అడ్డ కూలీల కష్టాలు తీర్చాలని ఎంసీపీఐ(యూ) ఆధ్వర్యంలో రాస్తారోకో
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Re Launch Nandi Awards: సినీ పరిశ్రమకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నంది అవార్డులు ఇచ్చి ప్రభుత్వం గౌరవించింది. తెలంగాణ స్వరాష్ట్రంగా ఏర్పడిన అనంతరం సినీ పరిశ్రమకు సంబంధించి అవార్డులు ఆగిపోయాయి. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం నంది అవార్డులకు పేరు మార్చి అందిస్తుండగా.. ఏపీలో మాత్రం పుష్కర కాలంగా ఎలాంటి అవార్డులు లేదు. తాజాగా నంది అవార్డులపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలోనే నంది అవార్డులు ఇస్తామని సినీ పరిశ్రమకు తీపి కబురు వినిపించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు చలన చిత్ర పరిశ్రమ అభివృద్ధికి సంబంధించి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని.. ఏప్రిల్ నుంచి అవసరమైన కార్యాచరణను ప్రారంభిస్తామని ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ప్రకటించారు.
Also Read: YS Sharmila: ఉపాధి హామీని మోదీ ఖూనీ చేస్తున్నారు.. అందరం తిరగబడాలి: వైఎస్ షర్మిల
వెలగపూడిలోని సచివాలయంలో మంత్రి కందుల దుర్గేష్ ఏపీ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ - 2026 పోటీల విజేతలను సత్కరించారు. అనంతరం మంత్రి దుర్గేశ్ మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్తో చర్చించి త్వరలోనే నంది అవార్డులు, నంది నాటకోత్సవాల నిర్వహణపై ప్రకటన చేస్తామని తెలిపారు. హైదరాబాద్కు ధీటుగా అమరావతిని సినిమా రంగానికి కేంద్ర బిందువుగా మార్చాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ఉందని చెప్పారు. సామాజిక చైతన్యంతో కూడినటువంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన దర్శకులు దిలీప్ రాజా ఏపీలో తెలుగు చలన చిత్ర పరిశ్రమ అభివృద్ధి చేయాలని నిరంతరం తపిస్తున్నారని మంత్రి దుర్గేశ్ తెలిపారు. సినిమా రంగం అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
Also Read: Pawan Kalyan: అరవ శ్రీధర్ రాసలీలపై పవన్ కల్యాణ్ ఆగ్రహం.. సమావేశం నుంచి వాకౌట్
ఏపీ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ వివరాలు
ఆంధ్రప్రదేశ్లోని ఔత్సాహిక కళాకారులను మాత్రమే ప్రోత్సహించేందుకు నిర్వహించిన ఏపీ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ పోటీల్లో రాష్ట్రవ్యాప్తంగా 203 షార్ట్ ఫిల్మ్ ఎంట్రీలు రాగా 2 వేల మంది నటీనటులు పాల్గొన్నారు. మొదటి మూడు స్థానాల్లో నిలిచిన విజేతలకు రూ.లక్ష రూపాయల నగదు బహుమతి అందించారు. ఉత్తమ నటిగా సుజిత (మనం), ఉత్తమ కేరెక్టర్ ఆర్టిస్ట్గా సాయి ప్రకర్ష (అబద్దం వర్సెస్ నిజం), ఉత్తమ నటుడు పవన్ శర్మ (మన్ను-మిన్ను), ఉత్తమ బాలనటి హర్షతున్నీసా, యంగ్ టాలెంట్ రిత్విక్ రెడ్డి (అస్త్ర), త్రివిక్రమ్ (డెబ్యూ డైరెక్టర్ ) విలన్ మీసాల భాస్కర్, తెలుగు స్క్రిప్ట్ పరిశీలకులు మంజులూరి లక్ష్మీపతి మాస్టర్, జగదీష్, ఉత్తమ దర్శకత్వం నరేష్ దోనె అవార్డులు పొందారు.
Also Read: Revanth Reddy: తెలంగాణ జాతిపిత కేసీఆర్ ఎలా అవుతాడు?: రేవంత్ రెడ్డి
షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ విజేతలు వీరే..
ప్రథమ బహుమతి: 'మహావృక్షం'. చంద్రశేఖర్ శకునాల (విశాఖపట్టణం)
ద్వితీయ బహుమతి: సింహాద్రి అప్పన్న, శ్రీనివాసరావు (శ్రీకాకుళం)
తృతీయ బహుమతి: అబద్దం వర్సెస్ నిజం, నవీన్ కుమార్ (పాలకొల్లు)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Pawan kalyan wife anna lezhneva visits Warangal Bhadrakali temple: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి అన్నాలెజీనోవా వరంగల్ లోని భద్రకాళి అమ్మవారి ఆలయంకు వచ్చారు. ఈ క్రమంలో ఆలయ అర్చకులు, దేవాలయం సిబ్బంది ప్రత్యేకంగా స్వాగతం పలికారు. అదే విధంగా సంప్రదాయ దుస్తుల్లో ప్రసిద్దమైన అమ్మవారి ఆలయంను అన్నా లెజీనోవా దర్శించుకున్నారు. అక్కడ మొక్కులు కూడా తీర్చుకున్నారు. ముఖ్య అర్చకులు వెంకట నాగరాజ శర్మ, వేద పండితులు ప్రదీప్ కుమార్ శర్మ వేదాశీర్వచనం అందించారు.
అమ్మవారి శేషవస్త్రాలను, తీర్థ ప్రసాదాలను పవన్ సతీమణికి అందజేశారు. పవన్ సతీమణి భద్రకాళి అమ్మవారి ఆలయంకు రావడంతో జనసేన కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. పవన్ సతీమణితో సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు. మరోవైపు పవన్ కళ్యాణ్ ఇటీవల కరీంనగర్ లోని కొండగట్టు అంజన్నస్వామిని దర్శించుకున్నారు.
ఇటీవల నాందేడ్ లోని గురుద్వారాను అన్నా లెజీనోవాతన భర్తతో పాటు కలిసి వెళ్లారు. అక్కడ తలపాగతో కలిసిదిగిన ఫోటోలు బాగా వైరల్గా మారాయి. తన కొడుకుకు గతంలో అగ్ని ప్రమాదంనుంచి బైటపడ్డాక అవకాశం చిక్కినప్పుడల్లా పవన్ కళ్యాణ్, ఆయన సతీమణి తరచుగా ఆలయాలను సందర్శిస్తు వార్తలలో ఉంటున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Shani Dev Effect On Zodiac Telugu: రాబోయే ఐదు నెలలు శని గ్రహం రెండుసార్లు సంచారం చేయడంతో అన్ని రాశుల వారిపై ప్రభావం పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. శని మొదటి నక్షత్ర సంచారంతో పాటు ఆ తర్వాత తిరోగమనం చేయబోతోంది. ముఖ్యంగా ఈ సమయంలో ఏలినాటి శని తో పాటు ఇతర శని ప్రభావాలతో బాధపడుతున్న వ్యక్తులపై ఊహించని ప్రభావం పడుతుంది. కాబట్టి వారి జీవితాల్లో అనేక మార్పులు సంభవించే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.
ఈ ఏడాది మే నెలలో శని గ్రహం నక్షత్ర సంచారం చేయబోతోంది.. మే 17వ తేదీన ఈ గ్రహం రేవతి నక్షత్రంలోకి ప్రవేశిస్తుంది. అయితే ఈ నక్షత్రానికి బుధుడు అధిపతిగా వ్యవహరిస్తాడని జ్యోతిష్యులు చెబుతున్నారు. కాబట్టి ఈ సమయంలో శని బుధ రెండు గ్రహాల ప్రభావం కొన్ని రాశుల వారిపై పడబోతుందని.. దీని కారణంగా ఆయారాశుల వారి జీవితాల్లో అనేకమైన మార్పులు సంభవించే అవకాశాలున్నట్లు వారు తెలుపుతున్నారు.
ప్రస్తుతం శని సక్రమ మార్గంలో కొనసాగుతోంది. జూలై 2026 సంవత్సరంలో మీన రాశిలో ఉన్నప్పుడే శని తిరోగమనం చేయబోతోంది. ఈ గ్రహం మొత్తం 138 రోజులపాటు తిరోగమన దిశలో తిరగబోతోంది. దీంతో డిసెంబర్ వరకు కొన్ని రాశుల వారిపై నేరుగా శని ప్రభావం పడుతుంది. దీని కారణంగా కొన్ని రాశుల వారికి అశుభ ఫలితాలు కలిగితే.. మరికొన్ని రాశుల వారికి సానుకూలమైన ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అయితే ఈ సమయంలో అత్యధిక లాభాలు పొందబోయే రాశులేవో? ఆరు నెలలపాటు ఎవరు అదృష్టాన్ని సొంతం చేసుకుంటారో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ రాశులవారికి బంపర్ లాభాలు:
కుంభరాశి
కుంభ రాశి వారికి శని అధిపతిగా వ్యవహరిస్తాడు. కాబట్టి శని తిరోగమన ప్రభావంతో పాటు నక్షత్ర సంచార ప్రభావంతో వీరికి అద్భుతమైన ప్రయోజనాలు చేకూరుతాయి. ముఖ్యంగా ఈ సమయంలో భారీగా లాభాలను ఆర్జించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో నిజాయితీగా వ్యాపారాలు చేయడం వల్ల భారీ మొత్తంలో డబ్బులు పొందగలుగుతారు. అలాగే వీరు ఈ సమయంలో వ్యాపారాల్లో పెట్టుబడును పెట్టడం కూడా చాలా మంచిదని జ్యోతిష్యులు చెబుతున్నారు. అయితే, ఈ సమయంలో కొన్ని రకాల అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలుంటాయి.
మీన రాశి
మీన రాశి వారికి శని తిరోగమన ప్రభావం, నక్షత్ర సంచారం వల్ల ఉద్యోగాలపరంగా విపరీతమైన ప్రయోజనాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ సమయంలో కృషికి తగ్గ ప్రతిఫలం లభించబోతోంది. అలాగే మీ జీవితంపై శని ప్రత్యేకమైన ప్రభావం పడి.. ఊహించని ఆర్థిక లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా ప్రేమ సంబంధాల్లో మెరుగుదల కూడా కనిపిస్తుంది. ఈ సమయంలో వీరికి పెళ్లిళ్లు అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.
మేషరాశి
శని ప్రభావంతో మేషరాశి వారికి చాలా మేలు జరుగుతుంది. వీరికి ఏలినాటి శని నడుస్తున్నప్పటికీ ఈ సమయంలో కొన్ని అద్భుతమైన లాభాలు కలుగుతాయి. ఖర్చులు భారీగా నియంత్రణలో ఉంటాయి. ఆర్థికంగా అద్భుతమైన ప్రయోజనాలు కలిగే అవకాశాలున్నాయి. అలాగే అంతర్జాతీయ కంపెనీలో పనులు చేసే వ్యక్తులకు అద్భుతమైన బహుమతులు లభిస్తాయి. ప్రేమ జీవితంలో కాస్త జాగ్రత్తగా ఉండడం మేలని జ్యోతిష్యులు చెబుతున్నారు. అంతేకాకుండా ఆర్థికపరంగా లావాదేవీలు చేసే క్రమంలో కూడా జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది.
Also Read: Mercury Transit 2026: మకరంలో తిష్ట వేసిన బుధుడు.. ఈ రాశుల వారికి కోటీశ్వరులయ్యే యోగం ప్రారంభం!

Also Read: Mercury Transit 2026: మకరంలో తిష్ట వేసిన బుధుడు.. ఈ రాశుల వారికి కోటీశ్వరులయ్యే యోగం ప్రారంభం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Oppo K14x 5g Launch Date In India Telugu: ప్రముఖ చైనీస్ స్మార్ట్ఫోన్ కంపెనీ ఒప్పో వచ్చేవారం భారత మార్కెట్లోకి తమ కొత్త స్మార్ట్ఫోన్ను విడుదల చేయబోతోంది. దీనిని కంపెనీ ఒప్పో k14 ఎక్స్ అనే పేరుతో అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. కంపెనీ ఇప్పటికీ ఈ మొబైల్కు సంబంధించిన కొన్ని వివరాలను అందుబాటులో ఉంచిన సంగతి తెలిసిందే. అయితే, ఇటీవల సోషల్ మీడియాలో మాత్రం ఈ స్మార్ట్ఫోన్కు సంబంధించిన కొన్ని రకాల ఫీచర్స్తో పాటు వేరియన్స్ వివరాలు లీకయ్యాయి. అవేంటో? ఈ స్మార్ట్ఫోన్కు సంబంధించిన అన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఒప్పో K14x స్మార్ట్ఫోన్ గతంలో విడుదల చేసిన అన్ని మొబైల్స్ డిస్ప్లే కంటే ప్రత్యేకమైన పెద్ద 6.75-అంగుళాల HD+ డిస్ప్లేను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది.. దీంతోపాటు ఇది ఎంతో శక్తివంతమైన మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్తో రన్ అవుతుంది. అలాగే ఈ స్మార్ట్ఫోన్ను కంపెనీ గతంలో విడుదల చేసిన ఒప్పో K13x 5G మొబైల్కి సక్సెస్గా విడుదల చేయబోతోంది.
ఇప్పటికే ఈ స్మార్ట్ఫోన్కి సంబంధించిన మైక్రోసైట్ ఫ్లిప్కార్ట్లో అందుబాటులో ఉంది. ఇందులో ఉన్న వివరాల ప్రకారం కంపెనీ ఒప్పో k14 ఎక్స్ స్మార్ట్ఫోన్ను భారతదేశ వ్యాప్తంగా ఫిబ్రవరి 10న లాంచ్ చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇది గత మోడల్స్ కంటే అద్భుతమైన డిజైన్తో లాంచ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇది కె సిరీస్ స్మార్ట్ ఫోన్స్ మాదిరిగానే కొన్ని ప్రత్యేకమైన స్పెసిఫికేషన్స్ కలిగి ఉంటుంది.
ముఖ్యంగా ఈ మొబైల్ వెనక భాగంలో పిల్ ఆకారపు కెమెరాను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. దీంతోపాటు రెండు ప్రత్యేకమైన కెమెరాలతో పాటు LED ఫ్లాష్ లైట్ను కూడా కలిగి ఉంటుంది. ఇక ఈ మొబైల్ ColorOS 15 పై రన్ అవుతుంది. ఇక ఈ మొబైల్ కెమెరాలు ప్రత్యేకమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్స్ ని కూడా కలిగి ఉంటాయి. ఈ స్మార్ట్ఫోన్కు సంబంధించిన రెండు కెమెరాలు వివరాల్లోకి వెళితే.. ఇందులో రెండు 50-మెగాపిక్సెల్ కెమెరా ప్రధాన కెమెరాలు ఉంటాయి. అలాగే 45 W ఛార్జింగ్ సపోర్టుతో ఎంతో శక్తివంతమైన 6,500 mAh బ్యాటరీతో విడుదల కాబతునట్లు తెలుస్తోంది. దీనిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 17 గంటల వరకు నాన్ స్టాప్ వీడియో ప్లే బ్యాక్ అందిస్తుంది.
Also Read: Redmi 14C 5G Offer: రెడ్మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్ఫోన్..అదిరిపోయే ఆఫర్!
ఈ స్మార్ట్ఫోన్లు ఇవే కాకుండా మరెన్నో అద్భుతమైన ఫీచర్లను ఒప్పో కంపెనీ అందుబాటులో ఉంచినట్లు తెలుస్తోంది. అయితే, ఈ స్మార్ట్ ఫోన్ డిజైన్ పరంగా మాత్రం కాస్త కొత్తగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా కొన్ని కొత్త కలర్స్లో ఈ మొబైల్ను విడుదల చేయబోతున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను కంపెనీ అతి త్వరలోనే అధికారికంగా వెల్లడించే అవకాశాలున్నాయి.
Also Read: Redmi 14C 5G Offer: రెడ్మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్ఫోన్..అదిరిపోయే ఆఫర్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Cobra Hood Video Watch Now: ఓ నగర శివారులో సాయంత్రం పూట నాగుపాము ప్రత్యక్షమవడం స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. అయితే స్థానికుల సమాచారం మేరకు అక్కడికి వన్యప్రాణి సంరక్షకులు చేరుకొని ఆ పాముని రెస్క్యూ చేశాడు ఈ సందర్భంలో తీసిన వీడియో ఇప్పుడు ఊహించని స్థాయిలో వైరల్ అవుతూ వస్తోంది. మున్నా అనే స్నేక్ క్యాచర్ పట్టుకున్న అత్యంత ప్రమాదకరమైన పామును ఓ డబ్బాలో బంధించాడు. ఇలా బంధించిన పామును వీడియో తీసి సోషల్ మీడియాలో సరదాగా పోస్ట్ చేశారు. ఇప్పుడు ఈ వీడియో యూట్యూబ్లో వైరల్ అవుతుంది. ఈ వీడియోకు సంబంధించిన అన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఓ తెల్లని ప్లాస్టిక్ డబ్బాలలో అత్యంత ప్రమాదకరమైన కింగ్ కోబ్రా ను బంధించిన దృశ్యాలు మీరు చూడొచ్చు. అలాగే ఆ డబ్బాలో పాము ఎంతో భయానకంగా పడగవిప్పి బయటికి వచ్చేందుకు ప్రయత్నిస్తున్న సందర్భం కూడా మీకు కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంది. అంతేకాకుండా ఈ వీడియోలో ఆ పాము ఆకారం, దాని వెనక భాగంలో ఉండే పడగా చాలా క్లియర్ గా కనిపిస్తుంది. అయితే ఆ పాము అలాగే పడక విప్పి ఉండిపోయింది.. స్నేక్ క్యాచర్ బృందం ఆ పాము ఎప్పుడైనా బయటికి వచ్చే అవకాశాలు ఉన్నాయని.. వారు అక్కడే అది బయటికి రాకుండా కాపలాగా ఉండడం మీరు చూడొచ్చు
సుమారు 30 సెకండ్ల నిడివి గల ఈ వీడియోలో ఆ కోబ్రా ఎంత ఉగ్రరూపం లో ఉందో మీరు క్లియర్గా చూడొచ్చు. ఈ వీడియోలో ఆ పాము పదేపదే పడగలను అటు ఇటు కదుపుతూ.. తన రక్షణ కోసం సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. స్నేక్ క్యాచర్స్ కూడా పాము కు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మంచి డబ్బాలోనే బంధించినట్లు తెలుస్తోంది. అందుకే ఆ పాము ఏమాత్రం బయటికి రాలేకపోయింది.
గత కొద్ది రోజుల నుంచి ఇలా పాములు అడవుల్లో నుంచి జనాభాసాల మధ్యలోకి వస్తున్నాయి. ఇవి ప్రమాదమని భావించి కొంతమంది వీటిని చంపేస్తున్నారు.. నిజానికి ఇలా చేయడం వల్ల ప్రకృతికి ఎంతో హాని కలిగే అవకాశాలున్నాయి. కాబట్టి ఇలా వన్యప్రాణులను చంపే బదులు.. మీకు దగ్గరలో ఉన్న వన్యప్రాణి సంరక్షకులకు సమాచారం అందించడం మేలు. వాళ్లు ఇలాంటి పాములను పట్టికెళ్లి సురక్షితమైన అడవి ప్రాంతంలో వదిలిపెడతారు. తద్వారా పర్యావరణ సమతుల్యత పెరుగుతుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Jagtial Congress Telugu News: తెలంగాణ రాష్ట్రం మున్సిపల్ ఎన్నికలకు సిద్ధమైంది. ఇప్పటికే ఎన్నికలకు సంబంధించిన తేదీలను కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే కొన్నిచోట్ల కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు భగ్గుమంటున్నాయి. జగిత్యాల మున్సిపల్ ఎన్నికలవేళ అధికార కాంగ్రెస్ పార్టీలో మరోసారి అంతర్గత విభేదాలు ఒక్కసారిగా పగమన్నాయి.. టికెట్ల కేటాయింపులో స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కు పార్టీ అధిష్టానం ప్రాధాన్యతను ఇవ్వడంతో పాత కాంగ్రెస్ నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
జగిత్యాలలో మున్సిపల్ వార్డుల వారిగా అభ్యర్థుల ఎంపికలు ఇప్పటి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ప్రతిపాదించిన అభ్యర్థుల పేర్లకే అధిష్టానం టికెట్లు ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. పార్టీ మారిన ఎమ్మెల్యేకు అగ్ర పీఠం వెయ్యడం, గత కొన్ని ఏళ్ల నుంచి పార్టీ జెండా మోసిన తమను కాదని ఎలా టికెట్లు ఇస్తారని సీనియర్ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా తమను విస్మరించి టికెట్లు కేటాయించడం పెద్ద అన్యాయమని వారు అంటున్నారు.
అయితే టికెట్ల ప్రకటన నేపథ్యంలో అసంతృప్తిగా ఉన్న కార్యకర్తలు అందరూ భారీ సంఖ్యలో మాజీ మంత్రి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నివాసానికి చేరుకున్నట్లు తెలుస్తోంది. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆయన ఇంటి ముందు ఆందోళన కార్యక్రమం కూడా చేపట్టారు. గత కొన్నేళ్ల నుంచి కష్టపడుతూ వస్తున్న వారిని కాకుండా.. కొత్తగా వచ్చిన వారికి టికెట్లు ఇవ్వడం పెద్ద అన్యాయమని అంటూ కార్యకర్తలు మాజీ మంత్రి ఇంటి ముందు నినాదాలు చేశారు.
మరోవై మొత్తం 50 సీట్లలో ఎమ్మెల్యే సంజయ్ వర్గానికి 30, మాజీ మంత్రి జీవన్ రెడ్డి వర్గానికి 20 సీట్లు కేటాయించారనే సమాచారం నేపథ్యంలో జీవన్ రెడ్డి వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీ-ఫామ్ల పంపిణీలో అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ కార్యకర్తలు సంజయ్ నివాసం వద్ద నిరసన చేపట్టారు.
పార్టీ మారిన వారికి టికెట్లు ఇవ్వడంతో మాజీ మంత్రి జీవన్ రెడ్డి తీవ్ర అసహనంతో ఉన్నట్లు తెలుస్తోంది. జగిత్యాల నియోజకవర్గంలో గత కొన్ని ఏళ్ల నుంచి క్రియాశీలకంగా కాంగ్రెస్కు పని చేస్తున్న జీవన్ రెడ్డికి పార్టీలో ప్రాధాన్యత లేకపోవడం, తన దగ్గరగా ఉన్న అనుచరులకు టికెట్లు దక్కకపోవడంతో అధిష్టానానికి ఇప్పటికే ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఈ పార్టీ అంతర్గత రాజకీయ పోరు జగిత్యాల మున్సిపల్ ఫలితాలపై ఎలాంటి ప్రభావం చూపుతోందోనని రాజకీయ విశ్లేషకులు ఆసక్తిగా గమనిస్తున్నారు. ప్రస్తుతం జగిత్యాల కాంగ్రెస్ లో పాత వర్సెస్ కొత్త అన్నట్లు పరిస్థితులు మారాయి. అయితే ఈ పరిస్థితిని తొందర్లోనే చక్కదిద్దే ఎందుకు రాష్ట్రస్థాయి నేతలు రంగంలోకి దిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Nara Lokesh Latest News Telugu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం సహాయక సహకారాలు మరింత పొందేందుకు మంత్రి లోకేష్ ఈరోజు రాజధాని ఢిల్లీకి వెళ్ళిపోతున్నారు. నేడు అమరావతిలో జరుగుతున్న రాష్ట్ర మంత్రివర్గం సమావేశం తర్వాత ఆయన తన పర్యటనను ప్రారంభించబోతున్నారు. మంత్రి లోకేష్ ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకు విజయవాడ విమానాశ్రయం నుంచి బయలుదేరి.. సాయంత్రం ఐదు గంటలకు ఢిల్లీ చేరుకుంటారు.. రాత్రి ఆయన ఢిల్లీలోనే బస చేసి. బుధవారం ఉదయం నుంచి ఆయన కేంద్ర మంత్రులతో కలిసే అవకాశాలున్నాయి.
రేపు ఉదయం లోకేష్ పార్లమెంట్ భవనానికి వెళ్లి అక్కడ పలువురు కేంద్ర మంత్రులతో వరస బేటీలు కాబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఐటీ రంగ విస్తరణతో పాటు ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ల ఏర్పాటుపై పలువురు మంత్రులతో చర్చించనున్నారు. అలాగే విద్యాసంష్కరణలతో పాటు నూతన విద్యాసంస్థల మంజూరుపై సంబంధిత మంత్రులతో మాట్లాడబోతున్నట్లు అధికారిక సమాచారం. ఇదే సమయంలో రాజధాని అమరావతి నిర్మాణానికి అవసరమైన నిధులతో పాటు కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టుల మంజూరును కూడా కోరబోతున్నట్లు తెలుస్తోంది.
కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు కేటాయించిన రాయితీలతో పాటు మౌలిక సదుపాయాల కల్పనపై ఇప్పటికే సానుకూలంగా స్పందించిన మంత్రి నారా లోకేష్.. వాటిని క్షేత్రస్థాయిలో అమలు చేసేందుకు అవసరమైన అనుమతుల కోసమే ఈ పర్యటన ప్రధాన అంశమని కొంతమంది రాజకీయ నిపుణులు చెబుతున్నారు. అదేవిధంగా కూటమి ప్రభుత్వ బలోపేతానికి సంబంధించిన అంశాలపై కూడా మంత్రులతో చర్చలు జరిపే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. చర్చలు ముగిసిన తర్వాత మంత్రి నారా లోకేష్ రేపు అర్ధరాత్రికి తిరిగి ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు.
రాష్ట్రానికి భారీ మొత్తంలో పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు.. రాష్ట్రంలో ఉన్న యువతకు ఉపాధి కల్పించడంలో ఈ ఢిల్లీ పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంటుంది. అంతేకాకుండా మంత్రి లోకేష్ జరిపిన చర్చల గురించి గురువారం లేదా శుక్రవారం ప్రత్యేకమైన ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇందులో భాగంగా ఢిల్లీలో చర్చించిన వివిధ అంశాలను మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయబోతున్నట్లు తెలుస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Realme p4 power 5g స్మార్ట్ఫోన్ అత్యంత తగ్గింపు ధరికే కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఇదే మంచి అవకాశంగా భావించవచ్చు. ఎందుకంటే ఇది ఫ్లిప్కార్ట్లో ఇప్పుడు ఎన్నో రకాల డిస్కౌంట్ ఆఫర్స్తో అందుబాటులో ఉంది. ముఖ్యంగా దీనిపై అదనంగా ఫ్లాట్ డిస్కౌంట్ లభించడమే కాకుండా బ్యాంకు డిస్కౌంట్ ఆఫర్స్, ఎక్స్చేంజ్ బోనస్ ఆఫర్లు కూడా లభిస్తున్నాయి. ఈ ఎక్స్చేంజ్ బోనస్ ఆఫర్స్లో భాగంగా కొనుగోలు చేసేవారికి ఇది చాలా చీప్ ధరకే లభిస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో Real me P4 Power 5G స్మార్ట్ ఫోన్ అద్భుతమైన ఫీచర్లతో అందుబాటులో ఉంది. ఇది చాలా ప్రత్యేకమైన 6.8-అంగుళాల 1.5K AMOLED HyperGlow 4D కర్వ్డ్ డిస్ప్లేతో లభిస్తోంది. అంతేకాకుండా ఇది 144Hz రిఫ్రెష్ రేట్, 6500 nits గరిష్ట బ్రైట్నెస్ సపోర్టుతో అందుబాటులోకి వచ్చింది. ఈ మొబైల్ భారత దేశంలో 10,001mAh భారీ బ్యాటరీతో లాంచ్ అయింది.
అంతేకాకుండా ఈ మొబైల్ చాలా ప్రత్యేకమైన 80W సూపర్ ఊక్ (SuperVOOC) ఫాస్ట్ ఛార్జింగ్, 27W రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ ఫీచర్లతో కూడా అందుబాటులో ఉంది. ఇక దీనిని కంపెనీ ఎంతో శక్తివంతమైన మీడియాటెక్ డైమెన్సిటీ 7400 అల్ట్రా (MediaTek Dimensity 7400 Ultra - 4nm) ప్రాసెసర్ తో విడుదల చేసింది. మల్టీ టాస్కింగ్ చేసే వారికి ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే ఈ మొబైల్ వెనక భాగంలో ఎంతో ప్రత్యేకతతో కూడిన 50MP Sony IMX882 (OIS) ప్రధాన కెమెరా ను కలిగి ఉంటుంది. దీనికి తోడు అదనంగా 8MP అల్ట్రా వైడ్ కెమెరా కూడా లభిస్తుంది. ఇక ఫ్రంట్ భాగంలో 16MP సెల్ఫీ కెమెరా కూడా లభిస్తోంది. దీంతోపాటు 5 Android 16 ఆధారిత Realme UI 7.0 ఆపరేటింగ్ సిస్టంపై రన్ అవుతుంది. అలాగే IP66, IP68, IP69 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ ఫీచర్ను కూడా కలిగి ఉంది.
Real me P4 Power 5G స్మార్ట్ఫోన్ను కంపెనీ జనవరి 29వ తేదీన భారత మార్కెట్లోకి అధికారికంగా విడుదల చేసింది. ప్రస్తుతం మార్కెట్లో 128 Gb ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ మొబైల్పై డిస్కౌంట్ ఆఫర్స్ లభిస్తున్నాయి. దీని అసలు ధర రూ.35,999 నుంచి ప్రారంభమవుతుంది. అయితే, ఫ్లిప్కార్ట్లో ఇప్పుడే కొనుగోలు చేసేవారికి.. రూ.25, 999కే పొందవచ్చు. ఇక ఈ స్మార్ట్ఫోన్ను మరింత తగ్గింపు ధరకే పొందాలనుకునేవారు బ్యాంకు డిస్కౌంట్ ఆఫర్స్ కూడా వినియోగించవచ్చు. ఈ ఆఫర్స్లో భాగంగా ఫ్లిప్కార్ట్ అనుసంధాన యాక్సిస్ బ్యాంక్, ఎస్బిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ అండ్ వినియోగించి పేమెంట్ చేసే వారికి ఏకంగా రూ.3,200 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే పేటీఎంతో పాటు కెనరా బ్యాంకు క్రెడిట్ కార్డుతో పేమెంట్ చేసే వారికి రూ.2,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది.
Also Read: Redmi 14C 5G Offer: రెడ్మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్ఫోన్..అదిరిపోయే ఆఫర్!
అలాగే ఏదైనా మొబైల్ ఎక్స్చేంజ్ చేసి దీనిని కొనుగోలు చేసే వారికి భారీ తగ్గింపుతో ఈ కొత్త స్మార్ట్ఫోన్ పొందవచ్చు. దీనికోసం ఏదైనా ప్రీమియం బ్రాండ్కి సంబంధించిన మొబైల్ను ఫ్లిప్కార్ట్కు ఎక్స్చేంజ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా చేస్తే ఏకంగా రూ.23 వేల వరకు బోనస్ లభిస్తుంది. దీనిని కొత్త మొబైల్ ధర నుంచి మైనస్ చేస్తే.. ఇది కేవలం రూ. 2,999కే పొందవచ్చు.
Also Read: Redmi 14C 5G Offer: రెడ్మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్ఫోన్..అదిరిపోయే ఆఫర్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Aditya Mangal Yoga Effect On Zodiac 2026: ఫిబ్రవరి నెల గ్రహ సంచారాల పరంగా చాలా అద్భుతమైన భావించవచ్చు. ఎందుకంటే శతభిష నక్షత్రంలోకి కొన్ని ప్రత్యేకమైన గ్రహాల సంచారం చేయబోతున్నాయి. ముఖ్యంగా ఈ సమయంలో గ్రహ సంయోగం జరగబోతోంది. దీంతో ఈనెల మరింత కీలకం కాబోతో ఉందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఫిబ్రవరి 19వ తేదీన శతభిషా నక్షత్రంలోకి సూర్యుడు ప్రవేశిస్తాడు.. ఆ తర్వాత మార్చి మూడున కుజుడు ప్రవేశిస్తాడు దీని కారణంగా ఈ రెండు గ్రహాల కలయిక జరుగుతుంది.
శతభిషా నక్షత్రంలో సూర్యుడితో పాటు కుజుడి కలయిక కారణంగా ఎంతో శక్తివంతమైన మంగళదిత్య రాజయోగం ఏర్పడుతుంది. దీని ప్రభావం మార్చి మూడవ తేదీ నుంచి ప్రారంభమవుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. దీంతో ఈ సమయం నుంచి కొన్ని రాశుల వారి జీవితాల్లో ఊహించని మార్పులు సంభవిస్తాయి. ముఖ్యంగా ఆర్థికంగా కలిసి రావడమే కాకుండా.. ఎన్నో రకాల ఆర్థికమైన ప్రయోజనాలు కలుగుతాయి.
ఈ రాశులవారికి లాభాలే లాభాలు:
మేషరాశి
కుజుడు మేషరాశి వారికి అధిపతిగా వ్యవహరిస్తాడు.. కాబట్టి శతభిషా నక్షత్రంలో సూర్యుడితో పాటు కుజుడు కలయిక జరపడం వల్ల మేష రాశి వారికి ఆత్మవిశ్వాసం ఊహించని స్థాయిలో పెరుగుతుంది. ముఖ్యంగా వీరికి ఈ సమయంలో కార్యాలయాల్లో క్రొత్త బాధ్యతలు లభిస్తాయి. అంతేకాకుండా ఈసారి అద్భుతమైన విజయాలు సాధించే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ రంగాల్లో పనులు చేసే వ్యక్తులకు విశేషమైన లాభాలు కలుగుతాయి.
మిథున రాశి
మంగళదిత్య రాజయోగంతో మిథున రాశి వారికి ఊహించని మేలు జరగబోతోంది. చాలా కాలంగా నిలిచిపోయిన అన్ని రకాల పనులు ఈ సమయంలో ఊపందుకుంటాయి. ముఖ్యంగా సంపాదన అధికంగా ఉంటుంది. అలాగే పాత పెట్టుబడుల నుంచి భారీ మొత్తంలో డబ్బులు సంపాదించగలుగుతారు. విదేశీ పర్యటనలు చేయాలనుకుంటున వ్యక్తులకు ఇది అద్భుతమైన అవకాశంగా భావించవచ్చు.. సుదీర్ఘ ప్రయాణాలు కూడా ఎంతో సులభంగా చేయగలుగుతారు.
సింహరాశి
మంగళదిత్య రాజయోగంతో సింహ రాశి వారికి చాలా మేలు జరుగుతుంది. వీరికి ఈ సమయంలో అత్యంత సానుకూలమైన ప్రయోజనాలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యాపారాల్లో పెద్ద పెద్ద ఒప్పందాలు కూడా కుదురుచుకుంటారు. అంతేకాకుండా కార్యాలయాల్లో అనుకుంటున్న పనులు ఎంతో సులభంగా చేసి అద్భుతమైన లాభాలు పొందగలుగుతారు. ముఖ్యంగా పరిపాలన సేవా రంగాల్లో పనిచేస్తున్న వ్యక్తులకు అద్భుతమైన ఒప్పందాలు కలుగుతాయి.
తులారాశి
మంగళదిత్య యోగం ప్రభావంతో తులా రాశి వారికి కెరీర్ వరంగా పెద్దపెద్ద మార్పులు రావడం ప్రారంభమవుతాయి. అంతేకాకుండా ఈ సమయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్న ప్రత్యర్ధుల నుంచి అద్భుతమైన లాభాలు పొందగలుగుతారు. భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్న వ్యక్తులకు ఎంతో మేలు జరగబోతోంది. అలాగే సంబంధాలు ఇతరులతో మెరుగుపడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.
Also Read: Mercury Transit 2026: మకరంలో తిష్ట వేసిన బుధుడు.. ఈ రాశుల వారికి కోటీశ్వరులయ్యే యోగం ప్రారంభం!

Also Read: Mercury Transit 2026: మకరంలో తిష్ట వేసిన బుధుడు.. ఈ రాశుల వారికి కోటీశ్వరులయ్యే యోగం ప్రారంభం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Mercury And Rahu Transit Effect On Zodiac Telugu: 2026 సంవత్సరం రెండవ నెల ఫిబ్రవరి ప్రారంభంకానే అయింది. జనవరి నెల కంటే ఈ నెలకు మరింత ప్రత్యేకమైన ప్రాముఖ్యత సంతరించుకోబోతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు ఎందుకంటే అనేక ప్రధాన గ్రహాలు ఈ నెలలోనే రాశి సంచారంతో పాటు నక్షత్ర సంచారం చేయబోతున్నాయి. దీనికి కారణంగా కొన్ని రాశుల వారి వ్యక్తిగత జీవితాల్లో అనేకమైన మార్పులు రాబోతున్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా కొన్ని ప్రధానమైన గ్రహాలు సంచారం చేయడంతో ఆయా రాశుల వారికి ఆర్థికంగా చాలా మేలు జరిగే సూచనలు కనిపిస్తున్నాయని వారు అంటున్నారు.
ఫిబ్రవరి మూడవ తేదీన 9 గంటలకు బుధుడు మకర రాశి నుంచి కుంభరాశిలోకి వెళ్ళాడు. రాహువు ఇప్పటికే అక్కడ సంచారదశలో ఉన్నాడు.. దీని కారణంగా ఈ రెండు గ్రహాల సంయోగం జరుగుతుంది. బుధుడు రాహు గ్రహాలు దాదాపు ఒకే రాశిలో 25 రోజులపాటు కలిసి ఉంటాయి. ఈ రెండు గ్రహాల సంచార ప్రభావం దాదాపు 60 రోజులు పాటు ఉంటుంది.. అంటే ఏప్రిల్ 11 వరకు ఈ రెండు గ్రహాల ప్రభావం కొనసాగుతూ ఉంటుంది. అప్పటివరకు కొన్ని రాశుల వారికి చాలా మేలు జరగబోతోంది.. అయితే, ఈ సమయంలో అత్యంత లాభాలు పొందబోయే రాశులేవో తెలుసుకోండి.
కర్కాటక రాశి
ఎనిమిదవ స్థానంలో ఈ రెండు గ్రహాలు కర్కాటక రాశి వారికి ఉండబోతున్నాయి. దీని కారణంగా వీరికి అద్భుతమైన లాభాలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా పరిశోధన తయారీ పరిశ్రమల్లో పనులు చేస్తున్న వ్యక్తులకు ఇది మంచి సమయంగా భావించవచ్చు.. అలాగే కొత్త వ్యాపారాలు ప్రారంభించే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ముఖ్యంగా అత్తమామలతో వివాదాలు కూడా ఏర్పడవచ్చు. కొన్ని రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.. కాబట్టి ఎంతో జాగ్రత్తగా ఉండడం మంచిది.
మకర రాశి
మకర రాశి వారికి రెండవ స్థానంలో ఈ రెండు గ్రహాలు సంచార దశలో ఉండబోతున్నాయి. కాబట్టి మీరు మాట్లాడే మాటలు ఎంతో ఆసక్తి కలిగిస్తాయి.. అలాగే ఏవైనా మాట్లాడేటప్పుడు కఠినంగా ఉండడం వల్ల కొన్ని రకాల సమస్యలు ఎదురవుతాయి. ముఖ్యంగా వీరి సంపాదన ఊహించని స్థాయిలో పెరుగుతుంది.. ఆహారపు అలవాట్లపై శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. కుటుంబంలో సామరస్యాన్ని కాపాడుకోవడానికి కొన్ని రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.
తులారాశి
తులా రాశి వారికి ఐదవ స్థానంలో బుధుడు రాహు గ్రహాలు సంచార దశలో ఉండబోతున్నాయి దీని కారణంగా వీరికి సృజనాత్మకత ఊహించని స్థాయిలో పెరుగుతుంది. స్టాక్ మార్కెట్, రచన, సినిమా పరిశ్రమల్లో ఉన్నవారికి పెద్దపెద్ద ప్రయోజనాలు కలుగుతాయి. పిల్లల చదువుల నుంచి కూడా మంచి లాభాలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రేమ సంబంధాలు ఉన్నవారికి ఈ సమయంలో గందరగోళం ఏర్పడవచ్చు. ఆర్థికంగా కూడా చాలా వరకు కలిసి రాబోతోందని జ్యోతిష్యులు చెబుతున్నారు.
మేషరాశి
రాహువు బుధుడు సంచారంతో మేష రాశి వారికి అంతా అనుకూలంగానే ఉంటుంది. ముఖ్యంగా వీరికి ఈ సమయంలో ఊహించని స్థాయిలో ఆదాయం పెరిగి సంపాదనలో మార్పులు కూడా సంభవిస్తాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభించాలనుకుంటున్న వ్యక్తులకు ఇది అద్భుతమైన సమయంగా భావించవచ్చు. అలాగే ప్రేమ సంబంధాల్లో బాగోద్వేగా ఆకర్షణ పెరుగుతుంది. విద్యార్థులకు ఇది అద్భుతమైన అవకాశంగా భావించవచ్చు. ఈ సమయంలో విద్యార్థులు ఎలాంటి పనులు చేసిన మంచి ఫలితాలు పొందగలుగుతారు సోషల్ మీడియా రంగాల్లో ఉన్న వ్యక్తులకు బోలెడు ప్రయోజనాలు కలుగుతాయి.
Also Read: Mercury Transit 2026: మకరంలో తిష్ట వేసిన బుధుడు.. ఈ రాశుల వారికి కోటీశ్వరులయ్యే యోగం ప్రారంభం!

Also Read: Mercury Transit 2026: మకరంలో తిష్ట వేసిన బుధుడు.. ఈ రాశుల వారికి కోటీశ్వరులయ్యే యోగం ప్రారంభం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Mercury Transit 2026 Effect On Zodiac Telugu: జ్యోతిష్య శాస్త్రంలో బుధుడికి చాలా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుందని మనందరికీ తెలుసు. ఇలాంటి ప్రధాన గ్రహం ఒకే నెలలో రెండు నుంచి మూడుసార్లు కదలికలు జరపడం విశేషం. అయితే, ఫిబ్రవరి నెలలో ఈ బుధుడు మూడుసార్లు సంచారం చేయబోతున్నాడు.. దీని కారణంగా కొన్ని రాశుల వారికి వ్యాపారం ఆర్థిక సంపదపరంగా విశేషమైన మార్పులు సంభవించబోతున్నాయి. ఈ గ్రహాన్ని కమ్యూనికేషన్ తెలివితేటలు అకౌంటింగ్ సూచికగా భావిస్తారు. అలాంటి ఈ గ్రహం మూడుసార్లు సంచారం చేయడం అరుదని కొంతమంది జ్యోతిష్యులు చెబుతున్నారు. అంతేకాకుండా ఈ సమయంలో కొన్ని రాశుల వారి జీవితాల్లో వేగంగా మార్పులు సంభవించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధుడు ఫిబ్రవరి మూడవ తేదీన కుంభ రాశిలోకి ప్రవేశించాడు. ఆ తర్వాత ఫిబ్రవరి 7వ తేదీన శతభిషా నక్షత్రంలోకి సంచారం చేస్తాడు.. మరికొన్ని రోజుల తర్వాత ఫిబ్రవరి 15న పూర్వ భాద్రపదద నక్షత్రంలోకి పరవేశిస్తాడు. ఇలా మూడుసార్లు సంచారం చేయడం కారణంగా కొన్ని రాశుల వారిపై గణనీయమైన ప్రభావం పడుతుంది. బుధుడి నిరంతర మార్పుల కారణంగా కొన్ని రాశుల వారు ఈ సమయంలో వ్యాపారం, ఉద్యోగాలు, ఆదాయం, వ్యక్తిగత నైపుణ్యంలో పెద్ద సానుకూలమైన మార్పులు పొందగలుగుతారు.
ఈ రాశుల వారికి దిమ్మతిరిగే జాక్పాట్..
వృషభ రాశి
ముఖ్యంగా బుధ గ్రహం సంచారంతో వృషభ రాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. వ్యాపారాల్లో కొత్త లాభాలు పొందడమే కాకుండా. సరైన ప్రణాళికలతో ముందుకు సాగుతారు అకౌంటింగ్ రంగాల్లో ఉన్న వ్యక్తులకు ఈ సమయంలో గ్రాఫ్ పెరుగుతుంది. అలాగే పనుల్లో అద్భుతమైన బాధ్యతలు లభించడమే కాకుండా నాయకత్వ లక్షణాలు పెరిగి.. మీ అధికారులతో మంచి సత్సంబంధాలు ఏర్పడతాయి. ఇక ఎప్పటినుంచో ఉద్యోగాలు చేస్తున్న వ్యక్తులకు మంచి పదోన్నతులు కూడా లభిస్తాయి. ఆర్థిక పరిస్థితులు గతంలో కంటే ఇప్పుడు మరింత మెరుగుపడే సూచనలు కనిపిస్తున్నాయి.
ధనస్సు రాశి
ధనస్సు రాశి వారికి బుధుడి సంచారంతో అదృష్టం ఒక్కసారిగా రాబోతోంది. సుదీర్ఘ కృషి ఫలాలు ఇప్పుడు వీరి చేతికి రాబోతున్నాయి. అంతేకాకుండా ఆర్థిక పరిస్థితులు మెరుగుపడటంతో మానసిక ఒత్తిడి నుంచి విముక్తి లభించబోతోంది. జీవనశైలిలో చిన్న చిన్న మార్పులు రావడానికి కారణంగా ఆరోగ్యం కూడా మెరుగుపడబోతోందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఇక పాత పనుల్లో ఆగిపోయిన డబ్బులు కూడా వెంటనే తిరిగి పొందగలుగుతారు. దీంతోపాటు అన్ని రకాల సమస్యలకు ఈ సమయం విముక్తి కలిగిస్తుంది.
మకర రాశి
మకర రాశి వారికి కూడా ఫిబ్రవరి నెల ఎన్నో సమస్యల నుంచి గొప్ప ఉపశమనాన్ని కలిగించబోతోంది. ముఖ్యంగా వీరు ఈ సమయంలో కొన్ని సమస్యల నుంచి ఉపశమనం పొందిన వార్తలు కూడా పొందగలుగుతారు. అలాగే వృత్తిపరమైన అంశాల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశాలున్నాయి. ఆర్థిక సంబంధాలు మరింత మెరుగుపడే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతోపాటు బాకీ ఇచ్చిన డబ్బు తిరిగి పొందే అవకాశాలు ఉన్నాయి. ఇక వైవాహిక జీవితంలో సంబంధాలు కూడా చాలా వరకు మెరుగుపడతాయి. అంతేకాకుండా ఒంటరిగా జీవిస్తున్న వ్యక్తులు మంచి భాగస్వామితో స్నేహం కుదుర్చుకుంటారు..
Also Read: Mercury Transit 2026: మకరంలో తిష్ట వేసిన బుధుడు.. ఈ రాశుల వారికి కోటీశ్వరులయ్యే యోగం ప్రారంభం!

Also Read: Mercury Transit 2026: మకరంలో తిష్ట వేసిన బుధుడు.. ఈ రాశుల వారికి కోటీశ్వరులయ్యే యోగం ప్రారంభం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Ghatkesar Mother And Two Children Suicide Mistery: జనవరి 31 తేదీ తల్లి ఇద్దరు పిల్లలు ఆత్మహత్య ఘటన హైదరాబాద్ వ్యాప్తంగా కలకలం రేపింది. భర్త పుట్టిన రోజే వీరు ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. పిల్లలతో సహా తల్లి విజయ ఆత్మహత్య కేసు ఇప్పటికి మిస్టరీగానే మిగిలింది. దుబాయ్ నుంచి భర్త సురేందర్ రెడ్డి హైదరాబాద్ వచ్చారు. కానీ అసలు విషయం మాత్రం వెలుగులోకి రావడం లేదు. తన భార్య ఎంతో స్ట్రాంగ్ ఉమెన్.. అలా ఎందుకు చేసిందో నాకు అర్థం కావడం లేదని ఆయన కన్నీరు మున్నీరవుతున్నారు. ఇక జనవరి 29వ తేదీ ఫోన్లో తన కూతురు ఐఐటీ సీట్ కొడతా అని చెప్పింది.. ఆ మాటలు తలుచుకుంటే నాకు బాధగా ఉందని ఆయన బోరున విలపిస్తున్నారు. నా పుట్టినరోజు ఇలా జరగడం తట్టుకోలేక పోతున్న.. ఇక ఎవరికోసం బతకాలి అంటూ ఆయన తీవ్ర భావోద్వేగానికి కూడా గురయ్యారు.
అయితే చక్కటి సంసారం.. ముత్యాలు లాంటి ఇద్దరు పిల్లలు.. భార్యాభర్తలు ఇద్దరికీ లక్షల్లో జీతం. ఎలాంటి ఆర్థిక సమస్యలు కూడా లేవు. ఏ అనారోగ్య సమస్యలు ఎదురుకాలేదు. అయినా కానీ ఆ తల్లి తీసుకున్న నిర్ణయంతో కుటుంబమే ముక్కలైంది. ఇద్దరు పిల్లలతో కలిసి విజయ రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటన హైదరాబాద్ వ్యాప్తంగా సంచలనం రేపింది. అయితే పోలీసుల దర్యాప్తులోనూ ఇప్పటికీ కారణం అంత చిక్కడం లేదు. ఒంటరితనమే కారణమా అని అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఫోన్ డేటాతోనే అసలు నిజం తేలాల్సింది.
అసలు ఏం జరిగింది?
హైదరాబాద్ శివారులో జనవరి 31వ తేదీ శనివారం తెల్లవారుజామున విషాద ఘటన వెలుగులోకి వచ్చింది. చర్లపల్లి నుంచి ఘట్ కేసర్ వెళ్లే రైల్వే స్టేషన్ వద్ద ఎంఎంటీఎస్ డౌన్ లోడింగ్ పై ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసుల ప్రకారం మృతులు బోడుప్పల్ హరితహారం కాలనీకి చెందిన విజయ, చేతనా రెడ్డి, విశాల్ రెడ్డి గా గుర్తించారు. దీంతో రైల్వే పోలీసులకు సమాచారం అందించగా పోస్ట్మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించిన సంగతి తెలిసిందే. అయితే ఏ కారణం లేకుండా ఇలా ఆత్మహత్యకు పాల్పడిన అవసరం ఏం వచ్చిందని కూడా దర్యాప్తు చేస్తున్నారు. రాత్రి 11:30 గంటలు సమయంలో విజయ పిల్లల హాస్టల్ వద్దకు వెళ్లి వారిని తీసుకువచ్చింది. కారులో వారు చర్లపల్లి రైల్వే స్టేషన్ చేరుకున్నారు. అక్కడే పార్కింగ్ చేసి కారులో ఒక సూసైడ్ లెటర్ కూడా రాసి ఉంచింది. ఎక్కువ ఒత్తిడి గురవుతున్నా క్షమించండి అని బంధువులకు రాసింది. అయితే అంతకుముందు వారి ఆత్మహత్యకు ముందే విజయా తమ్ముడు కూడా ఫోన్లో మాట్లాడాడు. కానీ అతనికి ఎలాంటి అనుమానం కలగలేదు అన్నారు.
అయితే, విజయ రెడ్డి గత నెల 28వ తేదీన వారి పెళ్లి రోజు సందర్భంగా భర్తతో గంటల కొద్ది ఫోన్లో మాట్లాడింది. ఆ తర్వాత 31వ తేదీ ఈ దారుణం జరిగింది. ఉప్పల్ నివాసం నుంచి ఘట్కేసర్, పటాన్చేరు కళాశాల హాస్టల్స్ నుంచి సీసీ టీవీ ఫుటేజీలను పోలీసులు పర్యవేక్షిస్తున్నారు. మార్గమధ్యంలో ఎక్కడైనా ఆగారా? అనే అంశాలపై వారు దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు ఏ కారణాలై ఉంటాయా? అని పోలీసులు ఆరా తీస్తున్నారు.
Also Read: విదేశాల నుంచి బంగారం తెస్తున్నారా? కొత్త రూల్స్ తెలియకపోతే ఇబ్బందే! లిమిట్ ఎంతంటే?
Also Read: భారత్కు ట్రంప్ భారీ గిఫ్ట్.. గొప్ప స్నేహితుడంటూ టారిఫ్ కట్, ప్రధాని మోదీ రియాక్షన్ ఇదే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
Arava Sridhar Affairs Issue: ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ రాసలీలల వ్యవహారం తీవ్ర సంచలనం రేపింది. ఈ వ్యవహారంపై రాజకీయంగా తీవ్ర వివాదం రాజుకోగా.. జనసేన పార్టీపై విమర్శలు వస్తున్నాయి. ప్రతిపక్షాలు జనసేన పార్టీపై తీవ్ర విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఆ పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తొలిసారి స్పందించారు. గతంలో మీడియా ముందు ఈ వ్యవహారం రాగా.. సమాధానం చెప్పలేక పారిపోయిన పవన్ కల్యాణ్ తాజాగా పార్టీ సమావేశంలో ఎమ్మెల్యే రాసలీలల వ్యవహారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పార్టీ సమావేశం నుంచి అర్ధాంతరంగా వెళ్లిపోయారు. ఈ పరిణామం జనసేన పార్టీలో కలకలం రేపింది.
Also Read: Budget 2026: కేంద్ర బడ్జెట్లో 10 భారీ ప్రకటనలు.. ప్రజల డబ్బులు భారీ సేఫ్
జనసేన పార్టీ నాయకులపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్లో నిర్వహించిన జనసేన కార్యవర్గ సమావేశంలో పవన్ మాట్లాడుతూ రాష్ట్ర పరిణామాలపై స్పందించారు. ఈ సందర్భంగా తిరమల కల్తీ లడ్డూ వ్యవహారంపై ఎందుకు మాట్లాడటం లేదని జనసేన పార్టీ నాయకులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు గగ్గోలు పెడితే పార్టీ నుంచి స్పందన లేదని మండిపడ్డారు. 'అందరి చిట్టా నా దగ్గర ఉంది. ఏం చేస్తారు.. రిపోర్ట్ ఇవ్వాలి' అని నాదెండ్ల మనోహర్కి చెప్పి పవన్ కల్యాణ్ వెళ్లిపోయారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులకు ఫుల్ క్లాస్ పీకారు.
Also Read: Revanth Reddy: తెలంగాణ జాతిపిత కేసీఆర్ ఎలా అవుతాడు?: రేవంత్ రెడ్డి
'లడ్డూ వ్యవహారంలో వైఎస్సార్సీపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఎందుకు తిప్పికొట్టడం లేదు? అన్నింటికీ నేనే మాట్లాడితే ఎమ్మెల్యేలు, మంత్రులు ఉన్నది ఎందుకు?' అని సమావేశంలో నాయకులపై పవన్ కల్యాణ్ చిందులు తొక్కారు. వైఎస్సార్సీపీ నాయకుల ట్రాప్లో చిక్కుకోవద్దని సూచించారు. 'మీపై, మీ కుటుంబసభ్యులపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడతారు. జాగ్రత్త!' అని హెచ్చరించారు. జనసేన నాయకులు మాత్రం సిద్ధాంతపరంగా.. సబ్జెక్ట్ పరంగానే మాట్లాడాలని చెప్పారు. మహిళల విషయంలో పార్టీ శ్రేణులు మరింత జాగ్రత్తగా ఉండాలని.. అరవ శ్రీధర్ వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ సూచించారు. మహిళలకు మీ చేయి తగిలినా రేప్ చేశారని వైఎస్సార్సీపీ నాయకులు ప్రచారం చేస్తారని పవన్ కల్యాణ్ తెలిపారు. 'వ్యక్తిగత వ్యవహారాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.. మీ వల్ల పార్టీకి నష్టం కలుగుతోంది' అని అసహనం వ్యక్తం చేశారు.
Also Read: Budget 2026: కేంద్ర బడ్జెట్లో 10 భారీ ప్రకటనలు.. ప్రజల డబ్బులు భారీ సేఫ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Tablet Sheet Wedding Card: సాధారణంగా పెళ్లి పత్రికలు అంటే దేవుళ్ల బొమ్మలు, రంగురంగుల డిజైన్లు, పట్టు వస్త్రాల అలంకరణలతోపాటు వధూవరుల ఫొటోలతో కనిపిస్తుంటాయి. శుభలేఖ విషయంలో వినూత్నంగా ఆలోచనలు చేస్తున్న యువత ఈ క్రమంలో సరికొత్తగా.. ఆసక్తికరంగా ఓ జంట రూపొందించింది. తమ వృత్తికి సంబంధించిన ఆనవాళ్లు కనిపించేలా పెళ్లి పత్రిను రూపొందించారు. తమ వైద్య వృత్తిలో కనిపించే ట్యాబ్లెట్ల షీట్ రూపంలో తమ పెళ్లి పత్రికను ప్రత్యేకంగా తయారు చేయించారు. ఆ పత్రికకు సంబంధించిన వీడియో వైరల్గా ఉంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Also Read: Budget 2026: కేంద్ర బడ్జెట్లో 10 భారీ ప్రకటనలు.. ప్రజల డబ్బులు భారీ సేఫ్
తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం కాకర్ల గ్రామానికి చెందిన యువకుడు కిన్నెర నవీన్ ఎంబీఏ పూర్తి చేసి మెడికల్ రిప్రజెంటేటివ్గా పని చేస్తున్నాడు. అతడికి వేంసూరు మండలం కందుకూరు గ్రామానికి చెందిన శిరీషతో వివాహం నిశ్చయమైంది. ఆమె ఎం ఫార్మసీ పూర్తి చేసి విజయవాడలోని పెద్దేశ్వర్ హెల్త్ కేర్ సెంటర్లో ఫార్మసిస్ట్గా పని చేస్తోంది. వధూవరులిద్దరూ మెడికల్ రంగానికి చెందిన వారు కావడంతో తమ వివాహ ఆహ్వానాన్ని కూడా అదే శైలిలో ఉండాలని భావించారు.
Also Read: Ministers Salaries: కేంద్ర మంత్రుల జీతాలు డబుల్.. బడ్జెట్లో భారీగా కేటాయింపులు
వీరిద్దరి వివాహం ఫిబ్రవరి 4వ తేదీన కందుకూరు గ్రామంలో జరగనుంది. ఈ సందర్భంగా తమ పెళ్లికి సంబంధించిన శుభలేఖను ప్రత్యేకంగా ఉండేలా రూపొందించారు. తమ వృత్తిపై ఉన్న మమకారాన్ని చాటుకోవడమే కాకుండా ప్రత్యేకంగా ఉండేలా ఏదైనా చేయాలని నవీన్ ఆలోచించారు. తన పెళ్లి పత్రికను ఒక టాబ్లెట్ స్ట్రిప్పు (ట్యాబ్లెట్ షీట్) ఆకారంలో డిజైన్ చేయించాడు. పత్రిక ముందటి భాగంలో సాధారణంగా టాబ్లెట్ షీట్పై ఉండే వివరాల తరహాలోనే పెళ్లి తేదీ, సమయం, వేదిక, వధూవరుల డిగ్రీల ముద్రించారు.
Also Read: AP Govt Employees: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు.. సీపీఎస్ ఉద్యోగులకు అదిరిపోయే వార్త
పెళ్లి పత్రిక వెనుక భాగంలో టాబ్లెట్లు ఉండే ఖాళీలను చూపిస్తూ ఇది ఒక మెడికల్ స్ట్రిప్పు అనే అనుభూతిని కలిగించేలా నవీన్ తమ పెళ్లి పత్రికను రూపొందించారు. ఈ కార్డులో వాడిన పదాలు కూడా మెడికల్ టెర్మినల్లో ఉన్నాయి. ప్రియమైన స్నేహితులు మా వివాహాన్ని అస్సలు మిస్స్ కాకండి అంటూ సరదాగా హెచ్చరిస్తూ పత్రికలో రాయించి తమ వివాహానికి ఆహ్వానం పలికారు. ఫిబ్రవరి 4వ తేదీన జరగనున్న ఈ వివాహానికి సంబంధించిన ఈ వెరైటీ వెడ్డింగ్ కార్డ్ ఇప్పుడు చర్చనీయాంశమైంది. తమ వృత్తి పట్ల ఉన్న అంకితభావాన్ని, ప్రత్యేకతను చాటుకున్న ఈ జంటను స్థానికులు, సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు అభినందిస్తున్నారు. తన పెళ్లి పత్రికను అత్యంత వినూత్నంగా, తాను చేస్తున్న వృత్తికి అద్దం పట్టేలా రూపొందించి ఆ జంట అందరినీ ఆశ్చర్యపరిచారు. అది పెళ్లి పత్రికా లేక టాబ్లెట్ షీటా అని భ్రమపడేలా ఉన్న ఆ వెడ్డింగ్ కార్డ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
Also Read: Govt Employees: ప్రభుత్వ ఉద్యోగుల కీలక డిమాండ్.. రూ.700 కోట్ల నుంచి రూ.1500 కోట్లకు పెంపు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి