అడ్డ కూలీల కష్టాలు తీర్చాలని ఎంసీపీఐ(యూ) ఆధ్వర్యంలో రాస్తారోకో
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Vellampalli Srinivas On Tirumala Laddu: తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం ఏపీ రాజకీయాల్లో మరోసారి సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. కూటమి నేతలు చేస్తున్న ఆరోపణలపై మాజీ మంత్రి, వైసీపీ నేత వెల్లంపల్లి శ్రీనివాస్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని నిరూపించగలరా? అంటూ ఆయన ప్రభుత్వానికి బహిరంగ సవాల్ విసిరారు.
విజయవాడలో మీడియాలో మాట్లాడిన వెల్లంపల్లి శ్రీనివాస్, చంద్రబాబు ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. సీబీఐ, సిట్ విచారణలో నిజాలు బయటపడినా ప్రభుత్వం ఇంకా బుకాయిస్తోందని ఆయన ఆరోపించారు.
రిపోర్టులపై క్లారిటీ ఏది?
సీబీఐ, సిట్ ఇచ్చిన నివేదికల్లో ఎక్కడా జంతువుల కొవ్వు ఆనవాళ్లు లేవని తేలిందని వెల్లంపల్లి పేర్కొన్నారు. "చార్జ్ షీట్లో కూడా యానిమల్ ఫ్యాట్ లేదని స్పష్టంగా ఉన్నప్పుడు, పవన్ కల్యాణ్ ఎందుకు అంత యాగీ చేశారు?" అని ప్రశ్నించారు.
తప్పుడు ప్రచారంతో భక్తుల మనోభావాలను దెబ్బతీసినందుకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెంకటేశ్వర స్వామి భక్తులకు క్షమాపణ చెప్పాలని వెల్లంపల్లి డిమాండ్ చేశారు.
కొత్త నాటకానికి తెరతీశారా?
జంతువుల కొవ్వు అంటే ప్రజలు నమ్మడం లేదని గ్రహించి, ఇప్పుడు లడ్డూలో యాసిడ్లు కలిపారంటూ కొత్త ప్రచారానికి తెరతీశారని వెల్లంపల్లి మండిపడ్డారు. "తినే పదార్థాల్లో యాసిడ్లు కలిపితే ఏమవుతుందో మీకే తెలియాలి" అంటూ ఎద్దేవా చేశారు. ఇచ్చిన హామీలు నెరవేర్చలేక, ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను పక్కదారి పట్టించేందుకే చంద్రబాబు ఇలాంటి 'డైవర్షన్' రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.
అయోధ్య లడ్డూల గందరగోళం
అయోధ్యకు కల్తీ లడ్డూలు పంపారని ఆరోపించిన పవన్ కళ్యాణ్పై వెల్లంపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఆ లడ్డూలను ఎవరు తయారు చేశారు? ఎక్కడి నుంచి పంపారు? అనే కనీస అవగాహన లేకుండా పవన్ మాట్లాడి అపహాస్యం పాలయ్యారని విమర్శించారు. వైసీపీ హయాంలో లడ్డూ నాణ్యతపై ఒక్క ఫిర్యాదు కూడా రాలేదని ఆయన గుర్తు చేశారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే కల్తీ నెయ్యి ట్యాంకర్లు వచ్చాయని, అవే ట్యాంకర్లు మళ్లీ లోపలికి వెళ్లాయని వెల్లంపల్లి ఆరోపించారు. దీనికి సమాధానం చెప్పాల్సింది ప్రభుత్వమేనని స్పష్టం చేశారు.
వెంకటేశ్వర స్వామి విషయంలో అపచారాలు చేయడం మంచిది కాదని, తప్పు చేసిన వారు శిక్ష అనుభవించక తప్పదని వెల్లంపల్లి హెచ్చరించారు. ఇప్పటికైనా అబద్ధపు ప్రచారాలు ఆపి, పాలనపై దృష్టి పెట్టాలని సూచించారు.
తప్పు ఒప్పుకున్న టీటీడీ మాజీ ఛైర్మన్..!
వైసీపీ అధికారంలో చేపట్టిన తర్వాత టీటీడీ బోర్డు ఛైర్మన్గా వ్యవహరించిన వైవీ సుబ్బారెడ్డి తాజాగా జాతీయ మీడియాతో మాట్లాడారు. కల్తీ జరిగిన మాట వాస్తవమే అని ఆయన స్పష్టం చేశారు. అయితే టీటీడీ మాజీ ఛైర్మన్ కల్తీని నిర్ధారించిన.. వైసీపీ అధినేత దగ్గర నుంచి స్థానిక నేతల వరకు కూటమి ప్రభుత్వాన్ని బుకాయించడం కొసమెరుపు.
Also REad: India Vs USA Match: టీ20 వరల్డ్కప్ తొలి మ్యాచ్లో టీమ్ఇండియా విజయం..పోరాడి ఓడిన యూఎస్ఏ!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Siddhi Yoga Effect On Zodiac: జ్యోతిష్య శాస్త్రం పరంగా ఈ ఆదివారం చాలా ప్రత్యేకమైనదిగా భావించవచ్చు. ఎందుకంటే చంద్రుడు తులా రాశిలోకి సంచరించడం.. బుధుడు ఈ రోజే కదలికలు జరపడం వల్ల ఎంతో శక్తివంతమైన సిద్ధియోగం ఏర్పడింది. అన్ని యోగాలతో పోలిస్తే.. దీనిని ఎంతో శుభప్రదమైనదిగా భావిస్తారు. కాబట్టి దీని ప్రభావం మొత్తం అన్ని రాశుల వారిపై పడుతుంది. దీంతో ఆయా రాశుల వారికి ఎంతో మేలు జరుగుతుంది. ఇదే సమయంలో సర్వార్ధ సిద్ధ యోగంతో పాటు ఎంతో శక్తివంతమైన రవి యోగం కూడా ఏర్పడుతుంది. దీంతో కొన్ని రాశుల వారికి అద్భుతమైన యోగాలు కలుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఈ సమయంలో ఆయా రాశుల వారికి ఊహించని ప్రయోజనాలు కలిగి అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈ రాశులవారికి డబ్బే, డబ్బు!
మేషరాశి
ఈ ఆదివారం నుంచి మేష రాశి వారికి అంతా బాగుంటుంది. ముఖ్యంగా వీరికి నైపుణ్యం వల్ల అద్భుతమైన లాభాలు కలుగుతాయి. వ్యాపారాలు కూడా చాలా వరకు లాభసాటిగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. సామాజిక కార్యక్రమాల్లో కూడా పాల్గొని విశేషమైన ప్రతిభ కనబరిచితారు.. అలాగే స్నేహితులతో పాటు సహుద్యోగుల నుంచి భారీ మొత్తంలో డబ్బులు పొందగలుగుతారు. ముఖ్యంగా ఈ సమయంలో ఎలాంటి పనులు చేసిన చాలావరకు ఆదాయాన్ని పొందుతారు. ప్రేమ జీవితం కూడా ఎంతో లాభసాటిగా మారుతుంది. తల్లిదండ్రుల నుంచి ప్రోత్సాహకాలు కూడా పొందుతారు. అలాగే ప్రేమ జీవితం కూడా చాలా ఆనందంగా కొనసాగుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.
మిథున రాశి
ఈ ఆదివారం నుంచి మిథున రాశి వారికి ఎన్నో రకాల అద్భుతమైన లాభాలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వీరికి కమ్యూనికేషన్ నైపుణ్యం విపరీతంగా పెరిగి సమాజంలో కీర్తి, ప్రతిష్ట లభిస్తాయి. అలాగే కుటుంబ జీవితంలో గౌరవం కూడా విపరీతంగా పెరుగుతుంది. చాలాకాలం పరిష్కారం కాని పనులు కూడా ఈ సమయంలో సులభంగా పూర్తవుతాయి. ఆర్థికంగా కూడా అనుకుంటున్న పనుల్లో అద్భుతమైన లాభాలు పొందుతారు. పిల్లలతో సమయం గడపడం వల్ల కొత్త కొత్త అవకాశాలు కూడా లభిస్తాయి. ఇతర విలాసవంతాలను పొందే సూచనలు కనిపిస్తున్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.
Also Read: Mercury Transit 2026: మకరంలో తిష్ట వేసిన బుధుడు.. ఈ రాశుల వారికి కోటీశ్వరులయ్యే యోగం ప్రారంభం!
మకర రాశి
మకర రాశి వారికి ఈ సమయంలో విపరీతంగా గౌరవం పెరుగుతుంది. అంతేకాకుండా కృషికి తగ్గ ప్రతిఫలం కూడా లభించబోతోంది. అలాగే కెరీర్ పరంగా అదృష్టం కూడా సహకరించబోతోంది. తెలివితేటలు విపరీతంగా పెరగడం వల్ల ఎలాంటి పనులు చేసిన అద్భుతమైన లాభాలు పొందుతారు. స్నేహితుల నుంచి సహకారం లభిస్తుంది. ఎలాంటి కోరికలు కోరుకున్నప్పటికీ ఈ సమయంలో అవి నెరవేర్చుకునే దిశగా పనులు చేయగలుగుతారు. అలాగే ప్రేమ జీవితం కూడా చాలా లాభసాటిగా మారుతుంది. అద్భుతమైన పనులు చేసిన ఈ సమయంలో మంచి లాభాలు పొందుతారు. ఆర్థికంగా కూడా చాలావరకు మెరుగుపడబోతోంది.
Also Read: Mercury Transit 2026: మకరంలో తిష్ట వేసిన బుధుడు.. ఈ రాశుల వారికి కోటీశ్వరులయ్యే యోగం ప్రారంభం!

Also Read: Mercury Transit 2026: మకరంలో తిష్ట వేసిన బుధుడు.. ఈ రాశుల వారికి కోటీశ్వరులయ్యే యోగం ప్రారంభం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
PM Narendra Modi Malaysia Tour: ప్రధాని మోదీ రెండు రోజుల మలేషియా పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఆదివారం, ఫిబ్రవరి 8 రెండవ రోజు పర్యటనలో భాగంగా.. కౌలాలంపూర్లో ప్రధాని మోదీ, మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం, మంత్రులు, రెండు దేశాల ప్రతినిధులతో పెర్దానా పుత్ర భవనంలో సమావేశమయ్యారు. అంతకుముందు ప్రధాని మోదీకి గౌరవ గార్డుతో స్వాగతం పలికారు. తన పర్యటన మొదటి రోజున మోదీ రెండు దేశాల మధ్య ఉమ్మడి విలువలు, పెరుగుతున్న వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని తెలియజేశారు.
ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. మీరు నన్ను, నా ప్రతినిధి బృందాన్ని స్వాగతించిన తీరుకు, ఈ కొన్ని గంటల్లో సాంప్రదాయ ఆచారాలను పక్కనపెట్టి మలేషియా జీవితాన్ని చాలా అందంగా ప్రదర్శించిన తీరుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. మీరు నిర్వహించిన అద్భుతమైన విధానం ఎల్లప్పుడూ మా జ్ఞాపకాలలో నిలిచి ఉంటుందని.. దీనికి నేను మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని మోదీ అన్నారు.
అలాగే కౌలాలంపూర్లో వేలాది మంది భారతీయ సమాజ సభ్యులను ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడారు. భారతదేశం-మలేషియా సంబంధాలు నమ్మకం, సంస్కృతి, ఆర్థిక ఆశయాల ద్వారా నడిచే కొత్త యుగంలోకి ప్రవేశిస్తున్నాయని అన్నారు. భారతీయ ప్రవాసులను సజీవ వారధిగా ఆయన అభివర్ణించారు. శతాబ్దాల నాటి తమిళ మూలాలు, ఉమ్మడి సంప్రదాయాలు, సాంస్కృతిక కొనసాగింపుపై మలేషియా ప్రధాని మంత్రి అన్వర్ ఇబ్రహీంను మోదీ ప్రశంసించారు.
మలేషియా పర్యటనలో ద్వైపాక్షిక సహకారానికి మార్గనిర్దేశం చేసే ఇంపాక్ట్ ఫ్రేమ్వర్క్ను ప్రధాని మోదీ ఆవిష్కరించారు. వాణిజ్యం, స్టార్టప్ల నుండి రక్షణ, సాంకేతికత వరకు, భారతదేశ పురోగతి మలేషియా విజయంతో విడదీయరానిదని మోదీ అభివర్ణించారు. 800 మందికి పైగా నృత్యకారులు ప్రదర్శించిన ఈ రికార్డు స్థాయి సాంస్కృతిక ప్రదర్శన రాబోయే సంవత్సరాల్లో గుర్తుండిపోతుందని ప్రధానమంత్రి సాంస్కృతిక ప్రదర్శనను ప్రశంసించారు. కళాకారులందరికీ ఆయన అభినందనలు తెలిపారు.
మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం, తాను ప్రధానమంత్రి కాకముందు నుండే స్నేహితులమని మోదీ అన్నారు. ప్రధానమంత్రి అన్వర్ ఇబ్రహీం సంస్కరణలపై దృష్టి పెట్టడం, ఆయన అద్భుతమైన అవగాహన, ఆసియాన్ 2025కు ఆయన సమర్థ అధ్యక్షత వహించడం పట్ల మోదీ ప్రశంసలు కురిపించారు. గత సంవత్సరం మలేషియాలో జరిగిన ఆసియాన్ శిఖరాగ్ర సమావేశానికి హాజరుకాని ప్రధాని మోదీ, త్వరలో మలేషియాను సందర్శిస్తానని హామీ ఇచ్చానని, ఆ వాగ్దానాన్ని నెరవేర్చుకున్నానన్నారు.
Also Read: Shani Shukra Yuti: మీనరాశిలో శనిదేవుడి, శుక్ర గ్రహాల సంయోగంతో ఈ 3 రాశుల వారికి ఉజ్వల భవిష్యత్తు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
India Vs USA T20 World Cup: టీ20 ప్రపంచకప్ తొలి మ్యాచ్లో టీమ్ఇండియా విజయం సాధించింది. ప్రత్యర్థి జట్టు యూఏఎస్ గట్టి పోటీని ఇచ్చినా.. చివరికి విజయం భారత్ను వరించింది. 162 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన యూఎస్ఏ టీమ్.. భారత బౌలర్ల ధాటికి 29 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.
కానీ, టీమ్ఇండియా లాంటి బలమైన జట్టుతో యూఎస్ఏ పోరాడిన విధానానికి ప్రేక్షకుల నుంచి ఆదారాభిమానాలు లభించాయి. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న యూఎస్ఏ.. భారత బ్యాటర్లను కట్టడి చేయడంలో ఒకింత విజయం సాధించారు. అయితే టీమ్ఇండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ హాఫ్ సెంచరీతో జట్టును గట్టెక్కించాడు.
162 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన యూఎస్ఏ టీమ్కు ఆదిలోనే భారత బౌలర్ల రూపంలో అడ్డు తగిలింది. గౌస్ (6), ఎస్ఆర్ ముక్కమల్ల (2), ఎండీ పటేల్ (0) (కెప్టెన్) వెంటనే వెనుదిరిగినా.. మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు మిలింద్ కుమార్ (34), కృష్ణమూర్తి (37) పోరాడి పెవిలీయన్ చేరారు. ఆ తర్వాత వచ్చిన శుభమ్ (37) చివర్లో బ్యాట్తో మెరుపులు మెరిపించినా అప్పటికే అమెరికా ఓటమికి చేరువైంది.
యూఎస్ఏపై భారత బౌలర్లు విరుచుకుపడ్డారు. సిరాజ్ 3 వికెట్లు.. అర్షదీప్ సింగ్, అక్షర్ పటేల్ చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. స్పిన్నర్ వరుణ్ 1 వికెట్ పడగొట్టాడు.
భారత ఇన్నింగ్స్..
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన టీమ్ఇండియాకు తొలి మ్యాచ్లోనే అమెరికా (USA) గట్టి పోటీని ఇచ్చింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వీరోచిత ఇన్నింగ్స్తో జట్టును ఆదుకున్నాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఒంటరి పోరాటం చేసి భారత్కు గౌరవప్రదమైన స్కోరు అందించాడు.
తొలి మ్యాచ్లోనే భారత టాపార్డర్ తడబడటంతో బాధ్యత తీసుకున్న సూర్యకుమార్ యాదవ్ (84)* మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ముఖ్యంగా ఇన్నింగ్స్ ఆఖరి రెండు ఓవర్లలో గేర్ మార్చిన స్కై, వరుసగా 3 ఫోర్లు, 3 సిక్సర్లు బాది స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. అతనికి తోడుగా తిలక్ వర్మ (25), ఇషాన్ కిషన్ (20) పర్వాలేదనిపించారు.
సూర్య ఒకవైపు నిలకడగా ఆడినా, మిగిలిన బ్యాటర్లు అమెరికా బౌలర్ల ధాటికి పెవిలియన్కు క్యూ కట్టారు. అభిషేక్ శర్మ, శివమ్ దూబే ఇద్దరూ గోల్డెన్ డక్ (తొలి బంతికే అవుట్)గా వెనుదిరగడం అభిమానులను నిరాశకు గురిచేసింది. రింకు సింగ్ (6), హార్దిక్ పాండ్య (5), అర్ష్దీప్ సింగ్ (4) వంటి ఫినిషర్లు కనీసం రెండంకెల స్కోరు కూడా చేయలేకపోయారు. చివరి బంతికి వరుణ్ చక్రవర్తి రనౌట్ అవ్వడంతో భారత్ 9 వికెట్లు కోల్పోయింది.
పసికూనగా భావించిన అమెరికా జట్టు భారత బ్యాటర్లను బాగా వణికించింది. అమెరికా బౌలర్ షాడ్లీ అద్భుత స్పెల్తో 4 వికెట్లు పడగొట్టాడు. ఒకే ఓవర్లో మూడు వికెట్లు తీసి భారత ఇన్నింగ్స్ను దెబ్బతీశాడు. హర్మీత్ సింగ్ 2 వికెట్లు తీయగా, అలీ ఖాన్, మొహ్సిన్ ఖాన్లకు తలో వికెట్ దక్కింది.
Also Read: Pakistan Vs Netherlands: పాకిస్థాన్ను వణికించిన నెదర్లాండ్..పరమచెత్తగా ఆడిన పాక్ చివరికి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Imanvi In Pawan Kalyan Movie: పవర్ స్టార్ పవన్ కల్యాణ్, స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి కాంబినేషన్లో రాబోతున్న భారీ ప్రాజెక్ట్ గురించి ప్రస్తుతం ఫిలింనగర్లో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. పవన్ కళ్యాణ్ ఇమేజ్కు తగ్గట్టుగా ఒక పవర్ఫుల్ స్క్రిప్ట్ను సురేందర్ రెడ్డి సిద్ధం చేయగా, ఈ సినిమా హీరోయిన్ ఎవరన్నది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. 2026 ఉగాది పర్వదినాన ప్రారంభం కానున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం హీరోయిన్ వేట ముమ్మరంగా సాగుతోంది. ఈ రేసులో ఒక కొత్త పేరు బలంగా వినిపిస్తోంది.
రష్మిక కాదు.. ఇమాన్వీ?
మొదట్లో ఈ సినిమా కోసం నేషనల్ క్రష్ రష్మిక మందన్న పేరు వినిపించినప్పటికీ, తాజా సమాచారం ప్రకారం మేకర్స్ ఒక కొత్త బ్యూటీ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.
ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఫౌజీ' (Fauji) సినిమాతో ఇమాన్వీ టాలీవుడ్లోకి అడుగుపెడుతోంది. తన క్లాసిక్ లుక్స్ మరియు సోషల్ మీడియా క్రేజ్ దృష్ట్యా, పవన్ సరసన ఈమె అయితే ఫ్రెష్గా ఉంటుందని సురేందర్ రెడ్డి భావిస్తున్నారట. పవన్ కల్యాణ్ తన రాజకీయ, ఇతర సినిమా కమిట్మెంట్స్ను బ్యాలెన్స్ చేస్తూ ఈ చిత్రానికి డేట్స్ కేటాయించనున్నారు. 2026 మార్చిలో (ఉగాదికి) ఈ సినిమాను అధికారికంగా ప్రారంభించి, ఆ వెంటనే రెగ్యులర్ షూటింగ్కు వెళ్లాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.
సురేందర్ రెడ్డి మార్క్ స్టైలిష్ యాక్షన్, పవన్ కల్యాణ్ మాస్ అప్పీల్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ కానున్నాయి. ఇప్పటికే కథా చర్చలు ముగియగా, ప్రస్తుతం ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక ప్రక్రియ సాగుతోంది.
ఇమాన్వీ పేరు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నప్పటికీ, చిత్ర నిర్మాణ సంస్థ నుండి గానీ, సురేందర్ రెడ్డి నుండి గానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఒకవేళ ఇమాన్వీ కన్ఫర్మ్ అయితే, ప్రభాస్ తర్వాత వెంటనే పవన్ కళ్యాణ్ వంటి బిగ్ స్టార్తో ఛాన్స్ దక్కించుకోవడం ఆమె కెరీర్కు మలుపు తిప్పే 'బంపర్ ఆఫర్' అనే చెప్పాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Motorola G86 Power 5g Price Cut: అత్యంత తగ్గింపు ధరతోనే MOTOROLA G86 Power 5G స్మార్ట్ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఇదే మంచి అద్భుతమైన అవకాశంగా భావించవచ్చు. ఫ్లిప్కార్ట్ వాలెంటైన్స్ డే ఆఫర్స్లో భాగంగా అత్యంత తగ్గింపు ధరకే లభిస్తోంది. ముఖ్యంగా దీనిపై ఎన్నో రకాల స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. అదనంగా ఈ మొబైల్పై ఎక్స్చేంజ్ బోనస్ కూడా లభిస్తుంది. వీటన్నిటిని వినియోగించి కొనుగోలు చేసే వారికి చీప్ ధరకే మొబైల్ లభిస్తుంది.
MOTOROLA G86 Power స్మార్ట్ఫోన్ దిమ్మ తిరిగే ఫీచర్లతో అందుబాటులోకి వచ్చింది. ముఖ్యంగా ఇది 6.7 అంగుళాల Super HD (1.5K) AMOLED/pOLED డిస్ప్లేను కలిగి ఉంటుంది. అంతేకాకుండా 120Hz రిఫ్రెష్ రేట్, 4500 nits పీక్ బ్రైట్నెస్ సపోర్టుతో అందుబాటులోకి వచ్చింది. ఈ మొబైల్ ఎంతో శక్తివంతమైన MediaTek Dimensity 7400 (4nm Octa-core) ప్రాసెసర్ను కలిగి ఉంటుంది. అలాగే ఈ స్మార్ట్ఫోన్ బేస్ వేరియంట్ 8జిబి ర్యామ్తో ప్రారంభమవుతుంది. అయితే దీని వెనుక భాగంలో ప్రీమియం లుక్లో కనిపించేందుకు అద్భుతమైన కెమెరా మాడ్యూల్ లభిస్తుంది. దీనికి ప్రత్యేకంగా 50MP మెయిన్ కెమెరా (Sony LYTIA 600 సెన్సార్, OIS) కెమెరా కలిగి ఉంటుంది. దీంతోపాటు అదనంగా 8MP అల్ట్రావైడ్, మాక్రో లెన్స్ కెమెరాలు కూడా లభిస్తున్నాయి.
ఈ స్మార్ట్ఫోన్ ఫ్రంట్ భాగంలో 32MP సెల్ఫీ కెమెరా కూడా అందుబాటులో ఉంది. ఈ మొబైల్ ఎంతో శక్తివంతమైన 6720mAh భారీ బ్యాటరీ, 33W TurboPower వేగవంతమైన ఛార్జింగ్ సపోర్టును కూడా కలిగి ఉంటుంది. అలాగే ఇది Android 15 (Hello UI) ఆపరేటింగ్ సిస్టంపై రన్ అవుతుంది. ప్రస్తుతం ఈ స్మార్ట్ఫోన్ బేస్ వేరియంట్ పై అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్స్ లభిస్తున్నాయి. దీని అసలు ధర మార్కెట్లో రూ.19,999 కాగా.. ఇప్పుడే కొనుగోలు చేసే వారికి 10 శాతం తగ్గింపుతో కేవలం రూ.17,999కే అందుబాటులో ఉంటుంది. అంతేకాకుండా ఫ్లిప్కార్ట్ అనుసంధాన యాక్సిస్ బ్యాంక్, ఎస్బిఐ బ్యాంకులకు సంబంధించిన క్రెడిట్ కార్డులను వినియోగించి పేమెంట్ చేస్తే రూ.1,800 వరకు డిస్కౌంట్ లభిస్తుంది.
Also Read: Redmi 14C 5G Offer: రెడ్మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్ఫోన్..అదిరిపోయే ఆఫర్!
అంతేకాకుండా ఐసిఐసిఐ బ్యాంకు క్రెడిట్ కార్డుతో పాటు సాధారణ ఎస్బిఐ బ్యాంకు క్రెడిట్ కార్డులను వినియోగించి పేమెంట్ చేసే వారికి కూడా రూ.1,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే ఎక్స్చేంజి బోనస్ ఆఫర్ వినియోగించి ఈ మొబైల్ను కొనుగోలు చేస్తే భారీ తగ్గింపు లభించబోతోంది. దీని కోసం ఏదైనా స్మార్ట్ఫోన్ ముందుగా ఎక్స్చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేస్తే, రూ.17 వేల బోనస్ లభిస్తుంది. దీంతో ఈ మొబైల్ రూ.999కే పొందవచ్చు.
Also Read: Redmi 14C 5G Offer: రెడ్మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్ఫోన్..అదిరిపోయే ఆఫర్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Motorola G96 5g Price In India: అత్యంత తగ్గింపు ధరలోనే మంచి మొబైల్ కొనుగోలు చేయాలనుకునే వారికి ఫ్లిప్కార్ట్ అద్భుతమైన అవకాశాన్ని అందిస్తోంది. వాలెంటెన్స్ డే సందర్భంగా మోటరోలా బ్రాండ్ కు సంబంధించిన కొన్ని మోడల్స్ పై అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్స్ అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా ఈ ఆఫర్స్లో భాగంగా కొనుగోలు చేసే వారికి అతి తక్కువ ధరలోనే మొబైల్స్ లభించబోతున్నాయి. అయితే ఈ వాలెంటెన్స్ డే సందర్భంగా అత్యంత తగ్గింపు ధరికే అందుబాటులో ఉన్న మొబైల్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ మోటోరోలా G96 5G స్మార్ట్ఫోన్ ఫ్లిప్కార్ట్లో వాలెంటైన్స్ డే సందర్భంగా చాలా తక్కువ ధరకే అందుబాటులో ఉంది. దీనిపై ఎన్నో రకాల డిస్కౌంట్ ఆఫర్స్ లభిస్తున్నాయి. ఇక ఈ మొబైల్ కు సంబంధించిన ఫీచర్స్ వివరాల్లోకి వెళ్తే.. ఇది మార్కెట్లోకి 6.67 అంగుళాల Full HD+ pOLED 3D కర్వ్డ్ డిస్ప్లేతో అందుబాటులోకి వచ్చింది. అంతేకాకుండా 144Hz రిఫ్రెష్ రేట్, 1600 నిట్స్ పీక్ బ్రైట్నెస్తో లభిస్తోంది. అలాగే ఇది ఎంతో శక్తివంతమైన క్వాల్కామ్ Snapdragon 7s Gen 2 ఆక్టా-కోర్ ప్రాసెసర్తో అందుబాటులో ఉంది.. అలాగే ఇది మార్కెట్లో 8gb ర్యామ్ బేస్ వేరియంట్తో ప్రారంభమవుతుంది.
ఇక వెనక భాగంలో ఈ మోటోరోలా G96 5G (Motorola G96 5g) స్మార్ట్ఫోన్ అద్భుతమైన కెమెరా మాడ్యూయల్ ని కలిగి ఉంది. ఇది 50MP మెయిన్ కెమెరా (Sony Lytia 700C సెన్సార్ తో అందుబాటులోకి వచ్చింది. దీంతోపాటు అదనంగా 8MP అల్ట్రావైడ్ కెమెరా కూడా లభిస్తోంది. ఇక ఫ్రంట్ భాగంలో 32MP సెల్ఫీ కెమెరా కూడా ఇందులో ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఎంతో శక్తివంతమైన 5500mAh బ్యాటరీ, ఇది 68W టర్బోపవర్ ఛార్జింగ్ సపోర్టును అందిస్తోంది. ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 15 (Android 15) ఆధారిత 'హలో UI' (Hello UI) ఆపరేటింగ్ సిస్టంపై రన్ అవుతుంది. ఇందులో డాల్బీ అట్మోస్ (Dolby Atmos) సపోర్ట్ ఉన్న స్టీరియో స్పీకర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.
Also Read: Redmi 14C 5G Offer: రెడ్మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్ఫోన్..అదిరిపోయే ఆఫర్!
ప్రస్తుతం మార్కెట్లో ఈ మోటోరోలా G96 5G స్మార్ట్ఫోన్ రెండు స్టోరేజ్ ఆప్షన్స్లో ఉంది.. 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన వేరియంట్ రూ.17,999 తో అందుబాటులో ఉంది. అయితే, దీనిని వాలెంటైన్స్ డే సందర్భంగా ఫ్లిప్కార్ట్లో ఇప్పుడే కొనుగోలు చేసే వారికి అదనంగా బ్యాంకు డిస్కౌంట్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. వీటిని వినియోగించాలనుకునేవారు.. ఫ్లిప్కార్ట్ అనుసంధాన ఆక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కలిగి ఉండి.. ఈ కార్డుతో పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేస్తే ఏకంగా రూ.1,800 వరకు డిస్కౌంట్ లభిస్తుంది.
అంతేకాకుండా ఐసిఐసిఐ బ్యాంక్, ఎస్బిఐ బ్యాంకులకు సంబంధించిన క్రెడిట్ కార్డులను వినియోగించి పేమెంట్ చేసినప్పటికీ రూ.1,000 డిస్కౌంట్ లభిస్తుంది. ఈ మోటోరోలా G96 5G (Motorola G96 5g)స్మార్ట్ఫోన్ మరింత చీప్ ధరకే పొందాలనుకునేవారు.. ఫ్లిప్కార్ట్ అందిస్తున్న ఎక్స్చేంజ్ ఆఫర్ ని వినియోగించాల్సి ఉంటుంది. దీనిని వినియోగించి కొనుగోలు చేస్తే ఏకంగా రూ.16,000 వరకు బోనస్ లభిస్తుంది. దీంతో మీరు ఈ మొబైల్ను రూ.2,000 లోపే పొందవచ్చు.
Also Read: Redmi 14C 5G Offer: రెడ్మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్ఫోన్..అదిరిపోయే ఆఫర్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
UP Student Attacks Teacher: ఉత్తరప్రదేశ్లో గురు-శిష్యుల పవిత్ర బంధానికే మాయని మచ్చ తెచ్చే అత్యంత దారుణమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. తన ప్రేమను నిరాకరించిందనే కక్షతో, ఒక 12వ తరగతి విద్యార్థి మహిళా ఉపాధ్యాయురాలిపై అమానవీయంగా దాడి చేసి, ఆమె పెదవిని కొరికి తీవ్రంగా గాయపరిచాడు.
మెయిన్పురి జిల్లాలోని సదర్ కొత్వాలి ప్రాంతంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. కేవలం వేధింపులతో ఆగకుండా, ఆ విద్యార్థి ఉపాధ్యాయురాలిపై భౌతిక దాడికి దిగడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది.
నిందితుడైన విద్యార్థి గత కొంతకాలంగా అదే పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయురాలిని నిరంతరం వేధింపులకు గురిచేసేవాడు. విద్యార్థి ప్రవర్తనపై బాధితురాలు అతని తల్లిదండ్రులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయింది. వేధింపులు భరించలేక ఆమె ఆ పాఠశాల నుండి తప్పుకుని, వేరే చోట ఉద్యోగంలో చేరారు. అయినప్పటికీ, ఆ విద్యార్థి ఆమెను వెంబడించడం మానలేదు.
దారి కాచి ఘాతుకం
ఉపాధ్యాయురాలు ప్రైవేట్ ట్యూషన్ చెప్పడానికి వెళ్తున్న సమయంలో, ఆ విద్యార్థి ఆమె దారిని అడ్డుకున్నాడు. మొదట వాగ్వాదానికి దిగి, ఆపై ఆమె మెడ పట్టుకుని బలవంతంగా లాగాడు. ఆమె ప్రతిఘటించడంతో ఆగ్రహం చెందిన ఆ విద్యార్థి, ఆమె పెదవిని బలంగా కొరికి తీవ్రంగా గాయపరిచాడు. ఈ భయంకర దృశ్యాలన్నీ సమీపంలోని సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి.
ఆసుపత్రిలో చికిత్స.. నిందితుడు పరారీ
తీవ్ర రక్తస్రావం కావడంతో బాధితురాలిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం ఆమెను ఆగ్రాకు తరలించారు. బాధితురాలి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం పరారీలో ఉన్న ఆ ఉన్మాద విద్యార్థి కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
మహిళల భద్రతపై ఆందోళన
విద్యాబుద్ధులు నేర్పే గురువులపైనే ఇలాంటి దాడులు జరగడం సమాజంలో నైతిక విలువల పతనాన్ని సూచిస్తోంది. ఈ ఘటనపై సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. నిందితుడికి కఠిన శిక్ష పడాలని సామాజిక కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు.
Also Read: Pakistan Vs Netherlands: పాకిస్థాన్ను వణికించిన నెదర్లాండ్..పరమచెత్తగా ఆడిన పాక్ చివరికి!
Also Read: Gold Price Today: కిలో వెండి రూ.2 లక్షల లోపు తగ్గుతుందా? బంగారం, వెండి ధరల భారీ పతనానికి కారణం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Pakistan Vs Netherlands T20 World Cup: టీ20 ప్రపంచకప్ 2026లో పాకిస్థాన్ ఎట్టకేలకు శుభారంభం చేసింది. కొలంబో వేదికగా నెదర్లాండ్స్తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో పాక్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించి, టోర్నీలో బోణీ కొట్టింది. అయితే, పసికూన నెదర్లాండ్స్ బౌలర్లు పాక్ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టి ఒక దశలో విజయం ముంగిట నిలిచారు. 148 పరుగుల మోస్తరు లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్, ఒక దశలో ఓటమి కోరల్లో చిక్కుకుంది. కానీ లోయర్ ఆర్డర్ బ్యాటర్ ఫహీం అష్రఫ్ వీరోచిత పోరాటంతో జట్టును గెలిపించాడు.
నెదర్లాండ్స్ పోరాటం (తొలి ఇన్నింగ్స్)
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ జట్టు 19.5 ఓవర్లలో 147 పరుగులకు ఆలౌట్ అయింది. కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ (37) ఆకట్టుకోగా.. బాస్ డీ లీడే (30), మైఖేల్ లెవిట్ (24) ఓ మోస్తరుగా రాణించారు.
మరోవైపు పాక్ బౌలర్లలో సల్మాన్ మీర్జా 3 వికెట్లతో చెలరేగగా.. నవాజ్, అబ్రార్ అహ్మద్, సయీమ్ అయూబ్ తలో రెండు వికెట్లు తీశారు. స్టార్ పేసర్ షాహీన్ అఫ్రిదికి కేవలం ఒక్క వికెట్ మాత్రమే దక్కింది.
పాక్ ఇన్నింగ్స్
లక్ష్య ఛేదనలో పాకిస్థాన్కు ఓపెనర్ సయీమ్ అయూబ్ (24) మెరుపు ఆరంభం ఇచ్చాడు. ఆ తర్వాత సాహిబ్జాదా ఫర్హాన్ (47) కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టును ఆదుకున్నాడు. నెదర్లాండ్స్ బౌలర్లు క్రమశిక్షణతో బౌలింగ్ చేయడంతో పాక్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. ఒక దశలో 117 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పాక్ పీకల్లోతు కష్టాల్లో పడింది.
ఓటమి ఖాయమనుకున్న దశలో ఫహీం అష్రఫ్ కేవలం 11 బంతుల్లోనే 29 పరుగులు (2 ఫోర్లు, 3 సిక్సర్లు) చేసి మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. మరో 3 బంతులు మిగిలి ఉండగానే పాక్ లక్ష్యాన్ని ఛేదించింది.
నెదర్లాండ్స్ బౌలర్లు ఆర్యన్ దత్, పాల్ వాన్ మీకెరెన్ చెరో రెండు వికెట్లతో పాకిస్థాన్ను వణికించినప్పటికీ, చివరి నిమిషంలో ఫహీం అష్రఫ్ మెరుపులు పాక్కు ఊపిరి పోశాయి. ఈ విజయంతో పాక్ ఖాతాలో 2 పాయింట్లు చేరాయి.
Also Read: Gold Price Today: కిలో వెండి రూ.2 లక్షల లోపు తగ్గుతుందా? బంగారం, వెండి ధరల భారీ పతనానికి కారణం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Samsung Galaxy M17 5G Price Cut: సాంసంగ్ బ్రాండ్కి సంబంధించిన మంచి స్మార్ట్ఫోన్ను చీప్ బడ్జెట్లోనే కొనుగోలు చేయాలనుకుంటున్నారా? మీకు శుభవార్త.. ప్రస్తుతం Samsung Galaxy M17 5G మొబైల్ భారీ తగ్గింపుతో లభిస్తోంది. ఇప్పుడే దీనిని ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్లో కొనుగోలు చేసేవారికి భారీ డిస్కౌంట్ లభిస్తుంది. అయితే, ఈ స్మార్ట్ఫోన్ ఏయే ఫీచర్స్తో అందుబాటులో ఉందో? ఎన్ని రకాల డిస్కౌంట్ ఆఫర్స్తో అందుబాటులో ఉందో ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ Samsung Galaxy M17 5G స్మార్ట్ఫోన్ ఎన్నో రకాల అద్భుతమైన ఫీచర్స్తో అందుబాటులోకి వచ్చింది. ఇది ప్రీమియం AI ఫీచర్లతో లభిస్తోంది. ప్రస్తుతం 6.7-అంగుళాల Full HD+ Super AMOLED డిస్ప్లేతో లభిస్తోంది. ఇందులో 90Hz రిఫ్రెష్ రేట్తో పాటు 1100 nits గరిష్ట బ్రైట్నెస్ సపోర్ట్ కూడా లభిస్తోంది.. అంతేకాకుండా స్క్రీన్ రక్షణ కోసం Corning Gorilla Glass Victus ప్రోటన్తో అందుబాటులో ఉంది.
ఈ మొబైల్ దాని సొంత Exynos 1330 (5nm) చిప్సెట్ ప్రాసెసర్తో అందుబాటులో ఉంది. అంతేకాకుండా OIS సపోర్ట్తో 50MP మెయిన్ కెమెరాతో పాటు 5MP అల్ట్రా వైడ్, 2MP మాక్రో లెన్స్ కెమెరాను కలిగి ఉంటుంది. అలాగే ఇది 13MP సెల్ఫీ కెమెరా ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇది ఎంతో శక్తివంతమైన 5,000mAh బ్యాటరీతో పాటు 25W ఫాస్ట్ ఛార్జింగ్కు సపోర్ట్ను కూడా కలిగి ఉంటుంది. దీంతో పాటు ఆండ్రాయిడ్ 15 ఆధారిత One UI 7 ఆపరేటింగ్ సిస్టమ్ను కూడా కలిగి ఉంటుంది. అంతేకాకుండా దీనికి 6 సంవత్సరాల పాటు OSతో పాటు సెక్యూరిటీ అప్డేట్స్ను కూడా అందిస్తోంది.
ఇందులో గూగుల్ 'సర్కిల్ టు సెర్చ్' (Circle to Search)తో పాటు 'జెమిని లైవ్' (Gemini Live) వంటి ప్రీమియం AI ఫీచర్లు కూడా లభిస్తున్నాయి. అలాగే ఇందులో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా అందుబాటులో ఉంది. ఇవే కాకుండా చాలా రకాల ప్రత్యేకమైన ఫీచర్స్తో ఈ మొబైల్ మార్కెట్లో లభిస్తోంది.
ఇప్పుడే ఈ స్మార్ట్ఫోన్ను బేస్ వేరియంట్ను అమెజాన్లో కొనుగోలు చేసేవారికి ఏకంగా ప్రత్యేకమైన తగ్గింపుతో లభిస్తోంది. దీని అసలు ధర రూ.16,499 కాగా.. ఇప్పుడే దీనిని కొనుగోలు చేసేవారికి 18 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో మీరు కేవలం రూ.13,499కే పొందవచ్చు. ఇవే కాకుండా అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి.
Also Read: Redmi 14C 5G Offer: రెడ్మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్ఫోన్..అదిరిపోయే ఆఫర్!
ఈ బ్యాంక్ ఆఫర్స్లో భాగంగా అమెజాన్ పే ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ను వినియోగించి పేమెంట్ చేస్తే ఏకంగా రూ.600 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో పాటు మీరు ఎక్చేంజ్ ఆఫర్ను వినియోగించి కొనుగోలు చేసేవారికి భారీ బోనస్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్స్లో భాగంగా ఏదైన పాత స్మార్ట్ఫోన్ ఎక్చేంజ్ చేస్తే రూ.12,700 వరకు బోనస్ లభిస్తుంది. దీంతో మీరు ఈ స్మార్ట్ఫోన్ను అన్ని ఆఫర్స్తో కలిపి కేవలం రూ.799కే పొందవచ్చు. అయితే, ఈ బోనస్ అనేది పాత స్మార్ట్ఫోన్ కండీషన్పై ఆధారపడి ఉంటుంది.
Also Read: Redmi 14C 5G Offer: రెడ్మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్ఫోన్..అదిరిపోయే ఆఫర్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Vaibhav Suryavanshi 175 Runs U19: అండర్-19 ప్రపంచకప్ 2026 ఫైనల్లో టీమ్ఇండియా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ సృష్టించిన విధ్వంసంపై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్నాయి. కేవలం 14 ఏళ్ల వయసులోనే ఇంగ్లాండ్ బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టిన వైభవ్ ఆటపై ఐస్లాండ్ క్రికెట్ చేసిన ఒక ఫన్నీ ట్వీట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
హరారే వేదికగా జరిగిన ఫైనల్లో వైభవ్ సూర్యవంశీ ఆడిన మెరుపు ఇన్నింగ్స్ ధాటికి ఇంగ్లాండ్ జట్టు బెంబేలెత్తిపోయింది. అతని బ్యాటింగ్ చూసి నెటిజన్లు ఫిదా అవుతుంటే, ఐస్లాండ్ క్రికెట్ బోర్డు తనదైన శైలిలో స్పందించింది.
ఏం జరిగింది?
వైభవ్ విధ్వంసకర సెంచరీ బాదిన వెంటనే ఐస్లాండ్ క్రికెట్ ట్విట్టర్ (X) వేదికగా ఇలా పేర్కొంది. "వైభవ్ సూర్యవంశీని ఎవరైనా వెంటనే అరెస్టు చేయాలి! మైదానంలో ఇంగ్లాండ్ బౌలర్లపై అతను చూపించిన ఈ హింస 'ఎక్స్-రేటెడ్' (X-rated) లాగా ఉంది." అంటే వైభవ్ బ్యాటింగ్ అంత భయంకరంగా, శక్తివంతంగా ఉందనే అర్థంలో సరదాగా ఈ కామెంట్ చేసింది. ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతోంది.
ఫైనల్ వంటి కీలక మ్యాచ్లో వైభవ్ 175 పరుగులు చేసి రికార్డు సృష్టించాడు. తన ఇన్నింగ్స్లో 15 ఫోర్లు, 15 సిక్సర్లు బాది ఇంగ్లీష్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. అండర్-19 ప్రపంచకప్ ఫైనల్ చరిత్రలోనే ఇది అత్యధిక వ్యక్తిగత స్కోరుగా నిలిచింది. డబుల్ సెంచరీకి కేవలం 25 పరుగుల దూరంలో వైభవ్ అవుట్ అయినప్పటికీ, అప్పటికే భారత్ విజయం ఖాయమైపోయింది.
ఆరోసారి ప్రపంచ విజేతగా భారత్
కెప్టెన్ ఆయుష్ మాత్రేతో కలిసి వైభవ్ అందించిన ఓపెనింగ్ భాగస్వామ్యం ఇంగ్లాండ్ను కోలుకోలేని దెబ్బ తీసింది. ఇంగ్లాండ్ బౌలర్లు ఎన్ని ప్రయోగాలు చేసినా వైభవ్ జోరును అడ్డుకోలేకపోయారు. ఫలితంగా భారత్ ఆరోసారి అండర్-19 ప్రపంచకప్ ట్రోఫీని ముద్దాడింది.
అతి చిన్న వయసులోనే ప్రపంచకప్ ఫైనల్లో అద్భుత ప్రదర్శన చేసిన వైభవ్, భవిష్యత్తులో భారత సీనియర్ జట్టులో స్టార్ ప్లేయర్ అవుతాడని మాజీ క్రికెటర్లు జోస్యం చెబుతున్నారు.
Also REad: Gold Price Today: కిలో వెండి రూ.2 లక్షల లోపు తగ్గుతుందా? బంగారం, వెండి ధరల భారీ పతనానికి కారణం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Samsung Galaxy A07 5G Price Cut: సాంసంగ్ కంపెనీ ఇటీవలే మార్కెట్లోకి విడుదల చేసిన అద్భుతమైన స్మార్ట్ఫోన్స్లో Samsung Galaxy A07 5G ఒకటి. ఇది ప్రీమియం ఫీచర్స్తో అందుబాటులోకి వచ్చింది. దీనిని కంపెనీ ఫిబ్రవరి 5వ తేదిన భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఇది ప్రీమియం ఫీచర్స్తో పాటు శక్తివంతమైన బ్యాటరీతో అందుబాటులోకి వచ్చింది. అయితే, ఈ స్మార్ట్ఫోన్ ఇప్పుడు అమెజాన్లో చాలా తక్కువ ధరకే లభిస్తోంది. దీనిపై ఉన్న ఆఫర్స్ వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఈ Samsung Galaxy A07 5G స్మార్ట్ఫోన్ ప్రీమియం డిప్లేతో అందుబాటులోకి వచ్చింది. ఇది 6.7 అంగుళాల HD+ డిస్ప్లేను కలిగి ఉంటుంది. అంతేకాకుండా PLS LCD స్క్రీన్తో లభిస్తోంది. ఇది 800 నిట్స్ (HBM) బ్రైట్నెస్, 120Hz రిఫ్రెష్ రేట్ను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ఫోన్ చాలా ప్రత్యేకమైన మీడియాటెక్ డైమెన్సిటీ 6300 (MediaTek Dimensity 6300) ఆక్టా-కోర్ చిప్సెట్ ప్రాసెసర్తో అందుబాటులోకి వచ్చింది. ఇది ఆండ్రాయిడ్ 16 ఆధారిత One UI 8.0 ఆపరేటింగ్ సిస్టమ్పై రన్ అవుతుంది. అంతేకాకుండా 6 ఏళ్ల పాటు ఆండ్రాయిడ్ OSతో పాటు ప్రత్యేకమైన సెక్యూరిటీ అప్డేట్స్ను కూడా అందిస్తోంది.
ఇక ఈ స్మార్ట్ఫోన్కి సంబంధించిన కెమెరా సెటప్ వివరాల్లోకి వెళితే.. ఇది డ్యూయల్ కెమెరా సెటప్ను కలిగి ఉంటుంది. వెనక భాగంలో 50MP మెయిన్ కెమెరాతో పాటు 2MP డెప్త్ సెన్సార్ సపోర్ట్తో అందుబాటులోకి వచ్చింది. దీంతో పాటు ఫ్రంట్ భాగంలో 8MP సెల్ఫీ కెమెరా కూడా అందుబాటులో ఉంది. అలాగే ఇందులో Full HD (1080p) వీడియో రికార్డింగ్ సపోర్ట్ను కూడా అందిస్తోంది.
ఈ స్మార్ట్ఫోన్ ఎంతో శక్తివంతమైన 6000mAh భారీ బ్యాటరీని కలిగి ఉంటుంది. 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో లభిస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో ఈ స్మార్ట్ఫోన్ రెండు స్టోరేజ్ ఆప్షన్స్లో అందుబాటులో ఉంది. మొదటి వేరియంట్ 4GB RAM + 128GB స్టోరేజ్తో ధర రూ.15,999తో లభిస్తుంది. ఇక రెండవ వేరియంట్ 6GB RAM + 128GB స్టోరేజ్తో రూ.17,999తో అందుబాటులో ఉంది.
Also Read: Redmi 14C 5G Offer: రెడ్మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్ఫోన్..అదిరిపోయే ఆఫర్!
ప్రస్తుతం బేస్ వేరియంట్ స్మార్ట్ఫోన్ను ఇప్పుడే కొనుగోలు చేసేవారికి బ్యాంక్ క్రెడిట్ కార్డ్లను వినియోగించి అమెజాన్లో కొనుగోలు చేసేవారికి ఏకంగా రూ. 1,000 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో ఈ మొబైల్ కేవలం రూ.14,999కే పొందవచ్చు. అలాగే ఎక్చేంజ్ బోనస్ ఆఫర్ను వినియోగించి ఈ స్మార్ట్ఫోన్ కొనుగోలు చేసేవారికి ఏకంగా రూ.15,199 వరకు బోనస్ లభిస్తుంది. దీంతో ఇప్పుడే దీనిని రూ.800కే పొందవచ్చు.
Also Read: Redmi 14C 5G Offer: రెడ్మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్ఫోన్..అదిరిపోయే ఆఫర్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Lava Yuva Smart 3 64 Price: ప్రముఖ లావా స్మార్ట్ఫోన్ కంపెనీ మార్కెట్లోకి దిమ్మతిరిగే ఫీచర్స్తో కూడిన మంచి మొబైల్ను విడుదల చేయబోతోంది. దీనిని కంపెనీ బడ్జెట్ రేంజ్లో లాంచ్ చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఆకుట్టుకునే ఫీచర్స్తో పాటు ప్రీమియం లుక్తో విడుదల కాబోతోంది. దీనిని కంపెనీ లావా యువ స్టార్ 3 పేరుతో వినియోగదారులకు అందించబోతోంది. అయితే, ఈ స్మార్ట్ఫోన్కి సంబంధించిన ఫీచర్స్ వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
లావా యువ స్టార్ 3 స్మార్ట్ఫోన్ ప్రీమియం డిజైన్తో లాంచ్ కాబోతోంది. ముఖ్యంగా ఇది వెనక భాగంలో అద్భుతమైన కెమెరా సెటప్ను కూడా కలిగి ఉంటుంది. అంతేకాకుండా దీనిని కంపెనీ ప్రీమియం కెమెరా సెన్సార్స్తో అందుబాటులోకి తీసుకు రాబోతోంది. విడుదలకు ముందే ఈ స్మార్ట్ఫోన్కు సంబంధించిన ఫీచర్స్ లీక్ అయ్యాయి.
YTECHB నివేదిక ప్రకారం.. ఈ స్మార్ట్ఫోన్ మ్యాట్ బ్లాక్ ఫినిషింగ్తో పాటు బ్యాక్ సెటప్లో రెండు నిలువు కెమెరాలను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో LED ఫ్లాష్ సెటప్ కూడా అందుబాటులో ఉంది. అంతేకాకుండా ఇందులోనే అనేక రకాల ప్రీమియం ఫీచర్స్ లభిస్తున్నట్లు తెలుస్తోంది. లావా యువ స్టార్ 3 స్మార్ట్ఫోన్ బ్యాక్ సెటప్లో 13MP కెమెరాను కూడా కలిగి ఉంటుంది. అలాగే ఇందులో ప్రత్యేకమైన AI కెమెరా ఫీచర్లు కూడా లభిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్ఫోన్ నలుపుతో పాటు ఇతర రంగుల్లో కూడా విడుదల కాబోతున్నట్లు సమాచారం.. దీనిని కంపెనీ ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్పై రన్ చేయబోతోంది..
Also Read: Redmi 14C 5G Offer: రెడ్మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్ఫోన్..అదిరిపోయే ఆఫర్!
ఈ స్మార్ట్ఫోన్ ఎంతో శక్తివంతమైన 5000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఫ్రంట్ భాగంలో 5MP ఫ్రంట్ సెల్ఫీ కెమెరా కూడా లభిస్తోంది. దీంతో పాటు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా అందుబాటులో ఉంది. అలాగే 6.7-అంగుళాల FHD డిస్ప్లేను కలిగి ఉండడమే కాకుండా సైడ్-మౌంటెడ్ ఫింగర్ప్రింట్ స్కానర్ కూడా లభిస్తోంది. ఈ లావా యువ స్టార్ 3 స్మార్ట్ఫోన్కి సంబంధించిన ధర వివరాలు కూడా ఇటీవలే లీక్ అయ్యాయి. దీనిని బట్టి చూస్తే.. భారతదేశంలో ధర రూ.10,000 నుంచి ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా వేరియంట్ను బట్టి ధరలో కాస్త అటు ఇటు మార్పులు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి.
Also Read: Redmi 14C 5G Offer: రెడ్మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్ఫోన్..అదిరిపోయే ఆఫర్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook