మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో ప్రపంచ ప్రజల దినోత్సవ వేడుకలు
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో ప్రపంచ జానపద దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం ఆధ్వర్యంలో సింగరేణి కల్యాణ మండపంలో జానపద కళాకారులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. సంఘం రాష్ట్ర కార్యదర్శి మధుకర్ మాట్లాడుతూ కళాకారులు నిరంతరం అలనాటి కళలను పునరుజ్జీవింపజేస్తూ ప్రజల్లో చైతన్యం కల్పిస్తూ జానపద కళలను ఆదరించాలని కోరారు.
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
King Cobra Snake Meeting: తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు మున్సిపాలిటీ కౌన్సిల్ సమావేశంలో నాగుపాముతో ఒక సభ్యుడు నిరసన తెలపడం కలకలం రేపింది. నిడదవోలు పట్టణంలోని 20వ వార్డులో తరచుగా ఇళ్లలోకి, కాలనీల్లోకి పాములు ప్రవేశిస్తున్నాయి. దీంతో ప్రజలు ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. పాముల బెడదతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నా అధికారులు స్పందించరా? అంటూ నిలదీస్తూ అతడు మీటింగ్లోకి నాగుపామును తీసుకొచ్చాడు. ఈ సంఘటన వైరల్గా మారింది.
Also Read: KTR On Kavitha: లిక్కర్ స్కామ్లో చెల్లెమ్మ కవితకు న్యాయం జరిగింది.. కేటీఆర్ హర్షం
తమ వార్డులో పాములు సంచరిస్తుండడంతో.. ప్రజలు ప్రాణభయంతో ఉన్నారని.. సమస్యను ఆరు నెలలుగా చెబుతున్నా మున్సిపల్ సిబ్బంది పట్టించుకోకపోవడంతో వైఎస్సార్సీపీ కౌన్సిలర్ దాకే అనిల్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యం.. ప్రజల కష్టాలు వివరించేలా నాగుపామును డబ్బాలోకి తీసుకొచ్చారు. తాచు పాము ఉన్న డబ్బాను సమావేశానికి తీసుకొచ్చిన తన వార్డులోని కష్టాలను అనిల్ కుమార్ కళ్లకు కట్టేలా వివరించారు.
Also Read: YSRCP MLCs Dharna: ఏపీ శాసనమండలిలో రచ్చరచ్చ.. తిరుమల వివాదంపై వైఎస్సార్సీపీ ధర్నా
సమావేశంలో కూర్చున్న తన చైర్ పక్కనే నాగుపాము డబ్బాను ఉంచుకున్నారు. పాముని చూసిన ఇతర సభ్యులు, అధికారులు భయాందోళనకు గురయ్యారు. ఇలాంటి చర్యలు సరైనవి కాదని చైర్మన్ భూపతి ఆదినారాయణ చెప్పడంతో సిబ్బంది పామును బయటకు తరలించారు. తమ వార్డులో ఖాళీ స్థలాల్లో చెత్త పేరుకుపోయి పాముల బెదడ తీవ్రంగా ఉందని ఎన్నిసార్లు చెప్పినా శుభ్రం చేయించడం లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అనిల్ కుమార్ తెలిపారు. పాముల భయం ఎలా ఉంటుందో స్వయంగా చూపించడానికి తాను ఇలా పామును మీటింగ్కు తీసుకొచ్చినట్లు వెల్లడించారు. రెండు రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని అధికారుల హామీ ఇవ్వడంతో పాము రగడ సద్దుమణిగింది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుపొందిన మున్సిపాలిటీ మెజారిటీ సభ్యులు పార్టీ మారడంతో ప్రస్తుతం జనసేన ఖాతాలో నిడదవోలు మున్సిపాలిటీ ఉంది. ప్రస్తుతం మంత్రి కందుల దుర్గేష్ నిడదవోలు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరి మంత్రి సొంత నియోజకవర్గంలో ఇలా సమస్య ఉండడం తీవ్ర దుమారం రేపుతోంది. మంత్రిగా ఉన్నా కూడా నిడదవోలు అభివృద్ధి చెందడం లేదని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి సారించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Hair Whorl Significance: మన పెద్దలు తరచుగా "తల మీద రెండు సుడులు (గుండ్లు) ఉంటే రెండు పెళ్లిళ్లు అవుతాయి" అని సరదాగా లేదా భయపెడుతూ అనడం మనం వినే ఉంటాం. సాముద్రిక శాస్త్రం ప్రకారం తల మీద ఉండే ఈ సుడులు ఒక వ్యక్తి స్వభావం, భవిష్యత్తు గురించి ఏం చెబుతున్నాయో వివరంగా తెలుసుకుందాం.
సాముద్రిక శాస్త్రం ప్రకారం మనిషి శరీర నిర్మాణం, పుట్టుమచ్చలు, తల మీద ఉండే సుడుల ఆధారంగా వారి వ్యక్తిత్వాన్ని అంచనా వేయవచ్చు. తల మీద ఉండే ఈ వృత్తాకార సుడులు ఆ వ్యక్తి ప్రేమ జీవితం, కెరీర్, ఆరోగ్య స్థితిగతులను సూచిస్తాయి.
తల మధ్యలో ఒకే సుడి ఉంటే..
సాముద్రిక శాస్త్రం ప్రకారం.. తల మధ్యలో ఒకే సుడి ఉన్నవారు చాలా అదృష్టవంతులుగా పరిగణిస్తారు. వీరు చాలా దయగలవారు, ప్రశాంతంగా ఉంటారు. చిన్న చిన్న విషయాలకు కోపం తెచ్చుకోరు. ఏ నిర్ణయమైనా ఆచి తూచి తీసుకుంటారు, కాబట్టి వీరు తీసుకునే నిర్ణయాలు చాలా వరకు సఫలమవుతాయి.
తలపై ఒక వైపు సుడి ఉంటే
తల మీద ఒక పక్కగా సుడి ఉన్నవారు అత్యంత నమ్మకస్తులు. వీరికి ఏదైనా పని అప్పగిస్తే పూర్తి బాధ్యతతో పూర్తి చేస్తారు. స్నేహమైనా, ప్రేమయినా చాలా నిజాయితీగా ఉంటారు. అవతలి వారిని మోసం చేయాలనే ఆలోచన వీరికి ఉండదు.
రెండు సుడులు ఉంటే అశుభమా?
సాముద్రిక శాస్త్రం ప్రకారం తలపై రెండు సుడులు ఉండటం అంత శుభప్రదంగా పరిగణించరు. ఇలాంటి వారు కొంచెం మొండి స్వభావం కలిగి ఉంటారు. ప్రతి చిన్న విషయానికి కోపం తెచ్చుకుంటారు. వీరి మనసు ఒకచోట స్థిరంగా ఉండదు. దీనివల్ల వృత్తి జీవితంలో లేదా వ్యక్తిగత జీవితంలో స్థిరత్వం లోపించవచ్చు.
రెండు వివాహాలు జరుగుతాయనేది కేవలం ఒక నమ్మకం మాత్రమే అయినప్పటికీ, వీరి చంచల మనస్తత్వం వల్ల వైవాహిక జీవితంలో తరచుగా విభేదాలు లేదా సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని శాస్త్రం చెబుతోంది.
చిన్న చిన్న సుడులు లేదా మచ్చలు
తల మీద చాలా చిన్న మచ్చలు లేదా సుడులు ఉన్నవారు మానసికంగ చాలా చురుగ్గా ఉంటారు. వీరి మెదడు చాలా పదునైనది. కెరీర్లో త్వరగా విజయం సాధిస్తారు. వీరు మనసులో స్వచ్ఛంగా ఉన్నప్పటికీ, తరచుగా ఏదో ఒక ఆరోగ్య సమస్యతో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఆరోగ్యం పట్ల వీరు ఎప్పుడూ ఆందోళన చెందుతుంటారు.
(ముఖ్య గమనిక: పైన పేర్కొన్న విషయాలు సాముద్రిక శాస్త్రం, లోకంలో ఉన్న నమ్మకాలపై ఆధారపడి ఉన్నాయి. దీనికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఒక వ్యక్తి భవిష్యత్తు అనేది వారి ప్రవర్తన, కష్టపడే తత్వంపై ఆధారపడి ఉంటుంది. దీన్ని జీ తెలుగు న్యూస్ ధ్రువీకరించడం లేదు.)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Telangana Bhavan: 'ప్రజల విశ్వాసం గులాబీ జెండాపైనే.. నడిగడ్డ స్ఫూర్తి రాష్ట్రానికి కావాలి. మళ్లీ కేసీఆర్ నాయకత్వంలో గులాబీ జెండా ఎగురుతుంది' అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. అవినీతి అరాచకమే జోడెడ్లుగా రేవంత్ రెడ్డి పరిపాలన చేస్తున్నారని.. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం అభివృద్ధి, సంక్షేమం జోడెడ్లుగా చేశారని గుర్తుచేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం అరాచక పాలన నడుస్తోందని విమర్శించారు.
Also Read: KTR On Kavitha: లిక్కర్ స్కామ్లో చెల్లెమ్మ కవితకు న్యాయం జరిగింది.. కేటీఆర్ హర్షం
అలంపూర్ నియోజకవర్గ నూతన బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ కౌన్సిలర్లను పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్లో శుక్రవారం సన్మానించారు. ఎమ్మెల్సీ చల్ల వెంకట్రామి రెడ్డి, ఆలంపూర్ ఎమ్మెల్యే విజేయుడుతో కలిసి సన్మానించిన అనంతరం మాజీ మంత్రి కేటీఆర్ కీలక ప్రసంగం చేశారు. ఆలంపూర్, అయిజ, గద్వాల, వడ్డేపల్లి ప్రాంతాల్లో బీఆర్ఎస్ పార్టీ ప్రజలు అందించిన మద్దతు విశేషమని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ నడిగడ్డలో మాత్రం ప్రజల విశ్వాసం ఇప్పటికీ బీఆర్ఎస్పైనే ఉందని మాజీ మంత్రి కేటీఆర్ చెప్పారు. సర్పంచ్ ఎన్నికల నుంచి మున్సిపల్ ఎన్నికల వరకు మెజారిటీ స్థానాలు గెలుచుకోవడం పార్టీ బలాన్ని నిరూపిస్తోందని వెల్లడించారు.
Also Read: Pension Hike: ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం మరో వరం.. త్వరలో పింఛన్ల పెంపు?
తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం అరాచక పాలన నడుస్తోందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. 'నాగర్కర్నూల్లో రెండు నెలల పాప మరణ ఘటన, కోదాడలో దళిత యువకుడు కర్ల రాజేష్ లాకప్ డెత్ వంటి ఘటనలు ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం. ఖమ్మం వెలుగుమట్లలో ఇళ్ల కూల్చివేతలు ప్రజలను రోడ్డున పడేసిన దారుణ చర్యలు' అని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ నాయకత్వంలో అభివృద్ధి, సంక్షేమం రెండు జోడెడ్లలా ముందుకు సాగాయని తెలిపారు. కానీ ప్రస్తుతం రేవంత్ రెడ్డి పాలనలో అవినీతి, అరాచకం జోడెడ్లుగా మారాయని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు.
Also Read: Salary Cut: ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ సీఎం హెచ్చరిక.. జీతంలో 10- 15 శాతం కట్
'చెక్ డ్యామ్లు పేల్చడం, పల్లె ప్రకృతి వనాల్లో చెట్ల నరుకులు వంటి చర్యలు రాష్ట్రాన్ని వెనక్కి నెడుతున్నాయి. ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేదు. రైతు బంధు, ఎరువుల సరఫరా వంటి అంశాల్లో రైతులను తీవ్రంగా నిరాశపరిచింది' అని రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. 'ప్రజలకు ఇప్పుడు కాంగ్రెస్ నిజ స్వరూపం అర్థమైంది. నడిగడ్డ స్ఫూర్తి రాష్ట్రం మొత్తం వ్యాపించాలి' అని కేటీఆర్ పిలుపునిచ్చారు.
ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామి రెడ్డి ప్రజల సమస్యలపై అంకితభావంతో పనిచేసే నాయకుడని, ఎమ్మెల్యే విజయుడు కూడా అదే తత్వాన్ని కొనసాగిస్తున్నారని మాజీ మంత్రి కేటీఆర్ ప్రశంసించారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లను ప్రలోభాలకు గురిచేసే ప్రయత్నాలు చేస్తుందని ముందుగానే హెచ్చరించిన కేటీఆర్, పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మరోసారి కేసీఆర్ నాయకత్వంలో గులాబీ జెండా ఎగరడం ఖాయమని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Miracle Babies: 6 కోట్లలో ఒకరికి జరిగే అద్భుతం.. ఒకేసారి ఐదుగురు బిడ్డలకు జన్మనిచ్చిన 24 ఏళ్ల మహిళ..
Miracle Babies Latest Telugu News: చైనాలో వైద్యరంగంలోని అరుదైన ఘటన చోటుచేసుకుంది.. ఓ యూనివర్సిటీ హాస్పిటల్లో షిన్జియాంగ్ ప్రాంతానికి చెందిన 24 ఏళ్ల దిలి (Dilie) అనే మహిళ ఒకేసారి ఐదుగురు పండంటి బిడ్డలకు జన్మనిచ్చి రికార్డు సృష్టించింది. ఈ ప్రసవానికి చైనాలోని ప్రముఖ వుహాన్ యూనివర్సిటీ ఆసుపత్రి వేదిక ఆపడం విశేషం.. అయితే, ఇలాంటి ఘటనలు చాలా అరుదుగా మాత్రమే జరుగుతాయని అక్కడి వైద్య నిపుణులు చెబుతున్నారు. కేవలం కొంతమందిలో మాత్రమే ఇలా అయిదుగురు బిడ్డలకు జన్మనిచ్చే సామర్థ్యం కలిగి ఉంటారని వారు అంటున్నారు. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
సాధారణంగా కవలలు లేదా ముగ్గురు పిల్లలు పుట్టడం మనం తరచుగా చూస్తూ ఉంటాం.. కానీ సహజ సిద్ధంగా ఐదుగురు బిడ్డలు జన్మించడం అనేది అత్యంత అరుదని వైద్యులు చెబుతున్నారు. వైద్య శాస్త్రాన్ని పునులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎటువంటి కృత్రిమ పద్ధతులు లేకుండా ఇలా ఐదుగురు పిల్లలు పుట్టే అవకాశం ఆరుకోట్ల ప్రసవాల్లో కేవలం ఒక్కరికి మాత్రమే ఉంటుందని తెలిపారు. తమ నలభై ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో ఇటువంటి అరుదైన ప్రసవం చేయడం ఇదే తొలిసారి అని.. కొంతమంది వైద్య నిపుణులు సంతోషం వ్యక్తం చేశారు..
ఈ క్లిష్టమైన ప్రసవాన్ని విజయవంతం చేసేందుకు సుమారు 20 మందికి పైగా వైద్య నిపుణులతో పాటు నర్సులు శ్రమించాల్సి వచ్చిందని ఆసుపత్రి సిబ్బంది తెలిపారు. దిలీకి పుట్టిన ఐదుగురు బిడ్డలు నలుగురు అమ్మాయిలతో పాటు ఒక అబ్బాయి ఉన్నట్లు వారు వెల్లడించారు. పుట్టిన ఈ బిడ్డలందరూ క్షేమంగా ఉన్నారని. ప్రస్తుతం వారి అనారోగ్యాన్ని నిరంతరం పర్యావేక్షిస్తున్నారని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.
Also Read: YS Jagan: పూజారి ఇచ్చిన తీర్థం పడేసిన వైఎస్ జగన్.. టీడీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
సాధారణంగా ముగ్గురు నుంచి అంతకంటే ఎక్కువ మంది పిల్లలు కడుపులో ఉండడంవల్ల గర్భిణీ కొన్ని రకాల అనారోగ్య సమస్యలకు గురవాల్సి వస్తుంది. ముఖ్యంగా వీరిలో రక్తపోటుతో పాటు శ్వాస సంబంధిత ఇబ్బందులు తలెత్తుతూ ఉంటాయి.. ముందస్తు ప్రణాళికలతో వైద్య బృందం ఈ ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేసింది. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ వస్తోంది. చాలామంది సోషల్ మీడియా వినియోగదారులు ఆ ఐదుగురు చిన్నారులకు మిరాకిల్ బేబీస్ అని పేర్లు కూడా పెడుతున్నారు..
Also Read: YS Jagan: పూజారి ఇచ్చిన తీర్థం పడేసిన వైఎస్ జగన్.. టీడీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..
Realme Narzo Power 5G Launches India March 5: ప్రముఖ స్మార్ట్ఫోన్ కంపెనీ రియల్ మీ వచ్చే నెలలో భారత్ మార్కెట్లోకి మరో అద్భుతమైన మొబైల్ను విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.. ఇది ఎంతో శక్తివంతమైన జంబో బ్యాటరీతో విడుదల కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిని కంపెనీ 10,001 mAh బ్యాటరీతో మార్కెట్లోకి విడుదల చేయబోతోంది. ఈ స్మార్ట్ఫోన్ రియల్మే P4 పవర్ 5G పేరుతో విడుదల కాబోతోంది. ఇది అద్భుతమైన ప్రాసెసర్తో పాటు ఎంతో శక్తివంతమైన కెమెరా సెటప్ని కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఎన్నో రకాల అద్భుతమైన ఫీచర్స్ను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ స్మార్ట్ఫోన్కు సంబంధించిన అన్ని రకాల వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రముఖ చైనీస్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్ మీ తమ Realme Narzo Power 5G మొబైల్ను మార్చి 5వ తేదీన భారతదేశంలో విడుదల చేయబోతున్నట్లు తమ అధికారిక వెబ్సైట్లో పేర్కొన్నారు. అంతేకాకుండా ఇప్పటికే ఈ స్మార్ట్ఫోన్కు సంబంధించిన ముఖ్యమైన ఫీచర్స్ను కూడా షేర్ చేశారు. దీన్ని బట్టి చూస్తే.. ఇది ఎంతో శక్తివంతమైన 10,001 mAh బ్యాటరీ కలిగి ఉండబోతుంది. అంతేకాకుండా ఈ మొబైల్ 38 గంటల పాటు స్టాండ్ బైతో పాటు 185 గంటలకు పైగా మ్యూజిక్ ప్లే బ్యాక్ను అందిస్తుంది. యూట్యూబ్ వీడియోలు చూస్తే.. దాదాపు 32 గంటల పాటు ప్లే బ్యాక్ అందిస్తున్నట్లు కంపెనీ క్లైమ్ చేస్తోంది. అలాగే 72 గంటలకు పైగా కాలింగ్ సపోర్ట్ ను కూడా అందిస్తున్నట్లు తెలిపింది.
ఇక ఈ Realme Narzo Power 5G స్మార్ట్ఫోన్ బ్యాటరీ చార్జింగ్ కోసం ఇందులో కంపెనీ 27 W వైర్డ్ ఛార్జింగ్, 27 W రివర్స్ ఛార్జింగ్కు సపోర్టును అందిస్తుంది. అంతేకాకుండా కేవలం 36 నిమిషాల్లో మాత్రమే 50 శాతం వరకు చార్జ్ చేస్తుంది. అలాగే ఇది వివిధ రంగుల్లో మార్కెట్లోకి విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7400 అల్ట్రా ప్రాసెసర్తో పాటు హైపర్విజన్ ప్లస్ AI చిప్పై రన్ కాబోతున్నట్లు సమాచారం. అంతేకాకుండా ఇది 6.78-అంగుళాల హైపర్గ్లో 4D కర్వ్ ప్లస్ డిస్ప్లేతో విడుదల కాబోతోంది. ఈ మొబైల్ అద్భుతమైన ఆండ్రాయిడ్ 16 ఆధారంగా రియల్మే UI 7.0 ఆపరేటింగ్ సిస్టంపై రన్ అవుతుంది.
Also Read: Redmi 14C 5G Offer: రెడ్మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్ఫోన్..అదిరిపోయే ఆఫర్!
రియల్మీ నార్జో పవర్ 5G (Realme Narzo Power 5G) స్మార్ట్ఫోన్కు సంబంధించిన వెనక భాగం వివరాల్లోకి వెళితే.. ఇది చాలా ప్రత్యేకమైన కెమెరా మాడ్యూల్ని కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా వెనక భాగంలో 50-మెగాపిక్సెల్ సోనీ IMX882 ప్రైమరీ కెమెరాను కలిగి ఉంటుంది. అలాగే ఇది ప్రత్యేకమైన ఫోర్ కే రికార్డుకు సపోర్ట్ అందిస్తుంది. దీంతో పాటు AI హైపర్ క్లారిటీ, AI హైపర్ మోషన్, AI ఆల్వేస్-ఆన్ HDR, AI స్మార్ట్ రిప్లై, AI స్టైల్మీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఫీచర్స్ కూడా అందుబాటులో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇక మూడు సంవత్సరాల వరకు కంపెనీ ప్రత్యేకమైన ఆండ్రాయిడ్ అప్గ్రేడ్లు కూడా అందిస్తోంది. అంతేకాకుండా ఎన్నో రకాల ప్రత్యేకమైన కొత్త ఫీచర్లు ఇందులో అందుబాటులో ఉన్నట్టు తెలుస్తోంది.
Also Read: Redmi 14C 5G Offer: రెడ్మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్ఫోన్..అదిరిపోయే ఆఫర్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Delhi Liquor Scam: మద్యం కుంభకోణం సాకుతో దేశంలో ప్రధానంగా కొట్లాడుతున్న రాజకీయ పార్టీలు, నాయకులను దెబ్బతీసేందుకు ప్రయత్నించారని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ఆ ప్రయత్నాలతో బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో తీవ్రంగా నష్టపోయిందని గుర్తుచేశారు. ఇదే విధంగా తమ నాయకులపై నమోదైన ప్రతి కేసు కూడా ఒక అబద్ధమని ప్రకటించారు. చివరికి సత్యమే గెలుస్తుందని తెలిపారు. కానీ ఆరోపణలకు ప్రాధాన్యమిస్తూ.. న్యాయ ప్రక్రియ కంటే మీడియా ధోరణితో తీవ్రంగా నష్టం వాటిల్లుతోందని తెలిపారు.
Also Read: Pension Hike: ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం మరో వరం.. త్వరలో పింఛన్ల పెంపు?
మద్యం కుంభకోణంలో కోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో భారత రాష్ట్ర సమితి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. 'మద్యం కుంభకోణం అనే సాకుతో కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ (AAP) ప్రభుత్వాన్ని కూల్చారు. ఆ కేసుతో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో రాజకీయంగా నష్టపోయింది మాత్రం భారత రాష్ట్ర సమితి పార్టీ. కవితకి ఈరోజు కోర్టులో న్యాయం జరిగింది' అని కేటీఆర్ ప్రకటించారు. 'ఇదే విధంగా మా నాయకులపై నమోదైన ప్రతి కేసు కూడా అబద్ధమని, రాజకీయ ప్రేరేపితమని, కల్పితమని త్వరలోనే తేలిపోతుంది' అని ధీమా వ్యక్తం చేశారు.
Also Read: Salary Cut: ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ సీఎం హెచ్చరిక.. జీతంలో 10- 15 శాతం కట్
'సత్యం గెలిచే వరకు, కాంగ్రెస్, బీజేపీలు చేసే బాధ్యతారహితమైన ఆరోపణలను మనం చూశాం. అసత్యపూరిత.. కుట్రపూరిత కేసులను ఆరోపణలను మీడియా ట్రయల్స్ ద్వారా మరింత పెద్దవి చేసి, ప్రజలను తప్పుదోవ పట్టించడానికి, మా ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తున్నారు' అని బీజేపీ, కాంగ్రెస్పై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 'దురదృష్టవశాత్తూ సాక్ష్యాల కంటే ఆరోపణలకే ప్రాధాన్యమిస్తూ.. న్యాయ ప్రక్రియ కంటే మీడియా కథనాలే మిన్న అనే ధోరణి ఈ నవ భారతంలో అలవాటుగా మారిపోయింది' అని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. కానీ చివరికి, న్యాయమే గెలుస్తుంది అని ప్రకటించారు.
మద్యం కుంభకోణంలో జైలులో గడిపిన చెల్లెమ్మ కవిత కూడా బయటపడడంతో కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. కవితకు న్యాయం జరిగిందని ప్రత్యేకంగా గుర్తుచేశారు. కవిత కేసు నుంచి బయటపడడంతో కేసీఆర్ కుటుంబం పూర్తి సంతోషంలో ఉంది. రాజకీయంగా వేధించడంలో భాగంగా కవితను ఇరికించారని మొదటి నుంచి కేసీఆర్తోపాటు కేటీఆర్, హరీశ్ రావు, బీఆర్ఎస్ పార్టీ చెబుతోంది. చెబుతున్నట్టుగానే కవిత కడిగిన ముత్యంలా బయటకు వచ్చారు. మరి తండ్రిపై తీవ్ర విమర్శలు చేసిన కవిత ఇప్పుడు కేసు నుంచి బయటపడడంతో రాజకీయంగా పునరాలోచన చేస్తారా? లేదా? అనేది ఉత్కంఠ నెలకొంది. ఈ కేసుపైనే తండ్రి, బీఆర్ఎస్ పార్టీతో కవిత విభేదించి బయటకు వచ్చిన విషయం తెలిసిందే.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Planetary Parade 2026 Telugu News: రేపు సాయంత్రం ఆకాశంలో మహా అద్భుతం జరగబోతోంది. ఎన్నో గ్రహాల అరుదైన కదలికల దృశ్యం ఆవిష్కృతం కాబోతోంది. విశ్వంలో జరిగే అరుదైన ఖగోళ సంఘటనల్లో ఒకటైన ప్లానెటరీ పరేడ్ ఫిబ్రవరి 28వ తేదీన సంభవించబోతోంది. ఈ అద్భుతమైన ఘట్టంలో సౌర కుటుంబంలోని ప్రత్యేకమైన ఆరు గ్రహాలు ఒకే వరుసలో కొలువుదీరబోతున్నాయి. ఈ వరుసలో భాగంగా బృహస్పతితో పాటు శుక్రుడు, బుధుడు, శని, యురేనస్, నెప్ట్యూన్ వంటి ప్రధాన గ్రహాలు ఒకే వరసలో ఉండడం విశేషం.. అయితే, ఇది భారతదేశంలో కనిపిస్తుందా? వీటిని ఎలా చూడొచ్చు? వీటివల్ల మనుషులపై ప్రభావం ఏదైనా ఉంటుందా? అనే వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం..
శాస్త్రవేత్తలు సమాచారం ప్రకారం.. సూర్యాస్తమయం అయిన 30 నుంచి 60 నిమిషాల తర్వాత ఈ అద్భుతం స్పష్టంగా ఆకాశంలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఆకాశం నిర్మలంగా ఉంటే.. ఎటువంటి పరికరాల సహాయం లేకుండానే పశ్చిమ దిశలో కొన్ని గ్రహాలను మనం నేరుగా సులభంగా వీక్షించవచ్చు. అయితే, ఆకాశంలో వచ్చే మేఘాల కారణంగా ఈ అద్భుతమైన దృశ్యం కనిపించకపోవచ్చు అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రేపు వాతావరణం బట్టి ఈ దృశ్యాలు కనిపిస్తాయా లేదా అనేది చూడాల్సి ఉంటుంది..
రేపు కొన్ని ప్రధాన గ్రహాలను నేరుగా చూడొచ్చని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఆకాశం ఎత్తులో ప్రకాశవంతంగా బృహస్పతి గ్రహం ఉంటుంది.. కాబట్టి దీనిని సులభంగా వీక్షించవచ్చని వారు అంటున్నారు. అంతేకాకుండా బుధుడితో పాటు శుక్రుడు, శని గ్రహాలు కూడా భూమికి చాలా దగ్గరగా కనిపిస్తాయని వారు చెబుతున్నారు. టెలిస్కోప్తో ఎవరైనాతో పాటు నెఫ్యూన్ వంటి భూమికి చాలా దూరంలో ఉన్న గ్రహాలను చూడొచ్చు. అంతేకాకుండా వీటిని చూడడానికి బైనాక్యులర్ల సహాయం కూడా అవసరమవుతుందని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు..
Also Read: YS Jagan: పూజారి ఇచ్చిన తీర్థం పడేసిన వైఎస్ జగన్.. టీడీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
ఇవి భారత్ లో కనిపిస్తాయా?
ఈ అద్భుతమైన దృశ్యాలు భారత్లో కూడా కనిపిస్తాయని కొంతమంది ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఖగోళ ప్రేమికులైతే సాయంత్రం ఆరు గంటల నుంచి 8 గంటల మధ్య ఈ గ్రహాల అమరికను చూడవచ్చని వారు తెలుపుతున్నారు. పట్టణాల్లో కాంతి, కాలుష్యం తక్కువ ఉన్న ప్రదేశాల నుంచి లేదా భవనాల పైకప్పుల నుంచి పశ్చిమ దిశగా చూస్తే ఈ గ్రహాలు వరుసగా కనిపిస్తాయని వారు అంటున్నారు.. ముఖ్యంగా రేపు శుక్రుడు అత్యంత ప్రకాశవంతంగా కనిపించబోతున్నాడు.. పక్కనే ఉన్న బుధ గ్రహాన్ని గుర్తించడం కూడా ఎంతో సులభం అవుతుంది.. మార్చి మూడవ తేదీన జరగబోయే సంపూర్ణ చంద్ర గ్రహణానికి ముందు ఈ గ్రహాల పెరేడ్ జరగడం విశేషమని కొంతమంది ఖగోళ శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి అరుదైన ఘటన మళ్లీ చూడడానికి ఏళ్ల తరబడి వేచి చూడాల్సి ఉంటుందని వారు అంటున్నారు. అయితే, వీటి ప్రభావం జ్యోతిష్య శాస్త్రం పరంగా చూస్తే.. కొన్ని రాశుల వారిపై పడే అవకాశం ఉందని నిపుణులు తెలుపుతున్నారు.
Also Read: YS Jagan: పూజారి ఇచ్చిన తీర్థం పడేసిన వైఎస్ జగన్.. టీడీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Tomorrow School Holiday: తమిళనాడులోని తంజావూరు జిల్లా విద్యార్థులకు, ప్రభుత్వ ఉద్యోగులకు జిల్లా యంత్రాంగం తీపి కబురు అందించింది. తంజావూరు జిల్లాలో మాసిమాగం పండుగను పురస్కరించుకుని, జిల్లా కలెక్టర్ ప్రియాంక పంకజం మార్చి 2 (సోమవారం) నాడు స్థానిక సెలవు (లోకల్ హాలీడే) ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీనివల్ల జిల్లాలోని పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలకు వరుసగా మూడు రోజులు సెలవులు లభించనున్నాయి.
సెలవుల వివరాలు ఇవే..
ఫిబ్రవరి 28 నాడు శనివారం వారాంతపు సెలవు కావడం ఆ తర్వాత మార్చి 1న ఆదివారం వరుస సెలవులు రానున్నాయి. ఈ క్రమంలో మార్చి 2న స్థానిక జిల్లా యంత్రాంగం మాసిమాగం సందర్భంగా స్థానిక సెలవు ప్రకటించారు.
అయితే ప్రస్తుతం పబ్లిక్ పరీక్షల సీజన్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో 12వ తరగతి (ఇంటర్మీడియట్) విద్యార్థులకు మాత్రం ఎలాంటి మార్పు లేకుండా ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం పరీక్షలు జరుగుతాయని కలెక్టర్ స్పష్టం చేశారు. మార్చి 2న ప్రకటించిన ఈ సెలవును భర్తీ చేసేందుకు, మార్చి 14 (శనివారం) నాడు జిల్లావ్యాప్తంగా పనిదినంగా (వర్కింగ్ డే) ప్రకటించారు.
మార్చి నెలలో ఇతర ప్రభుత్వ సెలవులు..
తంజావూరు జిల్లాలోనే కాకుండా, సాధారణంగా మార్చి నెలలో మరికొన్ని ప్రభుత్వ సెలవులు కూడా ఉన్నాయి. మార్చి 3న మంగళవారం నాడు ఉగాది (తెలుగు నూతన సంవత్సరం), మార్చి 21 శనివారం రంజాన్.. మార్చి 31న మహావీర్ జయంతి సందర్భంగా సెలవులు రానున్నాయి.
పరీక్షల సన్నద్ధత..
వరుస సెలవులు దొరకడంతో పబ్లిక్ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఇది మంచి అవకాశమని చెప్పవచ్చు. ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా చదువుకోవడానికి ఈ మూడు రోజుల విరామం ఎంతగానో ఉపయోగపడుతుందని విద్యా నిపుణులు భావిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
India Vs West Indies Super 8 Scenarios: టీ20 వరల్డ్ కప్ 2026లో అత్యంత ఉత్కంఠభరితమైన ఘట్టం ఆసన్నమైంది. పదేళ్ల విరామం తర్వాత ప్రపంచకప్ వేదికగా భారత్-వెస్టిండీస్ జట్లు తలపడబోతున్నాయి. ఈడెన్ గార్డెన్స్లో జరగనున్న ఈ మ్యాచ్ను కేవలం ఒక పోరుగా కాకుండా, 'వర్చువల్ క్వార్టర్ ఫైనల్'గా పరిగణిస్తున్నారు. అయితే, ఒకవేళ వర్షం పడి మ్యాచ్ రద్దయితే పరిస్థితి ఏమిటన్నది ఇప్పుడు అభిమానుల్లో ఆందోళన కలిగిస్తోంది.
ప్రస్తుతం గ్రూప్-1లో సెమీఫైనల్ బెర్త్ కోసం తీవ్ర పోటీ నెలకొంది.
వెస్టిండీస్: 2 మ్యాచ్లు - 2 పాయింట్లు (NRR: +1.791)
భారత్: 2 మ్యాచ్లు - 2 పాయింట్లు (NRR: -0.100)
గెలిచిన జట్టు 4 పాయింట్లతో నేరుగా సెమీఫైనల్కు చేరుకుంటుంది. కానీ మ్యాచ్ జరగకుండా నిలిచిపోతేనే అసలు సమస్య మొదలవుతుంది.
ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయి?
ఐసీసీ నిబంధనల ప్రకారం.. సూపర్-8 దశలో ఏదైనా మ్యాచ్ ఫలితం తేలకుండా రద్దయితే, రెండు జట్లకూ చెరో 1 పాయింట్ కేటాయిస్తారు. అప్పుడు భారత్, వెస్టిండీస్ రెండూ తలా 3 పాయింట్లతో సమానంగా నిలుస్తాయి. ఈ స్థితిలో సెమీఫైనల్ విజేతను నెట్ రన్ రేట్ (NRR) ఆధారంగా నిర్ణయిస్తారు.
ప్రస్తుత గణాంకాల ప్రకారం వెస్టిండీస్ (+1.791) భారత్ (-0.100) కంటే చాలా మెరుగైన స్థానంలో ఉంది. ఒకవేళ మ్యాచ్ రద్దయితే, నెట్ రన్ రేట్ వెస్టిండీస్కు అనుకూలంగా ఉండటంతో వారు సెమీస్కు చేరుకుంటారు. భారత్ టోర్నీ నుండి నిష్క్రమించాల్సి వస్తుంది.
వాతావరణం ఎలా ఉండబోతోంది?
భారత అభిమానులకు ఊరటనిచ్చే విషయం ఏమిటంటే.. వాతావరణ శాఖ నివేదికల ప్రకారం మార్చి 1న కోల్కతాలో వర్షం కురిసే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఆకాశం నిర్మలంగా ఉండి, మ్యాచ్ పూర్తిస్థాయిలో (20 ఓవర్లు) జరిగే అవకాశం మెండుగా కనిపిస్తోంది.
భారత్ ముందున్న సవాల్..
భారత్ ఈ మ్యాచ్లో కేవలం గెలవడమే కాదు, వెస్టిండీస్పై పైచేయి సాధించి గతంలో ఎదురైన పరాజయాలకు ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది. స్పిన్నర్లకు అనుకూలించే ఈడెన్ గార్డెన్స్ పిచ్పై భారత్ తన స్పిన్ మ్యాజిక్తో వెస్టిండీస్ను కట్టడి చేయగలదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
Also Read: TTD Online Frauds: శ్రీవారి భక్తులకు టీటీడీ కీలక హెచ్చరిక..వెలుగులోకి వచ్చిన భారీ మోసం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Motorola Edge 60 Stylus Price Cut: అత్యంత తక్కువ ధరలోనే మంచి మొబైల్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఫ్లిప్కార్ట్ హోలీ సందర్భంగా మీకోసం కొన్ని అద్భుతమైన ఆఫర్స్తో స్మార్ట్ఫోన్స్ను విక్రయిస్తోంది. ముఖ్యంగా గత ఏడాది ఏప్రిల్లో మార్కెట్లోకి విడుదలైన మోటరోలా ఎడ్జ్ 60 స్టైలస్ (Motorola Edge 60 Stylus) స్మార్ట్ఫోన్ అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్స్తో లభిస్తోంది. ఇది ప్రీమియం ఫీచర్స్తో అందుబాటులోకి వచ్చింది. అయితే, ఈ స్మార్ట్ఫోన్కి సంబంధించిన ఫీచర్స్, డిస్కౌంట్ ఆఫర్స్ వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..
మోటరోలా ఎడ్జ్ 60 స్టైలస్ (Motorola Edge 60 Stylus) స్మార్ట్ఫోన్ సంబంధించిన ఫీచర్స్ వివరాల్లోకి వెళ్తే.. దీనిని కంపెనీ ఎంతో ప్రత్యేకమైన 6.67-అంగుళాల 1.5K pOLED డిస్ప్లే తో విడుదల చేసింది. దీంతోపాటు ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 3000 nits పీక్ బ్రైట్నెస్, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ సపోర్టుతో అందుబాటులో ఉంది. అలాగే ఈ మొబైల్ వెనక భాగంలో అద్భుతమైన కెమెరా సెటప్ను కలిగి ఉంటుంది. ముఖ్యంగా ఇది Sony LYT-700C సెన్సార్, OIS సపోర్ట్ తో కూడిన 50MP మెయిన్ కెమెరాను కలిగి ఉంటుంది. దీంతోపాటు అదనంగా 13MP అల్ట్రావైడ్, మాక్రో లెన్స్ కెమెరా కూడా లభిస్తోంది. ఇక ఫ్రంట్ భాగంలో 32MP సెల్ఫీ కెమెరా అందుబాటులో ఉంది. వీడియో కాలింగ్ కోసం ఈ కెమెరా ఎంతగానో సహాయపడుతుంది.
అలాగే ఈ Motorola Edge 60 Stylus మొబైల్కు సంబంధించిన బ్యాటరీ వివరాల్లోకి వెళ్తే.. 5000 mAh బ్యాటరీ, 68W టర్బో పవర్ ఫాస్ట్ ఛార్జింగ్, 15W వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్తో అందుబాటులో ఉంది. అంతేకాకుండా ఇది ఆండ్రాయిడ్ 15 (Android 15) ఆధారిత Hello UI ఆపరేటింగ్ సిస్టంపై రన్ అవుతుంది. అలాగే ప్రత్యేకమైన NFC, బ్లూటూత్ 5.4, Wi-Fi 6E కనెక్టివిటీ ఫీచర్లను కూడా కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ స్మార్ట్ఫోన్కు సంబంధించిన ప్రత్యేకత ఏంటంటే.. దీనిలో ఇన్-బిల్ట్ స్టైలస్ పెన్. దీనితో మీరు స్క్రీన్పై నోట్స్ రాసుకోవచ్చు, బొమ్మలు గీయవచ్చు లేదా ఫొటోలను ఎడిట్ ఎంతో సులభంగా చేసుకోవచ్చు. అలాగే ఇది IP68 రేటింగ్తో వచ్చింది.. నీటిలో పడినప్పటికీ ఏమాత్రం పాడవకుండా ఉంటుంది. ఇవే కాకుండా ఎన్నో రకాల అద్భుతమైన ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి.
భారతదేశంలో దీనిని కంపెనీ MRP రూ.28,999 ధరతో అందుబాటులో ఉంది. అయితే ఇప్పుడే దీనిని ఫ్లిప్కార్ట్లో కొనుగోలు చేసే వారికి 28 శాతం ప్రత్యేకమైన ఫ్లాట్ తగ్గింపుతో కేవలం రూ.20,899 లోపే పొందవచ్చు. అంతేకాకుండా దీనిపై ప్రత్యేకమైన బ్యాంక్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. ఈ ఆఫర్స్లో భాగంగా.. ఫ్లిప్కార్ట్ అనుసంధాన ఆక్సిస్ బ్యాంకు క్రెడిట్ కార్డును వినియోగించి పేమెంట్ చేసే వారికి రూ.1000 వరకు తగ్గింపు లభిస్తుంది..
Also Read: Redmi 14C 5G Offer: రెడ్మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్ఫోన్..అదిరిపోయే ఆఫర్!
అంతేకాకుండా ఈ Motorola Edge 60 Stylus మొబైల్పై ఎక్స్చేంజ్ బోనస్ కూడా అందుబాటులో ఉంది. దీనిని కొనుగోలు చేసే క్రమంలో ఏదైనా మీ దగ్గర ఉన్న పాత స్మార్ట్ఫోన్ను ఎక్స్చేంజ్ చేస్తే ఏకంగా రూ.20 వేల వరకు బోనస్ లభిస్తుంది. ఈ ఎక్స్చేంజ్ బోనస్ను మొబైల్ ధర నుంచి మైనస్ చేస్తే.. కేవలం ఈ కొత్త స్మార్ట్ఫోన్ రూ.899లోపే పొందవచ్చు. అలాగే మరింత తగ్గింపు ధరకు పొందడానికి ఇతర ఆఫర్స్ కూడా వినియోగించవచ్చు.
Also Read: Redmi 14C 5G Offer: రెడ్మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్ఫోన్..అదిరిపోయే ఆఫర్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Srikakulam Diarrhea Cases: 'డయేరియాతో శ్రీకాకుళంలో చనిపోయింది ఒక్కరే.- బయటకు మాత్రం ముగ్గురు చనిపోయారు అని ప్రచారం చేస్తున్నారు' అని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ ప్రకటించారు. డయేరియా వస్తే పదులు సంఖ్యలో చనిపోతారని.. కానీ శ్రీకాకుళంలో మాత్రం అలా జరగలేదని స్పష్టం చేశారు. మున్సిపల్ కమిషనర్ వచ్చి కేవలం 10 రోజులే అయ్యింది. మున్సిపల్ కమిషనర్ ఉదయం 6 గంటల నుండి పని ప్రారంభిస్తారు. ఈ వ్యవహారంలో మున్సిపల్ కమిషనర్ తప్పులేదు' అని ఎమ్మెల్యే తెలిపారు. మున్సిపల్ కమిషనర్ సస్పెన్షన్ రద్దు చేయాలని ప్రభుత్వాన్ని కోరినట్లు వెల్లడించారు.
Also Read: YSRCP MLCs Dharna: ఏపీ శాసనమండలిలో రచ్చరచ్చ.. తిరుమల వివాదంపై వైఎస్సార్సీపీ ధర్నా
ఏపీ అసెంబ్లీలో శ్రీకాకుళం డయేరియా వ్యాప్తిపై శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ మీడియాతో చిట్చాట్ చేశారు. 'సచివాలయ వ్యవస్థ చాలా గొప్పది. అయితే గత ప్రభుత్వం సచివాలయ వ్యవస్థని సక్రమంగా ఉపయోగించలేదు. ఉన్నత చదువులు చదివిన వారి నెత్తిన వాలంటీర్లు తీసుకొచ్చి పెట్టారు. సచివాలయ సిబ్బంది మొత్తాన్ని ఆఫీసులోనే కూర్చోబెట్టారు.సచివాలయ సిబ్బందికి మొత్తం గ్రామాల్లో ఉన్న సమస్యల మీద కనీస అవగాహన లేదు. వాళ్లు ఏం చేయాలో వాళ్లకే తెలియదు' అని ఎమ్మెల్యే శంకర్ పేర్కొన్నారు.
Also Read: Pension Hike: ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం మరో వరం.. త్వరలో పింఛన్ల పెంపు?
'శ్రీకాకుళం నియోజకవర్గంలోని అన్ని సచివాలయాల సిబ్బందితో రివ్యూ మీటింగ్ పెట్టా. నేనడిగే ప్రశ్నలకు వాళ్లు నోరేళ్లపెట్టారు. ధర్మాన ప్రసాదరావు రోడ్లు ఇన్నేళ్లు రాజకీయం చేసి కనీసం రోడ్లు డ్రైనేజీలు కూడా చేపించలేకపోయాడు' అని విమర్శించారు. పనులు చేయకుండానే కొట్లాది రూపాయలు తన అనునాయలకు అక్రమంగా కట్టబెట్టాడని ఆరోపించారు. 'మొన్న జరిగిన ఎన్నికల్లో నాకు 52,000 మెజారిటీ వచ్చింది. ఈసారి 70 వేల మెజారిటీతో వస్తుంది రాసి పెట్టుకోండి' అని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ ధీమా వ్యక్తం చేశారు. 'తెలంగాణలో మాజీ మంత్రి హరీష్ రావు లాగా.. నేను కూడా శాశ్వతంగా ఎమ్మెల్యేగా గెలిచేందుకు కష్టపడి ప్రజలకు సేవ చేస్తా' అని తెలిపారు. తనకు మంత్రి పదవి కన్నా... ఎమ్మెల్యేగా ప్రజలకు సేవ చేయడం సంతృప్తినిస్తుందని చెప్పారు.
Also Read: IND vs ZIM: చెపాక్లో భారత్ చేతిలో జింబాబ్వే చిత్తు.. టీ20 ప్రపంచకప్ సెమీస్ ఆశలు సజీవం
శ్రీకాకుళంలో డయేరియా వ్యాప్తి తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. డయేరియా బారినపడి ముగ్గురు చనిపోయారని తెలుస్తోంది. పెద్ద ఎత్తున ప్రజలు ఆస్పత్రుల బారిన పడుతున్నారు. డయేరియాతో చాలా మంది తీవ్ర అస్వస్థతకు గురవడంతో సీఎం చంద్రబాబు స్పందించారు. డయేరియా వ్యాప్తిపై సమీక్ష చేసి అధికార యంత్రాంగానికి కీలక ఆదేశాలు ఇచ్చారు. నిర్లక్ష్యం వహించిన అధికారులపై వేటు వేశారు. అయితే డయేరియా వ్యాప్తిపై కూటమి ప్రభుత్వాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిలదీసింది. చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యం.. అలసత్వం కారణంగానే శ్రీకాకుళంలో డయేరియా పెరిగిపోయిందని.. వెంటనే పటిష్ట చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Rashmika Cinema Career After Marriage: నేషనల్ క్రష్ రష్మిక మందన్న జీవితంలో ఒక అందమైన మలుపు చోటుచేసుకుంది. 'కుమారి' నుంచి 'శ్రీమతి'గా మారి, మిసెస్ దేవరకొండగా కొత్త చాప్టర్ ప్రారంభించిన ఆమెకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, ఈ ఆనందంతో పాటు అభిమానుల మదిలో ఒకే ప్రశ్న మెదులుతోంది.. "పెళ్లి తర్వాత రష్మిక మళ్ళీ ముఖానికి రంగు వేసుకుంటుందా?" అనే ప్రశ్న అందరిలోనూ కలిగింది.
ప్రస్తుతం చేతిలో ఉన్న క్రేజీ ప్రాజెక్టులు
రష్మిక ప్రస్తుతం తన కెరీర్లో అత్యంత కీలకమైన దశలో ఉంది. ఆమె చేతిలో ఉన్న ప్రాజెక్టులు చూస్తుంటే, ఆమె సినిమాలకు అంత సులభంగా దూరం కాదని స్పష్టమవుతోంది.
తన భర్త విజయ్ దేవరకొండతో కలిసి నటిస్తున్న హ్యాట్రిక్ సినిమా 'రణబాలి'. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. తెలుగులో చేస్తున్న 'మైసా' పాన్-ఇండియా యాక్షన్ మూవీలో రష్మిక ఒక పవర్ ఫుల్ పాత్రలో కనిపించనుంది. మరోవైపు బాలీవుడ్ స్టార్ షాహిద్ కపూర్తో కలిసి 'కాక్ టైల్ 2' రొమాంటిక్ కామెడీ చిత్రంలో నటిస్తుంది.
మారిన ట్రెండ్.. మారిన ఆలోచనలు
ఒకప్పుడు హీరోయిన్లకు పెళ్లైతే కెరీర్ ముగిసినట్లే అనే భావన ఉండేది. కానీ నేడు సమంత, నయనతార, ఆలియా భట్ వంటి వారు పెళ్లి తర్వాత కూడా బాక్సాఫీస్ వద్ద తమ సత్తా చాటుతున్నారు. రష్మికకు ఉన్న డెడికేషన్ మరియు పాన్-ఇండియా లెవల్లో ఆమెకున్న క్రేజ్ దృష్ట్యా, ఆమె కెరీర్ ఇప్పుడప్పుడే ముగిసే అవకాశం లేదు.
సినీ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. రష్మిక పెళ్లి తర్వాత కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఇకపై వచ్చిన ప్రతి సినిమా చేయకుండా, కేవలం నటనకు ప్రాధాన్యత ఉన్న, తన ఇమేజ్కు సరిపోయే సెలెక్టివ్ కథలను మాత్రమే ఎంచుకోవచ్చు. కొత్త జీవితాన్ని ఎంజాయ్ చేయడానికి కొన్ని నెలల పాటు షూటింగ్లకు విరామం ఇచ్చే అవకాశం ఉంది. పర్సనల్ లైఫ్ను, ప్రొఫెషనల్ లైఫ్ను బ్యాలెన్స్ చేస్తూ మునుపటి కంటే మరింత ఉత్సాహంగా ప్రేక్షకుల ముందుకు రావొచ్చు.
రష్మిక మందన్న కేవలం ఒక గ్లామర్ డాల్ మాత్రమే కాదు, అద్భుతమైన నటి కూడా. అందుకే ఆమె అభిమానులు తనను మళ్లీ వెండితెరపై చూడాలని కోరుకుంటున్నారు. బహుశా కొద్ది రోజులు విశ్రాంతి తీసుకున్నా, రష్మిక తన నటనతో మనల్ని అలరించడానికి మళ్లీ రావడం ఖాయంగా కనిపిస్తుంది!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
YSRCP MLCs Protest: రాజకీయ వివాదం సృష్టించేందుకు తెర మీదకు తీసుకువచ్చిన తిరుమల లడ్డూ వివాదంపై చర్చించాల్సిందేనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన కొనసాగిస్తోంది. శాసనమండలి సమావేశాలు ప్రారంభమైన నాటి నుంచి తిరుమల లడ్డూ కల్తీ ఆరోపణలపై సభలో చర్చించాలని వైఎస్సార్సీపీ కోరుతోంది. ఇదే డిమాండ్పై సభ లోపల.. బయట నిరవధిక నిరసన చేస్తోంది. శుక్రవారం కూడా చర్చకు పట్టుబడుతూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు ధర్నాకు దిగారు. దీంతో శాసనమండలిలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
Also Read: Pension Hike: ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం మరో వరం.. త్వరలో పింఛన్ల పెంపు?
శాసన మండలిలో జరిగిన వ్యవహారంపై చైర్మన్ మోషేన్ రాజు అసంతృప్తి వ్యక్తం చేశారు. తిరుమల లడ్డూ అంశంపై చర్చకు అవకాశం ఇవ్వాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని మండలి చైర్మన్ తిరస్కరించారు. దీంతో తిరుమల లడ్డు అంశం పై చర్చ కొనసాగించాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు ఆందోళన కొనసాగించారు. వీరి ఆందోళనతో శాసనమండలి వాయిదా వేసినా కూడా మండలి చైర్మన్ పోడియం వద్ద వైఎస్సార్సీపీ సభ్యులు ఆందోళన కొనసాగిస్తున్నారు.
Also Read: IND vs ZIM: చెపాక్లో భారత్ చేతిలో జింబాబ్వే చిత్తు.. టీ20 ప్రపంచకప్ సెమీస్ ఆశలు సజీవం
ఎట్టి పరిస్థితుల్లో సభలో లడ్డు వ్యవహారంపై చర్చ కొనసాగించాలని డిమాండ్ చేశారు. మండలిలో లడ్డూపై చర్చ జరపాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు రోడ్డుపై బైఠాయింపు. ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ మాట్లాడుతూ.. ' తిరుపతి లడ్డూ వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణ జరగాలి. కల్తీ నెయ్యి సరఫరాలో హెరిటేజ్ పాత్రపై అనుమానాలు ఉన్నాయి. - నెయ్యి సరఫరా వివరాలు బయట పెట్టాలి' అని డిమాండ్ చేశారు. 'మా దగ్గర ఆధారాలు ఉన్నాయి. శాసనమండలిలో చర్చకు సిద్ధమని ప్రకటించాలి. కానీ చంద్రబాబు ప్రభుత్వం తప్పించుకుంటోంది. అవసరమైతే న్యాయ విచారణకు సిద్ధం. హెరిటేజ్ సంస్థపై సమగ్ర దర్యాప్తు జరపాలి' అని ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ కోరారు.
Also Read: YS Jagan: పూజారి ఇచ్చిన తీర్థం పడేసిన వైఎస్ జగన్.. టీడీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
మరో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ.. 'ఇందాపూర్ హెరిటేజ్ సంబంధాలపై చర్చ కోరుతూ పోరాటం చేస్తున్నాం. 23న జరిగిన బీఏసీ సమావేశంలో లడ్డుపై చర్చకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కానీ శాసనమండలిలో ప్రకటన చేసి ప్రభుత్వం పారిపోతుంది. ఇందాపూర్ నిజాలు బయటపడతాయనే భయం ప్రభుత్వానికి ఉంది. లడ్డు అంశంపై ప్రభుత్వం వెనక్కి ఎందుకు తగ్గింది?' అని ప్రశ్నించారు. 'భక్తుల భావోద్వేగాలకు సంబంధించిన విషయంపై స్పష్టత లేదు. నిజాలు బయటకు రాకుండా అడ్డుకునే ప్రయత్నం జరుగుతోంది. వైఎస్సార్సీపీ లడ్డు అంశంపై చర్చ జరిపే వరకు పోరాటం చేస్తాం' అని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి స్పష్టం చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Telangana Pension Hike: అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలతోపాటు 420 హామీలు ఇచ్చిన విషయం తెలిసిందే. అధికారంలోకి రెండున్నరేళ్లు పూర్తయినా ఇచ్చిన హామీలు అరకొరగా అమలు చేస్తోంది. వాటిలో మహిళలకు ఇచ్చిన హామీలు అసలుకే అమలు కావడం లేదు. హామీలు అమలు చేయకపోవడంతో దాని ప్రభావం ఇటీవల జరిగిన పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీపై తీవ్ర ప్రభావం చూపింది. ప్రజలు స్పష్టమైన తీర్పునివ్వకపోవడంతో కాంగ్రెస్ పార్టీ ప్రజల ఆగ్రహాన్ని గుర్తించి హామీలు అమలు చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అందులో భాగంగా పింఛన్లు పెంచబోతున్నట్లు సమాచారం.
Also Read: IND vs ZIM: చెపాక్లో భారత్ చేతిలో జింబాబ్వే చిత్తు.. టీ20 ప్రపంచకప్ సెమీస్ ఆశలు సజీవం
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసరా పెన్షన్లను రూ.2 వేలకు పెంచిన విషయం తెలిసిందే. ఎన్నికల సమయంలో రూ.4 వేలకు పెంచుతామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఇచ్చిన హామీని రెండున్నరేళ్లలో అమలు చేయలేదు. ఇప్పుడు ఆ పింఛన్ల పెంపును కొంత పెంచేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. రూ.500 పింఛన్ పెంచాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ప్రస్తుతం వృద్ధులు, ఒంటరి మహిళలు, వితంతువులకు ఇస్తున్న రూ.2,016 పెన్షన్ను రూ. 2,516కు పెంచే అవకాశం ఉంది.
Also Read: YS Jagan: పూజారి ఇచ్చిన తీర్థం పడేసిన వైఎస్ జగన్.. టీడీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
పింఛన్ల పెంపుపై మార్చి 16వ తేదీ నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. పెంచిన పెన్షన్లు ఏప్రిల్ లేదా మే నెల నుంచి పింఛన్దారుల ఖాతాల్లో జమ అయ్యేలా ప్రభుత్వం ప్రణాళిక రచిస్తోంది. ఎన్నికల హామీ మేరకు పెన్షన్ మొత్తాన్ని రూ.4,000 వరకు పెంచాల్సి ఉండగా.. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం దశలవారీగా పెంచాలని భావిస్తోంది. ఆర్థిక భారాన్ని దృష్టిలో ఉంచుకుని ఏకమొత్తంలో కాకుండా యేటా రూ.500 చొప్పున పెంచుకుంటూ వెళ్లాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించుకుంది.
Also Read: Cardiac Arrest: తొమ్మిదేళ్ల బాలికకు గుండెపోటు.. పాఠశాలలో కుప్పకూలి హఠాన్మరణం
కొత్త పెన్షన్లు
రాష్ట్రంలో ప్రస్తుతం 42.7 లక్షల మంది పెన్షన్ పొందుతున్నారు. కొత్తగా దరఖాస్తు చేసుకున్న మరో 5 నుంచి 10 లక్షల మందికి కూడా పెన్షన్ మంజూరు చేసే అవకాశం ఉంది. కొత్త పింఛన్ల జారీ ప్రక్రియపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
ఆర్థిక భారం
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రూ.4 వేలకు పింఛన్లను పెంచితే ప్రభుత్వంపై మోయలేని భారం పడుతుంది. దీంతో పెన్షన్లను రూ.500 పెంచాలని ప్రభుత్వం నిర్ణయించగా.. దీనివలన ప్రభుత్వంపై ఏడాదికి సుమారు రూ.2,500 కోట్ల అదనపు భారం పడే అవకాశం ఉందని ఆర్థిక శాఖ లెక్కలు వేస్తోంది.
అకస్మాత్తుగా పింఛన్ పెంచాలని నిర్ణయించడం వెనుక రాజకీయ కారణం ఉంది. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో ప్రజలు పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పారు. రాబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు ఓట్లు వేయకుంటే పరువు పోతుందని భావించిన కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమలుపై దృష్టి సారించింది. ఈ క్రమంలోనే ఆసరా ఫించన్ల పెంపును ప్రభుత్వం త్వరితగతిన అమలు చేయాలని చూస్తోంది.
ఇప్పటికే చర్చలు
తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో సంక్షేమ రంగానికి, ముఖ్యంగా విద్యా, వైద్యంతో పాటు ఆసరా పెన్షన్లకు ప్రభుత్వం పెద్దపీట వేయబోతోంది. ఇప్పటికే అధికారులతో ముఖ్యమంత్రి చర్చలు జరిపారని, మంత్రివర్గంలో కూడా దీనిపై ప్రాథమిక చర్చ జరిగినట్లు తెలుస్తోంది. దివ్యాంగులకు ప్రస్తుతం ఇస్తున్న రూ.4,016 పెన్షన్ను కూడా దశలవారీగా పెంచే అవకాశం ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Mercury And Venus Transit Effect On Zodiac Telugu: ఫిబ్రవరి నెల కంటే మార్చి నెల మరింత ప్రత్యేకమైనదిగా భావించవచ్చు ఎందుకంటే ఈ సమయంలో బుధుడితో పాటు శుక్రుడి శక్తివంతమైన కలయిక జరుగుతుంది. కాబట్టి ఈ నెలకు ఎంతో ప్రత్యేకమైన ప్రాముఖ్యత సంతరించుకుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా మార్చి 15వ తేదీ తెల్లవారుజామున 12 గంటల సమయంలో బుధుడు, శుక్రుడు ఒకదానికొకటి 30 డిగ్రీల కోణంలోకి రాబోతున్నాయి. దీని కారణంగా ఎంతో శక్తివంతమైన దృష్టి రాజయోగం ఏర్పడుతుంది.
తెలివితేటలు, వ్యాపారం, వాక్కుకు, అధిపతి అయిన బుధుడు.. ప్రేమ, సంపద, శ్రేయస్సుకు అధిపతి అయిన శుక్రుడి కలయికతో కొన్ని రాశులు ప్రభావితమవుతాయి. ముఖ్యంగా ఈ రాశుల వారికి జీవితంపై సానుకూలమైన ప్రభావం పడుతుంది. ఆర్థికంగా లాభాలు కలగడమే కాకుండా కెరీర్ పరంగా అద్భుతమైన ప్రయోజనాలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సామాజిక హోదా కూడా మెరుగుపడుతుంది. దీంతోపాటు ఆర్థిక సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి.
ఈ రాశులవారికి బంపర్ జాక్పాట్!
వృషభ రాశి
వృషభ రాశిలో జన్మించిన వ్యక్తులకు స్థానికంగా కొత్త లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా ఈ రెండు గ్రహాలు ఒకదానికొకటి 30 డిగ్రీల కోణంలోకి రావడం వల్ల ఏర్పడిన యోగ ప్రభావం వల్ల వీరికి సృజనాత్మకత పెరుగుతుంది ముఖ్యంగా కమ్యూనికేషన్ మెరుగుపడుతుంది. సాహిత్య, మీడియా రంగాల్లో పనులు చేస్తున్న వ్యక్తులకు అద్భుతమైన విజయాలు చేకూరే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా వీరు భారీ మొత్తంలో ఆదాయ వనరులు కూడా పొందగలుగుతారు.
మిథున రాశి
మిథున రాశి వారికి సంభాషణలో మాధుర్యం కూడా విపరీతంగా పెరుగుతుంది. వ్యాపారాలతో పాటు ఉద్యోగాల్లో అద్భుతమైన నిర్ణయాలు తీసుకుంటారు. ముఖ్యంగా వీరికి ఊహించని ఆర్థిక లాభాలు కలుగుతాయి. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు కూడా ఎంతో సులభంగా పూర్తవుతాయి. ప్రేమ సంబంధాలు మరింత మెరుగుపడి.. జీవితంలో అద్భుతమైన లాభాలు పొందుతారు.
కన్యారాశి
కన్య రాశిలో జన్మించిన వ్యక్తులకు కూడా వ్యాపారాల్లో పెద్ద పెద్దగా లాభాలు రావడం ప్రారంభమౌతాయి. ఎన్నో రకాల ప్రయోజనాలు పొందుతారు. ముఖ్యంగా పాత అప్పుల నుంచి ఉపశమనం కూడా కలుగుతుంది. అలాగే కుటుంబ వాతావరణంలో అందం కూడా రెడ్డి అవుతుంది. ఈ సమయంలో హోదా కూడా పెరుగుతుంది.
తులారాశి
తులా రాశిలో జన్మించిన వ్యక్తులకు శక్తివంతమైన రాజయోగ ప్రభావంతో అదృష్టం కూడా ఊహించని స్థాయిలో పెరుగుతుంది. ముఖ్యంగా కెరీర్ పరంగా ఎన్నో రకాల అవకాశాలు కూడా లభిస్తాయి. అలాగే ఆర్థిక సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. అంతే కాకుండా ప్రేమ సంబంధాలు గతంలో కంటే ఇప్పుడు మరింత మెరుగుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
