మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో ప్రపంచ ప్రజల దినోత్సవ వేడుకలు
Bellampalle, Kannal Rural, Telangana:మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో ప్రపంచ జానపద దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం ఆధ్వర్యంలో సింగరేణి కల్యాణ మండపంలో జానపద కళాకారులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. సంఘం రాష్ట్ర కార్యదర్శి మధుకర్ మాట్లాడుతూ కళాకారులు నిరంతరం అలనాటి కళలను పునరుజ్జీవింపజేస్తూ ప్రజల్లో చైతన్యం కల్పిస్తూ జానపద కళలను ఆదరించాలని కోరారు.
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
Jada Sravan Kumar: గాదె సాయికృష్ణది లాకప్ డెత్ కాదు.. ప్రీ ప్లాన్ మర్డర్
Vijayawada, Andhra Pradesh:Gade Sai Krishna Case: 'కనపడిన వారిని అంతా లోపలికి వేస్తూ.. ప్రశ్నిస్తే.. సోషల్ మీడియా లో పోస్ట్లు పెడితే నీకు జైలు జీవితం కన్ఫామ్ అని నారా లోకేశ్ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నాడు. ఏపీలో న్యాయం నాలుగు పాదాల మీద కాదు.. 40 పాదాల మీద నడుస్తోంది' జై బీమ్ భారత్ పార్టీ వ్యవస్థాపకుడు జడ శ్రవణ్ తీవ్ర ఆరోపణలు చేశారు. 'సాయికృష్ణ మృతి పై హోమ్ మినిస్టర్ మాట్లాడలేదు. ప్రశ్నిస్తానని చెప్పిన పవన్ బాధిత కుటుంబాన్ని కలవలేదు' అని గుర్తుచేశారు.
విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో జడ శ్రవణ్ కుమార్ సాయికృష్ణ కేసు ఉదంతాన్ని పూసగుచ్చినట్టు వివరించారు. 'సాయికృష్ణ మృతి పై హైకోర్టు లో ప్రజా ప్రయోజనం వాజ్యం వేస్తాం. సీఐ మీద మర్డర్ కేసు పెట్టారు. బాడీ లేదు, చనిపోయాడని నిర్ధారణ లేదు కానీ మర్డర్ కేసు నమోదు చేయడం అంటే కేసును నీరు కార్చడమే' అని జడ శ్రవణ్ కుమార్ ఆరోపించారు. సాయికృష్ణ కేసును నీరు కార్చడం కోసమే సీఈ సెక్షన్లు పెట్టారు. ఇది లాకప్ డెత్ కాదు ప్రీ ప్లాన్ మర్డర్' అని తెలిపారు. ల్యాండ్ సెటిల్మెంట్లో ఈ హత్య జరిగింది. ఈ కేసులో ఉన్న పెద్ద తలకాయలు బయట పెడతాను' అని శ్రవణ్ ప్రకటించారు.
సాయికృష్ణ కేసుపై కళ్లకు కట్టినట్టు
'టాస్క్ఫోర్స్ సీఐ మార్కాపురం నుంచి సాయికృష్ణని తీసుకొచ్చాడు. సీఐతో పాటు ఇద్దరు కానిస్టేబుళ్లు, ఒక ఏఎస్ఐ, బ్లూ కోర్ట్లో పని చేసే ఒక వ్యక్తి సాయి కృష్ణని తీసుకొచ్చారు. మార్కాపురం స్టేషన్లో జీడీ పెట్టారు. 8వ తేదీన తీసుకొనివచ్చి 9వ తేదీ టాస్క్ఫోర్స్ ఆఫీస్కి తీసుకెళ్లారు. ఒక రోజు టాస్క్ఫోర్స్ ఆఫీస్లో ఒక రోజు ఉన్నారు. రమేష్ హాస్పిటల్ పక్కన ఉన్న ఒక హోటల్లో రూమ్ నెంబర్-302లో ఉదయం టాస్క్ఫోర్స్, రాత్రి కృష్ణ లంక పోలీసులు చిత్రహింసలకు గురి చేశారు. సీఐ నాగరాజు పేరు మీదనే హోటల్ రూమ్ బుక్ అయింది. 14వ తేదీ రంగా ఇంటి ముందు ఉన్న ప్రజా వైద్యశాలకు తీసుకెళ్లారు. 15వ తేదీ మణిపాల్ ఆస్పత్రికి తరలించగా అక్కడ డాక్టర్ వేణుగోపాల్ చికిత్స చేయించారు. అయన కూడా చేతులెత్తేశారు. 16వ తేదీ ఆర్ఎంపీ డాక్టర్తో హోటల్లో చికిత్స చేయించారు. 23వ తేదీ సాయంత్రం సాయికృష్ణ చనిపోయాడు. 24వ తేదీ ఆర్టీసీ బస్టాండ్లో ప్లాట్ఫామ్ నంబర్-43 దగ్గర అనాథ శవంగా సాయికృష్ణను పడేశారు. విజయవాడ మునిసిపల్ కార్యాలయానికి అనాథ శవం పేరుతో కాల్చడానికి అనుమతి తీసుకొన్నారు. లేఖ రాసింది టాస్క్ఫోర్స్ సీఐ. అనాథ శవం అని సీఐ నిర్ధారించారు. స్వర్గపురిలో ఉన్న మేనేజర్, బ్లూకోర్టులో ఉన్న స్నేహితులు ఉదయం 5.30 గంటలకు ఖననం చేశారు. బూడిద కూడా దొరికింది' అని కళ్ల ముందు చూసినట్టు జడ శ్రవణ్ వివరించారు.
'సాయికృష్ణ కేసులో ఇంతమంది పోలీసులు ఇన్విల్వ్ అయితే.. ఎవరి మీద కేసు పెట్టారు? ఒకరి మీద కడితే సరిపోతుందా? ఎవరెవరు ఇన్వాల్ అయ్యారు? ఎందుకోసం ఈ పని చేశారు?' అని జై బీమ్ భారత్ పార్టీ వ్యవస్థాపకుడు జడ శ్రవణ్ తెలిపారు. 'ఈ ప్రభుత్వం నో డెలివరీ ప్రభుత్వం. ఎమ్మెల్యే లు అమ్మాయిలను రేప్ చేస్తే మాట్లాడారు. ఆరవ శ్రీధర్ని ఢిల్లీలో పక్కన కూర్చోపెట్టుకొంటావా? నువ్వేం సనాతన ధర్మ సారథివి. ఢిల్లీ స్థాయిలో కాదు. ఈ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఉన్నారు. పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాలు ఉన్నాయని హోటల్స్లో పెట్టి కొడుతున్నారు' అని జడ శ్రవణ్ వివరించారు.
'హోటల్స్లో కూడా సీసీ కెమెరాలు పెట్టాలి. సీబీఐకి ఈ కేసు అప్పగించాకపోతే న్యాయం జరగదు. ఈ కేసులో భాగమైన వ్యక్తులు చాలా పెద్దవాళ్లు. వాళ్లు ఉండగా కేసు ముందుకు సాగదు. చేతి గీతలు అరగదీస్తామని డిప్యూటీ సీఎం చెబుతాడు. యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ అంటే ఎన్కౌంటర్. అది అమలు చేస్తామని పవన్ అంటున్నాడు. పవన్ ఈ విధంగా మాట్లాడితే ఎందుకు పోలీసులు అలా ప్రవర్తించకుండా ఉంటారు' అని జడ శ్రవణ్ ప్రశ్నించారు.
Organ Donation: మరణించిన తర్వాత ఆరుగురికి ప్రాణం పోసిన రాజ్..ముంబై కుర్రాడి హృదయ విదారక గాథ!
Mumbai, Maharashtra:19 Years Boy Organ Donation: ముంబైకి చెందిన 19 ఏళ్ల కాలేజీ విద్యార్థి రాజ్ గాంధీ.. తాను మరణిస్తూ కూడా ఆరుగురి జీవితాల్లో వెలుగులు నింపాడు. ఈ విధంగా అవయవదానంపై అవయవదానంపై జీ మీడియా (Zee Media) కల్పించిన అవగాహన ఇప్పుడు మరింత మంది ఇళ్లలో ఆనందాన్ని తీసుకురావాలని వీలు కల్పించింది. జీ మీడియా స్ఫూర్తితో రాజ్ పెద్ద సోదరుడు మిటెన్ గాంధీ పంచుకున్న ఆనాటి విషాద, స్ఫూర్తిదాయక జ్ఞాపకాలు ఇప్పుడు మీ కోసం..
ఆ ఒకే ఒక్క రాత్రి..
అది 2017, మే 18వ తేదీ సాయంత్రం.. ముంబైలోని మసీద్ స్టేషన్ సమీపంలో ఉన్న తన మామయ్య ఆఫీసులో పని ముగించుకుని రాజ్ లోకల్ ట్రైన్లో ఇంటికి బయలుదేరాడు. రాత్రి 8 గంటలవుతున్నా రాజ్ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు అతడికి పదే పదే ఫోన్ చేశారు. చివరకు అతని ఫోన్ ఎత్తిన పోలీసులు.. రాజ్ రైలు ప్రమాదానికి గురై ఇక లేడనే వార్తలను తెలియజేశారు.
రైలులో విపరీతమైన రద్దీ కారణంగా తోపులాట జరిగి, రాజ్ అదుపుతప్పి కదులుతున్న రైలు నుండి కింద పడిపోయాడు. తలకు తీవ్ర గాయాలు కావడంతో అతన్ని వెంటనే ముంబైలోని లీలావతి ఆసుపత్రి ICUలో చేర్పించారు. వైద్యులు శతవిధాలా ప్రయత్నించినప్పటికీ రాజ్ ఆరోగ్యం క్షీణిస్తూనే వచ్చింది.
దుఃఖంలోనూ వెలుగులు నింపాడు..
మే 21, 2017న రాజ్ 'బ్రెయిన్ డెడ్' (మెదడు పూర్తిగా పనిచేయడం ఆగిపోవడం) అయినట్లు వైద్యులుధృవీకరించారు. ఆ నిమిషంలో గాంధీ కుటుంబంపై కొండంత దుఃఖం వచ్చిపడింది. అయినప్పటికీ, ఎప్పుడూ ఇతరులకు సహాయం చేసే గుణమున్న రాజ్ జ్ఞాపకార్థం.. అతని అవయవాలను దానం చేయాలని కుటుంబం నిర్ణయించుకుంది.
మొదట్లో అవయవాల దుర్వినియోగంపై కొన్ని అపోహలు ఉన్నప్పటికీ.. ఓ స్వచ్ఛంద సంస్థకు చెందిన కౌన్సిలర్లు భారతదేశంలో అవయవ దాన ప్రక్రియ అంతా చట్టబద్ధంగా, పారదర్శకంగా (ZTCC వెయిటింగ్ లిస్ట్ ప్రకారం) జరుగుతుందని వివరించడంతో తల్లిదండ్రులు నవీన్చంద్ర గాంధీ, నీలా గాంధీ ధైర్యంగా ముందుకు వచ్చారు.
ఆరుగురికి ప్రాణం పోశాడు..
ఇది రైలు ప్రమాదం కావడం వల్ల మెడికో-లీగల్ కేసుగా నమోదైంది. అయినప్పటికీ పోలీసులు, ఆసుపత్రి యాజమాన్యం వేగంగా స్పందించి అనుమతులు మంజూరు చేశారు. ఈ క్రమంలో రాజ్కు చెందిన గుండె, కాలేయం, మూత్రపిండాలు, కళ్లు వంటి వాటిని ఆరుగురికి దానం చేశారు కుటుంబసభ్యులు.
"రాజ్ భౌతికంగా మన మధ్య లేకపోయినా, అతని గుండె చప్పుడు కారణంగా మరొకరి కుమారుడు, సోదరుడు లేదా తండ్రి ఈ రోజు బతికి ఉన్నారనే విషయమే మాకు పెద్ద ప్రశాంతత" అంటూ రాజ్ సోదరుడు మిటెన్ భావోద్వేగానికి గురయ్యారు.
జీ మీడియా విజ్ఞప్తి.. "జిందగీ కే బాద్ భీ"
భారతదేశంలో ప్రతిఏటా లక్షలాది మంది సరైన సమయానికి అవయవాలు అందక ప్రాణాలు కోల్పోతున్నారు. తీవ్ర దుఃఖంలో ఉండి కూడా ఒక కుటుంబం తీసుకునే సాహసోపేత నిర్ణయం.. మరెన్నో కుటుంబాల్లో వెలుగులు నింపగలదని రాజ్ గాంధీ కథ నిరూపించింది. జీ మీడియా అవగాహన ప్రచారం "జిందగీ కే బాద్ భీ" (Zindagi Ke Baad Bhi) లో భాగస్వాములు అవ్వండి.
Also Read: కొత్త ఉద్యోగులకు కేంద్రం గుడ్న్యూస్.. పీఎఫ్ అకౌంట్లో రూ.15,000 జమ..ఎప్పుడంటే?
Also Read: భారీగా తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు..ట్రంప్ ప్రకటనతో ఒక్కసారి పడిపోయిన ఇంధన ధరలు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Revanth Reddy: తెలంగాణ భవిష్యత్ తరగతి గదుల్లోనే ఉంది: రేవంత్ రెడ్డి
Hyderabad, Telangana:Hyderabad: 'ప్రీ ప్రైమరీ విధానం తీసుకొచ్చి ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను పునరుద్ధరిస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలల్లో నో అడ్మిషన్ బోర్డు పెట్టాల్సి వస్తుందని ఎవరూ కలలో కూడా ఊహించి ఉండరు. ఆరుట్ల పబ్లిక్ స్కూల్ ఏర్పాటుతో అలాంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించాం. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మించి దేశానికే ఆదర్శంగా తెలంగాణను నిలపబోతున్నాం' అని రేవంత్ రెడ్డి తెలిపారు.
హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో జరిగిన యంగ్ ఇండియా స్టూడెంట్ కిట్స్ పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కీలక ప్రసంగం చేశారు. 'అరవై ఏళ్ల సుదీర్ఘ పోరాటం, వందలాది మంది యువత ఆత్మ బలిదానాలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ భవిష్యత్ తరగతి గదుల్లోనే ఉందని మేం సంపూర్ణంగా విశ్వసించాం. విధ్వంసమైన విద్యా వ్యవస్థను వికాసం వైపు నడిపించాలని నిర్ణయించాం. అందుకే బడ్జెట్ లో విద్య కోసం 8.5 శాతం నిధులు కేటాయించాం. విద్యా అభివృద్ధికి రూ. 26,600 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. ఇది ఖర్చుగా కాదు భవిష్యత్ తరాల కోసం పెట్టుబడిగా మేం భావిస్తాం' అని తెలిపారు.
వందేళ్ల నష్టం
'పదేళ్లు అధికారంలో ఉన్న వాళ్లు విద్యకు ప్రాధాన్యం ఇవ్వలేదు. పదేళ్లు అధికారంలో ఉన్నవాళ్లు డైట్, కాస్మోటిక్ చార్జీలు పెంచలేదు. మేం అధికారంలోకి రాగానే డైట్, కాస్మోటిక్ చార్జీలు పెంచాం' అని రేవంత్ రెడ్డి వివరించారు. 'ప్రభుత్వ పాఠశాలలు మూసివేసి విద్యా వ్యవస్థను విధ్వంసం చేశారు. విద్యా శాఖకు మంత్రి లేడంటూ కొందరు మాట్లాడుతున్నారు. పదేళ్లు వాళ్లు చేసిన విధ్వంసంతో వందేళ్ల నష్టం జరిగింది. అందుకే విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసి పేదలకు విద్య అందించాలని విద్యా శాఖను నా దగ్గరే పెట్టుకున్న' అని వెల్లడించారు.
స్పోర్ట్స్ యూనివర్సిటీ
'రాబోయే ఒలంపిక్స్ లక్ష్యంగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశాం. ఏఐ తుఫాన్తో కోట్లాదిమంది నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. అందుకే బ్లూ కాలర్ జాబ్స్ వైపు దృష్టి సారించాం. యువతకు నైపుణ్య శిక్షణ అందించే కార్యక్రమాన్ని చేపట్టాం. ఇంగ్లీష్తో పాటు జర్మనీ, జపాన్ భాషను నేర్పిస్తున్నాం. ఐటీఐలను ఏటీసీలుగా మార్చాం. స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేసుకున్నాం' అని తెలంగాణ సీఎం వెల్లడించారు.
గొప్ప వాళ్లుగా తీర్చిద్దడమే లక్ష్యం
మీలో ఉన్న నైపుణ్యాన్ని వెలికితీసి పదును పెట్టి గొప్ప వాళ్లుగా తీర్చిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి ప్రకటించారు. సోషల్ వెల్ఫేర్లో చదువుకున్న విద్యార్థులు డాక్టర్లుగా, ఐఏఎస్లుగా, ఐపీఎస్లుగా, రాజకీయ నాయకులుగా ఎదగాలని ఆకాంక్షించారు. మీరంతా తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. దేశాన్ని నడిపించే శక్తిగా ఎదగాలని.. రేపటి భవిష్యత్ తరగతి గదుల్లోనే ఉందని చెప్పారు. 'మీ తలరాతను మార్చేది చదువొక్కటే. మీరు చదవండి మీకు ఏం కావాలో ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా. 27.50 లక్షల మంది విద్యార్థులకు ఇవాళ యంగ్ ఇండియా స్టూడెంట్ కిట్స్ అందిస్తున్నాం. తెలంగాణను ఎడ్యుకేషన్ హబ్గా, స్పోర్ట్స్ హబ్గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నాం' అని రేవంత్ రెడ్డి వివరించారు.
TTD September Tickets: తిరుమల వెళ్లే భక్తులకు శుభవార్త..రూ.120లకే దర్శనం టికెట్..రేపు ఒక్క రోజు మాత్రమే!
Tirupati Urban, Andhra Pradesh:TTD September 2026 Tickets: తిరుమల శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) కీలక ప్రకటన చేసింది. సెప్టెంబర్ 2026 నెలకు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్ల ఆన్లైన్ ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ నమోదు ప్రక్రియ జూన్ 18న ప్రారంభమైంది. ఈ లక్కీ డిప్లో టికెట్లు పొందిన భక్తులకు కేవలం రూ.120కే మొదటి గడప నుంచి స్వామివారిని అత్యంత సమీపంగా దర్శించుకునే అరుదైన అవకాశం లభిస్తుంది.
లక్కీ డిప్ ముఖ్యమైన తేదీలు
ఈ లక్కీడిప్ నమోదుకు ఇప్పటికే రిజిస్ట్రేషన్స్ ఓపెన్ అవ్వగా.. జూన్ 20వ తేదీన ఉదయం 10 గంటలకు వరకు మాత్రమే భక్తులకు రేపు లాస్ట్ ఛాన్స్ ఉండనుంది. జూన్ 20 మధ్యాహ్నం విజేతల వివరాలను టీటీడీ ప్రకటిస్తుంది. ఎంపికైన వారికి ఎస్ఎంఎస్, ఈమెయిల్ ద్వారా సమాచారం అందుతుంది. లక్కీ డిప్లో పేరు వచ్చిన భక్తులు జూన్ 20 నుండి జూన్ 22 మధ్యాహ్నం 12 గంటల లోపు ఆన్లైన్లో నిర్ణీత రుసుము చెల్లించి టికెట్ కన్ఫర్మ్ చేసుకోవాలి.
గమనిక: సాధారణంగా మొదటి గడప దర్శనం కోసం శ్రీవాణి ట్రస్ట్ ద్వారా రూ.10,500 ఖర్చు చేయాల్సి ఉంటుంది. కానీ ఈ లక్కీ డిప్ ద్వారా సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధన వంటి సేవలను కేవలం రూ. 120 ప్రారంభ ధరకే పొందే వీలుండటంతో భక్తులు దీనిపై ప్రత్యేక ఆసక్తి చూపిస్తారు. భక్తులు టీటీడీ అధికారిక వెబ్సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా ఈ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
ఇతర సేవా టికెట్ల విడుదల షెడ్యూల్
లక్కీ డిప్ సేవలతో పాటు సెప్టెంబర్ నెలకు సంబంధించిన మిగతా దర్శన కోటాలను కూడా టీటీడీ వరుసగా విడుదల చేయనుంది.
తిరుమలలో ఇతర ఆర్జిత సేవలైన కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ టికెట్లను బుకింగ్ చేసేందుకు జూన్ 22 ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు.
అలాగే జూన్ 22 మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవలు, వాటికి సంబంధించిన దర్శన స్లాట్లు రిలీజ్ చేస్తుండగా.. జూన్ 23న అంగప్రదక్షిణ టోకెన్లు, శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శన టికెట్లు, అలాగే వృద్ధులు, దివ్యాంగుల ప్రత్యేక దర్శన కోటా టోకెన్లు విడుదలవుతాయి. ఆ తర్వాత జూన్ 24వ తేదీన ఉదయం 10 గంటలకు రూ.300 విలువైన స్పెషల్ దర్శనం టికెట్లను బుక్ చేయోచ్చు. అదే విధంగా జూన్ 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు సెప్టెంబరు నెలలో దర్శనం టికెట్లు ఉన్న భక్తులకు రూమ్ బుకింగ్ అందుబాటులో ఉండనుంది. శ్రీవారి సేవల్లో పాల్గొనాలనుకునే భక్తులు ఈ తేదీలను గమనించి, గడువులోగా తమ టికెట్లను బుక్ చేసుకోవాలని టీటీడీ సూచించింది.
Also Read: ఏపీ రైతులకు తీపికబురు..రేపు రైతుల ఖాతాల్లోకి డబ్బు జమ..ఏం టైమ్కి వస్తాయంటే?
Also Read: విశాఖపట్నంపై కన్నేసిన పాకిస్థాన్..బంగాళఖాతంలోకి పాక్ సబ్మెరైన్ ఎంట్రీ!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Career Guide: ఇంటర్ తర్వాత తక్కువ ఖర్చుతో.. హై శాలరీ ఇచ్చే టాప్ డిప్లొమా కోర్సులు!సైన్స్, ఆర్ట్స్, కామర్స్ వారికి బెస్ట్ ఆప్షన్స్!
Hyderabad, Telangana:Top Diploma Courses After 12th: పరీక్షల ఫలితాలు వచ్చిన తర్వాత, ఇక తదుపరి అడుగు ఏమిటి అనే సందేహం విద్యార్థుల్లో ఉంటుంది. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన వారు కేవలం డిగ్రీ, బీకాం, బీఎస్సీ లేదా బీటెక్ కోర్సులకే పరిమితం కానక్కర్లేదు; డిప్లమా కోర్సుల ద్వారా కూడా త్వరగా ఉద్యోగంలో చేరవచ్చు. ఈ కోర్సుల్లో ప్రాక్టికల్ శిక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తారు, దీనివల్ల విద్యార్థుల్లో నైపుణ్యం (Skill Development) పెరుగుతుంది. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక శిక్షణ మరియు జ్ఞానాన్ని అందిస్తూ, ఒకటి నుండి మూడు ఏళ్లలో ఈ కోర్సులను పూర్తి చేసి లక్ష్యంగా పెట్టుకున్న ఉద్యోగాన్ని సాధించవచ్చు.
12వ తరగతి తర్వాత ఉత్తమ డిప్లమా కోర్సులు ఇవే...
దేశవ్యాప్తంగా ప్రాచుర్యంలో ఉన్న కొన్ని ముఖ్యమైన డిప్లమా కోర్సులు
డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్, డిప్లొమా ఇన్ ఆర్కిటెక్చర్, డిప్లొమా ఇన్ ఫార్మసీ, డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్, డిప్లొమా ఇన్ ఫ్యాషన్ డిజైనింగ్, డిప్లొమా ఇన్ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్, డిప్లొమా ఇన్ గ్రాఫిక్ డిజైన్, ఇంటీరియర్ డిజైన్, డిప్లొమా ఇన్ డిజిటల్ మార్కెటింగ్, ఈవెంట్ మేనేజ్మెంట్, డిప్లొమా ఇన్ వెబ్ డిజైన్ అండ్ డెవలప్మెంట్, మెడికల్ లేబొరేటరీ టెక్నాలజీ, డిప్లొమా ఇన్ నర్సింగ్, డిప్లొమా ఇన్ ఎర్లీ చైల్డ్ హుడ్ ఎడ్యుకేషన్.
12వ తరగతి తర్వాత సైన్స్ విద్యార్థుల కోసం డిప్లొమా కోర్సులు...
సైన్స్ విభాగం విద్యార్థులు డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్, డిప్లొమా ఇన్ ఫార్మసీ, డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్, డిప్లమా ఇన్ నర్సింగ్ వంటి కోర్సులను ఎంచుకోవచ్చు.
Also Read: NEET UG Re-Exam: నీట్ రీ-ఎగ్జామ్ రాసే విద్యార్థులకు అలెర్ట్.. పరీక్ష రోజూ ఇవి అస్సలు వేసుకెళ్లొద్దు! డ్రెస్ కోడ్ రూల్స్ ఇవే!
Also Read: నీట్ రీ-ఎగ్జామ్ గైడ్లైన్స్ విడుదల.. మార్కింగ్ విధానం, తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్లు ఇవే!
కామర్స్ విద్యార్థుల కోసం డిప్లొమా కోర్సులు...
కామర్స్ స్ట్రీమ్కు చెందిన వారు డిప్లొమా ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్, డిప్లొమా ఇన్ అకౌంటింగ్, రిటైల్ మేనేజ్మెంట్ వంటి కోర్సులను చేయవచ్చు.
ఆర్ట్స్ విద్యార్థుల కోసం డిప్లొమా కోర్సులు...
ఆర్ట్స్ విభాగంలో డిప్లొమా ఇన్ ఫైన్ ఆర్ట్స్, డిప్లొమా ఇన్ ఈవెంట్ మేనేజ్మెంట్, డిప్లొమా ఇన్ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్, డిప్లొమా ఇన్ ఫ్యాషన్ డిజైన్, మల్టీమీడియా అండ్ యానిమేషన్ వంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయి. విద్యార్థులు తమ ఆసక్తిని బట్టి సరైన గ్రూపులను ఎంచుకోవచ్చు. ఈ కోర్సులు వారి కెరీర్ లక్ష్యాలను చేరుకోవడానికి, నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి, పారిశ్రామిక అనుభవాన్ని పొందడానికి భవిష్యత్తులో గొప్ప బాటగా నిలుస్తాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Karimnagar: వంటా-వార్పుకు 15 ఏళ్లు.. నాటి కరీంనగర్ పోరాట జ్ఞాపకాలు!
Hyderabad, Telangana:Telangana Vanta Varpu 15 Years: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన మలిదశ ఉద్యమంలో కరీంనగర్ జిల్లా ఒక ఊపు ఊపేసింది. తెలంగాణ సమాజం మొత్తాన్ని ఒకే తాటిపైకి తెచ్చిన అపూర్వ ఘట్టం.. వంటా-వార్పు కార్యక్రమం జరిగి సరిగ్గా నేటికీ 15 ఏళ్లు పూర్తయింది.. పల్లె నుంచి పట్నం వరకు.. పేద నుంచి ధనిక దాకా.. ప్రతి ఒక్కరూ రోడ్లపైకి వచ్చి.. పొయ్యిలు వెలిగించి.. వంటలు వండి సగర్వంగా తమ నిరసనలు వ్యక్తం చేశారు.. నాడు కరీంనగర్ వీధులన్నీ తెలంగాణ నినాదంతో మారుమోగాయి.. ఈ అపూర్వ ప్రజా ఉద్యమ తీవ్రత అప్పట్లో ఢిల్లీ పీఠాన్ని కుదిపేసిన సంగతి కూడా తెలిసిందే..
ఉద్యమ జ్వాలగా మారిన వంటిల్లు..
నాడు కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా జరిగిన ఈ వంటావార్పు కార్యక్రమం కేవలం ఒక నిరసన కార్యక్రమంగా మిగలలేదు.. అదొక మహా జనజాతరను తలపించేసింది. జాతీయ రహదారులతో పాటు ప్రధాన కూడలన్నీ వంటశాలలుగా మారిపోయాయి.. కుల మత వర్గ బేధాలు మరిచి అందరూ ఒకే చోట కూర్చుని భోజనాలు చేశారు.. వంటలు వండుతూనే.. మరోవైపు బతుకమ్మ ఆడుతూ.. ధూమ్ దాం అద్భుతమైన ఆటపాటలతో ఉద్యమ కళాకారులు ఉత్సాహాన్ని నింపారు.. అంతేకాకుండా కొన్ని చోట్ల పోలీసులు సైతం ఈ కార్యక్రమాన్ని అడ్డుకున్నప్పటికీ.. ప్రజలు ఏమాత్రం వారి లాఠీ దెబ్బలకు లెక్కచేయకుండా దీనిని విజయవంతం చేశారు...
నాడు రోడ్డుపై వండిన ప్రతి మెతుకు.. తెలంగాణ రాష్ట్ర కాంక్షను చాటి చెప్పిందని.. ప్రతి పొయ్యి నుంచి వచ్చిన పొగ.. ఢిల్లీ పాలకుల కళ్ళకు కమ్మేలా చేసిందని నాటి ఉద్యమకారులు ఎన్నో వ్యాసాలు రాశారు.. తెలంగాణ వస్తేనే మన బతుకులు మారుతాయి అని నమ్మకాన్ని.. ఈ వంటావార్పు కార్యక్రమం ప్రజల్లో బలంగా నాటింది. పిల్లలతో పాటు వృద్ధులు, మహిళలు సైతం ఎండను లెక్కచేయకుండా రోడ్లపైనే గడిపేశారు..
Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!
సకలజనులు ఏకమైతే ఉద్యమం ఎంతటి ప్రరూపం దాల్చుతుందో.. ఈ కార్యక్రమం దేశానికి చూపించేలా చేసింది.. నాటి కరీంనగర్ పోరాటాల పటిమ.. ఆత్మగౌరవ నినాదం.. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయడంలో క్రియాశీలక పాత్ర పోషించింది.. 15 ఏళ్లు గడిచినప్పటికీ.. నాటి వంటావార్పు జ్ఞాపకాలు.. ఆ ఉద్వేగం, ఆ ఐక్యత తెలంగాణ ప్రజల గుండెల్లో నేటికీ ఒక అద్భుతమైన జ్ఞాపకం గానే మిగిలిపోయి ఉంది.. తెలంగాణ ఉద్యమ చరిత్ర పుటల్లో కరీంనగర్ సాధించిన ఈ పోరాటం ఎప్పటికీ ఒక మైలురాయిగానే నిలిచిపోయింది.. అంతేకాకుండా ఈ సమయంలో ఎంతోమంది చేసిన త్యాగాలు కూడా చరిత్రలో నిలిచిపోయాయి..
Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
Annadata Sukhibhava: ఏపీ రైతులకు తీపికబురు..రేపు రైతుల ఖాతాల్లోకి డబ్బు జమ..ఏం టైమ్కి వస్తాయంటే?
Vijayawada, Andhra Pradesh:Annadata Sukhibhava 2026: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న పెట్టుబడి సాయం కోసం ఎదురుచూస్తున్న అన్నదాతలకు కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించింది. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన 'అన్నదాత సుఖీభవ' పథకానికి సంబంధించిన నిధుల విడుదలకు ముహూర్తం ఖరారైంది. రేపు (శనివారం) ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బటన్ నొక్కి ఈ నిధులను నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి జమ చేయనున్నారు.
పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలోని లింగంగుంట్ల గ్రామం వేదికగా ఈ కార్యక్రమం అధికారికంగా ప్రారంభం కానుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా ఈ బహిరంగ సభలో పాల్గొని, 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తొలి విడత నిధులను రైతులకు విడుదల చేయనున్నారు. ఉదయం జరగనున్న బహిరంగ సభలో సీఎం చంద్రబాబు మాట్లాడిన తర్వాత దాదాపుగా ఉదయం 11 గంటల సమయంలో అకౌంట్లోకి డబ్బు జమ చేయనున్నారని సమాచారం. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలులో భాగంగా, వ్యవసాయ సీజన్ ప్రారంభంలోనే రైతులకు పెట్టుబడి సాయం అందించాలనే సంకల్పంతో ప్రభుత్వం ఈ అడుగు వేసింది.
ముఖ్యాంశాలు, లబ్ధి వివరాలు..
కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో సాగే 'అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన్' కలయిక ద్వారా ఈ ఏడాది తొలి విడత కింద ప్రభుత్వం ఏకంగా రూ.3,125 కోట్ల భారీ మొత్తాన్ని పంపిణీ చేయనుంది. ఈ విడత నిధుల విడుదల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు 46.85 లక్షల రైతు కుటుంబాలకు నేరుగా లబ్ధి చేకూరనుంది.
విత్తనాలు, ఎరువుల కొనుగోలు సమయానికి ఈ పెట్టుబడి సాయం అందడం వల్ల రైతులకు అప్పుల బాధ తప్పుతుందని, వ్యవసాయ పనులకు ఎంతో ఊరట లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.
చిలకలూరిపేట పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు నిధుల విడుదలతో పాటు, రైతులతో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలను తెలుసుకోనున్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే తమ ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని కూటమి నాయకులు స్పష్టం చేస్తున్నారు. సీజన్ ఆరంభంలోనే నేరుగా ఖాతాల్లోకి డబ్బులు జమ అవుతుండటంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్నదాతల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన సాంకేతిక ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు.
Also Read: విశాఖపట్నంపై కన్నేసిన పాకిస్థాన్..బంగాళఖాతంలోకి పాక్ సబ్మెరైన్ ఎంట్రీ!
Also Read: Sai Krishna Case: "నా కొడుకు బతికే ఉన్నాడా లేదా చంపేశారా?".. రౌడీషీటర్ సాయికృష్ణ తల్లి ఆవేదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Cow Viral Video: పిల్లాడికి ఉయ్యాల ఊపుతున్న గోమాత.. వీడియో వైరల్!
Hyderabad, Telangana:Cow Rocking Cradle Viral Video Watch: గోమాతను మన సాంస్కృతిలో కేవలం జంతువుగా కాకుండా.. అమ్మలా భావించి పూజ చేస్తూ ఉంటాం.. ఆవుకు మనుషుల పట్ల, ముఖ్యంగా చిన్నపిల్లల పట్ల ఉండే ప్రేమ అపారమైందని చెప్పడానికి ఎన్నో పురాణాలకు సంబంధించిన కథలను వినే ఉంటాం.. కానీ తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వింత వీడియో చూస్తే.. ఆ మాటలు అక్షరాల నిజమైన అని నమ్మక తప్పదు.. ఒక మూగ జీవం చూపించిన మాతృ ప్రేమ ఇప్పుడు సోషల్ మీడియా వినియోగదారుల హృదయాలను గెలుచుకుంటుంది. అయితే ఈ వీడియోలో ఏముంది? ఇంతలా వైరల్ అవ్వడానికి గల కారణాలేంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
అమ్మతో పోటీగా ఉయ్యాల ఊపుతూ..
వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక పల్లెటూరి వాతావరణం కనిపిస్తోంది.. అక్కడ ఒక పెద్ద చెట్టుకు కట్టిన ఉయ్యాలను ఒక చిన్నారి ప్రశాంతంగా పడుకొని ఉండడం మీరు చూడొచ్చు. ఆ పిల్లాడిని నిద్రపుచ్చడానికి ఒకవైపు అతని తల్లి ఉయ్యాల ఊపుతోంది.. అయితే ఇక్కడే ఒక అద్భుతం జరిగింది.. అక్కడే నిలబడి ఉన్న ఒక ఆవు ఆ చిన్నారిపై తనకున్న ప్రేమను చాటుకుంది. తన నోటితో ఉయ్యాలతాడును పట్టుకొని.. ఆ తల్లితో పోటీగా ఎంతో జాగ్రత్తగా ఉయ్యాల ఊపడం మీరు క్లియర్ గా చూడొచ్చు.
మూగజీవం చూపిన మాతృప్రేమ..
సాధారణంగా జంతువులకు అంతగా అవగాహన ఉండదని చాలామంది భావిస్తూ ఉంటారు.. కానీ ఈ వీడియోలో ఆవు ప్రవర్తించిన తీరు చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలగక తప్పదు.. ఆ చిన్నారికి ఎక్కడ తగులుతుందో అన్నట్లుగా చాలా నెమ్మదిగా.. ఎంతో క్రమశిక్షణతో అది ఉయ్యాల ఊపుతున్న దృశ్యాలు చూసి అక్కడున్న వారితో పాటు వీడియో చూస్తున్న సోషల్ మీడియా వినియోగదారులు కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు. జంతువుల్లోనూ ఇంతటి ప్రేమ, బంధం ఉంటుందా అని అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ వస్తున్నారు..
Also Read: నాగమణికి కాపలాగా రెండు భారీ కింగ్ కోబ్రాలు.. వీడియో వైరల్..
సోషల్ మీడియా వినియోగదారులు ఫిదా..
ప్రస్తుతం ఈ అరుదైన వీడియో అన్ని సోషల్ మీడియాకు సంబంధించిన ప్లాట్ఫారమ్లలో హల్ చల్ చేస్తోంది. లక్షలాదిమంది ఈ వీడియోను వీక్షించడమే కాకుండా లైక్లతో పాటు షేర్లు కూడా చేస్తున్నారు. అంతేకాకుండా చాలామంది ఈ వీడియో చూసి వారి అభిప్రాయాలను కామెంట్లలో వ్యక్తం చేస్తూ వస్తున్నారు. గోమాత అంటే కేవలం దైవం మాత్రమే కాదు.. కమ్మని అమ్మ ప్రేమకు నిదర్శనం అని ఒకరు కామెంట్ చేయగా.. ఇక మరికొంతమంది ఈ దృశ్యం చూశాక మనసు చాలా ప్రశాంతంగా అనిపించిందని.. మూగ జీవాల ప్రేమ ఎంతో స్వచ్ఛమైన దంటు కామెంట్లు చేస్తూ వస్తున్నారు.. ఏది ఏమైనా ఉయ్యాల ఊపుతున్న ఆవుకి సంబంధించిన వీడియో మాత్రం సోషల్ మీడియాను ఊపేస్తోంది..
Also Read: నాగమణికి కాపలాగా రెండు భారీ కింగ్ కోబ్రాలు.. వీడియో వైరల్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్.. - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..
Viral Video: ఒకవైపు కాలుతున్న చితి.. పక్కనే కూర్చుని రమ్మీ ఆడుతున్న యువకులు.. వీడియో!
Hyderabad, Telangana:Burning Pyre Rummy Game Viral Video Watch: సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి నిత్యం ఏదో ఒక విచిత్రమైన షాకింగ్ వీడియో నెట్టింట ఊహించని స్థాయిలో హల్చల్ చేస్తూనే ఉంటుంది. కొన్ని వీడియోలు నవ్వు పుట్టిస్తుంటే.. మరికొన్ని ఆశ్చర్యం కలిగిస్తూ ఉన్నాయి. కానీ తాజాగా వైరల్ అవుతున్న ఒక వీడియో మాత్రం సోషల్ మీడియా వినియోగదారులను ఊహించని స్థాయిలో దిగ్భ్రాంతికి గురిచేస్తుంది. చావుపట్ల కనీసం గౌరవం లేకుండా, ఏమాత్రం భయం భక్తి లేకుండా కొంతమంది యువకులు చేసిన పనికి అందరూ ఆశ్చర్యపోతూ ఉన్నారు. అసలు ఏం జరిగి ఉంటుంది? తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఏంటి? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.
శవం కాలుతున్నా.. డోంట్ కేర్..
వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక హృదయ విదారక.. అదే సమయంలో విచిత్రమైన దృశ్యం కనిపిస్తూ ఉండడం మీరు చూడొచ్చు. ఒకవైపు స్మశాన వాటికలో చితిపై ఒక శవం కాలుతుంది. సాధారణంగా ఇలాంటి చోట నిశ్శబ్దంతో పాటు బాధ ఒక రకమైన భయానక వాతావరణముంటుంది.. కానీ అక్కడ ఉన్న కొందరు యువకులకు మాత్రం అవేమి పట్టనట్లుగా ప్రవర్తించారు. చితి పక్కనే కొంతమంది యువకులు కూర్చుని చాలా ప్రశాంతంగా రమ్మీ ఆడుతూ కనిపించారు..
భయం లేదు.. బాధ లేదు..
పక్కనే మంటలు ఎగసిపడుతూ ఒక మృతదేహం కాలిపోతున్నప్పటికీ.. ఆ యువకులు ఏమాత్రం చలించలేదు.. వారి ముఖాల్లో ఎలాంటి భయం కానీ.. బాధ కానీ కనిపించలేదు. తమ చుట్టూ ఏం జరుగుతుందననే.. దానితో సంబంధం లేకుండా.. ఆట గెలవడమే లక్ష్యంగా.. కార్డులు మొక్కలు పంచుకుంటూ రమ్మీ గేమ్ ఆడుతుండడం ఈ వీడియోలో మీరు స్పష్టంగా చూడొచ్చు. ఈ వీడియోను ఎవరు ఎక్కడ తీశారో కానీ.. సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది కాస్త ఇప్పుడు వైరల్ గా మారింది.
Also Read: నాగమణికి కాపలాగా రెండు భారీ కింగ్ కోబ్రాలు.. వీడియో వైరల్..
ఈ వీడియో సోషల్ మీడియా అన్ని ప్లాట్ఫారమ్లలో విపరీతంగా షేర్ అవుతోంది. దీనిపై చాలామంది సోషల్ మీడియా వినియోగదారులు రకరకాలుగా స్పందిస్తూ వస్తున్నారు.. కలికాలం అంటే ఇదేనేమో.. మనుషుల్లో మానవత్వంతో పాటు చావుపట్ల భయం పూర్తిగా పోయాయి.. అని కొందరు కామెంట్స్ చేస్తుంటే.. మరికొంతమందైతే వీరి మానసికస్థితి ఏ స్థాయికి చేరిందో చూడండి.. స్మశానాన్ని కూడా వదలట్లేదు అంటూ కొంతమంది కామెంట్లలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. చితి పక్కన కూర్చుని రమ్మీ ఆడటానికి ఎంత గుండె ధైర్యం కావాలి బాబోయ్.. అంటూ మరికొంతమంది షాక్ అవుతూ కామెంట్లు పెడుతున్నారు..
Also Read: నాగమణికి కాపలాగా రెండు భారీ కింగ్ కోబ్రాలు.. వీడియో వైరల్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్.. - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..Twitter, Facebook
Allu Arjun Stampede Case: అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు నోటీసులు..సోమవారం కోర్టుకు రావాల్సిందే!
Hyderabad, Telangana:Allu Arjun Stampede Case News: హైదరాబాదులోని సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించిన ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. రాబోయే సోమవారం నాడు కోర్టు ముందు వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని న్యాయస్థానం ఆయనను ఆదేశించింది.ఈ ఘోర ప్రమాదానికి సంబంధించి చిక్కడపల్లి పోలీసులు ఇప్పటికే 23 మందిని నిందితులుగా చేర్చుతూ కోర్టులో ఛార్జ్షీటు దాఖలు చేశారు. వీరిలో 19 మంది నిందితులకు నాంపల్లి కోర్టు తాజాగా సమన్లు జారీ చేసింది.Woman Attack Video: రెవెన్యూ అధికారిపై దాడి చేసిన మహిళ..నడిరోడ్డుపై చొక్కా గల్లా పట్టి లాగేసింది!
Turkayamjal, Hayathnagar_Khalsa, Telangana:Allu Arjun: పుష్ప 2 సినిమా వివాదంపై గ్యాగ్ ఆర్డర్.. ఊహాజనిత వార్తలు ప్రచారం చేయోద్దని హైదరాబాద్ సివిల్ కోర్టు ఆదేశాలు.!.
Hyderabad, Telangana:Hyderabad civil court issued gag orders on allu arjun pushpa 2 movie controversy: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు నాంపల్లి హైకోర్టు ఊహించని షాక్ ఇచ్చింది. గతంలో పుష్ప 2 మూవీ ప్రీరిలీజ్ వేళ అశోక్ నగర్ లోని సంధ్య థియేటర్ వద్ద చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటనలో తమ ఎదుట హజరు కావాలని సమన్లు జారీ చేసింది. 2024 డిసెంబర్ 4న 'పుష్ప 2' సినిమా బెనిఫిట్ షో నేపథ్యంలో సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటలో రేవతి అనే మహిళఅభిమాని చనిపోగా, ఆమె కుమారుడు శ్రీతేజ్ ఇప్పటికి చికిత్స తీసుకుంటున్నాడు. ఈ క్రమంలో పోలీసులు మొత్తంగా 23 మందిపై గతంలో చార్జ్ షీట్ దాఖలు చేశారు.
తాజాగా.. ఈ కేసులో నాంపల్లి కోర్టు తమ ఎదుట హజరు కావాలని 19 మందికి సమన్లు జారీ చేసింది. దీనిలో ఏ 11గా ఉన్న అల్లు అర్లును కూడా నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ నెల 22న (సోమవారం) వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. దీంతో ఈ పరిణామం అల్లుఅర్జున్ కు బిగ్ షాక్ గా మారింది. మరోవైపు హైదరాబాద్ సిటి సివిల్ కోర్టు పుష్ప 2 వివాదంకు సంబంధించి గ్యాగ్ ఆర్డర్ విధించింది.
పుష్ప 2 సినిమా చిత్ర యూనిట్ తో పాటు ఎవరిపై కూడా ఊహాజనిత వార్తలు వేయవద్దంటూ కోర్టు ఆదేశించింది.
ఊహాజనిత వార్త కథనాలతో పాటు, టీవీ ఛానెల్స్ లలో డిబేట్లు పెట్టవద్దంటూ కోర్టు స్పష్టం చేసింది. సంధ్య థియేటర్కు సంబంధించిన O.S. No.216 of 2026 లో I.A. No.369 of 2026 కేసులో, హైదరాబాద్ నగర సివిల్ కోర్టు గౌరవ వేకేషన్ సివిల్ జడ్జి-కమ్-XXV అదనపు చీఫ్ జడ్జి గారు 04 జూన్ 2026 తేదీన మధ్యంతర (Ad-Interim Ex Parte Injunction) ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ ఉత్తర్వుల ప్రకారం, పై కేసుకు సంబంధించిన అంశాలపై కేసు విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో.. వాస్తవ నిర్ధారణకు ముందుగానే ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ఎటువంటి ఊహాగానాలు, అసత్య ప్రచారాలు, ఆధారరహిత ఆరోపణలు, వాస్తవాలకు విరుద్ధమైన చర్చలు, డిబేట్లు, వార్తా కథనాలు లేదా సోషల్ మీడియా పోస్టులు ప్రచురించడం లేదా ప్రసారం చేయరాదని కోర్టు ఆదేశించింది.
ముఖ్యంగా.. సంబంధిత మీడియా సంస్థలు, డిజిటల్ ప్లాట్ఫారమ్లు, సోషల్ మీడియా వేదికలు, ప్రజలు గౌరవ న్యాయస్థానం జారీ చేసిన ఈ ఉత్తర్వులను గౌరవించి, కేసుకు సంబంధించిన నిర్ధారణ కాని సమాచారాన్ని ప్రచారం చేయకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోర్టు ఆదేశించింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Rajendranagar: రీల్స్ పిచ్చి పీక్స్.. కోబ్రా పిల్లతో స్టంట్లు.. యువకుడు మృతి!
Hyderabad, Telangana:Rajendranagar Snake Bite Video: సోషల్ మీడియా పిచ్చి.. రీల్స్ మోజు నేటి తరం యువత ప్రాణాల మీదకు తెస్తోంది.. లైకులు, కామెంట్ల కోసం ప్రాణాలను సైతం పణంగా పెడుతూ చేసిన ఒక పిచ్చి ప్రయత్రం ఒక యువకుడి నిండు ప్రాణాన్ని బలితీసుకుంది.. రీల్స్ కోసం ఏకంగా కింగ్ కోబ్రా పిల్లతో సాహసాలు చేయబోయిన ఓ యువకుడు, అది కాటేయడంతో కేవలం మూడు గంటల సమయంలో ప్రాణాలు కోల్పోయిన విషాదకర సంఘటన రాజేంద్రనగర్ పరిధిలో కలకలం రేపింది.
రీల్స్ పిచ్చి..
స్థానికులతో పాటు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజేంద్రనగర్ పిల్లర్ నెంబర్ 248 పరిసర ప్రాంతంలో ఓ యువకుడు సోషల్ మీడియాలో రీల్స్ చేసి అప్లోడ్ చేయాలనుకున్నాడు. అందుకోసం స్థానికంగా కనిపించిన ఒక చిన్న కోబ్రా పిల్లను పట్టుకున్నాడు. అది చిన్న పిల్ల కదా.. ఏమౌతుందిలే అనే నిర్లక్ష్యంతో, చేతుల్లో పట్టుకుని రకరకాల విన్యాసాలు చేస్తూ వీడియోలు రికార్డ్ చేయించుకున్నాడు..
మూడు గంటల్లోనే..
పాముతో ఆటలాడుతున్న సమయంలో అది ఒక్కసారిగా యువకుడిపై దాడి చేసి కాటు వేసింది. చిన్న పామే కదా అని మొదట లైట్ తీసుకున్నప్పటికీ...కొద్దిసేపటికే విషం శరీరం మొత్తం పాకడం మొదలైంది. తీవ్ర అస్వస్థతకు గురైన యువకుడిని గమనించిన స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే, కోబ్రా విషం అత్యంత ప్రమాదకరమైనది కావడంతో.. కాటు వేసిన కేవలం మూడు గంటల సమయంలోనే ఆ యువకుడు చికిత్స పొందుతూ చనిపోయాడు.. ఈ వార్త తెలియడంతో యువకుడి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
Also Read: Video Viral: సాయం ముసుగులో అరాచకం.. యువతి ప్రైవేటు పార్ట్ మీద చెయ్యి వేసి మరీ.!. వీడియోపై దుమారం..
స్థానికుల ఆందోళన..
ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో యువతకు రీల్స్ పిచ్చి ముదిరిపోతోందని.. నాలుగు లైకుల కోసం, వ్యూస్ కోసం బిల్డింగ్ల పైనుంచి దూకడం, బైక్ స్టంట్లు చేయడం, ఇప్పుడు ఇలా విషసర్పాలతో ఆటలాడటం చూస్తుంటే భయమేస్తోందఅని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. వన్యప్రాణులు, విషసర్పాలతో ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రయోగాలు చేయోద్దని.. ప్రాణాలతో చెలగాటం ఆడవద్దని పోలీసులతో పాటు అటవీ శాఖ అధికారులు గట్టిగా హెచ్చరిస్తూ వస్తున్నారు.
Also Read: Video Viral: సాయం ముసుగులో అరాచకం.. యువతి ప్రైవేటు పార్ట్ మీద చెయ్యి వేసి మరీ.!. వీడియోపై దుమారం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్.. - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..Twitter, Facebook
Korutla: కోరుట్లలో అరుదైన కాటిల్ ఈగ్రేట్ పక్షుల.. ఎందుకొచ్చాయో తెలుసా?
Jagtial, Telangana:Korutla Mini Tank Bund News: జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని మినీ ట్యాంక్ బండ్ ప్రాంతం ప్రస్తుతం పక్షుల కిలకిలరావాలతో, అద్భుతమైన ప్రకృతి దృశ్యాలతో కళకళలాడి పోతోంది.. కంటికి ఇంపుగా, చూడముచ్చటైన రూపురేఖలతో సందర్శకులను ఆకట్టుకుంటున్న కాటిల్ ఈగ్రేట్ (Cattle Egret) పక్షులు ఇప్పుడు పట్టణ వాసులకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.. అసలు ఈ పక్షులు ఎక్కడి నుంచి వచ్చాయి. వీటి ప్రాముఖ్యత పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
సంతానోత్పత్తి కోసమే ఈ రాక..
సాధారణంగా వివిధ ప్రాంతాలకు వలస వెళ్లే ఈ కాటిల్ ఈగ్రేట్ పక్షులు.. ప్రస్తుతం కోరుట్లలోని మినీ ట్యాంక్ బండ్ సమీపంలో ఉన్న తుమ్మ చెట్లపై ప్రత్యేకమైన స్థావరాలను ఏర్పాటు చేసుకున్నాయి.. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఇవి కేవలం విశ్రాంతి కోసమే కాకుండా.. సంతానోత్పత్తి కోసం ఇక్కడికి చేరుకున్నట్లు సమాచారం.. చెట్లపై గుంపులు గుంపులుగా చేరుతూ.. గూళ్లు కట్టుకుని, గుడ్లు పొదుగుతూ పక్షులు చేస్తున్న సందడి ప్రకృతి ప్రేమికులకు కనువిందు చేస్తూ వస్తోంది..
ఆకర్షణీయమైన రంగులో..
ఈ పక్షుల ప్రత్యేకత వాటి రంగులోనే ఉంటుంది.. సాధారణ కొంగల కంటే ఇవి ఎంతో భిన్నంగా.. వీటి తల, మెడతో పాటు వీపు భాగం నారింజ, గోధుమ రంగుల సమ్మేళనంతో మెరిసిపోతూ చాలా ఆకర్షణీయంగా నిలుస్తూ ఉంటాయి.. పట్టణం మధ్యలో కూడా ఇటువంటి వలస పక్షులు కోరుట్లను తమ ఆవాసంగా ఎంచుకోవడం పర్యావరణ సమతుల్యతకు.. ఇక్కడి మినీ ట్యాంక్ బండ్ పరిసరాలు పక్షుల జీవనానికి అనుకూలంగా ఉన్నాయనడానికి నిదర్శనమని పర్యావరణవేత్తలు అభిప్రాయ పడుతూ వస్తున్నారు..
Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!
ప్రకృతి ప్రేమికుల్లో ఆనందం..
రోజూ సాయంత్రం సమయంలో మినీ ట్యాంక్ బండ్ దగ్గరకు వచ్చే స్థానికులు.. చెట్లపై వాలి ఉన్న ఈ పక్షులను చూసి ఆశ్చర్యపోతున్నట్లు తెలుస్తోంది.. చాలా మంది వీటిని ఫోటోలు తీసి సోషల్ మీడియాల్లో కూడా పోస్ట్ చేస్తున్నారు. అయితే, పక్షుల గూళ్లకు, వాటి సంతానోత్పత్తికి ఎటువంటి ఆటంకం కలగకుండా చూడాలని.. ఈ అరుదైన పక్షులను రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని స్థానిక ప్రకృతి ప్రేమికులు కోరుతున్నారు.
Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
Honor నుంచి మైండ్ బ్లోయింగ్ ఫోన్.. ఏకంగా 7,700mAh బ్యాటరీ, ప్రత్యేక AI బటన్..
Hyderabad, Telangana:Honor 600 Smart 5G: ప్రముఖ చైనీస్ స్మార్ట్ఫోన్ కంపెనీ Honor స్మార్ట్ఫోన్ ప్రియులకు అద్భుతమైన శుభవార్తను చెప్పెందుకు సిద్ధమైంది. భారీ బ్యాటరీ సామర్థ్యంతో సరికొత్త 5G స్మార్ట్ఫోన్ను లాంచ్ చేసేందుకు రెడీ అయ్యింది. దీనిని కంపెనీ Honor 600 Smart 5G పేరుతో సరికొత్త మోడల్ను కంపెనీ త్వరలోనే మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకు రాబోతోంది. ఇప్పటికే ఫ్రాన్స్కు చెందిన అధికారిక హానర్ వెబ్సైట్లో ఈ ఫోన్ 'కమింగ్ సూన్' (Coming Soon) ట్యాగ్తో లిస్ట్ అవ్వడంతో దీనిపై భారీ అంచనాలు పెరిగాయి..
ఛార్జింగ్ టెన్షన్కు చెక్..
ఈ Honor 600 Smart 5G స్మార్ట్ఫోన్ అతిపెద్ద హైలైట్ దీని బ్యాటరీ సామర్థ్యం. సాధారణంగా స్మార్ట్ఫోన్లలో 5000mAh లేదా 6000mAh బ్యాటరీలను చూస్తుంటాం.. కానీ Honor ఒక అడుగు ముందుకు వేసి ఇందులో ఏకంగా 7,700mAh భారీ బ్యాటరీని అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు 45W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా లభించడం విశేషం. ఒక్కసారి ఛార్జ్ చేస్తే రోజులకు రోజులు బ్యాటరీ బ్యాకప్ ఇచ్చేలా ఈ ఫోన్ను డిజైన్ చేసిన్నట్లు తెలుస్తోంది..
ప్రత్యేక AI బటన్..
టెక్నాలజీ పరంగా చూస్తే.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టూల్స్ను వినియోగదారులు సులభంగా యాక్సెస్ చేయడానికి వీలుగా ఈ స్మార్ట్ఫోన్లో ఒక ప్రత్యేకమైన AI బటన్ను అందించిన్నట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్ఫోన్ సరికొత్త ఆండ్రాయిడ్ 16 ఆధారిత మ్యాజిక్ ఓఎస్ 10.0 (MagicOS 10.0) ఆపరేటింగ్ సిస్టమ్పై రన్ అవుతుంది.. అంతేకాకుండా, ఇందులో శక్తివంతమైన స్నాప్డ్రాగన్ 4 జెన్ 4 (Snapdragon 4 Gen 4) ప్రాసెసర్ను వినియోగించిన్నట్లు సమాచారం..
డిస్ప్లే, కెమెరా..
Honor 600 Smart 5G మొబైల్కి సంబంధించని ఫీచర్స్ వివరాల్లోకి వెళితే.. ఈ ఫోన్ 1,020 నిట్స్ పీక్ బ్రైట్నెస్తో 6.87 ఇంచుల HD+ (1592 × 720 పిక్సెల్స్) LCD డిస్ప్లేను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా వెనక భాగంలో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను అందుబాటులోకి తీసుకు వచ్చారు. ఇందులో అద్భుతమైన సౌండ్ ఎక్స్పీరియన్స్ కోసం డ్యూయల్ స్టీరియో స్పీకర్లను అందించారు.
ఈ స్మార్ట్ఫోన్ ప్రస్తుతం వెబ్సైట్లో వైట్తో పాటు బ్లాక్ కలర్ ఆప్షన్లలో అందుబాటులోకి వచ్చింది. బడ్జెట్ ధరలోనే అదిరిపోయే ఫీచర్లు, భారీ బ్యాటరీ బ్యాకప్తో రాబోతున్న ఈ హానర్ 600 స్మార్ట్ 5G ఫోన్ మార్కెట్లో వన్ ప్లస్, శామ్సంగ్, వివో వంటి బ్రాండ్లకు గట్టి పోటీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. త్వరలోనే దీని ధరతో పాటు లాంచ్ తేదీల అధికారిక వివరాలు వెల్లడించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
