icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

Foxconn Pregnant Incident: ఆఫీస్ టాయిలెట్‌లో ప్రసవించిన టీనేజ్ యువతి..వెంటనే బిడ్డ గొంతు కోసి చంపేసింది! కటకటాల్లోకి కసాయి తల్లి!

Chapparadahalli, Karnataka:

Foxconn Teenage Pregnancy Incident: మన సమాజంలో చెడ్డ తండ్రి ఉండవచ్చు కానీ చెడ్డ తల్లి ఉండదు అనే నానుడి ఉండేది. కానీ ఇప్పుడు అది పూర్తిగా మార్చేసే పరిస్థితి వచ్చింది. అందుకు తగ్గట్టుగా ప్రస్తుతం కర్ణాటకలోని బెంగళూరులో ఓ దుర్ఘటన ఉదాహరణగా మారింది. ఓ టీనేజ్ యువతి తాను పనిచేసే కంపెనీ టాయిలెట్‌లో ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ప్రసవించిన వెంటనే ముక్కపచ్చలారని ఆ బిడ్డను గొంతు కోసి చంపేసింది ఆ మహాతల్లి. ఇంతకీ ఆ సంఘటన ఏంటి? పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

కర్ణాటకలోని బెంగళూరులో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఫాక్స్‌కాన్ ఫ్యాక్టరీలో ఉద్యోగినిగా పనిచేస్తున్న ఓ టీనేజ్ యువతి టాయిలెట్‌లో బిడ్డకు జన్మనిచ్చింది. టాయిలెట్‌లో ప్రసవించి, ఆ తర్వాత వెంటనే అప్పుడే పుట్టిన శిశువును చంపేసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ప్రసిద్ధ ఆపిల్ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ అయిన ఫాక్స్‌కాన్.. బెంగళూరులోని దేవనహళ్లి యూనిట్‌లో ఈ దుర్ఘటన జరగడం ఇప్పుడు వార్తల్లో నిలిచింది.

ఫాక్స్ కాన్ ఉద్యోగుల సమాచారం ప్రకారం.. నిందితురాలు రేణుక తన షిఫ్ట్‌లో పనిచేస్తుండగా మధ్యలో టాయిలెట్‌కు వెళ్లినట్లు సమాచారం. ప్రసవం ఆకస్మికంగా జరిగిందని అధికారులు అనుమానిస్తున్నారు. పోలీసు నివేదికల ప్రకారం.. ప్రసవించిన తర్వాత ఆ టీనేజర్ పదునైన వస్తువుతో శిశువు గొంతు కోసి, మృతదేహాన్ని ఒక సంచిలో పెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. అదే రోజు ఉదయం మరో ఉద్యోగి రెస్ట్‌రూమ్‌లోకి ప్రవేశించి, మృతదేహాన్ని చూసి, వెంటనే ఫ్యాక్టరీ సెక్యూరిటీ, స్థానిక పోలీసులకు సమాచారం అందించడంతో ఈ సంఘటన బయట పడింది.

ఈ దారుణానికి పాల్పడిన నిందితురాల్ని పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు ప్రారంభించారు. ఆ యువతి తన గర్భాన్ని దాచిపెట్టిందా, ఆమె పరిస్థితి గురించి మరెవరికైనా తెలుసా అనే విషయాలతో సహా, అధికారులు సంఘటనల క్రమాన్ని విచారిస్తున్నారు. దర్యాప్తు కొనసాగుతున్న కొద్దీ మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని జాతీయ మీడియా పేర్కొంది. దర్యాప్తులో తేలిన విషయాల ఆధారంగా తగిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు తెలిపారు. నిందితుడు చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద తీవ్రమైన అభియోగాలను ఎదుర్కొనే అవకాశం ఉంది.

Also Read: Moving OYO Scandal: 108 అంబులెన్స్‌లో రొమాన్స్..ఒకే అమ్మాయితో ఇద్దరు అబ్బాయిలు అడ్డంగా దొరికిపోయారు! లైవ్‌లో వీడియో రికార్డు!

Also Read: Composite Salary Account: ఉద్యోగులకు ప్రభుత్వం సూపర్ గుడ్‌న్యూస్..ఉచితంగా రూ.కోటిన్నర..సులభంగా లోన్స్, క్యాష్‌బ్యాక్‌లు!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Composite Salary Account: ఉద్యోగులకు ప్రభుత్వం సూపర్ గుడ్‌న్యూస్..ఉచితంగా రూ.కోటిన్నర..సులభంగా లోన్స్, క్యాష్‌బ్యాక్‌లు!

Hyderabad, Telangana:

Composite Salary Account Benefits: ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం సూపర్ గుడ్‌న్యూస్ అందించింది. ఇటీవలే డీఏ ప్రకటించిన నేపథ్యంలో ఇప్పుడు మరో శుభవార్త ఉద్యోగుల సంతోషాన్ని రెట్టింపు చేసింది. ఆర్థిక భద్రతతో పాటు సంక్షేమాన్ని మరింత పటిష్టం చేసే దిశగా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కాంపోజిట్ శాలరీ అకౌంట్ ప్యాకేజీ అనే సదుపాయాన్ని తీసుకొచ్చింది. ఈ ఏడాది ప్రారంభంలో అనగా 2026లో ఈ పథకాన్ని అధికారికంగా బలోపేతం చేశారు. ఇది సాధారణ బ్యాంకింగ్ సేవలతో ఇతర ఇన్సూరెన్స్, లోన్స్‌తో పాటు ఇతర ఆర్థిక ప్రయోజనాలను ఉద్యోగులకు ఒకే దగ్గర అందించే విధంగా ఈ ప్యాకేజీని రెడీ చేశారు. 

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమంతో పాటు ఆర్థిక భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఈ కాంపోజిట్ శాలరీ అకౌంట్ ప్యాకేజ్ సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. 2026 జనవరి 14న ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రారంభించింది. ఇందులో సాధారణ బ్యాంకింగ్ సేవలతో పాటు ఇన్సూరెన్స్, లోన్స్ వంటి వాటితో పాటు అనేక సదుపాయలు ఒకే దగ్గర అందుబాటులో ఉంచేలా ఈ ప్రక్రియ ఉండనుంది. కేంద్రం ప్రవేశపెట్టిన ఈ పథకం అన్ని విభాగాల ఉద్యోగులకు (A, B, C, D) పారామిలటరీ, మిలటరీతో పాటు ఇతర భద్రతా దళాల సిబ్బందికి ఇది వర్తించనుంది. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోనూ ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి.

ఈ కొత్త పథకంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అనేక ప్రయోజనాలు చేకూరుతాయి. బ్యాంకింగ్ సౌకర్యాలలో జీరో బ్యాలెన్స్ శాలరీ ఖాతాతో పాటు RTGS, NEFT, IMPS, UPI లావాదేవీలపై ఎలాంటి అదనపు రుసుములు వసూలు చేయరు. అలాగే ఉచిత మల్టీ-సిటీ చెక్ బుక్‌లు, లాకర్ అద్దె, డిమాండ్ డ్రాఫ్ట్‌లపై ప్రత్యేక తగ్గింపులు అందుబాటులో ఉంటాయి. అలాగే మీరు హౌస్, ఎడ్యుకేషన్, వెహికల్, పర్సనల్ వంటి ఏవైనా లోన్స్ తీసుకున్నా.. వాటిపై అతి తక్కువ వడ్డీతో అందుబాటులో ఉంటుంది. వీటితో పాటు లోన్ తీసుకున్న వారికి ప్రాసెసింగ్ ఛార్జీల నుంచి పూర్తిగా మినహాయింపు లభిస్తుంది. కొన్ని సందర్భాల్లో ప్రాసెసింగ్ ఫీజుతో పాటు ఇతర ఛార్జీలపై భారీగా తగ్గింపు ఇచ్చే అవకాశం ఉంది.

ఈ పథకంలో నమోదైన కేంద్ర ప్రభుత్వం ఉద్యోగికి రూ.1.5 కోట్ల వరకు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ లభిస్తోంది. దీంతో పాటు రూ.2 కోట్ల వరకు విమాన యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కూడా లభిస్తుంది. ఉద్యోగుల శాశ్వత, పాక్షిక వైకల్యంపై రూ.1.5 కోట్ల బీమా.. అలాగే టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ కింద రూ.20 లక్షల బీమా వరకు పొందవచ్చు. దీంతో పాటు ఇన్సూరెన్స్‌లపై అదనపు టాప్-అప్ సదుపాయంతో కుటుంబం మొత్తానికి సమగ్ర ఆరోగ్య బీమా సౌకర్యం పొందవచ్చు. డెబిట్ , క్రెడిట్ కార్డులపై మెరుగైన రివార్డ్స్, ఎయిర్‌పోర్ట్ లౌంజ్, క్యాష్‌బ్యాక్ సౌకర్యాలు పొందవచ్చు.

అయితే కేంద్రం ప్రవేశపెట్టిన ఈ బ్యాంక్-లింక్డ్ ప్యాకేజీ ప్రస్తుతం అమలులో ఉన్న CGEGISను భర్తీ చేయదని సమాచారం. కానీ, ఇదో అదనపు ప్రయోజనంగా ఉద్యోగులకు కలిసొస్తుందని అంటున్నారు. అటు ప్రభుత్వం ఇచ్చే ప్రయోజనాలతో పాటు ఇటు బ్యాంక్ ఇచ్చే బీమా కవరేజీని కూడా పొందడం లాభంగా మారుతుంది. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమం కోసం ఈ సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టింది.

Also Read: Moving OYO Scandal: 108 అంబులెన్స్‌లో రొమాన్స్..ఒకే అమ్మాయితో ఇద్దరు అబ్బాయిలు అడ్డంగా దొరికిపోయారు! లైవ్‌లో వీడియో రికార్డు!

Also Read: Petrol Price Hike: పెట్రోల్, డీజిల్‌ ధరలపై రూ.25 నుంచి రూ.28 పెంపు! కేంద్ర ప్రభుత్వం క్లారిటీ..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Moving OYO Scandal: 108 అంబులెన్స్‌లో రొమాన్స్..ఒకే అమ్మాయితో ఇద్దరు అబ్బాయిలు అడ్డంగా దొరికిపోయారు! లైవ్‌లో వీడియో రికార్డు!

Chhatarpur, Madhya Pradesh:

Moving OYO Scandal Video in MP: ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన 108 అంబులెన్స్‌లో లవర్స్ లైంగిక కార్యాకలాపాలు చేస్తున్నారు. ఒకే అంబులెన్స్‌లో ఒక అమ్మాయి, ఇద్దరు అబ్బాయిలు అనైతిక కార్యకలాపాలు పాల్పడడంపై ప్రజలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రజారోగ్యానికి బాసటగా నిలిచిన 108 అంబులెన్స్‌లో హోటల్‌గా మార్చుకొని రొమాన్స్ చేస్తూ పట్టుబడ్డారు. 

మధ్యప్రదేశ్‌లోని ఛతర్‌పూర్ జిల్లాలో ఓ విచిత్ర ఘటన జరిగింది. ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడాల్సిన అంబులెన్స్, యువతీ యువకులకు లైంగిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. ఆ రాష్ట్రంలోని ఓ 108 అంబులెన్స్ లవర్స్‌కు 'కదులుతున్న ఓయో' లాగా మారింది. అంబులెన్స్‌లో అనైతిక కార్యకలాపాలకు పాల్పడడం పట్ల ఇప్పుడు ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

వైరల్ అయిన వీడియో ప్రకారం.. అంబులెన్స్ లోపల అనుమానాస్పద కార్యకలాపాలు జరగడం స్థానికులు గమనించారు. ఆ వెంటనే అంబులెన్స్‌ను వెంబడించ సాగారు. సుమారు 5 కిలోమీటర్ల దూరం ఆ అంబులెన్స్‌ను వెంబడించిన తర్వాత చివరికి అంబులెన్స్‌ను ఆపారు. ఈ సమయంలో, వాహనం లోపల ఒక యువతి, ఇద్దరు యువకులు కనిపించారు.

అంబులెన్స్‌ను ఆపినప్పుడు అందులో రోగి గానీ, అత్యవసర పరిస్థితికి సంబంధించిన ఆనవాళ్లు గానీ లేవు. పైగా, ఆ అంబులెన్స్‌ను లవర్స్‌కు ఓయో హోటల్ స్పాట్‌గా వాడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీనిపై స్థానికులు ప్రశ్నించగా.. లోపల ఉన్నవారు తాము 'కుటుంబ సభ్యులం' అని చెప్పి తప్పించుకోవడానికి ప్రయత్నించారు. కానీ, ముఖం కప్పుకుని కూర్చున్న ఆ యువతి దృశ్యాలు, ప్రజల ఆగ్రహాన్ని చూపిస్తున్న వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

అత్యవసర పరిస్థితుల్లో ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన ప్రభుత్వ అంబులెన్స్ సేవను దుర్వినియోగం చేయడంపై ప్రజాగ్రహం పెల్లుబికింది. పోలీసులు ఈ ఘటనపై ప్రాథమిక దర్యాప్తు ప్రారంభించి, అధికారిక నివేదిక కోసం ఎదురుచూస్తున్నారు. ఈ చర్య ఇప్పుడు మొత్తం వైద్య సేవా వ్యవస్థ విశ్వసనీయతపై ప్రశ్నలను లేవనెత్తింది.

Also Read: Petrol Price Hike: పెట్రోల్, డీజిల్‌ ధరలపై రూ.25 నుంచి రూ.28 పెంపు! కేంద్ర ప్రభుత్వం క్లారిటీ..

Also REad; MI Vs CSK Preview: ముంబై వర్సెస్ చెన్నై..ధోనీ ఆడుతున్నాడా లేదా? ఈరోజు తుదిజట్టులో ధోనీ, రోహిత్ ఉంటారా?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement

OnePlus మాస్టర్‌ప్లాన్.. 200MP కెమెరా, 9,000mAh బ్యాటరీతో OnePlus 16 లీక్!

Hyderabad, Telangana:

OnePlus 16 Leak: స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వన్‌ప్లస్ తమ కొత్త ఫ్లాగ్‌షిప్ మోడల్‌ను లాంచ్‌ చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. దీనిని కంపెనీ వన్‌ప్లస్ 16 (OnePlus 16) స్మార్ట్‌ఫోన్‌ పేరుతో అందుబాటులోకి తీసుకు రాబోతోంది. ఇప్పటి వరకు ఏ స్మార్ట్‌ఫోన్‌లోనూ చూడని అత్యంత శక్తివంతమైన ఫీచర్లు ఈ మొబైల్‌లో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా గేమింగ్ ప్రియులతో పాటు టెక్ ప్రియులను ఆకట్టుకునేలా ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఎంతో శక్తివంతమైన ప్రాసెసర్‌తో పాటు బ్యాటరీ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అయితే, అధికారిక ప్రకటనకు ముందే ఈ స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్స్‌ ఇటీవలే లీక్‌ అయ్యాయి. అవేంటో వాటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఈ వన్‌ప్లస్ 16 స్మార్ట్‌ఫోన్‌లో అద్భుతమైన డిస్ల్పే ఉండబోతున్నట్లు లీక్‌ అయిన వివరాలు చెబుతున్నాయి. ఇందులో 6.78 అంగుళాల కస్టమ్ BOE LTPO ప్యానెల్‌ను వినియోగించిన్నట్లు తెలుస్తోంది. అలాగే ఇది ఏకంగా 240Hz రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేసే అవకాశం ఉన్నట్లు సంచారం.. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న ఫ్లాగ్‌షిప్‌ మొబైల్స్‌ కేవలం  120Hz, 144Hzకే పరిమితమవ్వగా.. వన్‌ప్లస్ త్వరలో విడుదల చేయబోయే స్మార్ట్‌ఫోన్‌లో ఏకంగా 240Hz ఉండడం విశేషం.. దీనివల్ల ఫోన్ వాడే క్రమంలో గేమింగ్ చేసే సమయంలో మంచి స్మూతింగ్‌ను అందిస్తుంది. 

ఈ OnePlus 16 స్మార్ట్‌ఫోన్‌లో పెర్ఫార్మెన్స్ విషయంలోనూ వన్‌ప్లస్ ఎక్కడా తగ్గడం లేనట్లు తెలుస్తోంది. ఇందులో కంపెనీ క్వాల్‌కామ్ నుంచి వస్తున్న అత్యంత శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 6 ప్రో (Snapdragon 8 Elite Gen 6 Pro) చిప్‌సెట్‌ ప్రాసెసర్‌ వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో మల్టీటాస్కింగ్‌ చేయడంతో పాటు భారీ యాప్‌లను కూడా ఎంతో సులభంగా వినియోగించవచ్చు. ఇక ఈ స్మార్ట్‌ఫోన్‌ వెనక భాగంలో అద్భుతమైన కెమెరా సెటప్‌ను కూడా కలిగి ఉన్నట్లు తెలుస్తోంది.

వన్‌ప్లస్ 16లో అద్భుతమైన కెమెరా సెటప్‌ను కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో వెనక భాగంలో 200 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో పాటు, 200 మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్‌ కెమెరాలతో అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా ఇందులో అదనంగా మరో కెమెరా కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ఏకంగా 9,000mAh భారీ బ్యాటరీని కూడా కలిగి ఉన్నట్లు సమాచారం.. దీనికి తోడుగా 100W ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం కూడా లభిస్తోంది. అయితే, దీనిని కంపెనీ అక్టోబర్ నెలలో చైనాలో విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. దీని ధర రూ.60 వేలు ఉండబోతున్నట్లు లీక్‌ అయిన వివరాలు చెబుతున్నాయి. 

Read more: OnePlus Nord 5: అమెజాన్ ధమాకా.. రూ.5,000 లోపే OnePlus Nord 5.. ఈ డీల్ వదులుకోవద్దు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

0
0
Report

Petrol Price Hike: పెట్రోల్, డీజిల్‌ ధరలపై రూ.25 నుంచి రూ.28 పెంపు! కేంద్ర ప్రభుత్వం క్లారిటీ..

Hyderabad, Telangana:

Petrol Price Hike News: దేశవ్యాప్తంగా ప్రస్తుతం 5 రాష్ట్రాల ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఇటీవలే యుద్ధం తాలూకా పెరుగుతున్న చమురు ధరల దృష్ట్యా ఎన్నికలు జరుగుతున్న కారణంగా ధరలు ఏమాత్రం పెంచలేదని కేంద్ర ప్రభుత్వంపై ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ 5 రాష్ట్రాల ఎన్నికలు పూర్తైన తర్వాత దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు రూ.25 మేర పెరుగుతాయని వార్తలు విపరీతంగా సర్కులేట్ అవుతున్నాయి. దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. రిటైల్ ఇంధన ధరలను పెంచేందుకు ఎలాంటి ప్రతిపాదన పరిశీలనలో లేదని పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ సోషల్ మీడియాలో ప్రకటన చేసింది. 

ప్రస్తుతం దేశంలో పశ్చిమ బెంగాల్, అస్సాం, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరుగుతాయన్న వార్తలను కేంద్ర ప్రభుత్వం తోసిపుచ్చింది. "ఫేక్ న్యూస్. పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయని కొన్ని వార్తా కథనాలు వస్తున్నాయి. ప్రభుత్వం వద్ద అలాంటి ప్రతిపాదన ఏదీ పరిశీలనలో లేదని ఇందుమూలంగా స్పష్టం చేస్తున్నాము. దురుద్దేశంతో ప్రజలను పక్కదారి పట్టించేందుకు ఈ పుకార్లు చేస్తున్నారు" అని సదరు మంత్రిత్వ శాఖ ట్వీట్ చేసింది. 

దేశంలోని ఈ కీలక రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు రూ.25-28 వరకు పెరగొచ్చని ఒక బ్రోకరేజ్ నోట్‌ను ప్రస్తావిస్తూ, పలు మీడియా నివేదికలు పేర్కొన్న నేపథ్యంలో ఈ వివరణ వచ్చింది. ఇరాన్ వివాదం నేపథ్యంలో పెరిగిన ప్రపంచ ముడి చమురు ధరల ఒత్తిడి వల్లే దేశంలో ఈ పెంపు ఉండే అవకాశం ఉందని ఆ నివేదికల ద్వారా తెలుస్తోంది.

అయితే పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఈ వాదనను గట్టిగా ఖండించింది. అంతర్జాతీయ మార్కెట్లలో అస్థిరత ఉన్నప్పటికీ, గత నాలుగేళ్లుగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరగని 'ఏకైక దేశం' భారతదేశమేనని అది పేర్కొంది. ప్రపంచ ధరల ఒడిదుడుకుల నుండి వినియోగదారులను కాపాడటానికి భారత ప్రభుత్వం, ప్రభుత్వ రంగ చమురు సంస్థలు అవిశ్రాంతగా చర్యలు తీసుకున్నాయని ఆ ప్రకటన తెలిపింది. భారతదేశంలో రిటైల్ ఇంధన ధరలను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రతిరోజూ సవరిస్తాయి. అయితే, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా ప్రపంచ ముడి చమురు బెంచ్‌మార్క్‌లు తీవ్రంగా హెచ్చుతగ్గులకు లోనైనప్పటికీ, ధరలు చాలా కాలంగా దాదాపుగా మారకుండానే ఉండడం గమనార్హం.

Also Read: Cheapest 7 Seater Cars: బడ్జెట్‌లో 7-సీటర్ కార్లు..కేవలం రూ.5.65 లక్షలకే బ్రాండ్ కారు ఇంటికి తీసుకెళ్లొచ్చు! ఎలాగో చూడండి!

Also Read: Aarav Akshay Kumar Salary: ఆ హీరోకి రూ.2,700 కోట్ల ఆస్తి..అయినా కొడుకు రూ.4,500 జీతానికి పనిచేస్తున్నాడు!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Luxury Cars at Half Price: రూ.14 లక్షలకే మెర్సిడెస్ బెంజ్, రూ.17 లక్షలకే ఆడి క్యూ7.. కళ్లు చెదిరే ఆఫర్లు!

Hyderabad, Telangana:

Second Hand Luxury Cars In Delhi: ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో చాలా మంది సెకండ్‌ హ్యాండ్‌ కార్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా చాలా మంది ఢిల్లీలోని కరోల్‌బాగ్ ప్రాంతం సెకండ్ హ్యాండ్ కార్లకు అడ్డాగా మారింది. ఇక్కడ మల్టీ నేనషన్‌ కార్ల కంపెనీకి చెందిన లగ్జరీ కార్లు కూడా అత్యంత చీప్ ధరలకే లభిస్తున్నాయి. ముఖ్యంగా ఇక్కడ అన్ని కార్లు సగం ధరలకే లభించడం విశేషం.. ఇక్కడ కొన్ని సెకండ్‌ హ్యాండ్‌ కార్ల షోరూమ్స్‌లో ఫార్చ్యూనర్, మెర్సిడెస్, ఆడి వంటి లగ్జరీ కార్లను ఎవరూ ఊహించని తక్కువ ధరలకే విక్రయిస్తూ మార్కెట్‌లో కొత్త సంచలనం సృష్టిస్తున్నారు.

ముఖ్యంగా ఈ మార్కెట్‌లో రూ.20 నుంచి 22 లక్షల వరకు పలికే 2017 మోడల్ టయోటా ఫార్చ్యూనర్ కార్లను కేవలం రూ.16.75 లక్షల నుంచి రూ.18 లక్షల లోపే అందిస్తున్నారు. అయితే, ఇక్కడ కంపెనీ నుంచి నేరుగా భారీ మొత్తంలో వాహనాలను కొనుగోలు చేయడం వలకల ఇంత తక్కువ ధరకు అందిస్తున్నట్లు షోరూమ్స్‌ నిర్వాహకులు చెబుతున్నారు.  ముఖ్యంగా ఇక్కడ SUVలు అత్యంత చీప్‌ ధరలకే అందుబాటులో ఉండడం విశేషం..

ఈ మార్కెట్‌లో కేవలం ఫార్చ్యూనర్ కార్లు మాత్రమే కాకుండా.. ఇతర లగ్జరీ కార్లపై కూడా అద్భుతమైన డిస్కౌంట్‌ ఆఫర్స్‌ అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా మహీంద్రా స్కార్పియో S10 టాప్ ఎండ్ మోడల్ కేవలం ఇక్కడ రూ.6 లక్షలకే అందుబాటులో లభిస్తోంది. ఇవే కాకుండా మెర్సిడెస్ బెంజ్‌కి సంబంధించిన వివిధ మోడళ్లు రూ. 14 లక్షల నుంచి రూ. 20 లక్షల మధ్యలో లభిండం విశేషం.. అలాగే ఇక్కడ 2018 మోడల్ మెర్సిడెస్ కేవలం రూ.20 లక్షలకే అందుబాటులో ఉన్నాయి.

అదేవిధంగా ఆడి బ్రాండ్‌కి సంబంధించిన Q7 2017 మోడల్ క్వాట్రో డిజిటల్ మీటర్ కలిగిన టాప్ మోడల్ కారును కేవలం రూ.17.75 లక్షలకే అందుబాటులో ఉంది. ఇక జాగ్వార్‌తో పాటు వోల్వో బ్రాండ్‌లకు సంబంధించిన కార్లు రూ. 15.50 లక్షల నుంచే ప్రారంభమవుతున్నాయి. అంతేకాకుండా వోల్వో V90 వంటి ప్రీమియం కార్లు రూ. 15 లక్షల నుంచి లభిస్తున్నాయి. ప్రస్తుతం చాలా మంది డీలర్లు వాహనం తిరిగిన కిలోమీటర్ల విషయంలో అబద్ధాలు చెబుతూ కస్టమర్స్‌ను మోసం చేస్తున్నారు. కానీ ఇక్కడ సర్వీస్ రికార్డులతో సహా పూర్తి వివరాలను అందిస్తున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. 

Read more: OnePlus Nord 5: అమెజాన్ ధమాకా.. రూ.5,000 లోపే OnePlus Nord 5.. ఈ డీల్ వదులుకోవద్దు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

0
0
Report
Advertisement

MI Vs CSK Preview: ముంబై వర్సెస్ చెన్నై..ధోనీ ఆడుతున్నాడా లేదా? ఈరోజు తుదిజట్టులో ధోనీ, రోహిత్ ఉంటారా?

Mumbai, Maharashtra:

MI Vs CSK Match Preview: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఇప్పుడు మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. నేడు ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ఐపీఎల్‌లో 5 సార్లు విజేతలుగా నిలిచిన ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, ఎంఎస్ ధోనీ ఈ మ్యాచ్‌లో ఆడతారనే వార్త ఇప్పుడు ఇరు టీమ్స్ ఫ్యాన్స్‌లో మరింత ఉత్సాహాన్ని నింపింది. ఈ క్రమంలో ముంబై, చెన్నై జట్లు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. 

ప్రస్తుత ఐపీఎల్ లీగ్‌లో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు చెరో 6 మ్యాచ్‌లు ఆడి.. చెరో 2 మ్యాచ్‌ల్లో గెలిచారు. పాయింట్ల పట్టిక ప్రకారం.. ముంబై ఇండియన్స్ జట్టు 7వ స్థానంలో ఉండగా.. 8వ స్థానంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు నిలిచింది. కాబట్టి, ఈ రెండు జట్ల మధ్య జరిగే మ్యాచ్ చాలా ఉత్కంఠభరితంగా ఉంటుందనడంలో సందేహం లేదు.   

ఈ ఏడాది ఐపీఎల్‌లో మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని ఇంకా చెన్నై తరఫున ఒక్క మ్యాచ్‌ కూడా ఆడలేదు. అతను ముంబైతో జరిగే మ్యాచ్‌లో ఆడతాడని భావిస్తున్నారు. ఇదిలా ఉండగా, స్పెన్సర్ జాన్సన్ చెన్నై జట్టులో చేరాడు. కానీ ఆ మ్యాచ్‌లో అతను ఆడే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. అదేవిధంగా 2026 ఐపీఎల్ నుంచి తప్పుకున్న ఆయుష్ మాత్రే స్థానంలో ఎవరు వస్తారనే ప్రశ్న అభిమానుల్లో నెలకొంది. ఈ నేపథ్యంలో అతని స్థానంలో ఊర్విల్ పటేల్ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.   

ముంబై ఇండియన్స్ జట్టు విషయానికొస్తే.. పెద్దగా మార్పులేమీ ఉండేలా కనిపించడం లేదు. గత రెండు మ్యాచ్‌లలో ఆడని రోహిత్ శర్మ ఈ మ్యాచ్‌లో ఆడే అవకాశం ఉంది. అయితే అది కూడా ఖరారు కాలేదు. ఒకవేళ అతను వస్తే యువ ఆటగాడు డానిష్ మలేవార్ జట్టుకు దూరమయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా విల్ జాక్స్ జట్టులో చేరినందున అతను కూడా ఈ మ్యాచ్‌లో ఆడే అవకాశం ఉంది.   

చెన్నై సూపర్ కింగ్స్ తుది జట్టు అంచనా..
సంజూ శాంసన్, రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), సర్ఫరాజ్ ఖాన్, శివమ్ దూబే, డెవాల్ట్ బ్రెవిస్, జామీ ఓవర్టన్, ఎంఎస్ ధోనీ (వికెట్ కీపర్), అన్షుల్ కాంబోజ్, నూర్ అహ్మద్, స్పెన్సర్ జాన్సన్, గుర్జాబ్నీత్ సింగ్. (ఇంపాక్ట్ ప్లేయర్: ఉర్విల్ పటేల్)  

ముంబయి ఇండియన్స్ తుదిజట్టు అంచనా.. 
క్వింటన్ డి కాక్ (వికెట్ కీపర్), డానిష్ మలేవార్, నమన్ దిర్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, గిరీష్ భరత్, మిచెల్ శాంట్నర్, విల్ జాక్స్, జస్ప్రీత్ బుమ్రా, అశ్వనీ కుమార్. (ఇంపాక్ట్ ప్లేయర్: సూర్యకుమార్ యాదవ్).

Also Read: Cheapest 7 Seater Cars: బడ్జెట్‌లో 7-సీటర్ కార్లు..కేవలం రూ.5.65 లక్షలకే బ్రాండ్ కారు ఇంటికి తీసుకెళ్లొచ్చు! ఎలాగో చూడండి!

Also Read: Team India T20 Captain: టీమ్ఇండియా టీ20 కెప్టెన్ మార్పు..అతడికే జట్టు పగ్గాలు..సూర్యకుమార్ యాదవ్‌కు నో ఛాన్స్!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Oppo Find X9s: కెమెరా అదిరింది.. ఒప్పో ఫైండ్ X9s ఫీచర్లు చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

Hyderabad, Telangana:

Oppo Find X9s Specs Price: ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ తయారీ బ్రాండ్‌ ఒప్పో (Oppo) మార్కెట్‌లోకి మరో అద్భుతమైన ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. దీనిని కంపెనీ  ఒప్పో ఫైండ్ X9s (Oppo Find X9s) పేరుతో అందుబాటులోకి తీసుకు వచ్చింది. ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్‌ డిజైన్‌ టెక్‌ ప్రియులను ఎంతగానో ఆకర్షిస్తోంది. ముఖ్యంగా ఈ స్మార్ట్‌ఫోన్‌ అద్భుతమైన బ్యాటరీ సామర్థ్యంతో పాటు అత్యాధునిక కెమెరా సెటప్‌తో పాటు పవర్‌ఫుల్‌ ప్రాసెసర్‌తో ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూపొందించిన్నట్లు కంపెనీ తెలిపింది. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన పూర్తి వివరాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఈ Oppo Find X9s స్మార్ట్‌ఫోన్‌ అద్భుతమైన 6.59 అంగుళాల AMOLED డిస్‌ప్లేతో అందుబాటులోకి వచ్చింది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ డిస్ల్పే వినియోగదారులకు అద్భుతమైన విజువల్ ఎక్స్‌పీరియన్స్ అందించేందుకు క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా ఈ డిస్ల్పే ప్రొటెక్షన్‌ కంపెనీ కంపెనీ ఎంతో శక్తివంతమైన కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్‌ను కూడా అందిస్తోంది. ఇవే కాకుండా ఇందులో కంపెనీ ఒప్పో ఫైండ్ X9s మొబైల్ మీడియాటెక్ డైమెన్సిటీ 9500s (MediaTek Dimensity 9500s) చిప్‌సెట్‌ ప్రాసెసర్‌తో విడుదల చేసింది. 

ఈ Oppo Find X9s మొబైల్‌ 12GB ర్యామ్‌తో పాటు 256GB, 512GB స్టోరేజ్ వేరియంట్లు అందుబాటులో వచ్చింది. అలాగే మల్టీ టాస్కింగ్‌తో పాటు హై-ఎండ్ గేమింగ్ ఆడేవారికి ఇది ఒక గొప్ప ఎంపికగా టెక్‌ నిపుణులు భావిస్తున్నారు. ఇక ఈ స్మార్ట్‌ఫోన్‌ ప్రత్యేకత ఏంటంటే? దీని కెమెరా సెటప్‌ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది మోస్ట్ పవర్‌ఫుల్‌ ఫీచర్స్ కలిగి కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. దీని వెనక భాగంలో 50MP ప్రధాన కెమెరా, 50MP అల్ట్రా వైడ్‌తో పాటు 50MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ కెమెరాను కూడా అందిస్తోంది. అంతేకాకుండా సెల్ఫీల కోసం ముందు భాగంలో 32MP కెమెరాను కలిగి ఉంటుంది. ఇవే కాకుండా ఇందులో కంపెనీ 4K వీడియో రికార్డింగ్‌ను కూడా సపోర్ట్ చేస్తుంది.

Read more: OnePlus Nord 5: అమెజాన్ ధమాకా.. రూ.5,000 లోపే OnePlus Nord 5.. ఈ డీల్ వదులుకోవద్దు!

ఈ Oppo Find X9s స్మార్ట్‌ఫోన్‌ బ్యాటరీ కూడా ఎంతో శక్తివంతంగా ఉండబోతోంది. ముఖ్యంగా ఇది  7025mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇది భారీ బ్యాటరీ సామర్థ్యం ఉండటం వల్ల ఒక్కసారి ఛార్జ్ చేస్తే రెండు రోజుల పాటు నిరంతరాయంగా వాడుకోవచ్చని కంపెనీ క్లైమ్‌ చేస్తోంది. అంతేకాకుండా 80W సూపర్ వూక్ (SuperVOOC) ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా అందుబాటులో ఉంది. దీని వల్ల ఈ బ్యాటరీ సులభంగా ఛార్జ్‌ అవుతుంది. ఈ మొబైల్‌ ఆండ్రాయిడ్ 16 ఆధారిత కలర్ ఓఎస్ (ColorOS) ఆపరేటింగ్‌ సిస్టమ్‌పై రన్‌ అవుతుంది.  దీని స్టార్టింగ్‌ ధర అంతర్జాతీయ మార్కెట్లో సుమారు రూ.85 వేల నుంచి ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే, దీనిని కంపెనీ త్వరలోనే భారత మార్కెట్‌లోకి విడుదల చేసే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. 

Read more: OnePlus Nord 5: అమెజాన్ ధమాకా.. రూ.5,000 లోపే OnePlus Nord 5.. ఈ డీల్ వదులుకోవద్దు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

0
0
Report

Motorola Edge 70 Pro: 6500mAh బ్యాటరీ, 50MP సెల్ఫీ కెమెరా.. మోటరోలా ఎడ్జ్ 70 ప్రో ఫీచర్స్ ఇవే!

Hyderabad, Telangana:

Motorola Edge 70 Pro Launched: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ మోటరోలా ఎంతో శక్తివంతమైన ఎడ్జ్‌ సిరీస్‌లోని మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ విడుదలైంది. బుధవారం ఈ కంపెనీ భారత మార్కెట్‌లోకి మోటరోలా ఎడ్జ్ 70 ప్రో (Motorola Edge 70 Pro) స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేసింది. ఇది అద్భుతమై డిజైన్‌తో పాటు ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి వచ్చింది. ముఖ్యంగా ఇందులో కంపెనీ అతి పెద్ద బ్యాటరీ సామర్థ్యంతో లాంచ్‌ అయ్యింది. అయితే, ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో ఈ మొబైల్‌ అందుబాటులోకి వచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

ఈ Motorola Edge 70 Pro స్మార్ట్‌ఫోన్ 6.8 అంగుళాల 1.5K ఎక్స్‌ట్రీమ్ అమోలెడ్ (Extreme AMOLED) డిస్‌ప్లేతో  విడుదలైంది. అంతేకాకుండా ఇది 144Hz రిఫ్రెష్ రేట్‌తో పాటు 5200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంటుంది. ఈ డిస్ల్పే వినియోగదారులకు అద్భుతమైన విజువల్ అనుభూతిని అందిస్తుంది. ఇందులో కంపెనీ ఎంతో శక్తివంతమైన  ప్రాసెసర్‌తో లాంచ్‌ చేసింది. ఇది  మీడియాటెక్ డైమెన్సిటీ 8500 ఎక్స్‌ట్రీమ్ 4nm చిప్‌సెట్‌తో అందుబాటులోకి వచ్చింది. కాబట్టి దీనితో గేమింగ్‌తో పాటు మల్టీ టాస్కింగ్‌కు అత్యంత అద్భతంగా పని చేస్తుంది.

ఫోటోగ్రఫీ ప్రియుల కోసం కంపెనీ అద్భుతమైన కెమెరా సెటప్‌ను కూడా అందిస్తోంది. వెనక భాగంలో OIS సపోర్ట్‌తో  50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో పాటు 50 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ లెన్స్‌ను కూడా కంపెనీ అందిస్తోంది. దీంతో పాట ఫ్రంట్‌ భాగంలో సెల్ఫీల కోసం ముందు భాగంలో కూడా 50 మెగాపిక్సెల్ ఆటోఫోకస్ కెమెరాను అందిస్తోంది. ఇవే కాకుండా ఈ స్మార్ట్‌ఫోన్‌ కెమెరా అద్భుతమైన ఫిల్టర్స్‌ కూడా లభిస్తున్నాయి. 

Read more: OnePlus Nord 5: అమెజాన్ ధమాకా.. రూ.5,000 లోపే OnePlus Nord 5.. ఈ డీల్ వదులుకోవద్దు!

ఈ స్మార్ట్‌ఫోన్‌ ఎంతో శక్తివంతమైన  6500mAh భారీ బ్యాటరీతో పాటు 90W టర్బోపవర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లభించడం చాలా విశేషం.. అంతేకాకుండా ఈ స్మార్ట్‌ఫోన్‌ బ్యాటరీ అత్యంత తక్కువ సమయంలో పూర్తిగా ఛార్జ్‌ అవుతుంది. ఇది ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్‌ అవుతుంది. దీంతో పాటు  3 ఏళ్ల ఓఎస్ అప్‌డేట్స్, 5 ఏళ్ల సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను అందిస్తుందని కంపెనీ క్లైమ్‌ చేస్తూ వస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ వివిధ స్టోరేజ్‌తో పాటు వివిధ ధరల్లో లభిస్తోంది. దీని మొదటి స్టోరేజ్‌ వేరియంట్‌ 256GB స్టోరేజ్‌తో ధర రూ. 38,999తో అందుబాటులో ఉంది. ఇక రెండవ వేరియంట్‌ 12GB RAM + 256GB స్టోరేజ్‌తో ధర రూ.41,999తో లభిస్తోంది. ఈ మొబైల్ ఏప్పిల్ 29వ తేది నుంచి ఈ కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ (Flipkart)తో పాటు మోటరోలా అధికారిక వెబ్‌సైట్లలో అందుబాటులోకి రాబోతోంది. 

Read more: OnePlus Nord 5: అమెజాన్ ధమాకా.. రూ.5,000 లోపే OnePlus Nord 5.. ఈ డీల్ వదులుకోవద్దు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

0
0
Report
Advertisement

Neechabhanga Raja Yoga 2026: మే నెలలో అరుదైన నీచభంగ రాజయోగం.. ఈ 3 రాశుల వారికి ఇక పట్టిందల్లా బంగారమే!

Hyderabad, Telangana:

Neechabhanga Raja Yoga In May 2026: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఏవైన రెండు గ్రహాలు కలయిక జరిపినప్పడు ఏర్పడే యోగాలు అన్ని రాశులవారిపై ఏదో ఒక విధంగా ప్రభావం తప్పకుండా చూపుతాయి. అయితే, ఈ ఏడాది మే నెలలో గ్రహాల స్థితిగతుల్లో అరుదైన మార్పులు సంభవించబోతున్నాయి. ఈ సమయంలో అత్యంత శక్తివంతమైన నీచభంగ రాజయోగం ఏర్పడబోతోందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఒక గ్రహం నీచ స్థితిలో బలహీనంగా ఉన్నప్పుడు.. మరో గ్రహం సహాయంతో ఆ దోషం తొలగిపోయి.. రాజయోగంగా మారుతుంది. దీనినే జ్యోతిష్య శాస్త్రంలో  నీచభంగ రాజయోగం అంటారు. ఈ యోగ ప్రభావం కూడా అన్ని రాశులవారిపై సమానంగా పడుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. కాబట్టి ఈ సమయంలో కొన్ని రాశులవారు అదృష్టాన్ని పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే, ఈ సమయంలో అత్యధిక లాభాలు పొందే రాశులేవో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఈ యోగంతో మూడు రాశులవారికి అదృష్టం వరించబోతోంది..
1. మేష రాశి (Aries)
నీచభంగ రాజయోగం ఏర్పడడం వల్ల మేష రాశివారికి ఈ సమయం స్వర్ణయుగమనే చెప్పాలి. ఎందుకంటే ఈ సమయంలో నిలిచిపోయిన ప్రతి పని వేగంగా పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ఎలాంటి పని చేసిన తప్పకుండా సక్సెస్‌ అవుతారు. దీంతో పాటు ఊహించని విధంగా ధనలాభం కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. పాత బాకీలు కూడా ఈ సమయంలో సులభంగా వసూలవుతాయి. అలాగే ఉద్యోగస్తులకు ప్రమోషన్లు లేదా జీతాల పెంపు ఉండే అవకాశం కూడా కనిపిస్తోంది. ఈ సమయంలో వ్యాపారాలు చేసేవారు నూతన ఒప్పందాలు కలిసివస్తాయి. ముఖ్యంగా పెట్టుబడులు పెట్టే ఛాన్స్‌ కూడా ఉంది. 

2. కర్కాటక రాశి (Cancer)
నీచభంగ రాజయోగం  ప్రభావంతో కర్కాటక రాశివారికి కూడా ఈ సమయం చాలా కలిసి రాబోతోంది. అంతేకాకుండా ఆత్మవిశ్వాసం కూడా రెట్టింపు అవుతుంది. కుటుంబంలో ఉన్న ఎలాంటి కలహాలైన సులభంగా తొలగిపోయి.. సులభంగా ప్రశాంతత లభించబోతోంది. దీంతో పాటు ఇంట్లో తప్పకుండా శుభకార్యాలు కూడా జరుగుతాయి. అంతేకాకుండా  గత కొంతకాలంగా వేధిస్తున్న అనారోగ్య సమస్యల నుంచి తప్పకుండా పరిష్కారం లభిస్తుంది. ముఖ్యంగా విదేశీ ప్రయాణాలకు మార్గం సుగమం అవుతుంది. అంతేకాకుండా ఈ సమయంలో లక్కీ జాక్‌పాట్ కొట్టే ఛాన్స్‌ కూడా కనిపిస్తోంది. 

3. కన్య రాశి (Virgo)
ఈ శక్తివంతమైన రాజయోగం ఎఫెక్ట్‌తో కన్య రాశి (Virgo)వారికి కూడా ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా ఆపారమైన కీర్తి, ప్రతిష్టలు కూడా పొందే ఛాన్స్‌లు కూడా కనిపిస్తున్నాయి. దీంతో పాటు సమాజంలో గౌరవం విపరీతంగా పెరుగుతుంది. రాజకీయ లేదా సామాజిక రంగాల్లో ఉన్న వారికి పదవీ యోగం కూడా ఉంది. దీని కారణంగా మంచి పదవులను కూడా త్వరలోనే పొందుతారు. అలాగే వ్యాపారాలు చేసేవారికి కూడా ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. కొత్త పెట్టుబడులకు ఇది చాలా అనువైన సమయమని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. దీర్ఘకాలిక సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. 

Also Read: Gajalakshmi Rajayoga 2026: మే 14 నుంచి ఈ 4 రాశుల వారికి మహర్దశ.. గజలక్ష్మి రాజయోగంతో ధన వర్షం ఖాయం!

Also Read: Gajalakshmi Rajayoga 2026: మే 14 నుంచి ఈ 4 రాశుల వారికి మహర్దశ.. గజలక్ష్మి రాజయోగంతో ధన వర్షం ఖాయం!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report

IRS Daughter Murder: రెండురోజుల్లో 2 రేప్‌లు, ఒక మర్డర్.. పోలీసులకే మైండ్ బ్లాంక్! దేశ రాజధానిని వణికించిన ‘కిల్లర్’ పనిమనిషి స్టోరీ!

Hyderabad, Telangana:

2 Days 2 Rapes In IRS Daughter Rape case: ఈ క్రైమ్‌ పని మనిషి కిల్లర్‌ కథ వింటే ఇంట్లో పనిమనిషి ఉన్న ప్రతిఒక్కరూ బెంబేలెత్తి పోవాల్సిందే.  పని నుండి తొలగించిన వ్యక్తి సదరు యజమాని కుమార్తె ప్రాణాలు తీశారు. ఏకంగా అత్యాచారం చేసి మరీ హత్య చేశాడు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో సంచలనం రేపుతోంది. ఐఆర్‌ఎస్‌ కూతురు (22) హత్యాచారం కేసులో ఈ సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసుల ప్రకారం రాహుల్ అనే మాజీ ఇంటి పనిమనిషి ఈ దారుణానికి ఒడిగట్టాడు. వెంటనే పోలీసులు సదరు నిందితుని గాలించి అరెస్టు చేశారు. ప్రధానంగా ఆన్‌లైన్ గేమ్స్‌కు బానిసైనా అతన్ని నెల కిందటే పని నుంచి తొలగించారు. ఆ కక్షతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో రెక్కీ వేసి మరీ డూప్లీకేట్‌ కీ తో ప్రవేశించి యువతిపై అఘాయిత్యానికి పాల్పడి, ఆ తర్వాత గొంతు నిలిమి చంపేశాడు. అయితే, ఈ కేసులో పోలీసులకు మరో విస్తుపోయే నిజం తెలిసింది. నిందితుడు ఈ హత్య చేసిన ముందు రోజే అళ్లార్‌లో ఒక మహిళను రేప్ చేసినట్లు సమాచారం. ఈ క్రైమ్ కిల్లర్ స్టోరీ రెండు రోజుల్లో రెండు అత్యాచారాలు, ఒక మర్డర్ దేశవ్యాప్తంగా వణికిస్తోంది. ఆ పూర్తి సమాచారం తెలుసుకుందాం.

ఈ ఐఆర్ఎస్ కూతురు యూపీఎస్‌స్సీ కి సన్నద్ధమవుతోంది. ఢిల్లీ ఈస్ట్ కైలాష్ లో ఈ ఘోర దుర్ఘటన చోటుచేసుకుంది. అయితే ఈ పనిమనిషి వయస్సు కేవలం 19 ఏళ్ళు మాత్రమే. దారుణానికి ఒడిగట్టిన అనంతరం దగ్గరలో ఉన్న ద్వారకా హోటల్ వద్ద తిరగడంతో పోలీసులు అతన్ని పట్టుకున్నారు. 

పోలీసులు లోతైన దర్యాప్తు ప్రారంభించినప్పుడు ఈ నిందితుడి గురించి విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఇతడు ఢిల్లీలో పలు నేరాలు పాల్పడినట్లు సమాచారం. అంతేకాదు తన స్వగ్రామామైన అల్వార్ లో కూడా ఓ మహిళపై దారుణానికి ఒడిగట్టాడు. స్నేహితుడి భార్యపై అత్యాచారం చేశాడు. డబ్బులు పెట్టి లూడో గేమ్ ఆడుతూ తరచూ వారి ఇంటికి వెళ్లేవాడు. కొన్ని రోజుల తర్వాత ఆ ఇంట్లోనే ఒక రూమ్‌లో అద్దెకు దిగినట్లు స్థానికులు సమాచారం. తన స్నేహితుడి భార్యపై అత్యాచారం జరిపి ఢిల్లీకి పారిపోయాడు. ఇక్కడ కూడా తోటి పనివారి నుంచి డబ్బులు అప్పుగా తీసుకొని తిరిగి ఇచ్చేవాడు కాదు. బెదిరింపులకు పాల్పేడవాడని సమాచారం.

READ ALSO:  ఘోర ప్రమాదం.. అదుపుతప్పిన ట్రక్కు, చెల్లాచెదురైన వాహనాలు, 11 మంది సజీవదహనం! హృదయవిదారక దృశ్యం..

READ ALSO:  Kurnool Accident: కర్నూల్‌ జిలాల్లో ఘోర ప్రమాదం.. 8 మంది దుర్మరణం, 15 మందికి తీవ్రగాయాలు..!

 

ఢిల్లీ జాయింట్‌ కమిషనర్‌ పోలీస్ విజయ్ కుమార్ ఈ ఘటన గురించి మీడియాతో మాట్లాడారు హత్యకు గల అసలైన కారణాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు. రెండు రోజుల్లో రెండు రేప్‌లకు పై దర్యాప్తు చేస్తున్నారు. ప్రధానంగా అతని క్రిమినల్ మైండ్ సెట్ వల్లే ఈ దారుణానికి వడగట్టాడని చెప్పారు. ప్రస్తుతం ఇంటరాగేషన్ చేస్తున్నారు. ఉన్నట్టుండి ఉద్యోగం నుంచి తొలగించినందుకే ఈ దారుణానికి వడగట్టినట్లు తెలుస్తోంది.  కక్ష పెట్టుకొని తన యజమాని కూతురినే అత్యాచారం చేసి హత్య చేశాడు. ఇక దర్యాప్తులో మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందన్నారు. అత్యాచారాన్ని తర్వాత అక్కడ  నిందితుడు సంచరించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

 

0
0
Report

Karimnagar: పన్ను ఎగవేతే లక్ష్యం.. చీకటి వ్యాపారానికి కరీంనగర్ అడ్డా..

Karimnagar, Telangana:

Karimnagar Zero Bill Scam Latest News: ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా జీరో బిల్లు వ్యాపారం ఇప్పుడు యదేచ్చగా సాగుతూ ప్రభుత్వ ఆదాయానికి భారీ గండి కొడుతోంది. GST ఎగవేత లక్ష్యంగా సాగుతున్న ఈ అక్రమ దందా వల్ల ప్రభుత్వ ఖజానాకు చేరాల్సిన కోట్లాది రూపాయల ఆదాయం పక్కదారి పడుతోంది. కరీంనగర్ లోని ప్రకాశం గంజ్‌తో పాటు గోదావరిఖని, జగిత్యాల వంటి ప్రధాన వ్యాపార కేంద్రాల్లో ఈ దందాలు మూడు పువ్వులు ఆరుకాయలుగా వర్ధిల్లుతూ వస్తోంది.

ముఖ్యంగా భవన నిర్మాణ రంగంలో కీలకమైన సిమెంటుతో పాటు ఐరన్, ఇతర వస్తువులు, వ్యవసాయానికి సంబంధించిన ఎరువుల విక్రయాలు జీరో బిల్లుల దండ ఎక్కువగా సాగుతోంది. నిబంధనల ప్రకారం ప్రతి లావాదేవీకి జిఎస్టి బిల్లు తప్పనిసరి.  కానీ కొందరు బడా వ్యాపారులు పన్ను ఎగవేసేందుకు ఎలాంటి బిల్లులు లేకుండా అమ్మకాలు కొనసాగిస్తున్నారు. మహారాష్ట్రతో పాటు కర్ణాటక, ఛత్తీస్‌గఢ్ వంటి ఇతర రాష్ట్రాల నుంచి ఎటువంటి పత్రాలు లేకుండా సరుకులను తరలిస్తున్నారు. వీటిని ఊరు శివారులోని రహస్యం గోదాముల్లో నిల్వ ఉంచి.. చీకటి పడ్డాక చిల్లర వర్తకులకు సరఫరా చేస్తూ వస్తున్నారు..

వాణిజ్య పన్నుల శాఖ అధికారుల అండదండలతోనే.. ఈ వ్యాపారం కోట్లలో సాగుతూ ఉందని విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. చెక్పోస్టుల వద్ద తనిఖీలు నామమాత్రం గానే సాగుతున్నాయని.. లారీకి ఇంత అని మామూలు అందడంతో అక్రమ రవాణాకు అడ్డు లేకుండా పోతుందని తెలుస్తోంది.. ఏటా వెలకోట్ల టర్నోవర్ జరిగే కరీంనగర్ మార్కెట్లో.. కాగితాలపై మాత్రం తక్కువ లావాదేవీలను చూపిస్తూ అధికారులను మేనేజ్ చేస్తున్నట్లు కూడా ఆరోపణలు వస్తున్నాయి..

వ్యాపారులు జీరో బిల్లుల పేరుతో సామాన్య ప్రజల నుంచి పూర్తిస్థాయిలో ధరను వసూలు చేస్తూ.. ప్రభుత్వానికి మాత్రం పన్ను చెల్లించడం లేదు.. ఒకవేళ వినియోగదారుడు బిల్లు అడిగితే అదనంగా పన్ను కట్టాలని భయపెట్టి.. బిల్లు లేకుండా తక్కువ ధరలకే ఇస్తున్నామని నమ్మిస్తున్నారు. దీనివల్ల వినియోగదారుడు నాణ్యత లేని వస్తువులు కొన్న చట్టపరంగా ఫిర్యాదు చేసే అవకాశం లేకుండా పోతావని సమాచారం..

Read more: OnePlus Nord 5: అమెజాన్ ధమాకా.. రూ.5,000 లోపే OnePlus Nord 5.. ఈ డీల్ వదులుకోవద్దు!

ప్రభుత్వ ఆదాయాన్ని గండి కొడుతున్న ఈ వ్యవస్థపై ఉన్నత అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతగానో ఉంది. స్పెషల్ టాస్క్ ఫోర్స్ బృందాలతో పాటు ఇతర అధికారులు కలిసి గోదాములపై దాడులు నిర్వహించి.. అక్రమంగా నిల్వచేసిన సరుకు సీజ్ చేయాలని స్థానికులు కోరుతున్నారు. పన్ను ఎగవేత దారులపై కఠిన చర్యలు తీసుకుంటేనే ప్రభుత్వ ఖజానాకు ఆదాయం చేరుతుందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు..

Read more: OnePlus Nord 5: అమెజాన్ ధమాకా.. రూ.5,000 లోపే OnePlus Nord 5.. ఈ డీల్ వదులుకోవద్దు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

0
0
Report
Advertisement

Luxury Cars At 5 Lakhs: రూ.5 లక్షలకే ఆడి, BMW కార్లు.. కళ్లు చెదిరే ఆఫర్లు!

Hyderabad, Telangana:

Second-Hand Luxury Cars At 5 Lakhs News: ఖరీదైన లగ్జరీ కారు కొనాలనేది మధ్యతరగతి ప్రజల కల.. సాధారణ వినియోగదారులు రోడ్లమీద లగ్జరీకారులను చూసి వాటిని ఫాలో అవుతుంటారు. అంటే ఆ కార్లు అంటే వారికి ఎంతో ఇష్టం. కానీ, ఈ కార్లు 50 లక్షల నుంచి కోట్ల రూపాయల వరకు ఉంటాయి. అయితే, సెకండ్ హ్యాండ్ కార్లు మాత్రం అత్యంత తక్కువ ధరల్లో లభిస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఢిల్లీ లాంటి కొన్నిచోట్లనైతే సాధారణ కార్ల ధరల్లోనే సెకండ్ హ్యాండ్ లగ్జరీ కార్లు లభిస్తూ ఉంటాయి. ఢిల్లీలోని రోహిణి సెక్టర్‌లో ఉన్న ఆటో కింగ్ సెకండ్ హ్యాండ్ కార్లకు సంబంధించిన షోరూం లో మెర్సిడెస్ బెంచ్, ఆడి, బిఎమ్‌డబ్ల్యూ వంటి దిగ్గజ బ్రాండ్ల కార్లు సాధారణ కార్ల ధరలకే లభిస్తున్నాయి. కేవలం రూ. 99,000 నుంచే కార్ల  అందుబాటులో ఉండడం విశేషం..

సాధారణంగా మారుతి స్విఫ్ట్ కార్ ధర షోరూం ప్రైస్ దాదాపు రూ.8 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఉంటుంది. అయితే, ఇక్కడ మెర్సిడెస్ బెంజ్ c200 పెట్రోల్ కారు ధర కేవలం రూ.4.90 లక్షల కే లభిస్తోంది. అంటే మారుతి స్విఫ్ట్ కారు సగం ధరకే ఈ కారు లభించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇక ఆడి ఏ సిక్స్ మెట్రిక్స్ వంటి ప్రీమియం లగ్జరీ కార్ కూడా ఇక్కడ 5.95 లక్షలకే అందుబాటులో ఉండడం విశేషం. ఇంత తక్కువ ధరకే లగ్జరీ కార్లు లభించడంతో చాలామంది ఆశ్చర్యపోయి అక్కడికి వెళ్లి మరి విక్రయించే వారిని ధరలు అడుగుతున్నారు..

Read more: OnePlus Nord 5: అమెజాన్ ధమాకా.. రూ.5,000 లోపే OnePlus Nord 5.. ఈ డీల్ వదులుకోవద్దు!

ఇవే కాకుండా ఎస్‌యూవీ (SUV) ప్రియుల కోసం మహీంద్రతో పాటు టాటా బ్రాండ్‌కు సంబంధించిన ఫ్యామిలీ కార్స్ కూడా చాలా తక్కువ ధరల్లో అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా మహీంద్రా ఎక్స్‌యూవీ 500 (XUV 500) కేవలం రూ. 3.90 లక్షలకే అందుబాటులో ఉంది. అలాగే ఎంతో శక్తివంతమైన కారుగా భావించే ఫోర్డ్ కంపెనీకి చెందిన ఎండీవర్ (3.2 ఆటోమేటిక్) రూ. 11.90 లక్షలకు లభిస్తోంది. దీంతోపాటు స్కార్పియో, థార్, ఫార్చ్యూనర్ వంటి కార్ల సగం ధరలకు అందుబాటులో ఉన్నాయి. అలాగే ఇక్కడ కేవలం రూ.50 వేలు లేదా లక్ష రూపాయలు డౌన్ పేమెంట్ కడితే చాలు.. ఇక్కడ మీకు నచ్చిన కార్ ను సొంతం చేసుకోవచ్చు. అంతేకాకుండా ప్రత్యేకమైన ఫైనాన్స్ సదుపాయం కూడా అందిస్తున్నారు.

ఈ కార్ బజార్‌లో కేవలం ఢిల్లీ వరకే కాకుండా.. ఫ్యాన్ ఇండియా సర్వీసులను కూడా కొన్ని సెకండ్ హ్యాండ్ షోరూమ్స్ వాళ్ల అందిస్తున్నారు. ఏ రాష్ట్రంలో ఉన్న.. మీరు కొనుగోలు చేసిన కారును ఇంటికి పంపించేలా ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కూడా ఉంది. అంతేకాకుండా తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ పంజాబ్ హర్యానా వంటి రాష్ట్రాలకు చెందిన వారికి రిజిస్ట్రేషన్ బదిలీ ప్రక్రియను కూడా దగ్గరుండి కార్లను విక్రయించే వారు పూర్తి చేస్తున్నారు. అయితే, చాలా తక్కువ ధరల్లో కార్లు అందుబాటులోకి రావడం వల్ల, యూజ్డ్ కార్లు కొనుగోలు చేసేటప్పుడు ఇంజన్ కండిషన్ తో పాటు యాక్సిడెంట్ హిస్టరీని కూడా ఒకసారి పరిశీలించడం చాలా మంచిదని కొంతమంది నిపుణులు సూచిస్తున్నారు.

Read more: OnePlus Nord 5: అమెజాన్ ధమాకా.. రూ.5,000 లోపే OnePlus Nord 5.. ఈ డీల్ వదులుకోవద్దు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

0
0
Report

Harish Rao: తెలంగాణ హైకోర్టుపై హరీశ్‌ రావు హర్షం.. సత్యమేవ జయతే!

Hyderabad, Telangana:

  Telangana High Court: కాళేశ్వరం కమిషన్‌పై హైకోర్టు వెలువరించిన తీర్పుపై బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్ రావు స్పందించారు. హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తూ 'ఎక్స్' వేదికగా ప్రకటన చేశారు. సత్యమేవ జయతే అని ప్రకటించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా అంతిమంగా ధర్మం జయిస్తుందని తెలిపారు. ముమ్మాటికీ కాళేశ్వరం తెలంగాణకు ప్రాణేశ్వరం అని ప్రకటించారు. కేసీఆర్‌, తనపై ఇచ్చిన తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు.

Also Read: KCR Harish Rao: రేవంత్‌ రెడ్డికి ఎదురుదెబ్బ.. హైకోర్టులో కేసీఆర్‌, హరీశ్‌ రావుకు భారీ ఊరట

'సత్యమేవ జయతే.. ఎవరెన్ని కుట్రలు చేసినా న్యాయస్థానాల్లో అంతిమంగా ధర్మం జయిస్తుంది. సత్యం నినదిస్తుందని ఈరోజు మరోసారి నిరూపితమైంది' అని బీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు, మాజీ మంత్రి హరీశ్‌ రావు ప్రకటించారు. 'ప్రాథమిక హక్కులు, సహజ న్యాయ సూత్రాలను విస్మరిస్తూ నడిపిన విచారణను ఉన్నత న్యాయస్థానం తప్పుబట్టింది. వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించేలా కమిషన్ చేసిన వ్యాఖ్యలు చెల్లవని.. ఆ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోరాదని స్పష్టంగా తీర్పు ఇచ్చింది' అని మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు.

Also Read: KCR Highlights: జగిత్యాలలో కేసీఆర్‌ 3.0.. ప్రజా ఆశీర్వాద సభ టాప్‌ 10 హైలెట్స్‌

'కాంగ్రెస్ ప్రభుత్వ రాజకీయ కుట్రలు బట్టబయలయ్యాయి. ప్రజా సమస్యలు పక్కనపెట్టి డ్రామాలు ఆడిన రేవంత్ రెడ్డి నిజస్వరూపం హైకోర్టు తీర్పుతో తేటతెల్లం అయ్యింది. ఇప్పటికైనా కక్షసాధింపులు, రాజకీయ దుష్ప్రచారం మానేసి వెంటనే రెండు పిల్లర్ల మరమ్మతులు పూర్తి చేసి తెలంగాణ  రైతుల ప్రయోజనాలు కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నాం' అని మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు. 'ఎవరు ఔనన్నా కాదన్నా ముమ్మాటికీ కాళేశ్వరం తెలంగాణకు ప్రాణేశ్వరం' అని మాజీ మంత్రి హరీశ్ రావు ప్రకటించారు.

ఈ తీర్పుపై బీఆర్‌ఎస్‌ పార్టీ స్పందిస్తూ కీలక ప్రకటన చేసింది. 'సత్యమేవ జయతే. కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ ఇచ్చిన నివేదికను నిలిపివేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టు. పీసీ ఘోష్ కమిషన్‌ ఇచ్చిన నివేదిక అంతా ట్రాష్.. చెత్త బుట్టలో వేయాల్సిందే! కమిషన్ పేరుతో కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష్యాన్ని దెబ్బతీయాలనే రేవంత్ ప్రభుత్వ కుట్రలను తిప్పికొట్టిన హైకోర్టు' అని వివరించింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report

KCR Harish Rao: రేవంత్‌ రెడ్డికి ఎదురుదెబ్బ.. హైకోర్టులో కేసీఆర్‌, హరీశ్‌ రావుకు భారీ ఊరట

Hyderabad, Telangana:

Telangana High Court: కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏర్పాటుచేసిన పీసీ ఘోష్‌ కమిషన్‌ నివేదికపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌తోపాటు హరీశ్‌ రావు, నాటి అధికారులక భారీ ఊరట లభించింది. పీసీ ఘోష్‌ కమిషన్‌ నివేదికపై తదుపరి చర్యలు కేసీఆర్‌, హరీశ్‌ రావుపై తీసుకోరాదని ధర్మాసనం ఆదేశించింది. సమర్పించిన నివేదిక ప్రకారం ఎలాంటి చర్యలు చేపట్టకూడదని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.

Also Read: SRH vs DC Highlights: ఉప్పల్‌లో ఢిల్లీ చిత్తు.. అభిషేక్‌ సెంచరీతో హైదరాబాద్‌ హ్యాట్రిక్‌ విజయం

కాళేశ్వరం ప్రాజెక్టులపై కాంగ్రెస్‌ ప్రభుత్వం తీవ్ర ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. కాళేశ్వరం ప్రాజెక్టును కూలేశ్వరం అని విమర్శలు చేస్తున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం 2024 మార్చి 14వ తేదీన జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ను నియమించింది. ఆ కమిషన్‌ను నియమిస్తూ జారీ చేసిన జీఓ 6ను రద్దు చేయాలని బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌, మాజీ మంత్రి హరీశ్‌ రావు, ఐఏఎస్‌ అధికారులు స్మితా సబర్వాల్‌, ఎస్‌కే జోషిలు వేర్వేరుగా పిటిషన్‌లు దాఖలు చేశారు.ఈ పిటిషన్‌లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అపరేశ్‌ కుమార్‌ సింగ్‌, జస్టిస్‌ జీఎం మొహియుద్దీన్‌తో కూడిన ధర్మాసనం సుదీర్ఘ విచారణ చేపట్టగా.. దానిపై తెలంగాణ హైకోర్టు నేడు బుధవారం తీర్పు ఇచ్చింది.

Also Read: GT vs MI Highlights: తిలక్‌ వర్మ బ్యాట్‌తో విధ్వంసం.. బంతిలో అశ్వనీ విశ్వరూపం

పీసీ ఘోష్‌ కమిషన్‌ విచారణ చేపట్టి ప్రభుత్వానికి 665 పేజీల నివేదికను సమర్పించింది. ప్రాజెక్టులోని వైఫల్యాలకు నాటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ బాధ్యుడు అని నివేదికలో కమిషన్‌ తెలిపింది. కాళేశ్వరం ప్రాజెక్టు రూ.38,500 కోట్ల అంచనాల నుంచి రూ.1.10 లక్ష కోట్లకు పెరిగిందని కమిషన్‌ ఆరోపించింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్‌లపై కమిషన్‌ విచారణ చేపట్టింది. ఈ కమిషన్‌పై వేసిన పిటిషన్‌ను విచారణ చేపట్టిన హైకోర్టు ఎవరిపై ఎలాంటి చర్యలు తీసుకోరాదని ఆదేశించింది. అయితే జీవో 6ను రద్దు చేయాలని విజ్ఞప్తి చేయగా.. న్యాయస్థానం మాత్రం కమిషన్‌ ఏర్పాటును సమర్ధించింది. చర్యలు తీసుకోరాదని ఆదేశించడంతో బీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

వాదనలు పరిశీలించిన హైకోర్టు కమిషన్ ఏర్పాటు సరైనదేనని పేర్కొంది. కమిషన్ తన నివేదిక రూపొందించే ప్రక్రియలో అవసరమైన నిబంధనలు పూర్తిగా పాటించలేదని ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో కమిషన్ నివేదికలోని నిర్ధారణలు 'ప్రస్తుతం అమల్లోకి రాకూడదు' అని స్పష్టం చేసింది. ఈ నివేదిక ఆధారంగా పిటిషనర్లపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ప్రభుత్వం, సంబంధిత అధికారులకు హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report
Advertisement
Advertisement
Back to top