మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో ప్రపంచ ప్రజల దినోత్సవ వేడుకలు
Bellampalle, Kannal Rural, Telangana:మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో ప్రపంచ జానపద దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర జానపద కళాకారుల సంఘం ఆధ్వర్యంలో సింగరేణి కల్యాణ మండపంలో జానపద కళాకారులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. సంఘం రాష్ట్ర కార్యదర్శి మధుకర్ మాట్లాడుతూ కళాకారులు నిరంతరం అలనాటి కళలను పునరుజ్జీవింపజేస్తూ ప్రజల్లో చైతన్యం కల్పిస్తూ జానపద కళలను ఆదరించాలని కోరారు.
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
Birthday As Death Day: బర్త్డేను డెత్ డేగా మార్చిన పాము.. మంచంపై అమ్మతో నిద్రిస్తుంటే
Iskapalli, Andhra Pradesh:Snake Bite Death: బంధుమిత్రులు, కుటుంబసభ్యులతో కలిసి ఆనందంగా పుట్టినరోజు చేసుకున్న బాలిక అలసిపోయి రాత్రి తల్లితో కలిసి మంచంపై నిద్రించింది. కానీ అదే చివరి రాత్రి అవుతుందని కుటుంబసభ్యులతోపాటు ఆ బాలిక కూడా అనుకోలేదు. మంచంపైకి యమపాశంలా పాము దూసుకొచ్చింది. తల్లితోపాటు నిద్రిస్తున్న బాలికను కాటేసింది. ఆలస్యంగా గుర్తించడంతో విషం శరీరమంతా పాకడంతో బాలిక మృతి చెందింది. ఈ సంఘటన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సొంత నియోజకవర్గం పిఠాపురంలో చోటుచేసుకుంది. బర్త్డే తెల్లవారుజామునే ఈ సంఘటన చోటుచేసుకోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
Also Read: Voice And SMS Packs: మొబైల్ వినియోగదారులకు తీపి కబురు.. డేటా లేకుండా రీచార్జ్ ప్లాన్స్
కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని యు కొత్తపల్లి మండలం పొన్నాడ గ్రామ పంచాయతీ కోనపాపేట జగనన్న కాలనీకి చెందిన చప్ప మల్లేశ్వరి కుమార్తె దీపిక (14). కోనపాపేట హైస్కూల్లో ఎనిమిదో తరగతి చదువుతున్న దీపిక గురువారం తన పుట్టినరోజు ఎంతో సంతోషంగా.. ఆనందోత్సాహాలతో చేసుకుంది. బర్త్ డే చేసుకున్న ఆనందంలో ఉన్న బాలిక రాత్రి ఇంట్లో తల్లి మల్లేశ్వరితో కలిసి మంచంపై నిద్రించింది. శుక్రవారం తెల్లవారుజామున మంచంపై ఉన్న పరుపు కిందకు పాము దూరింది. కొద్దిసేపటికి దీపికను ఆ కాటు వేసింది. బాలికకు పాము కాటేసిన విషయాన్ని గమనించిన తల్లి వెంటనే పిఠాపురంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించింది. అయితే అప్పటికే బాలిక మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పుట్టినరోజు తెల్లారే బాలిక మృతి చెందడం ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. 14 ఏళ్లకే నూరేళ్లు నిండాయా అంటూ తల్లిదండ్రులు లబోదిబోమంటూ రోదించారు. ఈ సంఘటనపై యు కొత్తపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం అనంతరం బాలిక మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. కాగా బాలికను కాటేసిన పాము గ్రామస్తులు, చుట్టుపక్కల వాళ్లు చంపేశారు.
Also Read: YS Jagan Padayatra: చంద్రబాబు పాలనలో ఏపీ మొత్తం తిరోగమనం: వైఎస్ జగన్
అత్తకు యముడిగా అల్లుడు
అత్తకు యముడిగా అల్లుడి మారిపోయి ఆమె ప్రాణం బలి తీసుకున్నాడు. వృద్ధాప్యంలో అత్తకు అండగా ఉండాల్సిన అల్లుడు అంతమెుందించాడు. ఏలూరు జిల్లా కొయ్యలగూడెంలోని తారకరామనగర్లో తన భార్యను కాపురానికి రాకుండా అత్త పోల మంగమ్మ తప్పుదోవ పట్టిస్తుందని అల్లుడు కేదారి పుల్లయ్య భావించాడు. భార్యాభర్తల మధ్య అత్త అడ్డుగా ఉందని.. ఆమె అడ్డు తొలగించుకోవాలని అల్లుడు నిర్ణయించుకున్నాడు. మద్యానికి బానిసైన అల్లుడు అత్తను చంపితే తమ సంసార జీవితానికి అడ్డేమి ఉండదని భావించి అత్త నిద్రిస్తున్న సమయంలో కత్తితో అత్యంత దారుణంగా హత్య చేశాడు. హత్య చేసిన అనంతరం పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
Also Read: Tirumala Laddu: తిరుమలలో సరికొత్త రికార్డు.. రూ.13.95 కోట్ల లడ్డూ విక్రయాలతో రూ.567 కోట్ల ఆదాయం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Baas Electric Scooter: సగం ధరకే ఎలక్ట్రిక్ స్కూటర్లు.. రూ.44,990కే అందుబాటులో బ్రాండ్ EVలు! ఏది బెస్టో తెలుసా?
Hyderabad, Telangana:Electric Scooter Baas Price: ఎలక్ట్రిక్ వాహానాల భారీ ఖర్చుతో విక్రయిస్తున్న నేపథ్యంలో దాని కొనుగోలు సమయంలో సగానికి సగం ఖర్చు వినియోగదారులకు తగ్గించే మోడల్ ప్రవేశపెట్టారు. 'బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్' (BaaS) మోడల్ అనేది ఎలక్ట్రిక్ వాహనాల అధిక ధరను తగ్గించడానికి ఒక వినూత్న పరిష్కారంగా మారాయి. ఈ విధానం బ్యాటరీ ఖర్చును వేరు చేసి, స్కూటర్ కొనుగోలు ధరను సగానికి తగ్గిస్తుంది. వినియోగదారులు బ్యాటరీని నెలవారీ సబ్స్క్రిప్షన్ చెల్లించి, తమ అవసరాలకు అనుగుణంగా ప్లాన్ను మార్చుకోవచ్చు.
భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల ట్రెండ్ నడుస్తోంది. పెట్రోల్ వెహికల్స్ అంతరించిపోయే విధంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ (EV) రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది. అయితే ఈవీలు అధిక ధరలు ఉండడం వల్ల వాటిని కొనుగోలు చేసేందుకు వినియోగదారులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఈ సమస్యలను దృష్టిలో పెట్టుకొని.. బ్యాటరీ యూజ్ ఏ సర్వీస్ (BaaS) అనే విన్నూత్న నమూనాను తయారీ సంస్థలు ముందుకు తెచ్చాయి. అయితే బైక్ లేదా స్కూటర్ కొనే సమయంలో బ్యాటరీ ఖర్చును అందులో నుంచి మినహాయించి సగం ధరకే అమ్మకాలను చేసేందుకు నిర్ణయించారు. దీని వల్ల వినియోగదారులు వాటిని కొనేందుకు ఆసక్తి చూపే అవకాశం కనిపిస్తోంది. అయితే బ్యాటరీ కోసం కేవలం నెలవారీ సబ్స్క్రిప్షన్ మాత్రమే అవసరం పడుతుంది.
ఈ మోడల్ ఎలక్ట్రిక్ స్కూటర్ మొత్తం ధరను దాదాపు సగానికి తగ్గేలా చేస్తుంది. ముఖ్యంగా ఇది పే-యాజ్-యు-గో మోడల్ కావడం వల్ల.. వినియోగదారులు తమ అవసరాలకు అనుగుణంగా ప్లాన్ను మార్చుకునే అవకాశం కూడా ఉంటుంది. ఈ మోడల్ కింద ప్రస్తుతం భారత మార్కెట్లో అందుబాటులో ఉన్న కొన్ని ప్రముఖ ఎలక్ట్రిక్ స్కూటర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా TVS ఆర్బిటర్ V1 గురించి తెలుసుకుందాం. ఇది తక్కువ ధరకే మంచి ఫీచర్లను అందించే మోడల్గా మార్కెట్లో నిలుస్తుంది. సాధారణంగా దీని ధర రూ.84,500గా విక్రయిస్తున్నారు. BaaS సదుపాయంతో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ను కేవలం రూ. 49,999కే అమ్మకం చేస్తున్నారు. ఇది ఒకసారి ఛార్జ్ చేయడం వల్ల సుమారు 86 కిలోమీటర్ల వరకు నడుస్తుంది. ఇందులో LED హెడ్ల్యాంప్స్, స్మార్ట్ కనెక్టివిటీ, యాంటీ-థెఫ్ట్ అలారం, హిల్ హోల్డ్ అసిస్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
హీరో మోటోకార్ప్ సంస్థకు చెందిన వీడా VX2 గో స్కూటర్ విషయానికి వస్తే.. ఈ స్కూటర్ BaaS మోడల్లో కేవలం రూ.44,990 ప్రారంభ ధరతో అందుబాటులోకి వచ్చింది. దీని ప్రత్యేకత ఏమిటంటే.. ఇది తీసివేయగల బ్యాటరీతో వస్తుంది. ఇది ఒకే ఛార్జ్పై సుమారు 92 కిలోమీటర్ల రేంజ్ను అందిస్తుంది. ఇందులో గంటకు 70 కిలోమీటర్ల గరిష్ట వేగం, డిజిటల్ డాష్బోర్డ్, రివర్స్ అసిస్ట్ వంటి ఆధునిక ఫీచర్లు ఉన్నాయి.
మూడవది టీవీఎస్ ఐక్యూబ్.. ఇది ఇప్పటికే భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఒకటిగా నిలిచింది. BaaS పథకంతో.. దీని ప్రారంభ ధర రూ.59,999కి తగ్గింది. టాప్ వేరియంట్ 212 కిలోమీటర్ల వరకు రేంజ్ను అందజేస్తుంది. స్మార్ట్ఫోన్ కనెక్టివిటీ.. TFT డిస్ప్లే, పెద్ద స్టోరేజ్ వంటి ఫీచర్లు దీనిని మరింత ఆకర్షణీయంగా నిలిపాయి. మొత్తంమీద ఎలక్ట్రిక్ వాహనాలను మరింత అందుబాటులోకి తీసుకురావడంలో BaaS మోడల్ కీలక పాత్ర పోషిస్తోంది. ప్రారంభ ఖర్చును తగ్గించడం, వినియోగదారునికి సౌకర్యవంతమైన చెల్లింపు పద్ధతిని అందించడం దీని ప్రధాన ప్రయోజనంగా మారింది. భవిష్యత్తులో ఈ పథకం మరింత విస్తరించే అవకాశం ఉందని మార్కెట్లో నిపుణులు భావిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Nayanthara: తిరుమలలో నయనతార, విఘ్నేష్ సందడి
Dharmavaram, Andhra Pradesh:Actress Nayanthara Visits Tirumala Temple Along With Husband Vignesh Watch VideoTirumala: తెలంగాణ ఫిరాయింపు ఎమ్మెల్యే తిరుమలలో ప్రత్యక్షం
Dharmavaram, Andhra Pradesh:Telangana Congress MLAs Visits Tirumala Temple Watch VideoBest Used Cars: రూ.8.99 లక్షలకే మహీంద్రా థార్, టాటా హారియర్.. సెకండ్ హ్యాండ్ కార్ల ధమాకా!
Hyderabad, Telangana:Best Used Cars in Delhi Pitampura: తక్కువ ధరలో మంచి కారు కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే మీకు శుభవార్త.. మధ్యతరగతి ప్రజల ధరలకు కూడా అద్భుతమైన కండిషన్తో కూడిన సెకండ్ హ్యాండ్ కార్లు ఢిల్లీ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఢిల్లీలోని పీతంపురా ఏరియాలో ఉన్న సెకండ్ హ్యాండ్ కార్ల షోరూంలో అత్యంత తక్కువ ధరలకే మంచి మంచి కండిషన్ కలిగిన కార్లు లభిస్తూ ఉన్నాయి. అంతేకాకుండా ఇక్కడ అద్భుతమైన కార్లు రూ.2.60 లక్షల నుంచి ప్రారంభమవుతున్నాయి. అలాగే అదిరిపోయే ఫీచర్లు ఉన్న ఎస్యూవీ (SUV), సెడాన్, హ్యాచ్బ్యాక్ కార్లు చీపు ధరలకే లభించడం విశేషం. ముఖ్యంగా ఇక్కడ డీజిల్, పెట్రోల్, సిఎన్జి (CNG) ఆప్షన్లలో లభిస్తున్న కార్లను ఎక్కువగా వినియోదారులు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే, ఈ సెకండ్ హ్యాండ్ కార్ షోరూమ్స్లో అందుబాటులో ఉన్న కార్లు ఏంటో వాటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఈ కార్ల మార్కెట్లో టాటా హారియర్ (Tata Harrier) వంటి లగ్జరీ కార్లు రూ. 7.75 లక్షల నుంచి ప్రారంభమవుతున్నాయి. ముఖ్యంగా 2021కి సంబంధించిన మోడల్ హారియర్ కేవలం రూ. 8.99 లక్షలకే అందుబాటులో ఉండడం విశేషం. అలాగే ఆఫ్-రోడింగ్ ప్రియుల కోసం 2021 మోడల్ మహీంద్రా థార్ (Mahindra Thar) 4x4 వేరియంట్ రూ. 8.99 లక్షలకే అందుబాటులో ఉంది. అలాగే మధ్యతరగతి వారికి ఇష్టమైన మారుతి స్విఫ్ట్ డిజైర్ (Swift Dzire) ఆటోమేటిక్ వేరియంట్ రూ. 3.99 లక్షలకే లభిస్తోంది. ఇవే కాకుండా ఎన్నో రకాల మోడల్స్ అత్యంత తక్కువ ధరల్లో లభిస్తూ ఉన్నాయి.
ఇవే కాకుండా 2019 మోడల్ కు సంబంధించిన మహీంద్రా KUV ఆన్-పేపర్ సిఎన్జితో కలిపి రూ. 2.95 లక్షలకే అందుబాటులో ఉండడం విశేషం.. అదేవిధంగా 2015 కు సంబంధించిన ఫోర్డ్ ఫిగో కేవలం రూ. 2.60 లక్షలతో మొదలు కాబోతోంది. దీంతోపాటు 2016 మోడల్ కు సంబంధించిన హ్యుందాయ్ క్రెటా ధర రూ. 5.50 లక్షలకే లభిస్తోంది. అలాగే ఈ సిఎన్జి ఫిట్టింగ్తో అందుబాటులో ఉంది. ఇది హైవేపై దాదాపు 30 కిలోమీటర్ల వరకు మైలేజీని అందిస్తున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా 2018 మోడల్ హ్యుందాయ్ వెర్నా (Verna) కేవలం రూ. 6.25 లక్షలకు అందుబాటులో ఉంది.
Also Read: ‘దురంధర్’ సినిమాపై నోరు మెదపని ఖాన్స్ త్రయం.. ఇతర ఇండస్ట్రీ హీరోలు..
దీంతోపాటు కస్టమర్ల కోసం తాడుపాటి మెకానిక్ చెకప్ లేదా ఇన్ఫెక్షన్ చేసుకునే వెసులుబాటును కూడా ఈ మార్కెట్లో కొన్ని సెకండ్ హ్యాండ్ షోరూమ్స్ వారు వారే ప్రత్యేకంగా అందిస్తున్నారు. అంతేకాకుండా వీటితోపాటు ఫ్యాన్ ఇండియా లోన్ సదుపాయం, ఇతర రాష్ట్రాలకు వెళ్లే వారికోసం ఎన్ఓసీతో పాటు ట్రాన్స్ఫర్ వంటి బాధ్యతలను కూడా ఇక్కడున్న షోరూమ్ యజమానులే చూసుకుంటున్నట్లు సమాచారం. కాబట్టి తక్కువ ధరలో మంచి కారు కొనుగోలు చేయాలనుకునేవారు తప్పకుండా ఢిల్లీలోని పీతంపురా మెట్రో స్టేషన్ సమీపంలో ఉన్న సెకండ్ హ్యాండ్ కార్లు షోరూమ్స్ చాలా బెస్ట్ గా భావించవచ్చు..
Also Read: ‘దురంధర్’ సినిమాపై నోరు మెదపని ఖాన్స్ త్రయం.. ఇతర ఇండస్ట్రీ హీరోలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Karimnagar: తెలంగాణ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. కేసీఆర్తో మాజీ మంత్రి జీవన్ రెడ్డి భేటీ!
Hyderabad, Telangana:Karimnagar Telugu Latest News: తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకోబోతోంది. ఉమ్మడి కరీంనగర్ (Karimnagar) జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఈరోజు BRS అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావుతో భేటీ కాబోతున్నారు. ఎర్రబెల్లిలోని కేసీఆర్ నివాసానికి తన అనుచరులతో కలిసి జీవన్ రెడ్డి వెళ్లనుండటం ఇప్పుడు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది.. ఈరోజు జీవన్ రెడ్డి కెసిఆర్ ని కలవడానికి గల కారణాలేంటి? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఈ సమావేశాన్ని కేవలం మర్యాదపూర్వక భేటీగా జీవన్ రెడ్డి వర్గీయులు తెలిపినప్పటికీ.. దీని వెనక లోతైన రాజకీయ వ్యూహాలు ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. గత కొంతకాలంగా జిల్లా రాజకీయాల్లో చోటు చేసుకున్న మార్పులతో పాటు సొంత పార్టీలో నెలకొన్న అనిచ్చితి నేపథ్యంలో జీవన్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కెసిఆర్ తో భేటీ అనంతరం ఆయన భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ భేటీకి జీవన్ రెడ్డితో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన పలువురు కీలక Brs నేతలు కూడా హాజరు కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR, మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్తో పాటు గంగుల కమలాకర్, టిఆర్ఎస్ సీనియర్ నేత ఎల్ రమణ, దామోదర్ రావు తదితరులు ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. ఉమ్మడి జిల్లాలో పార్టీ బలోపేతంతో పాటు ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై కేసీఆర్ వీరికి దిశా నిర్దేశం చేయబోతున్నట్లు సమాచారం.
Also Read: ‘దురంధర్’ సినిమాపై నోరు మెదపని ఖాన్స్ త్రయం.. ఇతర ఇండస్ట్రీ హీరోలు..
జీవన్ రెడ్డి వంటి సీనియర్ నేత కేసిఆర్ చెంతకు చేరడం వల్ల ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో BRS కేడర్లో కొత్త ఉత్సాహం నెలకుంది. గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాము మాత్రం గా ఉన్న పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకే ఈ భేటీ ఉపయోగపడుతుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా కొప్పుల ఈశ్వర్ తో పాటు గంగుల కమలాకర్ వంటి సీనియర్ నేతల సమక్షంలో జరిగే ఈ సమావేశం జిల్లా రాజకీయ చిత్రపటాన్ని మార్చే అవకాశాలున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు..
Also Read: ‘దురంధర్’ సినిమాపై నోరు మెదపని ఖాన్స్ త్రయం.. ఇతర ఇండస్ట్రీ హీరోలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Shani Dev: ఏప్రిల్ 12 నుంచి శని గ్రహ మార్పు.. ఆ రాశుల వారికి ఆర్థిక కష్టాలు తప్పవా?
Hyderabad, Telangana:Shani Dev Effect On 4 Zodiac Signs Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనిగ్రహం మార్పుల కారణంగా మానవ జీవితాల్లో ఎన్నో రకాల ఊహించని మార్పులు సంభవిస్తూ ఉంటాయి. న్యాయదేవతగా పిలుచుకునే ఈ శని తన స్థితిని మార్చుకున్నప్పుడల్లా ద్వాదశ రాశుల వారిపై శుభ, అశుభ ప్రభావం పడుతూ ఉంటుంది. 2026 సంవత్సరం ఏప్రిల్ 12వ తేదీన శని దేవుడు మీన రాశిలో ఉదయించబోతున్నాడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఏదైనా గ్రహం తిరోగమన నుంచి సక్రమ మార్గంలోకి రావడం వల్ల అనేక మార్పులు సంభవిస్తాయి. ముఖ్యంగా శని గ్రహం శనివారం రోజున సక్రమ మార్గంలోకి రావడం వల్ల కొన్ని రాశుల వారిపై తీవ్ర ప్రభావం పడుతుంది. ముఖ్యంగా ఈ సమయంలో కొన్ని రాశుల వారు అనేక సమస్యలను ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఆర్థికంగా కూడా తీవ్రంగా నష్టపోతారు. కాబట్టి ఈ సమయంలో తప్పకుండా ఆయా రాశుల వారి జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.
ఈ రాశుల వారిపై శని ప్రభావం..
మేషరాశి
మేషరాశిలో జన్మించిన వ్యక్తులపై శని ప్రభావం విపరీతంగా పడబోతోంది. వీరికి ఊహించని స్థాయిలో ఖర్చులు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వీరు అనవసరపు వివాదాల్లో కూడా దూరి పేరును నాశనం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. దీంతోపాటు అనేక సమస్యలు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ఎన్నో రకాల దీర్ఘకాలిక సమస్యల భారిన కూడా పడే అవకాశాలు ఉన్నాయి.
కన్యరాశి
కన్యా రాశి వారికి భాగస్వామ్య వ్యాపారాల్లో అనేక ఇబ్బందులు రావడం ప్రారంభమవుతాయి. జీవిత భాగస్వామితో చిన్నపాటి విభేదాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ సమయంలో వీరి తప్పకుండా ఒకటికి రెండుసార్లు ఆలోచించడం చాలా మంచిది.. దీంతో పాటు ఆరోగ్య విషయంలో కూడా అశ్రద్ధ వహించకపోవడం మంచిదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో సంతానపరమైన సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆందోళన పడకుండా ఎంతో జాగ్రత్తగా ఉండి ముందుకు సాగడం చాలా మంచిదని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా ఉద్యోగాలు చేస్తున్న వారిపై ఈ సమయంలో విపరీతమైన ఒత్తిడి పెరుగుతుంది. తీసుకునే నిర్ణయాల్లో కూడా ఆలోచించి వ్యక్తిగత జీవితానికి ఏది బాగుంటుందని అనే అంశాన్ని ఒకటికి రెండుసార్లు ఆలోచించి ముందుకు సాగండి..
మీన రాశి
శని మీన రాశిలో ఉదయించడం వల్ల రాశి వారికి మానసిక ఆందోళన పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా అన్ని రకాల పనుల్లో విపరీతంగా జాప్యం జరుగుతుంది. ఏదైనా పని ప్రారంభించడం వల్ల ముందుకు సాగకపోవచ్చు. కాబట్టి ఈ సమయంలో కాస్త నెమ్మది నెమ్మదిగా పనులు చేస్తూ ముందుకు సాగాల్సి ఉంటుంది. దీంతోపాటు ముఖ్యమైన నిర్ణయాలు వాయిదా వేయడం చాలా మంచిదని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
IPL 2026 LSG vs KKR: ఓటమి నుంచి లక్నో విజయం.. బౌలర్ల వైఫల్యంతో కలకత్తా హ్యాట్రిక్ ఓటమి
Kolkata, West Bengal:KKR vs LSG Highlights: ఇది అసలైన క్రికెట్ ఆట.. ఇది అసలైన ఐపీఎల్ మజా. వరుసగా జరుగుతున్న మ్యాచ్లు నరాలు తెగే ఉత్కంఠతో కొనసాగుతుండగా.. లక్నో సూపర్ జియాంట్స్, కలకత్తా నైట్రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్ కూడా అదే స్థాయిలో జరిగింది. ఒక్కో బంతి ఒక్కో మలుపు తిరుగుతూ.. ఫలితం అటు ఇటు తారుమారు అవుతూ చివరకు విజయం లక్నో వైపు నిలవగా.. మరో ఓటమిని ఖాతాలో వేసుకుని ఈ సీజన్లో కలకత్తా హ్యాట్రిక్ పరాభవం మూటగట్టుకుంది.
Also Read: Gas Cylinder Theft: ఖమ్మంలో సరికొత్త దొంగతనం.. బంగారం కన్నా గ్యాస్ సిలిండర్ ఎక్కువ
వరుస ఓటములతో సతమతమవుతున్న కలకత్తా నైట్రైడర్స్ మరో ఓటమిని చవిచూసింది. లక్నో సూపర్ జియాంట్స్తో జరిగిన మ్యాచ్లో ఏమాత్రం పోరాటం చేయలేదు. మోస్తరు లక్ష్యాన్ని బౌలర్లు కాపాడడంలో విఫలమయ్యారు. కానీ లక్నో సూపర్ జియాంట్స్ అద్భుతంగా ఆడి ఓటమి నుంచి విజయం వైపుగా మ్యాచ్ను మలుపు తిప్పింది. కలకత్తా వేదికగా జరిగిన మ్యాచ్లో కలకత్తాపై మూడు వికెట్ల తేడాతో లక్నో విజయం సాధించి పాయింట్లను మెరుగుపర్చుకోగా.. కలకత్తా హ్యాట్రిక్ ఓటములతో చెన్నై సరసన నిలిచింది.
Also Read: Gas Cylinder Theft: ఖమ్మంలో సరికొత్త దొంగతనం.. బంగారం కన్నా గ్యాస్ సిలిండర్ ఎక్కువ
సొంతగడ్డపై టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన కోల్కత్తా నైట్రైడర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 181 పరుగులు చేసింది. కెప్టెన్ అజింక్యా రహనే 24 బంతుల్లో 41 పరుగులు చేయగా.. వాటిలో 4 ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి. ఫిన్ అలెన్ (9) తక్కువ స్కోర్కే పరిమితమవగా.. అంగ్క్రిష్ రఘువంశీ అద్భుతంగా ఆడి 33 బంతుల్లో 45 పరుగులు చేశాడు. వాటిలో 5 బౌండరీలు, రెండు సిక్సర్లు ఉన్నాయి. కామెరూన్ గ్రీన్ 24 బంతుల్లో 32 పరుగులతో రాణించగా.. రింకూ సింగ్ 4 పరుగులే చేశాడు. ఆఖరులో రావ్మన్ పావెల్ చెలరేగి ఆడి 39 పరుగులు చేసి జట్టుకు చెప్పుకోదగ్గ స్కోర్ను అందించాడు. వరుస వైఫల్యాలను పొందుతున్న సమయంలో విజయం కోసం భారీ స్కోర్ చేస్తారనుకుంటే మోస్తరు స్కోర్ నమోదు చేశారు. లక్నో సూపర్ జియాంట్స్ బౌలింగ్ చెప్పుకోదగ్గట్టు ఏమీ లేదు. ప్రిన్స్ యాదవ్, సిద్ధార్థ్, దిగ్వేష్ రాఠి, అవేశ్ ఖాన్ ఒక్కో వికెట్ తీశారు.
Also Read: Voice And SMS Packs: మొబైల్ వినియోగదారులకు తీపి కబురు.. డేటా లేకుండా రీచార్జ్ ప్లాన్స్
కలకత్తా నిలిపిన లక్ష్యాన్ని బంతులను పూర్తి చేసుకుని 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. సూపర్ ఓవర్ వెళ్తుందని భావించగా అనూహ్యంగా ముకుల్ చౌదరి బ్యాటింగ్తో అదరగొట్టి జట్టుకు విజయాన్ని అందించాడు. మిచెల్ మార్ష్ (15), కెప్టెన్ రిషబ్ పంత్ (10), నికోలస్ పూరన్ (13), అబ్దుల్ సమద్ (2), షమీ (1) తక్కువ పరుగులు చేయగా.. ఆయుశ్ బదౌనీ, ముకుల్ చౌదరి అద్భుతంగా ఆడారు. 34 బంతుల్లో 54 పరుగులు చేసిన ఆయుశ్.. 7 ఫోర్లు, రెండు సిక్సర్లతో చెలరేగి ఆడాడు. వికెట్లన్నీ టపాటపా పడుతున్నా.. ఓటమి ఖాయం చేసుకున్న సమయంలో ముకుల్ చౌదరి అద్భుతంగా ఆడాడు. ఎవరూ ఊహించని రీతిలో ఏడో స్థానంలో బ్యాటింగ్కు దిగి దుమ్మురేపాడు. 27 బంతుల్లో 54 పరుగులు చేసి విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. బౌండరీలు రెండు కొట్టగా.. ఏడు సిక్సర్లతో ధనాధన్ షాట్లు బాదాడు.
చివరి రెండు ఓవర్లు
విజయం కోసం ఏమాత్రం కలకత్తా బౌలర్లు ప్రయత్నం చేయలేకపోయారు. ఆరంభంలో టపాటపా వికెట్లు తీసినా.. ఓవర్లు ముగుస్తున్నా కొద్దీ బౌలింగ్ పదును తగ్గింది. ముఖ్యంగా చివరి రెండు ఓవర్లు చక్కగా వేసి ఉంటే ఫలితం వేరేలా ఉండేది. కానీ కలకత్తా బౌలర్లు గెలుపు బాధ్యత మరిచారో లేదో ఏమిటో తెలియదు కానీ వికెట్లు తీయకపోవడమే కాకుండా పరుగులను కూడా నియంత్రించలేకపోయారు. వైభవ్ అరోరా, అనుకుల్ రాయ్ రెండేసి వికెట్లు తీయగా.. సునీల్ నరైన్, కార్తీక్ త్యాగి, కామెరూన్ గ్రీన్ ఒక్కో వికెట్ తీశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Akanksha Puri Bikini Saree: చీరపై బికినీ బ్లౌజ్లో తమిళ హీరోయిన్ రచ్చ..సోషల్ మీడియాలో బండ బూతులు తిడుతున్నారు!
Hyderabad, Telangana:Akanksha Puri Bikini Saree Photots: సినీ తారల జీవితమంతా వారు ఏదో ఒక స్టైల్, ఫ్యాషన్ ట్రెండ్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అయితే అలాంటి కొన్ని విచిత్రమైన ఫ్యాషన్స్ సాధారణ ప్రజలకు అంతగా నచ్చకపోవచ్చు. అలా ఎంతో మంది సెలబ్రిటీలు తమ ఫ్యాషన్ డిజాస్టర్గా మిగిలిన రోజుల్లో ఎంతో మంది ట్రోల్స్కు గురైయ్యారు. ఇప్పుడదే కోవలో ఓ సీరియల్ నటిపై నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. అయితే ఈ 37 ఏళ్ల నటి తాజాగా జరిగిన ఓ ఫ్యాషన్ షోలో సంప్రదాయ దుస్తులైన చీరపై బికినీ బ్లౌజ్ ధరించి ర్యాంప్ వాక్ చేసింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది.
తమిళ, హిందీ, భోజ్పురీ వంటి భాషల్లో సుపరిచితమైన బోల్డ్ యాక్టరస్ ఆకాంక్ష పూరి. తమిళంలో విశాల్, తమన్నా జంటగా నటించిన 'యాక్షన్' సినిమాలోనూ ఆకాంక్ష నటించింది. ఈ సినిమా తెలుగు డబ్బింగ్ వర్షెన్ రిలీజ్ కాగా.. ఈమె తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. ఇటీవలే ఆమె 'సారీ పర్మైష్' అనే మ్యూజిక్ వీడియోతో తరచూ వార్తల్లో నానుతోంది. ఆ మ్యూజిక్ ఆల్బమ్ ప్రచారంలో భాగంగా ఓ ఫ్యాషన్ షోకు నటి ఆకాంక్ష పూరి హాజరైంది. అయితే అందులో ఆమె ధరించిన దుస్తులు ఇప్పుడు విమర్శలకు తావిస్తోంది.
ఈ ఆన్లైన్ ట్రోలింగ్కు కారణం ఏమిటంటే ఆమె ర్యాంప్ వాక్ సమయంలో సంప్రదాయ చీరపై బికినీ బ్లౌజ్ ధరించడమే అని తెలుస్తోంది. ఇదే విషయమై ఆమెపై సోషల్ మీడియాలో రకరకాల ట్రోల్స్ వస్తున్నాయి. కొందరు నెటిజన్లు ఆమెపై తిట్ల దండకం మొదలుపెడుతున్నారు. ఇప్పుడిదే ట్రోల్స్ పై నటి ఆకాంక్ష పూరి స్పందించారు.
బాంబే టైమ్స్ ఫ్యాషన్ వీక్లో డిజైనర్ రోహిత్ వర్మ కోసం నటి ఆకాంక్ష పూరి.. అతిథిగా ర్యాంప్పై నడిచినప్పటి నుంచి ఈమెపై సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ బిపాషా బసుతో సహా పలువురు ప్రముఖ తారలు విచ్చేశారు. అయితే ఈ ర్యాంప్ వాక్లో ఆకాంక్ష పూరి ధరించిన బికినీ బ్లౌజ్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ నటి సాంప్రదాయ మహారాష్ట్ర పైఠానీ చీరను ధరించి, దానికి బికినీ బ్లౌజ్ను ధరించడం చాలామందికి నచ్చలేదు.

ఈ క్రమంలో ఆమె ఈ దుస్తులలో ర్యాంప్పై నడిచినప్పుడు.. అందరూ ఆమె సిక్స్ ప్యాక్ అబ్స్, ఫిట్నెస్ను గమనించి కొందరు మెచ్చుకోగా మరికొందరు ఆ ఫొటోలను చూసి విమర్శిస్తున్నారు. ర్యాంప్ వాక్కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంటే.. ట్రోల్స్ మొదలయ్యాయి. ఇలాంటి దుస్తుల కాంబినేషన్ భారతీయ సంస్కృతిని అవమానించడమే అని కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరైతే 'చెత్త ఫ్యాషన్' అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు.
ఆన్లైన్ ట్రోలింగ్ పై నటి ఆకాంక్ష పూరి స్పందించింది. దుస్తులు అనేవి తన ఎంపిక కాదని చెప్పింది. అది కేవలం డిజైనర్ ఆలోచన అని ఆమె తెలిపింది. డిజైనర్ నచ్చిన దుస్తులను ర్యాంప్ వాక్లో ధరించాల్సి ఉంటుందని.. తన డిజైనర్ చెప్పిన దుస్తులనే ధరించానని ఆమె చెప్పుకొచ్చింది. ఈ క్రమంలో తన డిజైనర్ రోహిత్కు మద్దతుగా నిలిచింది. రోహిత్ డిజైన్ చేశాడంటే ఎంతో ఆలోచించి.. ఆ తర్వాతే అలా డిజైన్ చేసి ఉంటాడని వెల్లడించింది. అతని పూర్తిగా నమ్మకం ఉందని.. తనపై నమ్మకంతోనే ఆత్మవిశ్వాసంతో ర్యాంప్ వాక్ చేశానని జవాబు ఇచ్చింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Tirumala Laddu: తిరుమల లడ్డూ విక్రయాల్లో సరికొత్త రికార్డు
Dharmavaram, Andhra Pradesh:Tirumala Laddu Prasadam Record Sales In 2025 26 Financial Year Watch VideoSreeleela Video: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న శ్రీలీల
Dharmavaram, Andhra Pradesh:Actress Sreeleela Tirumala Darshan With Srivani Trust Quota Watch VideoGas Cylinder Theft: ఖమ్మంలో సరికొత్త దొంగతనం.. బంగారం కన్నా గ్యాస్ సిలిండర్ ఎక్కువ
Penuballi, Telangana:LPG Gas Cylinder: గ్యాస్ సిలిండర్ల సమస్య దేశంలో తీవ్రంగా వేధిస్తుండగా దొంగలు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దాని ప్రభావం ఎంతలా బంగారం, వెండి ఆభరణాలకు తగ్గట్టు అంతటి విలువ గ్యాస్ సిలిండర్ పొంది ఉంది. ఖమ్మం జిల్లాలో జరిగిన దొంగతనంలో బంగారు, వెండి ఆభరణాలతోపాటు గ్యాస్ సిలిండర్ను దొంగతనం చేశాడు. అంతేకాకుండా ఇంట్లో ఉన్న వంటనూనె క్యాన్ను కూడా తస్కరించాడు. వైరల్గా మారిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
Also Read: Cyber Fraud: వికసిత్ భారత్ పేరిట మోసం.. సైబర్ నేరగాళ్ల చేతిలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే
ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో పట్టపగలు జరిగిన చోరీ కలకలం రేపింది. దొంగలు బంగారం, వెండి ఆభరణాలతో పాటు వంట నూనె, గ్యాస్ సిలిండర్ను కూడా ఎత్తుకెళ్లడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. జార్ఖండ్ నుంచి వచ్చి లంకపల్లి గ్రామంలోని మసీద్లో నాలుగు సంవత్సరాలుగా మహమ్మద్ కమాలుద్దీన్ మౌల్వీ సాబ్గా పని చేస్తున్నాడు. మసీద్ ఆవరణలోనే నివాసం ఉంటూ లంకపల్లి సెంటర్లో ఫ్యాన్సీ షాపు నిర్వహించుకుంటూ జీవిస్తున్నాడు.
Also Read: Voice And SMS Packs: మొబైల్ వినియోగదారులకు తీపి కబురు.. డేటా లేకుండా రీచార్జ్ ప్లాన్స్
యథావిధిగా గురువారం తన ఇంటికి తాళం వేసి మౌల్వీ సాబ్ తన భార్యతో కలిసి దుకాణానికి వెళ్లారు. తర్వాత మధ్యాహ్నం ఇంటికి వచ్చే సరికి ఇంటి తాళాలు పగలకొట్టి.. ఇంట్లోని వస్తువులు చిందరవందరగా పడి ఉన్నాయి. లోపలికి వెళ్లి చూడగా బీరువా తాళాలు పగలకొట్టి ఉంది. పరిశీలించగా రూ.10 వేల నగదుతో పాటు 5.195 గ్రాముల బంగారు ఆభరణాలు, 454.74 గ్రాముల వెండి ఆభరణాలను దొంగతనానికి గురయ్యాయి. దీంతోపాటు ఇంట్లో ఉన్న నిత్యావసర వస్తువులు, 15 లీటర్ల వంట నూనె, గ్యాస్ సిలిండర్ను దొంగలు ఎత్తుకెళ్లారు. గ్యాస్ కనెక్షన్ను తీసేసి మరీ గ్యాస్ సిలిండర్ను దొంగలించడం గమనార్హం. బాధిత కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దొంగతనం జరిగిన విధానాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
మేడిపల్లిలో దొంగతనం
మల్కాజిగిరి కమిషనరేట్ మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధి పర్వతాపూర్ మల్లికార్జున్ నగర్ ఓ ఇంట్లో చోరీ జరిగింది. బంధువు మరణించాడని కుటుంబసభ్యులు వెళ్లి వచ్చేలోపు ఇంట్లో దొంగతనం చోటుచేసుకుంది. ఇంట్లోని బంగారం, వెండి ఆభరణాలు దుండగులు అపహరించారు. ఐదు తులాల బంగారు ఆభరణాలు, కొంత నగదు చోరీకి గురైందని బాధితురాలు రేణుక తెలిపారు.
సికింద్రాబాద్లో చైన్స్నాచింగ్
హైదరాబాద్ సికింద్రాబాద్లో చైన్ స్నాచింగ్కు పాల్పడుతున్న నిందితుడిని రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జీఆర్పీ, ఆర్పీఎఫ్ సంయుక్తంగా చేపట్టిన దర్యాప్తులో దొంగ చిక్కాడు. అతడి 50 గ్రాముల బంగారు నగలు స్వాధీనం చేసుకున్నారు. షేర్ మార్కెట్ నష్టాలు, ఆన్లైన్ బెట్టింగ్ కారణంగా ఈ నేరాలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. రెండు కేసులు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Telangana Ration Card: రేషన్కార్డుదారులకు షాకింగ్ న్యూస్..త్వరలోనే వాళ్లందరికీ రేషన్ కార్డులు కట్!
Hyderabad, Telangana:Telangana Ration Card News: రేషన్ కార్డుదారులకు దిమ్మతిరిగే వార్త ఇది. తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటికే 1.40 లక్షల రేషన్ కార్డులను తొలగించిన ప్రభుత్వం ఇప్పుడు అనర్హులను గుర్తించే పనిలో పడింది. అనర్హులకు నోటీసులు ఇవ్వడమే కాకుండా.. ఏఐ సాఫ్ట్వేర్ ఆధారంగా పనిచేసే ప్రక్రియను మరింత వేగవంతం చేస్తున్నారు.Bellamkonda Srinivas Marriage: హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్లి ఫిక్స్..పెళ్లి జరిగేది ఆరోజే..లగ్నపత్రిక రెడీ!
Hyderabad, Telangana:Bellamkonda Srinivas Marriage Invitation: టాలీవుడ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. హైదరాబాద్కు చెందిన కావ్యా రెడ్డి అనే వ్యాపారవేత్తను పెళ్లాడనున్నాడు. ఏప్రిల్ 29న వీరిద్దరి పెళ్లి జరగనుంది.Cyber Fraud: వికసిత్ భారత్ పేరిట మోసం.. సైబర్ నేరగాళ్ల చేతిలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే
Jangaon, Telangana:Viksit Bharat Scheme Cyber Fraud: సైబర్ నేరగాళ్లు సాధారణ ప్రజలను వదిలిపెట్టి వీవీఐపీలను పట్టుకుంటున్నారు. ఇప్పటికే ఏపీలో పలువురు ప్రజాప్రతినిధులను బురిడీ కొట్టి మోసం చేసిన సైబర్ మోసగాళ్లు ఇప్పుడు తెలంగాణ ఎమ్మెల్యేను కూడా తమ వలలో వేసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ పేరు చెప్పి ఎమ్మెల్యేతో మాట్లాడి రూ.లక్ష తన్నుకుపోయారు. తీరా అసలు విషయం తెలుసుకుని ఎమ్మెల్యే విస్తుపోయాడు. ఆ ఎమ్మెల్యే ఎవరో కాదు బీఆర్ఎస్ పార్టీ జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి. ఈ ఘటనపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
Also Read: Voice And SMS Packs: మొబైల్ వినియోగదారులకు తీపి కబురు.. డేటా లేకుండా రీచార్జ్ ప్లాన్స్
జనగామ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఫోన్కు ఒకరు ఫోన్ చేసి 'ఫైనాన్స్ అడిషనల్ సెక్రటరీ మాట్లాడుతున్నా. కేంద్ర ప్రభుత్వ పథకం వికసిత్ భారత్ ద్వారా నిరుద్యోగ యువతకు రూ.10 లక్షల వరకు రుణాలు ఇచ్చే అవకాశం ఉంది. దీనికి ఒక్కొక్కరికి రూ.2,500 ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంది' అని వివరించాడు. ఈ పథకంతో తన జనగామ నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతకు ఆర్థిక ప్రయోజనం లభిస్తుందని భావించిన పల్లా రాజేశ్వర్ రెడ్డి తనకు ఫోన్ చేసిన వ్యక్తికి రూ.లక్ష ఫోన్పే ద్వారా చెల్లించాడు. అనంతరం అసలైన ఫైనాన్స్ అడిషనల్ సెక్రటరీకి ఫోన్ చేసి డబ్బులు అందాయా? అని ఎమ్మెల్యే అడిగారు.
Also Read: Nayanthara: తిరుమలలో హీరోయిన్ నయనతారపై ఎగబడ్డ అభిమానులు
డబ్బులు ఎక్కడివి? ఏం మాట్లాడుతున్నారు? తాను ఫోనే చేయలేదని ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శి బదులివ్వడంతో పల్లా రాజేశ్వర్ రెడ్డి అవాక్కయ్యారు. తాను మోసపోయానని గ్రహించి వెంటనే జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సైబర్ క్రైమ్ విభాగంలో ఈ ఘటనపై కేసు నమోదైంది. సైబర్ మోసగాళ్ల చేతిలో ఎమ్మెల్యే మోసపోవడం ఇది తొలిసారి కాదు. గతంలో ఏపీకి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు కూడా మోసపోయారు.
సైబర్ నేరగాళ్లు, మోసగాళ్లు వీవీఐపీలనే ఈ స్థాయిలో మోసం చేస్తుంటే ఇక సాధారణ ప్రజల పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవాలి. అసలు నేరాల కంటే సైబర్ మోసాలు భారీగా పెరిగిపోతుండడంతో పోలీసులు వీటిపై ప్రత్యేకంగా దర్యాప్తు చేపడుతున్నారు. అయితే ఎంత చేసినా ముందు ప్రజలు సైబర్ మోసగాళ్లపై అవగాహన పెంచుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. అవగాహన ఉంటే మోసపోయే అవకాశం ఉండదని చెబుతున్నారు.
Also Read: YSR Death Reason: తండ్రి వైఎస్సార్ మరణం వెనుక వైఎస్ జగన్ హస్తం: అచ్చెన్నాయుడు తీవ్ర ఆరోపణలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
