icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

Garlic In Ghee Benefits: వెల్లుల్లిని నెయ్యిలో వేయించి తింటే..? ఎన్నో రకాల వ్యాధులకు అమృతంలా పనిచేస్తుంది!

Hyderabad, Telangana:

Fry Garlic In Ghee: నెయ్యి, వెల్లుల్లి.. ఈ రెండు భారతీయ వంటగదిలో విడదీయలేని భాగాలు. కేవలం రుచి కోసం మాత్రమే కాకుండా, ఆయుర్వేదంలో వీటి కలయికను ఒక శక్తివంతమైన ఔషధంగా పరిగణిస్తారు. నెయ్యిలో వేయించిన వెల్లుల్లిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కలిగే అద్భుత ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

వెల్లుల్లిలో ఉండే అల్లిసిన్ అనే సమ్మేళనానికి యాంటీ బాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. దీనిని నెయ్యిలో వేయించినప్పుడు ఆ పోషకాలను శరీరం త్వరగా గ్రహిస్తుంది. వెల్లుల్లి, నెయ్యి కలయిక సహజ రోగనిరోధక శక్తిని (రోగనిరోధక శక్తి) పెంచుతుంది. ముఖ్యంగా జలుబు, దగ్గు, వైరల్ ఇన్ఫెక్షన్ల బారి నుండి ఇది మనల్ని కాపాడుతుంది.

అలాగే నెయ్యిలోని బ్యూట్రిక్ యాసిడ్ జీర్ణవ్యవస్థను శుభ్రపరుస్తుంది. గ్యాస్, కడుపు ఉబ్బరం, అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలతో బాధపడేవారికి ఇది అద్భుతమైన ఇంటి చిట్కాగా మారుతుంది. వెల్లుల్లి శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, రక్తపోటును (బ్లడ్ ప్రెజర్) నియంత్రణలో ఉంచుతుంది. నెయ్యిలోని మంచి కొవ్వులు గుండె పనితీరును మెరుగుపరుస్తాయి. అదే విధంగా శరీరంలోని అంతర్గత వాపులను తగ్గించి, ఊపిరితిత్తుల నివారణలో ఈ మిశ్రమం కీలక పాత్ర పోషిస్తుంది.

ఎలా తీసుకోవాలి?
వెల్లుల్లి రెబ్బలను తొక్క తీసి, కొద్దిగా నెయ్యిలో దొరగా వేయించాలి. వీటిని ఉదయాన్నే పరగడుపున లేదా రాత్రి పడుకునే ముందు తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఏదైనా సరే సాధారణంగా తీసుకుంటేనే అమృతం. నెయ్యి, వెల్లుల్లి మిశ్రమాన్ని అతిగా తీసుకుంటే అజీర్ణం లేదా ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు.

(గమనిక: ఇప్పటికే ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు లేదా మందులు వాడుతున్న వారు, ఈ చిట్కాను పాటించే ముందు సంబంధిత వైద్య నిపుణుడ్ని సంప్రదించడం మేలు. దీన్ని జీ తెలుగు న్యూస్ ధ్రువీకరించడం లేదు.)

Also Read: ఒకే ఇంట్లో ఇద్దరికి రైతు భరోసా ఇస్తారా? ఏడాది రూ.12,000 పొందాలంటే ఏం చేయాలి?

Also Read: రిషబ్‌ పంత్‌కు బీసీసీఐ షాక్..వన్డే ప్రపంచకప్ టీమ్‌ నుంచి పంత్ ఔట్! అతని స్థానంలో..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Crime News: విశాఖలో ఘోరం..లేడీస్ హాస్టల్ నిర్వాహకుడి రాసలీలలు..పెళ్లైన 45 రోజులకే నవవధువు బలి!

Visakhapatnam, Andhra Pradesh:

Visakhapatnam Crime News: కాళ్ళకు పారాణి ఆరకముందే, నూరేళ్ల జీవితాన్ని పంచుకోవాల్సిన భర్త కాలయముడయ్యాడు. పెళ్లైన కేవలం 45 రోజులకే ఓ నవవధువు అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోవడం విశాఖపట్నంలోని రేసపువానిపాలెంలో తీవ్ర కలకలం రేపింది. భర్త పరాయి స్త్రీలతో పెట్టుకున్న సంబంధాలే ఈ మరణానికి కారణమని తెలుస్తోంది.

అసలేం జరిగింది?
శ్రీకాకుళం జిల్లాకు చెందిన సోమేశ్వరరావు, తేజశ్రీకి నెల రోజుల క్రితం వివాహం జరిగింది. సోమేశ్వరరావు విశాఖపట్నంలో ఒక లేడీస్ హాస్టల్ నడుపుతున్నాడు. పెళ్లైన కొద్దిరోజులకే భర్త అసలు స్వరూపం తేజశ్రీకి అర్థమైంది. హాస్టల్‌లో ఉండే కొందరు అమ్మాయిలతో సోమేశ్వరరావుకు అక్రమ సంబంధాలు ఉన్నాయని ఆమె గుర్తించింది.

భర్తను తేజశ్రీ నిలదీయడంతో, సోమేశ్వరరావు ఆమెపై వేధింపులకు దిగాడు. మానసికంగా, శారీరకంగా చిత్రహింసలు పెట్టడం మొదలుపెట్టాడు. ఈ పరిశీలన తేజశ్రీ తన తల్లిదండ్రులకు చెప్పుకుని ఏడ్చింది. అయితే, "కొత్త కాపురంలో సర్దుకుపోవాలి" అని వారు సర్దిచెప్పారు. కానీ, రోజురోజుకూ భర్త టార్చర్ మితిమీరిపోవడంతో, సున్నిత మనస్కురాలైన తేజశ్రీ తీవ్ర నిర్ణయం తీసుకుంది.

రేసపువానిపాలెం నివాసంలో తేజశ్రీ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు రంగంలోకి దిగారు. అయితే, ఇది ఆత్మహత్య కాదని.. భర్త సోమేశ్వరరావే ఆమెను చంపి, ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. త్రీ టౌన్ పోలీసులు ఘటనను పరిశీలించి కేసు నమోదు చేశారు. ప్రాథమిక ఆధారాల మేరకు భర్త సోమేశ్వరరావును అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు చేరుకున్నారు.

Also Read: త్వరలోనే హీరో విజయ్-త్రిషల పెళ్లి?! వీళ్లిద్దరి మధ్య వయసు గ్యాప్ ఎంత ఉందంటే?

ALso Read: బ్యాంకులకు వరుసగా 4 రోజులు సెలవులు..ఈ పనులు వెంటనే పూర్తి చేసుకోండి!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Dowry Death: 45 రోజులకే నవ వధువు ఆత్మహత్య.. బైక్ అంటే బైక్, పొలం అంటే పొలం ఇచ్చినా భర్త వేధింపులు

Visakhapatnam, Andhra Pradesh:

Husband Harassed For Additional Dowry: విశాఖపట్టణంలో అమానుష సంఘటన చోటుచేసుకుంది. ఎంతో ఘనంగా తల్లిదండ్రులు పెళ్లి చేయగా.. అత్తారింటికి కొత్త ఆశలతో ఆ యువతి కొత్త జీవితాన్ని ప్రారంభించింది. అత్తారింటికి వచ్చిన తర్వాత ఆమెకు వేధింపులు మొదలయ్యాయి. ఇతర అమ్మాయిలతో సంబంధాలు నడిపిస్తున్న భర్త నిజస్వరూపం తెలుసుకున్న భార్య నివ్వెరపోయింది. ఇదేమిటని నిలదీయగా.. భర్త ఎదురుదాడి చేసి వరకట్నం వేధింపులు ప్రారంభించాడు. ఇక కోరికల చిట్టా విప్పాడు. అడిగిన ఖరీదైన బైక్‌.. పొలం ఇచ్చినా కూడా అతడి వేధింపులు ఆగలేదు. దీంతో ఆమె మనస్తాపం చెంది ప్రాణాలు తీసుకున్నారు.

Also Read: Banks Strike: బ్యాంకు ఉద్యోగుల సంచలన నిర్ణయం.. 2 వీకాఫ్‌ల కోసం రెండు రోజుల సమ్మె!

విశాఖపట్టణం గార మండలం శిమ్మపేటకు చెందిన శిమ్మ లక్ష్మీ నారాయణ, శారద దంపతులు వ్యవసాయ కూలీలు. డిగ్రీ చదివిన కుమార్తె తేజశ్రీ (22)ని శ్రీకాకుళం మండలం రాగోలు సమీప గూడెం గ్రామానికి చెందిన రుప్ప మల్లేషు కుమారుడు రొప్ప సోమేశ్వరరావుకు ఇచ్చి ఈ ఏడాది మార్చి 6వ తేదీన వివాహం చేశారు. కట్నం కింద రూ.20 లక్షల నగదు, 20 తులాల బంగారం ఇచ్చుకున్నారు. విశాఖపట్నం ఎల్‌అండ్‌టీ కంపెనీలో ఇంజినీర్‌గా సోమేష్‌ నావల్‌ డాక్‌యార్డ్‌లో ప్రాజెక్టు డిజైనర్‌గా పనిచేస్తున్నాడు.

Also Read: Hyderabad Public: ఇంట్లో పనివారుగా నేపాలీలు వద్దు.. ప్రజలకు పోలీస్‌ కమిషనర్ సూచన

పెళ్లయిన అనంతరం సోమేశ్‌, తేజశ్రీ విశాఖపట్టణంలోని రామా టాకీస్‌ సమీపంలో అద్దె ఇంట్లో కాపురం పెట్టారు. కొంతకాలంగా విశాఖపట్టణంలో సోమేశ్వర రావు లేడీస్ హాస్టల్ నడుపుతుండగా.. అమ్మాయిలతో సంబంధాలు పెట్టుకున్నాడు. ఇది తెలుసుకున్న అనంతరం ఇటీవల ఓ యువతిని సోమేష్‌ ఇంటికి తీసుకురావడంతో భార్య తేజశ్రీ నిలదీసింది. అది సహించని సోమేష్‌ రూ.3 లక్షల విలువైన బైక్‌ కావాలని వేధించడంతో ఆ యువతి తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో అత్తామామలు నాలుగైదు రోజుల్లోనే అతడికి బండి కొనిచ్చేశారు. వారం రోజుల తర్వాత పది సెంట్లు భూమి రాయాలని, తులం నల్లపూసలు చేయించాలని మళ్లీ వేధించడంతో పాటు ఆమె తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి చెప్పింది. పెళ్లి ఆల్బమ్‌లో సగం మొత్తం రూ.1.50 లక్షలు అడగడంతో రూ.50 వేలు కూడా ఇచ్చారు.

గొడవ.. బలవన్మరణం
ఈనెల 7వ తేదీన ఉదయం 8 నుంచి 9 గంటల మధ్య సోమేష్, తేజశ్రీ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఇద్దరూ తమకు ఫోన్‌ చేశారని, గొడవ మామూలేనని తేజశ్రీ తమతో చెప్పిందని, ఆ తర్వాత పలు దఫాలు ఫోన్‌ చేసినా లిఫ్ట్‌ చేయలేదని ఆమె తల్లిదండ్రులు చెబుతున్నారు. ఉదయం 9.30 గంటలకు ఉరివేసుకుని మీ పాప చనిపోయిందని తన ఫ్రెండ్‌తో సోమేష్‌ ఫోన్‌ చేయించడంతో ఒక్కసారి హతాశులయ్యామని మృతురాలి తల్లిదండ్రులు వివరించారు. హుటాహుటినా విశాఖపట్టణం బయల్దేరి వెళ్లి చూడగా కుమార్తె బెడ్‌ మీద విగతజీవిగా ఉంది. అయితే మెడ, కాళ్లపై వాతలు ఉన్నాయని, సోమేష్‌ స్నేహితులు ముగ్గురు అక్కడే ఉండడంతో ఆమెను చంపేసి ఉంటారని మృతురాలి తల్లిదండ్రులు అనుమానించారు. ఇదే విషయమై విశాఖపట్నం త్రీటౌన్‌లో కేసు పెట్టామని, సోమేష్‌ను అదే రోజు పోలీసులు అరెస్టు చేశారని తెలిపారు. తమ కుమార్తెకు తీరని అన్యాయం జరిగిందని.. అదనపు వరకట్నం కోసం వేధించడమే కాక హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని తల్లిదండ్రులు వాపోయారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

0
0
Report
Advertisement

PBKS Vs DC Preview: పంజాబ్ కింగ్స్ పతనం ఆగిపోతుందా? ఢిల్లీ క్యాపిటల్స్ టోర్నీ నుంచి వైదొలగుతుందా?

Jhikli Barol, Himachal Pradesh:

PBKS Vs DC Preview 2026: ఐపీఎల్ 2026 సీజన్ క్లైమాక్స్ దశకు చేరుకుంటున్న వేళ ధర్మశాల వేదికగా జరగనున్న పంజాబ్ కింగ్స్ (PBKS), ఢిల్లీ క్యాపిటల్స్ (DC) పోరు ఆసక్తికరంగా మారింది. ఒకవైపు ప్లేఆఫ్ రేసులో నిలవాలని పంజాబ్, మరోవైపు పరువు కాపాడుకోవాలని ఢిల్లీ తహతహలాడుతున్నాయి.

శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో పంజాబ్ కింగ్స్ ఈ సీజన్‌లో వరుస విజయాలతో దూసుకెళ్లగా.. గత మూడు మ్యాచ్‌లలో మాత్రం చతికిలపడింది. ఆరంభ 7 మ్యాచ్‌లలో 6 గెలిచిన పంజాబ్, ఇప్పుడు వరుస ఓటములతో ఆత్మరక్షణలో పడింది. ధర్మశాలలోని పిచ్ పంజాబ్ కింగ్స్ జట్టుకు విజయాన్ని ఇస్తుందా లేదా? అనేది తెలియాల్సి ఉంది. 

మరోవైపు, అక్షర్ పటేల్ సారథ్యం ఢిల్లీలోని క్యాపిటల్స్ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. 11 మ్యాచ్‌లలో కేవలం 4 విజయాలతో ఇప్పటికే టాప్-4 రేసు నుంచి దాదాపు నిష్క్రమించింది. ఇప్పుడు ఆ జట్టు లక్ష్యం కేవలం పంజాబ్ విజయావకాశాలను దెబ్బతీసి, పరువు నిలబెట్టుకోవడం కోసమే మ్యాచ్ ఆడే అవకాశం కనిపిస్తుంది.

ఐపీఎల్ చరిత్రలో ఈ రెండు జట్ల మధ్య సమరం ఎప్పుడూ నువ్వా-నేనా అన్నట్లుగానే సాగుతోంది. పంజాబ్ కింగ్స్ (కింగ్స్ లెవెన్ పంజాబ్), ఢిల్లీ క్యాపిటల్స్ (ఢిల్లీ డేర్ డెవిల్స్) మధ్య మొత్తంగా 36 మ్యాచ్‌లు జరిగాయి. వాటిలో పంజాబ్ 18 మ్యాచ్‌ల్లో గెలుపొందగా.. ఢిల్లీ 17 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఈ సీజన్ మొదటి మ్యాచ్‌లో ఢిల్లీ నిర్దేశించిన 264 పరుగుల భారీ లక్ష్యాన్ని పంజాబ్ ఛేదించడం విశేషం.

పంజాబ్ కింగ్స్ గత మ్యాచ్‌లలో క్యాచ్‌లు వదిలేసి భారీ మూల్యాన్ని చెల్లించింది. సహాయ కోచ్ జేమ్స్ హూప్స్ అన్నట్లుగా, క్యాచ్‌లు పట్టి ఉంటే ఫలితాలు మరోలా ఉండేవి. సముద్ర మట్టానికి 1,457 మీటర్ల ఎత్తులో ఉంటే ఈ మైదానంలో గాలి పల్చగా ఉంటుంది. ఫలితంగా బంతి వేగంగా సీమ్ అవుతుందని పిచ్ క్యూరేటర్లు అంచనా వేస్తున్నారు. ఇది బ్యాటర్లకు అనుకూలించినా, అర్ష్‌దీప్ సింగ్, మిచెల్ స్టార్క్ వంటి బౌలర్లు స్వింగ్‌తో మాయ చేయగలరు. పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నుంచి ఒక భారీ ఇన్నింగ్స్ రావాల్సి ఉంది. అలాగే ఢిల్లీకి కేఎల్ రాహుల్ ఫామ్ ఆ జట్టుకు ఆందోళన కలిగిస్తోంది. ధర్మశాల పిచ్ సాధారణంగా పేస్, బౌన్స్‌కు సహకరిస్తుంది. బ్యాటర్లకు కూడా ఇది స్వర్గధామంగా మారనుంది.

పంజాబ్ కింగ్స్ (PBKS) తుదిజట్టు అంచనా
శ్రేయస్ అయ్యర్ (సి), ప్రభ్‌సిమ్రన్ సింగ్, ప్రియాన్ష్ ఆర్య, సూర్యాంశ్ షెగ్డే, మార్కస్ స్టోయినిస్, శశాంక్ సింగ్, అజ్మతుల్లా ఒమర్జాయ్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్‌దీప్ సింగ్, మార్కో జాన్సెన్. (ఇంపాక్ట్ ప్లేయర్: హర్‌ప్రీత్ బ్రార్)

ఢిల్లీ క్యాపిటల్స్ (DC) తుదిజట్టు అంచనా..
కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), అభిషేక్ పోరెల్, నితీష్ రాణా, ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్ (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, అశుతోష్ శర్మ, అఖీబ్ నబీ, లుంగి ఎంగిడి, మిచెల్ స్టార్క్, ముఖేష్ కుమార్. (ఇంపాక్ట్ ప్లేయర్: సమీర్ రిజ్వీ)

Also Read: మహేష్ బాబు మేనకోడలిని చూశారా? హీరోయిన్లనే మించిన అందం..క్యూట్‌లో క్వీన్!

Also Read: ప్రభుత్వ ఉద్యోగుల ఎగిరి గంతేసే వార్త..డీఏతో పాటు HRA పెంపునకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

YS Jagan Padayatra 2.0: ఆంధ్రప్రదేశ్‌లో మారుతున్న రాజకీయ సమీకరణాలు..జగన్ పాదయాత్ర ఖరారు..ప్రకటన అప్పుడే!

Tadepalli, Andhra Pradesh:

YS Jagan Padayatra 2.0 News: విదేశీ పర్యటన ముగించుకుని రాష్ట్రానికి తిరిగి వచ్చిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హీట్ పెంచేలా అడుగులు వేస్తున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకుంటున్న వేళ, అటు అధికార పక్షం.. ఇటు ప్రతిపక్షం వ్యూహప్రతివ్యూహాలతో సిద్ధమవుతున్నాయి.

లండన్ టూర్ ముగించుకుని బెంగళూరు చేరుకున్న జగన్, మంగళవారం తాడేపల్లికి రానున్నారు. 2024 ఎన్నికల ఓటమి తర్వాత పార్టీ సంస్థాగత బలోపేతంపై ఇప్పటివరకు పెద్దగా దృష్టి సారించని ఆయన, ఇకపై పూర్తిస్థాయిలో రంగంలోకి దిగాలని నిర్ణయించుకున్నారు.

మే 13న ఉన్నత స్థాయి సమావేశంలో పార్టీ ముఖ్య నేతలతో జగన్ భేటీ కానున్నారు. రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లే విధానంపై చర్చించనున్నారు. వైఎస్సార్ జయంతి సందర్భంగా జూలై 8, 9 తేదీల్లో రాష్ట్ర స్థాయి ప్లీనరీని నిర్వహించాలని కేడర్ నుంచి ఒత్తిడి వస్తోంది. 

దీనిపై ఈ సమావేశంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. గతేడాది వాయిదా పడుతూ వస్తున్న జిల్లాల పర్యటనలు, కార్యకర్తల సమావేశాలను తక్షణమే ప్రారంభించే దిశగా జగన్ మొగ్గు చూపుతున్నారు. పెండింగ్‌లో ఉన్న నియోజకవర్గాల సమన్వయకర్తల జాబితాను ఖరారు చేసి, ఎన్నికల మూడ్‌లోకి పార్టీని తీసుకెళ్లడం జగన్ ప్రధాన లక్ష్యం.

ఒకవైపు జగన్ వ్యూహాలు సిద్ధం చేసుకుంటుంటే, మరోవైపు రాష్ట్ర రాజకీయాల్లో కొన్ని కీలక మార్పులు కనిపిస్తున్నాయి. హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నివాసాలకు ప్రధాని వెళ్లడం కూటమి బలాన్ని చాటుతోంది. 

అదే విధంగా ఈ నెలాఖరులో నెల్లూరు వేదికగా మహానాడు నిర్వహించేందుకు టీడీపీ సిద్ధమైంది. దీని ద్వారా రెండేళ్ల పాలన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు. వచ్చే ఏడాది నుంచి జగన్ మళ్లీ పాదయాత్ర చేపట్టే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. దానికి ముందుగా పార్టీ కేడర్‌లో జోష్ నింపడం ఇప్పుడు అనివార్యంగా మారింది.

రెండేళ్ల కూటమి పాలన పూర్తవుతున్న తరుణంలో, విమర్శలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయి పోరాటాలకు జగన్ సిద్ధమవుతున్నారు. ప్లీనరీ ద్వారా కొత్త ఉత్సాహాన్ని నింపి, వచ్చే ఏడాది పాదయాత్రకు పునాది వేయడమే జగన్ తదుపరి వ్యూహంగా కనిపిస్తోంది.

Also Read: అనసూయపై అసభ్యకర కామెంట్స్..మరో నిందితుడు అరెస్ట్..ఏం జరిగిందంటే?

Also Read: Rukmini Vasanth Photos: కాటేసే కళ్లతో కొంటెగా చూస్తోంది కన్నడ భామ..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

PM Modi Public Call: బంగారంతో సహా ప్రజలకు ప్రధాని మోదీ 6 విజ్ఞప్తులు.. అవేమిటంటే?

Baddipadaga, Telangana:

Gold Price: తెలంగాణ పర్యటనకు వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు కొన్ని కీలక సూచనలు చేశారు. వాటిలో బంగారంతోపాటు విదేశీ ప్రయాణం, ఎరువుల వినియోగం తదితర అంశాలపై ప్రధాని విజ్ఞప్తులు చేశారు. దేశం కోసం కొన్ని తగ్గించుకోవాలని సూచనలు చేశారు. విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయడం కూడా దేశభక్తిలో భాగమని గుర్తుచేశారు. ప్రస్తుతం కరోనా వంటి సమయంలో ఎదుర్కొన్న పరిస్థితులు ఎదుర్కోవాలని హెచ్చరించారు.

Also Read: Narendra Modi: 'అబద్ధపు హామీలు ఇచ్చి మర్చిపోవడమే కాంగ్రెస్‌ మోడల్‌': ప్రధాని మోదీ

ప్రజలకు సూచనలు
==> మెట్రో సేవలను ఎక్కువగా వినియోగించాలి. కార్‌పూలింగ్‌ను ప్రోత్సహించాలి. సాధ్యమైనంత వరకు రైల్వే సరుకు రవాణాను వినియోగించాలి. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచాలి.
==> కనీసం ఏడాది పాటు విదేశీ పర్యటనలు తగ్గించుకోవాలి. విదేశీ వస్తువుల కొనుగోళ్లు తగ్గించాలి. దేశీయ ఉత్పత్తులను ప్రోత్సహించాల. వోకల్ ఫర్ లోకల్‌ను బలంగా అమలు చేయాలి. రోజువారీ జీవితంలో విదేశీ ఉత్పత్తుల స్థానంలో స్వదేశీ ఉత్పత్తులను ఉపయోగించాలి.
==> విదేశీ మారక ద్రవ్యాన్ని కాపాడుకోవాలి
==> ఏడాదిపాటు బంగారం కొనడం తగ్గించుకోవాలి
==> వంట నూనెల వినియోగాన్ని తగ్గించుకోవాలి
==> రైతులు రసాయన ఎరువులను తగ్గించుకోవాలి. రసాయన ఎరువుల వినియోగాన్ని 25 శాతం నుంచి 50 శాతం వరకు తగ్గించి సహజ వ్యవసాయం వైపు అడుగులు వేయాలి.

==> డీజిల్ పంపుల స్థానంలో సౌరశక్తి పంపులను ఉపయోగించాలి.

Also Read: Narendra Modi: తెలంగాణలో మార్పు అనివార్యం.. అబ్‌కీ బార్‌ బీజేపీ సర్కార్‌: ప్రధాని మోదీ

కరోనా కాలంలో అలవాటైన వర్క్ ఫ్రం హోమ్‌, ఆన్‌లైన్ సమావేశాలను మళ్లీ ప్రాధాన్యం ఇవ్వాలని ప్రధాని మోదీ సూచించారు. విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయడం కూడా దేశభక్తిలో భాగమని గుర్తుచేశారు. రసాయన ఎరువుల అధిక వినియోగంతో భూమి నాశనం అవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచ సంక్షోభాల సమయంలో ప్రతి పౌరుడు దేశహితం కోసం కట్టుబడి పనిచేయాలని పిలుపునిచ్చారు. ఇది ఒక్క ప్రభుత్వానికి.. ఒక్క పార్టీకి సంబంధించిన అంశం కాదని, దేశానికి సంబంధించిన బాధ్యత అని ప్రధాని మోదీ గుర్తుచేశారు. ప్రతి పౌరుడు, ప్రతి రాజకీయ పార్టీ, ప్రతి సంస్థ దేశ ప్రయోజనాల కోసం ఏకమై పనిచేస్తే దేశం ప్రతి సంక్షోభాన్ని జయిస్తుందని తెలిపారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement

Narendra Modi: 'అబద్ధపు హామీలు ఇచ్చి మర్చిపోవడమే కాంగ్రెస్‌ మోడల్‌': ప్రధాని మోదీ

Hyderabad, Telangana:

PM Modi Speech: బీజేపీ అభివృద్ధి, ఉపాధి సృష్టిపై దృష్టి సారిస్తుంటే కాంగ్రెస్ పార్టీ మాత్రం ప్రజలను మోసం చేసే రాజకీయాలు చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విమర్శలు చేశారు. దేశంలో మూడు రాష్ట్రాల్లోనే కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఉన్నారని, ఎక్కడ ఉన్నా కాంగ్రెస్ మోడల్ ఒకటే. ముందుగా అబద్ధపు హామీలు ఇవ్వడం.. తర్వాత వాటిని మర్చిపోవడమే. హిమాచల్‌, కర్ణాటకలో కాంగ్రెస్ తన హామీలను అమలు చేయకుండా ప్రజలను ఇబ్బందులకు గురి చేసింది. తెలంగాణలో కూడా అదే జరుగుతోంది' అని రేవంత్‌ రెడ్డిపై ప్రధాని మండిపడ్డారు.

Also Read: Narendra Modi: తెలంగాణలో మార్పు అనివార్యం.. అబ్‌కీ బార్‌ బీజేపీ సర్కార్‌: ప్రధాని మోదీ

తెలంగాణ పర్యటనకు వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేసిన అనంతరం హైదరాబాద్‌లోని సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన బీజేపీ భారీ బహిరంగ సభలో పాల్గొని కీలక ప్రసంగం చేశారు. తెలంగాణలో పాలన సాగిస్తున్న కాంగ్రెస్‌ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. అయితే రేవంత్‌ రెడ్డి పేరు ప్రస్తావించకుండా ప్రసంగం చేయడం గమనార్హం. 'కాంగ్రెస్ ఇప్పుడు దేశాన్ని విభజించే రాజకీయాలకు కేంద్రంగా మారింది. మావోయిస్టు భావజాలాన్ని ప్రోత్సహించేలా కాంగ్రెస్ వ్యవహరిస్తోంది. ముస్లిం లీగ్ కంటే కూడా కఠిన వైఖరితో ముందుకెళ్తోంది. అందుకే ప్రజలు కాంగ్రెస్‌ను ముస్లిం లీగ్ మావోయిస్టు కాంగ్రెస్‌గా అభివర్ణిస్తున్నారు' అని ప్రధాని మోదీ విమర్శించారు. మావోయిస్టు ఉగ్రవాదం కారణంగా దేశం ఎన్నో నష్టాలు చవిచూసిందని, తెలంగాణ కూడా దశాబ్దాల పాటు బాధలు అనుభవించిందని ప్రధాని గుర్తుచేశారు.

Also Read: Telangana CM: 'తెలంగాణపై ప్రధాని మోదీ పెద్ద మనసు చూపాలి: రేవంత్‌ రెడ్డ

కాంగ్రెస్‌, వామపక్షాలు మావోయిస్టులకు భావజాల పరంగా మద్దతు ఇవ్వడంతోనే ఈ సమస్య ఇంతకాలం కొనసాగింది. తెలంగాణ పోలీసులకు పూర్తిస్థాయి స్వేచ్ఛ ఇచ్చి ఉంటే మావోయిస్టు ఉగ్రవాదాన్ని చాలా కాలం కిందటే అంతం చేసేవారు. ఎన్డీఏ ప్రభుత్వ కృషితో ఇప్పుడు తెలంగాణ మావోయిస్టుల నుంచి విముక్తి దిశగా వెళ్తోంది' అని ప్రధాని మోదీ తెలిపారు. ప్రస్తుతం భారత్ అభివృద్ధి దిశగా వేగంగా పయనిస్తున్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సంక్షోభాలను ఎదుర్కొంటోందని వివరించారు.

Also Read: Bandi Bageerath POCSO: రేవంత్‌ రెడ్డి ఏం చేస్తున్నావు? బండి సంజయ్‌ కొడుకు కేసుపై హరీశ్‌ రావు నిలదీత

'కరోనా తర్వాత సరఫరా వ్యవస్థలు దెబ్బతిన్నాయి. ఉక్రెయిన్ యుద్ధంతో ఆహారం, ఇంధనం, ఎరువుల ధరలు ప్రపంచవ్యాప్తంగా పెరిగాయి. అయినప్పటికీ భారత ప్రభుత్వం ప్రజలపై భారం పడకుండా రైతులకు భారీ సబ్సిడీతో ఎరువులను అందిస్తున్నాం. ప్రపంచ మార్కెట్‌లో రూ..3000 ఉన్న ఎరువుల సంచిని భారత రైతులకు రూ.300 లోపే అందిస్తున్నాం' అని ప్రధాని మోదీ వివరించారు.  దేశ ప్రయోజనాల కోసం ప్రజలు కొన్ని సంకల్పాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. 

కార్యకర్తల్లో జోష్‌
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన సభలో ప్రధాని మోదీ కార్యకర్తలను ఉత్సాహపరిచారు. సభా ప్రారంభానికి ముందు తన కోసం కార్యకర్తలు, చిన్నారులు తీసుకొచ్చిన పెయింటింగ్స్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించి తన భద్రతా సిబ్బందితో తీసుకున్నారు. ఆ చిత్రాలను సేకరించాలని ఎస్పీజీ అధికారులను ఆదేశించిన అనంతరం సేకరించిన పెయింటింగ్స్‌పై చిత్రకారుల అడ్రస్‌లు ఉంటే వారికి స్వయంగా లేఖలు రాస్తానని చెప్పడంతో కార్యకర్తల్లో జోష్‌ వచ్చింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Narendra Modi: తెలంగాణలో మార్పు అనివార్యం.. అబ్‌కీ బార్‌ బీజేపీ సర్కార్‌: ప్రధాని మోదీ

Baddipadaga, Telangana:

PM Modi Full Speech: 'తెలంగాణ రాజకీయాల్లో మార్పు అనివార్యం. అబ్‌కీ బార్ తెలంగాణాలో కూడా బీజేపీ ప్రభుత్వం అనే నినాదం ఇప్పుడు ప్రజల సంకల్పంగా మారింది' అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ చారిత్రాత్మక విజయాన్ని సాధించినట్టు తెలంగాణలో కూడా కుటుంబ, అవినీతి రాజకీయాలకు ముగింపు పలకాలని నిర్ణయించుకున్నారని చెప్పారు. కాంగ్రెస్‌ ప్రజలను మోసం చేసిందని.. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని స్పష్టం చేశారు.

Also Read: Telangana CM: 'తెలంగాణపై ప్రధాని మోదీ పెద్ద మనసు చూపాలి: రేవంత్‌ రెడ్డి

హైదరాబాద్‌లోని సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో జరిగిన బీజేపీ బహిరంగ సభలో ప్రధాని మోదీ కీలక ప్రసంగం చేశారు. జాతీయ, తెలంగాణ రాష్ట్ర రాజకీయాలతోపాటు ప్రపంచ పరిణామాలపై ప్రధాని స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. 'పశ్చిమ బెంగాల్‌లో తొలిసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. అక్కడి చారిత్రాత్మక విజయోత్సాహం ఇప్పుడు తెలంగాణలో కూడా కనిపిస్తోంది. తెలంగాణ బీజేపీ కార్యకర్తల్లో అపారమైన జోష్ కనిపిస్తోంది' అని ప్రధాని తెలిపారు.

Also Read: Bandi Bageerath POCSO: రేవంత్‌ రెడ్డి ఏం చేస్తున్నావు? బండి సంజయ్‌ కొడుకు కేసుపై హరీశ్‌ రావు నిలదీత

'దేశవ్యాప్తంగా బీజేపీ అభివృద్ధి మోడల్‌, సుపరిపాలనపై ప్రజలు మళ్లీ మళ్లీ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు' అని ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను ప్రధాని మోదీ ప్రస్తావించారు. ఇప్పుడు తెలంగాణలో అబ్‌కీ బార్ బీజేపీ సర్కార్‌ అని ప్రజలు స్పష్టంగా చెబుతున్నారని పేర్కొన్నారు. 'పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ విజయం కేవలం రాజకీయ గెలుపు మాత్రమే కాదు. ప్రజలను సంవత్సరాల పాటు బంధించిన కుటుంబ, నియంతృత్వ రాజకీయాలపై ప్రజలు ఇచ్చిన తీర్పు' అని తెలిపారు. 'కాంగ్రెస్ అవినీతి, కుటుంబవాదం, రాజ్యాంగ సంస్థలను బలహీనపరిచే రాజకీయాలకు మారుపేరుగా మారింది. అదే మార్గంలో తృణమూల్‌ కాంగ్రెస్‌ కూడా నడిచింది. ఇప్పుడు ప్రజలు అలాంటి రాజకీయాలను తిరస్కరిస్తున్నారు' అని ప్రధాని మోదీ వివరించారు.

'దక్షిణాది నుంచి ఈశాన్య రాష్ట్రాల వరకు బీజేపీని చిన్న పార్టీగా చూసేవారు. కానీ నేడు దేశవ్యాప్తంగా బీజేపీపై ప్రజల్లో అపారమైన విశ్వాసం పెరిగింది. తెలంగాణకు బీజేపీ చరిత్రలో ప్రత్యేక స్థానం ఉంది. దేశంలో బీజేపీకి కేవలం ఇద్దరు ఎంపీలు ఉన్న సమయంలో తెలంగాణ నుంచే ఒక ఎంపీ గెలిచారు' అని ప్రధాని మోదీ గుర్తుచేశారు. దేశంలో మద్దతు లేకపోయినా తెలంగాణ ప్రజలు బీజేపీకి అండగా నిలిచారని చెప్పారు. ఇప్పుడు తెలంగాణ నుంచి దాదాపు సగం మంది ఎంపీలు బీజేపీ తరఫున గెలిచారని.. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో కూడా బీజేపీ ఘన విజయం సాధిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు.

కాంగ్రెస్‌‌ పార్టీ వాగ్దానాల మోసం, కుటుంబ రాజకీయాలతో తెలంగాణ ప్రజలు విసిగిపోయారు. అందుకే రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. రాష్ట్ర అభివృద్ధే దేశ అభివృద్ధి అనే సిద్ధాంతంతో కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోంది. అభివృద్ధి చెందిన భారత నిర్మాణంలో తెలంగాణ, హైదరాబాద్ కీలక పాత్ర పోషించాలని కేంద్రం కట్టుబడి ఉంది' అని ప్రధాని మోదీ వివరించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

PM Modi Visit Hyderabad: డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌కు ప్రధాని మోదీ పరామర్శ..సీఎం చంద్రబాబు ఇంట్లో గంటకు పైగా భేటీ!

Hyderabad, Telangana:

PM Modi Visit CBN Residence: హైదరాబాద్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ బిజీ షెడ్యూల్ మధ్య ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నివాసాలను సందర్శించారు. జూబ్లీహిల్స్ పరిసరాల్లోని కూటమి నేతల ఇంటికి వెళ్లి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేశారు. రాజకీయ ప్రాధాన్యతతో పాటు వ్యక్తిగత అనుబంధాన్ని చాటుతూ ఈ పర్యటన సాగింది.

ప్రధాని మోదీ తొలుత డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నివాసానికి వెళ్లారు. ఇటీవల పవన్ కల్యాణ్‌కు సైనస్ సమస్య కారణంగా శస్త్రచికిత్స జరిగింది. ప్రస్తుతం ఆయన తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ క్రమంలో పవన్ ఇంటికి వెళ్లిన మోదీ, ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

పవన్ నివాసం నుంచి ప్రధాని నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్లారు. ప్రధానికి చంద్రబాబుతో పాటు మంత్రి నారా లోకేశ్ ఘనస్వాగతం పలికారు. దాదాపు గంటకు పైగా చంద్రబాబు నివాసంలో గడిపిన మోదీ, బాబుతో కలిసి వివిధ రాజకీయ, అభివృద్ధి అంశాలపై కీలక చర్చలు జరిపారు.

ఎక్స్‌ (ట్విట్టర్) వేదికగా ప్రధాని స్పందన
చంద్రబాబు కుటుంబ సభ్యులతో దిగిన ఫొటోలను ప్రధాని మోదీ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. "చంద్రబాబు నాయుడు గారి నివాసానికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను కలవడం ఎంతో సంతోషాన్నిచ్చింది. ఎన్నో విభిన్నమైన అంశాలపై అభిప్రాయాలను పంచుకోవడం చాలా బాగుంది" అని మోదీ పేర్కొన్నారు.

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, హైదరాబాద్ వేదికగా ప్రధాని మోదీ స్వయంగా వీరి ఇళ్లకు వెళ్లి కలవడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ఇది ఇరు పార్టీల మధ్య ఉన్న బలమైన బంధానికి నిదర్శనమని విశ్లేషకులు భావిస్తున్నారు.

Also Read: "చచ్చేంత వరకు నా మాజీ లవర్స్‌ను ప్రేమిస్తూనే ఉంటా" విష్ణుప్రియ సంచలన వ్యాఖ్యలు

Also Read; కృనాల్ పాండ్యా చొక్కా పట్టుకున్న పూరన్..LSG Vs RCB మ్యాచ్ తర్వాత మైదానంలో డిష్యుం..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement

Explosives in Modi Tour: ప్రధాని మోదీ పర్యటనలో బాంబు కలకలం..నగరం మొత్తం టెన్షన్ టెన్షన్!

Agara, Karnataka:

Explosives Found in Modi Tour: బెంగళూరులో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన వేళ పేలుడు పదార్థాల లభ్యం కావడం తీవ్ర సంచలనం సృష్టించింది. కర్ణాటక పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ కార్యక్రమ వేదికకు కూతవేటు దూరంలో పేలుడు పదార్థాలు బయటపడటం భద్రతా వర్గాలను ఉలిక్కిపడేలా చేసింది. బెంగళూరు శివార్లలోని ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆశ్రమంలో జరిగే వేడుకకు ప్రధాని హాజరుకావాల్సి ఉండగా, ఈ ఘటన వెలుగు చూసింది.

ఏం జరిగింది?
ఆదివారం నాడు ప్రధాని మోదీ ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ 45 ఏళ్ల ఉత్సవాల్లో పాల్గొనేందుకు షెడ్యూల్ ఖరారైంది. ఈ నేపథ్యంలో పోలీసులు ముందస్తు తనిఖీల్లో ప్రధాన వేదికకు కేవలం 3 దూరంలో ఉన్న కాగలిపుర సమీపంలోని ఫుట్‌పాత్ పక్కన రెండు జిలాటిన్ స్టిక్‌లు లభ్యమయ్యాయి. సమాచారం అందిన వెంటనే బాంబు నిర్వీర్య దళం (BDDS), ఫోరెన్సిక్ నిపుణులు అక్కడికి చేరుకుని ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. 

ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ జిలాటిన్ స్టిక్స్ అక్కడికి ఎలా వచ్చాయనే దానిపై పోలీసులు రెండు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. సమీపంలోని క్వారీ పనుల కోసం తెచ్చినవి పొరపాటున అక్కడ పడిపోయాయా? లేదా ప్రధాని పర్యటనను టార్గెట్ చేస్తూ ఎవరైనా ఉద్దేశపూర్వకంగా అక్కడ ఉంచారా? అనే కోణంలో విచారణ సాగుతోంది.

ఆశ్రమంలో ప్రధాని ప్రసంగం
భద్రతా ముప్పు పొంచి పర్యటన, కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య ప్రధాని మోదీ తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఆర్ట్ ఆఫ్ లింగ్ వ్యవస్థాపకుడు శ్రీ శ్రీ రవిశంకర్ సామాజిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలను ఆయన కొనియాడారు. ఆశ్రమ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన ధ్యాన మందిరాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. బెంగళూరు కేవలం టెక్నాలజీకే పరిమితం కాకుండా, ఆధ్యాత్మిక చైతన్యానికి కేంద్రంగా మారిందని ప్రధాని ప్రశంసించారు. ప్రకృతి వ్యవసాయం, పర్యావరణ పరిరక్షణలో వాలంటీర్లు కావాలని కోరుతున్నారు.

ALso Read: ఉద్యోగులకు ఊరట! ఏటీఎం నుంచి PF డబ్బులు విత్‌డ్రా..తాజాగా అప్‌డేట్ ఇదే..

Also Read: Pooja Hegde Photos: జిమ్ డ్రస్సులో సెగలు పుట్టిస్తున్న పూజా హెగ్డే..కెవ్వుకేక అంతే!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement

Telangana CM: 'తెలంగాణపై ప్రధాని మోదీ పెద్ద మనసు చూపాలి: రేవంత్‌ రెడ్డి

Hyderabad, Telangana:

Revanth Reddy Meets Narendra Modi: 'తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కేంద్ర ప్రభుత్వ సహకారం కావాలి. వికసిత్‌ భారత్‌ లక్ష్యం నెరవేరాలంటే తెలంగాణ కూడా అభివృద్ధి చెందాలి. ప్రధానమంత్రిగా మన్మోహన్‌ సింగ్‌ అందించినట్టు సహకారం మీరు అందించాలి' అని ప్రధానమంత్రిని తెలంగాణ ముఖ్యమంత్రి కోరారు. ఎన్నికలు ముగిసిపోవడంతో రాజకీయాలు పక్కనబెట్టి అభివృద్ధిపై అందరం దృష్టి సారించాలని రేవంత్‌ రెడ్డి పేర్కొన్నారు.

Also Read: PM Modi Tour Live Updates: తెలంగాణ అభివృద్ధి మేం పెద్దపీట వేస్తున్నాం: ప్రధాని... లైవ్ అప్డేట్స్

హైదరాబాద్‌ పర్యటకు వచ్చిన ప్రధానమంత్రి హెచ్‌ఐసీసీలో తెలంగాణకు సంబంధించిన రూ.9,377 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. ప్రధానమంత్రికి స్వాగతం పలికి జ్ఞాపిక అందించిన అనంతరం రేవంత్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. 'ఇది వికాస ఉత్సవం. తెలంగాణ అభివృద్ధికి ఎంతో కీలకం. మీరు వికసిత్‌ భారత్‌ ప్రకటించిన సమయంలోనే మేం 2047 పాలసీ డాక్యుమెంట్‌ రూపొందించాం' అని గుర్తుచేశారు.

Also Read: Bandi Bageerath POCSO: రేవంత్‌ రెడ్డి ఏం చేస్తున్నావు? బండి సంజయ్‌ కొడుకు కేసుపై హరీశ్‌ రావు నిలదీత

'5 రాష్ట్రాల ఎన్నికలు ముగియగానే అభివృద్ధి పనులు ముందుకు తీసుకెళ్లడానికి ప్రధానమంత్రి వచ్చారు. రాజకీయాలు పక్కనపెట్టి అభివృద్ధిపై అందరం దృష్టి సారించాలి' అని తెలంగాణ సీఎం తెలిపారు. '2047 నాటికి దేశ ఎకానమీని 30 ట్రిలియన్‌లకు చేర్చాలని ప్రధానమంత్రి లక్ష్యంగా పెట్టుకున్నారు. 3 శాతం జనాభా ఉన్న తెలంగాణ దేశంలో 10 శాతం ఎకానమీని లక్ష్యంగా పెట్టుకుంది. 2047 నాటికి తెలంగాణ 3 ట్రిలియన్ల ఎకానమీ చేరుకోవడమే మా లక్ష్యం' అని రేవంత్ రెడ్డి ప్రకటించారు.

'ఆరోజు మన్మోహన్‌ సింగ్‌లాగా ఇప్పుడు మీ సహకారం కావాలి. దేశంలో 6 నగరాలను గ్రోత్‌ ఇంజిన్‌లాగా అభివృద్ధి చేయండి. టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేసి సింగిల్‌ విండో ద్వారా అనుమతులు ఇవ్వండి' అని ప్రధానమంత్రిని రేవంత్ రెడ్డి కోరారు. 'దేశం అభివృద్ధి చెందుతున్నంత వేగంగా తెలంగాణ అభివృద్ధి చెందాలనుకుంటుంది. అందుకు మీ సహకారం కావాలి. మచిలీపట్నం పోర్టు వరకు వేగంగా రైల్వే లైన్‌ వేయండి. పెండింగ్‌ ప్రాజెక్టులకు వెంటనే అనుమతులు ఇవ్వండి. మోడీది పెద్దమనసు అని బండి సంజయ్‌, కిషన్‌ రెడ్డి అంటారు. తెలంగాణపై కూడా పెద్ద మనసు చూపించండి' రేవంత్‌ రెడ్డి కోరారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

MS Dhoni For Peddi: 'పెద్ది' సినిమా కోసం రంగంలోకి ఎంఎస్ ధోనీ..రామ్‌చరణ్ కోసం గ్రాండ్‌గా పబ్లిసిటీ!

Hyderabad, Telangana:

Dhoni For Peddi Pre-Release Event: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న భారీ చిత్రం 'పెద్ది' విడుదలకు సిద్ధమవుతున్న వేళ, సినీ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన వార్త హల్ చల్ చేస్తోంది. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం ఏకంగా క్రికెట్ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోని రంగంలోకి దిగుతున్నట్లు సమాచారం అందుతోంది. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ లేదా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు ధోనీ హజరయ్యే అవకాశం కనిపిస్తోంది. 

రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కలయికలో వస్తున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమా, ఫైనల్‌గా జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.

సినిమా రిలీజ్ దగ్గర పడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్స్ వేగాన్ని పెంచారు. తాజా సమాచారం ప్రకారం.. 'పెద్ది' సినిమా ట్రైలర్‌ను మే 16న గ్రాండ్ లాంఛ్ ఈవెంట్ నిర్వహించనున్నారని సమాచారం అందుతోంది. ఈ ఈవెంట్‌ను తెలుగు రాష్ట్రాల్లో కాకుండా, నార్త్ మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకుని మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో నిర్వహించనున్నారని తెలుస్తోంది.

ఈ వేడుకకు మాజీ కెప్టెన్ MS ధోని ముఖ్య అతిథిగా హాజరయ్యే అవకాశం ఉందట. రామ్ చరణ్ - ధోని మధ్య ఉన్న స్నేహం, అలాగే ఈ సినిమాలో చరణ్ ఒక రూరల్ క్రికెటర్‌గా కనిపిస్తారనే ప్రచారం నేపథ్యంలో ధోని రాకకు ప్రాధాన్యత సంతరించుకుంది.

మరో విశేషం ఏమిటంటే.. ఈ ఈవెంట్‌లో ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ లైవ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నారట. ఇప్పటికే ఈ సినిమాలోని 'చికిరి చికిరి' పాట 200 మిలియన్లకు పైగా వ్యూస్‌తో యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. ఇప్పుడు రెహమాన్ స్వయంగా స్టేజ్ మీద సందడి చేయనుండటం అభిమానులకు కన్నుల పండుగే అని చెప్పాలి. నార్త్ ఇండియాలో 'పుష్ప' సాధించిన ఘనవిజయాన్ని దృష్టిలో ఉంచుకుని, 'పెద్ది' సినిమాకు కూడా అక్కడ భారీ ఓపెనింగ్స్ రాబట్టాలని మేకర్స్ పట్టుబడుతున్నారు. అందుకే బాలీవుడ్ బెల్ట్‌లో ఈ స్థాయి ఈవెంట్‌ను ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.

గమనిక: ధోని రాక, భోపాల్ ఈవెంట్‌పై ఇంకా చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఒకవేళ ఇది నిజమైతే, ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఇది ఒక బిగ్గెస్ట్ ప్రమోషనల్ ఈవెంట్‌గా మారే అవకాశం కనిపిస్తోంది!

Also Read: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్..ప్రశాంత్ నీల్ సినిమా నుంచి సాలిడ్ అప్‌డేట్..

Also Read: బాలయ్యపై మనసు పారేసుకున్న బాలీవుడ్ బ్యూటీ..'ఆయన వయసుతో పనేముంది' అంటున్న హీరోయిన్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Petrol Diesel Price Hike: మే 15 నుంచి భారీగా పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. లీటరుకు రూ.4 నుంచి రూ.5 వరకు పెంపు?

Hyderabad, Telangana:

Petrol Diesel Price Hike News: పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు మే 15 తర్వాత భారీగా పెరుగుతున్నాయని వార్తలు వెల్లువెత్తుతున్నాయి. చమురు కంపెనీలు ఆయిల్ ధరలను పెంచేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇటీవలే 5 రాష్ట్రాల అసెంబ్లీ ఫలితాల తర్వాత ఇంధన ధరలు పెరుగుతాయని ఎప్పటినుంచో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఇదే విషయంపై గతంలో కేంద్ర ప్రభుత్వం ఖండించింది. 

ఎందుకంటే ఇప్పటికే నెలకు రూ.30,000 కోట్ల నష్టాల్లో ఉన్న ఈ కంపెనీలు మే 15 నుంచి ధరలను సవరించే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి. అయితే పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు ఏమాత్రం పెరగనున్నాయి. దీని వల్ల సామాన్యుడిపై భారం ఎంత మోపనున్నారు? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. 

దేశ ప్రజలు మరోసారి ఇంధన ధరల పెంపు భయాన్ని ఎదుర్కొంటున్నారు. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో భారతదేశంలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ సిలిండర్ల ధరలు పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. నివేదికల ప్రకారం.. చమురు కంపెనీలు మే 15వ తేదీలోగా కొత్త ధరలను సవరించే అవకాశం ఉందని తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం నుండి అనుమతి లభించిన వెంటనే వాటిని ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ఇది సామాన్యుడిపై ఎంతో భారం పడనుంది.

ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ఒక్క బ్యారెల్ ముడి చమురు ధర 120 డాలర్ల మార్కును దాటింది . పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం, హోర్మూజ్ జలసంధిలో ముడిచమురు రవాణాలో జాప్యం వంటి కారణాలతో ముడి చమురు ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో భారతదేశంలోనూ దీని ప్రత్యక్ష ప్రభావం చూపనుంది. దీంతో ఇంధన ధరల పెంపు అనివార్యం అని విశ్లేషకులు చెబుతున్నారు.

ఇప్పటికే పెరిగిన ముడిచమురు ధరల నేపథ్యంలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం వంటి ప్రభుత్వ రంగ చమురు ఉత్పత్తి సంస్థలు భారీ నష్టాలను చవిచూస్తున్నాయి. నివేదికల ప్రకారం.. ఈ కంపెనీలు ప్రతి నెలా సుమారు రూ.30,000 కోట్ల నష్టాలను భరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నష్టాన్ని అరికట్టేందుకు ఇంధన ధరల పెంపు ఉండబోతోందని తెలుస్తోంది.

ఒకవేళ కేంద్ర ప్రభుత్వం నుంచి ఆమోదం లభిస్తే.. పెట్రోల్, డీజిల్ ధరలు లీటర్‌కు రూ.4 నుంచి రూ.5 వరకు పెరిగే అవకాశం కనిపిస్తోంది. అలాగే గృహ వినియోగం కోసం ఎల్పీజీ సిలిండర్ల ధర రూ.40 నుంచి రూ.50 వరకు పెరగవచ్చని అంచనా వేస్తున్నారు. వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల ధర ఇప్పటికే భారీగా పెరిగింది. స్థానికంగా ఇప్పటికే ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర రూ.993కి చేరింది. దీని ప్రభావం హోటళ్లు, రెస్టారెంట్లతో పాటు చిరుతిండి వ్యాపారస్తులపై తీవ్ర భారం పడుతోంది. అయితే ఇంధన ధరల పెంపుపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ధరల పెంపు ఉండబోతుందనే ఊహాగానాల నేపథ్యంలో ఈ చర్చకు మరింత బలం చేకూరుతోంది.

Also Read: రూ.5000 షాపింగ్‌తో రూ.2000 బిల్లు కడితే చాలు! డీమార్ట్‌లో అదిరిపోయే ఆఫర్లు..

Also Read: మహేష్ బాబు మేనకోడలిని చూశారా? హీరోయిన్లనే మించిన అందం..క్యూట్‌లో క్వీన్!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement
Advertisement
Back to top