బెల్లంపల్లిలో సంతరించుకున్న వినాయక చవితి శోభ
Bellampalle, Kannal Rural, Telangana:మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. దుకాణాలు కొనుగోరుదారులతో కిటకిటలాడుతున్నాయి. చవితి పూజ సామాగ్రి కేంద్రాలు ప్రధాన రహదారుల పక్కన ఏర్పాటు చేయడంతో రహదారులు రద్దీగా మారాయి. వివిధ రూపాల్లో బొజ్జ గణపయ్య ప్రతిమలు అందరినీ ఆకర్షిస్తున్నాయి. వినాయక విగ్రహాల కొనుగోలు జోరుగా సాగుతోంది. పూజ సామాగ్రి కోసం మండలాల నుండి పట్టణానికి ప్రజలు వచ్చి సందడి చేస్తున్నారు.
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
Maternal Uncle: బాలికపై అఘాయిత్యం.. కంటికి రెప్పలా కాపాడాల్సిన మేనమామ కాటేశాడు
Hyderabad, Telangana:POCSO Case: శారీరక వాంఛ తీర్చుకునేందుకు కొందరు కామాంధులు రెచ్చిపోతున్నారు. వావివరసలు చూడడం లేదు.. తమ కోరికలు తీర్చుకోవడానికి ఎవరినైనా కాటేయడానికైనా సిద్ధమవుతున్నారు. అలా మేనమామ అని ప్రేమగా ఉండే మేన కోడలిపై ఓ దుర్మార్గుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఒక్కసారి కాదు రెండు సార్లు కాదు పలుమార్లు బాలికపై దాడి చేసి తన కోరికలు తీర్చుకున్నాడు. ఆలస్యంగా తెలుసుకున్న కుటుంబసభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే అతడిని పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
Also Read: Birthday As Death Day: బర్త్డేను డెత్ డేగా మార్చిన పాము.. మంచంపై అమ్మతో నిద్రిస్తుంటే
నల్గొండ జిల్లా వేములపల్లి మండలం శెట్టిపాలెంలో కోడిరెక్క నాగేంద్రకు మేన కోడలు ఉంది. బాలిక (మైనర్) అయిన మేన కోడలితో నాగేంద్ర అసభ్యంగా ప్రవర్తిస్తూ వేధిస్తున్నాడు. కొద్దిరోజులకు బాలికపై అఘాయిత్యం చేయడం ప్రారంభించాడు. మైనర్గా ఉన్నప్పటి నుంచే ఆమెపై వరుసగా అఘాయిత్యాలకు పాల్పడుతుండడంతో మేన కోడలు ఎవరికీ చెప్పుకోలేకపోయింది. మేనమామ కావడంతో అతడికి భయపడా కుటుంబసభ్యుల ముందు నోరు విప్పలేదు. అయితే తాజాగా ఎలాగోలా కుటుంబసభ్యులు అతడి అఘాయిత్యం తెలియడంతో దిగ్భ్రాంతికి లోనయ్యారు.
Also Read: RR vs RCB: ఐపీఎల్ 2026 రారాజు రాజస్థాన్.. సూర్యవంశీ, జురేల్ బ్యాటింగ్ విధ్వంసంతో బెంగళూరు బోల్తా
ఇక మేనమామ వేధింపులు తాళలేక ఆ మేన కోడలు ఎల్బీనగర్ పోలీసులను ఆశ్రయించింది. ఘటన వేములపల్లి పరిధి కావడంతో ఎల్బీనగర్ నుంచి కేసు అక్కడికి బదిలీ చేశారు. నిందితుడు కోడిరెక్క నాగేంద్రపై పోక్సో చట్టం కింద కఠిన సెక్షన్లతో కేసు నమోదు చేశారు. నిందితుడు నాగేంద్రను అరెస్ట్ చేసి వేములపల్లి పోలీసులు రిమాండ్కు తరలించారు. ఈ విషయం తెలుసుకున్న మహిళా సంఘాలు నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశాయి.
సూర్యాపేట జిల్లా కోదాడలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కోదాడలోని డీ మార్ట్ సమీపంలోని ఫ్లైఓవర్ వద్ద జాతీయ రహదారిపై ముందుగా వెళ్తున్న లారీని ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీకొట్టింది. హైదరాబాద్ నుండి ఏలూరు వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 16 మందికి తీవ్ర గాయాలు కాగా.. వెంటనే స్థానికుల సహాయంతో పోలీసులు కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ నిద్ర మత్తు కారణంగానే ప్రమాదం జరిగిందని ప్రయాణికులు చెబుతున్నారు. 36 మంది ప్రయాణికులతో హైదరాబాద్ నుంచి బస్సు ఏలూరుకు బయలుదేరింది. ఎగ్జిట్ డోర్ వద్ద ప్రమాదం జరగడంతో వెనక ఉన్న అత్యవసర ద్వారం నుంచి ప్రయాణికులు బస్సు దిగారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Thieves Video: పిల్ల దొంగల చేతివాటం చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే.. వీడియో..
Hyderabad, Telangana:Child Thieves Video Watch Here: నేటి కాలంలో నేరగాళ్లు ఏ వయసులో వారైనా సరే.. తమ తెలివితేటలతో సామాన్యులను ఇబ్బందుల్లో పడేస్తున్నారు. ముఖ్యంగా నగరాల్లో జనసంచారం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో దొంగలు రెచ్చిపోతూ వస్తున్నారు. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో చూస్తుంటే.. దొంగతనానికి వయస్సుతో సంబంధం లేదని గుర్తు చేస్తోంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతు వస్తోంది. ఈ వీడియోకు సంబంధించిన అన్ని రకాల వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
వైరల్ అవుతున్న ఈ వీడియోలో.. ఒక సాధారణ వ్యక్తి షాప్ దగ్గర నిలబడి వస్తువులను కొనుగోలు చేయడంలో మునిగిపోయాడు.. అతను షాపు యజమానితో మాట్లాడుతున్న సమయంలో ఇద్దరు బాలురు సాధారణంగా అలవాటుగా దుకాణం దగ్గరికి వచ్చినట్లు నటించారు.. అందులో ఒక బాలుడు సదరు వ్యక్తికి అతి సమీపంలోకి వెళ్లి.. ఎంతో చాకచక్యంగా వెనక జేబులో ఉన్న పర్సును బయటికి తీశాడు. అయితే అతను ఆ షాపు యజమానితో మాట్లాడుతున్న సమయంలో ఇది జరిగింది..
కేవలం కొన్ని సెకన్ల వ్యవధిలోనే.. అతని జేబులో నుంచి పర్సును తీయడం మీరు గమనించవచ్చు. ఆ పరీక్షలు తీసిన వెంటనే మరో బాలుడు కూడా అలర్ట్ అయిపోయాడు. దీంతో వారిద్దరు ఏమి ఎరగనట్లుగా అక్కడి నుంచి మెల్లగా జారిపోయారు.. బాధితుడు తన పనిలో తాను ఉండడంతో.. తన పర్సు పోయిందన్న విషయం కూడా అతనికి వెంటనే అర్థం కాలేదు.. ఈ మొత్తం దృశ్యం అక్కడున్న సీసీ కెమెరాలు రికార్డు అయింది.. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతూ వస్తుంది..
ఈ వీడియో ఇంస్టాగ్రామ్తో పాటు ఇతర సోషల్ మీడియా వేదికల్లో విపరీతంగా షేర్ అవుతోంది. వీడియో చూసిన సోషల్ మీడియా వినియోగదారులు ఆ పిల్లల వేగాన్ని చూసి ఊహించని స్థాయిలో ఆశ్చర్యానికి గురవుతున్నారు. వీరు పిల్లల లేక వృత్తిపరమైన దొంగలా? అని కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు కామెంట్ చేస్తూ వస్తున్నారు. ఇక మరి కొంతమంది అయితే పిల్లలను ఇలాంటి నేరాల్లోకి దింపుతున్న ముఠాలపట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం సీసీటీవీలో రికార్డ్ అయిన ఈ వీడియో ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది.
Read more: Automatic Aarti Video: ఇక ఆటోమేటిక్ మిషన్తోనే దేవుడికి హారతి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..
Gudivada Amarnath Jail: మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్కు జైలుశిక్ష ఖరారు.. 6 నెలలు జైలు, రూ.5 వేలు జరిమానా..ఎందుకంటే?
Visakhapatnam, Andhra Pradesh:Gudivada Amarnath Jail News: వైసీపీ నాయకుడు, ఏపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్కు కోర్టు షాక్ ఇచ్చింది. పదేళ్ల క్రితం అనగా 2016 ఏప్రిల్లో నమోదైన ఓ కేసులో వాదనలు తాజాగా పూర్తవ్వగా విశాఖపట్నంలోని రెండో అదనపు ప్రధాన న్యాయస్థానం తీర్పును ఇచ్చింది. నిందితుడిగా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ను పరిగణించిన కోర్టు.. ఆరు నెలల జైలు శిక్షతో పాటు రూ.5 వేలు జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది. ఇదే విషయమై ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చ జరుగుతోంది.
పూర్తి వివరాల్లోకి వెళితే.. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలోని హామీలను సత్వరమే అమలు చేయాలని అప్పట్లో వైసీపీ నేతగా ఉన్న మాజీ మంత్రి అమర్నాథ్ నేతృత్వంలో ఆందోళనలు చేపట్టారు. విశాఖకు ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ 2016లో నిరసనలు చేశారు. స్థానిక జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నాలుగు రోజుల పాటు ఆమరణ నిరాహర దీక్ష చేపట్టగా దీనిపై టూటౌన్లో కేసు నమోదయ్యింది.
ఆ క్రమంలో ఆరోగ్య పరిస్థితి క్షీణించగా.. దీక్షను భగ్నం చేసి ఆస్పత్రికి తరలించేందుకు పోలీసులు ఏర్పాటు చేశారు. దీక్షను భగ్నం చేసి వెంటనే కింగ్ జార్జ్ ఆస్పత్రికి తరలించారు. అయితే నిరాహార దీక్ష పేరుతో ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడని ప్రయత్నించారనే ఆరోపణలతో వైజాగ్ టూటైన్ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసు గత ఎనిమిదేళ్లుగా కోర్టులో వాయిదాలు నడుస్తూ ఉంది.
తాజాగా ఈ కేసుపై తుది విచారణ పూర్తి చేసిన తర్వాత విశాఖపట్నం రెండో అదనపు కోర్టు తీర్పు వెలువరించింది. అమర్నాథ్పై చేసిన ఆరోపణలు నిజమని నిర్ధారించగా.. మాజీ మంత్రి అమర్నాథ్ను దోషిగా తేల్చిన కోర్టు.. అతనికి ఆరు నెలల జైలుశిక్షతో పాటు రూ.5 వేలు జరిమానా విధించింది. ఒకవేళ జరిమానా చెల్లించని పరిస్థితుల్లో అదనపు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది.
వైజాగ్ అదనపు కోర్టు విధించిన జైలు శిక్షపై స్పందించిన వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్.. ప్రజా ప్రయోజనం కోసం అప్పట్లో రైల్వే జోన్ ఏర్పాటు సాధనే థ్యేయంగా చేసిన పోరాటాన్ని తప్పుగా చిత్రీకరించారని అమర్నాథ్ ఆరోపించారు. తమ పోరాటాల వల్లే విశాఖపట్నానికి రైల్వే జోన్ వచ్చిందని ఆయన చెబుతున్నారు. అయితే కోర్టు ఇచ్చిన తీర్పును గౌరవిస్తూనే.. న్యాయసలహా మేరకు హైకోర్టు లేదా సుప్రీంకోర్టులో అప్పీల్ చేస్తామని ఆయన పేర్కొన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Viral Video: చేపకు సిగరెట్ తాగించిన వ్యక్తి.. నెటిజన్ల ఆగ్రహం.. వీడియో!
Hyderabad, Telangana:Fish Viral Video Watch: సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక నిత్యం ఏదో ఒక వింత వైరల్ అవుతూనే వస్తోంది. అయితే, కొన్ని వీడియోలు సోషల్ మీడియా వినియోగదారులకు నవ్వు తెప్పించితే.. మరికొన్ని మాత్రం తీవ్ర ఆగ్రహాన్ని కలిగిస్తుంటాయి. తాజాగా అటువంటి కోవాకు చెందిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్గా మారింది. ఒక చేపకు సిగరెట్ తాగించిన వింత ఘటన ఇప్పుడు చర్చనీయాంశానికి దారితీస్తోంది. దీనికి సంబంధించిన అన్ని రకాల వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..
సాధారణంగా చేపలు నీటిలో ఆక్సిజన్ తీసుకుంటూ ఉంటాయి. కానీ వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక వ్యక్తి తను పట్టుకున్న చేపలను నేలపై ఉంచి.. దానికి సిగరెట్ తాగించడం మీరు చూడొచ్చు. ఆ వ్యక్తి వెలిగించిన సిగరెట్లు చేప లోపల పెట్టగా.. అది గాలి కోసం నోరు తెరిచిన ప్రతిసారి సిగరెట్ పొగను లోపలికి పీల్చుకుంటూ మళ్లీ వదులుతోంది. నీటిలో ఉండాల్సిన జీవిని బయటపడేటమే కాకుండా.. దానికి ఇలా పొగను అలవాటు చేయడం చూసి సోషల్ మీడియా వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ వీడియో పై సోషల్ మీడియాలో నేటిజల్లు తీవ్ర స్థాయిలో మండిపడుతూ వస్తున్నారు..నోరులేని జీవుల పట్ల ఎలాంటి చర్యలు ఏంటని కొంతమంది ప్రశ్నిస్తూ వస్తే.. మరి కొంతమంది కేవలం న్యూస్ తో పాటు లైక్స్ కోసం ఇలా మూగజీవులను హింసించడం నేరమని ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. చేపకు సిగరెట్ తాగించడం ఎంటర్టైన్మెంట్ కాదు.. అదొక రకమైన జంతు హింస అని జంతు ప్రేమికుల అభిప్రాయపడుతున్నారు..
Read more: Automatic Aarti Video: ఇక ఆటోమేటిక్ మిషన్తోనే దేవుడికి హారతి!
సిగరెట్లు నికోటితోపాటు ఇతర రసాయనాలు మనుషులకే కాకుండా జలచరాలకు కూడా అత్యంత ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నీటి నుంచి బయటికి తీసినప్పుడే చేపలు ప్రాణాపాయ స్థితిలో ఉంటాయని.. అటువంటి సమయంలో ఇలా పొగను పీల్చడం వల్ల అవి త్వరగా చనిపోయే అవకాశం ఉందని సోషల్ మీడియా వినియోగదారులు చెబుతూ వస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో ఇంస్టాగ్రామ్తో పాటు ట్విటర్లో విపరీతంగా వైరల్ అవుతుంది. మూగ జీవులను ఇలా హింసించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వస్తున్నారు..
Read more: Automatic Aarti Video: ఇక ఆటోమేటిక్ మిషన్తోనే దేవుడికి హారతి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..Twitter, Facebook
Gudivada Amarnath Jail: వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్కు జైలుశిక్ష..6 నెలల జైలు, రూ.5 వేలు జరిమానా!
Visakhapatnam, Andhra Pradesh:Gudivada Amarnath Jail News: ఏపీ మాజీ మంత్రి, వైసీపీ నాయకుడు గుడివాడ అమర్నాథ్కు విశాఖ అదనపు కోర్టు షాక్ ఇచ్చింది. పదేళ్ల క్రితం అనగా 2016 ఏప్రిల్లో జరిగిన ఓ సంఘటనపై కేసు నమోదవ్వగా.. తాజాగా కేసు వాదనలు పూర్తవ్వడంతో మాజీ మంత్రి అమర్నాథ్ను దోషిగా తేలుస్తూ 6 నెలల జైలు, రూ.5 వేలు జరిమానా విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది.Kcr Public Meeting: జగిత్యాలలో ఈ నెల 20న.. కేసీఆర్ భారీ బహిరంగ సభ.. జీవన్ రెడ్డి ఏమన్నారంటే..?..
Hyderabad, Telangana:kcr public meeting in jagtial on 20 th of these month: తెలంగాణ రాజకీయాలు మరోసారి హీటెక్కాయి. జగిత్యాల జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరికపై తెలంగాణ రాజకీయాల్లో హాట్ హాట్ గా చర్చలు జరుగుతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డిపై జీవన్ రెడ్డి ఇటీవల చేసిన వ్యాఖ్యలతో మరింత రచ్చ రాజుకుంది. దీనికి కాంగ్రెస్ నేతలు కౌంటర్ లు ఇస్తున్నారు. మరోవైపు జీవన్ రెడ్డి,కేసీఆర్ రాక నేపథ్యంలో ఈ నెల 20న సాయంత్రం 5 గంటలకు జగిత్యాలలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయనున్నారు. గులాబీ దళపతి కేసీఆర్ సమక్షంలో BRS పార్టీ కండువాను మాజీ మంత్రి జీవన్ రెడ్డి కప్పుకొనున్నారు. జిల్లా కేంద్రంలోని మోతె రోడ్ లో బహిరంగ సభ ... ఏర్పాటు చేస్తారని ప్రచారం జరుగుతుంది . కేసీఆర్ సభ కోసం బహిరంగ సభ స్థలాలను మాజీ మంత్రి జీవన్ రెడ్డి తో పాటు, ఉమ్మడి జిల్లా బిఆర్ఎస్ నేతలు పరిశీలించారు
జిల్లా కేంద్రంలోని ఎస్.కె.ఎన్.ఆర్ డిగ్రీ కాలేజ్, మోతే రోడ్డు, కాలేజీ గ్రౌండ్ స్థలాలను నాయకులు పరిశీలించారు. జగిత్యాల లో కేసీఆర్ సభ స్థలాలను పరిశీలించిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి, జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు విద్యాసాగర్ రావు, కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్, ఎమ్మెల్సీ రమణ, లోక్ బాపు రెడ్డి లు, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ లు ఉన్నారు. ఈ క్రమంలో సభకు భారీగా కార్యకర్తలు, నాయకులు తరలి వస్తున్న నేపథ్యంలో వివిధ స్థలాలను నేతలు పరిశీలిస్తున్నారు.
ఈ నేపథ్యంలో.. BRS జిల్లా అధ్యక్షులు విద్యాసాగర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 20 న జగిత్యాల మోతె రోడ్ లో కెసిఆర్ బహిరంగా సభ ఉంటుందన్నారు. కేసీఆర్ కోసం రావడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. సుమరు ఒక లక్ష మంది తో సభ ఏర్పాటు చేస్తామన్నారు.
మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఏమన్నారంటే..?..
జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. తన శేష జీవితంలో కేసీఆర్ తో కలిసి పనిచేయడం నా అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. మార్పు రావాలంటే కేసీఆర్ రావాలి రేవంత్ రెడ్డి పోవాలని మరోసారి కాంగ్రెస్ పై నిప్పులు చెరిగారు. రెండున్నర సంవత్సరాలలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హమీలను నెరవేర్చడంలో విఫలమైందన్నారు.
Read more: Aadi Srinivas: కేసీఆర్ విషకౌగిలిలోకి జీవన్ రెడ్డి.. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
Realme Narzo 100 Lite 5G: ఆరేళ్ల వరకు బ్యాటరీ గ్యారెంటీ! రియల్మీ నార్జో 100 లైట్ 5G లాంచ్ డేట్ ఫిక్స్..
Hyderabad, Telangana:Realme Narzo 100 Lite 5g To Launch On April 14: ప్రముఖ స్మార్ట్ఫోన్ దిగ్గజ రియల్ మీ తన నార్జో సిరీస్లో మరో అద్భుతమైన మొబైల్ను విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్ఫోన్ భారత మార్కెట్లో అత్యంత శక్తివంతమైన ఫీచర్లతో అందుబాటులోకి రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిని రియల్ మీ కంపెనీ రియల్మీ నార్జో 100 లైట్ 5G (Realme Narzo 100 Lite 5G) పేరుతో ఏప్రిల్ 14వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేయబోతున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు కలిగిన మొబైల్స్ కొనుగోలు చేసేవారిని దృష్టిలో పెట్టుకొని ఈ స్మార్ట్ఫోన్ను రూపొందించినట్లు తెలుస్తోంది. అయితే, ఈ మొబైల్కు సంబంధించిన అన్ని వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ Realme Narzo 100 Lite 5G స్మార్ట్ఫోన్ ఎంతో శక్తివంతమైన బ్యాటరీని కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఇది 7000mAh టైటాన్ బ్యాటరీతో అందుబాటులోకి రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిని ఒక్కసారి చార్జింగ్ చేస్తే రెండు రోజుల పాటు నిరంతరంగా పనిచేయడమే కాకుండా సినిమాలు చూసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఈ బ్యాటరీ ఆరేళ్లపాటు అద్భుతమైన హెల్త్ కండిషన్ తో పనిచేస్తుందని రియల్ మీ కంపెనీ భరోసా కూడా అందిస్తూ వస్తోంది. ఇందులో కంపెనీ ప్రత్యేకమైన రివర్సల్ చార్జింగ్ సపోర్ట్తో పాటు దీనిని పవర్ బ్యాంకులో వాడుకునేందుకు వివిధ రకాల పరికరాలతో చార్జింగ్ సపోర్ట్ను కూడా అందిస్తోంది.
ముఖ్యంగా ఈ Realme Narzo 100 Lite 5G స్మార్ట్ఫోన్ గేమింగ్తో పాటు మల్టీ టాస్కింగ్ చేసే వారికి చాలా బాగా పనిచేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్ఫోన్లో 6.9 అంగుళాల భారీ ఎల్సీడీ డిస్ప్లేను అందించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇది 144Hz రిఫ్రెష్ రేట్, 900 నిట్స్ గరిష్ట బ్రైట్నెస్తో వస్తుంది. అలాగే ఈ మొబైల్ ఎంతో శక్తివంతమైన మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్ను కలిగి ఉంటుంది. దీంతోపాటు ఫోన్ వేడెక్కకుండా ఉండేందుకు ప్రత్యేకమైన కూలింగ్ సిస్టం కూడా ఇందులో అందించినట్లు తెలుస్తోంది.
Also Read: Vivo V70 Elite: ఫ్లిప్కార్ట్ ధమాకా ఆఫర్.. రూ.55 వేల Vivo V70 Elite ప్రీమియం ఫోన్ కేవలం రూ.16 వేలకే!
ఈ Realme Narzo 100 Lite 5G ఫోన్ వెనక భాగంలో అద్భుతమైన కెమెరా మాడ్యూల్ని కలిగి ఉంటుంది. ఇందులో ఎంతో శక్తివంతమైన ప్రధాన కెమెరా అందుబాటులో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. దీంతోపాటు ఒక ప్రత్యేకమైన ఎల్ఈడీ ఫ్లాష్ కూడా లభిస్తుంది. అలాగే ఈ మొబైల్ ప్రతిష్టంగా ఉండేందుకు Armorshell ప్రొటెక్షన్ కూడా అందుబాటులో ఉంది. ఇది మొత్తం రెండు కలర్ ఆప్షన్స్ లో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్ఫోన్కు సంబంధించిన ధర వివరాల్లోకి వెళ్తే.. దీనిని కంపెనీ ధర రూ.13 వేల నుంచి అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. మొదటి సేల్లో భాగంగా కొనుగోలు చేసే వారికి దీనిపై ఎన్నో రకాల అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్స్ అందుబాటులో ఉండబోతున్నాయి.
Also Read: Vivo V70 Elite: ఫ్లిప్కార్ట్ ధమాకా ఆఫర్.. రూ.55 వేల Vivo V70 Elite ప్రీమియం ఫోన్ కేవలం రూ.16 వేలకే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Macherla ASI: పల్నాడులో ఎఎస్సై బాగోతం.. ఏకాంతంగా ఉన్న జంటల వీడియోలు తీసి.. డిపార్ట్ మెంట్ లో దుమారం..
Hyderabad, Telangana:Palnadu Asi blackmail couple after secretly filming photos: సాధారణంగా ఎవరికైన అన్యాయం జరిగితే వెంటనే పోలీసుల దగ్గరకు వెళ్తారు. తమకు జరిగిన అన్యాయంపై వారికి ఫిర్యాదు చేస్తారు. ఎలాగైన న్యాయం చేయాలని పోలీసుల్ని ప్రాధేయ పడతారు. చాలా మంది పోలీసులు విధి నిర్వహణలో ప్రజలకు మేలు చేసే పనులుచేస్తారు. బాధితులకు అండగా నిలబడతారు. మరోవైపు కొంత మంది మాత్రం దీనికి భిన్నంగా ఉంటారు. వేసుకున్న ఖాకీ దుస్తుల పరువు తీసేలా ప్రవర్తిస్తారు. ఏదైన సమస్య ఉందని పీఎస్ కు వస్తే వేధింపులకు గురిచేస్తారు. అంతే కాకుండా లంచం ఇవ్వాలని, లైంగికంగా కూడా టార్చర్ చేస్తారు. ఇలాంటి ఘటనలు తరచుగా మనం చూస్తుంటాం.
పల్నాడులోని మాచర్ల నియోజక వర్గంలో ఒక ఏఎస్సై మొత్తంగా డిపార్ట్ మెంట్ పరువు తీసేలా ప్రవర్తించాడు. ఏకంతంగా ఉన్న జంటలను టార్గెట్ చేసుకుని వేధింపులకు గురిచేశాడు.ఈ ఘటన ఏపీలో దుమారంగా మారింది. పల్నాడు జిల్లా మాచర్ల పరిధిలో ఒక ఏఎస్సై నియోజక వర్గం పరిధిలో పర్యాటక ప్రాంతంలలో తరచుగా తిరిగే జంటలను టార్గెట్ చేశాడు. దీనికి జమ్మల మడుగుకు చెందిన ఆటో డ్రైవర్ సాయం తీసుకున్నాడు. ఇతనిలో వారి ఏకంతంగా , రొమాన్స్ చేసుకుంటుండగా వీడియోలు, ఫోటోలు తీయాలని చెప్పేవాడు.
ఆ తర్వాత వారిని ఏఎస్సై బ్లాక్ మెయిల్ చేస్తు డబ్బులు ఇవ్వాలని, తనతో లైంగికంగా కలవాలని వారిని వేధింపులకు గురిచేశాడు. ఇటీవల ఒక వ్యాపారి, మహిళతో రొమాన్స్ చేసుకుంటుండగా వీడియో తీశాడు. అతడ్ని కూడా ఇదే విధంగా వేధింపులకు గురిచేశాడు. దీంతో డబ్బులు ఇచ్చిన వేధింపులు ఆగక పోవడంతో బాధితుడు ఎస్పీకి తన బాధను చెప్పుకున్నాడు.
ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. సదరు పీఎస్ పరిధిలో ఎస్సై, ఏఎస్సై, కానిస్టేబుల్ సైతం ఇదే విధంగా ఏకతంగా ఉండే జంటలను టార్గెట్ చేసుకుని వేధించారని ఘటనలు వెలుగులోకి వచ్చాయి. దీనిపై ఏకంగా స్థానిలకు ఎస్పీని కలిశారు. దీనిపై విచారణకు ఆదేశించినట్లు చెప్పారు. ఈ ఘటనపై మహిళ కమిషన్ రంగంలోకి దిగింది.
దీనిపై సమగ్రంగా విచారణ చేపట్టి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. మహిళల భద్రతపై రాజీపడేదిలేదని స్పష్టం చేశారు. మహిళలను ఇబ్బందులకు గురిచేస్తే కఠిన చర్యలు ఎదుర్కొవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
Singer Mangli Case: టాలీవుడ్ సింగర్ మంగ్లీపై కేసు నమోదు..చంపేస్తామని మంగ్లీ సోదరుడు, డైరెక్టర్ వేణు బెదిరింపులు?!
Hyderabad, Telangana:Singer Mangli Case News: టాలీవుడ్ సింగర్, ప్రముఖ జానపద గాయని మంగ్లీ (సత్యవతి చౌహాన్)పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యింది. ఆమెతో పాటు ఆమె సోదరుడు శివ, డైరెక్టర్ వేణు ఊడుగుల (విరాటపర్వం డైరెక్టర్)పై ఓ వ్యక్తి కేసు నమోదు చేశాడు. పెట్టుబడి డబ్బును మోసం చేయడం సహా హత్యాయత్న బెదిరింపుల నేపథ్యంలో సదరు బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. దీంతో వీరు ముగ్గురు చట్టపరమైన చిక్కుల్లో పడ్డారు.
బాధితుని లాయర్ దాఖలు చేసిన ఫిర్యాదు ప్రకారం.. వ్యాపార పెట్టుబడులపై అధిక రాబడి ఇస్తామని వాగ్దానం చేసి నిందితులు దాదాపు 100 మంది బాధితుల నుంచి భారీ మొత్తంలో డబ్బు వసూలు చేశారని ఆరోపణలు ఉన్నాయి. కోట్ల రూపాయలు అప్పుగా తీసుకొని.. ఇన్నేళ్లు గడిచినా.. లాభాలను గానీ, అసలు పెట్టుబడులను గానీ తిరిగి ఇవ్వలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఎన్ని రోజుల గడిచినా తన డబ్బు తిరిగి రావడం లేదనే ఆవేదనతో బాధితులు న్యాయం కోసం ఇప్పుడు పోలీసులను ఆశ్రయించారు. నిందితుల నుంచి డబ్బు అడిగేందుకు వెళ్లిన బాధితుడ్ని చంపుతామని బెదిరించినట్లు వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. తన ఫిర్యాదులో సింగర్ మంగ్లీ, ఆమె సోదరుడు శివతో పాటు చిత్ర దర్శకుడు వేణు ఉడుగుల తనకు ఫోన్ చేసి బెదిరించారని.. దీంతో తన క్లైయింట్కు ప్రాణహాని ఉందని బాధితుని తరఫు లాయర్ ఆరోపించారు.
ఆరోపణలను తీవ్రంగా పరిగణిస్తూ.. పంజాగుట్ట పోలీసులు భారతీయ న్యాయ సంహితలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిధులను అక్రమంగా సేకరించారా, ఈ ఆరోపిత మోసంలో ఏదైనా పెద్ద నెట్వర్క్ ప్రమేయం ఉందా అనే విషయాలను అధికారులు ఇప్పుడు పరిశీలిస్తున్నారు. సింగర్ మంగ్లీకి పాపులర్ అయిన కారణంగా ఆమె పేరు ప్రముఖంగా ఈ కేసులో వినిపిస్తోంది.
అయితే ఫిర్యాదులో పేర్కొన్న ఇతరుల ప్రమేయం ఏ మేరకు ఉందో, అలాగే వాపసు కోరిన వారిని అణచివేయడానికి నిందితులు బెదిరింపులకు పాల్పడ్డారో లేదో కూడా దర్యాప్తు అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ పెట్టుబడులు పథకం నిజమైనదా లేక అమాయక వ్యక్తులను మోసం చేసేందుకు పక్కాగా ప్లాన్ చేశారా అనేది విచారణలో తేలుతుందని పోలీసు అధికారులు చెబుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
GDS 2nd Merit List: గుడ్న్యూస్.. పోస్టల్ శాఖ GDS 2nd మెరిట్ లిస్ట్ 2026 అవుట్.. రిజల్ట్ PDF లింక్ ఇదే!
Hyderabad, Telangana:GDS 2nd Merit List 2026 OUT: అభ్యర్థులు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న పోస్టల్ శాఖ GDS ఫలితాలు నిన్న అధికారికంగా విడుదల చేశారు. తెలంగాణ, ఏపీకి సంబంధించి మొత్తంగా దేశవ్యాప్తంగా ఈ ఫలితాలు విడుదలయ్యాయి. రెండో షార్ట్ లిస్టులో ఏపీలో 1016 పోస్టులు, తెలంగాణలో 608 పోస్టులు ఉన్నాయి... తెలంగాణ నుంచి 214 మంది ఎంపిక అవ్వగా.. ఆంధ్రప్రదేశ్ నుంచి 555 మంది ఎంపికయ్యారు. వీరంతా ఏప్రిల్ 27న డివిజన్ ఆఫీసులో ధ్రువీకరణ పత్రాలు కూడా సమర్పించాల్సి ఉంటుంది. పదో తరగతి మార్కుల ఆధారంగా ఈ ఎంపిక చేపట్టారు.
దేశవ్యాప్తంగా 19 సర్కిల్స్ లో ప్రస్తుతం నాలుగు సర్కిల్స్ ఎన్నికల్లో కోడ్ ఉండటంతో ఫలితాలు నిలిపివేశారు. మొత్తంగా ఈ పోస్టల్ గ్రామీణ డాగ్ సేవకు దేశవ్యాప్తంగా 28,636 ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఇతర పోస్టులు కూడా భర్తీ చేయనున్నారు. వారి లిస్టు ఆన్లైన్లో పొందుపరిచారు. అభ్యర్థులు రాష్ట్రాలవారీగా పీడీఎఫ్ రూపంలో డౌన్లోడ్ చేసుకోవచ్చు.
GDS ఫలితాలు సెకండ్ మెరిట్ లిస్ట్ డౌన్లోడ్ చేసుకునే విధానం..
అధికారిక వెబ్సైట్ GDS సెకండ్ మెరిట్ లిస్టులో పొందుపరిచారు. https://indiapostgdsonline.gov.in/ ఓపెన్ చేసి అందులో 'కేండిడేట్స్ కార్నర్' క్లిక్ చేయండి. అక్కడ ఎడమ వైపున కిందికి స్క్రోల్ డౌన్ చేసే ఆన్లైన్ ఎంగేజ్మెంట్ సెక్షన్ కనిపిస్తుంది. దానిపై సెకండ్ మెరిట్ లిస్ట్ పీడీఎఫ్ ఎంపిక చేసుకోవాలి. అక్కడ పోస్టల్ సర్కిల్ స్క్రీన్ కనిపిస్తుంది. మీ సంబంధిత రాష్ట్రం, సర్కిల్ ఎంపిక చేసుకొని 'జీడీఎస్ రిజల్ట్స్ 2026 సెకండ్ మెరిట్ లిస్టు' పీడీఎఫ్ సెలెక్ట్ చేయాలి. CTRL+F ఏడు సంఖ్యల రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
GDS పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు త్వరలో కాల్ లెటర్ అందజేస్తారు. ముందుగా సంబంధిత సెంటర్ కి వెళ్లి వారి ధ్రువపత్రాలు అందజేయాల్సి ఉంటుంది. ఆ తర్వాతే తుది ఎంపిక జరుగుతుంది. ఎంపికైన అభ్యర్థులకు నెలవారీ జీతం, పెర్క్స్ ఇతర బెనిఫిట్స్ కూడా అందుకుంటారు.
Also Read: పదో తరగతి పాస్ అయ్యారా? ఇంటర్ చదువుతూనే నెలకు వేలల్లో సంపాదించే గోల్డెన్ ఛాన్స్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Women Reservations: మహిళా రిజర్వేషన్లకు కాంగ్రెస్ వ్యతిరేకం కాదు: రేవంత్ రెడ్డి
New Delhi, Delhi:Women Reservations: మహిళా రిజర్వేషన్లకు కాంగ్రెస్ వ్యతిరేకం కాదని రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇప్పుడున్న సీట్లలో కూడా మహిళా రిజర్వేషన్లు అమలు చేయొచ్చు కదా? అని ప్రశ్నించారు. ఇప్పటికిప్పుడు నియోజకవర్గాల పెంపు అత్యవసరం ఎందుకు? అని నిలదీశారు. సీడబ్ల్యూసీలో నియోజకవర్గాల పెంపుపై కీలకమైన అభిప్రాయాలను తెలిపినట్లు వెల్లడించారు. నియోజకవర్గాల పెంపుతో చిన్న రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరగనుందని ఆందోళన వ్యక్తం చేశారు. 'చిన్న రాష్ట్రాలు చిన్నగా.. పెద్ద రాష్ట్రాలు మరీ పెద్దగా అయిపోతాయి. చిన్న రాష్ట్రాలు ప్రాముఖ్యత కోల్పోతాయి. ఉత్తరాదికి అడ్వాంటేజ్గా మారనుంది' అని చిట్చాట్లో రేవంత్ రెడ్డి తెలిపారు.
Also Read: Birthday As Death Day: బర్త్డేను డెత్ డేగా మార్చిన పాము.. మంచంపై అమ్మతో నిద్రిస్తుంటే
న్యూఢిల్లీ పర్యటనకు వచ్చిన రేవంత్ రెడ్డి మీడియాతో చిట్చాట్ చేశారు. కీలక విషయాలపై స్పందిస్తూ మాట్లాడారు. 'ఉత్తరాది రాష్ట్రాలతోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటారు. నియోజకవర్గాల పెంపు పార్టీల సమస్య కాదు, ప్రాంతాల సమస్య. నియోజకవర్గాల పెంపు, అందమైన ముసుగులో మోసం. నియోజకవర్గాల పెంపుతో చిన్న రాష్ట్రాలు ,పెద్ద రాష్ట్రాల మధ్య ఇప్పుడున్న గ్యాప్ ఉండాలి' అని పేర్కొన్నారు. ఆర్థిక ప్రాతిపదికన నియోజకవర్గాలు పెంచొచ్చని తెలిపారు.
Also Read: RR vs RCB: ఐపీఎల్ 2026 రారాజు రాజస్థాన్.. సూర్యవంశీ, జురేల్ బ్యాటింగ్ విధ్వంసంతో బెంగళూరు బోల్తా
'దక్షిణాదిపై వివక్ష కొనసాగుతుంది. 50 శాతం పెంపుతో జరిగే నష్టాలపై సీడబ్ల్యూసీలో స్పష్టంగా చెప్పా. బీజేపీ పెడుతున్న మెలికల్లో రాజకీయ స్వార్థం ఉంది. వివక్షను మేము అంగీకరించం' అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. 'ఎలా పెంచాలి.. ఏంటి అనేది చర్చ లేకుండా ఇప్పటికిప్పుడు ఎందుకింత అర్జెంటు? ఇప్పుడున్న 543 సీట్లలో 181 సీట్లను మహిళలకు ఇవ్వచ్చు కదా?' అని ప్రశ్నించార. తెలంగాణలో ఐదు నెలల్లో జనగణన, కులగణనలను పూర్తి చేశామని వెల్లడించారు.
Also Read: Deepam Scheme: దీపం లబ్ధిదారులకు సీఎం చంద్రబాబు తీపి కబురు.. ఏమిటంటే?
'హడావిడి చేసి రైతు వ్యతిరేక చట్టాలు తీసుకువచ్చారు. రైతుల ఆందోళనతో మళ్లీ వెనక్కి తీసుకున్నారు. నియోజకవర్గాల పెంపుపై దక్షిణాదిలో రియాక్షన్ వస్తే చిన్న రాష్ట్రాలు వ్యతిరేకిస్తే ఏం చేస్తారు? బిల్లు అడ్డుకోవాల్సి వస్తే పోరాటం తప్పదు' అని రేవంత్ రెడ్డి తెలిపారు. 'దక్షిణాది రాష్ట్రాలు ఫైనాన్షియల్ క్యాపిటల్గా ఉన్నాయి. ఉత్తరాది రాష్ట్రాలు పొలిటికల్ క్యాపిటల్గా కొనసాగుతున్నాయి. తెలంగాణ ఒక్క రూపాయి కేంద్రానికి కడితే 42 పైసలే ఇస్తున్నారు. దక్షిణాదికి చాలా అన్యాయం జరుగుతోంది' అని పేర్కొన్నారు.
'మేం బాధతో ఉన్నాం.. ఆర్థికంగా నష్టపోతున్నాం. రాజకీయంగా కూడా సెకండ్ గ్రేడ్గా చూస్తున్నారు. మాపై వివక్ష కొనసాగుతుంది' అని రేవంత్ రెడ్డి తెలిపారు. 'సీనియర్లకు అవమానం జరిగిందని కేటీఆర్ మాట్లాడడం సిగ్గుచేటు. ఆలె నరేంద్ర, దేశిని చిన్న మల్లయ్య, ఈటల రాజేందర్ ఇలా ఎంతోమందికి బీఆర్ఎస్ పార్టీలో ఏం జరిగింది. దక్షిణాది నుంచి బండి సంజయ్, కిషన్ రెడ్డిలకు కేంద్ర ప్రభుత్వంలో చోటు దక్కింది. ఇప్పుడు సీట్లు పెరిగాక చప్రాసి పదవి కూడా దొరకదు. నా పోరాటం నా వ్యక్తిగతం కోసం కాదు ప్రజల కోసమే. మెరిట్ డిసబిలిటీ విధానంలో అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు ఉండాలి' అని చిట్చాట్లో రేవంత్ రెడ్డి వెల్లడించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
IPL 2026 RR vs RCB: ఐపీఎల్ 2026 రారాజు రాజస్థాన్.. సూర్యవంశీ, జురేల్ బ్యాటింగ్ విధ్వంసంతో బెంగళూరు బోల్తా
Guwahati, Assam:RR Win By 6 Wickets: రాజస్థాన్ రాయల్స్ ఐపీఎల్ 2026లో రారాజుగా నిలుస్తోంది. అసలు ఓటమి ఎరుగకుండా వరుస విజయాలు సాధిస్తున్న ఈ జట్టు నాలుగో విజయాన్ని ఖాతాలో వేసుకుని అరుదైన ఘనత సాధించింది. ప్రత్యర్థి ఎవరైనా సరే వారిని ఓడించేస్తున్న రాజస్థాన్ తాజాగా డిఫెండింగ్ చాపింయన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరును కూడా బోల్తా కొట్టించింది. 6 వికెట్ తేడాతో మ్యాచ్ను సొంతం చేసుకుని పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని సుస్థిరం చేసుకుంది.
Also Read: Deepam Scheme: దీపం లబ్ధిదారులకు సీఎం చంద్రబాబు తీపి కబురు.. ఏమిటంటే?
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లకు 8 వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేసింది. ఫిల్ సాల్ట్ గోల్డెన్ డకౌట్ కాగా.. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ 32 పరుగులు చేశాడు. దేవదత్ పడిక్కల్ (14), కృనాల్ పాండ్యా (1), జితేష్ శర్మ (5), టిమ్ డేవిడ్ (13) తక్కువ పరుగులకు ఔటయ్యారు. కెప్టెన్ రజత్ పాటిదార్ 40 పరుగుల్లో 63 పరుగులు చేయగా.. వాటిలో 4 ఫోర్లు, నాలుగు సిక్సర్లు ఉన్నాయి. రాజస్థాన్ రాయల్స్ పొదుపుగా వేసినా పరుగులు ద్విశతకం దాటాయి. అయినా కూడా జోఫ్రా ఆర్చర్, రవి బిష్ణోయ్, బ్రిజేష్ శర్మ తలా రెండేసి వికెట్లు వేశారు. సందీప్ శర్మ, రవీంద్ర జడేజా ఒక్కో వికెట్ పడగొట్టారు.
Also Read: KCR Jeevan Reddy: 'దేవుడే పంపిండు మీతో కలిసి పని చేయమని' కేసీఆర్తో జీవన్ రెడ్డి
బెంగళూరు విధించిన లక్ష్యాన్ని 18 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి రాజస్థాన్ రాయల్స్ ఛేదించింది. గత మ్యాచ్లో అదరగొట్టిన యశస్వి జైస్వాల్ (13) తక్కువ పరుగులకే ఔటవగా... ధృవ్ జురేల్, వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్తో విధ్వంసం సృష్టించారు. 26 బంతుల్లో అత్యంత వేగంగా సూర్యవంశీ 78 పరుగులు చేయగా.. వాటిలో 8 ఫోర్లు, ఏడు సిక్సర్లు ఉన్నాయి. ధ్రువ్ జురేల్ 43 బంతుల్లో 81 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. అతడు 8 బౌండరీలు బాదగా.. మూడు సిక్సర్లు ఉన్నాయి. షిమ్రాన్ హిట్మెయిర్ డకౌట్ కాగా.. కెప్టెన్ రియాన్ పరాగ్ మూడే పరుగులు చేశాడు. రవీంద్ర జడేజా 24 స్కోర్తో నాటౌట్గా నిలిచాడు. అజేయంగా గెలుస్తున్న రాజస్థాన్ ఓడించేందుకు బెంగళూరు బౌలర్లు మరింత శ్రమించాల్సి ఉంది. యువ బ్యాటర్లను ఔట్ చేయడంలో విఫలమవడంతో భారీ స్కోర్ సాధించారు. జోష్ హేజిల్వుడ్, కృనాల్ పాండ్యా రెండేసి వికెట్లు తీయగా.. మిగతా బౌలర్లు పరుగులు ఇవ్వడమే సరిపోయింది తప్ప వికెట్లు తీయలేకపోయారు.
Also Read: Birthday As Death Day: బర్త్డేను డెత్ డేగా మార్చిన పాము.. మంచంపై అమ్మతో నిద్రిస్తుంటే
యువ ఆటగాళ్లతో నిండిన రాజస్థాన్ రాయల్స్ ఐపీఎల్ 2026లో అద్భుతం చేసేస్తోంది. ప్రత్యర్థి ఎవరనేది చూడకుండా వరుస మ్యాచ్లు ఆడుతూ విజయాలు సొంతం చేసుకుంటోంది. గత సీజన్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరును కూడా రాజస్థాన్ తేలికగా తీసిపడేసింది. వరుసగా నాలుగు విజయాలతో అజేయంగా పాయింట్ల పట్టికలో 8 పాయింట్లతో అగ్రస్థానాన్ని పదిలం చేసుకోగా.. బెంగళూరు ఆడిన మూడు మ్యాచ్ల్లో తొలి ఓటమిని ఖాతాలో వేసుకుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Jeevan Reddy: దేవుడే నన్ను పంపాడు.. కేసీఆర్ ను కలిసి జీవన్ రెడ్డి తీవ్ర భావొద్వేగం..
Hyderabad, Telangana:Jeevan reddy meets with kcr in erravelli farm houseAllu Arjun Remuneration: 'రాకా' సినిమా కోసం అల్లు అర్జున్ పారితోషకం ఎంతో తెలుసా? భారతీయ చిత్ర పరిశ్రమలో సరికొత్త రికార్డు!
Hyderabad, Telangana:Allu Arjun Raaka Remuneration: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ అట్లీ కాంబోలో తెరకెక్కుతోన్న బారీ బడ్జెట్ చిత్రం 'రాకా'. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా 'రాకా' సినిమాలో ఫస్ట్లుక్ను చిత్రబృందం విడుదల చేసింది. ఇందులో హీరోగా అల్లు అర్జున్ విలక్షణ పాత్ర పోషిస్తున్నట్లు.. తోడేలు చేతిని చూపిస్తూ కనిపించాడు. ఒక్క ఫస్ట్లుక్తో సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది చిత్రబృందం. భారీగా విజువల్ ఎఫెక్ట్స్తో తెరకెక్కనున్న ఈ మూవీకి దాదాపుగా రూ.900 నుంచి రూ.1000 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి.
సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్గా రూపొందుతోన్న ఈ సినిమా కోసం భారీగా ఖర్చు చేస్తున్నారన్న వార్తల నడుము నటీనటులు రెమ్యూనరేషన్ గురించి తెగ చర్చ జరుగుతోంది. అంతర్జాతీయ స్థాయి హంగులతో విజువల్ ఎఫెక్ట్స్తో అట్లీ మార్క్ మాస్ ఎలిమెంట్స్ కోసం నిర్మాతలు ఖర్చుకు వెనుకాడడం లేదట.
ఇంతటి భారీ బడ్జెట్ చిత్రంలో నటీనటుల రెమ్యునరేషన్లు కూడా అదే స్థాయిలో ఉన్నాయని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. 'రాకా' సినిమా కోసం కథానాయకుడు అల్లు అర్జున్ దాదాపు రూ.175 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది.
అదే విధంగా ఈ సినిమాలోని హీరోయిన్ దీపికా పదుకొణె కూడా హీరోకి తగ్గట్టుగా రూ.25 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమాలో రష్మిక మంధన్న కీలక పాత్ర పోషిస్తుందని.. ఆమె కూడా రూ.5 నుంచి రూ.7 కోట్ల పారితోషకం డిమాండ్ చేస్తున్నట్లు చెబుతున్నారు.
'రాకా' సినిమాలో మృగం గెటప్ కోసం నిర్మాతలు భారీగా ఖర్చు చేస్తున్నారట. ఈ లుక్ కోసం కాస్ట్యూమ్స్, మేకప్, గ్రాఫిక్స్ భారతీయ తెరపై మునుపెన్నడూ చూడని విధంగా ఉండబోతున్నాయని సమాచారం. ఈ చిత్రం 2027 సమ్మర్లో విడుదల చేయనున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
