icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Pinewz
504251
KASARLA RAMESHKASARLA RAMESHFollow28 Sept 2024, 11:23 am
0
0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

Re NEET 2026: నీట్ అభ్యర్ధులకు శుభవార్త..ఫీజు తిరిగి చెల్లింపుతో పాటు 15 నిమిషాలు నిడివి పెంపు!

Hyderabad, Telangana:

Re NEET 2026 Extra 15 Minutes: ఇటీవలే జరిగిన నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్ NEET) పేపర్ లీక్ నేపథ్యంలో దాన్ని తిరిగి నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రీ-నీట్ ను 2026 జూన్ 21న నిర్వహించనున్నామని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పష్టం చేశారు. అయితే ఈసారి పరీక్ష రాసే అభ్యర్థులకు కొంతమేర ఊరట కలిగించారు. పరీక్ష రాసే విద్యార్థులకు 15 నిమిషాలు అదనంగా సమయం ఇస్తామని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు.

ఈ ఏడాది జరిగిన నీట్ పరీక్షకు సంబంధించిన ప్రశ్నాపత్రం ఇటీవలే లీక్ అయ్యిన సంగతి తెలిసిందే. దీంతో ఈ పరీక్షను రద్దు చేస్తూ నేషనల్ టెస్ట్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) కీలక ప్రకటన చేసింది. దీంతో అప్పటివరకు పరీక్ష కోసం ప్రిపేర్ అయ్యి టైమ్ ధారపోసిన విద్యార్థులు, వారి తల్లీదండ్రుల ఊసూరుమన్నారు. అయితే ఈ పరీక్షను రద్దు చేసినా.. భారతదేశపు అతిపెద్ద వైద్య ప్రవేశ పరీక్షను ఎటువంటి లోపాలు లేకుండా సజావుగా నిర్వహించడంలో విఫలమైనందుకు NTA, భారత ప్రభుత్వం.. ప్రజల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాయి. అయితే ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన దర్యాప్తును కేంద్ర ప్రభుత్వం సీబీఐకి అప్పగించగా.. ఇప్పుడు ఆ పరీక్షను తిరిగి నిర్వహించేందుకు ప్రణాళికను విడుదల చేశారు. 

నీట్ ప్రశ్నపత్రం లీక్ కేసులో ఇప్పటికే ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. మంగీలాల్ బివాల్, దినేష్ బివాల్, వికాస్ బివాల్, శుభమ్ ఖైర్నార్, యష్ యాదవ్ అనే నిందితులను CBI కోర్టు ముందు హాజరుపరిచింది. వారిని ఏడు రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాలని రౌస్ అవెన్యూ కోర్టును కోరారు. 

పరీక్షా కేంద్రం ఎంపిక ఎలా!
అభ్యర్థులు తమ పరీక్షా కేంద్రాన్ని ఎంచుకోవడానికి వీలుగా వారికి ఒక వారం రోజుల సమయం ఇస్తామని మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. తమ నివాసాన్ని మార్చుకున్న విద్యార్థులు, ప్రస్తుతం తాము నివసిస్తున్న నగరంలోనే పరీక్షా కేంద్రాన్ని ఎంచుకోవడానికి వీలుగా ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

Also Read: రజినీకాంత్ 'జైలర్ 2'షూటింగ్‌లో ప్రమాదం..ఒకరు మృతి, రంగంలోకి దిగిన పోలీసులు!

Also Read: ఏపీ క్యాబినెట్ మీటింగ్‌లో కీలక నిర్ణయాలు..నో వెహికల్ డే, ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Jailer 2 Crew Death: రజినీకాంత్ 'జైలర్ 2'షూటింగ్‌లో ప్రమాదం..ఒకరు మృతి, రంగంలోకి దిగిన పోలీసులు!

Chennai, Tamil Nadu:

Jailer 2 Crew Death News: సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా, నెల్సన్ దర్శకత్వంలో రూపొందుతోన్న 'జైలర్ 2' షూటింగ్‌లో విషాదం చోటుచేసుకుంది. గురువారం మధ్యాహ్నం ఆ సినిమా కోసం సెట్ వర్క్ జరుగుతున్న క్రమంలో ఆర్ట్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన కార్తికేయన్ అనే 28 ఏళ్ల టెక్నీషియన్ కరెంట్ షాక్‌కు గురై మృతిచెందాడు. పనైయూర్‌లోని ఒక స్టూడియోలో సెట్ నిర్మాణ పనులు జరుగుతుండగా ఈ ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. ఈ దిగ్భ్రాంతి ఘటనతో షూటింగ్‌ వెంటనే నిలిపేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

పోలీసుల కథనం ప్రకారం.. మృతుడిని టి.కార్తికేయన్‌గా గుర్తించారు. ఈయన ఆర్ట్ డిపార్ట్‌మెంట్ సిబ్బందిలో ఒకరిగా పనిచేస్తున్నారు. ఒక ఇంటిని పోలిన సెట్ నిర్మాణ పనుల్లో కార్తికేయన్ నిమగ్నమై ఉన్నప్పుడు మధ్యాహ్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. విద్యుత్ కనెక్షన్ పనులు చేస్తుండగా, ప్రమాదవశాత్తు ఆయన విద్యుత్ తీగను తాకడం వల్లే ఈ ఘటన జరిగిందని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. తోటి సిబ్బంది వెంటనే అంబులెన్స్‌లో సమీప ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించినప్పటికీ, ఆసుపత్రికి చేరుకునేసరికే ఆయన మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు.

ఈ ఘటన జరిగిన వెంటనే, కనత్తూర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్ట్‌మార్టం పరీక్షల నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ రాయపేట ఆసుపత్రికి తరలించారు. అధికారికంగా 'ప్రథమ సమాచార నివేదిక' (FIR) నమోదు చేసే ప్రక్రియ కొనసాగుతుండగా, విద్యుత్ లీకేజీకి గల కారణాలపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. వైరింగ్ లోపాల వల్లనా, లేక సెట్‌లో తగినంత భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లనా ఈ ప్రమాదం జరిగిందనే కోణంలో దర్యాప్తు అధికారులు విచారణ జరుపుతున్నారు.

ఆర్ట్ డిపార్ట్‌మెంట్‌లోని ఓ టెక్నిషియన్ మృతి కారణంగా 'జైలర్ 2' షూటింగ్‌ను అర్ధాంతరంగా ఆపేశారు. ప్రమాదం జరిగిన కొద్దిసేపటికే, అంటే మధ్యాహ్నం సుమారు 2:00 గంటల ప్రాంతంలో ప్రధాన నటుడు రజనీకాంత్ సెట్‌కు చేరుకోవాల్సి ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న 'జైలర్ 2', 2023 బ్లాక్‌బస్టర్ 'జైలర్' చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతోంది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పూర్తయినా.. ప్యాచ్ వర్క్ కోసం కొన్ని సన్నివేశాలు రీషూట్ చేస్తుంది చిత్రబృందం. అయితే దీనిపై చిత్రబృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

Also Read: ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమంత్రి తీపికబురు..2 శాతం డీఏ పెంచిన రాష్ట్ర ప్రభుత్వం!

Also Read: మహిళలకు ప్రభుత్వం శుభవార్త..బ్యాంకు ఖాతాల్లోకి రూ.1,000 జమ అప్పటి నుంచే?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Jagtial: కేంద్రీయ విద్యాలయం ఎవరి వల్ల ఆగుతోంది? సంజయ్ కుమార్ కౌంటర్.. అరవింద్ అటాక్!

Hyderabad, Telangana:

Jagtial Kendriya Vidyalaya Row Telugu News: జగిత్యాల జిల్లాకు మంజూరైన కేంద్రీయ విద్యాలయం ఇప్పుడు రాజకీయాలకు ఒక కీగా మారింది.. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాల్సిన పాఠశాల భవనంతో పాటు స్థల వివాదంలో చిక్కుకొని ప్రజాప్రతినిధుల మద్యం మాటల యుద్ధానికి దారితీస్తూ వస్తోంది. స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ తో పాటు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మధ్య ఈ వివాదం ముదరడంతో జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయినట్లు తెలుస్తోంది. అసలు అక్కడ ఏం జరుగుతుంది? వీరిద్దరి మధ్య మాటల యుద్ధం ఎందుకు? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..

చలిగల్ గ్రామ శివారులో కేంద్రీయ విద్యాలయానికి కేటాయించిన స్థల విషయంలో ఏర్పడిన ఓ చిన్న సమస్య వీరిద్దరి మధ్య రణ రంగానికి దారితీసింది. ఈ స్థలాన్ని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అడ్డుకుంటున్నారని.. ఎంపీ ధర్మపురి అరవింద్ ఆరోపిస్తున్నారు. కేంద్రం పాఠశాలను మంజూరు చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు స్థానిక ఎమ్మెల్యే ఉద్దేశపూర్వకంగానే స్థలం కేటాయింపులు జాప్యం చేస్తున్నారని ఆయన బండి పడ్డారు. దీనికి నిరసనగా జగిత్యాలాలు భారీ దీక్ష చేపట్టబోతున్నట్లు ఎంపీ ప్రకటించడం సంచలనంగా మారింది..

ఎంపీ ఆరోపణలను ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొన్ని కీలక అంశాలను లేవనెత్తారు.. చలిగల్ వాలెంటరీ స్థలం ఇరిగేషన్ శాఖ పరిధిలో ఉందని.. దానికి సంబంధించిన నిర్ణయాలు మంత్రి స్థాయిలో జరుగుతాయని ఆయన స్పష్టం చేశారు. గత ఐదేళ్లుగా జిల్లా అభివృద్ధిని పట్టించుకోని ఎంపి.. ఇప్పుడు కేవలం రాజకీయాల కోసమే తనను టార్గెట్ చేస్తున్నారని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు.. స్థల కేటాయింపుకు సాంకేతిక ఇబ్బందులు ఉన్నాయని.. వాటిని పరిష్కరించాల్సింది పోయి తనపై బురద జల్లడం సరికాదని ఆయన  అన్నారు..

Also Read: నీ కాళ్లు మొక్కుతా సారూ.. మా ధాన్యం కొనండి!.. జగిత్యాలలో రైతు ఆవేదన..

కేంద్రీయ విద్యాలయం రాకూడదని నేనెందుకు అనుకుంటాను.. ఎంపీ గారు తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి నాపై అసత్య ప్రసారం చేస్తున్నారని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. ప్రజా ప్రతినిధుల మధ్య నడుస్తున్న ఈ వార్ వల్ల అసలు నష్టపోయేది విద్యార్థులేనని అక్కడి మేధావులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే తరగతులు ప్రారంభం కావాల్సి ఉండగా.. భవన నిర్మాణానికి పునాది పడకపోవడంపై యువత సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఎంపీ అరవింద్ దీక్షకు సిద్ధమవుతుండడంతో పోలీసులు జగిత్యాలలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసే యువచనలు ఉన్నట్లు తెలుస్తోంది..

Also Read: నీ కాళ్లు మొక్కుతా సారూ.. మా ధాన్యం కొనండి!.. జగిత్యాలలో రైతు ఆవేదన..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report
Advertisement

Delhi News: నాకు ముగ్గురు పిల్లలున్నారు.. వదిలేయండి.. ఢిల్లీ గ్యాంగ్ రే**ప్ బాధితురాలు కన్నీరు..

Hyderabad, Telangana:

Delhi Gang Rape Telugu News: దేశ రాజధాని లోని మహిళా భద్రత మళ్లీ ప్రశ్నార్ధకంగా మారిపోయింది.. కామాందుల చేతిలో చిక్కిన ఒక బాధితురాలు తన ముగ్గురు పిల్లల కోసం ప్రాధేయపడిన.. వారు ఏమాత్రం కనికరించకుండా దారుణానికి ఒడిగట్టేసారు. హృదయాన్ని తగిలిస్తున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో బాధితురాలు కామాందులతో మాట్లాడిన కొన్ని అరుదైన మాటలు వైరల్ గా మారాయి. 

నాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు.. వాళ్లు నాకోసం ఎదురు చూస్తూ ఉంటారు.. ప్లీజ్ నన్ను వదిలేయండి అని సదరు మహిళ నిందితులను వేడుకున్న వారు వినిపించుకోలేదు.  బాధితురాలి వివరాలకు ప్రకారం.. ఆమెకు నాలుగు, ఆరు, 9 ఏళ్ల వయస్సు ఉన్న ముగ్గురు చ చిన్నారి ఆడపిల్లలున్నారు. పని ముగించుకుని ఇంటికి వెళ్తున్న సమయంలో కొందరు దుండగులు ఆమెను అడ్డగించి నిర్మాణస్య ప్రదేశానికి తీసుకెళ్లి ఆమెపై విచక్షణారహితంగా లైంగిక దాడికి పాల్పడ్డారు..

తనపై జరిగిన అఘాయిత్యాన్ని బాధితురాలు కన్నీరు మున్నీరవుతూ పోలీసులకు వివరించింది. నన్ను బలవంతంగా తీసుకెళ్లి హత్యాచారం చేశారు.. నేను ఎంతగా వదిలేయమని చెప్పినప్పటికీ వారు కనికరించలేదు.  చివరకు ఈ విషయం ఎవరికీ చెప్పనని.. నా పిల్లల కోసం నన్ను వదిలేయమని కాళ్ళ వేళ్ళ పడ్డానని.  నా దీన స్థితిని చూసి వారు వదిలిపెట్టారు.. అని ఆమె వాంగ్మూలంలో పేర్కొన్నారు..

నిందితుల నుంచి తప్పించుకున్న బాధితురాలు.. ఏ మాత్రం ధైర్యం కోల్పోకుండా కొంత దూరం వెళ్లిన తర్వాత వెంటనే పోలీసులకు ఫోన్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. ఈ దారుణ ఘటనపై కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. బాధితురాలు చెప్పిన ఆడవాళ్లతో పాటు పరిసర ప్రాంతాల్లో సీసీటీవీ పుటిజి ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో పడ్డట్లు తెలుస్తోంది.. నగర నడిబొడ్డున ముగ్గురు పిల్లల తల్లి పై ఇలాంటి అఘాయిత్యం జరగడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. నిందితులను కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలు డిమాండ్ కూడా చేస్తున్నాయి..

Also Read:  ​Fact Check: 1967 ఇందిరా గాంధీ బంగారం కొనవద్దని చెప్పారా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report

Gajalakshmi Rajayoga 2026: అరుదైన గజలక్ష్మి రాజయోగం.. ఈ 5 రాశుల వారికి అదృష్టం మాములుగా ఉండదు, ఇక డబ్బే డబ్బు!

Hyderabad, Telangana:

Gajalakshmi Rajayoga 2026 Effect On Zodiac: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మే 14, 15, 16 తేదీలకు చాలా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఎందుకంటే మే 14వ తేదీన అనేక గ్రహాలు ఏకకాలంలోనే సంచారం చేశాయి. అర్ధరాత్రి వేళ చంద్రుడు మేషరాశిలోకి ప్రవేశించాడు. ఆ తర్వాత సూర్యుడితో పాటు కుజ గ్రహాల కలయిక కూడా జరిగింది. మరోవైపు శుక్రుడు గురుడితో కలయిక జరపడం కారణంగా ఎంతో శక్తివంతమైన రాజయోగం ఏర్పడింది. ఈ సమయంలో మిథున రాశిలో శుక్రుడితో పాటు గురుడి కలయిక జరిగింది. దీని కారణంగా గజలక్ష్మిరాజుయోగం ఏర్పడింది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ రాజయోగానికి చాలా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. అలాగే ఈ సమయంలో గురుడు పునర్వాసు నక్షత్రం మూడవ స్థానంలోకి ప్రవేశించాడు. బుధుడు వృషభ రాశిలోకి సంచారం చేశాడు. ఇలా అనేక గ్రహాలు ఈ తేదీల్లో సంచారం చేయడం విశేషం.. దీని కారణంగా మొత్తం ఐదు రాశుల వారిపై ఊహించని ప్రభావం పడుతుంది.

ఈ రాశులవారికి బంపర్‌ జాక్‌పాట్:
మిథున రాశి 
మే 14వ తేదీ నుంచి మిధున రాశి వారికి ఈ సమయంలో విశేషమైన ప్రయోజనాలు కలగబోతున్నాయి. ముఖ్యంగా మిత్రగ్రహమైన శుక్రుడి ప్రవేశంతో ఏర్పడిన గజలక్ష్మి రాజయోగ ప్రభావం వల్ల వీరికి అన్ని రకాల సమస్యలు పరిష్కారం లభించబోతున్నాయి. అంతేకాకుండా ఈ సమయంలో వచ్చే ప్రతి సమస్యకు పరిష్కారం లభించబోతోంది. ఆర్థికంగా ప్రణాళికలు అద్భుతమైన విజయాలు సాధించగలుగుతారు. ఖర్చులు నియంత్రించుకోగలిగితే జీవితంలో ఊహించని లాభాలు పొందగలుగుతారు. ఇతరులనుంచి మంచి సపోర్టు పొంది.. అనుకోని ధన లాభాలు కూడా పొందుతారు. అలాగే ప్రేమ జీవితంలో వస్తున్న సమస్యలు కూడా పూర్తిగా పరిష్కారం అవుతాయి. వీరికి ఆత్మవిశ్వాసం కూడా అంచెలంచెలుగా రెట్టింపు అవుతుంది. సృజనాత్మకత కూడా చాలా వరకు పెరిగి అనుకున్న పనుల్లో అద్భుతమైన విజయాలు సాధిస్తారు.

తులారాశి 
గజలక్ష్మి రాజయోగంతో తులారాశి వారికి ఈ సమయం మంచి ఫలితాలను అందిస్తుంది. అంతేకాకుండా జీవితంలో వస్తున్న ఆందోళనలు కూడా సులభంగా తొలగిపోతాయి. పనిలోని మీ సామర్థ్యంతో పాటు నైపుణ్యాలు విపరీతంగా పెరుగుతాయి. పై అధికారుల నుంచి మీకు మంచి సపోర్టు లభిస్తుంది. అంతేకాకుండా కొత్త భాగస్వాములు కూడా మీతో పరిచయాలు పెంచుకునే అవకాశాలు కనిపిస్తాయి. అలాగే పిల్లల గురించి ఆలోచిస్తున్న వ్యక్తులకు ఆందోళన తగ్గి విశేషమైన లాభాలు కలుగుతాయి. ప్రభుత్వ రంగాల్లో పనులు చేస్తున్న వ్యక్తులకు ఈ సమయంలో తప్పకుండా విజయాలు సాధించే అవకాశాలు లభిస్తాయి. ముఖ్యంగా ప్రేమ జీవితంలో శృంగారభరితమైన సమయం గడిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇష్టమైన ఆహారాన్ని ఆస్వాదించి జీవితంలో అద్భుతమైన ఆనందాన్ని పొందుతారు..

ధనస్సు రాశి 
ధనస్సు రాశిలో జన్మించిన వ్యక్తులకు ఏడవ స్థానంలో శుక్ర గురు గ్రహాల కలయిక జరిగింది. దీని కారణంగా విద్యాతో పాటు వృత్తి జీవితంలో అభివృద్ధి లభించబోతోంది. అలాగే మీ పనుల్లో అనుభవంతో పాటు జ్ఞానం కూడా విపరీతంగా పెరుగుతుంది. ఈ సమయంలో ఎలాంటి విజయాలైన ఎంతో సులభంగా సాధించగలుగుతారు. మీ పనికి తగ్గ ప్రశంసలు కూడా దక్కుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. మీ జీవిత భాగస్వామి సపోర్టు లభించి కొన్ని రకాల పనులు ఎంతో సులభంగా చేయగలుగుతారు. అంతేకాకుండా కుటుంబ జీవితంలో గౌరవం కూడా విపరీతంగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతోపాటు ఈ సమయంలో ఉద్యోగాలు మారాలని చూస్తున్న వ్యక్తులకు ఈ సమయం ఎంతో లాభదాయక అందిస్తుంది..

కుంభరాశి 
కుంభరాశిలో జన్మించిన వ్యక్తులకు శుక్ర, గురు గ్రహాల కలయిక కారణంగా ఈ సమయం చాలా శుభప్రదంగా ఉండబోతోంది. ముఖ్యంగా ఐదవ స్థానంలో ఈ రెండు గ్రహాల కలయిక కారణంగా ఉన్నట్టుండి ఇంట్లో ఆనందం ఊహించని స్థాయిలో పెరుగుతుంది. పనులన్నీ సజావుగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీకు మీ సహ ఉద్యోగుల నుంచి మంచి సపోర్టు లభించి.. ఎప్పుడూ పొందలేని ఆనందాన్ని కూడా సొంతం చేసుకోగలుగుతారు. అంతేకాకుండా అదృష్టంతో పాటు జీవితంలో అనుకున్న లాభాలన్నీ పొందగలుగుతారు. అలాగే ఎప్పటినుంచో కోరుకుంటున్న కోరికలు ఎంతో సులభంగా నెరవేరుతాయి. డబ్బు సంబంధిత సమస్యలకు కూడా చాలావరకు పరిష్కారం లభిస్తుంది.

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

గమనిక: ఇక్కడ అందించిన వార్త కేవలం జ్యోతిష్య శాస్త్ర నిపుణులు నుంచి సేకరించి రాసింది మాత్రమే..  దీనిని జీ తెలుగు న్యూస్ ధృవీకరించదు.

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report

PBKS vs MI Highlights: పంజాబ్‌ను దెబ్బతీసిన ముంబై.. తిలక్‌వర్మ తుఫాన్‌ ఇన్నింగ్స్‌

mathura, Dharamshala, Himachal Pradesh:

Tilak Varma Heroic Batting: ప్లేఆఫ్స్‌ రేసులో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఆరంభంలో అదిరిపోయే మ్యాచ్‌లతో ఓటమి లేకుండా ఆడిన పంజాబ్‌ కింగ్స్‌ సెకండాఫ్‌లో పరిస్థితి రివర్స్‌ మారింది. ఇప్పుడు వరుస ఓటములు చవిచూస్తూ ప్లేఆఫ్స్‌ అవకాశాలను దూరం చేసుకుంటోంది. తాజాగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌ను కూడా పంజాబ్‌ కోల్పోయింది. విజయం కోసం చివరి బంతి వరకు పోరాడినా ఫలితం నిరాశ మిగిల్చింది. తిలక్‌ వర్మ భారీ ఇన్నింగ్స్‌తో మ్యాచ్‌ను గెలిపించి ముంబై జట్టుకు ఊరటనిచ్చాడు. ధర్మశాల వేదికగా జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌పై ముంబై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌కు సంబంధించి విశేషాలు ఇలా ఉన్నాయి.

0
0
Report
Advertisement

Bandi Bhageerath: కొడుకును అప్పగించకుండా బండి సంజయ్‌ ఎవరిని బెదిరిస్తున్నాడు? ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ ఫైర్‌

Baddipadaga, Telangana:

Bandi Bhageerath POCSO Case: 'పేట్ బషీరాబాద్ పోలీసులు చట్టానికి వ్యతిరేకంగా పోక్సో కేసు నిందితుడు బండి భగీరథ్ మామకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. బండి భగీరథ్‌కు నేర చరిత్ర ఉంది. ఆ విషయం పోలీసులకు తెలుసు. తెలంగాణ మహిళ లోకానికి బండి భగీరథ్‌తో ప్రమాదం పొంచి ఉంది' అని మాజీ ఐపీఎస్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ ఆందోళన వ్యక్తం చేశారు. 'బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసుపై పోలీసులు మీడియా సమావేశం ఎందుకు పెట్టలేదు? బండి భగీరథ్‌ను రక్షించాలనే ఆలోచన రేవంత్ రెడ్డికి ఉన్నట్లు కనిపిస్తుంది. సీతక్క మీడియా సమావేశం ఏర్పాటు చేసి బండి భగీరథ్ గురించి మహిళ లోకానికి తెలపాలి' అని డిమాండ్‌ చేశారు.

Also Read: Govt Employees: ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. రేపు సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

హైదరాబాద్‌లోని బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. 'బండి భగీరథ్‌ చేతిలో అన్యాయానికి గురయిన బాధితురాలి వ్యక్తిత్వాన్ని అడుగడుగున నాశనం చేయాలని చూస్తున్నారు. ఆమెపై సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు పోస్టులు పెడుతున్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రితో బాధితురాలు తల్లి కొట్లాట చేస్తానని నాతో చెప్పింది. బాధితురాలి ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ నాశనం చేస్తున్నారని బాధితురాలు తల్లి ఆవేదన చెందుతుంది' అని బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వివరించారు.

Also Read: AMCA Project: అనంతపురం జిల్లాకు మరో వరం.. కరువు సీమలో భారీ యుద్ధ విమాన ప్రాజెక్టు

'రేవంత్ రెడ్డికి ఒక అమ్మాయి ఉంది ఆ బాధ ఎలా ఉంటుందో ఆయనకు తెలుస్తుంది. సీతక్క, కొండా సురేఖ డీజీపీతో మాట్లాడి బాధితురాల ఫొటోలను సోషల్ మీడియా నుంచి వెంటనే తీసివేసేలా చర్యలు తీసుకోవాలి' అని బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్‌ చేశారు. 'బండి భగీరథ్ పారిపోయారు. నిందితుడి తండ్రితో కలిసి రేవంత్ రెడ్డి మీటింగ్‌లో పాల్గొన్న తరువాత కేసు గురించి ఇంకేం విచారణ ఉంటుంది. బీజేపీ నాయకులు బాధిత మహిళను మేజరా, మైనరా చర్చ చేయడం బాధాకరం' అని మాజీ ఐపీఎస్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

Also Read: KKR vs RCB Highlights: కలకత్తా ప్లేఆఫ్స్‌ ఆశలు గల్లంతు.. బెంగళూరు బెర్త్‌ పక్కా

'కల్వకుంట్ల కవిత పార్టీ పెట్టుకున్నప్పుడు తెలంగాణకు అమ్మలా ఉంటానని చెప్పి మర మనిషిగా ఉంటున్నారు. తెలంగాణ అమ్మలా ఉండాలని అనుకుంటున్న కవిత బాధితురాల అమ్మ బాధ ఒకసారి చూడాలి. రేవంత్ రెడ్డి, బీజేపీ స్క్రిప్ట్ కవిత చదవి మర మనిషిలా ఉంటున్నారు. బీఆర్ఎస్ నాయకులతోనే బాధితురాలి వివరాలు బయటకు వచ్చాయని కవిత అనడం సరికాదు' అని కవితపై బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

'ఒక సీనియర్ పోలీస్ అధికారి సలహాతోనే బండి భగీరథ్ కరీంనగర్‌లో బాధితురాలిపై కేసు పెట్టాడు. యూనివర్సిటీలో బండి భగీరథ్ ఇష్యూ అయినప్పుడే తన తండ్రి భగీరథ్‌ను బయటకు పంపించుకోవాలి. బండి సంజయ్ కొడుకు పెంపకంలో తేడా ఉంది. పిల్లలు అందరు ఒకటే పెంపకంలో లోపం ఉన్నప్పుడే ఇలాంటివి జరుగుతాయి' అని మాజీ ఐపీఎస్‌ అధికారి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ తెలిపారు. 'బండి భగీరథ్ కరీంనగర్‌లో బాధితురాలుపై పెట్టిన కేసులో సెక్షన్ ఒకలా ఉన్నాయి. బండి భగీరథ్‌పై బాధితురాలు పెట్టిన కేసులో సెక్షన్ 6, 8 పెట్టకుండా పోలీసులు నిర్లక్ష్యం చేశారు' అని ఆరోపించారు.

'బాధితురాలుపై సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు పోస్టులు పెడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలి. రేవంత్ రెడ్డి పాలనలో తెలంగాణ ప్రజలకు రక్షణ లేదు. రిటైర్డ్ డీజీ ర్యాంక్ పోలీస్ అధికారి భార్యను పట్టపగలే నేపాల్ గ్యాంగ్ హత్య చేసింది. బండి సంజయ్‌ను ఇబ్బంది పెట్టిన వారిని ఏ ఒక్క వ్యక్తి వదిలిపెట్టను అని అంటున్నాడు. సీతమ్మ తల్లి కోసం ఆంజనేయుడు లంకను దహనం చేశాడు. ఆంజనేయుడు పేరు తీసే అర్హత బండి సంజయ్‌కు లేదు' అని బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు.

'బండి సంజయ్ ఎవరిని భయపెట్టిస్తున్నాడు? బాధితురాలను బెదిరిస్తున్నారా, మమ్మల్ని బెదిరిస్తున్నారా?' అని మాజీ ఐపీఎస్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ ప్రశ్నించారు. బండి సంజయ్ వ్యాఖ్యలతో బాధితురాలు తల్లి భయపడుతోందని తెలిపారు. 'దేశం కోసం... ధర్మం కోసం పోక్సో కేసుల్లో అత్యధికంగా బీజేపీ నేతలపైనే ఎక్కువ. బాధితురాలకు న్యాయం చేయాలి' అని డిమాండ్‌ చేశారు.

0
0
Report

AP Govt Teachers: ప్రభుత్వ టీచర్లకు సీఎం చంద్రబాబు తీపి కబురు.. ఏం ప్రకటించారంటే?

Nuzendla, Andhra Pradesh:

Good News To Govt Teachers: ప్రభుత్వ టీచర్లు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న కీలక అంశంపై కూటమి ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఉద్యోగులకు ఊరట కలిగించేలా ప్రమోషన్‌లలో విషయంలో ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఏపీలో ప్రభుత్వ టీచర్ల ప్రమోషన్లకు కొత్త రూల్ తీసుకువచ్చింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇకపై టీచర్లకు పదోన్నతుల్లో టెట్ (ఉపాధ్యాయ అర్హత పరీక్ష) తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది.

Also Read: AMCA Project: అనంతపురం జిల్లాకు మరో వరం.. కరువు సీమలో భారీ యుద్ధ విమాన ప్రాజెక్టు

స్కూల్‌ అసిస్టెంట్, ప్రధానోపాధ్యాయులు గ్రేడ్‌-2 ప్రమోషన్లకు టెట్ తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఒకటో తరగతి నుంచి ఎనిమిదో తరగతి టీచర్లు ఉద్యోగంలో ఏ రోజు చేరినా సరే పదోన్నతులు (ప్రమోషన్) సమయంలో మాత్రం ఎన్‌సీటీఈ నిబంధనలు పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. ఏపీలో సర్వీసులో ఉన్న ఉపాధ్యాయుల కోసం టెట్‌కు సంబంధించిన మార్గదర్శకాలను సుప్రీంకోర్టు ఆదేశాలతో ప్రభుత్వం గతేడాది అక్టోబర్‌‌లో విడుదల చేసిన విషయం తెలిసిందే. 

Also Read: Govt Employees: ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. రేపు సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

కొత్త రూల్‌తో ప్రభుత్వ టీచర్లకు సంబంధించిన ప్రమోషన్‌ల జాబితాలో టెట్‌ కాలమ్‌ ఉంచారు. కొత్తగా టెట్‌ కాలమ్‌ను సర్వీసులో ఉన్న స్కూల్‌ అసిస్టెంట్లు, ఎస్జీటీల సీనియారిటీ జాబితాలో చేరుస్తారు. సీనియారిటీ జాబితాలో టెట్‌ మార్కులు, ఏపీటెట్‌, సీటెట్‌లో అర్హత సాధించారా? లేదా? ఏపీటెట్‌లో ఏ పేపర్‌లో అర్హత సాధించారు? పేపర్‌-2లో అర్హత సాధించి ఉంటే సబ్జెక్టు, మాధ్యమం వివరాలను పొందుపర్చాలి ఉంది. సర్వీస్‌లో ఉన్న టీచర్లకు ప్రభుత్వం గతేడాది టెట్ రాసే అవకాశం ఇచ్చింది. దీంతో టీచర్ల ప్రమోషన్లలో ఎన్‌సీటీఈ నిబంధనలను ప్రస్తావించారు. గతేడాది సుప్రీంకోర్టు టీచర్లకు టెట్‌ అర్హత తప్పనిసరి అని తీర్పు ఇవ్వడంతో ఏపీలో కూడా టెట్‌ తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

Also Read: KKR vs RCB Highlights: కలకత్తా ప్లేఆఫ్స్‌ ఆశలు గల్లంతు.. బెంగళూరు బెర్త్‌ పక్కా

వారికి విదేశీ పర్యటన
ప్రమోషన్‌లలో కొత్త రూల్‌తోపాటు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు అందుకున్న ఉపాధ్యాయులకు ప్రభుత్వం బంపర్‌ ఆఫర్‌ ఇచ్చింది. ఉత్తమ అవార్డులు అందుకున్న 31 మంది ఉపాధ్యాయులతోపాటు సీమ్యాట్‌ కాంట్రాక్ట్‌ లెక్చరర్‌ సతీష్‌రెడ్డికి ప్రభుత్వం విదేశీ పర్యటనకు ఎంపిక చేసింది. ఫిన్లాండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ టుర్కు సందర్శనకు ప్రభుత్వం పంపించనుంది. ఉపాధ్యాయుల ఫిన్లాండ్ టూర్‌కు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆగస్టు 17 నుంచి 26వ తేదీ వరకు 31మంది టీచర్లు, సీమ్యాట్ కాంట్రాక్ట్ లెక్చరర్ సతీశ్‌రెడ్డి, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ తమీమ్‌ అన్సారియా  ఫిన్లాండ్ దేశం‌లో పర్యటిస్తారు.

0
0
Report

Bride Death: రాత్రి పెళ్లి భజంత్రీలు తెల్లారి చావు డప్పు.. వివాహమైన తెల్లారి వధువు, తల్లి దుర్మరణం

Visakhapatnam, Andhra Pradesh:

Wedding Tragedy: అంగరంగ వైభవంగా రాత్రి పెళ్లి చేశారు.. బంధుమిత్రులు తరలివచ్చారు. ఆనందోత్సాహాలతో పెళ్లి వేడుక జరగ్గా.. తన భర్తతో కలిసి వధువు అత్తారింటికి బయల్దేరింది. పెళ్లయిన తర్వాతి రోజు అత్తారింటికి కాపురం కోసం వెళ్తున్న వధువు జరిగిన ఘోర సంఘటనలో ఆమె దుర్మరణం పాలయ్యారు. ఆమెతోపాటు ఆమె తల్లి కూడా మరణించడంతో పెళ్లి ఇంట చావు భాజా మోగింది. తల్లీ కుమార్తెలు రోడ్డు ప్రమాదంలో మరణించడంతో విశాఖపట్టణంలో తీవ్ర విషాదం అలుముకుంది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

Also Read: AMCA Project: అనంతపురం జిల్లాకు మరో వరం.. కరువు సీమలో భారీ యుద్ధ విమాన ప్రాజెక్టు

విశాఖపట్టణం గాజువాక అగనంపూడి శానివాడ సమీపంలో గురువారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అగనంపూడి గ్రామానికి చెందిన నడుపూరు పెంటారావు, కనకమహాలక్ష్మి చిన్న కుమార్తె రామేశ్వరిని వాడచీపురుపల్లి గ్రామానికికి చెందిన నర్సింగరావుకు ఇచ్చి బుధవారం రాత్రి వైభవంగా వివాహం చేశారు. రాత్రి బంధుమిత్రుల సమక్షంలో విందు జరిగిన అనంతరం రామేశ్వరి మెడలో నర్సింగరావు మూడు ముళ్లు వేశాడు. వివాహం అనంతరం అక్కడే నిద్రపోయిన వధూవరులు తెల్లవారుజామున లేచి అత్తగారి ఊరు అగనంపూడి బయల్దేరారు.

Also Read: Govt Employees: ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. రేపు సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

తన భార్య, అత్తామాలను తీసుకుని వరుడు అంగనపూడి గ్రామానికి కారులో బయల్దేరగా.. మార్గమధ్యలో ఘోర సంఘటన జరిగింది. కారు అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. అతివేగంతో ఢీకొట్టడంతో కారులోని నూతన వధూవరులతోపాటు అత్తామామలు, ఇతర కుటుంబసభ్యులు ఎగిరిపడ్డారు. తీవ్ర గాయాలతో వధువు రామేశ్వరి అక్కడికక్కడే మృతి చెందగా.. మిగతా వారు గాయాలపాలయ్యారు. వెంటనే స్థానికులు, పోలీసులు అప్రమత్తమై క్షతగాత్రులను ఆస్పత్రికి ఇతరలించారు.

Also Read: KKR vs RCB Highlights: కలకత్తా ప్లేఆఫ్స్‌ ఆశలు గల్లంతు.. బెంగళూరు బెర్త్‌ పక్కా

ఇరు కుటుంబాలు
పెళ్లి దండలతో ఉన్న రామేశ్వరి మృతి చెందగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె తల్లి కనకమహాలక్ష్మి చికిత్స పొందుతూ మరణించారు. వరుడు నర్సింగరావుతోపాటు మిగతా ముగ్గురికి తీవ్ర గాయాలవగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉందని సమాచారం. ఈ సంఘటనతో ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం అలుముకుంది. పెళ్లితో ఆనందంగా ఉన్న ఆ కుటుంబాలు ఒక్కసారిగా తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాయి. ప్రమాదానికి డ్రైవర్‌ నిద్రమత్తు కారణంగా తెలుస్తోంది. డ్రైవింగ్‌ చేస్తున్న వ్యక్తి ఒక కునుకు వేయడంతో కారు పక్కకు ఒరిగి స్తంభాన్ని ఢీకొట్టి ఉంటుందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించారు. ప్రమాద స్థలంలో వధూవరుల పెళ్లి దండలు పడి ఉండడంతో ఆ సన్నివేశం చూస్తే అందరినీ కలచివేస్తోంది. ఇక నిన్న పెళ్లిలో దిగిన ఫొటోల్లో ఉన్న వ్యక్తులు అప్పుడే మరణించడంతో బంధుమిత్రులు షాక్‌కు గురయ్యారు. ఈ సంఘటన అగనంపూడి, వాడచీపురుపల్లి గ్రామాల్లో తీవ్ర విషాదం నింపింది.

0
0
Report
Advertisement

AP Cabinet Meeting: ఏపీ క్యాబినెట్ మీటింగ్‌లో కీలక నిర్ణయాలు..ఒకరోజు నో వెహికల్ డే, ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్!

Velgapudi, Andhra Pradesh:

AP Cabinet Meeting News: అమరావతిలో నేడు ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ మీటింగ్ జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మంత్రివర్గం దాదాపుగా 40కి పైగా అంశాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. అందులో ప్రధానంగా పరిపాలనా సంస్కరణలు, పొదుపు చర్యలు, పారిశ్రామికాభివృద్ధిపై దృష్టి సారించినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని అటు పర్యావరణ పరిరక్షణతో పాటు ఇటు ప్రభుత్వ ఖర్చుల పొదుపు కోసం మంత్రివర్గం వినూత్నమైన మార్పులకు శ్రీకారం చుట్టింది.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు 'పొదుపు'ను ఒక విధానాన్ని అమలు చేయడానికి కేబినెట్ నిర్ణయించింది. వారానికి ఒకరోజు ప్రభుత్వ వాహనాలను వాడకూడదని (నో వెహికల్ డే) మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. మంత్రులు తమ రవాణా కోసం పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్, ఎలక్ట్రిక్ వాహనాలు (EV) లేదా సైకిళ్లను వాడాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. అలాగే మంత్రుల జిల్లాల పర్యటనల్లో అనవసర ఖర్చులను తగ్గించుకోవాలని (కాస్ట్ కటింగ్) సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. పాలకులతో పాటు పౌరుల్లో బాధ్యతను పెంచేలా ఈ ప్రత్యేక ప్రచారాన్ని మరింతగా ముందుకు తీసుకెళ్లాలని ఆయన పేర్కొన్నారు.

ఐటీ, ఇతర రంగాల తరహాలో ప్రభుత్వ శాఖల్లో కూడా విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. నేరుగా ఆఫీసుకు రావాల్సిన అవసరం లేని ఉద్యోగులకు 'వర్క్ ఫ్రమ్ ప్రభుత్వ హోమ్' కల్పించే ప్రతిపాదనపై మంత్రివర్గంలో కీలక చర్చ జరిగింది. త్వరలోనే మార్గదర్శకాలు విడుదలయ్యే అవకాశం ఉంది.

అలాగే భవిష్యత్తులో ప్రభుత్వం కొత్తగా కొనుగోలు చేసే వాహనాలన్నీ EV (ఎలక్ట్రిక్ వాహనాలు) అయి ఉండాలని నిర్ణయించారు. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు.

ఇదే సమావేశంలో రాష్ట్ర ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచేలా పలు పారిశ్రామిక ప్రాజెక్టులకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. టెక్నాలజీ రంగంలో డేటా సెంటర్ల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ఆటోమొబైల్, సిమెంట్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో భారీ పెట్టుబడులు, ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. అలాగే ఈ సమావేశంలో క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టుల విస్తరణకు ప్రాధాన్యతనివ్వాలని మంత్రివర్గం నిర్ణయించింది.

Also Read: ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమంత్రి తీపికబురు..2 శాతం డీఏ పెంచిన రాష్ట్ర ప్రభుత్వం!

Also Read: మహిళలకు ప్రభుత్వం శుభవార్త..బ్యాంకు ఖాతాల్లోకి రూ.1,000 జమ అప్పటి నుంచే?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

AMCA Project: అనంతపురం జిల్లాకు మరో వరం.. కరువు సీమలో భారీ యుద్ధ విమాన ప్రాజెక్టు

Puttaparthi, Andhra Pradesh:

Puttaparthi AMCA Project: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కరువుకు కేరాఫ్‌గా నిలిచిన ఉమ్మడి అనంతపురం జిల్లా ఇప్పుడు అభివృద్ధికి కేంద్రంగా మారుతోంది. ఇప్పటికే ఈ కరువు ప్రాంతంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతుండగా.. అదే స్థాయిలో భారీ ప్రాజెక్టులు వస్తున్నాయి. కియా కార్ల సంస్థ ఉమ్మడి అనంతపురం జిల్లాలోనే ఉండగా.. తాజాగా యుద్ధ విమానాల తయారీ ప్రాజెక్టు కూడా అనంతపురం జిల్లాలో ఏర్పాటుకానుంది. రూ.లక్ష కోట్లతో ఈ ప్రాజెక్టు ఏర్పాటు కానుండడంతో అనంతపురం జిల్లాకు మహర్దశ పట్టనుంది.

Also Read: Bandi Bageerath POCSO Case: అమ్మాయి మైనర్‌ కాదు.. హైకోర్టులో బండి భగీరథ్‌ వాదనలు

పుట్టపర్తిలో రూ.లక్ష కోట్లతో ఫిఫ్త్ జనరేషన్ యుద్ధ విమానాల తయారీ ప్రాజెక్టుకు రేపు అంకురార్పణ జరగనుంది. ఈ ప్రాజెక్టు పనులకు సీఎం చంద్రబాబు, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రేపు శంకుస్థాపన చేయనున్నారు. ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి పర్యటన నేపథ్యంలో పుట్టపర్తిలో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే అక్కడ ఏర్పాట్లు పూర్తిగా కాగా.. తాజాగా కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను అనంతపురం జిల్లా ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Also Read: KKR vs RCB Highlights: కలకత్తా ప్లేఆఫ్స్‌ ఆశలు గల్లంతు.. బెంగళూరు బెర్త్‌ పక్కా

ఈనెల 15న పుట్టపర్తిలో సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ యుద్ధ విమానాల తయారీ ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమం జరగనున్న నేపథ్యంలో ఏర్పాట్లను పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, సీఎం కోఆర్డినేటర్ పెందుర్తి వెంకటేష్, మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి, మడకశిర ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు పరిశీలించారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో 650 ఎకరాల్లో ఫిఫ్త్ జనరేషన్ యుద్ధ విమానాల తయారీ ప్రాజెక్టు ఏర్పాటు చేయడం ఎంతో చారిత్రాత్మక నిర్ణయమని పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి తెలిపారు.

Also Read: Govt Employees: ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. రేపు సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

సత్యసాయి బాబా ఆశీస్సులతో భారత రక్షణ రంగానికి సంబంధించిన అత్యంత ప్రతిష్టాత్మక విమానాల తయారీ ప్రాజెక్టు సత్యసాయి జిల్లా పుట్టపర్తికి రావడం గొప్ప వరం అని ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా వేలాది మందికి ప్రత్యక్ష, పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని వివరించారు. ఆమడగూరు మండలంలో 5 వేల మెగావాట్ల సామర్థ్యంతో రూ.51 వేల కోట్ల వ్యయంతో రిలయన్స్ సోలార్ పవర్ ప్రాజెక్టు ఏర్పాటు కావడం జిల్లాకు మరొక గర్వకారణమని ఎమ్మెల్యే సింధూర రెడ్డి చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి, పరిశ్రమల స్థాపనకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.

0
0
Report

Bandi Bageerath POCSO Case: అమ్మాయి మైనర్‌ కాదు.. హైకోర్టులో బండి భగీరథ్‌ వాదనలు

RRaghu19h ago
Hyderabad, Telangana:

Telangana High Court: అత్యాచారానికి పాల్పడిన కేంద్ర మంత్రి బండి సంజయ్‌ కుమారుడు, నిందితుడు బండి భగీరథ్‌కు బెయిల్‌పై ఇంకా ఎలాంటి నిర్ణయం రాలేదు. తెలంగాణ హైకోర్టులో వేసిన పిటిషన్‌ గురువారం మధ్యాహ్నం విచారణకు వచ్చింది. మధ్యంతర బెయిల్‌ కోసం బండి భగీరథ్‌ న్యాయవాదులు వాదనలు వినిపించారు. బాధితురాలు మైనర్‌ కాదు మేజర్‌ అని చెబుతున్నారు కానీ ఆమెపై అత్యాచారం చేసిన విషయాన్ని మాత్రం మరచిపోతున్నారు. ఇదే విషయమై హైకోర్టులో వాదనల మీద వాదనలు జరిగాయి. చివరకు రేపు విచారణకు వాయిదా వేసింది.

Also Read: KKR vs RCB Highlights: కలకత్తా ప్లేఆఫ్స్‌ ఆశలు గల్లంతు.. బెంగళూరు బెర్త్‌ పక్కా

బాధితురాలు తరఫు న్యాయవాది వాదనలు
కరీంనగర్‌లో బాధితురాలిపై తప్పుడు కేసు పెట్టారు. బాధితురాలు తల్లి పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌కి వెళ్లిన సమయంలో వెంటనే కరీంనగర్‌కి సమాచారం ఇచ్చి కేసు నమోదు చేశారు. నిందితుడు కేంద్ర మంత్రి కుమారుడు ఈ కేసులో చాలా ప్రభావితం చేశారు. తమ వాదనలు వినిపించడానికి  మాకు కొంత సమయం కావాలని న్యాయస్థానాన్ని బాధితురాలు తరఫు న్యాయవాది కోరారు. రేపు మధ్యంతర బెయిల్ పై రేపు నిర్ణయం తీసుకుంటామని న్యాయస్థానం తెలిపింది.

Also Read: Govt Employees: ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. రేపు సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

'పోక్సో చట్టంలోని  సెక్షన్ 11 నిర్దేశించిన వాటి పరిధిలోకి పిటిషనర్ రారు. బీఎన్‌ఎస్‌ సెక్షన్ 74, 75 ఆరోపించిన నేరాలు రుజువు కాలేదు. బాధితురాలుగా చెబుతున్న బాలిక వయసు 19 నుంచి 20 మధ్య ఉంటుంది. ఆమె తల్లి తప్పుడు రికార్డ్స్ సృష్టించి వయసు తగ్గించి కఠినమైన పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయించారు. 8 నెలలు కింద జరిగిన సంఘటనపై ఇప్పుడు ఫిర్యాదు చేయడంలో దురుద్దేశం ఉంది. ' అని బండి భగీరథ్‌ న్యాయవాది, సీనియర్ కౌన్సిల్ నిరంజన్ రెడ్డి వాదించారు. బాలిక మైనర్ కాదు అనడానికి మీ దగ్గర ఆధారాలు ఉంటే సమర్పించాలని నిందితుడు తరఫు న్యాయవాదికి హైకోర్టు సూచించారు.

'ఐదేళ్ల కిందట అంటే అమ్మాయికి 15 ఏళ్ల వయసు ఉన్నప్పుడు కారు నడుపుతూ కేసు నమోదైంది. అందులో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ వివరాలు సరైనవే అయితే తను మేజర్ అవుతుంది. ఆ యువతి పలు రకాల తేదీలతో డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్స్ తీసుకుంది' అని పిటిషనర్ తరపున వాదన వినిపిస్తున్న సీనియర్ కౌన్సిల్ నిరంజన్ రెడ్డి తెలిపారు. 'ఈనెల 8వ తేదీన పేట్ బషీరాబాద్ పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన పోక్సో కేసులో తప్పుడు ఆరోపణలు చేశారు. నాపై ఆరోపణలు చేస్తున్న బాలిక, ఫిర్యాదు చేసిన వ్యక్తి రూ.5 కోట్లు డిమాండ్ చేశారు. బెదిరింపులకు పాల్పడమే కాకుండా ఆ మొత్తాన్ని చెల్లించకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బాధితురాలు బెదిరించారు. బాధితుల నుంచి వచ్చిన బెదిరింపులకు లొంగకుండా కరీంనగర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాం. ప్రముఖ రాజకీయ వ్యక్తి కుమారుడు కావడంతో ఈ కుట్రకు పాల్పడ్డారు' అని నిందితుడు బండి భగీరథ్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.

హైకోర్టు కీలక వ్యాఖ్యలు
'ప్రతిసారి కేంద్ర మంత్రి కుమారుడు అని మీరు పదే పదే చెప్పాల్సిన అవసరం లేదు. బాధితురాలు పుట్టినరోజు డేట్స్‌పై పోలీసులు విచారణ చేయాలి' అని హైకోర్టు ఆదేశించింది. ఇక బెయిల్‌పై విచారణను రేపటికి వాయిదా వేసింది.

0
0
Report
Advertisement

CM Vijay 1000 Scheme: మహిళలకు ప్రభుత్వం శుభవార్త..బ్యాంకు ఖాతాల్లోకి రూ.1,000 జమ అప్పటి నుంచే?

RRaghu21h ago
Nagalapuram, Tamil Nadu:

CM Vijay 1000 Scheme Update: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ తన ఎన్నికల హామీని నిలబెట్టుకునే పనిలో పడ్డారు. మహిళా గౌరవ వేతన పథకం కింద మే నెలకు సంబంధించిన రూ.1,000 నిధులను తాజాగా విడుదల చేశారు. కుటుంబ భారాన్ని మోస్తున్న గృహిణులకు, పేద మహిళలకు అండగా నిలవడమే ఈ పథకం ఉద్దేశం అని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

ఈ పథకం లబ్ధిదారులకు ఎటువంటి మధ్యవర్తుల ప్రమేయం లేకుండా, నిధులు నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లోకి 'డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్' (DBT) పద్ధతిలో జమ అవుతాయి. వార్షిక ఆదాయం, భూమి విస్తీర్ణం, విద్యుత్ వినియోగం వంటి వస్తువులను ప్రాతిపదికగా తీసుకుని అర్హులైన ప్రభుత్వం ఎంపిక చేసింది. నిధుల జమ ప్రక్రియలో ఎటువంటి సాంకేతిక లోపాలు తలెత్తకుండా చూడాలని సీఎం విజయ్ అధికారులను సూచించారు.

గతంలో కొన్ని కారణాల వల్ల దరఖాస్తులు తిరస్కరణకు గురైన మహిళల పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉంది. అర్హత ఉండి కూడా లబ్ధి పొందని వారు మళ్లీ దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం వీలు కల్పించనున్నట్లు తెలుస్తోంది. ప్రతి అర్హత కలిగిన మహిళకు ఈ పథకం అందాలన్నదే తమ లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు.

ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి విజయ్ సంక్షేమ పథకాల అమలుపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ వెయ్యి రూపాయల సాయం సామాన్య మహిళల దైనందిన అవసరాలకు, పిల్లల చదువులకు, మందుల ఖర్చులకు ఎంతో ఆసరాగా నిలుస్తోంది. మే నెల నిధుల విడుదల కోసం బ్యాంకింగ్, ప్రభుత్వ నిర్వహణ సమన్వయంతో పనిచేస్తున్నాయి.

Also Read: హాట్‌ ఫోజులతో హీటెక్కిస్తున్న గోల్డెన్ బ్యూటీ..వరుస హిట్లతో దూసుకుపోతున్న మీనాక్షి!

Also Read: బంగాళాఖాతంలో ఉపరీతల ఆవర్తన ద్రోణి..రాబోయే 5 రోజులు ఈ ప్రాంతాల్లో వర్షాలు దంచికొడతాయి

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Rain Alert: బంగాళాఖాతంలో ఉపరీతల ఆవర్తన ద్రోణి..రాబోయే 5 రోజులు ఈ ప్రాంతాల్లో వర్షాలు దంచికొడతాయి!

RRaghu21h ago
Vijayawada, Andhra Pradesh:

Rain Alert In AP And Telangana: ఈసారి వర్షాకాలం ముందస్తుగానే పలకరించనుంది. మే 16 నాటికి నైరుతి రుతుపవనాలు అండమాన్ సముద్రం, దక్షిణ బంగాళాఖాతంలోకి ప్రవేశించనున్నాయి. ప్రస్తుతం సముద్ర మట్టానికి 5.8 కి.మీ ఎత్తులో కొనసాగుతున్న అల్పపీడన ద్రోణి వర్షాలకు అనుకూలంగా మారింది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ ఓ ప్రకటనలో తెలిపింది. 

తెలంగాణలో ఎండలతో పాటు అకాల వర్షాలు కురిసే అవకాశం ఉంది. మే 14న రాష్ట్రవ్యాప్తంగా జల్లులు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో ఉరుములతో కూడిన వానలు పడవచ్చని వెల్లడించింది. మే 15-16 తేదీల్లో ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో 40-50 కి.మీ వేగంతో గాలులు వీస్తాయి. మరోవైపు ఆదిలాబాద్, నిజామాబాద్ వంటి ఉత్తర తెలంగాణ జిల్లాల్లో మే 15 నుంచి వడగాల్పులు వీచే ప్రమాదం ఉంది. ఉష్ణోగ్రతలు 2-3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని వాతావరణశాఖ అభిప్రాయపడింది.

మరోవైపు ఏపీలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉండనుంది. అల్లూరి సీతారామరాజు జిల్లా, పోలవరం ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలకు చేరి తీవ్రమైన వడగాల్పులు వీస్తాయని APSDMA హెచ్చరించింది. మే 15, 16 తేదీల్లో నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో పిడుగులు పడే అవకాశం ఉన్నందున రైతులు పొలాల్లో జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

ప్రజలకు సూచనలు 
వాతావరణ మార్పుల నేపథ్యంలో అధికారులు ఈ క్రింది జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది. వర్షం పడేటప్పుడు పిడుగుల ముప్పు ఉంటుంది కాబట్టి చెట్లు లేదా విద్యుత్ స్తంభాల కింద నిలబడకూడదని తెలిపింది. అలాగే మధ్యాహ్నం బయటకు వెళ్లేవారు గొడుగు వాడడం సహా డీహైడ్రేషన్ కాకుండా తగినంత నీరు తాగాలని హెచ్చరించింది. ఉరుములు, మెరుపులు ఉన్న సమయంలో ఎలక్ట్రానిక్ పరికరాల వాడకం తగ్గించడం సురక్షితం. కాబట్టి రాబోయే ఐదు రోజులు ప్రకృతి విచిత్రంగా ప్రవర్తించనుందన్న హెచ్చరికల నడుమ తెలుగు రాష్ట్రాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.

 

Also Read: తిరుమల వెళ్లే శ్రీవారి భక్తులకు గుడ్‌న్యూస్..ఇకపై లక్కీడిప్ విధానంలో ఆ టికెట్లు!

Also Read: ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తే ఎంత లాభమో తెలుసా? పర్యావరణానికి ఎంతో మేలు!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement
Advertisement
Back to top