మహిళపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి ఉరిశిక్ష వేయాలి
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Blinkit Delivery Video Watch Here: సాధారణంగా మనకు ప్రతిరోజు ట్రాఫిక్ మధ్యలో ఎల్లో లేదా ఆరెంజ్ కలర్లో బ్యాగులు తగిలించుకొని ఒక టూ వీలర్ పై దూసుకు వెళ్లే డెలివరీ బాయ్స్ కనిపిస్తూ ఉంటారు. కానీ రాజస్థాన్లో మాత్రం ఓ డెలివరీ ఏజెంట్ దీనికి భిన్నంగా ఉన్నాడు. ఇప్పుడు ఈయనకు సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలు విపరీతంగా వైరల్ అవుతుంది. పెట్రోల్ ధరల ప్రభావము లేక పర్యావరణం పైన ఉన్న ప్రేమనో తెలీదు కానీ ఒక వృద్ధుడు గుర్రంపై సవారి చేస్తూ సరుకులను డెలివరీ చేస్తూ అందర్నీ ఆశ్చర్యపోయేలా చేశారు. అయితే గుర్రంపై వెళ్తున్న సమయంలో ఆ రోడ్డు గుండా వెళ్లే ఇతర ప్రయాణికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడు ఈ వీడియో కాస్త వైరల్ గా మారింది.
రాజస్థాన్కు చెందిన ఒక వృద్ధుడు సాంప్రదాయ దుస్తులను ధరించి.. తలకు పాగా చుట్టుకొని ఒక నల్లటి గుర్రంపై దర్జాగా వెళుతూ ఉండడం మీరు గమనించవచ్చు. ఆయన వీపుకు ప్రముఖ క్విక్ కామర్స్ సంస్థ Blinkit సంబంధించిన డెలివరీ చేసేందుకు తీసుకెళ్లే బ్యాగు కూడా మీరు చూడొచ్చు. ఆ పసుపు రంగు బ్యాగు తో అతను గుర్రంపై స్వారీ చేయడం చూసి అక్కడ ఉన్న వారంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఇది రాజస్థాన్ ప్రధాన్.. ఇక్కడ యువకులంతా గుర్రంపై స్వారీ చేసే అలవాటు ఉంటుంది. కాబట్టి డెలివరీ కూడా ఇలా గుర్రంపై చేయగలుగుతున్నాను అని రాసి ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
ఈ వీడియోను చూసిన సోషల్ మీడియా వినియోగదారులు రకరకాలుగా స్పందిస్తూ వస్తున్నారు. పర్యావరణాన్ని కాపాడడానికి వాయు కాలుష్యాన్ని నివారించడానికి ఇదొక అద్భుతమైన మార్గమని.. దీని ద్వారా పెట్రోల్ ఖర్చులు కూడా పూర్తిగా తగ్గుతాయని కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు కామెంట్ చేస్తూ వస్తున్నారు. అలాగే మరికొంతమంది రాజస్థానీ కళాకారులతో ఎవరూ పడలేరని కొనేయాడుతూ కామెంట్లలో రాస్తున్నారు. ఏది ఏమైనా అతను ఇలా గుర్రాన్ని వినియోగించి ఇతరులకు వస్తువులు డెలివరీ చేయడం చూసి అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు.
और बुजुर्ग घोड़ों पर ऑनलाइन डिलीवरी कर रहे हैं…😂 pic.twitter.com/uYAzlhxSNY
— kapil bishnoi (@Kapil_Jyani_) February 22, 2026
రాజస్థాన్లో ఇలా గుర్రంపై స్వారీ చేస్తూ డెలివరీ చేయడం మొదటిసారి అని కొంతమంది కామెంట్ చేస్తున్నారు. గతంలో ఒక వ్యక్తి ఒంటెపై వెళ్లి డెలివరీ చేసిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాను హల్చల్ చేశాయి. ఆధునిక సాంకేతికతకు బానిసవ్వకుండా ఇలా ఎవరికి నచ్చినట్టు వారు చేస్తున్న తీరు చూస్తుంటే సాంస్కృతి ఇంకా జీవిస్తుందనే ఆశలు పుట్టుకొస్తున్నాయి. అయితే తాజాగా ఈ గుర్రంపై డెలివరీ చేయడానికి సంబంధించిన వీడియో అన్ని సోషల్ మీడియా మాధ్యమాలలో విపరీతంగా వైరల్ అవుతూ వస్తుంది. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియోను కొన్ని లక్షల మంది వీక్షించారు.
Also Read: AI Boyfriends: చైనాలో AIతో అమ్మాయిల లవ్.. భయపడుతున్న కమ్యూనిస్టు ప్రభుత్వం?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Tirupati Garuda Varadhi Flyover: తిరుపతి పట్టణ ప్రజలతోపాటు అక్కడకు వచ్చే సందర్శకులకు భారీ అలర్ట్. తిరుపతి నగరానికి మణిహారంగా ఉన్న గరుడ వారధిపై పోలీసులు ఆంక్షలు విధించారు. ఇకపై బైక్లు, భారీ వాహనాలు ఫ్లైఓవర్పై రాకపోకలు సాగించరాదు. గరుడ వారధిపై బైక్లు, భారీ వాహనాలను గరుడ వారధిపై నిషేధిస్తూ స్థానిక అధికారులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. నిషేధం విధించడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఇంతకీ ఎందుకు నిషేధించారో తెలుసా?
Also Read: Harish Rao: ఢిల్లీలో నీతులు.. మరి తెలంగాణలో ఎందుకు ఉల్లంఘిస్తున్నారు?: హరీశ్ రావు
తిరుపతిలోని గరుడ వారధిపై ఇటీవల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్డు ప్రమాదాల నివారణకు అధికారులు చర్యలు చేపట్టగా.. ప్రమాదాల నియంత్రణకు ఆంక్షలు విధించారు. గరుడ వారధి ఫ్లైఓవర్పై ద్విచక్ర వాహనాలు, భారీ వాహనాల రాకపోకలను పూర్తిగా నిషేధిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. తిరుపతి స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా గరుడ వారధి ఫ్లైఓవర్ నిర్మించిన విషయం తెలిసిందే. ఈ ఫ్లైఓవర్పై కొంతకాలంగా ప్రమాదాల సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఎస్పీ సుబ్బరాయుడు, మున్సిపల్ కమిషనర్ మౌర్య నేతృత్వంలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించి ప్రమాదాల నివారణకు సమాలోచనలు చేశారు.
Also Read: Hotels Close: బ్యాచిలర్స్ అలర్ట్! హైదరాబాద్లో హోటల్స్, హాస్టల్స్ క్లోజ్?
గరుడ వారధి ప్రారంభమైన నాటి నుంచి జరిగిన ప్రమాదాలను పరిశీలించిన అధికారుల కమిటీ ద్విచక్ర వాహనాలు, భారీ రవాణా వాహనాలతోనే అధిక ప్రమాదాలు జరుగుతున్నాయని గుర్తించింది. బైక్లు అతివేగం, భారీ వాహనాల నియంత్రణ కోల్పోవడంతో సామాన్య ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రమాదాల నివారణకు బైక్లు, భారీ వాహనాలు గరుడ వారధిపై నిషేధిస్తే ప్రమాదాలు తగ్గుతాయని అంచనాకు వచ్చిన అధికారులు ఆ మేరకు నిషేధం విధించారు. గరుడ వారధిపై బుధవారం నుంచి బైక్లు, భారీ వాహనాల రాకపోకలను తిరుపతి అధికారులు నిషేధించారు.
Also Read: Tirumala: తిరుమలలో భారీగా కరెన్సీ కట్టలు.. ఎన్ని లక్షలు తీసుకెళ్లవచ్చో తెలుసా?
తిరుపతిలో ట్రాఫిక్ కష్టాలు తొలగించేలా ఫ్లైఓవర్ను నిర్మించడంతో కొంత ఉపశమనం కలిగింది. అయితే ప్రమాదాలు జరుగుతుండడంతో ఫ్లైఓవర్పై ఆంక్షలు విధించారు. కొత్త నిర్ణయంతో తిరుమలకు వచ్చే భక్తులు తిరుచారు మామిడి మార్కెట్ యార్డ్ దగ్గర ఫ్లై ఓవర్ ఎక్కితే కపిలతీర్థం వరకు చేరుకునేలా గరుడ వారధి ఫ్లైఓవర్ నిర్మించారు. రేణిగుంట నుంచి వచ్చే వాహనాలు రామానుజ సర్కిల్ ముందు నుంచి, కరకంబాడి నుంచి వచ్చే వారికి లీలామహల్ ముందు నుంచి ఫ్లైఓవర్ మూడు ప్రాంతాలకు అనుగుణంగా ఉంది. ఇప్పుడు భారీ వాహనాలు, బైక్లు నిషేధించడంతో గతంలో మాదిరి కింది నుంచి అవి రాకపోకలు సాగించాల్సి ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Students Massaging Teacher Video Watch Here: పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించి.. వారిని జీవితంలో ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన ఒక గురువు.. తన వృత్తికి మచ్చ తెచ్చేలా వ్యవహరించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. తరగతి గదిలోనే విద్యార్థులతో మసాజ్ చేయించుకుంటూ అడ్డంగా దొరికిపోయారు.. ఉత్తరప్రదేశ్లోని చిత్రకూట్ జిల్లాలోని జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ కావడంతో విద్యాశాఖ అధికారులు సదరు ప్రధానోపాధ్యాయురాలను సస్పెండ్ చేస్తూ ప్రత్యేకమైన ఉత్తర్వులు జారీ చేస్తారు. అయితే ఈ వీడియోని ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారాయి.. ఈ వీడియోలు మీరు కూడా చూడాలనుకుంటున్నారా?
చిత్రా కూట్ జిల్లాలోని కర్వీ మైనర్ ప్రాంతంలో ఒక ప్రభుత్వం ప్రాథమిక పాఠశాలలో మధురై అనే మహిళ ఉపాధ్యాయురాలుగా గత కొద్ది సంవత్సరాలుగా పనిచేస్తూ వస్తుంది. పాఠశాల పని వేళల్లో ఆమె తరగతి గదిలో పాఠాలు చెప్పాల్సింది పోయి.. కింద నేలపై పడుకొని మొబైల్ ఫోన్ చూస్తూ.. హాయిగా పిల్లలతో ఒళ్ళును నొక్కించుకుంటుంది. ఆ విద్యార్థులను పిలిచి మసాజ్ చేయించుకోవడమే కాకుండా తన కాళ్ళను కూడా నొక్కించుకుంటుందట.. టీచర్ చెప్పిన మాట కాదనలేక విద్యార్థులు కూడా ఆమె కాళ్లు నొక్కుతూ ఈ వీడియోలో కనిపించడం మీరు చూడొచ్చు. ఇప్పుడు దీనికి సంబంధించిన దృశ్యాలు విపరీతంగా వైరల్ గా మారాయి..
How can the future of children be shaped if principal herself exploits them like this? pic.twitter.com/dxLOjS5QR1
— Suraj Kumar Bauddh (@SurajKrBauddh) March 6, 2026
ఇప్పుడు వైరల్ అవుతున్న ఈ వీడియోను ఎవరు రహస్యంగా తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే, ఈ వీడియో క్షణాల్లోనే ఊహించని స్థాయిలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన సోషల్ మీడియా వినియోగదారులు ఆ టీచర్ ప్రవర్తన పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పిల్లలను బానిసల్ల వాడుకుంటారా అంటూ విద్యాశాఖను ప్రశ్నిస్తున్నారు.. అయితే ఈ వ్యవహారం జిల్లా విద్యాశాఖ అధికారుల దృష్టికి చేరడంతో వెంటనే.. విచారణకు ఆదేశించారు. శుక్రవారం పాఠశాలను సందర్శించిన విచారణ బృందానికి విద్యార్థులు షాకింగ్ విషయాలు చెప్పడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది..
Also Read: AI Boyfriends: చైనాలో AIతో అమ్మాయిల లవ్.. భయపడుతున్న కమ్యూనిస్టు ప్రభుత్వం?
సదరు టీచర్ తరచుగా తమతోనే ఇలా మసాజ్ చేయించుకుంటారని.. కొన్ని కొన్ని సందర్భాల్లో వ్యక్తిగత పనులను కూడా చేయించుకుంటారని విద్యార్థులు వెల్లడించారు.. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి విద్యార్థుల పట్ల ఇలా ప్రవర్తించినందుకు గాను ప్రధానోపాధ్యాయురాలు మధురాయిను జిల్లా ఉన్నత అధికారులు తక్షణమే సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే తనపై ఇచ్చిన ఆరోపణలను మధురై కొట్టి పారేయడం ఇప్పుడు చర్చనీయాంశానికి దారితీసింది. ఆ వీడియోలో ఉన్నది తను కాదని.. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్సీ సహాయంతో నకిలీ వీడియోను ఎవరు కావాలనే సృష్టించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని ఆమె తెలిపింది. కానీ ప్రాథమిక విచారణలో అది వాస్తవమేనని తేలడంతో విద్యాధికారులు ఆమెపై కఠిన చర్యలు తీసుకున్నారు.
Also Read: AI Boyfriends: చైనాలో AIతో అమ్మాయిల లవ్.. భయపడుతున్న కమ్యూనిస్టు ప్రభుత్వం?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Woman Shaves Head Viral Video Watch: సాధారణంగా ఆడపిల్లలకు పెళ్లి వయస్సు రాగానే ఇంట్లో వాళ్లంతా ఎంతో ఆసక్తిగా పిల్లలకు పెళ్లి చేయాలని సంబంధాలు చూడడం మొదలుపెడతారు. అంతేకాకుండా త్వరగా సెటిల్ అయిపోవడానికి పిల్లలపై ఒత్తిడి చేస్తూ ఉంటారు. అయితే, ఆ ఒత్తిడిని తట్టుకోలేక తీసుకున్న నిర్ణయం ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించిన దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ వస్తున్నాయి. తన ఇష్టానికి విరుద్ధంగా పెళ్లి చేయాలని చూస్తున్న కుటుంబ సభ్యులకు నిరసనగా ఆమె ఏకంగా రాత్రికి రాత్రి గుండు కొట్టించుకుంది. గుండు కొట్టించుకొని ఆ యువతి వీడియో రిలీజ్ చేసింది.. దీనికి సంబంధించిన వీడియో ని ఇప్పుడు సోషల్ మీడియాను హల్చల్ చేస్తోంది.
పశ్చిమ బెంగాల్కు చెందిన ఓ యువతికి ఆమె తల్లిదండ్రులు గత కొన్ని రోజుల నుంచి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు.. తనకిప్పుడు పెళ్లి చేసుకోవడం అసలు ఇష్టం లేదని.. బాగా చదువుకొని కెరీర్ పై దృష్టి పెట్టాలని ఆమె తన బాధని ఎంత చెప్పినప్పటికీ వారు వినిపించుకోలేకపోయారు.. రోజురోజుకు ఇంట్లో పెళ్లి గోల ఎక్కువ అవ్వడంతో.. సంబంధాలు చూడటం ఆపాలని ఆ యువతి గట్టిగా నిర్ణయించుకుంది.. ఇందులో భాగంగానే ఆ యువతి రాత్రికి రాత్రి గుండు కొట్టించుకున్నట్లు తెలుస్తోంది.
Also Read: AI Boyfriends: చైనాలో AIతో అమ్మాయిల లవ్.. భయపడుతున్న కమ్యూనిస్టు ప్రభుత్వం?
వీడియో వైరల్..
అయితే ఆ యువతి ఒకరోజు రాత్రి తన ఇంట్లో తల్లిదండ్రుల గోల తట్టుకోలేక సెలూన్కి వెళ్లి పొడవాటి జుట్టును పూర్తిగా తొలగించుకుంది. ఆ యువతి తన జుట్టును మొత్తం క్లీన్ సేవ్ చేయించుకుంది. ఇలా చేసిన తర్వాత సోషల్ మీడియాలో వీడియో షేర్ చేసింది.. నన్ను పెళ్లి చేసుకోమని బలవంతం చేస్తే.. ఇదే జరుగుతుందని అని తన కుటుంబానికి వీడియో రూపంలో సందేశం పంపింది. అయితే, ఈ వీడియో ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతూనే ఉంది. చాలామంది ఈ వీడియోను చూసి సోషల్ మీడియా వినియోగదారులు షేర్లు చేస్తున్నారు.
https://t.co/14ynnqW7Ld pic.twitter.com/LE2oJNazRY
— Anonymous_girl (@srutimisra_789) March 8, 2026
ఈ వీడియోకు సోషల్ మీడియా వినియోగదారులు కామెంట్లు పెడుతున్నారు. కొంతమంది ఆమెకు మద్దతుగా.. అమ్మాయిల ఇష్ట ఇష్టాలతో సంబంధం లేకుండా పెళ్లిళ్లు చేయడం మహా తప్పు అని.. ఆమె తన నిరసన తెలపడానికి ఎంచుకున్న మార్గం తనలో ఉన్న బాధను తెలుపుతుందని.. కొంతమంది కామెంట్ చేస్తున్నారు.. మరి కొంతమంది తనకు పెళ్లి ఇష్టం లేదని తెలపడానికి ఇదొక మార్గమా? తల్లిదండ్రులతో కూర్చుని మాట్లాడి ఒప్పించాల్సింది పోయి ఇలా చేయడం చాలా తప్పని కామెంట్లు చేస్తూ వస్తున్నారు..
Also Read: AI Boyfriends: చైనాలో AIతో అమ్మాయిల లవ్.. భయపడుతున్న కమ్యూనిస్టు ప్రభుత్వం?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Viral Video: 60 ఏళ్ల వృద్ధుడు, 26 ఏళ్ల యువతితో ప్రేమాయణం.. ఘనంగా పెళ్లి చేసుకున్న జంట.. వీడియో ఇదే..
60 Year Old Man Marries Video Watch Now: ప్రేమకు వయస్సుతో ఎలాంటి సంబంధం లేదు. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రేమలో పడుతున్న వైనం మరోసారి నిరూపితమైంది. పాకిస్తాన్ కు చెందిన ఒక 60 ఏళ్ల వృద్ధుడు తనకంటే సగం వయస్సు తక్కువ ఉన్న యువతిని వివాహం చేసుకున్న ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ యువతి కేవలం 20 ఏళ్ల వయస్సు ఉండడమే కాకుండా.. అప్పటికే తన చదువు పూర్తి చేసుకుందట.. ఈ వింత పెళ్లికి సంబంధించిన ఫోటోలతో పాటు వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో వైరల్ అవుతూ వస్తున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.
దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పాకిస్తాన్లోని రావల్పిండికి చెందిన హకీం బాబర్ ఒక ఆయుర్వేద వైద్యుడు.. ఆయనకు దాదాపు 60 ఏళ్లకు పైగానే ఉంటాయని స్థానికులు చెబుతున్నారు. ఇటీవలే ఆయన 26 ఏళ్ల తన భార్యకు డైవర్స్ ఇచ్చి.. 26 ఏళ్ల అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరి మధ్య వ్యత్యాసం దాదాపు 34 ఏళ్ళు ఉండడం విశేషం. అయితే మనుషులు కలిస్తే వయసు ఒక సంఖ్య మాత్రమే అని ఈ జంట ప్రపంచానికి చాటి చాటి చెప్పింది..
సాధారణంగా యువ పెళ్లి జంటలు చేసుకునే విధంగా.. ఆ వృద్ధ వరుడు కూడా ఇవ్వవధువుతో కలిసి గ్రాండ్ గా ఫ్రీ వెడ్డింగ్ షూట్ నిర్వహించారు. పెళ్లి వేడుకలు హాకీమ్ బాబర్ తన భార్య కోసం ప్రేమ పాటలను పాడి.. పెళ్లికి వచ్చిన అతిధులను ఆశ్చర్యానికి గురి చేశారు. ఇస్లామిక్ సాంప్రదాయం ప్రకారం వీరి వివాహం ఎంతో ఘనంగా జరిగింది. అంతేకాకుండా కుల పెద్దలతో పాటు స్థానికులు వీరి పెళ్లికి అతిథులుగా వచ్చి ఆశీర్వదించారు.. ఇప్పుడు దీనికి సంబంధించిన దృశ్యాలు కూడా ఊహించని స్థాయిలో వైరల్ అవుతూ వస్తున్నాయి.
Video of Bridal Photoshot has gone viral on SM pic.twitter.com/FGQHjMLfth
— Megh Updates 🚨™ (@MeghUpdates) February 26, 2026
Also Read: AI Boyfriends: చైనాలో AIతో అమ్మాయిల లవ్.. భయపడుతున్న కమ్యూనిస్టు ప్రభుత్వం?
ఈ వివాహానికి సంబంధించిన వీడియో మేఘ్ అప్డేట్స్ అనే ట్విట్టర్ ఖాతా నుంచి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.. అయితే, దీనిని పోస్ట్ చేసిన కొన్ని రోజుల్లోనే సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో వ్యూస్ సంపాదించుకుంది. దీనిపై నటిజెన్లు రకరకాలుగా స్పందిస్తూ వస్తున్నారు. ప్రేమకు హద్దులు లేవని.. వారు సంతోషంగా ఉంటే చాలని కొందరు వారికి మద్దతుగా నిలిస్తే.. మరికొందరు ఇది కేవలం డబ్బుల కోసమే జరిగిన పెళ్లి అంటూ కామెంట్లలో విమర్శలు గుప్పిస్తున్నారు. వృద్ధుడి ఆరోగ్యం, వయస్సు పై మరికొందరు జోకులు వేస్తూ కామెంట్లలో సోషల్ మీడియా వినియోగదారులను నవ్విస్తున్నారు.
Also Read: AI Boyfriends: చైనాలో AIతో అమ్మాయిల లవ్.. భయపడుతున్న కమ్యూనిస్టు ప్రభుత్వం?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Sun Moon Saturn Venus Conjunction Effect On Zodiac: అతి త్వరలోనే చైత్ర నవరాత్రులు కూడా ప్రారంభం కాబోతున్నాయి. ఈ ఏడాది ఈ నవరాత్రులు మార్చి 19వ తేదీ నుంచి ప్రారంభమై 27వ తేదీ వరకు కొనసాగుతాయి. అయితే, ఈ నవరాత్రు లను దుర్గాదేవికి అంకితం చేశారు. ఈ సమయంలోనే కొన్ని అత్యంత అరుదైన గ్రహాల కలయిక కూడా జరుగుతోంది.. ముఖ్యంగా మొదటి రోజే సూర్యుడు, చంద్రుడు, శని, శుక్ర గ్రహాల కలయిక మీనరాశిలో జరగబోతోంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఏవైనా కొన్ని గ్రహాలు ఒక రాశిలో కలిసిన అరుదైన యోగాలు ఏర్పడుతూ ఉంటాయి. అలాంటిది ఈ నాలుగు గ్రహాలు ఒకే చోట కలవడం చాలా విశేషమని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. దీనివల్ల ఈ క్రిందిరాశుల వారికి ఎంతో మేలు జరుగుతుంది. ఆర్థికంగా కూడా చాలా వరకు కలిసి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈ రాశుల వారికి బంపర్ ప్రయోజనాలు..
మేషరాశి
చైత్ర నవరాత్రుల సమయంలో మేష రాశి వారికి ఎక్కువగా మంచి ఫలితాలు కలుగుతాయి. కెరీర్తో పాటు ఉద్యోగాలపరంగా విశేషమైన ప్రయోజనాలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆకస్మిక డబ్బులు కూడా లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ఉద్యోగాలు చేస్తున్న వారికి చాలాకాలంగా ఎలాంటి శుభవార్తలు లేని వారికి ఈ సమయంలో తప్పకుండా కొన్ని రకాల డబ్బుతో కూడిన శుభవార్తలు అందుకుంటారు. పెండింగ్లో ఉన్న ప్రతి పని త్వరగా పూర్తవుతుంది. చట్టపరమైన కేసుల నుంచి కూడా ఉపశమనం కలుగుతుంది.
కర్కాటక రాశి
చైత్ర నవరాత్రుల సమయంలో కర్కాటక రాశి వారికి కూడా ఆర్థికంగా చాలా లాభదాయకంగా ఉంటుంది. అంతేకాకుండా కొత్త ఆదాయ వనరులు కూడా పొందగలుగుతారు. అలాగే ఆర్థిక పరిస్థితులు గతంలో కంటే ఇప్పుడు మరింత మెరుగుపడతాయి. దీంతోపాటు వ్యాపారాలనుంచి భారీ మొత్తంలో లాభాలు కూడా పొందగలుగుతారు. వ్యాపారాల విస్తరణ కోసం ఎదురుచూస్తున్న వ్యక్తులు అద్భుతమైన ప్రయోజనాలు పొందుతారు. అలాగే వీరికి ఈ సమయంలో ఖ్యాతితో పాటు సామాజిక స్థితిగతులు పెరుగుతాయి. కెరీర్ పరంగా మంచి పురోగతి కూడా లభిస్తుంది. అలాగే పిల్లలనుంచి అద్భుతమైన శుభవార్తలు కూడా వింటారు.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
మకర రాశి
మకర రాశి వారికి చరిత్ర నవరాత్రుల నుంచి అద్భుతమైన శుభ సమయం ప్రారంభమవుతుంది. వీరు కొత్త ప్రాజెక్టుల నుంచి విశేషమైన గుర్తింపు పొందుతారు. అంతేకాకుండా కొత్త వ్యాపారాలు ప్రారంభించాలనుకుంటున్న వ్యక్తులకు ఈ సమయం చాలా అద్భుతంగా ఉండబోతోంది. అలాగే కుటుంబంలో శాంతి వాతావరణం కూడా నెలకొంటుంది. పెట్టుబడులు పెట్టాలనుకుంటున్న వ్యక్తులు అద్భుతమైన లాభాలు కూడా పొందుతారు. పూర్వికుల ఆస్తుల నుంచి భారీ మొత్తంలో డబ్బులు కూడా సొంతం చేసుకోగలుగుతారు. ఉద్యోగాలు పొందాలనుకుంటున్న వ్యక్తులకు ఈ సమయం ఎంతో లాభదాయకం. అంతేకాకుండా ఉద్యోగాల్లో పదోన్నతులు కూడా లభిస్తాయి. అలాగే వీరికి బాధ్యతలు కూడా విపరీతంగా పెరుగుతాయి.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Trigrahi Rajayog Effect On Zodiac Telugu News: జ్యోతిష్య శాస్త్రంలో గ్రహ కదలికలు మానవ జీవితాల పై ఎలాంటి ప్రభావం చూపుతాయో మనందరికీ తెలిసిందే. వీటి ప్రభావం మొత్తం 12 రాశుల వారిపై పడుతుంది. రాబోయే ఐదు రోజుల్లో ముఖ్యమైన గ్రహాలు కదలికలు జరిపి ప్రత్యేకమైన సంయోగాన్ని ఏర్పరచబోతున్నాయి. ముఖ్యంగా ఐదు రోజుల తర్వాత బృహస్పతి రాష్ట్ర పరిగణించే మీనంలో సూర్యుడుతో పాటు శుక్రుడు శని గ్రహాలకు జరుగుతుంది. దీని కారణంగా త్రిగ్రహి రాజయోగం ఏర్పడుతుంది.
జ్యోతిష్య శాస్త్రంలో సూర్యుడిని విశ్వాసంతో పాటు నాయకత్వానికి సూచికగా భావిస్తారు. శని చర్యతో పాటు న్యాయాన్ని సూచిస్తుంది. శుక్రుడు భౌతిక ఆనందంతో పాటు శ్రేయస్సు, సంపదకు సూచికగా చెప్పుకుంటారు. అయితే ఈ మూడు గ్రహాల కలయిక కొన్ని రాశుల వారికి అద్భుతమైన శుభ ప్రభావాన్ని అందిస్తుంది. ముఖ్యంగా ఆర్థికంగా కూడా అద్భుతమైన లాభాలు కలుగుతాయి. త్రిగ్రహి రాజయోగం కారణంగా ధనస్సు రాశి తో పాటు మీనా, వృషభరాశులు ప్రభావితమవుతాయి. ఈ సమయంలో అద్భుతమైన ప్రయోజనాలు లభించడమే కాకుండా.. ఈ రాశుల్లో జన్మించిన వ్యక్తులకు కెరీర్, వ్యాపారాల పరంగా కూడా కలిసి వస్తుంది. జీవితంలో సానుకూలమైన మార్పులు రావడం ప్రారంభమవుతాయి. కొత్త బాధ్యతలు లభించడమే కాకుండా అద్భుతమైన విజయాలు సాధించే అవకాశాలు కూడా ఉన్నాయి.
ఈ రాశులవారికి బంపర్ లాభాలు:
మీన రాశి
శక్తివంతమైన త్రిగ్రహి యోగం ఏర్పడడం వల్ల మీన రాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ముఖ్యంగా వీరికి పనుల్లో కొత్త అవకాశాలు లభించడమే కాకుండా ఎన్నో సమస్యలు పరిష్కారం అవుతాయి. దీంతోపాటు కొత్త బాధ్యతలు లభించి అద్భుతమైన పనులు చేయగలుగుతారు. అలాగే చాలా కాలంగా ఉన్న పనులు కూడా ఎంతో సులభంగా పూర్తవుతాయి. ముఖ్యంగా వీరికి ఉద్యోగాలపరంగా పదోన్నతులు లభించడమే.. ఆర్థికంగా ఎన్నో రకాల లాభాలు కలుగుతాయి. వ్యాపారవేత్తలు ఈ సమయంలో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. దీనికి కారణంగా ఆర్థికంగా బలపడే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ఎలాంటి ప్రయత్నాలు చేసినా విశేషమైన ప్రయోజనాలు పొందుతారు.
ధనస్సు రాశి
ధనస్సు రాశిలో జన్మించిన వ్యక్తులకు ఈ యోగ ప్రభావంతో కెరీర్ పరంగా అద్భుతమైన పురోగతి లభిస్తుంది. అంతేకాకుండా ఉద్యోగాలు మారాలనుకుంటున్న వ్యక్తులకు అద్భుతమైన పదోన్నతులు లభిస్తాయి. అంతేకాకుండా వీరు కొన్ని రకాల కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్త ఒప్పందాలు చాలావరకు అద్భుతమైన అవకాశాలను తెచ్చి పెడతాయి. అలాగే భాగస్వామ్యుల నుంచి విశేషమైన ప్రయోజనాలు కూడా పొందుతారు. ఆర్థిక సంబంధిత సమస్యలు కూడా పూర్తిగా దూరమవుతాయి. ముఖ్యంగా ఎప్పటినుంచో కొన్ని రకాల పనులు చేయాలనుకుంటున్న వ్యక్తులకు ఈ సమయం అద్భుతమైన అవకాశాన్ని అందించబోతోంది.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
వృషభరాశి
వృషభ రాశిలో జన్మించిన వ్యక్తులకు ఈ గ్రహ సంయోగం కారణంగా ఆర్థికంగా విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. సూర్యుడితో పాటు శని శుక్ర గ్రహాల కలయిక వల్ల వీరికి అద్భుతమైన లాభాలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్త ఆదాయ వనరులు కూడా అద్భుతంగా లభిస్తాయి. అంతేకాకుండా కొన్ని రకాల ఆర్థిక సమస్యల నుంచి బయటపడే అవకాశాలున్నాయి. కెరీర్ పరంగా విశేషమైన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలు చేస్తున్న వ్యక్తులకు భారీ మొత్తంలో లాభాలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కెరీర్ పరంగా అనుకుంటున్న పనుల్లో అద్భుతమైన విజయాలు సాధిస్తారు.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Amla Juice Benefits For Weight Loss: ప్రకృతి మనకు ప్రసాదించిన అద్భుత ఔషధం ఉసిరికాయ. కేవలం ఒక గ్లాసు ఉసిరి నీటిని మీ రోజువారి జీవితంలో భాగం చేసుకోవడం వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. ముఖ్యంగా మధుమేహం, కొలెస్ట్రాల్ వంటి సమస్యలతో బాధపడేవారికి ఈ "పచ్చి ఉసిరి రసం" ఒక వరంలా పనిచేస్తుంది.
పురాతన కాలం నుండి ఆయుర్వేదంలో ఉసిరికాయకు ప్రత్యేక స్థానం ఉంది. ఉసిరి నీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కలిగే ప్రధాన ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
కొలెస్ట్రాల్, చక్కెర స్థాయిల నియంత్రణ
ఉసిరి నీరు రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి, గుండె జబ్బుల ప్రమాదాన్ని నివారిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉన్నవారు ఉసిరి నీటిని తాగడం వల్ల ఇన్సులిన్ సున్నితత్వం మెరుగుపడుతుంది. ఇది సహజంగా షుగర్ లెవల్స్ను అదుపులో ఉంచుతుంది.
బరువు తగ్గుదల..
శరీర జీవక్రియను వేగవంతం చేయడంలో ఉసిరి నీరు కీలక పాత్ర పోషిస్తుంది. మీరు బరువు తగ్గాలనుకుంటే, వ్యాయామంతో పాటు ఈ పానీయాన్ని తీసుకుంటే శరీరంలోని అదనపు కొవ్వు వేగంగా కరుగుతుంది. ఇందులో పుష్కలంగా ఉండే విటమిన్-సి మీ ఇమ్యూనిటీని పెంచి ఇన్ఫెక్షన్ల నుండి రక్షిస్తుంది.
జీర్ణ సమస్యలకు పరిష్కారం
అజీర్ణం, కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలతో బాధపడేవారు ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఉసిరి నీటిని తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇది శరీరాన్ని లోపలి నుండి శుభ్రపరుస్తుంది.
ఉసిరి రసం ఎలా తీసుకోవాలి?
ఉదయాన్నే ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఉసిరి రసాన్ని కలుపుకుని తాగాలి. ఈ పానీయం కొంచెం వగరుగా అనిపిస్తే, రుచి కోసం కొద్దిగా తేనెను కలుపుకోవచ్చు.
(గమనిక: ఆరోగ్యకరమైన జీవనశైలి కోసం ఉసిరి రసం ఒక ఉత్తమ ఎంపిక. అయితే, ఏదైనా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారు లేదా మందులు వాడుతున్న వారు ఈ పానీయాన్ని ప్రారంభించే ముందు ఒకసారి వైద్యుని సలహా తీసుకోవడం ఉత్తమం. దీన్ని జీ తెలుగు న్యూస్ ధ్రువీకరించడం లేదు.)
Also Read: Washing Clothes At Night: రాత్రిపూట బట్టలు ఉతుకుతున్నారా? ఇలా చేస్తే మీ జీవితంలో వచ్చే మార్పులు ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Telangana Assembly Deputy Speaker: 'లోక్సభలో డిప్యూటీ స్పీకర్ పదవిని భర్తీ చేయలేదని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తున్న కాంగ్రెస్ పార్టీ మరి తెలంగాణ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పదవిని ఎందుకు భర్తీ చేయడం లేదు' మాజీ మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. ఈ సందర్భంగా కేసీఆర్ వేణుగోపాల్ తీరును ఖండించారు. 'రాష్ట్రంలో మాత్రం అడ్డగోలుగా రాజ్యాంగ ఉల్లంఘన. ప్రజాస్వామ్య వ్యవస్థలను ఖూనీ చేయడంలో కాంగ్రెస్, బీజేపీ దొందూ దొందే' అని విమర్శించారు.
Also Read: Hotels Close: బ్యాచిలర్స్ అలర్ట్! హైదరాబాద్లో హోటల్స్, హాస్టల్స్ క్లోజ్?
'తెలంగాణలో రెండేళ్లు దాటినా డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఏది? ఇది రాజ్యాంగ శూన్యత కాదా? రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ సమాధానం చెప్పాలి' అని మాజీ మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు. ఢిల్లీలో రాజ్యాంగం గురించి గొప్పలు చెబుతూ రాష్ట్రాల్లో మాత్రం అదే రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతున్న కాంగ్రెస్ పార్టీ తీరును బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి హరీశ్ రావు తప్పుపట్టారు. 'ప్రజాస్వామ్య వ్యవస్థలను కించపరడం, అగౌరవపరచడంలో కాంగ్రెస్, బీజేపీలు ఒకే నాణేనికి ఉన్న రెండు ముఖాలు. లోక్సభలో డిప్యూటీ స్పీకర్ పోస్టును ఏడేళ్లుగా ఖాళీగా ఉంచడాన్ని రాజ్యాంగ శూన్యత అని పీఏసీ చైర్మన్ కేసీ వేణుగోపాల్ అనడం హాస్యాస్పదంగా ఉంది' అని మాజీ మంత్రి హరీశ్ రావు ఎద్దేవా చేశారు.
Also Read: KTR: ప్రైవేటు బిల్లులు పెడతాం.. కాంగ్రెస్ను కడిగి పారేస్తాం: కేటీఆర్
'కేసీ వేణుగోపాల్ చెప్పిన మాటలు నిజమే కావచ్చు. కానీ అదే సూత్రం తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి వర్తించదా?' అని మాజీ మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి దాదాపు రెండున్నరేళ్లు కావొస్తున్నా.. అసెంబ్లీలో డిప్యూటీ స్పీకర్ పోస్టును ఎందుకు భర్తీ చేయడం లేదని నిలదీశారు. ఢిల్లీలో రాజ్యాంగం గురించి గొంతు చించుకునే కేసీ వేణుగోపాల్, రాహుల్ గాంధీ తెలంగాణలో జరుగుతున్న రాజ్యాంగ ఉల్లంఘనపై ఏం సమాధానం చెబుతారు? ఇది రాజ్యాంగ శూన్యత కాదా? అని హరీశ్ రావు ప్రశ్నించారు.
Also Read: Tirumala: తిరుమలలో భారీగా కరెన్సీ కట్టలు.. ఎన్ని లక్షలు తీసుకెళ్లవచ్చో తెలుసా?
'రాజ్యాంగ విలువల గురించి ఢిల్లీలో నీతులు చెప్పే కాంగ్రెస్, తన రాజకీయ అవసరాల కోసం రాష్ట్రాల్లో వ్యవస్థలను ఖూనీ చేస్తోంది' అని మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. బీజేపీ అనుసరిస్తున్న అప్రజాస్వామిక విధానాలనే కాంగ్రెస్ కూడా తెలంగాణలో రిపీట్ చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీజేపీలు ప్రజాస్వామ్యాన్ని నాశనం చేయడంలో పోటీ పడుతున్నాయని విమర్శించారు. తమకు అనుకూలంగా ఉన్నప్పుడు ఒక మాట.. లేనప్పుడు మరో మాట మాట్లాడటం కాంగ్రెస్ నైజమని తెలిపారు. ఈ దొంగ వైఖరిని ప్రజలు గమనిస్తున్నారని మాజీ మంత్రి హరీశ్ రావు చెప్పారు. 'అధికార దాహంతో ఈ రెండు పార్టీలు రాజ్యాంగాన్ని అగౌరవపరచడం అత్యంత సిగ్గుచేటు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను గాలికొదిలేసి.. రాజ్యాంగబద్ధమైన పదవులను భర్తీ చేయకుండా కాలయాపన చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి' అని మాజీ మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Hotels And Hostels Close: ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చినట్టు అక్కడెక్కడో కొన్ని దేశాలు యుద్ధం చేస్తుంటే దాని ప్రభావం భారతదేశంపై తీవ్రంగా పడింది. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య జరుగుతున్న ఘర్షణ వాతావరణం.. యుద్ధ పరిస్థితులు నెలకొనడంతో భారత ప్రజల జీవనం అతలాకుతలమవుతోంది. దీంతో బ్యాచిలర్స్, ఉద్యోగులు, గృహిణులతోపాటు యావత్ ప్రజానీకం తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Also Read: KTR: ప్రైవేటు బిల్లులు పెడతాం.. కాంగ్రెస్ను కడిగి పారేస్తాం: కేటీఆర్
యుద్ధం ప్రభావంతో అంతర్జాతీయంగా చమురు దిగుమతులపై తీవ్ర ప్రతిబంధకం ఏర్పడింది. ఇంధనం, చమురు దిగుమతులపై అనిశ్చితి నెలకొనడంతో దేశంలో పెట్రోల్, డీజిల్తోపాటు ఎల్పీజీ గ్యాస్ సరఫరాపై వదంతులు వ్యాప్తి చెందుతున్నాయి. దేశంలో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ కొరత ఏర్పడుతుందనే వార్తలు దావానంలా వ్యాపిస్తున్నాయి. ఈ కారణంగా ఆతిథ్య రంగం తీవ్రంగా ప్రభావితమవుతోంది. హోటల్ రంగం కుదేలవుతోంది. వాణిజ్య ఎల్పీజీ గ్యాస్ సరఫరా కొరత ఏర్పడిందని.. సరిపడా గ్యాస్ లభించడం లేదని వార్తలు వస్తున్న నేపథ్యంలో దేశంలోని ప్రధాన నగరాల్లో హోటళ్లు మూతపడుతున్నాయి. ఇప్పటికే బెంగళూరు, ముంబై, చెన్నైలో హోటళ్లు సగానికి పైగా మూతపడ్డాయి. ఇప్పుడు హైదరాబాద్లో కూడా మూతపడే అవకాశం ఉంది.
Also Read: Hotels Close: బెంగళూరు బంద్.. నగరంలో నేటి నుంచి అన్నీ హోటల్స్ క్లోజ్
వాణిజ్య ఎల్పీజీ సరఫరాపై ప్రతిబంధకం ఏర్పడిన నేపథ్యంలో హైదరాబాద్ హోటళ్ల సంఘం సమావేశమైంది. అంతర్జాతీయంగా ఏర్పడిన పరిస్థితులు.. దేశంలో ఎల్పీజీ గ్యాస్ సరఫరా ఎలా ఉందని హోటల్ అసోసియేషన్ చర్చించింది. ప్రస్తుతానికి అయితే హోటళ్ల బంద్ను సంఘం ప్రకటించలేదు. అంతేకాకుండా హైదరాబాద్లో హాస్టల్స్ కూడా మూతపడుతాయనే వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. హాస్టల్స్లో కూడా పెద్ద ఎత్తున ఎల్పీజీ గ్యాస్ వినియోగం జరుగుతుంటుంది. కమర్షియల్ గ్యాస్లు వినియోగిస్తుండడంతో ఇప్పుడు కొరత ఉండే నేపథ్యంలో హాస్టల్స్ కూడా బంద్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే హాస్టల్స్ సంఘం కూడా తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ప్రభుత్వం గ్యాస్ కొరత రాకుండా చూసుకోవాలని విజ్ఞప్తి చేసింది.
Also Read: Tirumala: తిరుమలలో భారీగా కరెన్సీ కట్టలు.. ఎన్ని లక్షలు తీసుకెళ్లవచ్చో తెలుసా?
ప్రస్తుతానికి అయితే తెలంగాణతోపాటు హైదరాబాద్లో ఎల్పీజీ గ్యాస్ ప్రభావంతో హాస్టల్స్, హోటళ్లు మూసివేసే అవకాశాలు లేవు. ప్రస్తుతం చెన్నై, బెంగళూరు, ముంబైలో హోటళ్లు మూసివేయగా.. హాస్టల్స్పై కూడా ప్రభావం చూపింది. హోటళ్లు మూసివేయడంతో ఆయా నగరాల్లో బ్యాచిలర్స్, ఉద్యోగస్తులు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరి యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో.. గ్యాస్ కొరత ఎప్పుడు తీరుతుందో వేచి చూడాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
AI Boyfriends Telugu News: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చైనాలో సరికొత్త రూపం దాల్చింది. తోడు కోసం మనుషుల కంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ సృష్టించిన బాయ్ ఫ్రెండ్స్ వైపు అక్కడ యువతులు విపరీతంగా ఆకర్షితులవుతున్నారు. ఒంటరితనం నుంచి విముక్తి పొందడానికి కోట్లాదిమంది అమ్మాయిలు ఈ వర్చువల్ తోడును ఎంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నారు. అయితే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ బాయ్ ఫ్రెండ్స్ కి ఎక్కువ ప్రాముఖ్యత పెరగడంతో చైనా ప్రభుత్వం కలవర పడుతోంది. నిజానికి ఇంతలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అమ్మాయిలను ఆకర్షించడానికి గల కారణాలేంటి? దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటో మనం ఎప్పుడు తెలుసుకుందాం.
చైనాలో పెరుగుతున్న విపరీతమైన పని ఒత్తిడి, సామాజిక ఆంక్షలు, ఆర్థిక ఇబ్బందుల వల్ల యువతకు తమ రిలేషన్ షిప్ కొనసాగించడం పెద్ద భారం అవుతుందట.. పెళ్లి పట్ల విరక్తిగా ఉన్న యువతులు.. గొడవలు పడని, ఎల్లప్పుడూ ప్రేమగా మాట్లాడే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ చాట్ బాట్లను తమ జీవిత భాగస్వాములుగా భావిస్తూ వస్తున్నారట.. మిన్మో తో పాటు తో పాటు గ్లో వంటి యాపుల ద్వారా తమకు నచ్చిన లవర్స్ ను డిజైన్ చేసుకుంటున్నారు. అంతేకాకుండా వీరికి 24 గంటలు అందుబాటులో ఉంటూ.. బాధల్లో ఉన్నప్పుడు మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు ఓదార్చడం వంటి పనులు చేయడంతో యువతులు ఎక్కువగా వీటికి బానిసలు అవుతున్నారట..
అయితే, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఇప్పుడు చైనా కమ్యూనిస్టు పార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది.. ఇప్పటికే దేశంలో జననాల రేటు విపరీతంగా పడిపోయి ఆందోళన కలిగిస్తుంటే.. యువతులు పెళ్లిళ్లు చేసుకోకుండా ఇలా కేవలం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ తోనే కాలం గడిపితే భవిష్యత్తులో దేశ జనాభా మరింత తగ్గిపోతుందని అక్కడి ప్రభుత్వం ఊహించని స్థాయిలో భయపడుతుందని వార్తలు వస్తున్నాయి. ఇది దేశ ఆర్థిక వ్యవస్థ పై కూడా ఊహించని ప్రభావం పడుతుందని కొంతమంది నిపుణులు చైనా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు.
చైనా ప్రభుత్వం ఈ వర్చువల్ లవ్ ను అరికట్టేందుకు ప్రత్యేకమైన చర్యలు చేపడుతూ వస్తుంది. చాట్ బాట్లతో గడిపే సమయం పై ప్రత్యేకమైన పరిమితి కూడా విధించినట్లు తెలుస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్ బాట్లు సామాజిక విలువలను దెబ్బతీయకుండా.. అశ్లీలతకు తావు లేకుండా ఉండేలా కఠినమైన ఫిల్టర్లను అమర్చాలని కంపెనీలకు చైనా ప్రభుత్వం ఆదేశించింది. యువత మనస్తత్వాలను ప్రభావితం చేసే యాపులపై చైనా ప్రభుత్వం ఇప్పటికే ప్రత్యేకమైన నిఘాలు కూడా ఏర్పాటు చేసింది.
Also Read: Redmi 14C 5G Offer: రెడ్మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్ఫోన్..అదిరిపోయే ఆఫర్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
LPG, LNG, PNG Difference: మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, ముఖ్యంగా ఇరాన్కు సంబంధించిన పరిస్థితులు ప్రపంచ ఇంధన మార్కెట్పై ప్రభావం చూపుతున్నాయి. ఈ పరిస్థితుల కారణంగా అంతర్జాతీయంగా గ్యాస్ సరఫరాలపై ఒత్తిడి పెరిగింది. దాని ప్రభావం భారతదేశంలో కూడా కనిపించడం ప్రారంభమైంది. గ్యాస్ ధరలు పెరగడం, కొంత ప్రాంతాల్లో సరఫరా అంతరాయం ఏర్పడడం వల్ల కొన్ని నగరాల్లోని చిన్న హోటళ్లు, రెస్టారెంట్లు తమ వ్యాపారాన్ని కొనసాగించడం కష్టంగా మారింది. కొన్ని చోట్ల కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేయాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది.
ఈ పరిస్థితుల్లో చాలా మంది ప్రజలకు ఒక సందేహం వస్తోంది. ఇంట్లో ఉపయోగించే గ్యాస్ ఏది? పైపుల ద్వారా వచ్చే గ్యాస్, సిలిండర్ గ్యాస్, LNG అన్నీ ఒకటేనా? వాస్తవానికి ఈ మూడు గ్యాస్ రకాల మధ్య స్పష్టమైన తేడాలు ఉన్నాయి. అవి ఏమిటి? భారత్లో అవి ఎలా సరఫరా అవుతున్నాయి? అనే విషయాలను సరళంగా తెలుసుకోవడం అవసరం. LPG, LNG, PNG మధ్య అసలు తేడా ఏంటీ? భారత్ ఈ గ్యాస్ ఎక్కడి నుంచి కొనుగోలు చేస్తుందో తెలుసుకుందాం.
PNG అంటే ఏమిటి?
PNG అంటే పైప్డ్ నేచురల్ గ్యాస్ . ఇది సహజ వాయువు. ఇందులో ప్రధానంగా మీథేన్ గ్యాస్ అధికంగా ఉంటుంది. ఈ గ్యాస్ను ప్రత్యేక పైప్లైన్ నెట్వర్క్ ద్వారా నేరుగా ఇళ్లకు సరఫరా చేస్తారు. ఢిల్లీ, ముంబై, నోయిడా, గురుగ్రామ్ వంటి పెద్ద నగరాల్లో ఇప్పటికే లక్షలాది ఇళ్లకు ఈ విధంగా గ్యాస్ అందుతోంది. PNG ఉపయోగించే ఇళ్లలో గ్యాస్ వినియోగాన్ని కొలవడానికి మీటర్ అమర్చుతారు. విద్యుత్ బిల్లుల మాదిరిగానే ప్రతి నెల గ్యాస్ వినియోగానికి అనుగుణంగా బిల్లు చెల్లించాలి. ఈ గ్యాస్ను ప్రధానంగా వంటకు, గీజర్లకు ఉపయోగిస్తారు. PNG తేలికపాటి వాయువు కావడంతో లీక్ అయినా అది గాల్లోకి పైకి వెళ్లిపోతుంది. అందువల్ల ఇది తక్కువ ప్రమాదకరమైన, శుభ్రమైన ఇంధనంగా పరిగణిస్తారు.
LPG అంటే ఏమిటి?
LPG అంటే లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్. ఇది మన ఇళ్లలో సాధారణంగా ఉపయోగించే సిలిండర్ గ్యాస్. ఇందులో ప్రొపేన్, బ్యూటేన్ అనే వాయువుల మిశ్రమం ఉంటుంది. ఈ వాయువులను అధిక ఒత్తిడితో ద్రవ రూపంలోకి మార్చి సిలిండర్లలో నింపుతారు. సాధారణంగా భారతదేశంలో 14.2 కిలోల సిలిండర్లు ఎక్కువగా ఉపయోగిస్తారు. ప్రధాన మంత్రి ఉజ్వల యోజన అమలు తర్వాత దేశవ్యాప్తంగా కోట్లాది కుటుంబాలకు LPG కనెక్షన్లు అందాయి. ప్రస్తుతం భారతదేశంలో 32 కోట్లకు పైగా LPG కనెక్షన్లు ఉన్నట్లు అంచనా. LPGలో పెద్ద భాగం మధ్యప్రాచ్య దేశాల నుంచి దిగుమతి అవుతుంది. ఈ గ్యాస్ గాలి కంటే బరువుగా ఉంటుంది. అందువల్ల గ్యాస్ లీక్ అయితే అది నేల దగ్గర చేరి ప్రమాదం కలిగించే అవకాశం ఉంటుంది. అందుకే LPG వాడేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం.
LNG అంటే ఏమిటి?
LNG అంటే లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్. ఇది కూడా సహజ వాయువే కానీ దీన్ని చాలా తక్కువ ఉష్ణోగ్రత వద్ద, సుమారు -162 డిగ్రీల సెల్సియస్ వరకు చల్లబరచి ద్రవ రూపంలోకి మార్చుతారు. ఇలా ద్రవ రూపంలోకి మారిన గ్యాస్ను పెద్ద ట్యాంకర్లలో ఒక దేశం నుంచి మరొక దేశానికి రవాణా చేస్తారు. భారతదేశంలో LNGను సాధారణ గృహాల్లో ఉపయోగించరు. ఇది ప్రధానంగా పరిశ్రమలు, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, పెద్ద వాణిజ్య రంగాల్లో ఉపయోగిస్తారు. భారత్కు LNG ప్రధానంగా ఖతార్, అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాల నుంచి దిగుమతి అవుతుంది.
భారత్లో గ్యాస్ సరఫరా ఎలా జరుగుతుంది?
భారతదేశంలో పైప్డ్ నేచురల్ గ్యాస్ను గృహాలకు సరఫరా చేసే పనిని గ్యాస్ పంపిణీ సంస్థలు నిర్వహిస్తాయి. నగరాల్లో పైప్లైన్ వ్యవస్థను ఏర్పాటు చేసి ఇళ్లకు గ్యాస్ అందిస్తాయి. LPG సిలిండర్లను ప్రభుత్వ రంగ చమురు సంస్థలు దేశవ్యాప్తంగా పంపిణీ చేస్తాయి. LNG దిగుమతులు మాత్రం ప్రత్యేక టెర్మినల్స్ ద్వారా జరుగుతాయి. అక్కడికి చేరిన LNGను మళ్లీ వాయు రూపంలోకి మార్చి పరిశ్రమలకు లేదా గ్యాస్ పంపిణీ నెట్వర్క్కు పంపిస్తారు.
ధరల పరంగా ఏది చౌక?
ధరల విషయానికి వస్తే నగరాల్లో పైప్డ్ గ్యాస్ సాధారణంగా తక్కువ ఖర్చుతో లభిస్తుంది. ఉదాహరణకు కొన్ని నగరాల్లో PNG ధర యూనిట్కు సుమారు రూ. 30–రూ. 32 వరకు ఉంటుంది. మరోవైపు LPG సిలిండర్ ధర సాధారణంగా రూ. 800 నుండి రూ. 1100 మధ్య ఉంటుంది. LNG ప్రధానంగా పరిశ్రమల్లో ఉపయోగించే ఇంధనం కావడంతో దాని ధర మార్కెట్ పరిస్థితులపై ఆధారపడి మారుతూ ఉంటుంది. ప్రపంచ మార్కెట్లో ఏర్పడే మార్పులు, ముఖ్యంగా మధ్యప్రాచ్య ప్రాంతంలో జరిగే పరిణామాలు గ్యాస్ సరఫరా, ధరలపై ప్రభావం చూపుతాయి. అందుకే ఇలాంటి పరిస్థితుల్లో PNG, LPG, LNG వంటి గ్యాస్ రకాల మధ్య తేడాలు తెలుసుకోవడం ప్రతి ఒక్కరికీ ఉపయోగకరంగా ఉంటుంది. ఈ మూడింటి మధ్య అసలు తేడా ఇదే…!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Congress 6 Guarantees: 'కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అరాచకాలపై ఈ అసెంబ్లీ సమావేశంలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించాం' అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. 'రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్ బుల్డోజర్లను పంపి ఇళ్లను కూలగొడుతున్న తీరుగానే శాసనసభలోనూ మంద బలంతో బుల్డోజర్ టాక్టిక్స్ని ప్రయోగిస్తున్నది. శాసనసభ, శాసనమండలి సమావేశాల్లో అబద్ధాలు, అసత్యాలను పచ్చిగా మాట్లాడుతూ అంకెలను తారుమారు చేస్తూ అసెంబ్లీ సమావేశాలను తూతూమంత్రంగా నిర్వహిస్తున్నది' అని విమర్శించారు. 'ఆరు గ్యారెంటీలకు తొలి మంత్రివర్గ సమావేశంలోనే నిర్ణయం తీసుకొని చట్టబద్ధత కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. దానికి తగ్గట్టు చట్టబద్దత కల్పించాలని ప్రైవేటు బిల్లు పెడతాం' అని కేటీఆర్ తెలిపారు.
Also Read: Tirumala: తిరుమలలో భారీగా కరెన్సీ కట్టలు.. ఎన్ని లక్షలు తీసుకెళ్లవచ్చో తెలుసా?
హైదరాబాద్లోని గోల్కొండ రిసార్ట్లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ఉమ్మడి ఓరియంటేషన్ సమావేశం నిర్వహించారు. అనంతరం పార్టీ సీనియర్ నాయకులతో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడారు. 'ఈసారి కాంగ్రెస్ పెడుతున్న బడ్జెట్ మూడోది. ఈసారి బడ్జెట్ సమావేశాలకు అత్యంత ప్రాధాన్యం ఉంది. ఇప్పటికే సగం ప్రభుత్వ పదవీ కాలం అయిపోయింది. హామీల అమలులో ప్రజలు ఇచ్చిన వ్యవధి అయిపోయింది. వారి హామీల అమలు వైఫల్యాన్ని మోసాన్ని ఎండగట్టేందుకు ఈ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించాం' అని వెల్లడించారు.
Also Read: Govt Employees: ప్రభుత్వ ఉద్యోగులకు భారీ షాకిచ్చిన తెలంగాణ సీఎం.. ఏం చెప్పారంటే?
'రెండన్నరేళ్ల తర్వాత కూడా చట్టబద్ధత పక్కన పెట్టి కనీసం అమలు కూడా చేయడం లేదు. అందుకే ఈ సమావేశాల్లో ఒక ప్రైవేట్ మెంబర్ బిల్లును మా పార్టీ తరఫున తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం. మేము పెట్టే ఈ ప్రైవేట్ మెంబర్ బిల్లుకి మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నా. ప్రజలకు ఇచ్చిన హామీలను పక్కన పెట్టి అసెంబ్లీలో నాటకాలు ఆడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బలంగా నిలదీస్తాం' అని రేవంత్ రెడ్డి ప్రకటించారు.
Also Read: Deputy CM Rahu Kethu Pooja: శ్రీకాళహస్తిలో తెలంగాణ డిప్యూటీ సీఎం రాహు కేతు పూజ
'రాహుల్ గాంధీకి రూ.వెయ్యి కోట్లు ఇస్తామని చెబుతున్న రేవంత్ రెడ్డి రైతులకు ఇవ్వాల్సిన రైతు బంధును మాత్రం పక్కన పెట్టాడు. ఖమ్మంలో ప్రభుత్వ దాష్టీకంతో ఇళ్లు కోల్పోయిన ఖమ్మం వెలుగుమట్ల తరపున.. మూసీ బాధితుల తరఫున, పేద దళిత గిరిజన ప్రజల కోసం ఈ అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తాం. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీపై ప్రభుత్వాన్ని నిలదీస్తాం' అని కేటీఆర్ తెలిపారు. 'అసెంబ్లీలో ప్రభుత్వం చేస్తున్న అంకెల గారడీని, లేని అప్పులను ఉన్నవిగా చూపిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ అబద్ధాలను అంకెలతో సహా ఎండగట్టాలని ఈరోజు జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నాం. ఈ బడ్జెట్ సమావేశాల సందర్భంగా దళిత, గిరిజన, బీసీ, మైనారిటీ వర్గాలకు ఇస్తామన్న నిధులు ఎందుకు కేటాయించలేదో నిలదీస్తాం. దీంతోపాటు ఆయా వర్గాలకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీపై రేవంత్ రెడ్డిని నిలదీస్తాం' అని మాజీ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి