సంజీవని హనుమాన్ ఆలయ భూముల సర్వే
Bellampalle, Telangana:బెల్లంపల్లి పట్టణంలోని సంజీవని హనుమాన్ ఆలయానికి సంబంధించిన దేవాలయ భూములు కబ్జా కావడంతో భూ సర్వే నిర్వహణను జిల్లా సర్వే డిపార్ట్మెంట్ ఏడీ. శ్రీనివాస్ తో శనివారం చేపట్టారు. ఈ సందర్బంగా ఉమ్మడి జిల్లా దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ నవీన్ కుమార్ మాట్లాడుతూ ఆలయానికి సంబంధించిన భూములు అన్యాక్రాంతం జరిగిన విషయంపై ఫిర్యాదులు వచ్చాయన్నారు. దేవాదాయ శాఖ భూమిని తిరిగి స్వాధీన పరచుకునేందుకు అవసరమైన చర్యలను చేపడతామన్నారు.हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
Fake Doctors: ఇంటర్తో డాక్టర్ అవతారం.. హైదరాబాద్లో ఫేక్ డాక్టర్లు కలకలం
Hyderabad, Telangana:Hyderabad Police: ప్రాణం పోసేవారు వైద్యులు.. కానీ వైద్యం చదవాలంటే ఎంతో చదువుకోవాల్సి ఉంది. మరి అలాంటి ఏమీ లేకున్నా.. అర్హత లేకున్నా వైద్యం చేస్తున్న నకిలీ డాక్టర్లు హైదరాబాద్లో కలకలం రేపారు. పోలీసుల తనిఖీల్లో ఫేక్ డాక్టర్లు పట్టుబట్టారు. క్లినిక్లు పెట్టేసి వైద్య సేవలు అందిస్తున్న కేటుగాళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఫేక్ డాక్టర్లు అరెస్టవడంతో హైదరాబాద్లో వైద్య సేవలు పొందే రోగులు భయాందోళన చెందుతున్నారు.
'హైదరాబాద్లో నకిలీ డాక్టర్ల ముఠాను అరెస్ట్ చేశాం. ఆగస్టు 24న జూబ్లీహిల్స్ జోన్, సికింద్రాబాద్ టాస్క్ఫోర్స్, స్థానిక పోలీసులు సంయుక్తంగా వివిధ ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. ఎలాంటి అర్హత లేకుండా డాక్టర్లుగా చలామణి అవుతున్న మొత్తం ఆరుగురు నకిలీ డాక్టర్లను పట్టుకున్నాం' అని టాస్క్ఫోర్స్ డీసీపీ గైక్వాడ్ విభవ్ రఘునాథ వెల్లడించారు. క్లినిక్లు పెట్టుకుని అమాయక ప్రజలకు వైద్యం పేరిట సెలైన్లు, ఇంజెక్షన్లు ఇస్తున్నారని తెలిపారు.
టాస్క్ఫోర్స్ డీసీపీ గైక్వాడ్ విభవ్ రఘునాథ కీలక విషయాలు వెల్లడించారు. కొన్ని సందర్భాల్లో కుట్లు కూడా వేస్తూ.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ అక్రమంగా డబ్బులు సంపాదిస్తున్నారని తెలిపారు. 'మధురానగర్ పీఎస్ పరిధిలో శ్రీ ఆక్వా ఫస్ట్ ఎయిడ్ పేరుతో వైద్యం చేస్తూ మెడిసిన్ ఇస్తున్న డి.రామ శేఖర్ రెడ్డి మెడికల్ షాప్ యజమాని, రాగం సుధాకర్ అనస్థీషియా టెక్నీషియన్లను అరెస్ట్ చేశాం. మెడికల్ షాప్ యజమాని సుధాకర్ను పనికి పెట్టుకోగా.. సుధాకర్ తనను తాను డాక్టర్గా పరిచయం చేసుకుంటూ రోజుకు 40-50 మందికి వైద్యం చేసేవాడు' అని వివరించారు.
'రహ్మత్నగర్లో మృదొడ్డి భారతి అనే మహిళ పారామెడికల్ కోర్సు చేసి.. నర్సుగా పనిచేసిన అనుభవంతో నాలుగేళ్లుగా ఎలాంటి అనుమతులు లేకుండా క్లినిక్ నిర్వహిస్తున్నారు. ఆమె చిన్నపిల్లలకు ఇంజెక్షన్లు, సెలైన్లు ఇస్తోంది' అని టాస్క్ఫోర్స్ డీసీపీ గైక్వాడ్ విభవ్ రఘునాథ వెల్లడించారు. 'జూబ్లీహిల్స్ పరిధిలోని వెంకటగిరి కటిక మహేశ్ రావు అనే వ్యక్తిని పట్టుకున్నాం. ఇతడు కేవలం ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ చదివి గతంలో ఫుడ్ స్టాల్ నడిపేవాడు. ఇప్పుడు డాక్టర్ అవతారం ఎత్తి రోజుకు 40-50 మందికి వైద్యం చేస్తున్నాడు' అని గైక్వాడ్ విభవ్ రఘునాథ వివరించారు.
'ఫిల్మ్నగర్ పరిధిలో సాయి తిరుమల క్లినిక్ పేరుతో పనుగంటి బాల నరసింహను అరెస్ట్ చేశాం. మెడికల్ షాప్ నిర్వహిస్తున్న ఆయన కూతురు ఎంబీబీఎస్ చదివింది. ఆమె పేరు మీద పక్కనే క్లినిక్ పెట్టి తనే స్వయంగా డాక్టర్గా వ్యవహరిస్తూ ఫీజులు వసూలు చేస్తూ వైద్యం చేస్తున్నాడు. బోరబండ పరిధిలోని గంగానగర్ ఎండీ అబ్దుల్ వలీని అరెస్ట్ చేశాం. ఇంటర్ ఫెయిలైన అబ్దుల్ వలీ ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేసిన అనుభవంతో ఒక గది అద్దెకు తీసుకుని క్లినిక్ తెరిచి రోజుకు 10-20 మందికి వైద్యం అందిస్తున్నాడు' అని గైక్వాడ్ విభవ్ రఘునాథ వెల్లడించారు.
'నకిలీ వైద్యుల నుంచి వీరి క్లినిక్ల నుంచి భారీగా సిరంజీలు, సెలైన్ బాటిళ్లు, బీపీ మిషన్లు, స్టెతస్కోప్లు, సర్జికల్ కత్తెరలు, రకరకాల ఇంజెక్షన్లు, పిల్లల మందులు మరియు కాలం చెల్లిన మందులను సీజ్ చేశాం' అని గైక్వాడ్ విభవ్ రఘునాథ వివరించారు. 'సికింద్రాబాద్ జోన్ పరిధిలోని రాంగోపాల్ పేట్, చిలకలగూడ, ఓయూ సిటీ, దోమలగూడ ప్రాంతాల్లో ఆరుగురు నకిలీ డాక్టర్లను అరెస్ట్ చేశాం. చిలకలగూడలో నకిలీ సర్టిఫికెట్లు సృష్టించి రోగులకు కాలం చెల్లిన మందులు అమ్ముతున్న అదాన్ సమదానిని అరెస్ట్ చేశాం' అని టాస్క్ఫోర్స్ పోలీసులు వెల్లడించారు.
'ఇంటర్ మాత్రమే చదివి చర్మ వ్యాధుల డెర్మటాలజిస్ట్గా రాంగోపాల్పేట్ పరిధిలో క్లినిక్ నడుపుతున్నాడు. క్యాల్షియం పౌడర్, జింక్ ఆక్సైడ్ కలిపి సొంతంగా పెట్రోలియం జెల్ తయారు చేసి రోగులకు ఇస్తున్నాడు. ఎం. శ్రీనివాస్ అనే వ్యక్తి డిగ్రీ చదివి 26 ఏళ్లుగా దోమలగూడలో సాయిరామ్ క్లినిక్ నడుపుతున్నాడు. పెద్దాపట్ల సదానంద్ పదో తరగతి మాత్రమే చదివి చిలకలగూడలో వైద్యం చేస్తున్నాడు. ఓయూ సిటీ పరిధిలో 17 ఏళ్లుగా క్లినిక్లు నడుపుతున్న డాక్టర్లు చింతలూరి రమేష్, శివరాత్రి లింగయ్య డిగ్రీ మాత్రమే చదివారు' అని పోలీసులు తెలిపారు.
Jogi Ramesh Family: లోపం ఉన్న కొడుకుతో పెళ్లి చేసి జోగి రమేశ్ నా గొంతు కోశారు: కోడలు మేఘన
Vijayawada, Andhra Pradesh:Ramesh Family Issue: 'జోగి రమేశ్ సానుభూతి కోసం.. రాజకీయం కోసం మాట్లాడినట్లుగా ఉంది. అసలు వాస్తవాలు ఏమిటో నేను పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో వివరించా. అక్కడ నేను ఏం చెప్పానో అవన్నీ వాస్తవాలు అని చెబుతున్నా. ఇప్పుడే బయటపడకున్నా తప్పకుండా త్వరలోనే అన్ని విషయాలు అందరికీ తెలుస్తాయి. మా వివాహమైన తర్వాత ఉన్న ఇబ్బందులను మా మాయయ్య, అత్తయ్యకే వివరించా. సమస్యలను పరిష్కరించకుండా.. అదనపు కట్నం తేవాలంటూ మా అత్తయ్య నన్ను హింసించారు' అని కోడలు మేఘన వెల్లడించారు.
విజయవాడలో మంగళవారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో జోగి రమేష్ కోడలు మేఘన కీలక అంశాలు వెల్లడించారు. ఇలాంటి రోజు వస్తుందని.. ఆడపిల్లగా ఇలా మాట్లాడాల్సి రావడం చాలా బాధగా ఉందని చెప్పుకొచ్చారు. తనకు జరిగిన అన్యాయాన్ని ఎదుర్కొని గట్టిగా నిలబడ్డానన.. జోగి రమేశ్, ఆయన కుటుంబ సభ్యులు తనపై నిందలు వేస్తున్నారని ఆరోపించారు. '2025 మేలో జోగి రమేశ్ కుమారుడు రాజీవ్తో నాకు వివాహమైంది. మా నాన్న ఎంతో సంతోషంతో కష్టపడి ఈ పెళ్లి చేశారు. జోగి రమేశ్ మీద నమ్మకంతో వారింటికి నన్ను కోడలిగా పంపారు. అందరి ఆడపిల్ల లాగానే ఎన్నో ఆశలతో ఆ ఇంట్లో అడుగు పెట్టా' అని మేఘన వెల్లడించారు.
'కానీ కొన్ని రోజులకే నన్ను ఇబ్బందులు పెట్టడం ప్రారంభించారు. ఇద్దరి మధ్య విభేదాలు వచ్చి విడిపోవడం అనేది సహజం. కానీ రాజీవ్కు ఉన్న సమస్య ఆ కుటుంబసభ్యులందరికీ తెలుసు. అయినా నాకు అతడితో పెళ్లి చేసి.. తెలిసి తెలిసి అమ్మాయి గొంతు కోయడం అనేది పెద్ద నేరం. జోగి రమేశ్కు కూడా ఒక కూతురు ఉంది. ఆమెకు ఇలా జరిగితే ఏం చేస్తారు? అసలు లోపం ఉందని తెలిసి నాతో ఎలా పెళ్లి చేశారో జోగి రమేశ్ చెప్పాలి' అని బాధితురాలు మేఘన నిలదీశారు.
'మాకు రాజకీయ చరిత్ర ఉంది. మేము చెప్పిందే చేయాలని బెదిరించారు. అదనపు కట్నం తీసుకువస్తే నువ్వు సంతోషంగా ఉంటావు. అప్పుడే అతడికి ఫీలింగ్స్ వస్తాయని అత్త మాట్లాడింది. తల్లి స్థానంలో ఉన్న శకుంతల అర్థం చేసుకోకుండా నన్నే తప్పు బట్టారు' అని బాధితురాలు మేఘన వివరించారు. పెళ్లికి ముందు హిందువులం అని చెప్పి తమకు పెళ్లి చేశారని.. కానీ వారి కుటుంబం మొత్తం క్రైస్తవులు అని.. ఇంట్లో హిందూ పూజలు అస్సలు చేయరని ఆరోపించారు.
'నేను చిన్ననాటి నుంచి హిందూ పూజలు చేయడం అలవాటు. నేను వారింటికి వెళ్లిన తర్వాత కూడా ఒక్క హిందూ దేవుళ్ల ఫొటో కూడా లేదు. నేను దేవుళ్ల పొటో తెచ్చి పూజ చేస్తుంటే అడ్డుకుని కొట్టారు. ఎవరి నమ్మకం వాళ్లది కానీ మాకు క్రైస్తవ మతం తీసుకున్నట్లు కూడా చెప్పలేదు. ఇంకా ఇప్పటికీ జోగి రమేశ్ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. అత్తగా ఉన్న శకుంతల అనేక రకాలుగా నన్ను ఇబ్బందులు పెట్టారు' అని మేఘన వివరించారు.
'కొడుకు లోపం గురించి మాత్రం మాట్లాడకుండా నిందలు నాపై మోపుతున్నారు. నేను పూజలు చేసుకునే సమయంలో అడ్డుకుని చేతిలో ఉన్న హారతి, అగర్బత్తీలు లాగి పడేశారు. మీ దేవుళ్లు కూడా ఒక దేవుళ్లేనా ఇవన్నీ కుదరదు అని ఫొటోలు బయట పడేసి నన్ను కొట్టారు. మీ దేవుడిని నమ్ముకోవడంతోనే నీకు ఇలా జరిగింది. మా దేవుడిని నమ్ముకో నీకు మంచి జరుగుతుందని చెప్పేవారు' అని మేఘన తెలిపారు.
'మతం గురించి చెప్పలేదు. కొడుకు లోపం గురించి చెప్పలేదు. వారికి ముందే తెలిసినా సంబంధం లేని నా గొంతు కోశారు. నీ అత్త తల్లిలాగా, నేను నిన్ను కూతురిలాగా చూసుకున్నా అని జోగి రమేష్ చెబుతున్నారు. అదే జరిగితే.. నేను ఈరోజు ఇలా ఎందుకు రోడ్డు మీదకు వస్తా?' అని మేఘన ప్రశ్నించారు. ఆమె గోరుముద్దులు తినిపించలేదు.. విషపు ముద్దలు తినిపించింది కాబట్టే తన జీవితం ఇలా బలైపోయిందని మేఘన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో సీఎం చంద్రబాబును కలిసి న్యాయం చేయాలని కోరతామని ప్రకటించారు.
Ts Employees: పెండింగ్ DAలు, PRC అమలు కోసం.. ఉద్యోగులు ఈ 27న కలెక్టరేట్ల ముట్టడి!
Hyderabad, Telangana:Pending DA News: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగుల తో పాటు పెన్షనర్ల తమ న్యాయమైన హక్కుల కోసం కదం తొక్కబోతున్నారు.. నెలల తరబడి పెండింగ్లో ఉన్న తమ డిమాండ్లను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ.. తెలంగాణ ఉద్యోగ సంఘాల ఐక్యత జేఏసీ ఆధ్వర్యంలో ఆగస్టు 27వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా మహాధర్నాకు పిలుపునిచ్చారు. ఈ ఆందోళన కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జిల్లా కేంద్రాలతో పాటు రాజధాని హైదరాబాద్ లో జోరుగా ధర్నా కార్యక్రమం జరగబోతోంది.
ఉద్యోగుల డిమాండ్లు ఇవే..
ప్రభుత్వం ముందు ఉద్యోగ సంఘాలు ప్రధానంగా కొన్ని డిమాండ్లను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇవి ఉద్యోగుల ఆర్థిక, ఆరోగ్య భద్రతకు అత్యంత కీలకమని నాయకులు స్పష్టం చేశారు. ముఖ్యంగా రెండవ పిఆర్సి అమలు కోసం.. నూతన పే రివిజన్ కమిషన్ సిఫారసులను వెంటనే అమలుచేసి.. ఉద్యోగుల వేతన సవరణ చేపట్టాలని కోరారు.. ఆర్థికంగా భారం పడుతున్న నేపథ్యంలో.. పెండింగ్ లో ఉన్న ఆరు DA లను తక్షణమే మంజూరు చేయాలని తెలిపారు..
అంతేకాకుండా కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీంను పూర్తిగా రద్దుచేసి.. ఉద్యోగులకు భద్రత నిచ్చే పాత పెన్షన్ విధానాన్ని తిరిగి తీసుకురావాలని.. ఉద్యోగులతో పాటు పెన్షనర్ల ఆరోగ్య భద్రత కోసం ఉద్దేశించిన నూతన ఎంప్లాయిస్ హెల్త్ స్కీములను మరింత పగర్బందీగా.. సమర్థవంతంగా అమలు చేయాలని కోరారు.. అదేవిధంగా మహాధర్ణాలు అన్ని శాఖల ఉద్యోగులతో పాటు వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగులు కూడా అత్యంత క్రియాశీలక పాత్ర పోషించాలని TGEJAC కోరింది.
రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖకు సంబంధించిన అన్ని సంఘాల నాయకులతో పాటు సభ్యులు పెద్ద సంఖ్యలో కదిలి రావాలని విజ్ఞప్తి చేసింది. ఉద్యోగ సంఘాల ఐక్యమత్యతను చాటిచెప్పేందుకు ఇది సరైన సమయం అని నాయకులు ఈ సమయంలో గుర్తు చేశారు.. ఒకవేళ ప్రభుత్వం వీరి డిమాండ్లకు దిగివస్తే.. ఉద్యోగులందరికీ తప్పకుండా పెండింగ్లో ఉన్న ఆరు డిఏలు మంజూరు అవ్వడమే కాకుండా.. డిమాండ్లన్నీ నెరవేరే అవకాశాలున్నాయి. కాబట్టి.. 27న జరిగే ఈ ఉద్యోగుల ధర్నాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం చర్చలకు వస్తుందో లేదో చూడాల్సిందే..
Also Read: Eshwar Sai: బాసింగా బాసింగా సాంగ్ ఫేమ్ ఈశ్వర్సాయి రాసలీలలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
వామ్మె.. నడిరోడ్డుపై పడగ విప్పిన రెండు భారీ నాగుపాములు.. వీడియో వైరల్!
Hyderabad, Telangana:King Cobras Video Watch Now: సోషల్ మీడియాలో ప్రతిరోజు ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. అయితే కొన్ని వీడియోలు మాత్రం సోషల్ మీడియా వినియోగదారులను ఎప్పుడూ ఆశ్చర్యానికి గురి చేసేలా చేస్తూ ఉంటాయి. తాజాగా యూట్యూబ్ ఛానల్ నుంచి షేర్ చేసిన షార్ట్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చెక్ చేస్తుంది. అంతేకాకుండా అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. అత్యంత విషపూరితమైన రెండు నాగుపాములు రహదారిపై పడగలెత్తి బుసలు కొడుతున్న దృశ్యాలు సోషల్ మీడియా వినియోగదారులను ఆశ్చర్యపోయేలా చేస్తున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
వైరల్ అవుతున్న వీడియోలో పచ్చని చెట్ల మధ్య ఉన్న ఒక నిర్మానుష్య రహదారిపై భారీ రెండు పడగ విప్పిన పాములు కనిపించడం మీరు ఈ వీడియోలో క్లియర్ గా చూడొచ్చు. కెమెరా వైపు చూస్తూ అవి దూకుడుగా పడక విప్పిన తీర్ అత్యంత భయానకంగా ఉంది. ఒక్కసారిగా ఆ రెండు పాములు వాటి శరీరాలను పైకి లేపి శత్రువుపై దాడికి సిద్ధంగా ఉన్నట్లు కనిపించడంతోపాటు బుసలు కొట్టడం చూస్తుంటే ఓ ప్రత్యేకమైన త్రిల్లింగ్ అనుభూతికి కలగక తప్పదు..
ఈ వీడియో యూట్యూబ్లో అప్లోడ్ అయిన కొద్ది రోజుల్లోనే ఊహించని స్థాయిలో వ్యూస్ ను సొంతం చేస్తుంది. అంతేకాకుండా లక్షలాదిమంది సోషల్ మీడియా వినియోగదారులు ఈ వీడియోను లైక్ చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ వీడియోను చూసిన చాలా మంది కామెంట్లు కూడా పెడుతూ వచ్చారు.. కామెంట్లకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. ఇంత దగ్గర్నుంచి ఇలాంటి విశేషాలు చూడడం ఇదే మొదటిసారి అని కామెంట్లు పెడుతున్నారు. ప్రకృతి సృష్టించిన అత్యంత అందమైన.. అత్యంత ప్రమాదకరమైన జీవులు ఇవి అంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు..
Also Read: Viral Pic: ఇదేం క్రియేటివిటీ రా బాబు.. మూత్రం పోస్తూ ప్రీ వెడ్డింగ్ ఫోటో స్టిల్స్..
నాగుపాము భారత దేశంలో కనిపించే అత్యంత విషపూరితమైన పాముల్లో ఒకటి. దీని కాటు అత్యంత ప్రమాదకరమైందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఈ పాములు కనిపించిన సమయంలో తప్పకుండా వీటికి దూరంగా ఉంటేనే చాలా మంచిదని వారు తెలుపుతున్నారు. లేదంటే దాడి చేసి ప్రాణాలను తీసే అవకాశాలున్నాయి. ముఖ్యంగా వర్షాకాలం లేదా పచ్చదనం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో.. పొలాల గట్ల వద్ద ఇలాంటి పాములు సంచరించే అవకాశం ఉందని నిపుణులు తెలుపుతున్నారు. ఒకవేళ ఇలాంటి పాములు కనిపిస్తే వాటిని చంపేయకుండా వన్యప్రాణి సిబ్బందికి లేదా స్నేక్ క్యాచెస్ కి సమాచారం అందించడం చాలా మంచిది.
Also Read: Viral Pic: ఇదేం క్రియేటివిటీ రా బాబు.. మూత్రం పోస్తూ ప్రీ వెడ్డింగ్ ఫోటో స్టిల్స్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Gold Discovery: మేక కోసం వెళ్తే బంగారు గని దొరికింది.. ఈ పల్లెటూరిలో భారీగా గోల్డ్!
Hyderabad, Telangana:Lost Goat Leads Man To Gold In Kenya: అదృష్టం ఎవరిని ఎప్పుడు ఎలా ఏ రూపంలో తలుపు తడుతుందో తెలియదు. ఒక పేద జీవితాన్ని ఒక తప్పిపోయిన మేక రాత్రికి రాత్రే మార్చేసింది.. మేకను వెతుక్కుంటూ వెళ్లిన ఆ యువకుడికి ఏకంగా బంగారమే దొరికింది.. ఈ వార్త ఊహించని స్థాయిలో వ్యాప్తి చెందడంతో.. ఇప్పుడు ఆ చిన్న పల్లెటూరికి వేలాది మంది క్యూ కడుతున్నారు.. పారలతో పాటు గుణపాలు పట్టుకొని తవ్వకాలు మొదలు పెట్టేసారు. ఆఫ్రికాలోని కెన్యాలో జరిగిన ఈ ఆసక్తికరమైన సంఘటన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. దీనికి సంబంధించిన అన్ని రకాల వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..
పశ్చిమ కన్యాలోని వెస్ట్ పోకోట్ కౌంటీకి చెందిన.. చేపోరేర్ అనే ఒక మారుమూల గ్రామం ఇప్పుడు ఈ బంగారు వేటకు అద్భుతమైన వేదిక అయింది. మన్సే లోమాచార్ అనే ఓ గొర్రెల కాపరి కొన్ని వారాల క్రితం తన తప్పిపోయిన మేకను వెతుక్కుంటూ అడవిలోకి వెళ్లేసాడు.. అక్కడ ఒక నది ఒడ్డున కొంతమంది మహిళలు మట్టిలో ఏదో వెతుకుతుండడం అతను చూశాడు.. వాళ్ళు అక్కడ బంగారం కోసం గాలిస్తున్నారని తెలుసుకున్న అతను.. మన్సే కూడా వారితో వెతికేందుకు ప్రయత్నించాడు. ఆశ్చర్యకరంగా అతనికి ఏకంగా మూడు గ్రాముల సహజసిద్ధమైన బంగారం దొరికింది. బంగారాన్ని మార్కెట్లో విక్రయించగా దాదాపు భారత కరెన్సీలో రూ.26 వేల రూపాయల వరకు వచ్చింది..
అతను బంగారం దొరికిన విషయం.. అతనికి వచ్చిన డబ్బుల గురించి ఆ నోట ఈ నోట చుట్టుపక్కల ప్రాంతాలకు పాకింది.. ఇంకేముంది రాత్రికి రాత్రే.. ఆ గ్రామానికి జనాలు పోటెత్తారు.. ఒకానొక దశలో దాదాపు పదివేల మంది బయటి వ్యక్తులు ఇక్కడికి చేరుకొని గుట్టలు చెట్లు పొదలు అని తేడా లేకుండా ఎక్కడపడితే అక్కడ తవ్వకాలు మొదలు పెట్టేసారు.. చేతిలో పారతో పాటు గుణపంతో మట్టిని తవ్వుతూ.. నదిలో జల్లెడ పడుతూ ఎవరికి వారు అదృష్టాన్ని పరీక్షించుకోవడం మొదలుపెట్టారు.. అయితే అందరికీ బంగారం దొరకకపోవడంతో కొందరు ఎలా వచ్చిన దారిలో అలా వెళ్ళిపోయారు.. ప్రస్తుతం ఇంకా ఇక్కడ 2500 మందికి పైగా బంగారం వేటను కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది..
బంగారం కోసం వేలమంది తరలి రావడంతో ఆ గ్రామం రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి.. నిశ్శబ్దంగా ఉండే ఆ పల్లెటూరి ఇప్పుడు ఒక జాతరను తలపిస్తోంది.. వచ్చిన వారి కోసం స్థానికులు కొత్తగా 200లకు పైగా దుకాణాలు కూడా తెరిచా.. ఆహారంతో పాటు తాగునీరు కోసం రోజు వారి వస్తువులను విక్రయించడంతో స్థానికులకు ఊహించని స్థాయిలో ఉపాధి లభించింది. ఈ గ్రామం ఉగాండా సరిహద్దులకు దగ్గరగా ఉండడంతో.. పొరుగు దేశం నుంచి కూడా జనాలు ఇక్కడికి క్యూ కడుతున్నారు..
నిజానికి ఆ ప్రాంతంలో ఉండే మహిళలు ఎప్పటినుంచో నదిలో బంగారం వెతుకుతూ వారానికి 8 నుంచి 23 డాలర్లు సంపాదిస్తున్నారు. కానీ..మన్సేకు ఒక్కసారి ఏకంగా భారీ మొత్తంలో బంగారం దొరకడంతో ఈ ప్రాంతం ఉన్నట్టుండి వెలుగులోకి వచ్చింది.. ఏది ఏమైనా తప్పిపోయిన ఒక చిన్న మేక.. మారుమూల గ్రామాన్ని ప్రపంచ పటంలో నిలబెట్టేలా చేసింది..
Also Read: Viral Pic: ఇదేం క్రియేటివిటీ రా బాబు.. మూత్రం పోస్తూ ప్రీ వెడ్డింగ్ ఫోటో స్టిల్స్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
EPFO కొత్త రూల్స్.. ప్రతి ఉద్యోగికి రూ.7500 పెన్షన్ వస్తుందా?
Hyderabad, Telangana:Epfo Pension Rules News: ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరికి ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ భవిష్యత్తుకు ఒక పెద్ద భరోసా.. రిటైర్మెంట్ తర్వాత కూడా ఆర్థికంగా స్థిరంగా ఉండేందుకు ఈపీఎఫ్ డబ్బులు, పెన్షన్ క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. అయితే ఈపీఎఫ్ పెన్షన్ నిబంధనల EPS-95 గురించి చాలామందికి పూర్తి అవగాహన లేకపోయింది.. ముఖ్యంగా ఎవరైతే తమ ఉద్యోగంలో దాదాపు 20 ఏళ్ల తరబడి సర్వీస్ పూర్తి చేస్తారో.. వారికి ఈపీఎఫ్ఓ ఒక అద్భుతమైన ప్రయోజనాన్ని అందిస్తోంది.. అయితే, ఈ రూల్ గురించి ప్రతి ఒక్క ఉద్యోగి కచ్చితంగా తెలుసుకోవాల్సిందే..
రెండేళ్ల బోనస్..
ఎంప్లాయిస్ పెన్షన్ స్కీమ్ నిబంధనల ప్రకారం.. ఒక ఉద్యోగి కనీసం 10 ఏళ్లు పనిచేస్తేనే నెల వారికి పెన్షన్ పొందడానికి అర్హత సాధిస్తూ ఉంటాడు. ఈ పెన్షన్ ఉద్యోగికి 58 ఏళ్లు నిండిన తర్వాత రావడం ప్రారంభమవుతుంది.. అయితే, ఎవరైతే తమ కెరీర్లు 20 ఏళ్ల సర్వీస్ను విజయవంతంగా పూర్తి చేస్తారో.. వారికి ఈపీఎఫ్వో రెండేళ్ల బోనస్ వెయిటేజీని అందిస్తోంది. అంటే మీరు 20 ఏళ్లు పనిచేస్తే.. మీ పెన్షన్ లెక్కించేటప్పుడు మీ సర్వీస్ను 22 ఏళ్లుగా పరిగణలోకి తీసుకుంటారని ఈపీఎఫ్ఓ చెబుతోంది.. దీనివల్ల రిటైర్మెంట్ తర్వాత మీకు వచ్చే నెల వారి పెన్షన్ మొత్తం పెరిగే అవకాశాలు ఉన్నాయి.
20 ఏళ్లు పూర్తి చేస్తే కచ్చితంగా రూ.7,500 పెన్షన్ వస్తుందా?.. లాంటి సోషల్ మీడియాలో వదంతులు నమ్మవద్దని నిపుణులు సూచిస్తున్నారు. మీ సర్వీస్ పాత కొత్త నిబంధనలు.. మీ బేసిక్ జీతం ఆధారంగా తీసుకొని పెన్షన్ వస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. EPFOలో ఉండే పెన్షన్ క్యాలిక్యులేటర్లు కేవలం ఒక అంచనాను మాత్రమే ఇస్తాయని గమనించాల్సిన అవసరం ఎంతగానో ఉందని నిపుణులు చెబుతున్నారు..
ఉద్యోగులు ఎప్పటికప్పుడు తమ UAN ద్వారా ఈపీఎఫ్ఓ పోర్టల్ లో లాగిన్ అయి తమ పాసుబుక్ తో పాటు.. సర్వీస్ హిస్టరీని చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు మారిన అన్ని కంపెనీల సర్వీస్ రికార్డులు ఒకే ఖాతాకు Merge ఉన్నాయా? లేదా సింగిల్ గా ఉన్నాయా అని చూసుకోవలసిన అవసరం ఎంతగానో ఉంది. ఇలా ఉంటేనే 20 ఏళ్ల సర్వీస్ బోనస్ను ఎలాంటి ఆటంకాలు లేకుండా పొందగలుగుతారు. అలాగే పిఎఫ్ ఖాతా ల పేర్లతో వచ్చే నకిలీ కాల్స్తో పాటు OTP అడిగే మోసగాళ్లపట్ల కూడా ఎంతో అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది..
Also Read: Viral Pic: ఇదేం క్రియేటివిటీ రా బాబు.. మూత్రం పోస్తూ ప్రీ వెడ్డింగ్ ఫోటో స్టిల్స్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
భార్య ప్రైవేట్ వీడియోలు తీసి పో**ర్న్ సైట్లకు అమ్మేసిన సైకో భర్త !
Hyderabad, Telangana:Kerala Psycho Husband Arrested News: పవిత్రమైన భార్య భర్తల బంధానికి మచ్చ తెచ్చే అత్యంత ధారణమైన ఘటన కేరళ రాష్ట్రంలో వెలుగు చూసింది.. రక్షణగా ఉండాల్సిన భర్తీ కీచకుడిగా మారి.. తన సొంత భార్యతో పడక గదిలో చేసిన పనులను వీడియోలుగా చిత్రీకరించి పోర్న్ సైట్లకు అమ్ముకున్నాడు. అంతటితో ఆగకుండా.. భార్యను వేరే అబ్బాయితో గడపాలని బలవంతం చేయడమే కాకుండా.. కన్న కూతురి ముందు వికృతి చేష్టలకు పాల్పడిన ఓ సైకో భర్తను పోలీసులు అరెస్టు చేశారు..
పోలీసుల అందించిన సమాచారం ప్రకారం.. కేరళలోని మయ్యనాడుకు చెందిన ఓ 31 ఏళ్ల యువకుడు.. పదేళ్లపాటు ప్రేమించుకున్న యువతిని ఆరేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు.. వీరికి నాలుగేళ్ల పాప ఉంది.. గత నాలుగేళ్లుగా ఈ కుటుంబం బ్రిటన్ లోని నివాసం ఉంటోంది. అయితే.. ఇంజనీరింగ్ మధ్యలోనే ఆపేసిన ఈ నిందితుడు మొదటినుంచి పోర్న్ వీడియోలకు బానిస అయ్యాడు.. భార్యకు తెలియకుండా పడకగదిలో.. స్నానం చేసే క్రమంలో సీక్రెట్ కెమెరాలు పెట్టి ఆమె వీడియోలను చిత్రీకరించాడు. వాటిని యూకే లోని పాలు అశ్లీల వెబ్సైట్లకు విక్రయించి డబ్బులు సంపాదించడం మొదలుపెట్టాడు. ఈ దారుణం గురించి పోర్న్ వెబ్సైట్లో వీడియోలు చూసిన బాధితురాలు స్నేహితులు ఆమెకు సమాచారం ఇవ్వడంతో అసలు విషయం బయటపడింది..
భర్త చేసిన దారుణం తెలుసుకున్న ఆ ఇల్లాలు కన్నీరు మున్నీరయింది.. అయినా సంసారాన్ని కాపాడుకోవాలని ఉద్దేశంతో ఆగస్టు 14న భర్తను తీసుకొని కేరళలోని కొల్లంకు తిరిగి వచ్చింది.. భర్త మానసిక స్థితి మారాలని అతనికి మూడు రోజులపాటు సైకియాట్రిస్ట్తో ప్రత్యేకమైన కౌన్సిలింగ్ ప్రక్రియను కూడా ఇపించింది. కానీ అతడిలో ఎలాంటి మార్పు రాలేదు.. పైగా ఇతర పురుషులతో పడుకోవాలని భార్యను టార్చర్ చేయడం మొదలుపెట్టాడట.. తాను స్వాతంత్రంగా బతకాలనుకుంటున్నానని.. దానికి అంగీకరించకపోవడంతో విచక్షణారహితంగా దాడి చేశాడట..
కౌన్సిలింగ్ తీసుకున్న తర్వాత కూడా అతని ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదట.. ఏకంగా నాలుగేళ్ల కూతురి ముందే తన లైంగిక వికృత చేస్తాలన్న ప్రదర్శిస్తూ వీడియోలు తీశారని బాధితురాలు తెలిపింది. ఈ దారుణాన్ని ప్రశ్నించిన భార్యను చితకబాతాడు.. తీవ్ర గాయాలపాలైన ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. కొల్లాలంలోని కొట్టియం పోలీసులకు ఫిర్యాదు చేసింది..
Also Read: Viral Pic: ఇదేం క్రియేటివిటీ రా బాబు.. మూత్రం పోస్తూ ప్రీ వెడ్డింగ్ ఫోటో స్టిల్స్..
ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ప్రత్యేకంగా దర్యాప్తు ప్రారంభించారు.. కౌన్సిలింగ్ సమయంలో చిన్నారి ఇచ్చిన వాంగ్మూలాలను ఆధారంగా ఆ సైకో భర్తపై ప్రత్యేకమైన పోక్షో చట్టం కింద కూడా నాన్ బేలబుల్ కింద కేసులు నమోదు చేశారు.. పోలీసులు కేసు నమోదు చేయగానే నిందితుడు పరారీ అయ్యాడు.. బాధితురాలు తరఫున న్యాయవాది ప్రశాంత్ వి కురత్ కేరళ హైకోర్టును ఆశ్రయించడంతో.. విచారణను వేగవంతం చేసిన పోలీసులు ఆగస్టు 24వ తేదీన నిందితుడుని ట్రాక్ చేసి అరెస్టు చేశారు..
Also Read: Viral Pic: ఇదేం క్రియేటివిటీ రా బాబు.. మూత్రం పోస్తూ ప్రీ వెడ్డింగ్ ఫోటో స్టిల్స్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
బుధాదిత్య యోగంతో ఈ 5 రాశుల దశ తిరగబోతోంది.. మీ రాశి ఇందులో ఉందా?
Hyderabad, Telangana:Budhaditya Yoga In August Last Week: ఆగస్టు చివరివారం కొన్ని రాశుల వారికి కొత్త ఆశలను, పెద్ద పెద్ద మార్పులను తీసుకురాబోతోంది. ముఖ్యంగా ఈ సమయంలో అనేక గ్రహాలు మార్పులు చేర్పులు చేసుకోబోతున్నాయి. దీని కారణంగా ఉంది వ్యక్తుల జీవితాల్లో వృత్తి వ్యాపారం ఆర్థిక పరిస్థితులు, కుటుంబ జీవితం పరంగా సానుకూలమైన మార్పులు వస్తూ ఉంటాయి. అయితే, ఈ వారం ఐదు రక్షల వారికి అత్యంత అనుకూలంగా ఉండబోతుంది..
ఆగస్టు 24 నుంచి 30 మధ్య సూర్యుడితో పాటు బుధుడు కేతు గ్రహాలు సింహరాశిలోనే ఉండడం.. కుజుడు మిధున రాశిలో.. శుక్రుడు కన్యారాశిలో.. గురుడు కర్కాటక రాశిలో.. శని మీన రాశిలో వక్రగతిలో ఉంటాయి. దీని కారణంగా 12 రాశుల వారిపై ఊహించని ప్రభావం పడుతుంది. ముఖ్యంగా ఆర్థికంగా అనుకోని ప్రయోజనాలు కలుగుతాయి..
ఈ వారం సూర్యుడితోపాటు బుధ గ్రహాల కలయిక ఘనంగా ఎంతో శక్తివంతమైన బుధాదిత్య రాజయోగం ఏర్పడింది. జ్యోతిష్య శాస్త్రంలో బుధుడిని మేదస్సుతో పాటు వాక్చాతుర్యం వ్యాపారం నిర్ణయాలు తీసుకునే సామర్థ్యానికి అధిపతిగా వ్యవహరిస్తూ ఉంటారు. అయితే సూర్యుడని ఆత్మవిశ్వాసం నాయకత్వం గౌరవానికి సూచికగా భావిస్తారు. ఇలా రెండు గ్రహాలు కారణంగా ఏర్పడిన బుధాదిత్య రాజయోగం మొత్తం అన్ని రాశులను ప్రభావితం చేస్తుంది.
ఈ రాశులవారికి బంపర్ లాభాలు:
వృషభ రాశి
ఈవారం వృషభ రాశి వారికి పెండింగ్లో ఉన్న పనులన్నీ ఎంతో సులభంగా పూర్తవుతూ ఉంటాయి. చాలాకాలంగా నేర్చుకున్న ప్రాజెక్టులు ఈ సమయంలో తిరిగి ప్రారంభమవుతాయి. అంతేకాకుండా పనుల్లో అకస్మాత్తుగా విజయాలు సాధించుతారు. ఉద్యోగాలు చేస్తున్నవారు కొత్త బాధ్యతలు పొందడమే కాకుండా.. అనుకోని ధన లాభాలు కూడా సొంతం చేసుకుంటారు. అలాగే ఈ సమయంలో ఆర్థిక పరిస్థితులు సాధారణం కంటే చాలా వరకు మెరుగుపడే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతోపాటు ఖర్చులను అదుపులో ఉంచుకోవడం వల్ల లాభాలు సొంతం చేసుకుంటారు. అంతేకాకుండా మానసిక ఒత్తిడి కూడా తొలగిపోయి అనుకున్న పనుల్లో అద్భుతమైన విజయాలు సాధిస్తారు..
కన్యా రాశి
ఈవారం కన్యా రాశి వారికి అనేక విషయాలపరంగా వస్తున్న సమస్యలు తొలగిపోయే.. అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వివాదాస్పద విషయాల్లో చాలా సానుకూలమైన ఫలితాలు పొందగలుగుతారు. ఉద్యోగాల్లో బాధ్యతలతో పాటు గౌరవం కూడా విపరీతంగా పెరుగుతుంది. నిలిచిపోయిన పనులు కూడా ఎంతో సులమంగా తిరిగి పూర్తి చేయగలుగుతారు. అంతేకాకుండా సామాజిక హోదా పెరిగి అద్భుతమైన విజయాలు సొంతం చేసుకుంటారు. భవిష్యత్తు ప్రణాళికల కోసం వ్యక్తుల సలహాలను తీసుకోవడం చాలా మంచిది.
వృశ్చిక రాశి
వ్యాపారాల పరంగా ఈ వారం వృశ్చిక రాశి వారికి కూడా ఎంతో అనుకూలంగా ఉంటుంది. కొత్త ఒప్పందాలు కుదిరే అవకాశాలు లభించడమే కాకుండా పాత సంబంధాలు మరింత మెరుగుపడతాయి. అంతేకాకుండా ఎలాంటి పనులు చేసిన మంచి లాభాలు వందనం చేసుకోగలుగుతారు. మీకు కుటుంబ సభ్యుల నుంచి మంచి సపోర్టు లభించడమే కాకుండా.. పూర్వీకుల ఆస్తులు తప్పకుండా తిరిగి పొందుతారు. ముఖ్యంగా ఉద్యోగస్తులకు పనుల్లో కొత్త బాధ్యతలు లభించి భవిష్యత్తులో పదోన్నతులకు మార్గం సుగుమవుతుంది.
మకర రాశి
ఈ వారం మకర రాశి వారికి కూడా అనుకున్న ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా పాత పెట్టుబడులనుంచి భారీ మొత్తంలో ధన లాభాలు కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చాలా కాలంలో ఆర్థిక ప్రణాళికలపై పనిచేస్తున్న వ్యక్తులకు ఈ సమయంలో పురోగతి కూడా లభించబోతోంది. కుటుంబ సభ్యుల నుంచి మంచి శుభవార్తలు వినడమే కాకుండా.. పనుల్లో పై అధికారుల నుంచి మంచి సపోర్టు కూడా పొందుతారు. ఏదైనా పెద్ద పెట్టుబడులు పెట్టడం వల్ల దిమ్మతిరిగే ధన లాభాలు సొంతం చేసుకోగలుగుతారు. అంతేకాకుండా దీర్ఘకాలిక సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.
కుంభరాశి
కుంభరాశిలో జన్మించిన వ్యక్తులకు కూడా ఆర్థిక విషయాల్లో శుభసంకేతాలు రావడం ప్రారంభమవుతాయి. ముఖ్యంగా పెంచుకునేందుకు కొత్త కొత్త మార్గాలను కూడా ఎంచుకునే అవకాశాలున్నాయి. దీంతోపాటు వ్యాపారవేత్తలకు ఈ సమయం ఎంతో లాభదాయకంగా ఉంటుంది. అలాగే పనుల్లో సామర్థ్యం పెరిగి పాత పెట్టుబడిలో నుంచి భారీ మొత్తంలో విజయాలు కలుగుతాయి. కుటుంబ సంబంధిత సమస్యల నుంచి పరిష్కారం కూడా లభిస్తుంది. అంతేకాకుండా ఎలాంటి నిర్ణయాలు తీసుకున్న మంచి లాభాలు పొందగలుగుతారు. అలాగే అనుకుంటున్న పనుల్లో దిమ్మతిరిగే ధన లాభాలు సొంతం చేసుకుంటారు..
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
గమనిక.. 
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..
YS Jagan: జూడాల సమ్మెపై అహంకారం వీడాలని సీఎం చంద్రబాబుకు వైఎస్ జగన్ విజ్ఞప్తి
Nuzendla, Andhra Pradesh:Junior Doctors Strike: ప్రజల ప్రాణాలు కాపాడే జూనియర్ డాక్టర్లను రోడ్డెక్కించి.. పేద రోగుల ప్రాణాలతో చెలగాటమాడతారా? అని సీఎం చంద్రబాబును వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రశ్నించారు. జూడాల స్టైపెండ్ సవరణను ఎందుకు నిలిపివేశారని నిలదీశారు. 'జూనియర్ డాక్టర్ల శ్రమతోనే ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో వైద్యసేవలు నడుస్తున్నాయి. ఇప్పుడు సమ్మె కారణంగా క్యాజువాలిటీ, ఐసీయూ, లేబర్ రూమ్ వంటి అత్యవసర సేవలకు అంతరాయం ఏర్పడి పేద రోగులు తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారు' అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితికి మీ మొండివైఖరే కారణం కాదా చంద్రబాబు? అని మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రశ్నించారు.
రెండు వారాలుగా జూనియర్ డాక్టర్లు సమ్మె చేపట్టగా.. వారి డిమాండ్లు, సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడంతో 'ఎక్స్' వేదికగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. 'రాష్ట్రంలోని 19 ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు చెందిన దాదాపు 9 వేల మంది ఇంటర్న్లు, పీజీలు, సూపర్ స్పెషాలిటీ, సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు 2 వారాలుగా ఆందోళన చేస్తున్నా ఎందుకు స్పందించడం లేదు?' అని చంద్రబాబును వైఎస్ జగన్ ప్రశ్నించారు.
'జూనియర్ డాక్టర్లకు జీవో నంబర్ 287 నిర్దేశించిన 15శాతం కంటే అధికంగా మా హయాంలో 42.4 శాతం పెంచాం. సూపర్ స్పెషాల్టీ కోర్సును అభ్యసిస్తున్న వారిని సీనియర్ రెసిడెంట్స్గా గురిస్తూ, వారి విజ్ఞప్తినికూడా పరిగణలోకి తీసుకుని నిర్దేశించిన దానికంటే పెంచి మొత్తంగా 77శాతం వారికి పెంచాం' అని మాజీ సీఎం వైఎస్ జగన్ వెల్లడించారు. ఆయుష్ విభాగానికి చెందిన జూనియర్ డాక్టర్లకు కూడా అల్లోపతి జూనియర్ డాక్టర్ల తరహాలోనే స్టైపెండ్ పెంచినట్లు తెలిపారు. పెరిగిన ధరలు, ద్రవ్యోల్బణం, జీవన వ్యయాన్ని పరిగణనలోకి తీసుకుని 15 శాతం కంటే మెరుగైన పెంపు ఇవ్వాలని జూనియర్ డాక్టర్లు కోరుతుంటే కేవలం 3 నుంచి 5 శాతం మాత్రమే పెంచుతామని చెప్పడం అన్యాయం కాదా? అని చంద్రబాబును వైఎస్ జగన్ నిలదీశారు.
'బకాయిలతో ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులు చేతులు ఎత్తేశాయి. మరోవంక ప్రభుత్వ వైద్యరంగాన్ని మీరు దారుణంగా దెబ్బతీశారు. దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా మేం ఒకేసారి 17 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలను తీసుకొచ్చి.. ఐదింటిని పూర్తిచేసి క్లాసులుకూడా ప్రారంభిస్తే, మరో కాలేజీని క్లాసులకు సిద్ధంచేసి, మొత్తంగా ఆరు అందుబాటులోకి తెచ్చాం' అని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ వెల్లడించారు. మిగిలిన వాటిని పూర్తిచేయాల్సిందిపోయి, వాటిని తెగనమ్మడానికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. మందులు లేక ప్రభుత్వ ఆస్పత్రులు విలవిల్లాడుతున్నాయని.. జీరో వేకెన్సీ పాలసీకి మంగళం పాడారని చంద్రబాబు పాలనపై మాజీ సీఎం వైఎస్ జగన్ విమర్శలు చేశారు.
'వైద్యరంగంలో మేం నియమించిన 50 వేల మంది సిబ్బందిని క్రమంగా తగ్గిస్తున్నారు. ఫ్యామిలీ డాక్టర్ విధానానికి గండికొట్టారు. సీహెచ్సీల్లో స్పెషలిస్ట్ డాక్టర్లను తొలగించారు. విలేజ్, అర్బన్ క్లినిక్లను నిర్వీర్యం చేశారు' అని కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మండిపడ్డారు. ఆరోగ్యశ్రీని దారుణంగా దెబ్బతీసి రూ.3 వేల కోట్లకుపైగా బకాయిలు పెట్టారని ఆరోపించారు. ప్రజారోగ్య వ్యవస్థలో చంద్రబాబు సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా చంద్రబాబు అహంకారం వీడి.. జూనియర్ డాక్టర్ల ప్రతినిధులను వెంటనే చర్చలకు పిలవాలని మాజీ సీఎం వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు. జూనియర్ డాక్టర్ల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని.. తగిన స్థాయిలో స్టైపెండ్ను పెంచాలని డిమాండ్ చేశారు.
Tirumala Video: తిరుమల స్వామి సేవలో హోంమంత్రి వంగలపూడి అనిత
Dharmavaram, Andhra Pradesh:AP Home Minister Vangalapudi Anitha Visits Tirumala Temple Watch VideoTirumala Temple: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఏపీ ఎంపీలు
Dharmavaram, Andhra Pradesh:Sama Satish Bhashyam Ramakrishna And Other VIPs Visits Tirumala Temple Watch VideoMangli: కలియుగ వైకుంఠవాసుడి సేవలో గాయని మంగ్లీ
Dharmavaram, Andhra Pradesh:Tollywood Singer Mangli Tirumala Darshan After Long Time Watch VisualsRevanth Reddy Resign: ముఖ్యమంత్రి పదవికి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి: ఈటల రాజేందర్
Hyderabad, Telangana:KPHB Lands Auction: భూకబ్జాలను అరికట్టే సత్తా లేకపోతే రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని మల్కాజిగిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. 'ఊర్లలో తాతల ఆస్తులు అమ్ముకుని తిరిగేవాన్ని తిరుగుబోతు అనేవారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి అదే పని చేస్తున్నారు' అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 'కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ ఏర్పడింది పేదలకు ఇళ్ల జాగాలు ఇవ్వడానికి అని.. వ్యాపారం చేయడానికి కాదు' అని స్పష్టం చేశారు. కేపీహెచ్బీ కాలనీలో ఏర్పాటుచేసిన వేలం పాటను రద్దు చేయాలని రేవంత్ రెడ్డికి డిమాండ్ చేశారు.
హైదరాబాద్లోని కూకట్పల్లి హౌసింగ్ బోర్డులో వేలానికి పెట్టిన ప్లాట్లను మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ పరిశీలించారు. అనంతరం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్తులు విక్రయించడం ఆపకపోతే దీనికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎంపీ ఈటల రాజేందర్ హెచ్చరించారు. రూ.20 వేల కోట్ల విలువైన భూములు హానర్ హోమ్స్కి కేసీఆర్ ప్రభుత్వం కేటాయించింది. తాను వస్తే వెనక్కి తీసుకుంటానని చెప్పిన రేవంత్ రెడ్డి ఎందుకు తీసుకోవడం లేదు?' అని ప్రశ్నించారు. 22ఏ ద్వారా రూ.10 లక్షల కోట్ల ఆదాయం రేవంత్ రెడ్డి లక్ష్యం. దానిలో ముప్పై శాతం వీళ్ల వాటా. పేదలను ఇబ్బంది పెడుతున్న వీరికి శిక్ష తప్పదు' రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ హెచ్చరిక జారీ చేశారు.
'హౌసింగ్ బోర్డ్ ఏర్పడింది పేదవారి సొంత ఇంటి కలను నెరవేర్చడానికి తప్ప వ్యాపారం చేయడానికి కాదు. వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2005-06లో కూకట్పల్లిలో భూముల విక్రయాలు ప్రారంభమయ్యాయి. ఈ భూముల విక్రయంతో వచ్చిన రూ.1,200 కోట్లు హౌసింగ్ బోర్డ్ ఖాతాలో నిల్వ ఉన్నాయి. కానీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత వాటిని తీసేసుకున్నాడు' అని ఎంపీ ఈటల రాజేందర్ వివరించారు. కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ పరిధిలో ఖాళీగా ఉన్న జాగాలను విక్రయించరాదని విజ్ఞప్తి చేశారు.
హౌసింగ్ బోర్డ్ చట్టం ప్రకారం పేదవారికి ఇళ్ల జాగాలు ఇవ్వాలి తప్ప ఇలా అమ్ముకోవడానికి హక్కు లేదని రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఎంపీ ఈటల రాజేందర్ గుర్తుచేశారు. 'కూకట్పల్లి హౌసింగ్ బోర్డులో ఖాళీ స్థలం లేకుండా చేస్తున్నారు. భూములు అమ్ముకొని జీతాలు ఇస్తున్నారు. ఆస్తులు విక్రయించడం ఆపకపోతే దీనికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. భూకబ్జాలను అరికట్టే సత్తా లేకపోతే రాజీనామా చేయాలి' అని ఎంపీ ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు.
'పేదవారికి కట్టించడానికి మనసు రావడం లేదా? పేదవారి కోసమైతే బడ్జెట్ లేదా? ఇందిర రాజ్యం ఇంటింటా సౌభాగ్యం అన్నది కేవలం నినాదంగానే మిగిలిపోయింది. రూ.6 లక్షలకు ఇళ్ల నిర్మాణం విషయంలో ప్రభుత్వం చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తోంది' అని ఎంపీ ఈటల రాజేందర్ విమర్శించారు. '22ఏ తీసుకొచ్చి రూ.10 లక్షల కోట్లు ప్రభుత్వానికి డబ్బులు వచ్చేలా చేయాలి. స్వామికార్యం స్వకార్యంలా 30 శాతం కొట్టేయాలని చూస్తున్నారు' అని ఆరోపించారు. అర్బన్ సీలింగ్ ల్యాండ్లను ప్రైవేటు వారికి కట్టబట్టే ప్రయత్నం కూడా ఆపాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఓట్లు వేసి కూర్చోబెట్టిన ఖర్మకు తమ ఉసురు పోసుకుంటున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ తెలిపారు.
Konda Surekha Issue: మంత్రి కొండా సురేఖ అంశంపై తొలిసారి నోరు విప్పిన రేవంత్ రెడ్డి
Baddipadaga, Telangana:Konda Surekha vs Revanth Reddy: అవినీతి, అక్రమాలు అంటూ ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దుమారం రేపిన విషయం తెలిసిందే. వారం రోజులుగా ఆమె చేసిన వ్యాఖ్యలపై రాజకీయాలు హాట్టాహాట్గా ఉన్నాయి. రేవంత్ రెడ్డిపై కొండా కుటుంబం తిరుగుబాటు చేసిందనే చర్చ జరుగుతోంది. ఈ అంశంలో కొండా సురేఖ క్రమశిక్షణా కమిటీ నోటీసులు అందుకోవడం.. దానికి బదులివ్వడం వంటివి చకాచకా జరిగిపోయాయి. అయితే తనపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన అంశంపై విదేశీ పర్యటన నుంచి తిరిగి వచ్చిన రేవంత్ రెడ్డి స్పందించారు.
హైదరాబాద్లోని సచివాలయంలో సోమవారం జరిగిన మీడియా సమావేశంలో రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా తన అమెరికా పర్యటనను కేంద్ర ప్రభుత్వం అడ్డుకోవడంపై మాట్లాడిన రేవంత్ రెడ్డి ఈ క్రమంలో మీడియా అంతా ఎదురుచూస్తున్న కొండా సురేఖ ఎపిసోడ్పై స్పందించకుండా వెళ్తున్నారు. ఈ క్రమంలో ఓ మీడియా ప్రతినిధి కొండా సురేఖ అంశాన్ని ప్రస్తావించారు. దీంతో రెండు మాటలు మాట్లాడి రేవంత్ రెడ్డివ వెళ్లిపోయారు.
బంతి అధిష్టానం కోర్టులో..
'కొండా సురేఖ అంశం కాంగ్రెస్ పార్టీ చూసుకుంటుంది. ఆ అంశం క్రమశిక్షణ కమిటీ పరిధిలో ఉంది. పార్టీ అంతర్గత అంశాలపై మాట్లాడను' అని రేవంత్ రెడ్డి తెలిపారు. పార్టీ అధిష్టానం నిర్ణయానికి ఎవరైనా కట్టుబడి ఉండాలని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఊహాజనితమైన విషయాలను ప్రస్తావించరాదని మీడియాకు విజ్ఞప్తి చేశారు. ఈ వ్యాఖ్యలు చూస్తుంటే కొండా సురేఖ వ్యవహారం అధిష్టానం కోర్టులో ఉందని స్పష్టంగా అర్థమవుతోంది. కొండా సురేఖ వ్యవహారంలో ఇప్పటికే పార్టీ అధిష్టానానికి రేవంత్ రెడ్డి తన అభిప్రాయం చెప్పినట్లు తెలుస్తోంది. ఇక ఆమెను సహించేది లేదని.. ఓపిక పట్టలేమని తేల్చిచెప్పినట్లు సమాచారం. అయితే కొండా సురేఖను సస్పెండ్ చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రస్తుతానికి ఎలాంటి చర్యలు తీసుకోకవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
కాగా కాంగ్రెస్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకోవడం ద్వారా కొండా సురేఖ మంత్రి పదవి పోతుందని చర్చ జరుగుతండగా.. అనూహ్యంగా ఆమె తన శాఖకు సంబంధించిన కార్యక్రమంలో మునిగారు. మంత్రి పదవి నుండి ఉద్వాసన, బర్తరఫ్ ఇలా వార్తలు వస్తుండగా కొండా సురేఖ మాత్రం పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోతున్నారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సమావేశమైన అనంతరం కొండా సురేఖ పూర్తి ధీమాతో ఉన్నట్లు తెలుస్తోంది. ఆయనను కలిసి వచ్చిన అనంతరం కొండా సురేఖ ఇక రాజకీయ వివాదాల జోలికి వెళ్లకుండా తన మంత్రిత్వ శాఖ పనుల్లో నిమగ్నమయ్యారు. మంత్రిగా సమీక్షలు.. కలెక్టర్లతో సమావేశాలు నిర్వహించారు.
