ఇసుక సరఫరా లేక ఖాళీగా ఉంటున్న భవన నిర్మాణ కార్మికులు
Bellampalle, Kannal Rural, Telangana:మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో భవన నిర్మాణాలు చేపట్టాలంటే కావాల్సిన ముఖ్యమైన వస్తువు ఇసుక లభించక భవన నిర్మాణ కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని భవన నిర్మాణ ఐక్య కార్మిక సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. వారు మాట్లాడుతూ స్లాట్ బుక్ చేసి ప్రభుత్వపరంగా చెల్లించాల్సిన డబ్బులు చెల్లించినప్పటికి ఇసుక సరఫరా చేయకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదన్నారు. దీంతో కార్మికులు పనులు లేకుండా ఖాళీగా ఉంటున్నారని, అధికారులు వెంటనే ఇసుక అందించే ఏర్పాటు చేయాలన్నారు.हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
నెటిజన్లను ఫిదా చేస్తున్న తండ్రీకూతుళ్ల డాన్స్.. వీడియో ఇదే చూడండి..
Hyderabad, Telangana:Father Daughter Dance Viral Video: సోషల్ మీడియాలో ప్రతిరోజూ వేలాది వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. కానీ అందులో కొన్ని మాత్రమే నెటిజన్స్ మనసును హత్తుకుని.. పెదవులపై చెరగని చిరునవ్వులు అందిస్తూ ఉంటాయి.. తాజాగా ఇంటర్నెట్లో అలాంటి ఒక అద్భుతమైన డ్యాన్స్ వీడియో నెటిజన్ల హృదయాలను తాకుతోంది.. తండ్రి, కుమార్తెల మధ్య ఉండే పవిత్రమైన చెదరని స్నేహాన్ని చాటిచెప్పే ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ఈ వీడియోకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
బాలీవుడ్ సూపర్ హిట్ సినిమాలోని బద్తమీజ్ దిల్ పాటకు తండ్రితో పాటు కుమార్తె పోటీపడి వేసిన డ్యాన్స్ స్టెప్పులు వేశారు.. ఇప్పుడు ఈ డ్యాన్స్ ఇంటర్నెట్లో సంచలనం సృష్టిస్తున్నాయి. పాట ప్లే కాగానే వారిద్దరి పర్ఫార్మెన్స్, పర్ఫెక్ట్ టైమింగ్, ముఖంలో ఎక్ప్స్ప్రెషన్స్ చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
వీడియో మొదటి నుంచే తండ్రీకూతుళ్ల ఎనర్జీ.. ఉత్సాహం నెటిజన్స్ను ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఎలాంటి ఇబ్బంది లేకుండా.. ఇద్దరూ కలిసి ఒకరికొకరు పోటీగా వేసిన డాన్స్ స్టెప్స్ నెటిజన్లను కట్టిపడేస్తున్నాయి. వీరి డాన్స్ స్టెప్పుల్లోని సమన్వయం చూస్తుంటే.. ఈ పర్ఫార్మెన్స్ వారికి ఎంతో ఇష్టమై ఉంటుందో స్పష్టంగా అర్థమవుతోంది. అయితే, డాన్స్ పర్ఫెక్షన్ కంటే కూడా ఇద్దరూ కలిసి సరదాగా డ్యాన్స్ చేసిన ఆ మధురమైన క్షణాలే.. ఈ వీడియోకు అసలైన ప్రాణమని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
డాన్స్ చేస్తున్నంత సేపూ వారిద్దరి ముఖాల్లో కనిపించే.. ప్రసన్నమైన చిరునవ్వు ఈ వీడియోకు ప్రధాన ఆకర్షణగా నిలిచిందని భావించవచ్చు.. ప్రతి స్టెప్పులోనూ వారి మధ్య ఉన్న అనుబంధం, ఆప్యాయత స్పష్టంగా కనిపిస్తున్నాయి. తండ్రి అంటే కేవలం కుటుంబ బాధ్యతలు నెరవేర్చే వ్యక్తి మాత్రమే కాదు.. కూతురు జీవితంలో అద్భుతమైన స్నేహితుడు, ఒక గొప్ప సపోర్ట్ సిస్టమ్.. అని ఈ వీడియోను చూసిన నెటిజన్లు కామెంట్లతో ప్రశంసిస్తున్నారు.
Also Read: పోలీస్ వ్యాన్ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!
ఈ అద్భుతమైన డ్యాన్స్ వీడియోను ఇన్స్టాగ్రామ్లో ఆకాంక్ష సెహగల్ (@akku_sehgal_) అనే ఖాతా ద్వారా పోస్ట్ చేశారు. సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన అతి తక్కువ సమయంలోనే ఈ రీల్ వైరల్ చార్ట్స్ను తిరగరాసింది. దీనిని ఇప్పటి వరకు 14 కోట్లకు (140 మిలియన్లు) పైగా సోషల్ మీడియా వినియోగదారులు వీక్షించారు. దీనికి ఇప్పటి వరకు 77 లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి. వేలాది మంది నెటిజన్లు బెస్ట్ ఫాదర్-డాటర్ డుయో.. క్యూటెస్ట్ డాన్స్ వీడియో.. అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
Also Read: పోలీస్ వ్యాన్ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
TSGLI లోన్ ఎలా పొందాలో తెలుసా? దరఖాస్తు విధానం, నిబంధనలు, పూర్తి వివరాలివే..!
Lakshmapur, Telangana:TSGLI loan: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్థిక అత్యవసర సమయాల్లో అండగా నిలిచేందుకు తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ లైఫ్ ఇన్సూరెన్స్ (TSGLI) పథకం ఎంతో ఉపయోగపడుతుంది. ఉద్యోగులు తమ TSGLI ఖాతాలో జమ అయిన మొత్తం ఆధారంగా సులభంగా లోన్ పొందవచ్చు. ఈ బీమా స్కీమ్ కింద ఉద్యోగి లేదా పెన్షనర్ సహజ మరణం కానీ.. ప్రమాదవశాత్తు మరణించినా. బీమా ప్రయోజనాలు వర్తిస్తాయి. దీంతో ఉద్యోగులు, వారి కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ స్కీమును జూన్ 25న ప్రారంభించారు. ఈ స్కీమును సమర్థవంతంగా అమలు చేసేందుకు రాష్ట్రప్రభుత్వం 14 ప్రముఖ బ్యాంకులతో ఒప్పందం కుదుర్చుకుంది. బ్యాంకుల సహకారంతో బీమా ప్రయోజనాలు అర్హులైన ఉద్యోగులు, పెన్షనర్లకు సులభంగా అందించే విధంగా చర్యలు తీసుకుంటుంది.
అయితే ఈ స్కీము కేవలం శాశ్వత ఉద్యోగులకే పరిమితం చేయాలని ప్రభుత్వం మొదట భావించినప్పటికీ.. ఆ తర్వాత కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ వంటి తాత్కాలిక ఉద్యోగులకు కూడా వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. బ్యాంకు ఖాతాల ద్వారా ప్రభుత్వ జీతం అందుకునే ప్రతి ఉద్యోగికీ ఈ బీమా రక్షణ లభిస్తుంది. దాదాపు 10 లక్షల మంది ఉద్యోగుల కుటుంబాలకు ఈ స్కీమ్ ద్వారా ఆర్థిక భరోసా కల్పించనున్నారు. ఈ బీమా స్కీమ్ కోసం ఉద్యోగులు ఎలాంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఏదైనా ప్రమాదంలో ఉద్యోగి మరణించినట్లయితే.. వారికి రూ. 60లక్షల నుంచి రూ. 2కోట్ల వరకు బీమా పరిహారం అందిస్తుంది. గతంలో సింగరేణి ఉద్యోగుల కోసం ప్రవేశపెట్టిన ఈ స్కీమ్ ద్వారా ఇప్పటికే 45 మంది ఉద్యోగుల కుటుంబాలకు 1కోటి చొప్పున పరిహారం అందించింది ప్రభుత్వం. అయితే ఈ లోన్ కు ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హతలు ఏంటి.. నిబంధనలు ఎలా ఉన్నాయి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
లోన్ అర్హతలు – ఎంత వస్తుంది?
TSGLI విధానం ప్రకారం, ఉద్యోగి ఖాతాలో బోనస్తో కలిపి జమ అయిన మొత్తం సంచిత నిధి (Surrender Value) నుంచి దాదాపు 80శాతం వరకు లోన్ పొందే అవకాశం ఉంటుంది. దీనిపై ప్రభుత్వం నిబంధనల ప్రకారం స్వల్ప వడ్డీ రేటును వసూలు చేస్తుంది.
దరఖాస్తు విధానం (Step-by-Step Process):
అప్లికేషన్ ఫారమ్:
ముందుగా తెలంగాణ ఇన్సూరెన్స్ శాఖ అధికారిక వెబ్సైట్ (tsgli.telangana.gov.in) నుంచి TSGLI లోన్ దరఖాస్తు ఫారమ్ను డౌన్లోడ్ చేసుకోవాలి.
వివరాల నమోదు:
ఫారమ్లో పాలసీ నంబర్, ఉద్యోగి ఐడీ, ప్రాథమిక వేతనం (Basic Pay), బ్యాంక్ ఖాతా వివరాలు, ఎంత రుణం కావాలో స్పష్టంగా పూరించాలి.
పత్రాల జతపరిచే విధానం:
పూర్తి చేసిన అప్లికేషన్కు బ్యాంక్ పాస్బుక్ మొదటి పేజీ జీరాక్స్ ప్రతిని జత చేయాలి. ఫారమ్పై రూ. 1/- రెవెన్యూ స్టాంప్ అతికించి సంతకం చేయాలి.
DDO ధ్రువీకరణ: పూరించిన అప్లికేషన్ను సంబంధిత డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్ (DDO) ఆమోదం పొంది, సంతకం, కార్యాలయ ముద్ర వేయించాలి.
సమర్పణ: అనంతరం ఈ దరఖాస్తును జిల్లా TSGLI ఇన్సూరెన్స్ కార్యాలయంలో అందజేయాలి.
తిరిగి చెల్లించే విధానం:తీసుకున్న రుణ మొత్తాన్ని ఉద్యోగి తన సౌకర్యాన్ని బట్టి 12, 24, 36 లేదా 48 నెలవారీ వాయిదాలలో (Instalments) తిరిగి చెల్లించవచ్చు. ఈ వాయిదా మొత్తాన్ని ప్రతి నెలా జీతం నుంచి DDO ద్వారా కట్ చేస్తారు. ఆత్యయిక పరిస్థితుల్లో బయట ఎక్కువ వడ్డీలకు అప్పులు చేయకుండా, తక్కువ వడ్డీకే లభించే TSGLI లోన్ సౌకర్యాన్ని ప్రభుత్వ ఉద్యోగులు సద్వినియోగం చేసుకోవచ్చు.
50శాతం చెల్లింపుల నిబంధన: మొదటిసారి తీసుకున్న రుణంలో కనీసం 50శాతం మొత్తం తిరిగి చెల్లించిన తర్వాతే రెండోసారి లోన్ కోసం దరఖాస్తు చేసుకునే అర్హత ఉంటుంది. డైరెక్టర్ ఆఫ్ ఇన్సూరెన్స్ విచక్షణాధికారం మేరకు మిగిలిన బకాయిలను మినహాయించుకుని మిగతా మొత్తాన్ని రెండోసారి రుణంగా మంజూరు చేస్తారు. అయితే TSGLI కింద ప్రతి నెలా చెల్లించే ప్రీమియం మొత్తానికి ఇన్కమ్ టాక్స్ యాక్ట్ సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు లభిస్తుంది.
Also Read: బంగారం కొనొద్దన్న మోదీ... ఆగిన కొనుగోళ్లు.. WGC లెక్కలు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
Also Read: కేంద్ర ప్రభుత్వం సంచలన ప్రాజెక్ట్.. రూ. 84,000 కోట్ల సముద్ర మంథన్.. ఏంటీ సముద్ర మంథన్?
Also Read: తెలంగాణ ఉద్యోగులు, పెన్షనర్లకు బిగ్ అలర్ట్..హెల్త్ కార్డ్ వివరాల
Also Read: EPF పెన్షనర్లకు షాక్.. నిలిచిపోయిన పింఛన్లు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
అమెరికా-ఇరాన్ యుద్ధానికి తాత్కాలిక విరామం.. ట్రంప్ సంచలన నిర్ణయం!
Hyderabad, Telangana:US-Iran Peace Talks: గతకొద్ది కాలంగా పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలకు కారణమైన అమెరికా-ఇరాన్ యుద్దంలో అనూహ్య మలుపు తిరిగింది. ఇరాన్పై చేపట్టాల్సిన సైనిక చర్యలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు (Military Action Halted) అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పందం (Peace Deal)కుదిర్చే దిశగా చర్చలు ముమ్మరమయ్యాయని.. అతి త్వరలోనే ఒప్పందంపై సంతకాలు జరిగే అవకాశం ఉందని అంతర్జాతీయ వర్గాలు వెల్లడించాయి.
ప్రపంచ చమురు రవాణాలో ఐదో వంతు ఈ హోర్ముజ్ జలసంధి (Strait of Hormuz) గుండానే సాగుతుంది. ఘర్షణల నేపథ్యంలో ఈ మార్గంలో నౌకల రాకపోకలు స్తంభించిపోవడంతో అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు ఆకాశాన్నంటాయి. ఇప్పుడు ఇరు దేశాలు శాంతి ఒప్పందానికి మొగ్గు చూపడంతో.. నౌకల రాకపోకలు పునరుద్ధరణకు మార్గం సుగమమైంది. దీనివల్ల భారత్ సహా ప్రపంచ దేశాలకు ఇంధన సరఫరాలో పెద్ద ఉపశమనం లభించనుంది.
మిలిటరీ స్థావరాలతో పాటు వ్యూహాత్మక ప్రాంతాలపై దాడులను నిలిపివేయాలని ట్రంప్ యంత్రాంగం ఆదేశించడంతో, పశ్చిమాసియా ప్రాంతంలో యుద్ధ భయం తగ్గిన్నట్లు తెలుస్తోంది. దౌత్యపరమైన సంప్రదింపుల వల్ల వివాదాలను పరిష్కరించుకోవడానికి ఇరాన్ కూడా సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ పరిణామంతో గ్లోబల్ షేర్ మార్కెట్లు, ఇంధన మార్కెట్లు సానుకూలంగా స్పందించాయి. చమురు సరఫరా యథావిధిగా సాగితే.. త్వరలోనే లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి.
Also Read: బంగాళాఖాతంలో వేగంగా మారుతున్న వాతావరణం..తెలుగు రాష్ట్రాలకు తుఫాన్ ముప్పు!
అమెరికా-ఇరాన్ మధ్య కుదురుతున్న ఈ శాంతి ఒప్పందాన్ని భారత్ సహా పలు ప్రపంచ దేశాలు స్వాగతించాయి. ఇంధన భద్రతతో పాటు గ్లోబల్ సప్లై చైన్ స్థిరత్వానికి ఈ నిర్ణయం అత్యంత కీలకమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సైనిక ఘర్షణల కంటే దౌత్యపరమైన పరిష్కారాలే ప్రపంచ శాంతికి క్రియాశీలక పాత్ర పోషిస్తాయని అంతర్జాతీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.
Also Read: బంగాళాఖాతంలో వేగంగా మారుతున్న వాతావరణం..తెలుగు రాష్ట్రాలకు తుఫాన్ ముప్పు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ఉగ్ర కుట్ర ప్లాన్.. పోలీసు యూనిఫాంలో దాడికి జైషే ఉగ్రవాది స్కెచ్!
Hyderabad, Telangana:Jaish Terrorist Plan: ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన విద్యార్థుల నిరసనలను లక్ష్యంగా చేసుకుని ఉగ్రదాడికి పథకం రచించినట్లు తెలుస్తోంది. పశ్చిమ బెంగాల్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF) అధికారులు అరెస్టు చేసిన జైషే ఏ మహమ్మద్ ఉగ్రవాది హమీమ్ మౌండల్ను సుదీర్ఘంగా విచారించగా ఈ కుట్ర కోణం బయటపడింది. ఇప్పుడు ఈ క్రుట అధికారులను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
ఎస్టీఎఫ్ అధికారుల వివరాల ప్రకారం.. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా జరుగుతున్న విద్యార్థుల ఆందోళనల సమయంలో ఖాకీ యూనిఫాం ధరించి చొరబడాలని ఉగ్రవాదులు భావించారు. పోలీసు దుస్తుల్లో ఉన్నట్లయితే ఎవరికీ అనుమానం రాదని.. సులువుగా జనం మధ్యలోకి వెళ్లి వినాశనం సృష్టించవచ్చని భావించి ఈ కుట్ర పన్నారు.
హమీమ్ మౌండల్కు కేవలం ఢిల్లీ దాడి బాధ్యత మాత్రమే కాకుండా.. పశ్చిమ బెంగాల్కు చెందిన పలువురు ప్రముఖ రాజకీయ నాయకులు, ఉన్నతాధికారుల కదలికలపై రెక్కి బాధ్యతలను కూడా జైషే మహమ్మద్ అధినాయకత్వం అప్పగించినట్లు విచారణలో తేలింది. పశ్చిమ బెంగాల్లోని ఒక బిజెపి ఎమ్మెల్యే కుమారుడి కిడ్నాప్, రూం డిమాండ్కి సంబంధించిన కేసును దర్యాప్తు చేస్తున్న క్రమంలో పోలీసులకు ఈ ఉగ్రవాద నెట్వర్క్ జాడ దొరికిన్నట్లు తెలుస్తోంది. కిడ్నాప్ కేసును తవ్వేకొద్దీ దీని వెనుక ఉన్న అంతర్జాతీయ ఉగ్రవాద సంబంధాలు, దాడుల ప్రణాళికలు ఒక్కటొక్కటిగా బయటపడ్డాయి.
ప్రస్తుతం బెంగాల్ ఎస్టీఎఫ్ దర్యాప్తును వేగవంతం చేసింది. హమీమ్ మౌండల్ స్వయంగా ఢిల్లీ జంతర్ మంతర్ వద్దకు వచ్చి రెక్కి నిర్వహించాడా? లేక అతని అనుచరులు ఎవరైనా ఢిల్లీలో ఈ కుట్రకు సహకరించారా? అనే కోణంలో పోలీసులు తీవ్రంగా విచారిస్తున్నారు. ఢిల్లీ పోలీసులకు, కేంద్ర నిఘా వర్గాలకు కూడా ఈ సమాచారాన్ని అందించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే రాజధానిలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.
Also Read: పోలీస్ వ్యాన్ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
సర్పంచ్కి ఓటెయ్యలేదని పగ.. ఇల్లు కూలుస్తానని బెదిరింపులు..!
Hyderabad, Telangana:Kamareddy Latest News: కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం హండే కేలూరు గ్రామంలో శనివారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. స్థానిక సర్పంచ్ ఎన్నికల్లో తనకు ఓటు వేయలేదనే కక్షతో.. కొన్ని ఏళ్ల క్రితం తాను నిర్మించుకున్న ఇల్లు కూల్చివేస్తానని సర్పంచ్ బెదిరిస్తున్నాడని ఆరోపిస్తూ ఒక నిరుపేద బాధితురాలు గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు ధర్నాకు దిగింది.. బాధితురాలి నిరసనకు పెద్ద ఎత్తున గ్రామస్తుల సపోర్ట్ రావడంతో గ్రామంలో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.
బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం... గత 25 సంవత్సరాలుగా ప్రభుత్వం తనకు కేటాయించిన స్థలంలోనే నివాసముంటున్నానని.. తన కష్టార్జితంతో ఆ ఇల్లు నిర్మించుకున్నానని తెలిపారు. అయితే, ఇటీవలి సర్పంచ్ ఎన్నికల్లో గ్రామ సర్పంచ్ గడ్డివర్ లక్ష్మణ్కు ఓటు వేయలేదనే నెపంతో.. ఆయన తనపై రాజకీయ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని రోజుల నుంచి తన ఇల్లు కూల్చివేస్తానంటూ.. సర్పంచ్ లక్ష్మణ్ తీవ్ర బెదిరింపులకు దిగుతున్నాడని బాధితురాలు ఆరోపించారు.
ఈ అన్యాయాన్ని నిరసిస్తూ.. సర్పంచ్ వేధింపుల నుంచి తనకు రక్షణ కల్పించి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు బాధితురాలు బైఠాయించి ధర్నా నిర్వహించారు. బాధితురాలికి మద్దతుగా గ్రామస్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి నిరసనలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఓ నిరుపేద మహిళపై ప్రజాప్రతినిధి స్థాయిలో ఉన్న వ్యక్తి కక్షసాధింపు చర్యలకు పాల్పడడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే బాధితురాలికి న్యాయం చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.
Also Read: బంగాళాఖాతంలో వేగంగా మారుతున్న వాతావరణం..తెలుగు రాష్ట్రాలకు తుఫాన్ ముప్పు!
ఈ సందర్భంగా బాధితురాలు కన్నీటి పర్యంతమవుతూ.. ఎన్నో ఏళ్ల కష్టంతో నిర్మించుకున్న ఇంటిని కూల్చేస్తే మా కుటుంబం రోడ్డున పడుతుంది. అధికారుల నుంచి నాకు న్యాయం జరగకపోతే ఈ గ్రామ పంచాయతీ కార్యాలయం ముందే ఆత్మహత్య చేసుకోవడం తప్ప నాకు వేరే మార్గం లేదని వాపోయింది. హండే కేలూరు గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితి తలెత్తినట్లు సమాచారం అందుకున్న మద్నూర్ ఎంపీడీఓ సత్యనారాయణ రెడ్డి.. స్థానిక మద్నూర్ పోలీసులతో కలిసి వెంటనే గ్రామానికి చేరుకున్నారు. ధర్నా స్థలికి వెళ్లి బాధితురాలితో పాటు గ్రామస్తులతో మాట్లాడి.. పరిస్థితిని సమీక్షించారు.
Also Read: బంగాళాఖాతంలో వేగంగా మారుతున్న వాతావరణం..తెలుగు రాష్ట్రాలకు తుఫాన్ ముప్పు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
సికింద్రాబాద్ మహంకాళికి తొలి బోనం సమర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్!
Hyderabad, Telangana:Secunderabad Bonalu 2026: తెలంగాణ విశిష్ట సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలకు ఆషాఢ మాస బోనాల పండగ ఒక ప్రతీక అని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర ఉత్సవాల సందర్భంగా మంత్రి తన కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకుని.. తొలి బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి బంగారు బోనంతో పాటు పట్టు వస్త్రాలను మంత్రి అధికారికంగా సమర్పించారు.
మహంకాళి అమ్మవారి దర్శనం అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలకు బోనాల పండగ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి.. పాడిపంటలతో పంట పొలాలు పచ్చగా ఉండాలని ఆ మహంకాళి అమ్మవారిని ప్రార్థించాం. ప్రజలంతా ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని.. ఎవరి వృత్తుల్లో వారు గొప్ప విజయాలు సాధించాలని వేడుకున్నాం. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ప్రజా సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఎలాంటి అవరోధాలు లేకుండా విజయవంతంగా ముందుకు సాగడానికి ఆ జగజ్జనని కరుణాకటాక్షాలు ఎల్లప్పుడూ మన రాష్ట్రంపై ఉండాలని ఆకాంక్షించాం.. అని మంత్రి తెలిపారు.
హైదరాబాద్ నగరం ఆతిథ్యానికి పెట్టింది పేరని గుర్తుచేసిన మంత్రి.. బోనాల ఉత్సవాలలో కులమతాలకు అతీతంగా ప్రజలంతా అత్యంత ఉత్సాహంతో, భాగస్వామ్యమై పండగను జరుపుకుంటారని అన్నారు. భక్తుల ఆకాంక్షలకు అనుగుణంగా, వారికేలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం, జిహెచ్ఎంసి, పోలీస్ విభాగాల ఆధ్వర్యంలో అన్ని రకాల విస్తృత ఏర్పాట్లు చేసినట్లు వివరించారు.
ALso Read: బంగాళాఖాతంలో వేగంగా మారుతున్న వాతావరణం..తెలుగు రాష్ట్రాలకు తుఫాన్ ముప్పు!
ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం ఉండటంతో ఈసారి ఆలయాలకు భక్తుల రద్దీ గణనీయంగా పెరిగిందని.. దానికి తగ్గట్టుగానే రవాణా వ్యవస్థను సిద్ధం చేశామని ఆయన పేర్కొన్నారు. గతంలో కూడా ఈ ప్రాంతంపై అనేక విపత్తులు వచ్చినప్పుడు ఉజ్జయిని మహంకాళి అమ్మవారు ప్రజలను కాపాడారని మంత్రి పొన్నం అన్నారు. ఎల్ నినో వంటి ప్రకృతి వైపరీత్యాలు ఎదురైనా.. తెలంగాణ రాష్ట్రానికి ఎలాంటి ఇబ్బందులు కలగకూడదని బోనాల సందర్భంగా అన్ని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించమని.. ప్రకృతి వైపరీత్యాలను తట్టుకుని అమ్మవారి దివ్య ఆశీస్సులతో రాష్ట్రంలో మంచి వర్షాలు కురుస్తాయనే నమ్మకం మాకు ఉందని మంత్రి పొన్నం అన్నారు.
ALso Read: బంగాళాఖాతంలో వేగంగా మారుతున్న వాతావరణం..తెలుగు రాష్ట్రాలకు తుఫాన్ ముప్పు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Mirnalini Ravi Engagement: సీక్రెట్గా నిశ్చితార్థం చేసుకున్న టాలీవుడ్ నటి! 'గద్దలకొండ గణేష్' హీరోయిన్ కాబోయే భర్త ఇతనే!
Chennai, Tamil Nadu:Mirnalini Ravi Engagement News: 'గద్దలకొండ గణేష్' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కోలీవుడ్ నటి, సోషల్ మీడియా సెన్సేషన్ మృణాళిని రవి నిశ్చితార్థం చేసుకుంది. తన ఎంగేజ్మెంట్ వార్తలతో ఒక్కసారిగా ఆమె ట్రెండింగ్లో నిలిచింది. ఆధ్యాత్మిక ప్రసంగీకుడు మహావిష్ణుతో తాను ప్రేమలో ఉన్నట్లు ప్రకటించడమే కాకుండా, వీరిద్దరి ఎంగేజ్మెంట్ ఫోటోలను ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు. ప్రస్తుతం ఈ జోడీకి సంబంధించిన పిక్స్ నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
మృణాళిని రవి నేపథ్యం..
షార్ట్ వీడియో యాప్ల ద్వారా పాపులర్ అయిన మృణాళిని.. ఆ తర్వాత 'సూపర్ డీలక్స్' సినిమాతో నటిగా అడుగుపెట్టారు. ఆ తర్వాత 'ఛాంపియన్', 'ఎనిమీ', 'కోబ్రా', 'రోమియో' వంటి పలు తమిళ, తెలుగు చిత్రాలలో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. సోషల్ మీడియాలోనూ ఈ భామకు భారీ ఫాలోయింగ్ ఉంది.
ఈ మహావిష్ణు ఎవరు?
మధురైకి చెందిన మహావిష్ణు తొలుత ఒక టీవీ ఛానెల్ కామెడీ షో ద్వారా వెలుగులోకి వచ్చి, ఆ తర్వాత ఆధ్యాత్మిక ప్రసంగీకుడిగా మారారు. అయితే 2024లో చెన్నైలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఆయన చేసిన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు తమిళనాడులో పెద్ద కలకలమే రేపాయి.
నెట్టింట ఎందుకు హాట్ టాపిక్ అయింది?
గతంలో పలు వివాదాల్లో చిక్కుకున్న ఆధ్యాత్మిక గురువును నటి వివాహం చేసుకుంటుండటంతో సోషల్ మీడియాలో రకరకాల కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. వీరిద్దరి మధ్య ఏడేళ్లుగా స్నేహం ఉందని, అదే ప్రేమగా మారిందని మహావిష్ణు తన సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. ఏది ఏమైనప్పటికీ, ఈ అనూహ్య నిశ్చితార్థం ప్రస్తుతం సినీ వర్గాలతో పాటు నెటిజన్లను సైతం ఆశ్చర్యపరుస్తోంది.
Also Read: అందంలో హీరోయిన్లను మించిపోయిన నటి రోజా కూతురు..అన్షు లేటెస్ట్ ఫొటోలు!
Also Read: సైమా అవార్డ్స్ 2026 నామినేషన్లు..ఉత్తమ నటుడి విభాగంలో పవన్ కళ్యాణ్కు గట్టి పోటీ!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
ఆగస్టు 12 సూర్య గ్రహణం.. ఈ 3 రాశుల వారికి తీవ్ర నష్టాలు.. మీ రాశి ఉందా?
Hyderabad, Telangana:Solar Eclipse August 12: ఈ నెలలో ఖగోళంలో మరో అద్భుతం జరగబోతోంది.. అత్యంత కీలకమైన క్షణాలు ఆసన్నం కాబోతున్నాయి. ఈ ఏడాది చివరి, ఎంతో ప్రాధాన్యత కలిగిన రెండవ సూర్య గ్రహణం ఆగస్టు 12వ తేదీన సంభవించబోతోంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఈ మార్పు మానవాళిపై, ముఖ్యంగా ద్వాదశ రాశుల జీవితాలపై ఎనలేని ప్రభావం చూపుతుంది. ఈ గ్రహణం భారతదేశంలో కనిపించకపోవడం వల్ల సూతక కాలం లేకపోయినప్పటికీ.. జ్యోతిష్యపరంగా మాత్రం ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఏదో ఒక మార్పును సృష్టించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ముఖ్యంగా.. జ్యోతిష్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మూడు రాశుల వారికి ఈ గ్రహణ కాలం తీవ్రమైన సవాలుగా మారే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. వీరు క్షణక్షణం ఆచితూచి అడుగు వేయకపోతే మానసిక, ఆర్థిక, కుటుంబ సంక్షోభాలు తప్పవని వేద పండితులు చెబుతున్నారు. అయితే, ఏయే రాశులవారు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో? ఈ సమయంలో ఏయే రాశులవారికి దుష్ప్రభావాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
సింహ రాశి (Leo):
సింహ రాశి వారికి ఆర్థికంగా కలిసివచ్చే అవకాశాలు ఉన్నప్పటికీ.. ఆరోగ్యం విషయంలో తీవ్ర ఉడుదుడుకులు ఎదురవుతాయి. తీవ్ర శ్రమ పడితే తప్ప ఫలితం దక్కని పరిస్థితి ఎదురవుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. వ్యాపారాల్లో ఆలోచించకుండా చేసే పనులు తీవ్ర నష్టాలకు దారితీస్తాయి. ఉద్యోగ ప్రాంతంలో సహోద్యోగులతో లేదా పైఅధికారులతో ఘర్షణ వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. కుటుంబంలో కలహాలు రాకుండా ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. తొందరపాటు నిర్ణయాలు మీ జీవితాన్ని ఇబ్బందుల్లోకి నెట్టే ప్రమాదం ఉంది.
కన్యా రాశి (Virgo):
కన్యా రాశి వారికి పూర్తవుతుందనుకున్న పనులు చివరి నిమిషంలో నిలిచిపోవడం తీవ్ర నిరాశను మిగులుస్తుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. స్నేహితుల నుంచి ఆశించిన సహాయం అందక మనస్తాపానికి గురవుతారు. కెరీర్లో అకస్మాత్తుగా అవరోధాలు ఎదురవుతాయి. ఆరోగ్యం క్షీణించడం, మానసిక ఆందోళన నిద్రలేమికి దారితీసే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమయంలో ఎవరితోనూ వివాదాలకు దిగకండి. పట్టుదలతో, సహనంతో ముందుకు సాగితేనే రాబోయే సమయం చాలా అద్భుతంగా ఉంటుంది.
కర్కాటక రాశి (Cancer):
కర్కాటక రాశివారికి ఈ సమయం ఒక రకమైన పరీక్షా సమయంగా భావించవచ్చు. ప్రతి పనిలోనూ అడుగడుగునా ఆటంకాలు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. వైవాహిక జీవితంలో అనవసర మనస్పర్ధలు, భార్యాభర్తల మధ్య విభేదాలు మనశ్శాంతిని దూరం చేయవచ్చు. అనుకోని ఖర్చులు రావడం వల్ల మీ బడ్జెట్ తలకిందులయ్యే ప్రమాదం కూడా స్పష్టంగా కనిపిస్తోంది.. కొత్త ప్రాజెక్టులు, వ్యాపారాలు ప్రారంభించాలనుకుంటే తప్పకుండా నిపుణుల సలహా తప్పనిసరని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఏ క్షణంలోనూ ఆవేశపడకండి.. ఓర్పుతో వ్యవహరించకపోతే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. అలాగే ప్రయాణాలను వాయిదా వేసుకోవడమే శ్రేయస్కరమని నిపుణులు సూచిస్తున్నారు.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
గమనిక.. 
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..
SIIMA Awards 2026: సైమా అవార్డ్స్ 2026 నామినేషన్లు..ఉత్తమ నటుడి విభాగంలో పవన్ కళ్యాణ్కు గట్టి పోటీ!
Hyderabad, Telangana:SIIMA Awards 2026 Nominations: సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ 2026 (సైమా అవార్డ్) వేడుక ఈసారి రసవత్తరంగా సాగనుంది. దక్షిణాది చిత్ర పరిశ్రమలకు చెందిన ఉత్తమ చిత్రాల్లోని విభాగాల్లో ఉత్తమ ప్రదర్శనకు గానూ ఈ అవార్డులను అందజేస్తారు. ఈ క్రమంలో సైమా అవార్డుల ప్రదానోత్సవానికి గానూ ఈ ఏడాది బరిలో ఉన్న నామినేషన్లను సైమా నిర్వాహకులు తాజాగా విడుదల చేశారు. సౌత్ ఇండియా సినిమా ఇండస్ట్రీల నుంచి వివిధ కేటగిరీల్లో పోటీ పడుతున్న వారి వివరాలను ఓ ప్రకటనలో వెల్లడించారు.
సైమా అవార్డ్స్ 2026లో టాలీవుడ్ నుంచి యువ కథానాయకుడు తేజ సజ్జా హీరోగా నటించిన 'మిరాయ్' సినిమా అత్యధికంగా 11 నామినేషన్లను దక్కించుకుంది. ఆ తర్వాత బరిలో నిలిచిన 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా 10 నామినేషన్లు.. 'తండేల్', 'కోర్టు' సినిమాలకు గానూ చెరో 9 నామినేషన్లు దక్కాయి. ఈ సారి ఈ సైమా అవార్డుల ప్రదానోత్సవాన్ని సెప్టెంబరు 11, 12 తేదీల్లో జరిగే వేడుకల్లో అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు.
టాలీవుడ్ నుంచి ఈసారి బరిలో నిలిచిన నామినేషన్లు ఆసక్తికరంగా ఉన్నాయి. స్టార్ హీరో పవన్ కళ్యాణ్ చాలా ఏళ్ల తర్వాత మరోసారి సైమా అవార్డ్స్ నామినేషన్ల బరిలో నిలిచారు. ఆయన నటించిన 'ఓజీ' సినిమాకి గాను ఉత్తమ నటుడి నామినేషన్ల బరిలో నిలిచారు. ఈ ఉత్తమ నటుడి అవార్డు కోసం ఏకంగా ఆరుగురు పోటీ పడుతుండడం గమనార్హం. ఈ క్రమంలో సైమా అవార్డ్స్ నామినేషన్లలో ప్రముఖ నామినేషన్ల వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
టాలీవుడ్ నుంచి ఉత్తమ నటుడి నామినేషన్ల బరిలో ఎవరెవరు ఉన్నారంటే?
పవన్కల్యాణ్ - ఓజీ (The Call Him OG)
ధనుష్ - కుబేర
నాని - హిట్ 3
నాగచైతన్య - తండేల్
తేజ సజ్జా - మిరాయ్
వెంకటేష్ దగ్గుబాటి - సంక్రాంతికి వస్తున్నాం
ఉత్తమ నటి విభాగం..
ఐశ్వర్యా రాజేష్ - సంక్రాంతికి వస్తున్నాం
రాశీ ఖన్నా - తెలుసు కదా
రష్మిక మంధాన - ది గర్ల్ ఫ్రెండ్
రితికా నాయక్ - మిరాయ్
సాయి పల్లవి - తండేల్
శ్రీనిధి శెట్టి - హిట్ 3
ఉత్తమ దర్శకుడు విభాగం..
చందూ మొండేటి - తండేల్
అనిల్ రావిపూడి - సంక్రాంతికి వస్తున్నాం
కార్తిక్ ఘట్టమనేని - మిరాయ్
శైలేష్ కొలను - హిట్ 3
రాహుల్ రవీంద్రన్ - ది గర్ల్ ఫ్రెండ్
సుజీత్ - ఓజీ
ఉత్తమ చిత్రం విభాగం..
కోర్ట్
మిరాయ్
హిట్ 3
సంక్రాంతికి వస్తున్నాం
ది గర్ల్ ఫ్రెండ్
తండేల్
ఉత్తమ సంగీత దర్శకుడు విభాగం..
దేవిశ్రీ ప్రసాద్ - తండేల్
భీమ్స్ సిసిరోలియో - సంక్రాంతి వస్తున్నాం
గౌర హరి - మిరాయ్
ఎస్.ఎస్.తమన్ - ఓజీ
హషీమ్ అబ్దుల్ వహద్ - ది గర్ల్ ఫ్రెండ్
విజయ్ బుల్గానిన్ - కోర్ట్.
Also Read: 'కొరియన్ కనకరాజు' ట్రైలర్ వచ్చేసింది! వరుణ్ తేజ్ డ్యుయెల్ రోల్..సత్య సూపర్ కామెడీ!
Also Read: అందంలో హీరోయిన్లను మించిపోయిన నటి రోజా కూతురు..అన్షు లేటెస్ట్ ఫొటోలు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Sangareddy Wedding Fraud: అందగత్తె అని ఎదురుకట్నం ఇచ్చి పెళ్లి చేసుకున్నాడు..చివరికి ఫస్ట్నైట్ రోజే..
Sangareddy, Telangana:Sangareddy Wedding Fraud News: ఒంటరి జీవితానికి స్వస్తి చెప్పి, కొత్త జీవితాన్ని ప్రారంభిద్దామని ఆశపడిన ఓ మెకానిక్కు పెళ్లయిన మరుసటి రోజే ఘోరమైన మోసం ఎదురైంది. అందంగా ఉందన్న ఉద్దేశంతో ఎదురుకట్నం ఇచ్చి మరీ వివాహం చేసుకుంటే.. ఫస్ట్నైట్ తిరిగేసరికి భార్య కళ్లుగప్పి పరారైన ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో సంచలనంగా మారింది.
ఘటన వివరాల్లోకి వెళ్తే..
సంగారెడ్డి ప్రాంతానికి చెందిన ఆరిఫుద్దీన్ మెకానిక్గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. 30 ఏళ్ల వైవాహిక జీవితం ఆ వెంటనే మొదటి భార్యతో విడిపోయిన తర్వాత ఒంటరితనం వెంటాడటంతో.. తోడు కోసం మరో వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు. ఈ క్రమంలోనే హైదరాబాద్ పాతబస్తీకి చెందిన ఓ యువతితో అతనికి వివాహం కుదిరింది. అమ్మాయి కుటుంబం ఆర్థిక పరిస్థితి బాగాలేకపోవడంతో పెళ్లి ఖర్చుల నిమిత్తం ఆరిఫుద్దీన్ స్వయంగా రూ.60 వేలు ఎదురుకట్నం ఇచ్చి పెద్దల సమక్షంలో ఘనంగా పెళ్లి చేసుకున్నాడు. జీవితంలో కొత్త ఆశలతో భార్యను ఇంటికి తీసుకెళ్లాడు.
తెల్లారేసరికి షాక్..
అంతా సంతోషంగా గడుస్తుందనుకున్న తరుణంలో మరుసటి రోజు ఉదయం నిద్రలేచి చూసేసరికి భార్య కనిపించకపోవడంతో ఆరిఫుద్దీన్ కంగుతిన్నాడు. ఇల్లంతా వెతికి, బంధువులను ఆరా తీసినా ఎలాంటి ప్రయోజనం లేకపోయింది. రాత్రికి రాత్రే ఆమె పరారవడంతో ఇది ముందస్తుగా వేసిన పక్కా పథకం (ప్లాన్) కావచ్చని భావించాడు.
ఈ మోసంపై వెంటనే పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయడంతో పాటు, తన భార్య క్షేమంగా తిరిగి రావాలని సోషల్ మీడియాలోనూ పోస్ట్ చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. యువతి కాల్ డేటా, స్థానిక సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తును ముమ్మరం చేశారు. కేవలం డబ్బుల కోసమే ఈ పెళ్లి నాటకం ఆడిందా? లేక దీని వెనుక అంతరాత్మను కదిలించే ఇతర కారణాలున్నాయా? అనే కోణంలో పోలీసులు కూపీ లాగుతున్నారు.
Also Read: ఆగస్టులో విద్యార్థులకు పండగే పండగ..ఏకంగా వారం రోజులకు పైగా సెలవులు!
ALso Read: బంగాళాఖాతంలో వేగంగా మారుతున్న వాతావరణం..తెలుగు రాష్ట్రాలకు తుఫాన్ ముప్పు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
NEET UG Counselling: నీట్ విద్యార్థులకు అలర్ట్..కౌన్సిలింగ్ తేదీల షెడ్యూల్ విడుదల..ఆగస్టు 5 నుంచి రిజిస్ట్రేషన్లు షురూ!
Hyderabad, Telangana:NEET UG Counselling Schedule: వైద్య విద్యనభ్యసించాలనుకునే లక్షలాది మంది విద్యార్థులకు మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (MCC) గుడ్న్యూస్ చెప్పింది. నీట్ యూజీ 2026 కౌన్సెలింగ్ పూర్తి షెడ్యూల్ను అధికారికంగా విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 5 నుంచి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు వెసులుబాటు కల్పించారు.
దేశవ్యాప్తంగా ఉన్న 15 శాతం ఆల్ ఇండియా కోటా (AIQ) కింద ఎంబీబీఎస్ (MBBS), BDS, B.Sc. నర్సింగ్ కోర్సులు, ఇతర కేటగిరీ సీట్ల భర్తీకి ఈ ప్రక్రియ కొనసాగనుంది. పూర్తి ఆన్లైన్ విధానంలో జరిగే ఈ కౌన్సెలింగ్లో పాల్గొనే అభ్యర్థులు ముందుగా MCC (మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ) పోర్టల్లోని ఇన్ఫర్మేషన్ బులెటిన్ను క్షుణ్ణంగా చదవాలని సూచించారు.
మొదటి రౌండ్ కౌన్సెలింగ్ కీలక తేదీల వివరాలు ఇలా ఉన్నాయి..
ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: ఆగస్టు 5, 2026
దరఖాస్తుకు చివరి తేదీ: ఆగస్టు 12, 2026
కాలేజీల ఆప్షన్ల ఎంపిక & లాకింగ్: ఆగస్టు 6 నుంచి ప్రారంభం
మొదటి రౌండ్ సీట్ల కేటాయింపు ఫలితాలు: ఆగస్టు 17, 2026
కాలేజీల్లో రిపోర్టింగ్ (అడ్మిషన్ ప్రక్రియ): ఆగస్టు 18 నుంచి ఆగస్టు 22 వరకు
కౌన్సెలింగ్లో ఎవరు అర్హులు?
నీట్ యూజీ 2026 పరీక్షలో కటాఫ్ మార్కులు సాధించి ఉత్తీర్ణులైన అభ్యర్థులు మాత్రమే ఈ కౌన్సెలింగ్కు అర్హులు. నిర్దేశిత పర్సంటైల్ కలిగి ఉండి, గడువులోగా ఆన్లైన్ దరఖాస్తు పూర్తి చేయాలి. అయితే, స్టేట్ కోటా కింద సీటు కోరుకునేవారు సంబంధిత రాష్ట్ర కౌన్సెలింగ్ అథారిటీ ద్వారా విడిగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఆన్లైన్ రిజిస్ట్రేషన్ విధానం..
1) మొదటగా MCC (మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ) అధికారిక వెబ్సైట్ను సందర్శించండి.
2) హోమ్పేజీలో కనిపించే 'NEET UG Counseling 2026' లింక్పై క్లిక్ చేయండి.
3) మీ నీట్ అప్లికేషన్ నంబర్, పాస్వర్డ్తో లాగిన్ అవ్వండి.
4) రిజిస్ట్రేషన్ ఫారమ్ను పూరించి, నిర్దేశిత కౌన్సెలింగ్ ఫీజు చెల్లించండి.
5) వ్యక్తిగత, విద్యా వివరాలను తప్పులు లేకుండా ఎంటర్ చేసి, అవసరమైన సర్టిఫికెట్లను అప్లోడ్ చేయండి.
6) మీ ప్రాధాన్యత ప్రకారం కాలేజీలు, కోర్సులను ఎంచుకుని (ఆప్షన్స్) లాక్ చేసి తుది దరఖాస్తును సమర్పించండి.
అభ్యర్థులు సిద్ధంగా ఉంచుకోవాల్సిన పత్రాలు..
> నీట్ యూజీ 2026 స్కోర్కార్డ్, అడ్మిట్ కార్డ్
> 10వ తరగతి సర్టిఫికేట్ (పుట్టిన తేదీ ధృవీకరణ కోసం)
> 12వ తరగతి లేదా ఇంటర్ మార్క్షీట్, పాసింగ్ సర్టిఫికేట్
> చెల్లుబాటు అయ్యే ఫోటో ఐడీ ప్రూఫ్ (ఆధార్, పాన్ లేదా ఓటర్ ఐడీ)
> రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు
> రిజర్వేషన్ కోరేవారు కుల ధృవీకరణ పత్రం (క్యాస్ట్ సర్టిఫికేట్)
> దివ్యాంగులు లేదా ప్రత్యేక కోటా అభ్యర్థులు సంబంధిత సర్టిఫికెట్లు
> అడ్మిషన్ సమయంలో అన్ని ఒరిజినల్ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది కాబట్టి వాటిని భద్రపరుచుకోవాలి.
సీట్ల కేటాయింపు ఎలా జరుగుతుంది?
రిజిస్ట్రేషన్లు ముగిసిన తర్వాత అభ్యర్థులు ఇచ్చిన ఆప్షన్ల ఆధారంగా సీట్ల కేటాయింపు ప్రక్రియ చేపడతారు. నీట్ ర్యాంక్, రిజర్వేషన్ నిబంధనలు, కేటగిరీ, కాలేజీల్లో అందుబాటులో ఉన్న సీట్ల సంఖ్య (సీట్ మ్యాట్రిక్స్) తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని పారదర్శకంగా సీట్లను కేటాయిస్తారు.
Also Read: ప్రధాని మోదీని బూతులు పట్టిన యువతి..ఇప్పుడు అమాయకంగా క్షమాపణలు చెబుతోంది!
Also Read; E20 పెట్రోల్తో మైలేజ్ తగ్గుతుందా? రాజ్యసభలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్య
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
India Medals At CWG: కామన్వెల్త్ గేమ్స్లో భారత్కు పతకాల పంట..ఒకే రోజు 8 స్వర్ణ పతకాలు..భారత్ ఖాతాలో 39 పతకాలు!
Hyderabad, Telangana:India Medals At CWG 2026: గ్లాస్గో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్లో భారత అథ్లెట్లు సత్తా చాటుతున్నారు. అంచనాలను మించి రాణిస్తూ దేశ కీర్తిని ప్రపంచ వేదికపై సగర్వంగా నిలబెడుతున్నారు. ముఖ్యంగా బాక్సింగ్ రింగ్లో మన క్రీడాకారులు పవర్ఫుల్ పంచ్లతో ప్రత్యర్థులను చిత్తుచేస్తూ పతకాల వర్షం కురిపించారు. ఒకే రోజు ఏకంగా ఐదు స్వర్ణ పతకాలను కైవసం చేసుకుని చరిత్ర సృష్టించారు. ఈ క్రమంలో కామన్వెల్ గేమ్స్ పదో రోజు నాటికి భారత్ ఖాతాలో పతకాల సంఖ్య 39కి చేరింది.
బాక్సింగ్లో పసిడి పరుగు..
మహిళా, పురుషుల బాక్సింగ్ విభాగాలలో మన వీర వనితలు, వీరులు పవర్ఫుల్ పంచ్లతో ప్రత్యర్థులను చిత్తుచేశారు. మహిళల విభాగంలో ప్రీతి పవార్ (54 కేజీలు), జైస్మిన్ లాంబోరియా (57 కేజీలు), ప్రియా ఘంగాస్ (60 కేజీలు), సాక్షి చౌదరి (51 కేజీలు), అరుంధతి చౌదరి (70 కేజీలు) అద్భుత విజయాలతో స్వర్ణ పతకాలను సాధించారు. లవ్లీనా బోర్గోహైన్ (75 కేజీలు) రజత పతకంతో మెరిశారు.
అదే విధంగా పురుషుల విభాగం సచిన్ శివాచ్ (60 కేజీలు), అంకుష్ పంఘాల్ (80 కేజీలు) పసిడి పతకాలు గెలుచుకోగా.. నరేందర్ బెర్వాల్ (90+ కేజీలు), జదుమణి సింగ్ రజత పతకాలు సాధించారు.
ఇతర క్రీడల్లోనూ మెరిసిన భారత్..
అథ్లెటిక్స్లో పురుషుల 5000 మీటర్ల ఫైనల్లో గుల్వీర్ సింగ్ అద్భుత ప్రదర్శనతో కాంస్య పతకం సాధించి, కామన్వెల్త్ చరిత్రలో ఈ ఈవెంట్లో పతకం సాధించిన తొలి భారతీయ అథ్లెట్గా రికార్డు సృష్టించారు. అలాగే పురుషుల ట్రిపుల్ జంప్లో ప్రవీణ్ చిత్రవేల్ రజతం, సెల్వ ప్రభు తిరుమరన్ కాంస్యం కైవసం చేసుకున్నారు.
పారా షాట్ పుట్: పురుషుల F57 విభాగంలో రాణా (13.40 మీటర్లు) స్వర్ణం సాధించగా, శుభమ్ జుయాల్ రజతం గెలుచుకుని భారత్కు 'వన్-టూ' ఘనతను అందించారు.
జూడో: మహిళల 63-కేజీల విభాగంలో ఉన్నతి శర్మ అద్భుతమైన ఇప్పోన్ విజయంతో కాంస్య పతకాన్ని సొంతం చేసుకున్నారు.
పతకాల పట్టికలో నాలుగో స్థానానికి భారత్
బాక్సర్లు, ఇతర అథ్లెట్ల అసాధారణ ప్రతిభతో భారత్ కామన్వెల్త్ గేమ్స్ పతకాల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకింది. ప్రస్తుతం భారత్ ఖాతాలో మొత్తం 39 పతకాలు (13 స్వర్ణాలు, 17 రజతాలు, 9 కాంస్యాలు) చేరాయి. క్రీడా రంగంలో మహిళలు, పురుషులు ఇద్దరూ సమానంగా రాణిస్తూ దేశకీర్తిని ప్రపంచ వేదికపై చాటుతుండటంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
Also Read: కామన్వెల్త్ గేమ్స్లో అద్భుతం..నీరజ్ చోప్రాకు రజతం..యశ్వీర్ సింగ్కు కాంస్య పతకం
Also Read: కామన్వెల్త్ గేమ్స్లో ఫైనల్కు చేరిన మరో భారత అథ్లెట్..బంగారం వేటలో బాక్సర్ ప్రీతి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
KTR: ఢిల్లీలో కదం తొక్కిన జెన్ జీ.. మెడలు వంచిన మోదీ
Hyderabad, Telangana:KTR Reacts On Gen Z Movement And Students Protest Watch VideoKTR: దేశ తలరాతను నిర్ణయించేది జెన్ జీ ఓటర్లే.. అప్రమత్తం కావాలి: కేటీఆర్
Hyderabad, Telangana:KTR Speech: దేశ తలరాతను నిర్ణయించేది జెన్జీ ఓటర్లేనని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. పత్రికా స్వేచ్ఛపై ఉక్కుపాదం.. నిజాలు చెప్పేవారిని జైల్లో పెడుతున్నారని గుర్తుచేశారు. హేట్ స్పీచ్ బిల్లు తెచ్చే ముందు పాలకులే విద్వేష ప్రసంగాలు మానాలని రేవంత్ రెడ్డికి హితవు పలికారు. మీడియా, రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు కొత్త తరాన్ని అర్థం చేసుకుని మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా తమను తాము మార్చుకోవాల్సిన అవసరం ఉందని గుర్తుచేశారు.
ఓ దినపత్రిక వార్షికోత్సవం సందర్భంగా శనివారం హైదరాబాద్లో నిర్వహించిన 'రాజ్యాంగం-ప్రజాస్వామ్యం-పత్రికా స్వేచ్ఛ' అనే అంశంపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక ప్రసంగం చేశారు. సీపీఐ, సీపీఐ(ఎం), కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్న సభా వేదికపై కేటీఆర్ ఆసక్తికర ప్రసంగం చేశారు. కొందరు సభపైన ఉన్న వారికే చురకలు అంటించారు. కచ్చితంగా కేసీఆర్ ముఖ్యమంత్రిగా తర్వాత జరిగే ఈ పత్రిక వార్షికోత్సవానికి వస్తారని ప్రకటించడం ఆసక్తికరంగా నిలిచింది.
కేసీఆర్ గారు నవతెలంగాణ పత్రిక పుట్టినప్పుడు వచ్చారు..
మళ్లీ 14వ వార్షికోత్సవానికి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా వస్తారు.- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS pic.twitter.com/zm03lJSAtp
— BRS Party (@BRSparty) August 1, 2026
'వచ్చే 2029 ఎన్నికల నాటికి దేశంలో 50 శాతానికి పైగా ఓటర్లు జెన్ జీ యువతే ఉంటారు. దేశ తలరాతను నిర్ణయించేది వారే. దీంతో మీడియా, రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు కొత్త తరాన్ని అర్థం చేసుకుని మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మార్చుకోవాల్సిన అవసరం ఉంది' అని మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. దేశంలో పత్రికా స్వేచ్ఛ క్రమంగా హరిస్తున్నారని.. నిజాలు చెప్పేవారిని జైళ్లకు పంపుతున్నారని, ప్రభుత్వాలు మీడియాను నియంత్రించే ప్రయత్నాలు చేస్తున్నాయని విమర్శించారు.
'ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ఉనికి కోసం పోరాడుతుండగా, సోషల్ మీడియా ప్రభావం వేగంగా పెరుగుతోంది. ఓ సంస్థ అధ్యయనం ప్రకారం 18 నుంచి 24 ఏళ్ల యువతలో 56 శాతం మంది వార్తాపత్రికలు చదవడం లేదు. సోషల్ మీడియా ద్వారానే వార్తలు తెలుసుకుంటున్నారు. నేటి తరం వార్తలను తమకు అవసరమైనప్పుడు మాత్రమే వినియోగిస్తోంది. మీడియా కూడా కాలానికి అనుగుణంగా మారకపోతే వెనుకబడిపోతుంది' అని మీడియా రంగానికి మాజీ మంత్రి కేటీఆర్ హెచ్చరించారు.
A statesman who rises above petty politics. @KTRBRS pic.twitter.com/UK23fi3vra
— Prof Dasoju Sravan Kumar (@sravandasoju) August 1, 2026
'ఢిల్లీలో ఇటీవల యువత చేపట్టిన ఆందోళనలు సంప్రదాయ రాజకీయాలకు భిన్నంగా సాగాయి. కొత్త తరానికి దేశం, సమాజం పట్ల అపారమైన కమిట్మెంట్ ఉందని ఆ ఉద్యమం నిరూపించింది. ప్రధాన మీడియా పట్టించుకోకపోయినా యువత దేశవ్యాప్తంగా చర్చను మార్చగలిగింది' అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గుర్తుచేశారు. దేశంలో మీడియా స్వేచ్ఛపై ఆంక్షలు పెరుగుతున్నాయని, మీడియా మేనేజ్మెంట్, హెడ్లైన్ మేనేజ్మెంట్, నెరేటివ్ మేనేజ్మెంట్ ద్వారా ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
'వార్తను వార్తగా రాసే పరిస్థితి లేకుండా పోయింది. కేంద్రమంత్రి కుమారుడిపై వచ్చిన లైంగిక దాడి ఆరోపణలు, లగచర్ల ఘటన, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల అంశాలను ప్రధాన మీడియా నిర్లక్ష్యం చేసింది' అని మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రభుత్వంలో ఉన్నవారే ముందుగా విద్వేష ప్రసంగాలు మానేసిన తర్వాతే హేట్ స్పీచ్ బిల్లు తీసుకురావాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి సూచించారు. సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ న్యూస్తో పాటు ప్రధాన మీడియాలో వచ్చే తప్పుడు ప్రచారాలపై కూడా ఫ్యాక్ట్ చెక్ జరగాలని మీడియాకు కేటీఆర్ సూచనలు చేశారు.
ప్రగతి భవన్లో 152 బెడ్రూమ్లు ఉన్నాయనే ప్రచారం, కాళేశ్వరం ప్రాజెక్టుపై తప్పుడు ఆరోపణలు, ఫోన్ ట్యాపింగ్ అంశాల్లో జరిగిన ప్రచారాలను ఉదాహరణగా మాజీ మంత్రి కేటీఆర్ ప్రస్తావన చేశారు. మీడియా అధికారాన్ని చూసి భయపడడం ప్రారంభిస్తే ప్రజాస్వామ్యం బలహీనపడుతుందని పేర్కొన్నారు. మంచి జరిగితే మంచిగా, తప్పు జరిగితే తప్పుగా నిర్భయంగా రాయాలని సూచించారు.
Telangana: తెలంగాణ రైజింగ్-2047లో భాగస్వామ్యం కావాలి: ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు పిలుపు
Hyderabad, Telangana:Hyderabad: తెలంగాణ రైజింగ్- 2047 లక్ష్యసాధనలో భాగస్వామ్యం కావాలని కార్పొరేట్ సంస్థలకు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పిలుపునిచ్చారు. 'ఆర్థిక వృద్ధితోపాటు సామాజిక పురోగతి సమాంతరంగా సాగేలా.. ఆవిష్కరణల ద్వారా ఉపాధి అవకాశాలు సృష్టించేలా.. అభివృద్ధి ప్రతి నియోజకవర్గానికి, దాని ఫలాలు సమాజంలోని ప్రతి వర్గానికి చేరేలా ఈ బృహత్తర ప్రణాళికను రూపొందించాం' అని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.
ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా (ఐసీఎస్ఐ), హైదరాబాద్ ఛాప్టర్ ఆధ్వర్యంలో హైదరాబాద్ కొండాపూర్లోని తెలంగాణ కాంట్రాక్టర్స్ కల్చరల్ క్లబ్లో రెండ్రోజుల పాటు జరుగుతున్న ‘50వ సదరన్ ఇండియా రీజినల్ కాన్ఫరెన్స్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్’ను శనివారం మంత్రి శ్రీధర్ బాబు లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం కీలక ప్రసంగం చేశారు. 'కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) ద్వారా తెలంగాణ అభివృద్ధిలో భాగం కావాలి. ప్రభుత్వం, పరిశ్రమలు, సమాజం సమష్ఠిగా కృషి చేస్తేనే రాష్ట్ర సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుంది' అని ప్రకటించారు.
Inaugurated the 50th Southern India Regional Conference of Company Secretaries 2026, organised by the Hyderabad Chapter of The Institute of Company Secretaries of India (ICSI), at the Telangana Contractors Cultural Club, Kondapur.
Glad to interact with over 700 Company… pic.twitter.com/lE40jrBhnE
— Sridhar Babu Duddilla (@OffDSB) August 1, 2026
'తెలంగాణ రైజింగ్-2047' అనేది కేవలం ప్రభుత్వ కార్యక్రమం కాదని.. సమాజంలోని అన్ని వర్గాల భాగస్వామ్యంతో సాకారమయ్యే అభివృద్ధి విజన్ అని శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ఆర్థిక వృద్ధితో పాటు సామాజిక పురోగతి సమాంతరంగా సాగేలా.. ఆవిష్కరణల ద్వారా ఉపాధి అవకాశాలు సృష్టించేలా.. అభివృద్ధి ఫలాలు ప్రతి వర్గానికి చేరేలా ఈ బృహత్తర ప్రణాళికను రూపొందించినట్లు వెల్లడించారు. ఈ లక్ష్య సాధనలో ప్రభుత్వం... పరిశ్రమలు, విద్యాసంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ రంగం భాగస్వామ్యానికి అత్యంత ప్రాధాన్యమిస్తోందని తెలిపారు.
సీఎస్ఆర్ ద్వారా సమాజంలో మార్పు తెచ్చే కార్యక్రమాల అమలుకు, పరిశ్రమల స్థాపనకు సంబంధించి ప్రతి దశలోనూ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు భాగస్వామిగా, సహాయకారిగా ఉంటుందని మంత్రి శ్రీధర్ బాబు భరోసా ఇచ్చారు. ఏఐ, డేటా గవర్నెన్స్, సైబర్ భద్రత వంటి అంశాలు కార్పొరేట్ ప్రపంచంలో కొత్త సవాళ్లుగా మారుతున్న నేపథ్యంలో కంపెనీ సెక్రటరీలు.. కేవలం కంప్లయన్స్ నిపుణులుగా కాకుండా స్ట్రాటజిక్ బోర్డ్ అడ్వైజర్లుగా మారాల్సిన అవసరం ఉందని గుర్తుచేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో కంపెనీలు కేవలం లాభార్జనే కాకుండా సస్టైనబుల్, ఎథికల్ వ్యాపార వృద్ధిపై దృష్టి సారించాలని సూచించారు. మరిన్ని కార్పొరేట్ కంపెనీలు, సంస్థలు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
