icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Pinewz
504251
KASARLA RAMESHKASARLA RAMESHFollow25 Aug 2024, 01:18 pm
0
0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

ED Raids Avinash Reddy: వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి ఈడీ షాక్..ఏపీ, తెలంగాణల్లో 10 చోట్ల ఏకధాటిగా సోదాలు!

Vijayawada, Andhra Pradesh:

ED Raids On MP Avinash Reddy: తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు మరోసారి ఉత్కంఠ రేకెత్తించే రీతిలో విస్తృత స్థాయి సోదాలు చేపట్టారు. ఏపీలోని కడప పార్లమెంటు సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డికి సంబంధించిన నివాసాలు, కార్యాలయాలపై ఏకకాలంలో ఈ తనిఖీలు జరుగుతున్నాయి. మనీలాండరింగ్ ఆరోపణలు, అనుమానాస్పద ఆర్థిక లావాదేవీల దర్యాప్తులో భాగంగా ఈ చర్యలు తీసుకున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

ఈడీ దర్యాప్తు ముఖ్యాంశాలు..
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని ఎంపీ అవినాష్ రెడ్డికి సంబంధించిన వివిధ ప్రధాన ప్రాంతాలలో ఏకకాలంలో మొత్తం 10 చోట్ల ఈడీ అధికారులు ఈ తనిఖీలు నిర్వహిస్తున్నారు.

ప్రధానంగా అనుమానాస్పద ఆర్థిక లావాదేవీలు, మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) నిబంధనల ఉల్లంఘనలు, ఆర్థికపరమైన అక్రమాలపై ఈ విచారణ కొనసాగుతోంది.

ఈ తనిఖీల సమయంలో అధికారులు పలు కీలకమైన పత్రాలు, డిజిటల్ రికార్డులు, బ్యాంకు ఖాతాల వివరాలు, ఆస్తులకు సంబంధించిన కాగితాలను సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సోదాలు కొనసాగుతుండగా ఈ దర్యాప్తునకు సంబంధించి మరిన్ని అధికారిక వివరాలు వెలువడాల్సి ఉంది. 
 

Also Read: "డీఎస్సీ లీకేజీలపై సీబీఐ విచారణ జరపాలి..లోకేష్‌ రాజీనామా చేయాలి" వైఎస్ జగన్‌ డిమాండ్

Also Read: తెలంగాణలో సినిమా థియేటర్లలో కొత్త రేట్లు..నిర్మాతలకు కాంగ్రెస్ ప్రభుత్వం కీలక ఆదేశం

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Toxic Censor Review: 'టాక్సిక్' సెన్సార్ రివ్యూ..బాక్సాఫీస్ వద్ద యశ్ 'టాక్సిక్' ప్రభంజనం సృష్టిస్తుందా?

Hyderabad, Telangana:

Toxic Movie Censor Review: 'కేజీఎఫ్ 1', 'కేజీఎఫ్ 2' చిత్రాల ద్వారా పాన్ ఇండియా రేంజ్ లో విపరీతమైన క్రేజ్, గుర్తింపు తెచ్చుకున్న హీరో యశ్. దాదాపు నాలుగేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత యశ్ హీరోగా నటిస్తూ ప్రేక్షకుల ముందుకు వస్తున్న సరికొత్త చిత్రం 'టాక్సిక్'. ఇటీవల విడుదలైన ఈ సినిమా అఫీషియల్ ట్రైలర్ తో మూవీపై అంచనాలు ఒక్కసారిగా ఆకాశాన్నంటాయి. ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 26వ తేదీన ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కావడానికి సిద్ధంగా ఉంది.

కన్నడ, మలయాళం, తమిళం, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఒకేసారి ఒకే రోజున ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ తరుణంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ కార్యక్రమాలను కూడా అత్యంత వేగవంతం చేసింది. ఈ ప్రతిష్టాత్మక 'టాక్సిక్' చిత్రానికి ప్రతిభావంతురాలైన మహిళా దర్శకురాలు గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహించడం విశేషం. కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్ స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్లపై ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ చిత్రంలో యశ్ సరసన కియారా అద్వానీ, నయనతార, హ్యుమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్ హీరోయిన్లుగా నటించారు.

ఇక 'టాక్సిక్' మూవీ ఇటీవల సెన్సార్ కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈ సినిమా రన్ టైమ్ భారత్ లో మొదట 3 గంటల 15 నిమిషాలుగా ఉంది. అయితే ప్రేక్షకులు బోర్ ఫీల్ కాకుండా మరింత గ్రిప్పింగ్ గా ఉంచేందుకు దానిని 2 గంటల 54 నిమిషాలకు (సుమారుగా 174 నిమిషాలు) కుదించారు. ఈ భారీ రన్ టైమ్ టాక్సిక్ సినిమాకు ప్లస్ అవుతుందా లేదా మైనస్ అవుతుందా అనేది వేచి చూడాలి. ఇక ఈ మూవీ ఇంగ్లీష్ వెర్షన్ ను ప్రపంచవ్యాప్తంగా దాదాపు 3 వేలకు పైగా స్క్రీన్స్ లో రిలీజ్ చేస్తున్నారు. అలాగే ఇండియన్ వెర్షన్ మూవీని కూడా రికార్డు స్థాయిలో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

'ఏ' (A) సర్టిఫికెట్ జారీ..
సెన్సార్ రిపోర్టు ప్రకారం.. టాక్సిక్ సినిమా థియేటర్లలో వేరే లెవెల్ లో ఉండబోతోందనే విషయం స్పష్టమవుతోంది. ఈ సినిమాలో హీరో యశ్ ద్విపాత్రాభినయం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. పాజిటివ్, నెగెటివ్ రెండు క్యారెక్టర్లలో కూడా ఆయన తన నట విశ్వరూపాన్ని చూపించారని సమాచారం. ముఖ్యంగా సెకండాఫ్ లో వచ్చే కొన్ని అద్భుతమైన యాక్షన్ ఎపిసోడ్స్ సినిమా మొత్తానికి మేజర్ హైలైట్ గా నిలవబోతున్నాయని సెన్సార్ సభ్యులు చెబుతున్నారు. ఇదే గనుక నిజమైతే యశ్ కెరీర్ లోనే కాకుండా, మొత్తం భారతీయ చిత్ర పరిశ్రమలోనే టాక్సిక్ మూవీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తుందని గట్టిగా టాక్ వినిపిస్తోంది.

ఒక మహిళా దర్శకురాలు ఇంతటి భారీ యాక్షన్, 'ఏ' సర్టిఫికెట్ ఉన్న సినిమా తీసి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టడం సామాన్యమైన విషయం కాదని నెటిజన్లు సామాజిక మాధ్యమాలలో చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ జోరు 1 మిలియన్ వరకు ఉందని తెలుస్తోంది. ఇక ఈ సినిమా పూర్తి స్థాయి రివ్యూ మరియు టాక్ తెలుసుకోవడం కోసం ప్రేక్షకులు ఆగస్టు 26 వరకు ఆగాల్సిందే. అంతకంటే ముందుగానే ఆగస్టు 22న హైదరాబాద్ లోని మల్లారెడ్డి యూనివర్సిటీలో ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమాన్ని చాలా ఘనంగా నిర్వహించనున్నారు.

Also Read: ఫోక్ డాన్సర్ల వివాదం.. ఈశ్వర్ సాయి భార్యపై రివర్స్ కేసు పెడుతున్న మాధురి రాథోడ్?

Also Read: 'ధురంధర్' నటి ఆయేషా ఖాన్ నిశ్చితార్థం..అతడి ఫొటో సీక్రెట్‌గా..సోషల్ మీడియాలో వైరల్!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Uppal Balu Nagarjuna: నవదీప్, బిందు మాధవి తర్వాత..ఇప్పుడు నాగార్జునపై వీడియో రిలీజ్‌ చేసిన ఉప్పల్ బాలు!

Hyderabad, Telangana:

Uppal Balu Akkineni Nagarjuna: తెలుగు బుల్లితెరపై అత్యంత ప్రజాదరణ పొందిన రియాల్టీ షో 'బిగ్‌బాస్' త్వరలోనే సీజన్ 10తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో, సామాన్యులకు హౌస్‌లోకి వెళ్లే సువర్ణావకాశాన్ని కల్పించేందుకు నిర్వాహకులు 'అగ్నిపరీక్ష 2' ఆడిషన్స్ నిర్వహిస్తున్నారు. అయితే, ఈ ఆడిషన్స్ నుంచి ఎలిమినేట్ అయిన సోషల్ మీడియా ఫేమ్ ఉప్పల్ బాలు వ్యవహారం ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.

జడ్జిలపై సంచలన ఆరోపణలు.. 
ఇటీవల బిగ్‌బాస్ అగ్నిపరీక్ష ఆడిషన్స్‌కు వెళ్లిన ఉప్పల్ బాలు అక్కడ ఎలిమినేట్ అయ్యారు. అనంతరం ఆయన షో జడ్జిలైన నవదీప్, బిందు మాధవి, అభిజిత్‌లపై తీవ్ర ఆరోపణలు చేశారు. ముఖ్యంగా జడ్జి నవదీప్ తన వీడియోలు చాలా వల్గర్ (అసభ్యంగా) ఉంటాయని అంటూ తనను అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు.

మరో జడ్జి బిందు మాధవి తనను 'ట్రాన్స్'వా అని ప్రశ్నించిందని బాలు పేర్కొన్నారు. కేవలం బాలు మాత్రమే కాకుండా, ఎలిమినేట్ అయిన ఇతర కంటెస్టెంట్స్ కూడా నిర్వాహకులు, జడ్జిలపై పలు ఆరోపణలు చేస్తున్నారు.

ట్విస్ట్ ఇచ్చిన ఉప్పల్ బాలు..
అయితే, తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఉప్పల్ బాలు పోస్ట్ చేసిన మరో వీడియో సోషల్ మీడియాను ఊపేస్తోంది. జడ్జిలపై విమర్శలను పక్కన పెట్టి, ఈసారి ఆయన బిగ్‌బాస్ నిర్వాహకులకు, హోస్ట్ నాగార్జునకు నేరుగా ఒక ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. "ప్లీజ్.. ఒక్క అవకాశం ఇవ్వండి.. దయచేసి నన్ను తీసుకోండి" అంటూ ఆయన చేతులు జోడించి వేడుకున్నారు. కనీసం వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారానైనా తనను షోలోకి పంపాలని నాగార్జునను, నిర్వాహకులను కోరారు. ఇదే తన చివరి వీడియో అని స్పష్టం చేశారు.

"రేటింగ్స్ పెంచే బాధ్యత నాదే!" తనకు ఒక్క అవకాశం ఇస్తే తప్పకుండా షో రేటింగ్స్ పెరుగుతాయని, ప్రేక్షకులు కోరుకునే ఫుల్ కామెడీని అందిస్తానని ఉప్పల్ బాలు హామీ ఇచ్చారు. హౌస్‌లో ఏ టాస్క్ ఇచ్చినా తాను ఆడతానని, తన అభిమానులు కూడా తాను బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లాలని బలంగా కోరుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. తనకు మద్దతుగా బిగ్‌బాస్ టీమ్‌కు మెసేజ్‌లు పంపాలని ఫాలోవర్స్‌కు విజ్ఞప్తి చేశారు.

'అడగడంలో తప్పు లేదు కదా' అని ప్రశ్నిస్తూ, అవకాశం ఇస్తే తన సత్తా నిరూపించుకుంటానని ఉప్పల్ బాలు వేడుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుండగా, నెటిజన్ల నుంచి ఉప్పల్ బాలుకు విశేష మద్దతు లభిస్తోంది. మరి ఈ విజ్ఞప్తిపై కింగ్ నాగార్జున, బిగ్‌బాస్ టీమ్ ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.

Also Read: ఫోక్ డాన్సర్ల వివాదం.. ఈశ్వర్ సాయి భార్యపై రివర్స్ కేసు పెడుతున్న మాధురి రాథోడ్?

Also Read: నటి మీనా భర్త మృతి వెనుక అసలు నిజం ఇదే..ఇంటర్వ్యూలో చెబుతూ కంటతడి పెట్టిన హీరోయిన్!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement

Vizag School Tragedy: విశాఖలోని ప్రైవేట్ స్కూల్లో తీవ్ర విషాదం..టీచర్ కొట్టిన తర్వాత కుప్పకూలి యూకేజీ చిన్నారి మృతి!

Visakhapatnam, Andhra Pradesh:

Vizag School Tragedy News: విశాఖపట్నంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నగరంలోని వన్‌ టౌన్‌ పరిధిలోని లిటిల్ గార్డెన్ స్కూల్‌ అనే ప్రైవేట్ పాఠశాలలో దారుణమైన ఘటన జరిగింది. టీచర్ దెబ్బలను తట్టుకోలేక ఆరేళ్ల బాలుడు మృతి చెందినట్లు సమాచారం. హోంవర్క్ చేయలేదనే కారణంతో ఉపాధ్యాయురాలు కొట్టడం వల్లే తమ బిడ్డ ప్రాణాలు కోల్పోయాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

ఏం జరిగిందంటే..?
విశాఖపట్నం వన్‌ టౌన్‌ పరిధిలోని లిటిల్ గార్డెన్ స్కూల్‌ లో ప్రణయ్ తేజ అనే బాలుడు యూకేజీ చదువుతున్నాడు. అయితే క్లాస్‌ రూమ్ లో టీచర్ అందరి హోంవర్క్‌ ను పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో ప్రణయ్​ తేజను హోంవర్క్‌ చేయలేదని ఉపాధ్యాయురాలు బెదిరించారు. దాంతో భయపడిపోయిన ప్రణయ్.. కొట్టొద్దు అంటూ విలపించాడు. అయినా ఆ ఉపాధ్యాయురాలు బాలుడి చెంపపై కొట్టింది. దాంతో బెదిరిపోయిన బాలుడు.. క్లాస్ రూమ్ లోనే స్పృహ కోల్పోయాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీల్లో రికార్డు అయ్యాయి. వెంటనే బాలుడ్ని కేజీహెచ్ కు తరలించారు. అయితే అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న బాలుడి తల్లిదండ్రులు, బంధువులు ఆస్పత్రికి చేరుకుని కన్నీటి పర్యంతం అయ్యారు. మరోవైపు బాలుడు ప్రణయ్ తేజ మృతిపై మంత్రి లోకేశ్ స్పందించారు. టీచర్ కొట్టడంతో చిన్నారి మరణించడం బాధాకరం అని అన్నారు. బాధ్యులు, సంబంధిత పాఠశాల యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు ఉంటాయన్నారు. ప్రణయ్ తేజ తల్లిదండ్రులకు జరిగిన నష్టాన్ని ఎవరూ పూడ్చలేనిదాని.. వారికి తన ప్రగాఢ సంతాపం తెలియజేయడంతో పాటు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ మేరకు ఎక్స్ లో లోకేశ్​ పోస్ట్ పెట్టారు.

ఇక ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టి.. బాధ్యులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇకపై ఏ విద్యార్థి కూడా ఇలాంటి విషాదానికి బలికాకుండా ప్రతి పాఠశాలలో పటిష్టమైన భద్రతా చర్యలు అమలు చేయాలని, ఉపాధ్యాయుల ప్రవర్తనపై కఠిన పర్యవేక్షణ ఉండాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. విద్యార్థులకు విద్యతో పాటు భద్రత కల్పించడం ప్రతి పాఠశాల యాజమాన్యం బాధ్యత అని.. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఘటనను అత్యంత సీరియస్‌గా తీసుకుని కఠిన నిర్ణయాలు అమలు చేయాలని తల్లిదండ్రులతో పాటు స్థానికులు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు.

Also Read: "డీఎస్సీ లీకేజీలపై సీబీఐ విచారణ జరపాలి..లోకేష్‌ రాజీనామా చేయాలి" వైఎస్ జగన్‌ డిమాండ్

Also Read: స్కూల్ విద్యార్థులపై వీధికుక్కల వరుస దాడులు..ఆ స్కూళ్లకు వరుసగా 4 రోజులు సెలవులు!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Lingamaneni Sanjush: కారు ప్రమాదంలో యువతి మృతి.. జనసేన ఎంపీ లింగమనేని రమేశ్‌ కొడుకుపై కేసు

Hyderabad, Telangana:

Lingamaneni Sanjush Accident Case: ఐటీ కారిడార్‌లో భోజనం చేసి రోడ్డు దాటుతూ వెళ్తున్న యువతిని అత్యంత వేగంగా కారుతో దూసుకొచ్చి ఢీకొట్టడంతో ఆమె ఎగిరి కిందపడి దుర్మరణం చెందింది. ఈ ప్రమాదం చేసిందెవరో కాదు ఏపీలోని జనసేన పార్టీ ఎంపీ లింగమనేని రమేశ్‌ కుమారుడు లింగమనేని సంజూశ్‌. ప్రమాదం జరిగి నాలుగు రోజుల తర్వాత పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారం సంచలనం రేపుతోంది. ఇంకా అరెస్ట్‌ చేయకపోవడంతో పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

హైదరాబాద్‌ మాదాపూర్‌లోని ఇన్‌ఆర్బిట్ మాల్‌లోని లైఫ్‌స్టైల్ స్టోర్‌లో పనిచేసే ఇద్దరు మహిళా ఉద్యోగులు భారతి ముఖి (26),  పూజా అశోక్ ఆగస్టు 16న భోజనం కోసం రోడ్డు అవతల ఉన్న హోటల్‌కు వెళ్లారు. భోజనం చేసి వారిద్దరూ మధ్యాహ్నం 3 గంటల సమయంలో తిరిగి విధుల్లో చేరేందుకు వస్తూ రోడ్డు దాటుతున్నారు. ఆ సమయంలో స్పోర్ట్స్‌ కారు (టీజీ09జీ0666) కారు అత్యంత వేగంగా దూసుకువచ్చి భారతి ముఖిని ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు భారతి ముఖి ఎగిరి కిందపడగా.. పూజా అశోక్‌కు స్వల్ప గాయాలయ్యాయి.

కారును ఏపీ రాజ్యసభ సభ్యుడు లింగమనేని రమేశ్‌ కుమారుడు లింగమనేని సంజూశ్‌ డ్రైవింగ్‌ చేస్తున్నాడు. ప్రమాదం అనంతరం వెంటనే తీవ్ర గాయాలపాలైన భారతి ముఖికి హుటాహుటిన అదే కారులో జూబ్లీహిల్స్‌లోని  అపోలో ఆస్పత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు. ప్రమాద సమయంలో భారతి ముఖితో ఉన్న పూజా అశోక్ వెంటనే ఈ విషయాన్ని లైఫ్‌స్టైల్ స్టోర్ మేనేజర్ అశ్విన్ కుమార్‌కు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న అశ్విన్ కుమార్ హుటాహుటిన ఆస్పత్రికి వెళ్లగా భారతి ముఖి అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు.

నిర్లక్ష్యంగా, అతివేగంగా కారు నడిపి భారతి ముఖి మృతికి కారణమైన ఎంపీ కుమారుడు సంజూశ్‌పై మాదాపూర్‌ పోలీసులకు లైఫ్‌స్టైల్‌ స్టోర్‌ మేనేజర్‌ అశ్విన్‌ కుమార్‌ ఫిర్యాదు చేశారు. అడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు క్రైమ్ నంబర్ 1238/2026 నమోదు చేశారు. బీఎన్‌ఎస్ సెక్షన్ 106(1) కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ప్రమాదానికి కారణాలు
నిత్యం బిజీగా ఉండే కేబుల్‌ బ్రిడ్జ్‌ సమీపంలో అత్యంత వేగంగా రావడమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. కారు వేగం, డ్రైవర్ నిర్లక్ష్యం ఉండడంతో పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ప్రమాద సమయంలో రోడ్డు పరిస్థితులు, సీసీటీవీ దృశ్యాలు తదితర అంశాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన ప్రత్యక్ష సాక్షులు, వాహనం వివరాలు, డ్రైవర్ పాత్రపై కూడా దర్యాప్తు కొనసాగుతోంది.

పెద్దల ఒత్తిడి?
ప్రమాదం జరిగి నాలుగు రోజులు గడిచిన తర్వాత నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేయడం విమర్శలకు తావిస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవింగ్‌ చేసిన ఎంపీ కుమారుడు సంజూశ్‌పై చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించినట్లు విమర్శలు వస్తున్నాయి. నాలుగు రోజుల తర్వాత కేసు నమోదు చేసిన పోలీసుల తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తన కుమారుడు సంజూశ్‌ను కాపాడుకునేందుకు ఎంపీ లింగమనేని రమేశ్‌ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు.. పెద్దల ద్వారా పోలీసులపై ఒత్తిడి తీసుకువస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. కాగా మృతురాలు ఒడిశా రాష్ట్రానికి చెందినవారు. కేసు నమోదు కాకుండా తీవ్ర ప్రయత్నాలు జరిగాయని.. మృతురాలి కుటుంబీకులను ప్రత్యేకంగా విమానంలో హైదరాబాద్‌కు రప్పించినట్లు.. బాధితులతో మాట్లాడి వారితో బేరసారాలు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏది ఏమి జరిగినా ఒకరి ప్రాణం తీసిన ఎంపీ కుమారుడిని అరెస్ట్‌ చేసి శిక్ష పడేలా చేయాలనే డిమాండ్‌ వినిపిస్తోంది.

0
0
Report
Advertisement
Advertisement

Konda Surekha: 'నా బిడ్డ కామెంట్లకు నాకేం సంబంధం'.. వివరణ ఇచ్చిన కొండా సురేఖ

Baddipadaga, Telangana:

Konda Susmita vs Revanth Reddy: 'అధికారం వచ్చాక రేవంత్‌ రెడ్డికి కళ్లు నెత్తికి ఎక్కాయని.. ఆయన అవినీతి భాగోతాలు చెబుతానని.. బీసీలను అణగదొక్కుతున్నారు' అని కొండా సుష్మిత వ్యాఖ్యలు చేయడం తెలంగాణలో తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. ఈ వ్యవహారంపై కాంగ్రెస్‌ పార్టీ క్రమశిక్షణా కమిటీ వివరణ ఇవ్వాలని నోటీసు పంపించగా దానికి మంత్రి కొండా సురేఖ స్పందించారు. తన కుమార్తె చేసిన వ్యాఖ్యలకు తనను వివరణ అడగడాన్ని తప్పుబట్టారు. ఆమె వ్యాఖ్యలకు తనకు ఏమిటి సంబంధం అని ప్రశ్నించారు.

టీపీసీసీ క్రమశిక్షణా కమిటీకి మంత్రి కొండా సురేఖ వివరణ ఇచ్చారు. తన వివరణతో కూడిన లేఖను టీసీసీసీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్ మల్లు రవికి పంపించారు. లేఖలో క్రమశిక్షణా కమిటీకి మంత్రి తన వివరణలో స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు. 'ఆగస్టు 19వ తేదీన నా పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ‘కొండా’ కుటుంబ అభిమానులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పలుచోట్ల వేడుకలు నిర్వహించడంతోపాటు సేవా కార్యక్రమాలు చేపట్టారు. నా స్వస్థలమైన గీసుకొండతో నా కూతురు సుస్మితా పటేల్‌కు ఉన్న ప్రత్యేక అనుబంధం కారణంగా అక్కడి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు నిర్వహించిన జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కుమార్తె కొండా సుస్మితా పటేల్ పాల్గొన్నారు' అని కొండా సురేఖ వివరించారు.

ఆ కార్యక్రమంలో తన కుమార్తె చేసిన వ్యాఖ్యలు పూర్తిగా తన వ్యక్తిగత అభిప్రాయమని మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. కుటుంబ బాంధవ్యం కారణంగా ఒకరి వ్యక్తిగత అభిప్రాయాలకు మరొకరు రాజకీయంగా బాధ్యత వహించాలనడం, ఆ ప్రాతిపదికన వివరణ కోరడం సముచితం కాదని మంత్రి సురేఖ పేర్కొన్నారు. తన కుమార్తె చేసిన వ్యాఖ్యలకు తనను బాధ్యురాలిగా చేయడం సహజ న్యాయ స్ఫూర్తికి విరుద్ధమని స్పష్టం చేశారు.

కాంగ్రెస్ పార్టీ నాయకత్వంపై, పార్టీ క్రమశిక్షణా నియమావళిపై తనకు సంపూర్ణ గౌరవం ఉందని మంత్రి కొండా సురేఖ లేఖలో వివరించారు. ప్రజాస్వామ్య విలువలు, వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ఈ విషయంలో తన ప్రమేయం లేదని గుర్తించాలని సూచించారు. తనకు జారీ చేసిన నోటీసును ఉపసంహరించుకోవాలని క్రమశిక్షణా కమిటీకి కొండా సురేఖ విజ్ఞప్తి చేశారు. మరి ఈ వివరణతో క్రమశిక్షణా కమిటీ సంతృప్తి చెందుతుందా? లేదా తదుపరి ఏం జరుగుతుందనేది ఉత్కంఠ నెలకొంది. మరో వైపు కొండా సుష్మితపై కాంగ్రెస్‌ పార్టీ మహిళా నాయకులు రెచ్చిపోతున్నారు. ఆమెపై తీవ్ర విమర్శలతోపాటు ఇష్టారీతిన వ్యాఖ్యలు చేస్తున్నారు. మరి ఈ పరిణామాలు ఎక్కడకు దారి తీస్తాయో వేచి చూడాలి.

0
0
Report
Advertisement

Chandrababu: నదీ జలాలపై దక్షిణాది రాష్ట్రాలు సమన్వయంతో ముందుకుసాగాలి: చంద్రబాబు

Salavankuppam, Tamil Nadu:

Southern Zonal Council Meeting: తెలంగాణ, ఏపీ విభజన జరిగి పుష్కర కాలం దాటినా విభజన చట్టంలోని అంశాలు ఇంకా నెరవేరలేదని దక్షిణాది రాష్ట్రాల సీఎంల సదస్సులో ఏపీ సీఎం చంద్రబాబు ప్రస్తావించారు. విభజన చట్టంలోని షెడ్యూల్ 9, 10 సంస్థలు 12 ఏళ్లుగా ఇంకా విభజనకు నోచుకోలేదని గుర్తుచేశారు. విభజన సమస్యల పరిష్కారానికి కేంద్రం వేగంగా చర్యలు తీసుకోవాలని కోరారు. నదీ జలాల అంశంలో దక్షిణాది రాష్ట్రాలు సమన్వయంతో ముందుకు సాగాలని కోరారు.

మహాబలిపురంలో హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన దక్షిణాది రాష్ట్రాల మండలి సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ సహా దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధి గురించి ప్రస్తావించారు. నదీ జలాలపై దక్షిణాది రాష్ట్రాలు సమన్వయంతో ముందుకుసాగాలని పిలుపునిచ్చారు. దక్షిణాది రాష్ట్రాల మధ్య సహకారమే లక్ష్యం. కేంద్రం, రాష్ట్రాల మధ్య విశ్వాసం, పరస్పర సహకారంతో సమస్యల పరిష్కారం జరగాలి' అని సీఎం చంద్రబాబు సూచించారు. ఏపీ, కర్ణాటక, తమిళనాడును అనుసంధానించే బుల్లెట్ ట్రైన్ కారిడార్‌కు ప్రతిపాదన చేశారు. కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్‌ నడపాలని విజ్ఞప్తి చేశారు. అమరావతి- బెంగళూరు- చెన్నై నగరాలను అనుసంధానించే రవాణా వ్యవస్థ ఉండాలని కోరారు.

'దక్షిణాది రాష్ట్రాల్లో ఉమ్మడి లాజిస్టిక్స్ నెట్‌వర్క్, డ్రై పోర్టులు ఏర్పాటు చేయాలి. దక్షిణాది విద్యుత్ గ్రిడ్‌ను జాతీయ గ్రిడ్‌తో అనుసంధానించాలి. దక్షిణాది రాష్ట్రాల యూనివర్సిటీలు, స్కిల్లింగ్ సంస్థలతో ఉమ్మడి కన్సార్టియం ఏర్పాటు చేయాలి' సమావేశంలో సీఎం చంద్రబాబు కోరారు. విపత్తుల సమయంలో రాష్ట్రాలు పరస్పరం సహకరించుకునే మ్యూచువల్ ఎయిడ్ ఫోర్స్ ఏర్పాటుకు ప్రతిపాదించారు. తిరుపతి నుంచి కాశీ, అయోధ్య, చార్‌ధామ్ వరకు ఉమ్మడి ఆధ్యాత్మిక పర్యాటక సర్క్యూట్ ఏర్పాటు చేయాలని కోరారు.

'దేశ జీడీపీలో దక్షిణాది రాష్ట్రాల వాటా సుమారు 31 శాతం ఉంది. 2047 నాటికి దక్షిణాది ఆర్థిక వ్యవస్థ 10 ట్రిలియన్ డాలర్లకు చేరే అవకాశం ఉంది. వికసిత్ భారత్ నిర్మాణంలో దక్షిణాది కీలక ఆర్థిక శక్తిగా ఎదగాలి' అని చంద్రబాబు తెలిపారు. 'పోలవరం, సౌత్ కోస్ట్ రైల్వే జోన్, అమరావతి ప్రాజెక్టులు  కేంద్ర సహకారంతో సాకారం అవుతున్నాయి. అమరావతికి చట్టబద్ధ రాజధాని హోదా సాధించాం. వనరుల లోటు, సెక్షన్ 56లోని అంశాలను పరిష్కరించాలి. దుగ్గరాజుపట్నం పోర్టు, రిఫైనరీ ప్రతిపాదనలకు వేగంగా అనుమతులు ఇవ్వాలి' అని సీఎం చంద్రబాబు కోరారు. విశాఖ, విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టులకు కేంద్రం అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కడప జేఎస్‌డబ్ల్యూ రైల్వే లింక్‌కు కేంద్ర అనుమతులు ఇవ్వాలన్నారు.

గోదావరి–కావేరి నదుల అనుసంధానంతో 500 టీఎంసీలకు పైగా నీటిని మళ్లించే ప్రతిపాదన సీఎం చంద్రబాబు చేశారు. గోదావరి–కావేరి అనుసంధానంతో తమిళనాడు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం అని పేర్కొన్నారు. నదీ జలాలపై ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు సమన్వయంతో ముందుకు సాగాలని కోరారు. గంగా–కావేరి నదుల అనుసంధానానికి దీర్ఘకాలిక జాతీయ ప్రణాళిక అవసరం అని గుర్తుచేశారు. నదుల అనుసంధానంపై కాలపరిమితితో కూడిన డీపీఆర్‌లు, అనుమతులు ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. సహకారం, సమన్వయంతోనే దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధి సాధ్యం అని ప్రకటించారు.

0
0
Report

YS Jagan DSC Demands: "డీఎస్సీ లీకేజీలపై సీబీఐ విచారణ జరపాలి..లోకేష్‌ రాజీనామా చేయాలి" వైఎస్ జగన్‌ డిమాండ్‌!

Vijayawada, Andhra Pradesh:

YS Jagan Demands CBI Enquiry On DSC: ఆంధ్రప్రదేశ్‌ గతంలో జరిగిన మెగా డీఎస్సీ (DSC) పరీక్షల నిర్వహణలో జరిగిన లీకేజీలు, అక్రమాలపై తక్షణమే సీబీఐ (CBI) విచారణ జరిపించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్‌.జగన్‌ డిమాండ్ చేశారు. డీఎస్సీ, ఏపీపీఎస్‌సీ (APPSC) అంశాలకు సంబంధించిన సాక్ష్యాలు, ఆధారాలను ఆయన మీడియా సమావేశంలో ప్రజల ముందుకు ఉంచారు. 

డీఎస్సీలో అక్రమాలు జరిగాయని తాము లేవనెత్తిన అంశాలన్నీ వాస్తవాలేనని క్రమంగా ప్రభుత్వమే అంగీకరించే పరిస్థితి వచ్చిందని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పేర్కొన్నారు. తప్పు చేశారు కాబట్టే ప్రభుత్వం గింజుకుంటోంది కానీ, సీబీఐ విచారణకు మాత్రం ముందుకు రావడం లేదని జగన్‌ ఆరోపించారు. 

ఈ అక్రమాలను గట్టిగా లేవనెత్తుతామనే భయంతోనే తమకు ప్రధాన ప్రతిపక్షంగా గుర్తింపు ఇవ్వడం లేదని, చివరికి ప్రతిపక్షం లేకుండానే సభను నడుపుతున్నారని జగన్ విమర్శించారు. ప్రత్యర్థి జట్టు లేని చోట, బౌలింగ్, ఫీల్డింగ్ లేకుండా తండ్రీ కొడుకులు ఇద్దరూ బ్యాటింగ్ చేసుకుంటూ తాము అద్భుతంగా చేశామని చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

డీఎస్సీ లీకేజీలపై చర్చ జరపాలని డిమాండ్ చేస్తూ తమ ఎమ్మెల్సీలు (MLCలు) నాలుగు రోజుల పాటు శాసనమండలిని స్తంభింపజేసినా ప్రభుత్వం చర్చకు సిద్ధపడలేదని వైఎస్ జగన్ మండిపడ్డారు. ఈ అక్రమాలకు బాధ్యత వహిస్తూ లోకేష్‌ తన మంత్రి పదవికి రాజీనామా చేసి తప్పుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.

అలాగే డీఎస్సీ పరీక్షల ప్రశ్నల తయారీ, పరీక్ష నిర్వహణ అనే రెండు కీలక బాధ్యతలను ఒకే అధికారి చేతిలో పెట్టడం ద్వారా పారదర్శకతకు పాతరవేసి, లీకేజీలకు స్వయంగా ద్వారాలు తెరిచారని వైఎస్‌ జగన్‌ ఆరోపించారు. ప్రశ్నల తయారీ అనేది ఎస్సీఈఆర్టీ (SCERT) డైరెక్టర్ బాధ్యత కాగా, పరీక్ష నిర్వహించే బాధ్యత డీఎస్సీ కన్వీనర్‌దని ఆయన అన్నారు. 

అయితే, ఈ రెండింటినీ ఒకే వ్యక్తికి అప్పగించినట్లు లోకేష్‌ స్వయంగా అంగీకరించడమే కాకుండా, అందులో తప్పేముందని దబాయించారని విమర్శించారు. ఈ రెండు వ్యవస్థల మధ్య ఉండాల్సిన కనీస నియంత్రణలను ఎందుకు తొలగించారో.. అలాగే ఒకే వ్యక్తి చేతిలో రెండు కీలక బాధ్యతలు ఎందుకు పెట్టారో తేలడానికి దర్యాప్తు జరగాలని జగన్ డిమాండ్ చేశారు. 

అవుట్‌సోర్సింగ్ ఉద్యోగి 'నవీన్' వివాదం.. 
డీఎస్సీ ప్రశ్నపత్రాలు తయారు చేసే విభాగంలో పనిచేసిన అవుట్‌సోర్సింగ్ ఉద్యోగి 'నవీన్'కు పరీక్షలో ఫస్ట్ ర్యాంక్ రావడం వాస్తవమేనని ప్రభుత్వం ఒప్పుకుందని వైఎస్ జగన్‌ తెలిపారు. క్వశ్చన్ బ్యాంక్ యాక్సెస్ ఉన్న నవీన్‌కు మొదటి ర్యాంక్ రావడంతో లీకేజీ స్పష్టంగా జరిగిందని, ఇది బయటపడితే గొడవ అవుతుందనే భయంతోనే మెరిట్ లిస్ట్ మార్చి అతనిని పక్కన పెట్టారని ఆయన ఆరోపించారు. మొదటి మెరిట్ లిస్టులో ఉన్న నవీన్ పేరును తొలగించి, రెండవ మెరిట్ లిస్టును ఎందుకు తెచ్చారని ప్రశ్నించారు. 

సీబీఐ దర్యాప్తునకు డిమాండ్..
నవీన్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు రాలేదు కాబట్టే ఉద్యోగం ఇవ్వలేదని తండ్రీ కొడుకులు ఇద్దరూ అసెంబ్లీలో, కోర్టులో అధికారుల చేత చెప్పించారని విమర్శించారు. అయితే, అభ్యర్థి ఐడీని బ్లాక్ చేసి, కనీసం కాల్ లెటర్ కూడా పంపనప్పుడు నవీన్ వెరిఫికేషన్‌కు ఎలా రాగలుగుతాడని ప్రశ్నించారు. దీనికి సంబంధించిన ఆధారాలతో నవీన్ హైకోర్టులో అఫిడవిట్ కూడా వేశాడని పేర్కొన్నారు. అసెంబ్లీలో వీటికి తండ్రీ కొడుకులు (చంద్రబాబు, లోకేష్) సమాధానం ఎందుకు చెప్పలేదని జగన్ నిలదీస్తూ, ఈ తప్పులన్నింటిపై తక్షణమే సీబీఐ దర్యాప్తు జరగాలని డిమాండ్ చేశారు.

Also Read: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల ముందు కీలక అప్‌డేట్..మరి ప్రతిపక్ష వైసీపీ పరిస్థితి ఇదే

Also Read: తూర్పు గోదావరి జిల్లాలో తీవ్ర విషాదం.. నదిలో దూకిన ఏఈ కుటుంబం..ముగ్గురు గల్లంతు!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement
Advertisement
Back to top