icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Pinewz
504251
KASARLA RAMESHKASARLA RAMESHFollow25 Aug 2024, 01:18 pm
0
0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

పేరు మార్చికుని హిందూ మహిళలకు వల.. లీకైన రొమాన్స్‌ వీడియోలు..

Hyderabad, Telangana:

Karnataka Gym Jihad Case Latest News: కర్ణాటకలోని దవాణగెరెలో కలకలం రేపిన జిమ్ జిహాద్ ఉదంతం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. హిందూ మహిళలను లక్ష్యంగా చేసుకుని.. పేర్లు మార్చుకుని మోసాలకు పాల్పడిన జిమ్ ట్రైనర్ వ్యవహారం బయటపడటంతో స్థానికులు, హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఇటీవలే సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు లీక్‌ అవ్వడంతో జిమ్‌లో జరిగిన అసలు విషయాలు బయటపడుతున్నాయి. అసలు లీక్‌ అయిన వీడియోలేంటి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఆకాష్‌గా మారిన ఇస్మాయిల్..
దవాణగెరెలోనిపవర్ ఫిట్‌నెస్ క్లబ్‌లో ట్రైనర్‌గా పనిచేస్తున్న ఇస్మాయిల్ అనే వ్యక్తి, జిమ్‌కు వచ్చే హిందూ మహిళలను బుట్టలో వేసుకోవడానికి తన పేరును ఆకాష్‌గా మార్చుకున్నాడు. తాను కూడా హిందువునని నమ్మించి.. ఎంతోమంది అమాయక మహిళలతో పరిచయాలు పెంచుకున్నాడు. వారి నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని వారితో అసభ్యకరంగా ప్రవర్తించడమే కాకుండా.. వారి ప్రైవేటు ఫోటోలను సేకరించినట్లు కూడా తెలస్తోంది.. అంతేకాకుండా ఇస్మాయిల్ కొంతమంది హిందూ మహిళతో జిమ్‌లో రొమాన్స్‌ కూడా చేశారని ఆరోపనలు వస్తున్నాయి. అలాగే వీటికి సంబంధించిన వీడియోలు కూడా ఇటీవలే సోషల్ మీడియాలో లీక్‌ అయ్యాయి.

దారుణమైన బ్లాక్‌మెయిలింగ్.. 
నిందితుడు ఇస్మాయిల్ మహిళల అసభ్యకర ఫోటోలను చూపిస్తూ.. వారిని తీవ్రంగా బ్లాక్‌మెయిల్ చేసినట్లు కూడా సమాచారం. ఈ వేధింపులు భరించలేక, సమాజంలో తలదించుకోలేక ఒక వివాహిత పాయిజన్ తాగి ఆత్మహత్యకు యత్నించడం నగరంలో తీవ్ర సంచలనం సృష్టించింది. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది.

పవర్ ఫిట్‌నెస్ క్లబ్ వద్ద భారీ నిరసన.. 
ఈ విషయం లీక్ అవ్వడంతో దవాణగెరెలో హిందూ సంఘాలతో పాటు బాధిత కుటుంబాలకు సపోర్ట్‌గా పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చారు. పవర్ ఫిట్‌నెస్ క్లబ్ ముందు భారీ ఎత్తున నిరసన చేపట్టారు. ఆగ్రహంతో నిరసనకారులు జిమ్ ఎదుట ఉన్న ఫ్లెక్స్ బోర్డులను పూర్తిగా చింపివేసి.. ధ్వంసం చేశారు. నిందితుడికి వ్యతిరేకంగా, జిమ్ యాజమాన్యానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

పరిస్థితి అదుపు తప్పుతుండటంతో రంగంలోకి దిగిన పోలీసులు.. నిందితుడు ఇస్మాయిల్‌ను ఇప్పటికే అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే కేవలం అరెస్ట్ చేస్తే సరిపోదని.. ఇటువంటి ఉన్మాదులను దేశం నుంచే బహిష్కరించాలని నిరసనకారులు హిందూ సంఘాలు గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి. 

Also Read: యోగి కాబినేట్ మరో కీలక నిర్ణయం.. ఉత్తర ప్రదేశ్‌లో జలాలాబాద్‌కు పేరు మార్పు..

Also Read: ముంబై, పూణెలను ముంచెత్తిన వర్షాలు.. స్కూళ్లకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

0
0
Report

Venu Swamy Divya Bharathi: "ఆ స్టార్ హీరోయిన్‌తో కలిసి నా బైక్‌పై ఊరంతా తిరిగేవాళ్లం" వేణుస్వామి సంచలన వ్యాఖ్యలు!

Hyderabad, Telangana:

Venu Swamy On Divya Bharathi: ప్రముఖ జ్యోతిష్కుడు వేణుస్వామి గురించి తెలుగు రాష్ట్రాల్లో పరిచయమైన వ్యక్తే. అందులోనూ సినీ రంగానికి సంబంధించిన కొన్ని జాతకాలు.. వారివారి భవిష్యత్తు గురించి తరచూ ప్రస్తావిస్తూ వస్తారు. సమంత - నాగచైతన్య విడాకులను కూడా ఈయన ముందే గ్రహించి జాతకాలను బయటపెట్టడం గమనార్హం. అయితే ఆ తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ గురించి కూడా వేణు స్వామి చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. అయితే ఆ తర్వాత ఏపీ రాజకీయాల గురించి కూడా కొన్ని ప్రిడిక్షన్స్ చెప్పిన మాట వాస్తవమే. 

అయితే 2024 ఎన్నికల్లో జనసేన పార్టీ నుంచి పోటీ చేసిన నటుడు పవన్ కళ్యాణ్‌కు ఘోర పరాజయం తప్పదని జ్యోతిష్కుడు వేణు స్వామి వెల్లడించాడు. అలాగే అప్పటి ముఖ్యమంత్రి జగన్‌ మరోసారి అధికారం చేపట్టే అవకాశం ఉందని చెప్పాడు. అయితే ఆయన చెప్పిన దానికి పూర్తి వ్యతిరేకంగా జరగడం వల్ల ఆయన జ్యోతిషం ఇకపై చెప్పనని శపథం చేశాడు. 

అప్పట్లో ఇతనిపై ఏపీలోని కూటమిలో జతకట్టిన తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీలకు చెందిన కార్యకర్తలు గట్టిగానే ట్రోల్స్ చేశారు. ఆ దెబ్బతో సైలెంట్‌గా మారిన జోతిష్కుడు వేణుస్వామి.. తాజాగా మరో సంచలన విశేషాలతో ఆయన బయటకు వచ్చాడు. తన వ్యక్తిగత విశేషాలను పంచుకుంటూనే.. తనతో ఓ హీరోయిన్ చనువుగా ఉందని చెప్పుకొచ్చాడు. ఇప్పుడా విషయం సినీవర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే ఇతనితో చనువుగా ఉన్న హీరోయిన్ ఎవరు? వీరిద్దరి మధ్య కథేంటి అనే విశేషాలను ఇప్పడు తెలుసుకుందాం. 

వేణుస్వామి చెప్పిన కథేంటి?
తెలంగాణ రాష్ట్రంలో మెదక్ జిల్లా గోమారంలో జన్మించిన జోతిష్కుడు వేణుస్వామి.. కేవలం తొమ్మిదో తరగతి వరకే చదువుకున్నాడట. ఆయన చిన్నతనం నుంచే పూజలు చేసేవాడినని ఆయన చెప్పుకొచ్చాడు. 11 ఏళ్ల వయసులో తండ్రిని కోల్పోయిన ఆవేదనలో.. తన అన్న రఘునాథ చారి వద్ద ఉంటూనే పౌరోహిత్యాన్ని ఆచరించినట్లు ఆయన వెల్లడించాడు. హైదరాబాద్ వచ్చిన తర్వాత 10, ఇంటర్, డిగ్రీ పూర్తి చేసినట్లు వేణుస్వామి అన్నారు. డిగ్రీలో అఖిల భారత విద్యార్థి పరిషత్‌లో సైతం పనిచేసినట్లు తెలిపారు. తన తండ్రికి గుడిలో దక్కని గౌరవం చూసి.. జనాల నుంచి అదే గౌరవాన్ని పొందనాలనే కోరిక చిన్నతనం నుంచి కలిగిందని వేణుస్వామి అన్నారు. 

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి బావమరిది చంద్ర ప్రతాప్ రెడ్డి పరిచయడతో జ్యోతిష్య రంగంలోకి ప్రవేశించినట్లు వేణుస్వామి చెప్పారు. ఆ తర్వాత అందులో లోతుగా అధ్యయనం చేసి పూర్తిగా దాన్ని వృత్తిగా స్వీకరించినట్లు స్పష్టం చేశారు. సాధారణ పూజలకు భిన్నంగా.. త్వరితగతిన ఫలితాలు అందించేలా వామాచారా మార్గాన్ని అనుసరించినట్లు బహిరంగంగా వెల్లడించారు. వామాచారం, దశమహావిద్యలు వంటి కఠినమైన పరిష్కారలను చూపుతాయని.. సాధారణ జీవితం కోటిశ్వరుడిగా మారేందుకు సహాయపడతాయని వేణు స్వామి చెప్పారు. 

అయితే తన యుక్త వయసులో ఉన్నప్పుడు బాలీవుడ్ హీరోయిన్ దివ్య భారతితో తన బైక్‌పై తిరిగినట్లు వేణు స్వామి గుర్తు చేసుకున్నారు. ఆనాటి నటీనటులు టీ తాగేందుకు కూడా బయటకు వచ్చే వాతావరణం ఉండేదని ఆయన వెల్లడించారు. అలాగే పరిటాల రవి ఇంట్లో కూడా పూజలు చేసినట్లు వేణుస్వామి తెలియజేశారు. తాను కింగ్ అవ్వడం తన లక్ష్యం కాదని.. కింగ్ మేకర్ గా మారేందుకు తాను ఇష్టపడతానని ఈ సందర్భంగా తన మనసులోని మాట బయటపెట్టారు. అందుకు సంబంధించిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

Also Read: 'తబాహీ' సాంగ్‌లో కియారా అద్వానీ అందాలు అరబోత..ఆ సినిమాకు ఎంత డబ్బు తీసుకుందో తెలుసా?

ALso Read: విద్యార్థులు ఎగిరి గంతేసే వార్త..రేపటి నుంచి వరుసగా 3 రోజులు సెలవులు..పండగే పండగ!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

స్వదేశానికి మన దేవుళ్లు.. ఆస్ట్రేలియా నుంచి భారత్‌కి 3 అరుదైన విగ్రహాలు!

Hyderabad, Telangana:

Stolen Ancient Idols Returned News: దేశ సంస్కృతి, ఆధ్యాత్మిక వైభవానికి ప్రతిరూపాలైన పురాతన దేవాలయ విగ్రహాలు ఎట్టకేలకు స్వదేశానికి చేరనున్నాయి. గతంలో తమిళనాడులోని ప్రముఖ ఆలయాల నుంచి దొంగిలించిన.. విదేశాలకు అక్రమంగా తరలించి.. ఆరు పురాతన విగ్రహాలను తిరిగి తీసుకువచ్చేందుకు తమిళనాడుకు సంబంధించిన ప్రత్యేక పోలీసు బృందం (Idol Wing) తీవ్ర ప్రయత్నాలు చేసింది.. ఈ క్రమంలో మొదటి విడతగా ఆస్ట్రేలియాలో ఉన్న మూడు అత్యంత విలువైన విగ్రహాలను భారతదేశానికి అప్పగించేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం అధికారికంగా అంగీకరించింది..

ప్రధాని మోదీకి అప్పగించిన విగ్రహాలు..
ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అక్కడి ప్రభుత్వం ఈ మూడు పురాతన విగ్రహాలను అధికారికంగా అందించింది.. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక సహాయంతో ఈ విగ్రహాలను విమానంలో ఢిల్లీకి తరిలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఢిల్లీ నుంచి.. తమిళనాడుకు చెందిన పోలీసులు భద్రత నడుమ వీటిని రాష్ట్రానికి తీసుకువచ్చి.. అవి ఏ ఆలయాలకు సంబంధించినవో ఆయా పుణ్యక్షేత్రాలలో శాస్త్రోక్తంగా పునఃప్రతిష్ఠించనున్నారు.

ఆస్ట్రేలియా నుంచి వస్తున్న మూడు విగ్రహాలు ఇవే.. 
భారతదేశానికి తిరిగి వస్తున్న మూడు విగ్రహాలలో ఒక్కోదానికి ఒక్కో విశిష్టమైన చరిత్ర ఉందని అధికారులు తెలుపుతున్నారు. ఇందులో త్రిశూల భద్రకాళి అమ్మవారి విగ్రహానికి చాలా ప్రత్యేకమైన ప్రాముఖ్య ఉంది. ఈ అపురూపమైన విగ్రహం తమిళనాడులోని తిరువారూర్ జిల్లా, కడువన్గుడి గ్రామంలో వెలసిన సుప్రసిద్ధ కైలాసనాథర్ ఆలయం నుంచి దొంగిలించిన్నట్లు తెలుస్తోంది. 

Also Read: యోగి కాబినేట్ మరో కీలక నిర్ణయం.. ఉత్తర ప్రదేశ్‌లో జలాలాబాద్‌కు పేరు మార్పు..

ఇక శివుని వాహనమైన ఈ పవిత్ర నంది విగ్రహం కూడా అదే కైలాసనాథర్ ఆలయానికి చెందినదిగా పోలీసులు గుర్తించారు. మూడవది షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం.. ఆరు తలలతో ఎంతో కళాత్మకంగా చెక్కిన ఈ సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం తంజావూరు జిల్లా, కుంభకోణం సమీపంలోని మానంబాడి గ్రామంలో ఉన్న ప్రసిద్ధ నాగనాథస్వామి ఆలయం నుంచి తీసుకెళ్లిన్నట్లు తెలుస్తోంది.

తమిళనాడు సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడటంలో అక్కడి పోలీసు విభాగం సాధించిన మరో మైలురాయి ఇదని అధికారులు తెలుపుతున్నారు. విదేశాల్లో ఉన్న మిగిలిన విగ్రహాలను కూడా త్వరలోనే దేశానికి తీసుకువస్తామని.. అక్రమ రవాణా చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తమిళనాడు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.

Also Read: ముంబై, పూణెలను ముంచెత్తిన వర్షాలు.. స్కూళ్లకు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

0
0
Report
Advertisement

Lulu Mall: వీటిపై 50 శాతం డిస్కౌంట్‌.. Hyundai i20 కారు గెలుచుకునే ఛాన్స్‌..

Hyderabad, Telangana:

Lulu Mall Hyderabad Sale News: షాపింగ్ ప్రియులకు ఒక అద్భుతమైన గుడ్‌న్యూస్‌.. కూకట్‌పల్లిలోని లులు మాల్ (Lulu Mall) అద్భుతమైన లులు ఆన్ సేల్ (Lulu On Sale) షాపింగ్ ఫెస్టివల్‌తో ప్రారంభించింది.. ఈ సేల్‌ జూలై 9వ తేదీ నుంచి ప్రారంభమై.. జూలై 12 వరకు నాలుగు రోజుల పాటు కొనసాగుతుందని లులు సంస్థ వెల్లడించింది.. ఈ నాలుగు రోజులు మాల్ ఉదయం 9 గంటల నుంచే ప్రారంభమవుతుంది. ఇందులో భాగంగా చాలా రకాల వస్తువులు అత్యంత చీప్‌ ధరలకే లభిస్తాయి. అయితే, వేటిపై ఆఫర్స్‌ లభిస్తున్నాయో.. ఇప్పుడు మనం తెలుసుకుందాం.

వీటిపై ఫ్లాట్ 50 శాతం డిస్కౌంట్..
ఈ సేల్‌లో భాగంగా 200పైగా దేశీయ, ఇంటర్నేషన్‌ బ్రాండ్‌లకు సంబంధించిన పైగా వస్తువులపై డిస్కౌంట్‌ ఆఫర్స్‌ అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా దుస్తులతో పాటు చెప్పులు, బ్యాగులతో పాటు లైఫ్‌స్టైల్ యాక్సెసరీలపై ఏకంగా 50 శాతం ఫ్లాట్ డిస్కౌంట్లు లభిస్తున్నాయి. టాప్ బ్రాండెడ్ ఉత్పత్తులను సగం ధరకే సొంతం చేసుకునే అవకాశం లభిస్తోంది.

లులు హైపర్‌మార్కెట్‌లో బంపర్ ఆఫర్లు..
మాల్‌లోని లులు హైపర్‌మార్కెట్‌లో నిత్యావసర సరుకులు (Groceries), ఎలక్ట్రానిక్స్, హోమ్ అప్లయన్సెస్, ఫ్యాషన్ విభాగాలకు సంబంధించిన దాదాపు 25,000 పైగా వస్తువులపై 50 శాతం వరకు ఫ్లాట్  డిస్కౌంట్ లభిస్తోంది. దీంతో మిడిల్ క్లాస్ నుంచి హై క్లాస్ వరకు అందరికీ ఇది రీజనబుల్ షాపింగ్‌గా మారుతుందని సంస్థ తెలిపింది.. ఇక ఫుడ్ కోర్టులో కూడా కస్టమర్ల కోసం ప్రత్యేక ఆఫర్లను అందుబాటులో ఉన్నాయి..

రూ.2999 షాపింగ్ చేస్తే.. కారు గెలుచుకునే అవకాశం..
ఈ సేల్‌లో భాగంగా లులు కంపెనీ ప్రత్యేకమైన లక్కీ డ్రాను కూడా అందుబాటులో ఉంచింది.. ఇందులో భాగంగా లులు మాల్ హ్యాపీనెస్ (Happiness Membership) లాయల్టీ మెంబర్‌షిప్ ఉన్న కస్టమర్లు రూ.2,999 లేదా అంతకంటే ఎక్కువ విలువైన షాపింగ్ చేస్తే.. వారు లక్కీ డ్రాలో పాల్గొనే అవకాశం కూడా అందిస్తోంది. ఈ డ్రాలో విజేతలైన వారికి సంస్థ హ్యుందాయ్ i20 (Hyundai i20) కారును బహుమతిని అందిస్తున్నారు. అంతేకాకుండా, ఈ ప్రత్యేకమైన మెంబర్‌షిప్‌ కలిగిన వారికి జూలై 8 నుంచే ముందస్తుగా (Early Access) సేల్‌లో పాల్గొనే ప్రత్యేక అవకాశం లభిస్తోంది.

Also Read: Xiaomi 18 Pro: ఐఫోన్, సాంసంగ్‌లకు చుక్కలు చూపించేలా షామీ కొత్త ఫ్లాగ్‌షిప్.. ఫీచర్లు లీక్!

పిల్లల కోసం ఫన్‌తురాలో డబుల్ ధమాకా..
షాపింగ్‌కు వచ్చే పిల్లల కోసం మాల్‌లోని గేమింగ్ జోన్ ఫన్‌తురా (Funtura) అద్భుతమైన ఆఫర్‌ను అందిస్తోంది. ఈ నాలుగు రోజుల్లో రూ.2,000 లేదా అంతకంటే ఎక్కువ రీఛార్జ్ చేసుకునే వారికి 100 శాతం వరకు ప్రత్యేకమైన బోనస్‌తో పాటు ఉచిత రైడ్ కూపన్లను కూడా అందిస్తోంది. ఈ భారీ డిస్కౌంట్ సేల్ కారణంగా మాల్‌కు భారీగా కస్టమర్స్‌ వచ్చే అవకాశం ఉంది.. కస్టమర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా లులు మాల్ యాజమాన్యం ప్రత్యేకమైన చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది..

Also Read: Xiaomi 18 Pro: ఐఫోన్, సాంసంగ్‌లకు చుక్కలు చూపించేలా షామీ కొత్త ఫ్లాగ్‌షిప్.. ఫీచర్లు లీక్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

0
0
Report

ఉత్తరాంధ్రకు వరం కానున్న భోగాపురం ఎయిర్‌పోర్ట్! ఎప్పటినుంచి ఫ్లైట్స్ నడుస్తాయి? ఎవరికి లాభం? లొకేషన్, ఫ్లైట్స్ ఫెసిలిటీస్ ఇవే!

Hyderabad, Telangana:

Bhogapuram Airport Updates: భోగాపురం ఎయిర్‌పోర్ట్ అందుబాటులోకి వస్తే విశాఖపట్నానికి రెండు విమానాశ్రయాల సౌకర్యం లభిస్తుంది. విశాఖపట్నం నుండి ఈ ఎయిర్‌పోర్ట్ ఎంత దూరంలో ఉంది? ప్రయాణికులు ఎప్పటి నుండి రాకపోకలు సాగించవచ్చు? అల్లూరి సీతారామరాజు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఇప్పుడు నిజం కానుంది. ఈ విమానాశ్రయానికి సంబంధించి ఏరోడ్రమ్ లైసెన్స్ ప్రక్రియ కూడా ఇటీవల పూర్తయింది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, విమానాశ్రయ నిర్మాణ పనులు 100 శాతం పూర్తయ్యాయని, అన్ని చట్టబద్ధమైన తనిఖీలు, భద్రతా ధ్రువీకరణలు, కార్యాచరణ పరీక్షలు పూర్తి అయ్యాయని తెలిపారు. అంతేకాకుండా, పీఎంఓ ఆఫీస్ కూడా ప్రారంభోత్సవ తేదీకి సంబంధించి ఏర్పాట్లు చేస్తోంది. ఈ మాసం చివరి వారంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా ఈ విమానాశ్రయాన్ని ప్రారంభిస్తారు. 2026 డిసెంబర్ నాటికి నిర్మాణ పనులు పూర్తిగా పూర్తవుతాయి. కేంద్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, జీఎంఆర్ గ్రూప్, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సంయుక్త కృషితో నిర్ణీత గడువు కంటే ఆరు నెలల ముందే పనులు పూర్తయ్యాయని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.

భోగాపురం ఎయిర్‌పోర్ట్ ఎక్కడుంది?
ఉత్తరాంధ్ర ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఈ విమానాశ్రయం విజయనగరం జిల్లాలో ఉంది. ఇది విశాఖపట్నం నుండి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. విశాఖపట్నం మెట్రోపాలిటన్, కోస్తా ఆంధ్ర ప్రాంతానికి ఇది ఒక ప్రధాన అంతర్జాతీయ విమానాశ్రయంగా మారుతుంది. ప్రస్తుతం విశాఖపట్నంలో భారత నౌకాదళానికి చెందిన వైమానిక స్థావరంతో పాటు విమానాశ్రయం అందుబాటులో ఉంది. అయితే, త్వరలోనే ఈ కొత్త గ్రీన్ ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం కూడా అందుబాటులోకి రానుంది. దీనివల్ల విశాఖపట్నంతో పాటు ఈ ప్రాంతం ఒక ప్రధాన వాణిజ్య విమానయాన కేంద్రంగా అభివృద్ధి చెందుతుంది.

జీఎంఆర్ గ్రూప్ 2200 ఎకరాల విస్తీర్ణంలో సుమారు రూ. 4,500 కోట్ల వ్యయంతో ఈ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేస్తోంది. ఏటా 40 మిలియన్ల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించేలా, 20 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల కార్గో టర్మినల్, అత్యాధునిక పార్కింగ్ సౌకర్యాలతో దీనిని నిర్మించారు. ఇందులో అధునాతన బ్యాగేజీ హ్యాండ్లింగ్ మరియు సెక్యూరిటీ చెకింగ్ వ్యవస్థలు ఉంటాయి. ప్రస్తుతం విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్ నౌకాదళ పరిమితుల వల్ల కొన్ని పరిమితుల్లో నడుస్తోంది. ఈ కొత్త ఎయిర్‌పోర్ట్ అందుబాటులోకి వస్తే అంతర్జాతీయ విమాన రాకపోకలు సులభమవుతాయి, దీనివల్ల ప్రయాణికులకు వేగవంతమైన చెకింగ్ , మెరుగైన వసతులు అందుబాటులోకి వస్తాయి.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే రోడ్డు కనెక్టివిటీని పెంచేందుకు చర్యలు చేపట్టింది. విశాఖపట్నం నుండి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు కనెక్టివిటీ పెంచేందుకు ఏడు ట్రాఫిక్ ఫ్రీ రోడ్లు అందుబాటులోకి రానున్నాయి. నేషనల్ హైవే విస్తరణ పనులు కూడా జరుగుతున్నాయి. విశాఖపట్నం నుండి డబుల్ డెక్కర్ మెట్రో కారిడార్ అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం జీఎంఆర్, రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ భాగస్వామ్యంతో విశాఖపట్నం నుండి భోగాపురం మార్గంలో ఎనిమిది ప్రదేశాలలో ఏసీ లాంజ్‌లను ఏర్పాటు చేస్తున్నారు.

ఎవరికి లాభం?
విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్ కంటే భోగాపురం ఎయిర్‌పోర్ట్ మరింత అత్యాధునిక సేవలను అందిస్తుంది. ఇది విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి జిల్లాల ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఉత్తర కోస్తా ఆంధ్ర ప్రజలు అంతర్జాతీయ ప్రయాణాల కోసం వేరే ప్రాంతాలకు వెళ్లకుండా ఇక్కడి నుండే సులభంగా ప్రయాణించవచ్చు.

పర్యాటకుల రాక..
ఈ ఎయిర్‌పోర్ట్ వల్ల ఉత్తరాంధ్రలో టూరిజం కూడా గణనీయంగా పెరుగుతుంది. ఇక్కడి బీచ్‌లు, బౌద్ధ వారసత్వ ప్రదేశాలు, హిల్ స్టేషన్లకు పర్యాటకుల రాక పెరుగుతుంది. దీనివల్ల టెక్నాలజీ, ఫార్మా, లాజిస్టిక్స్, తయారీ రంగాలకు వెసులుబాటు కలుగుతుంది. హోటల్స్, రెస్టారెంట్లు, ట్రాన్స్‌పోర్ట్ రంగాలకు కూడా ఇది లాభదాయకంగా మారుతుంది.

Read more:  ఉత్తరాంధ్రకు గేమ్‌ ఛేంజర్‌.. నేడు భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు తొలి విమానం..!

Read more:  AP: మూడు రాజధానుల పరిష్కారానికి జగన్ మాస్టర్ ప్లాన్ ఇదేనా

ఆక్వా రంగానికి బెనిఫిట్‌..
కేవలం ప్రయాణికులకే కాకుండా, 20,000 మెట్రిక్ టన్నుల కార్గో టర్మినల్ ఉండటం వల్ల ఆంధ్రప్రదేశ్‌లోని ఆక్వా, సీఫుడ్, ఫార్మా, అగ్రికల్చర్ ఉత్పత్తులను సులభంగా ఎగుమతి చేసే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఏవియేషన్, కార్గో హ్యాండ్లింగ్, లాజిస్టిక్స్, రిటైల్ రంగాల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా అనేక ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి, ముఖ్యంగా రాష్ట్ర యువతకు ఇది గొప్ప అవకాశం. అంతర్జాతీయ ప్రయాణాలు ఇప్పుడు మరింత సులభం కావడమే కాకుండా, ఖర్చు కూడా తగ్గుతుంది. ప్రయాణ సౌకర్యార్థం ప్రత్యేక ఎలక్ట్రిక్ బస్సులు కూడా అందుబాటులోకి రానున్నాయి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report

నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు.. 3,035 మంది ఉపాధ్యాయులపై సర్కార్ వేటు..!

BBhoomi4h ago
Secunderabad, Telangana:

Bihar Fake Teacher Scam: బీహార్ విద్యాశాఖ రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ద ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. నకిలీ డిగ్రీలు, ఫోర్జరీ విద్యా ధృవపత్రాలు సమర్పించి ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన 3,035 మంది ఉపాధ్యాయులను తొలగించాలనే సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. 2006 నుంచి 2015 మధ్య ఉపాధ్యాయుల నియామకాల్లో విస్తృత అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో, రాష్ట్ర విజిలెన్స్ బ్యూరో కొంతకాలంగా క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తోంది. ఈ విస్తృత దర్యాప్తు అనంతరం, విజిలెన్స్ బ్యూరో నివేదిక ఆధారంగా విద్యాశాఖ ఈ కీలక చర్యలు తీసుకుంది.

ఈ దర్యాప్తులో దిగ్భ్రాంతికరమైన వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. చాలా మంది అభ్యర్థులు ఉనికిలో లేని కళాశాల ధృవపత్రాలను సృష్టించగా, మరికొందరు అసలు ధృవపత్రాలను ఫోర్జరీ చేసి ప్రభుత్వ ఉద్యోగాలు పొందారు. ఈ కుంభకోణంలో దోషులుగా తేలిన 3,035 మంది ఉపాధ్యాయులపై ఇప్పటికే వివిధ పోలీస్ స్టేషన్లలో 1,830 ఎఫ్‌ఐఆర్‌లు దాఖలయ్యాయి. వారు ఉద్యోగంలో ఉన్నప్పుడు ప్రభుత్వం నుండి పొందిన జీతాలు, అలవెన్సులే కాకుండా, వారి గౌరవ వేతనం, జీతాలను కూడా వడ్డీతో సహా తిరిగి రాబట్టాలని విద్యాశాఖ నిర్ణయించింది. వారిని అధికారిక విధుల నుంచి తొలగించిన వెంటనే ఈ రికవరీ ప్రక్రియ ప్రారంభమవుతుంది.

విజిలెన్స్ విచారణ ముమ్మరమవ్వడంతో, శాఖాపరమైన చర్యలను తప్పించుకోవడానికి కొంతమంది ఉపాధ్యాయులు తమ ఉద్యోగాలకు రాజీనామా చేశారు. అయితే, కేవలం రాజీనామా చేసినంత మాత్రాన చట్టపరమైన చర్యల నుండి తప్పించుకోలేరని, అక్రమ మార్గాల ద్వారా లబ్ధి పొందిన వారందరిపై చట్టం తన పని తాను చేస్తుందని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. విద్యా నియామకాలలో పారదర్శకతను పెంచడానికి, సంవత్సరాలుగా వ్యవస్థలో కొనసాగుతున్న అవకతవకలను తొలగించడానికి,  ప్రభుత్వ విద్యా వ్యవస్థపై ప్రజల విశ్వాసాన్ని పునరుద్ధరించడానికి ఈ కఠిన నిర్ణయాలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

Also Read: జనం అడిగారా?..ఆ ఉచిత పథకాలు ఎవరి కోసం? తెలంగాణ సర్కార్‌పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం..!!

Also Read: ఉచిత వైద్యం ఉద్యోగుల హక్కు.. జీతాల్లో EHS కోతపై తెలంగాణ హైకోర్టు సీరియస్..!!

Also Read:ప్రభుత్వ ఉద్యోగులకు ఇంపార్టెంట్ అప్‌డేట్.. బీమా ప్రయోజనాలు దక్కాలంటే వెంటనే ఈ పని చేయండి..!!

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report
Advertisement

రెండో టీ20 సిరీస్‌ పాయె.. ఇంగ్లండ్‌ చేతిలో పరువు పోగొట్టుకున్న టీమిండియా

England:

Team India: టీ20 ప్రపంచ‌ చాంపియన్‌ భారత జట్టు‌కు మరో భంగపాటు ఎదురైంది. ఐర్లాండ్‌ సిరీస్‌లో వైట్‌వాష్‌కు గురయిన టీమిండియా ఇంగ్లాండ్‌ చేతిలో కూడా అదే పరిస్థితి ఎదుర్కొంటోంది. నాలుగో టీ20 మ్యాచ్‌లో కూడా ఓడిపోయిన భారత జట్టు వరుసగా మూడో ఓటమిని చవిచూసింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 3-0తో ఇంగ్లాండ్‌ టీ20 సిరీస్‌ను సొంతం చేసుకుంది. సొంత గడ్డపై జరుగుతున్న సిరీస్‌లో ఇంగ్లండ్‌ ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టి ఆతిథ్య టీమిండియాను వైట్‌వాష్‌ చేయాలని చూస్తోంది.

శ్రేయస్‌ అయ్యర్‌ నాయ కత్వంలో బరిలో దిగిన టీమిండియా నాలుగో మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ 9 వికెట్ల తేడాతో భారీ విజయం సాధించింది. భారత్‌ జట్టు నిర్దేశించిన 159 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్‌ 13.5 ఓవర్లలో ఒక వికెట్‌ మాత్రమే కోల్పోయి ఛేదించింది. కెప్టెన్‌ హ్యారీ బ్రూక్‌, ఫిల్‌ సాల్ట్‌ చెలరేగి ఆడడంతో ఇంగ్లండ్‌ సిరీస్‌ను సొంతం చేసుకుంది. 35 బంతుల్లో 79 పరుగులు చేసిన బ్రూక్‌ నాటౌట్‌గా నిలవగా.. 8 ఫోర్లు, 4 సిక్సర్లు బాదాడు. చక్కటి సహకారం అందిస్తూ ఫిల్‌ సాల్ట్‌ 59 పరుగులు చేసి అజేయంగా మ్యాచ్‌ను ముగించాడు. 39 బంతులు మిగిలుండగానే ఆట ముగియడం విశేషం. తక్కువ లక్ష్యాన్ని కాపాడడంలో భారత బౌలర్లు విఫలమయ్యారు. ఏమాత్రం ప్రత్యర్థిని ఇరుకునపెట్టేలా బౌలింగ్‌ చేయలేకపోయారు. అర్ష్‌దీప్‌ సింగ్‌ తీసిన ఒక్క వికెట్‌ తప్ప మిగిలిన బౌలర్లు తమలోని శక్తిని బయటకు తీయలేదు. దీంతో మరో మ్యాచ్‌ మిగిలుండగానే ఐదు టీ20 సిరీస్‌ను 3-0తో ఇంగ్లండ్‌ తన ఖాతాలో వేసుకుంది.

తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు అతి తక్కువ స్కోర్‌ నమోదు చేసింది. కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ మెరిసినా మిగతా వాళ్లంతా నిరాశపరచడంతో ప్రత్యర్థికి భారీ లక్ష్యం నిర్దేశించలేకపోయింది. 49 బంతుల్లో 80 పరుగులు చేసి చివరి వరకు కెప్టెన్‌ శ్రేయస్‌ నిలబడ్డాడు. 4 ఫోర్లు, 5 సిక్సర్లతో చెలరేగినా ఇతర బ్యాటర్లు సహకరించలేకపోయారు. యంగ్‌ ఓపెనర్‌ వైభవ్‌ సూర్యవంశీ మరోసారి తక్కువ పరుగులు (15) చేయగా.. ఇషాన్‌ కిషన్‌ (4), అభిషేక్‌ శర్మ (16) ఘోరంగా విఫలమయ్యారు. మూడు వికెట్లు కోల్పోయిన విపత్కర పరిస్థితుల్లో శ్రేయస్‌ అయ్యర్ కెప్టెన్‌‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. శివమ్‌ దూబే (22) కొంత సహకారం అందించగా తర్వాత వచ్చిన బ్యాటర్లు నిలబడలేకపోయారు. తిలక్‌ వర్మ (11), వాషింగ్టన్‌ సుందర్‌ (5) తక్కువ పరుగులకే వెనుదిరిగారు. బౌలింగ్‌తో ఇంగ్లీష్‌ బౌలర్లు అదరగొట్టి భారత్‌ను తక్కువ స్కోర్‌కు పరిమితం చేశారు. ఆర్చర్‌ 20 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీయగా.. జోష్‌ టంగ్‌ కూడా రెండు వికెట్లు పడగొట్టారు. 

ఒక ప్రపంచకప్‌ సాధించిన జట్టు ఇదేనా అని రెండు సిరీస్‌లను చూస్తే అనుమానం వస్తోంది. పసికూన ఐర్లాండ్‌ చేతిలో వైట్‌వాష్‌కు గురవడమే షాకింగ్‌గా ఉండగా.. ఇంగ్లండ్‌తో జరుగుతున్న సిరీస్‌లోనూ ఇంతటి చెత్త ప్రదర్శన భారత జట్టు నుంచి ఎవరూ ఊహించలేదు. ఒక మ్యాచ్‌ రద్దు.. జరిగిన మూడు మ్యాచ్‌ల్లో భారత్‌ ఘోర వైఫల్యం ప్రదర్శించడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా రెండో మ్యాచ్‌లో అత్యంత భారీ తేడాతో ఓడిపోగా.. నాలుగో మ్యాచ్‌ కూడా ఘోర పరాభవమే. ఈ స్థాయి చెత్త ప్రదర్శన చేయడంతో బీసీసీఐ దిద్దుబాటు చర్యలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. జట్టు తిరిగివచ్చాక భారీ మార్పులు చేసే అవకాశం ఉన్నట్లు క్రీడా వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో చివరి ఐదో టీ20 శనివారం జరుగుతుండగా.. ఈ మ్యాచ్‌లోనైనా భారత జట్టు గొప్ప ప్రదర్శన చేసి పరువు నిలబెట్టుకుంటుందో లేదో చూడాలి.

0
0
Report
Advertisement

2036లో హైదరాబాద్‌కు ఒలింపిక్స్‌ క్రీడలు తీసుకురావడమే నా కల: రేవంత్‌ రెడ్డి

Hyderabad, Telangana:

Revanth Reddy: 2036లో ఒలింపిక్స్ క్రీడలను నిర్వహించాలని భారతదేశం పోటీ పడుతున్న నేపథ్యంలో ఆ క్రీడల నిర్వహణకు తెలంగాణ ఆతిథ్యం ఇవ్వాలనే బలమైన ఆకాంక్షను తెలంగాణ ముఖ్యమంత్రి వ్యక్తం చేశారు. ఒలింపిక్స్‌ క్రీడల నిర్వహణకు అనుగుణంగా తెలంగాణ, హైదరాబాద్ నగరాన్ని అన్ని రకాలుగా సర్వసన్నద్ధం చేస్తున్నట్లు తెలిపారు. 'క్రీడారంగంలో స్పష్టమైన విధానం లేని కారణంగా క్రీడల్లో దేశం వెనుకబడిపోయింది. తెలంగాణలో స్పష్టమైన క్రీడా పాలసీని తెచ్చాం. దేశంలో క్రీడా శిక్షణా కేంద్రాలు, యూనివర్సిటీలకు పాలసీ ఉండాలి. స్వాతంత్య్రోద్యమ కాలంలో యంగ్ ఇండియా పేరుతో మహాత్మాగాంధీ నడిపిన యంగ్ ఇండియా దినపత్రిక స్ఫూర్తిగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశాం' అని వివరించారు.

హైదరాబాద్‌ వేదికగా గచ్చిబౌలి స్టేడియం వేదికగా ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షురాలు పీటీ ఉషతో కలిసి గచ్చిబౌలి స్పోర్ట్స్ డిస్ట్రిక్ట్, యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీని ముఖ్యమంత్రి ప్రారంభించారు. క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, ప్రభుత్వ సలహాదారు (క్రీడలు) ఏపీ జితేందర్ రెడ్డి, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో కలిసి ప్రారంభించిన అనంతరం ముఖ్యమంత్రి కీలక ప్రసంగం చేశారు.

'వచ్చే నవంబర్‌లో ఖేలో ఇండియా పోటీలను నిర్వహించడమే కాకుండా 2036 ఒలింపిక్స్ నిర్వహించాలని భారతదేశం భావిస్తున్న నేపథ్యంలో దీనికి తెలంగాణ వేదిక కావాలి' అని తెలంగాణ సీఎం ఆకాంక్షించారు. 82 ఎకరాల్లో అత్యాధునిక వసతులతో స్పోర్ట్స్ యూనివర్సిటీని, ప్రపంచ స్థాయి స్పోర్ట్స్ అకాడమీని ఇక్కడ నిర్మించబోతున్నామని.. 2028 డిసెంబర్‌లో ఆ స్పోర్ట్స్ యూనివర్సిటీని ప్రారంభించుకోబోతున్నట్లు వెల్లడించారు.

'క్రీడారంగంలో స్పష్టమైన విధానం లేని కారణంగా క్రీడల్లో దేశం వెనుకబడిపోయింది. తెలంగాణలో స్పష్టమైన క్రీడా పాలసీని తెచ్చాం. దేశంలో క్రీడా శిక్షణా కేంద్రాలు, యూనివర్సిటీలకు పాలసీ ఉండాలి. స్వాతంత్య్రోద్యమ కాలంలో యంగ్ ఇండియా పేరుతో మహాత్మాగాంధీ నడిపిన యంగ్ ఇండియా దినపత్రిక స్ఫూర్తిగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశాం అని వివరించారు.

'ఏషియన్ క్రీడలు, ప్రపంచ మిలిటరీ గేమ్స్, కామన్‌వెల్త్ గేమ్స్ నిర్వహణకు వేదికగా ఉన్న హైదరాబాద్ ఆ తర్వాత గడిచిన 20 ఏళ్లపాటు చెప్పుకోదగిన క్రీడలను నిర్వహించలేదు. 23 ఏళ్ల కిందట నిర్మించిన స్టేడియాలు ఆ తర్వాత పెళ్లిళ్లకు, రాజకీయ కార్యక్రమాలకు వేదికగా ఉపయోగించారు. వాటన్నింటినీ పునరుద్ధరించాలని భావిస్తున్నాం' అని రేవంత్‌ రెడ్డి తెలిపారు. నిజమైన క్రీడాకారులను సంపూర్ణమైన ప్రోత్సాహకాలను అందించడానికి స్పోర్ట్స్ పాలసీతో పాటు పీపీపీ విధానంలో క్రీడా యూనివర్సిటీని నెలకొల్పామని వెల్లడించారు. దీనిలో ప్రభుత్వం జోక్యం ఉండదని స్పష్టం చేశారు. సంజయ్ గోయంకా, అభినవ్ బింద్రా, కపిల్ దేవ్, కావ్య మారన్, ఉపాసన రామ్ చరణ్, రవికాంత్ రెడ్డి లాంటి క్రీడలను ప్రోత్సహిస్తున్న వారితో యూనివర్సిటీని ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఈ వర్సిటీ నిర్వహణ విషయంలో వారికే పూర్తి స్వేచ్ఛను ఇచ్చామని తెలంగాణ సీఎం తెలిపారు. 

'చదువులోనే కాదు, క్రీడల్లో రాణించినా భవిష్యత్తు బాగుంటుందని, క్రీడలపై దృష్టి సారించండి. క్రీడల్లో రాణించి దేశానికి ప్రతిష్ట తీసుకొస్తే అలాంటి వారికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చే బాధ్యతను తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటుంది' అని తెలంగాణ సీఎం ప్రకటించారు. క్రీడలు, క్రీడాకారులను ప్రోత్సహించే విషయంలో పీటీ ఉష లాంటి వారు అవసరమైన సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. 

ఏ రంగంలోనైనా ఉత్తమంగా రాణించాలంటే ఏకాగ్రత ఉండాలని.. అప్పుడే రాణించగలుతామని తెలంగాణ సీఎం సూచించారు. వందకు వంద శాతం సాధన చేయాలని. ఒకసారి ఓటమి చెందినంత మాత్రాన కుంగిపోవలసిన అవసరం లేదని చెప్పారు. ఒక ఓటమి మనల్ని నిరాశపరచకూడదని.. ఓటమిని సవాలుగా తీసుకోవాలని రేవంత్ రెడ్డి తెలిపారు. 2026 ఖేలో ఇండియా యూత్ గేమ్స్ (8వ ఎడిషన్) క్రీడలు, జాతీయ ఇంటర్ డిస్ట్రిక్ట్ జూనియర్ అథ్లెటిక్స్ మీట్ టోర్నమెంట్స్‌, హాకీ ఇండియా లీగ్, ప్రపంచ పికిల్‌బాల్ లీగ్, ఆర్చరీ ప్రీమియర్ లీగ్, టెన్నిస్ ప్రీమియర్ లీగ్ పోటీలకు తెలంగాణ ఆతిథ్యం ఇవ్వబోతున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా వివిధ క్రీడల్లో విశేష ప్రతిభ కనబరిచిన తెలంగాణకు చెందిన ఆరుగురు క్రీడాకారులకు రూ.7.15 కోట్ల మేరకు నగదు ప్రోత్సాహకాలను అందించారు. 

నగదు ప్రోత్సాహకాలు ఇలా..
దీప్తి దివాంజీ (ప్యారా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్): రూ.50 లక్షలు
ధనుష్ శ్రీకాంత్‌ (షూటింగ్ - డెఫ్లింపిక్స్): రూ.2.10 కోట్లు
ఈషా సింగ్‌ (ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ ప్రపంచకప్ విజేత - వరల్డ్ రికార్డు): రూ.3.3 కోట్లు
నిఖత్ జరీన్‌ (బాక్సింగ్): రూ.60 లక్షలు
తనిష్క్ మురళీధర్ నాయుడు (షూటింగ్): రూ.53.65 లక్షలు
రావూరి సురభి భరద్వాజ్‌ (షూటింగ్): రూ.10 లక్షలు

0
0
Report
Advertisement

జీ మీడియాకు అడ్వర్టైజర్ల బ్రహ్మరథం.. ఫిఫా ప్రపంచకప్‌ 2026తో అమాంతం పెరిగిన జీ నెట్‌వర్క్‌ యాడ్‌లు

Mumbai, Maharashtra:

Z Media Advertisements: ఫిఫా వరల్డ్ కప్ 2026 హక్కులు దక్కించుకున్న జీ మీడియాకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించడమే కాకుండా జీ మీడియా వాణిజ్య ప్రకటనలతోనూ దూసుకెళ్తోంది. ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ను భారతదేశ ప్రజలకు అందిస్తున్న జీ మీడియాకు వీక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. అత్యధిక వీక్షణలు పొందుతుండడంతో జీ మీడియాలో వాణిజ్య ప్రకటనలు వేసేందుకు అంతర్జాతీయ బ్రాండ్లు క్యూలు కడుతున్నాయి. టీవీ స్పోర్ట్స్‌ పోర్ట్‌ఫోలియోలో 95 శాతానికి పైగా ప్రీమియం అడ్వర్టైజింగ్‌ ఇన్వెంటరీ ఇప్పటికే అమ్ముడైపోవడం విశేషం.

0
0
Report

Kiara Advani Remuneration: 'తబాహీ' సాంగ్‌లో కియారా అద్వానీ అందాలు అరబోత..ఆ సినిమాకు ఎంత డబ్బు తీసుకుందో తెలుసా?

Hyderabad, Telangana:

Kiara Advani Remuneration For Toxic Movie: 'రాకింగ్ స్టార్' యశ్ హీరోగా, గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ పాన్-ఇండియా మూవీ 'టాక్సిక్'. 'కేవీఎన్ ప్రొడక్షన్స్' సంస్థ భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్, ఎట్టకేలకు ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.

ఈ సినిమాలో యశ్ సరసన నయనతార, కియారా అద్వానీ, హ్యూమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్ వంటి భారీ తారాగణం నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ సినిమాపై భారీ అంచనాలను పెంచగా, తాజాగా మేకర్స్ రిలీజ్ చేసిన ఒక సాంగ్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

ట్రెండింగ్‌లో 'తబాహి'..కియారా బోల్డ్ లుక్!
బుధవారం (జులై 9) ఈ సినిమా నుంచి 'తబాహి' అనే వీడియో సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పాటలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ గతంలో ఎన్నడూ లేనంత రొమాంటిక్, బోల్డ్ లుక్‌లో కనిపించి అందాలు ఆరబోసింది. సినిమాలో యాక్షన్, హింసతో పాటు రొమాన్స్ కూడా ఓ రేంజ్‌లో ఉండబోతుందని ఈ పాటతో క్లారిటీ వచ్చేసింది. యూట్యూబ్‌లో విడుదలైన నిమిషాల వ్యవధిలోనే ఈ సాంగ్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతూ, మిలియన్ల కొద్దీ వ్యూస్‌తో దూసుకుపోతోంది.

కియారా కెరీర్‌లో ఇదే అత్యధికం..
'తబాహి' సాంగ్ నెట్టింట వైరల్ అవుతున్న నేపథ్యంలో, ఈ సినిమా కోసం కియారా అద్వానీ తీసుకున్న పారితోషికంపై సరికొత్త చర్చ మొదలైంది. ఈ చిత్రంలో తన పాత్ర డిమాండ్ మేరకు గ్లామరస్‌గా నటించినందుకు గానూ ఆమె భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.

పాన్ ఇండియా లెవెల్‌లో కియారాకు ఉన్న క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకుని, నిర్మాతలు ఆమె అడిగినంత మొత్తాన్ని చెల్లించినట్లు సమాచారం. ఈ సినిమా కోసం కియారా ఏకంగా రూ.15 కోట్లు అందుకుందట. 'గేమ్ ఛేంజర్' సినిమా కోసం కియారా సుమారు రూ.5 నుంచి రూ.7 కోట్ల వరకు పారితోషికం తీసుకుంది. దానితో పోలిస్తే 'టాక్సిక్' చిత్రానికి ఆమె రెమ్యునరేషన్ ఏకంగా డబుల్ అయింది. కియారా సినీ కెరీర్‌లోనే ఇదే అత్యధిక పారితోషికం కావడం విశేషం.

బాలీవుడ్‌తో పాటు సౌత్ ఇండియాలోనూ తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న కియారా అద్వానీ, ఈ భారీ పారితోషికంతో భారతీయ చిత్ర పరిశ్రమలోనే అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే స్టార్ హీరోయిన్ల లీగ్‌లోకి అధికారికంగా చేరిపోయింది.

Also Read: హీరోయిన్ జాన్వీ కపూర్ కాబోయే భర్త ఇతనే! ఎట్టకేలకు ప్రియుడి పేరును బయటపెట్టిన బ్యూటీ!

Also Read: "ఆ హీరో ముద్దు పెట్టుకుంటూ అక్కడ చేయి పెట్టాడు"..'పోటుగాడు' హీరోయిన్ షాకింగ్ కామెంట్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Telangana School Holidays: విద్యార్థులు ఎగిరి గంతేసే వార్త..రేపటి నుంచి వరుసగా 3 రోజులు సెలవులు..పండగే పండగ!

Hyderabad, Telangana:

Telangana Bandh Holidays: తెలంగాణలోని స్కూళ్లు, కాలేజీల విద్యార్థులకు జూలై నెలలో ఊహించిన విధంగా సెలవులు రానున్నాయి. సాధారణంగా జూలైలో ఎలాంటి పండుగలు, ప్రభుత్వ సెలవులు ఉండవు. కేవలం ఆదివారాలు, రెండో శనివారం మాత్రమే సెలవులు ఉన్నాయి. రేపు అనగా జూలై 10న విద్యార్థి సంఘాల బంద్ కారణంగా తెలంగాణ వ్యాప్తంగా విద్యాసంస్థలు మూతపడనున్నాయి. 

అయితే తాజాగా జూలై నెలలో రెండో శనివారం సెలవును కూడా ఇటీవలే రద్దు చేయగా.. జూలై నెలలో అత్యధికంగా 27 రోజుల పాటు విద్యాసంస్థల పనిదినాలను ప్రభుత్వం ప్రకటించింది. అయినా తాజాగా బంద్ మరి ఇతర సెలవులు నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా విద్యాసంస్థలు మూతపడనున్నాయి. 

గత వారం బీసీ సంఘాల డిమాండ్ల పరిష్కారానికి బంద్ నిర్వహించిన తర్వాత.. ఇప్పుడు జూలై 10న తెలంగాణ వ్యాప్తంగా వామపక్ష విద్యార్థి సంఘాలు రాష్ట్ర వ్యాప్త బంధువులను పిలుపునివ్వడమే అందుకు కారణంగా తెలుస్తోంది. సాధారణంగా జూలై నెల వచ్చిందంటే విద్యార్థులకు ఎలాంటి పండగ హాలిడేలు దొరకవు. కానీ, తెలంగాణలో మాత్రం ఈసారి ఊహించిన విధంగా అదనపు సెలవులు రానున్నాయి. వేరువేరు డిమాండ్లతో బీసీ సంఘాలు, వామపక్ష విద్యార్థి సంఘాలు రాష్ట్ర వ్యాప్త బంద్‌లకు పిలుపునివ్వడమే అందుకు కారణంగా తెలుస్తుంది. 

జులై 10న వామపక్ష విద్యార్థి సంఘాల బంద్..
బీసీ సంఘాల బంధు ముగిసిన వారం రోజులకే మరో బంద్ తెరపైకి వచ్చింది. తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో ఉన్న పలు సంస్థలు పరిష్కారం కోసం వామపక్ష విద్యార్థి సంఘాలు, జులై 10న బంద్‌ను పిలుపునిచ్చాయి. హైదరాబాదులో సమావేశమైన విద్యార్థుల సంఘాల నాయకులు ఈ మేరకు కార్యచరణ రూపొందించి పోస్టర్‌ను కూడా ఆవిష్కరించారు. 

జులై 10 శుక్రవారం నాడు విద్యాసంస్థలు స్వచ్చందంగా ఇబ్బందులు పాటించాలని, అవాంఛనీయ పరిస్థితులు రాకుండా యాజమాన్యాలు, తల్లిదండ్రులు సహకరించాలని విద్యార్థి సంఘాల నాయకులు కోరుతున్నారు. దీనివల్ల విద్యార్థులకు వీకెండ్ కు ముందు మరో అదనపు సెలవు దొరకనుంది. అయితే జూలై 11న రెండో శనివారం కావడం వల్ల కొన్ని స్కూళ్లు, కాలేజీలకు సెలవు ఉండనుంది. కానీ, కొన్ని విద్యాసంస్థలు మాత్రం జూన్‌లో ఇచ్చిన సెలవుల నేపథ్యంలో దీన్ని రద్దు చేసినట్లు గతంలో ప్రకటించారు. జూలై 12న ఆదివారం.. ఈ విధంగా రెండో శనివారం లభించే వాళ్లకు వరుసగా మూడు రోజుల పాటు సెలవులు వచ్చినట్లు ఉంది. 

బంద్‌లతో పార్టీ నెలలో వర్షాల కారణంగా అదనపు సెలవులు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో నైరుతి రుతుపవనాలు ఊపొందుకున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడుతున్న తుఫానుగా మరి అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. గత ఏడాది కూడా భారీ వర్షాలు, వరదల కారణంగా ప్రభుత్వం విద్యాసంస్థలకు వరుసగా అత్యవసర సెలవులు ప్రకటించింది. ఏడాది కూడా అదే పరిస్థితి రిపీట్ అయితే, జులై నెలలో విద్యార్థులకు మరిన్ని సడన్ హాలిడేస్ దొరికే అవకాశం ఉంది.

Also REad: పవన్ కళ్యాణ్ అభిమాని నిరంజన్‌ కోసం 'ఓజీ' సినిమా నుంచి గిఫ్ట్! తమన్ సంచలన నిర్ణయం!

Also REad: రైల్వే ప్రయాణికలకు గుడ్‌న్యూస్..ఇకపై కేవలం రూ.200లకే స్లీపింగ్ పాడ్స్‌లో విశ్రాంతి!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement
Advertisement
Back to top