Back
Mancherial504251blurImage

రైల్వే కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లే ఇండ్లలోకి వర్షం నీరు

KASARLA RAMESH
Aug 25, 2024 13:18:06
Bellampalle, Kannal Rural, Telangana
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని 11,12 వార్డ్ ల లో రైల్వే కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో ప్రహరీ కూల్చడం వల్లే రైల్వే క్వార్టర్స్ ఇండ్లలోకి వరద నీరు చేరి ప్రజలు నష్ట పోవడం జరిగిందని మున్సిపల్ చైర్మన్ జక్కుల శ్వేతా అన్నారు. ఆదివారం బాధితుల ఇండ్లను పరిశీలించి మున్సిపల్ అధికారులతో మాట్లాడి జేసీబీ సహాయంతో వర్షపు నీటిని తొలగించారు. రైల్వే కాంట్రాక్టర్ వల్లే వర్షం నీరు ఇండ్లలోకి వచ్చిందని, కాంట్రాక్టర్ బాధ్యత వహించి బాధితులకు నష్టపరిహారం అందించాలని అన్నారు.
0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com