icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Pinewz
504251
KASARLA RAMESHKASARLA RAMESHFollow25 Aug 2024, 01:18 pm
0
0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

Solar Eclipse: ఆగస్టు 12న సూర్యగ్రహణం..భారత్‌తో కనిపిస్తుందా? సూతక సమయం అప్పుడే!

Hyderabad, Telangana:Last Solar Eclipse Of 2026: ఖగోళ ప్రియులు, జ్యోతిష్య శాస్త్రజ్ఞులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 2026 ఏడాది చివరి సూర్యగ్రహణం దగ్గర పడుతోంది. ఇప్పటికే ఈ ఏడాది (2026)లో మొత్తం రెండు సూర్య గ్రహణాలు సంభవించనుండగా.. ఇప్పటికే ఒక సూర్య గ్రహణం ఫిబ్రవరి 17న పూర్తయ్యింది. ఇప్పుడు ఆగస్టులో మరో సూర్య గ్రహణం సంభవించనుంది. 2026లో ఏర్పడనున్న చివరి లేదా రెండో సూర్యగ్రహణం ఆగస్టు 12న అనగా శ్రావణ మాస అమావాస్య నాడు సంభవించనుంది. జ్యోతిష్య గణనల ప్రకారం.. ఈ ఆఖరి సూర్య గ్రహణం ఆశ్లేష నక్షత్రంలో కర్కాటక రాశిలో సంభవిస్తుంది. భారతకాలమానం ప్రకారం ఈ గ్రహణం ఆగస్టు 12 రాత్రి 9.04 గంటల నుంచి ఆగస్టు 13 తెల్లవారుజామున 4.25 గంటల వరకు అనగా మొత్తంగా 7 గంటల 21 నిమిషాల పాటు ఈ గ్రహణం కొనసాగనుంది.
0
0
Report

Harish Rao: మిషన్ భగీరథకు పదేళ్లు.. తెలంగాణ ప్రజల జీవితాలను మార్చిన ఒక అద్భుతం

Baddipadaga, Telangana:

Mission Bhagiratha Decade: నీటి కోసం అల్లాడిన తెలంగాణ ఇప్పుడు ప్రతి ఇంటికి నీటి కులాయితో ఆరోగ్య తెలంగాణగా మారింది. దీనికి కారణం మిషన్‌ భగీరథ. ఈ పథకం ప్రారంభమై పదేళ్లు పూర్తవడంతో మాజీ మంత్రి హరీశ్ రావు స్పందించారు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్‌ మానసపుత్రిక అయిన మిషన్‌ భగీరథ్‌ పదేళ్లు పూర్తికావడంతో హర్షం వ్యక్తం చేస్తూ.. ఆ పథకం అమలుతో తెలంగాణలో జరిగిన మార్పులు వివరించారు. తెలంగాణ ప్రజల జీవితాలను మార్చిన ఒక మహత్తరమైన ప్రణాళిక అని అభివర్ణించారు.

మిషన్‌ భగీరథ పథకం పదేళ్లు పూర్తి కావడంతో ఇంటింటికీ తాగునీటి విప్లవానికి దశాబ్ది అని బీఆర్‌ఎస్‌ పార్టీ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ హరీశ్ రావు ప్రకటించారు. ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన నల్లా నీరు అందించాలనే సంకల్పంతో ప్రారంభమైన మిషన్ భగీరథ.. దేశానికే ఆదర్శంగా నిలిచిన పథకం అని గుర్తుచేశారు. తెలంగాణ ఫ్లోరోసిస్ రక్కసి రూపుమాపిన సుజల వ్యవస్థ మిషన్‌ భగీరథ అని తెలిపారు. కేసీఆర్ దూరదృష్టితో రూపుదిద్దుకున్న మిషన్ భగీరథ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంతో నిర్వీర్యమవుతోందని మండిపడ్డారు.

'తెలంగాణలో ప్రతి ఇంటికీ సురక్షిత, స్వచ్ఛమైన  తాగునీటిని అందించాలనే లక్ష్యంతో ప్రారంభమైన మిషన్ భగీరథకు నేటితో పదేళ్లు పూర్తి కావడం సంతోషకరం. సరిగ్గా పదేళ్ల కిందట ఇదే రోజు ఒక గొప్ప ఆలోచనతో ప్రారంభమైన ఈ పథకం ప్రజల తాగునీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపింది. మిషన్ భగీరథ దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్న అతిపెద్ద తాగునీటి మౌలిక వసతుల ప్రాజెక్టుగా నిలిచింది. దేశానికి రోల్ మోడల్ గా నిలిచి హర్ ఘర్ జల్ పథకం అయింది. మిషన్ భగీరథ అనేది ఒక పథకం కాదు.. తెలంగాణ ప్రజల జీవితాలను మార్చిన ఒక మహత్తరమైన ప్రణాళిక' అని మాజీ మంత్రి హరీశ్‌ రావు వెల్లడించారు.

 

'రాష్ట్రంలో ఏ ఇంట్లోనూ తాగునీటి కోసం ఇబ్బంది ఉండకూడదు. ఏ తల్లి కూడా బిందె పట్టుకుని కిలోమీటర్ల దూరం నడవకూడదు, ఏ గ్రామం కూడా వేసవిలో నీటి ఎద్దడి ఎదుర్కోకూడదు అనే సంకల్పంతో కేసీఆర్ ప్రభుత్వం ఈ బృహత్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది' అని నాటి సాగునీటి శాఖ మంత్రి హరీశ్‌ రావు గుర్తుచేశారు. 'తెలంగాణ ఏర్పాటుకు ముందు అనేక గ్రామాలు, తండాలు, మారుమూల ప్రాంతాల్లో తాగునీటి పరిస్థితి దయనీయంగా ఉండేది. తాగు నీటి కోసం బిందెలు మోసుకుంటూ కిలోమీటర్ల దూరం వెళ్లి నీళ్లు తెచ్చుకోవడం మహిళలకు నిత్యకృత్యంగా ఉండేది. చాలా గ్రామాల్లో చేతిపంపులు, బోర్లు, స్థానిక నీటి వనరులపైనే ప్రజలు ఆధారపడేవారు. భూగర్భ జలాలు అడుగంటిన ప్రాంతాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉండేది' అని నాటి దుర్భర పరిస్థితులు వివరించారు.

'ఫ్లోరైడ్ సమస్య ఉన్న ప్రాంతాల్లో విషపూరితమైన నీటినే తాగాల్సిన పరిస్థితులు ఉండేవి. దీంతో ఎముకలు వంకర్లు తిరిగి ఎదుగుదల ఆగిపోయేది. మారుమూల ప్రాంతాల్లో కలుషిత నీటి కారణంగా మలేరియా, డెంగీ, డయేరియాతో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయేవారు. ఈ దుస్థితిని మార్చాలంటే తాత్కాలిక చర్యలు సరిపోవని గుర్తించిన కేసీఆర్ రాష్ట్రవ్యాప్తంగా ఒక సమగ్ర తాగునీటి గ్రిడ్‌ను నిర్మించాలనే ఆలోచన చేశారు. ఆ బృహత్తర యజ్ఞమే మిషన్ భగీరథ' అని మాజీ మంత్రి హరీశ్‌ రావు వివరించారు.

గోదావరి, కృష్ణా నదుల నుంచి ఉపరితల ప్రవాహ జలాన్ని సేకరించి, శుద్ధి చేసి, భారీ పైప్‌లైన్ల ద్వారా గ్రామాలు, పట్టణాలు, మారుమూల ప్రాంతాలకు తరలించి.. ఇంటింటికీ సరఫరా చేసే సమగ్ర తాగునీటి వ్యవస్థను నిర్మించారని నాటి సాగునీటి శాఖ మంత్రి హరీశ్‌ రావు వెల్లడించారు. ఒక రాష్ట్రం మొత్తం తాగునీటి అవసరాలను ఒకే సమగ్ర వ్యవస్థతో పరిష్కరించాలనే ఆలోచన అప్పట్లో దేశంలోనే అరుదైనది. అందుకే మిషన్ భగీరథ తెలంగాణ అభివృద్ధి చరిత్రలో మాత్రమే కాదు దేశ చరిత్రలోనే ఒక ప్రత్యేకమైన మైలురాయిగా నిలిచింది' అని వెల్లడించారు. 

'మిషన్ భగీరథ ప్రభావంతో గ్రామీణ తెలంగాణలో మహిళలు తాగునీటి కోసం పడే కష్టాలు తగ్గాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రాణాలు నిలిచాయి. ముఖ్యంగా ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాల్లో సురక్షితమైన తాగునీటిని అందించడంలో మిషన్ భగీరథ కీలక పాత్ర పోషించింది. ఫ్లోరైడ్ రహిత తెలంగాణకు మిషన్ భగీరథ సాధించిన ఖ్యాతి' అని బీఆర్‌ఎస్‌ పార్టీ డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ హరీశ్ రావు తెలిపారు. తాగునీటితో ప్రజల ఆరోగ్యాలను కాపాడిన అమృత జల ప్రణాళిక అని చెప్పారు.

'కేసీఆర్ ప్రభుత్వం నిర్మించిన మిషన్ భగీరథను నిర్వహించే సమర్థత లేకపోవడం సిగ్గుచేటు. పథకాలను రాజకీయ కక్షలకు బలి చేయొద్దు. కేసీఆర్ ప్రభుత్వం ప్రారంభించింది కాబట్టి మిషన్ భగీరథను నిర్లక్ష్యం చేయడం క్రిమినల్ నెగ్లిజెన్స్. ప్రభుత్వాలు మారుతాయి.. కానీ ప్రజల అవసరాలు మారవు' అని మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు. రాజకీయ కక్షలు, వ్యక్తిగత విమర్శలను పక్కనపెట్టి ప్రజలకు ఉపయోగపడుతున్న పథకాలను సజావుగా నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. మిషన్ భగీరథ నిర్వహణకు ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించాలి. దెబ్బతిన్న పైప్‌లైన్లు, మోటార్లు, పంపింగ్ వ్యవస్థలను వెంటనే మరమ్మతు చేయాలని మాజీ మంత్రి హరీశ్ రావు కోరారు. నీటి సరఫరాలో ఎక్కడ అంతరాయం ఏర్పడినా వెంటనే స్పందించేలా ప్రత్యేక పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.

 

 

0
0
Report
Advertisement

Chiranjeevi Korean Kanakaraju: కొరియన్ కనకరాజు సినిమాపై మెగాస్టార్ చిరంజీవి కామెంట్స్..ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్న రివ్యూ!

Hyderabad, Telangana:

Chiranjeevi On Korean Kanakaraju: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన తాజా చిత్రం 'కొరియన్ కనకరాజు' థియేటర్లలో విడుదలై విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. విలక్షణ కథలతో అలరించే వరుణ్ తేజ్, ఈసారి కంప్లీట్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించిన ఈ సినిమా మొదటి షో నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్‌కు ప్రముఖుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతుండగా.. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి, వరుణ్ సతీమణి లావణ్య త్రిపాఠి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

చిరంజీవి ప్రశంసల వర్షం
సినిమా విజయంపై మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా సంతోషం వ్యక్తం చేశారు. "ఈ చిత్రానికి వస్తున్న అద్భుతమైన స్పందన చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది. ఎక్కడ చూసినా 'నవ్వులే నవ్వులు' అనే మాటే వినిపిస్తోంది. వరుణ్ తేజ్ ఈ బ్లాక్ బస్టర్ విజయానికి నూటికి నూరు శాతం అర్హుడు. నీ కష్టానికి, నిబద్ధతకు తగిన ప్రతిఫలం దక్కింది" అంటూ చిరు కొనియాడారు. తాను త్వరలోనే సినిమా చూస్తానని, ఈ చిత్రం మరిన్ని రికార్డులు సృష్టించాలని ఆకాంక్షించారు.

లావణ్య త్రిపాఠి భావోద్వేగ పోస్ట్
వరుణ్ భార్య, నటి లావణ్య త్రిపాఠి తన భర్త సక్సెస్ పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ ప్రత్యేకంగా అభినందించారు. "నువ్వు ఏ ప్రాజెక్ట్ చేసినా ప్రాణం పెట్టి నటిస్తావు. నీ కెరీర్‌లో 'కొరియన్ కనకరాజు' ఒక మైలురాయిగా నిలుస్తుంది. సరికొత్త జానర్లను అన్వేషించాలనే నీ అంకితభావమే నిన్ను ఈ స్థాయికి చేర్చింది" అంటూ ప్రేమపూర్వకంగా విషెస్ తెలిపారు. వరుణ్‌ను మాస్ పాత్రలో చూడటం తనకెంతో ఇష్టమని పేర్కొన్నారు.

బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న సినిమా
ఇంతకుముందు యాక్షన్, సీరియస్ రోల్స్ చేసిన వరుణ్ తేజ్.. ఈసారి పూర్తిగా తన కామెడీ యాంగిల్‌ను బయటకు తీశారు. 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్', 'ఎక్స్‌ప్రెస్ రాజా' వంటి హిలేరియస్ హిట్లు ఇచ్చిన మేర్లపాక గాంధీ.. వరుణ్‌ను పక్కా మాస్ అండ్ కామెడీ రోల్‌లో ప్రెజెంట్ చేశారని ప్రేక్షకులు అంటున్నారు. వీకెండ్ అడ్వాంటేజ్, పాజిటివ్ పబ్లిక్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా కలెక్షన్ల వర్షం కురిపించడం ఖాయంగా కనిపిస్తోంది.

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఈ సినిమాలో హీరోగా నటించగా.. అతని సరసన కొరియన్ అమ్మాయిగా రితికా నాయక్ హీరోయిన్ అలరించింది. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్స్ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించాయి. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించగా.. ఎస్ఎస్ తమన్ సంగీతాన్ని సమకూర్చారు.

Also Read: మలైకా అరోరా డేటింగ్ లైఫ్..తనకంటే చిన్నవారితోనే ఆమె ఎందుకు రిలేషన్‌షిప్‌లో ఉంటోంది?

Also Read: ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి? త్వరలోనే అధికారిక ప్రకటన!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

TG High Court: కుబేరుడు కూడా కూలీకి పోవాల్సి వస్తుంది.. ఉచిత హమీ పథకాలపై హైకోర్టు సెన్సెషనల్ కామెంట్స్..

Hyderabad, Telangana:

HC Judge Justice nagesh bhimapaka reacts in Free govt Schemes: దేశంలో ఎక్కడ చూసిన అన్ని పార్టీలు ప్రజలకు ఉచితపథకాలు అంటు ఇష్టమున్నట్లు హమీలు ఇస్తున్నారు. ఏ మాత్రం కష్టం లేకుండా ప్రభుత్వాలు పథకాలు అందించినప్పుడు జనాలు అసలు పనిచేయడం మానేస్తారని మేధావులు అభిప్రాయ పడుతున్నారు.  ఈ క్రమంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి నాన్ బెయిలబుల్ వారెంట్ కేసు విచారణ నేపథ్యంలో తెలంగాన హైకోర్టు జస్టిస్ నగేష్ బీమాపాక కీలక వ్యాఖ్యలు చేశారు. అదే విధంగా ప్రభుత్వాలు అందిస్తున్న ఉచిత పథకాలపై కూడా తీవ్రంగా స్పందించారు.ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ఉచిత పథకాలు కోటీశ్వరులు కూడా తీసుకుంటున్నారన్నారు. 

రైతుబంధు అనే పథకం ఎంతోమంది కోటీశ్వరులు లబ్ధి పొందుతున్నారని పేర్కొన్నారు. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వానికి భారం పడుతుందన్నారు. అసలు ఎవరికైనా సమాజంలో బాధ్యత ఉందా..?.. అని ఆవేదన వ్యక్తం చేశారు. ఉచిత పథకాల ద్వారా భవిష్యత్ తరాలకు ప్రభుత్వాలు ఏం చేయబోతోందని అసహానం వ్యక్తం చేశారు. ఒకప్పుడు ఈ దేశానికి మనం ఏమి ఇచ్చాం అనుకునేవాళ్లమని, కానీ ఇప్పుడు ఈ దేశం మనకేమిచ్చింది అనే పరిస్థితికి వచ్చామన్నారు. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయని.. మనకేమిచ్చారు, నాకేమిచ్చారు అనే పరిస్థితులకు వచ్చాయన్నారు.

గాంధీ, నెహ్రూ, ప్రకాశం పంతులను చూసి కొంత మంది ఈ దేశానికి నేను ఏదైనా ఇవ్వాలనుకునే వాళ్ళన్నారు. కానీ
 ఇప్పుడు ఈ దేశం నాకేమిచ్చిందని అనుకుంటున్నామన్నారు. ప్రభుత్వాలు చేసిన తప్పిదాల వల్ల అధికారులు బలి అవుతున్నారని ఫైర్ అయ్యారు. ఒక్క సందీప్ సుల్తాన్య పైనే మూడు నుంచి నాలుగు వేల కేసులు ఉన్నాయన్నారు.

ఈ కేసులను చూస్తే సందీప్ సుల్తానియా జీవితకాలం జైల్లో ఉండాలని పేర్కొన్నారు. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పోస్టులో ఉన్నందుకే అని కేసులన్నీ భరించాల్సిన పరిస్థితి ఏర్పడిందని జస్టిస్ కీలక వ్యాఖ్యలు చేశారు. సందీప్ సుల్తానియా మీద కోర్టు ధిక్కరణ కింద వంద కేసులు పెండింగ్ ఉన్నాయన్నారు.  మీరు ముఖ్యమంత్రి అయితే ఈ కేసులపై మీరేం చేయగలరో చెప్పండని ప్రభుత్వ న్యాయవాదిని హైకోర్టు జస్టిస్ ప్రశ్నించింది.

మేము రాజకీయ ఉపన్యాసాలు చేయాలనుకోవడం లేదన్నారు.  ఒక సమాజంలో పౌరుడు గా ఆవేదనతో చెప్తున్న మాటలన్నారు.  పల్లెటూర్లు ప్రస్తుతం పనిచేయడానికి కూలీలు దొరకడం లేదని, రైతుల పరిస్థితి ఘోరంగా ఉందన్నారు.. ఒకప్పుడు మనుషులు పనిచేసేవాలంట అనే చెప్పుకునే పరిస్థితి ఏర్పడవచ్చన్నారు.

రాష్ట్ర ప్రభుత్వాలు పథకాలు ఇస్తున్నాయి.. నేనెందుకు పని చేయాలని అభిప్రాయానికి వచ్చారన్నారు. రాజకీయపరమైన ఉపన్యాసము ప్రభుత్వాలను విమర్శించడం మేము ఈ మాటలు అనడం లేదని,  ప్రభుత్వాలు ఆలోచించాలని ఉద్దేశంతోనే ఈ మాటలు చెబుతున్నామన్నారు. ఇలాంటి సందర్భాల్లో అధికారులను కోర్ట్ కి పిలిపించడం మాకు బాధగానే ఉందన్నారు. సందీప్ సుల్తానీయ మంచి అధికారే, కానీ తప్పని పరిస్థితుల్లో ఆదేశాలు ఇస్తున్నామన్నారు.

ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యాలను కూడా కొందరు విద్యార్థులు  బ్లాక్ మెయిల్ చేస్తున్నారని పేర్కొన్నారు.  కాలేజ్ కి వెళ్లకుండా బయట తిరిగుతున్నారన్నారు. చదువుకున్నోడికి కాలేజ్ ఫీజులు చెల్లించాలి. కాలేజ్ మానేసిన విద్యార్థులకు ప్రభుత్వం చెల్లించడం  సరైందా ?.. అంటూ జడ్జీ ప్రశ్నించారు.

బాగా చదువుకొనే వారికి ఫీజులు కట్టండని, అర్హులైన వారికి పథకాలు ఇవ్వలన్నారు. కోటి 15 లక్షల కుటుంబాలకు ఉచిత పథకాలు ఇస్తే ఈ దేశాన్ని ఏమి నడుపుతారని,  ఇలాగే ఉచిత పథకాలు ఇస్తూ పోతే.. కుబేరుడు కూడా డబ్బులు అన్ని అయిపోయి పనికి ఆహారపథకం కింద కుబేరుడు కూలికి వస్తాడన్నారు.

Read more: ఈ నెల 16 వరకే Gas ఈ KYC.. లేకుంటే గ్యాస్ కనెక్షన్ కట్..

భవిష్యత్ అవసరాలు దృష్ట్యా, ఆవేదనతో ఈ మాటలు చెపుతున్నామన్నారు. ప్రస్తుతం  దేశంలో డేంజర్ బెల్స్ మొగుతున్నయని,   సమాజంలో చాలా ప్రమాదకర పరిస్థితులు ఏర్పడబోతున్నాయన్నారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

0
0
Report

Mumbai Bomb Threat: స్వాతంత్ర్య దినోత్సవం వేళ ముంబైలో బాంబు బెదిరింపు..ఆగస్టు 15న వరుస పేలుళ్లకు భారీ ప్లాన్!

Mumbai, Maharashtra:

Mumbai Bomb Threat Today: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ముందు ముంబై మహానగరం తీవ్ర అప్రమత్తతలో (హై అలర్ట్) ఉంది. ముంబై మేయర్ రీతు తావ్డే అధికారిక ఈమెయిల్ ఐడీకి వరుసగా మూడోసారి బాంబు బెదిరింపు సందేశం రావడంతో పోలీసులు, భద్రతా బలగాలు ఉలిక్కిపడ్డాయి. నగరంలోని పాఠశాలలు, మెట్రో నెట్‌వర్క్, స్టాక్ ఎక్స్ఛేంజ్‌తో పాటు ప్రముఖ ప్రదేశాలపై దాడులు చేస్తామని ఈ మెయిల్ ద్వారా హెచ్చరించారు.

బెదిరింపు ఈమెయిల్‌లోని ముఖ్యాంశాలు..
ముంబై మేయర్‌కు వచ్చిన బెదిరింపుల ప్రకారం.. ఘట్‌కోపర్, అంధేరి, మరోల్ నాకా, గుండవాలి, ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ (CSMT) వంటి రద్దీ ప్రాంతాల్లో కార్ బాంబులు, ఐఈడీలతో దాడులు చేస్తామని హెచ్చరించారు. ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలను పాఠశాలలకు పంపొద్దని.. ముంబై మెట్రోలో ప్రయాణం వద్దని అందులో పేర్కొంది.

అయితే బెదిరింపు మెయిల్‌లో ఖలిస్తాన్ అనుకూల నినాదాలు ఉండడం గమనార్హం. "ఖలిస్తాన్ జిందాబాద్" నినాదాలతో పాటు "సిక్కులకు స్వాతంత్ర్య దినోత్సవం లేదు" అనే వాదనలను ఆ ఈమెయిల్‌లో ప్రస్తావించారు.

అలాగే ప్రధాని నరేంద్ర మోడీకి మద్దతు ఇస్తున్నారనే కారణంతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌లను ప్రత్యేకంగా టార్గెట్ చేస్తున్నట్లు తెలిపారు.

బెదిరింపుల మెయిల్ ప్రకారం.. ఆగస్టు 15న మధ్యాహ్నం 12:11 గంటలకు ముంబైని స్థంభింపజేయడంతో పాటు మధ్యాహ్నం 3:11 గంటలకు మేయర్ కార్యాలయంపై దాడి చేయడం ద్వారా భారత ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడమే తమ ఉద్దేశమని అందులో పేర్కొన్నారు.

రంగంలోకి సైబర్ పోలీసులు
మేయర్ కార్యాలయానికి ఇలాంటి బెదిరింపులు రావడం ఇది మూడోసారి. వరుస హెచ్చరికలతో అప్రమత్తమైన ముంబై పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. ఈమెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది? దాని వెనుక ఎవరున్నారు? అనే కోణంలో సైబర్ పోలీసులు దర్యాప్తును తీవ్రతరం చేశారు. ఈమెయిల్ ఐపీ (IP) చిరునామా, మూలాన్ని గుర్తించేందుకు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి.

Also REad; జంతర్‌ మంతర్‌లో ఉగ్రవాదుల కుట్రభగ్నం..ఐఎస్ఐ ఉగ్ర ముఠాల గుట్టురట్టు..9 మంది అరెస్ట్!

Also Read: మార్కెట్లోకి కొత్త ప్లాస్టిక్ కరెన్సీ నోట్లు..చలామణీ ఎప్పటినుంచి అంటే?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement

AP Local Body Elections: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల సమరం..బ్యాలెట్ బాక్సులా? ఈవీఎంలా?

Vijayawada, Andhra Pradesh:

AP Local Body Elections 2026: ఆంధ్రప్రదేశ్‌ స్థానిక సంస్థల ఎన్నికలకు రాజకీయ వేడెక్కుతోంది. ప్రభుత్వం, ఎన్నికల సంఘం (SEC) ఏర్పాట్లను వేగవంతం చేయగా, రాజకీయ పార్టీలు సైతం సమాయత్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణలో అత్యంత కీలకమైన "పోలింగ్ పద్ధతి" (ఈవీఎంలా? బ్యాలెట్ బాక్సులా?) అనే అంశంపై తీవ్ర చర్చ జరుగుతోంది.

ముఖ్య పరిణామాలు..
సీఎం చంద్రబాబు మంత్రులకు క్షేత్రస్థాయిలో సిద్ధం కావాలని నిర్దేశించగా, కూటమి పార్టీలు ఏకపక్ష విజయం లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాయి. మరోవైపు, ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్సీపీ కూడా ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని కార్యాచరణను అమలు చేస్తోంది.

రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్‌ఈసీ) అనిల్ చంద్ర పునేఠా అధికారులతో సమావేశమై ఎన్నికల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ అధికారులతో ఇప్పటివరకు జరిగిన ఏర్పాట్లు, పెండింగ్ పనులపై చర్చించారు.

రాష్ట్రంలోని మొత్తం 123 మున్సిపాలిటీలు/కార్పొరేషన్లలో 23 చోట్ల, అలాగే 13,359 పంచాయతీల్లో 354 చోట్ల కోర్టు కేసులు, న్యాయపరమైన వివాదాలు పెండింగ్‌లో ఉన్నట్లు అధికారులు తెలిపారు. వీటిని త్వరగా పరిష్కరించేందుకు లీగల్ టీమ్‌లతో ఎస్‌ఈసీ చర్యలు వేగవంతం చేసింది.

ఓటర్ల జాబితా, రిజర్వేషన్లు: పంచాయతీల్లో ఓటర్ల జాబితాలను ఇప్పటికే ప్రకటించగా, డెడికేటెడ్ కమిషన్ నివేదిక రాగానే రిజర్వేషన్ల ప్రక్రియను చేపట్టాలని నిర్ణయించారు.

ఈవీఎంలా? బ్యాలెట్ పేపర్లా?
ఈ ఎన్నికల్లో సాంప్రదాయ పద్ధతిలో బ్యాలెట్ పేపర్లు/బాక్సులను వినియోగించాలా, లేక ఈవీఎం (EVM)ల వైపు వెళ్లాలా అనేదానిపై ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ఎన్నికల నిర్వహణ వ్యయం, భద్రత, సమయం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని పోలింగ్ పద్ధతిపై ఎస్‌ఈసీ త్వరలోనే తుది నిర్ణయం తీసుకోనుంది.

గత సార్వత్రిక ఎన్నికల సమయంలో ఈవీఎంల పనితీరుపై దేశవ్యాప్తంగా వివిధ వాదనలు వినిపించడం, బ్యాలెట్ పేపర్లను మళ్లీ ప్రవేశపెట్టాలనే డిమాండ్లు పెరుగుతున్న తరుణంలో.. స్థానిక ఎన్నికల్లో ఎస్‌ఈసీ ఏ విధానానికి మొగ్గు చూపుతుందనేది రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది.

Also Read: AP Rain Alert: బంగాళాఖాతంలో మరోసారి అలజడి..రేపు ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు!

Also Read: ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవి? త్వరలోనే అధికారిక ప్రకటన!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

సింహరాశిలో సూర్య-కేతువుల కలయిక.. ఆగస్టు 17 నుంచి ఈ 3 రాశులవారికి బంపర్ జాక్‌పాట్!

Hyderabad, Telangana:

Sun-ketu Conjunction Telugu: జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారాలతో పాటు నక్షత్రాల మార్పు అన్ని రాశుల వారి జీవితాలపై ఊహించని ప్రభావాన్ని చూపుతూ ఉంటాయి. ఇదిలా ఉంటే ఆగస్టు 17వ తేదీన జ్యోతిష్య శాస్త్రంలో ఒక అరుదైన, అత్యంత శక్తివంతమైన సంఘటన చోటుచేసుకోబోతోంది. నవగ్రహాల అధిపతిగా భావించే సూర్యభగవానుడు తన సొంత రాశి సింహరాశిలోకి ప్రవేశించనున్నాడు. అక్కడ ఇప్పటికే ఉన్న కేతువుతో సూర్యుడు కూడా కలయిక జరపుతాడు. చాలా సంవత్సరాల తర్వాత సింహరాశిలో సూర్య-కేతువుల ఈ అరుదైన కలయిక జరగడం విశేషం.

జ్యోతిష్య నిపుణుల ప్రకారం.. సూర్యుడు తన సొంత రాశిలో ఉన్నప్పుడు అత్యంత బలంగా, శక్తివంతంగా ఉంటాడని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అలాంటి సూర్యుడితో కేతువు కలయిక.. ఈ గ్రహ మార్పును మరింత ప్రాధాన్యత కలిగించేలా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ అరుదైన సంయోగం వల్ల ఆగస్టు 17 నుంచి ప్రధానంగా మూడు రాశుల వారికి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. హోదాతో పాటు గౌరవం, పదోన్నతితో పాటు ఉద్యోగ, వ్యాపార రంగాల్లో వీరు ఊహించని విజయాలు పొందే ఛాన్స్‌లు కూడా కనిపిస్తున్నాయి. అయితే, ఈ సమయంలో ఏయే రాశులవారి మేలు జరుగుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఈ రాశులవారికి బంపర్‌ జాక్‌ఫాట్..
కన్యా రాశి (Virgo)
కన్యారాశివారికి ఈ గ్రహ సంయోగం ఆర్థికంగా, వ్యాపారపరంగా ఎంతో లబ్ధి చేకూరుస్తుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. వీరికి కొత్త ఆదాయ మార్గాలు సుగమమవుతాయి. అనుకోకుండా ఆకస్మిక ధనలాభం లభించే అవకాశం ఉంది. ఆర్థిక స్థితి మెరుగుపడటంతో ఇల్లు, వాహనం లేదా ఇతర విలువైన స్థిరాస్తులు కొనుగోలు చేసే ఛాన్స్‌లు కూడా కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులకు గత అనుభవాలు బాగా కలసివచ్చే ఛాన్స్‌లు కూడా కనిపిస్తున్నాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి లేదా విస్తరించడానికి ఇది సరైన సమయంగా భావించవచ్చు. కుటుంబంలో ఆనందం కూడా రెట్టింపు అవుతుంది..

మకర రాశి (Capricorn)
మకర రాశి వారికి సూర్య, కేతువుల కలయిక కారణంగా ఈ సమయం అత్యంత సానుకూలమైన ఫలితాలను అందిస్తుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. వీరికి సుదీర్ఘకాలంగా స్వంత ఇల్లు లేదా ఫ్లాట్ కొనుగోలు చేయాలనుకుంటున్న వారి కల ఈ సమయంలో నెరవేరే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయిద. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఎదురవుతున్న అడ్డంకులు తొలగిపోతాయి. మొండిబాకీలు వసూలై ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే చాలా బలంగా మారుతుంది. కుటుంబ సభ్యుల పూర్తి సపోర్ట్ లభిస్తుంది. ఆధ్యాత్మికతో పాటు ధార్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది.

సింహ రాశి (Leo)
సింహరాశి అధిపతి స్వయంగా సూర్యుడే కావడం.. ఈ సంయోగం కూడా సింహరాశిలోనే ఏర్పడడం కారణంగా ఈ రాశి వారికి అత్యంత శ్రేష్ఠమైన ఫలితాలను అందిస్తుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. వీరికి ఈ సమయంలో తప్పకుండా నిర్ణయాధికారం, ధైర్యం విశేషంగా పెరుగుతాయి. మీ వ్యక్తిత్వం ఎదుటివారిని ఆకట్టుకుంటుంది. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్, జీతం పెరుగుదల సూచనలు ఉన్నాయి. సమాజంతో పాటు కుటుంబంలో మీ ప్రతిష్ట మెరుగుపడే ఛాన్స్‌లు ఉన్నాయి. నిలిచిపోయిన పనులన్నీ సజావుగా పూర్తవుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు..

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

గమనిక.. 

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..

0
0
Report

Vivo S2 గ్రాండ్ ఎంట్రీ.. చీప్‌ ధరకే 3D కర్వ్‌డ్ డిస్‌ప్లే, Sony 50MP కెమెరా!

Hyderabad, Telangana:

Vivo S2 India Launch: స్మార్ట్‌ఫోన్ ప్రియుల అద్భుతమైన శుభవార్త.. టెక్ ప్రియులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న అద్భుతమైన టైమ్‌ రానే వచ్చేసింది. ప్రముఖ దిగ్గజ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వివో (Vivo) భారత మార్కెట్‌లో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్‌లోకి విడుదల చేసేందుకు సిద్ధమైంది. తన అత్యంత ప్రతిష్టాత్మక ఫోన్ Vivo S2ను ఆగస్టు 6న గ్రాండ్‌గా లాంచ్ చేసేందుకు సిద్ధమైంది.. ఇది అద్భుతమైన ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఈ స్మార్ట్‌ఫోన్‌ డిజైన్‌ అద్భుతమైన డిజైన్‌ను కలిగి ఉంటుంది.. ఇది 6.83 అంగుళాల 3D కర్వ్‌డ్ AMOLED డిస్‌ప్లేతో అందుబాటులోకి రాబోతోంది. 1.5K రిజల్యూషన్‌తో పాటు 120Hz రీఫ్రెష్ రేట్‌తో కంటికి చెప్పలేనంత ఇంపుగా కనిపిస్తుందని తెలుస్తోంది.. ఏకంగా 3,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో ఎంతో ఎండలో కూడా ప్రకాశవంతంగా మెరుస్తుంది. కళ్లకు ఏమాత్రం శ్రమ కలగకుండా SGSలో-బ్లూ లైట్ సర్టిఫికేషన్‌తో అందుబాటులోకి తీసుకు రావడం విశేషం..

ఈ డివైజ్‌లో MediaTek Dimensity 7360 Turbo శక్తివంతమైన ప్రాసెసర్‌ను కూడా కలిగి ఉంటుంది.. ఆంటోటూ (AnTuTu) బెంచ్‌మార్క్‌లో ఏకంగా 9.70 లక్షలకు పైగా స్కోర్ సాధించిన్నట్లు తెలుస్తోంది. ఇక గేమర్స్ కోసం ఏకంగా 7,050 mAh భారీ బ్యాటరీని ఇందులో అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఇంత పెద్ద బ్యాటరీ ఉన్నప్పటికీ.. ఫోన్ మందం కేవలం 7.99 mm మాత్రమే ఉండటం నిజంగా ఒక అద్భుతంగా భావించవచ్చు. 

ఫోటోగ్రఫీ అంటే ఇష్టపడేవారికి వివో అద్భుతమైన కెమెరా సెటప్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చిన్నట్లు తెలుస్తోంది.. బ్యాక్ సెటప్‌ను 50 మెగాపిక్సెల్ Sony IMX852 ప్రధాన కెమెరాతో పాటు ఫ్రాంట్‌ భాగంలో 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో అందుబాటులోకి తీసుకు వచ్చింది. రెండు కెమెరాలూ 4K వీడియో రికార్డింగ్‌కు సపోర్ట్ చేస్తాయి.

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

అధునాతన OriginOS 6, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఫీచర్లతో పాటు డ్యూయల్ సిమిట్రికల్ స్పీకర్లతో రాబోతున్న ఈ ఫోన్ సిల్క్ వైట్, శాఫైర్ బ్లూతో పాటు రీగల్ బ్రాంజ్ కలర్స్‌లో అందుబాటులోకి రాబోతోంది.. 8GB+128GB వేరియంట్ ధర సుమారు రూ.51,999తో.. 8GB+256GB వేరియంట్ ధర రూ. 55,999తో అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.. ఇది అమెజాన్‌తో పాటు వివో ఈ-స్టోర్లతో పాటు ప్రముఖ రిటైల్ షాపుల్లో ఇది అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది..

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report
Advertisement

పుష్య నక్షత్రంలో గురు మార్పులు.. ఆగస్టు 19 వరకు ఈ రాశుల జాతకం అమాంతం మారబోతోంది!

Hyderabad, Telangana:

Jupiter Transit In Pushya Nakshatra: జ్యోతిష్య శాస్త్రంలో అదృష్టం, సంపద, వివాహంతో పాటు జ్ఞానానికి కారకుడిగా భావించే దేవగురు బృహస్పతి నక్షత్ర సంచారంలో కీలక మార్పు చోటుచేసుకుంది. గురు గ్రహం పుష్య నక్షత్రంలోని నాలువ పాదంలోకి సంచారవ చేసింది. ఆగస్టు 3 సోమవారం రాత్రి 11 గంటలకు గురుడు పుష్య నక్షత్రంలోకి ప్రవేశించగా.. ఆగస్టు 19 వరకు ఇదే స్థానంలో కొనసాగుతాడు. ఈ అద్భుతమైన నక్షత్ర పద సంచారం వల్ల ప్రధానంగా 4 రాశుల విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఆదాయం పెరగడమే కాకుండా బ్యాంక్ బ్యాలెన్స్ అమాంతం పెరిగే అవకాశాలు విపరీతంగా కనిపిస్తున్నాయి. అయితే ఏయే రాశులవారికి ఈ సమయం ఎంత బాగుంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఈ రాశులవారికి బంపర్ లాభాలు
కన్యా రాశి (Virgo) 

గురు నక్షత్ర పద సంచారం కన్యా రాశి వారికి అపారమైన విజయాలను అందిస్తుంది. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి సమాజంలో గౌరవ ప్రతిష్ఠలు అమాంతం పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. కెరీర్‌లో బంపర్ పురోగతి సాధిస్తారు. గురు గ్రహ అనుగ్రహంతో అదృష్టం తోడై.. గత కొంతకాలంగా నిలిచిపోయిన పనులన్నీ త్వరగా పూర్తవుతాయి. ఆదాయం పెరగడమే కాకుండా.. రాబోయే కొన్ని నెలల్లో వీరి ఖర్చులు విపరీతంగా పెరుగుతూ ఉంటాయి. 

ధనుస్సు రాశి (Sagittarius) 
ధనుస్సు రాశి వారికి ఈ సమయం చాలా అద్భుతంగా ఉండబోతోందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. కెరీర్‌లో పెద్ద ఎత్తున విజయం సాధించడమే.. కాకుండా ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడతాయి. సంపాదనకు సరికొత్త మార్గాలు సుగమం అవుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఈ సమయంలో ప్రేమ జీవితంలో సానుకూల మార్పులు వచ్చి.. దాంపత్య జీవితం ప్రశాంతంగా సాగుతుందని నిపుణులు తెలుపుతున్నారు.. దీర్ఘకాలిక సమస్యలతో పాటు వివాదాల నుంచి శాశ్వత ఉపశమనం లభిస్తుంది.

మకర రాశి (Capricorn) 
మకర రాశి జాతకులకు గురుడి నక్షత్ర సంచారం అత్యంత శుభ సమయాన్ని అందిస్తుంది.. వ్యాపారంలో భారీ డీల్స్ కుదిరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అంతేకాకుండా సమాజంలో హోదా విపరీతంగా పెరుగుతుంది. కుటుంబంలో ఇన్నాళ్లూ ఉన్న ఆందోళనలతో పాటు మానసిక అశాంతి తొలగిపోతాయి. ఆర్ధిక ఇబ్బందులు తీరిపోయి.. నూతన మార్గాల నుంచి లభించే ఆదాయంతో బ్యాంక్ బ్యాలెన్స్ గణనీయంగా పెరుగుతుంది.

మీన రాశి (Pisces) 
మీన రాశి వారికి కూడా ఈ సంచారం అత్యంత సానుకూల ఫలితాలను అందిస్తుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. సంపాదనకు కొత్త అవకాశాలు కూడా కలుగుతాయి.. ధన సమస్యలు పూర్తిగా తొలగిపోయే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. సామాజిక స్థాయిలో పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. ఉద్యోగార్థులకు నూతన ఉద్యోగావకాశాలు లభించడంతో పాటు ఉద్యోగంలో ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు, పెద్ద ఆఫర్లు లభించే ఛాన్స్‌లు కూడా కనిపిస్తున్నాయి.

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

గమనిక.. 

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..

0
0
Report

తల్లిదండ్రులు ఒకసారి ఆలోచించండి.. ఆడపిల్లలకు ఆ వ్యాక్సిన్ ఎంతో ముఖ్యం.. ఆ టీకాపై ఎందుకీ అపోహలు?

BBhoomi18h ago
Secunderabad, Telangana:

HPV: భారతదేశంలో మహిళల ప్రాణాలను తీస్తున్న అతిపెద్ద ఆరోగ్య సమస్యల్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ (Cervical Cancer) ఒకటి. ప్రతి ఏటా వేలాది మంది మహిళలు ఈ వ్యాధి బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే, ఈ క్యాన్సర్‌ను రాకుండా అడ్డుకోగల అత్యంత శక్తివంతమైన హెచ్‌పివి (HPV - Human Papillomavirus) వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. సైన్స్ ఇంత పురోగమించినా.. మనదేశంలో చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలకు ఈ టీకా వేయించడానికి ఇప్పటికీ వెనుకంజ వేస్తుండటం ఆందోళన కలిగిస్తోంది.

ప్రపంచవ్యాప్తంగా గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ మరణాలలో దాదాపు 4వ వంతు భారతదేశంలోనే సంభవిస్తున్నాయి. అయితే, ఈ క్యాన్సర్‌ను రాకుండా అడ్డుకోగల అత్యంత శక్తివంతమైన హెచ్‌పివి (HPV - Human Papillomavirus) వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. అయినప్పటికీ, తప్పుడు సమాచారం.. సరైన అవగాహన లేకపోవడం, ఆడపిల్లల లైంగికత గురించి మాట్లాడటానికి ఉన్న అసౌకర్యం వంటి కారణాల వల్ల భారతీయ తల్లిదండ్రులలో ఈ వ్యాక్సిన్ పై ఎన్నో అనుమానాలు, అపోహలను కలిగి ఉన్నారు. వాస్తవానికి  ఈ వ్యాక్సిన్ ఏమి చేస్తుంది?  ఆడపిల్లలకు వ్యాక్సిన్ ఇవ్వడానికి తల్లిదండ్రులు ఎందుకంత సంకోచిస్తున్నారు. ఈ సంకోచం వెనుక ఉన్న అసలు కారణం ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.

HPV అనేది లైంగికంగా సంక్రమించే వైరస్ అనే విషయాన్ని తల్లిదండ్రులు  తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. చిన్న వయస్సులోనే ఈ టీకా ఇస్తే పిల్లల ప్రవర్తన మారిపోతుందేమోననే భయం కొందరు తల్లిదండ్రుల్లో ఉంది.  సోషల్ మీడియాలో వచ్చే అసత్య ప్రచారాలను నమ్మి, ఈ వ్యాక్సిన్ తీసుకుంటే భవిష్యత్తులో సంతానోత్పత్తి సమస్యలు వస్తాయని భావిస్తున్నారు..గర్భాశయ క్యాన్సర్‌ను ఒక టీకాతో పూర్తిగా నివారించవచ్చనే ప్రాథమిక అవగాహన మెజారిటీ ప్రజలకు లేదు. HPV 16 , HPV 18 అనే రెండు రకాలు ప్రపంచవ్యాప్తంగా దాదాపు 70 శాతం గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ కేసులకు కారణమవుతున్నాయి. క్వాడ్రివాలెంట్ టీకా (గార్డాసిల్) బైవాలెంట్ టీకా (సెర్వారిక్స్) రెండూ ఈ రకాలను లక్ష్యంగా చేసుకుంటాయి. పూణేలోని సీరం ఇన్‌స్టిట్యూట్ అభివృద్ధి చేసిన, భారతదేశంలో దేశీయంగా ఉత్పత్తి చేసిన సెర్వావాక్ టీకా, అధిక ప్రమాదం ఉన్న   HPV 16 , HPV 18 రెండు రకాలను కవర్ చేస్తుంది.  ఈ వ్యాక్సిన్ 2022లో డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా నుండి ఆమోదం పొందింది. 

అయితే పెళ్లికి ముందే ఈ టీకాను ఇచ్చినట్లయితే.. గర్భశాయ ముఖద్వారా క్యాన్సర్ రాకుండా నిరోధిస్తుంది.  అందుకే దీనిని 9 నుండి 14 సంవత్సరాల వయస్సు గల బాలికలకు సిఫార్సు చేస్తున్నారు వైద్యులు.  ది లాన్సెట్ ఆంకాలజీలో ప్రచురించిన 2020 నాటి ఒక అధ్యయనంలో, స్వీడన్‌లో 11 సంవత్సరాల పాటు 16 లక్షల మందికి పైగా మహిళలను పరిశీలించగా, 17 ఏళ్లలోపు టీకా తీసుకున్న బాలికలకు, టీకా తీసుకోని మహిళలతో పోలిస్తే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ వచ్చే ప్రమాదం 88 శాతం తక్కువగా ఉందని కనుగొన్నారు. అయితే ఈ వ్యాక్సిన్స్ను  మూడు డోసులుగా ఇచ్చేవారు. 15 ఏళ్లలోపు అమ్మాయిలకు, ఇప్పుడు ఆరు నెలల వ్యవధిలో ఇచ్చే రెండు డోసులు సమానమైన రోగనిరోధక శక్తిని అందిస్తాయి. అందుకే ఈ HPV వ్యాక్సిన్ అత్యంత సురక్షితమైనది. ఆడపిల్లలకు 9 నుండి 14 ఏళ్ల వయస్సు మధ్యలో (లైంగిక జీవితం ప్రారంభం కాకముందే) ఈ టీకా ఇవ్వడం వల్ల గర్భాశయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం 90శాతం కంటే ఎక్కువ తగ్గుతుంది. ఈ వ్యాక్సిన్ కేవలం క్యాన్సర్ కణాలకు కారణమయ్యే వైరస్‌ను మాత్రమే అడ్డుకుంటుంది తప్ప, పిల్లల శరీర వ్యవస్థపై లేదా భవిష్యత్తు సంతానోత్పత్తిపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపదని వైద్యులు తెగేసి చెప్తున్నారు.

మార్పు ఎక్కడ రావాలి?
మన పిల్లల భవిష్యత్తును సురక్షితంగా ఉంచడానికి మూఢనమ్మకాలను పక్కనబెట్టాలి.

స్కూల్ లెవల్ అవగాహన: పాఠశాలల్లో పేరెంట్-టీచర్ మీటింగ్‌ల ద్వారా ఈ వ్యాక్సిన్ ప్రాముఖ్యతను వివరించాలి.

ప్రభుత్వ ప్రోత్సాహం: జాతీయ టీకాల పట్టికలో దీనిని చేర్చి, సామాన్యులకు ఉచితంగా లేదా తక్కువ ధరకు అందేలా చూడాలి.

సరైన సమయంలో ఆడపిల్లలకు HPV వ్యాక్సిన్ వేయించడమే మనం వారికి ఇచ్చే అతిపెద్ద ఆరోగ్య రక్షణ.

Also Read: ఇన్సూరెన్స్ లేకపోతే పెట్రోల్ బంకుల్లో నో ఫ్యూయల్! కేంద్రానికి సుప్రీంకోర్టు కీలక సూచనలు..!!

Also Read: పీఆర్సీ పై టీచర్ల పోరు బాట.. సెప్టెంబర్ 1న ప్రభుత్వ ఉపాధ్యాయుల మహా ధర్నా.. డిమాండ్లు ఇవే..!!

Also Read: టీచర్లకు డెడ్‌లైన్ ఫిక్స్.. టెట్ అర్హత తప్పనిసరి

Also Read: ఆ బడుల్లో ఒకే టీచర్.. దేశంలో ఇలాంటి పాఠశాలలు లక్ష

 

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

0
0
Report

Vizag Rains: జలమయమైన కాలనీలు.. విశాఖ నగరాన్ని వణికించిన భారీ వర్షం

Visakhapatnam, Andhra Pradesh:

Heavy Rain In Vizag: ఎల్‌నినో ప్రభావం తీవ్ర ప్రభావం చూపిస్తున్న సమయంలో విశాఖపట్టణం నగరంలో చాలా రోజుల తర్వాత భారీ వర్షం కురిసింది. వర్షాకాలం ప్రారంభమైన రెండు నెలల తర్వాత కుండపోత వాన పడింది. పగటిపూట మొత్తం ఎండ వేడిమి ఉండగా.. సాయంత్రం కాగానే వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. అనంతరం ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా వాన పడడంతో విశాఖవాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

ఆకస్మికంగా కురిసిన వర్షంతో విశాఖపట్టణం నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షం కారణంగా ప్రధాన రహదారులపై భారీగా వరద నిలిచింది. కుండపోత వర్షంతో డ్రైనేజీల్లో ఉద్ధృతంగా వరద ప్రవహించింది. భారీ వర్షంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనగా.. భారీ వరద కారణంతో వాహనాల రాకపోకలు స్తంభించాయి. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. వాహనదారులతోపాటు పాదచారులు అవస్థలు ఎదుర్కొన్నారు. దీంతో నీటిలోనే ప్రయాణం సాగించారు.

కుండపోత వర్షంతో లోతట్టు ప్రాంతాల్లోకి వరద చేరింది. ఎక్కడా ఇంకుడుగుంతలు కనిపించకుండా పోవడంతో నగరంలో వర్షపు నీటి సంరక్షణపై మళ్లీ చర్చ జరిగింది. వర్షపు నీరంతా డ్రైనేజీల ద్వారా సముద్రంలోకి వృథాగా చేరుతోంది. భారీ వర్షాలతో నగర డ్రైనేజీ వ్యవస్థపై మరోసారి ప్రశ్నలు మొదలయ్యాయి. వర్షపు నీటి నిల్వ, ఇంకుడు గుంతల ఏర్పాటుపై నిపుణుల సూచనలు చేసినా అధికార యంత్రాంగం పెడచెవిన పెట్టింది. ఉరుములు, మెరుపుల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచించారు. అవసరమైతే తప్ప బయటకు రావద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది.

రేపు కూడా వర్షాలు
విశాఖపట్టణంలో గురువారం భారీ వర్షం పడగా రేపు కూడా వర్షం హెచ్చరికలు ఉన్నాయి. మరో 24 గంటల పాటు పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు.. అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

భారీ వరద
ఎగువ కురుస్తున్న వర్షాలతో ఏపీలోని పలు ప్రాజెక్టులకు వరద ప్రవాహం కొనసాగుతోంది. తుంగభద్ర జలాశయానికి భారీ వరద ప్రవాహం కొనసాగుతూనే ఉంది. దీంతో ఆ ప్రాజెక్టులో నీటి నిల్వ 66 టీఎంసీలకు చేరింది. తుంగభద్ర డ్యామ్‌కు 50,726 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతుండడంతో నీటిమట్టం పెరుగుతోంది. భారీ వరద వస్తుండడంతో రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. భారీ వరద కొనసాగుతున్నా కూడా డ్యామ్‌ నుంచి నీటి విడుదల స్వల్పంగా ఉంది. 1,423 క్యూసెక్కుల నీటిని మాత్రమే విడుదల చేస్తున్నారు. తుంగభద్రలో పెరుగుతున్న నీటి నిల్వలతో కృష్ణా నదీ పరివాహక ప్రాంత రైతులు.. రాయలసీమ ప్రాంత సాగుకు సానుకూల సంకేతాలుగా భావిస్తున్నారు. వచ్చే రోజుల్లో ఎగువ ప్రాంతాల్లో వర్షాలపై నీటి లభ్యత ఆధారపడి ఉండనుంది.

తుంగభద్ర ప్రాజెక్టులో నీటి నిల్వల లెక్కలు
డ్యామ్ పూర్తి స్థాయి నీటిమట్టం 1,633 అడుగులు
ప్రస్తుతం నీటిమట్టం 1,621.52 అడుగులు
మొత్తం నిల్వ సామర్థ్యం 105.788 టీఎంసీలు
ప్రస్తుతం నీటి నిల్వ 66 టీఎంసీలు

 

0
0
Report
Advertisement

ముల్తానీ మిట్టీతో మచ్చలేని అందం.. ట్యాన్, పింపుల్స్ తగ్గించే సింపుల్ హోమ్ రెమిడీస్!

Hyderabad, Telangana:

Multani Mitti Face Packs: ఆరోగ్యకరమైన చర్మం అందరికీ కావాలి, అలాగే స్కిన్ టోన్ కూడా మెరుగుపడాలి. ప్రతిరోజూ ఎండలో బయటకు వెళ్లడం వల్ల సూర్యకిరణాల ప్రభావంతో స్కిన్ ట్యాన్ అవుతుంది. అయితే, మన డైలీ బ్యూటీ రొటీన్‌లో ముల్తానీ మట్టిని చేర్చుకోవడం వల్ల మంచి ప్రయోజనాలు పొందవచ్చు. ఇది ఓపెన్ పోర్స్ సమస్యను నియంత్రించడమే కాకుండా, సహజమైన గ్లోను అందిస్తుంది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ముల్తానీ మట్టిని వాడటం వల్ల ముఖంపై ఉన్న టాన్ కూడా తగ్గిపోతుంది. దీనిని 'ఫుల్లర్స్‌ ఎర్త్‌' అని కూడా పిలుస్తారు. కొన్ని శతాబ్దాలుగా దీనిని సౌందర్య సాధనంగా వాడుతున్నారు. ఇందులో మెగ్నీషియం, కాల్షియం, సిలికా వంటి ఖనిజాలు పుష్కలంగా ఉండటం వల్ల ఇవి చర్మాన్ని సహజంగా క్లెన్స్ చేస్తాయి. దీనివల్ల మీ ముఖం రోజంతా తాజాదనంతో మెరుస్తూ కనిపిస్తుంది.

అయితే, ముల్తానీ మట్టితో సహా ఏదైనా కొత్త ఉత్పత్తిని ఉపయోగించే ముందు, అది మీ స్కిన్‌కు సరిపోతుందో లేదో ప్యాచ్ టెస్ట్ చేయడం ముఖ్యం. ముల్తానీ మట్టి ముఖ్యంగా ఆయిలీ, యాక్నే సమస్యలు ఉన్నవారికి బాగా ఉపయోగపడుతుంది. ఇది అదనపు నూనెను గ్రహించి ఓపెన్ పోర్ట్స్‌ను శుభ్రం చేస్తుంది. కాంబినేషన్ స్కిన్ ఉన్నవారు కూడా దీనిని కేవలం టీ జోన్ (T-zone) ప్రాంతంలో వాడటం వల్ల అదనపు నూనెను తగ్గించుకోవచ్చు. సాధారణంగా ముల్తానీ మట్టిని ఫేస్‌కు అప్లై చేసిన తర్వాత సుమారు 20 నిమిషాల పాటు ఉంచి, సాధారణ నీటితో కడిగేయాలి. మట్టి సుమారు 80 శాతం వరకు ఆరిన తర్వాత క్లీన్ చేస్తే సరిపోతుంది. పూర్తిగా ఎండిపోయి ముఖంపై క్రాక్స్ వచ్చే వరకు ఉంచకూడదు. దీని తర్వాత వెంటనే మాయిశ్చరైజర్‌ను ఉపయోగించాలి, తద్వారా ముఖం త్వరగా డ్రై అవ్వకుండా ఉంటుంది.

ముల్తానీ మట్టి ఫేస్ ప్యాక్ తయారీ విధానం..
మన బిజీ లైఫ్, డైలీ రొటీన్‌లో ఈ ఫేస్ ప్యాక్‌ను చేర్చుకోవాలంటే, రెండు చెంచాల ముల్తానీ మట్టికి ఒక చెంచా పచ్చి పాలు, కొన్ని చుక్కల రోజ్ వాటర్ కలిపి మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి. దీనిని ముఖం, మెడ భాగంలో అప్లై చేసి 15 నిమిషాల పాటు ఆరనివ్వండి. ఇది ముఖంపై ఉన్న అదనపు నూనె, దుమ్ము , ధూళిని తొలగిస్తుంది. దీనివల్ల ముఖం తాజాదనంతో కనిపిస్తుంది. బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ సమస్య కూడా తగ్గుతాయి.

ట్యాన్ తగ్గిస్తుంది..
బ్యూటీ రొటీన్‌లో ముల్తానీ మట్టిని చేర్చుకోవడం వల్ల ముఖంపై ఉన్న టాన్ కూడా తగ్గుతుంది. ముల్తానీ మట్టికి చిటికెడు పసుపు, రోజ్ వాటర్ కలిపి అప్లై చేస్తే మంచి గ్లో వస్తుంది. పాలు వాడలేని వారు పెరుగును కూడా ఉపయోగించవచ్చు. ఇది చర్మానికి మంచి పోషణను, సహజమైన మెరుపును అందిస్తుంది. ముల్తానీ మట్టిలో చర్మాన్ని సహజంగా ప్రకాశింపజేసే గుణాలు ఉండటం వల్ల లోతైన క్లెన్సింగ్ లభిస్తుంది.

Also Read:  వర్షాకాలంలో కుండీల్లోనే పెంచుకోగలిగే 7 మొక్కలు.. ఇంట్లోనే ఫ్రెష్ కూరగాయలు!

Also Read:  తీవ్రమైన ఒత్తిడితో రాత్రులు నిద్రపట్టడం లేదా?

పిగ్మెంటేషన్‌కు చెక్..
ముఖంపై మచ్చలు లేదా పిగ్మెంటేషన్ ఉంటే, రెండు చెంచాల ముల్తానీ మట్టికి కొంచెం నిమ్మరసం, పసుపు కలిపి అప్లై చేయవచ్చు. ఇందులో చందనం పొడిని కూడా కలిపి మెత్తని పేస్ట్‌లా తయారు చేసుకుని, 20 నిమిషాల పాటు ఉంచి చల్లని నీటితో కడిగేయాలి. ఆ తర్వాత వెంటనే మాయిశ్చరైజర్ అప్లై చేయాలి. ఇలా చేయడం వల్ల పిగ్మెంటేషన్ తగ్గుతుంది.

అయితే, పైన పేర్కొన్నట్లుగా కొత్త ఉత్పత్తులను వాడే ముందు టెస్ట్ చేయడం చాలా ముఖ్యం. సెన్సిటివ్ స్కిన్ ఉన్నవారు చర్మం త్వరగా డ్రై అయ్యే అవకాశం ఉన్నందున ముందుగా పరీక్షించి వాడటం మంచిది. ఎగ్జిమా, సోరియాసిస్ వంటి చర్మ సమస్యలు ఉన్నవారు డెర్మటాలజిస్ట్ సలహా తీసుకున్న తర్వాతే ముల్తానీ మట్టిని ఉపయోగించాలి. వారానికి రెండు సార్లు ముల్తానీ మట్టిని వాడటం వల్ల మీ చర్మం ఎల్లప్పుడూ తాజాదనంతో మెరుస్తూ ఉంటుంది.(Disclaimer: పాఠకులారా ఈ వ్యాసం కేవలం సాధారణ సమాచారం, సలహాలను మాత్రమే అందిస్తుంది. ఇది ఎంతమాత్రం వృత్తిపరమైన సలహా కాదు. ఈ సమాచారానికి జీ తెలుగు న్యూస్ ఎటువంటి బాధ్యత వహించదు.)

 

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report

KTR: కేసీఆర్‌ను మళ్లీ సీఎం చేయడమే ప్రొఫెసర్‌ జయశంకర్‌కు నిజమైన నివాళి: కేటీఆర్‌

Hyderabad, Telangana:

Professor Jayashankar: 'తెలంగాణ ప్రయోజనాలు ఢిల్లీ చేతుల్లో బందీ అయ్యింది. యాచించి కాదు.. శాసించే నాయకత్వమే తెలంగాణకు అవసరం' అని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తెలిపారు. తెలంగాణకు దిక్సూచి జయశంకర్.. యాచించి కాదు.. శాసించి తెలంగాణ జయశంకర్ బోధించారని గుర్తుచేశారు. తెలంగాణను మళ్లీ కేసీఆర్ చేతిలో పెట్టడమే ప్రొఫెసర్‌ జయశంకర్‌కు నిజమైన నివాళి అని మాజీ మంత్రి కేటీఆర్‌ ప్రకటించారు. జయశంకర్ ఆశయాలే బీఆర్ఎస్‌ పార్టీకి మార్గదర్శకం అని తెలిపారు. కేసీఆర్‌తోనే తెలంగాణ సాధ్యమని జయశంకర్‌ గట్టిగా నమ్మారని గుర్తుచేశారు.

ఢిల్లీ చుట్టూ రేవంత్ రెడ్డి ప్రదక్షిణలతో తెలంగాణకు దక్కిందేమిటి? అని కేటీఆర్ ప్రశ్నించారు. ఢిల్లీ సామంతులు కాదు.. తెలంగాణ స్వతంత్రులు కావాలని పేర్కొన్నారు. 75 ఢిల్లీ టూర్లు.. తెలంగాణకు తెచ్చిందేమిటి? అని నిలదీశారు. ఢిల్లీకి సామంతుల్లా మారొద్దు.. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడాలని ప్రజలకు గులాబీ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్‌లో ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి కార్యక్రమం నిర్వహించారు. ప్రొఫెసర్‌ జయశంకర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కీలక ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి తరచూ ఢిల్లీ పర్యటనలు చేయడంపై తీవ్ర విమర్శలు చేశారు.

'ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్ రెడ్డి 32 నెలల్లో 75 సార్లు ఢిల్లీకి వెళ్లారు. ప్రతి 13 రోజులకు ఒకసారి ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారు. ఢిల్లీకి సామంతులు కాకుండా స్వతంత్రులు కావాలి అని జయశంకర్ చెప్పేవారు. స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష అని ఆయన ఎప్పుడూ చెప్పేవారు' అని మాజీ మంత్రి కేటీఆర్‌ గుర్తుచేశారు. తెలంగాణ నీటి హక్కుల విషయంలో ఏపీ ప్రభుత్వం తెలంగాణకు చెందిన ఏడు ప్రాజెక్టులను రద్దు చేయాలని ప్రయత్నిస్తోందని, జీఆర్ఎంబీ ద్వారా జరుగుతున్న అన్యాయాన్ని మాజీ మంత్రి హరీశ్ రావు ఇప్పటికే ఆధారాలతో వివరించారని వెల్లడించారు. ఢిల్లీ పార్టీల చేతుల్లో తెలంగాణ మళ్లీ తల్లడిల్లుతోందని, తెలంగాణ కోసం పుట్టిన నిఖార్సయిన పార్టీ బీఆర్ఎస్ మాత్రమేనని సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌ స్పష్టం చేశారు.

పార్లమెంట్‌లో ఒక బీజేపీ ఎంపీ తెలంగాణ ఏర్పాటును పాకిస్తాన్‌తో పోల్చినా, బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు ఎవరూ స్పందించలేదని గుర్తుచేశారు. రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ, అప్పులు, అభివృద్ధి అంశాల్లో రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. తొలి ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అమలు చేయలేదని రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ ప్రజలకు సమాధానం చెప్పాలని మాజీ మంత్రి కేటీఆర్‌ డిమాండ్ చేశారు. తెలంగాణ మిగులు రాష్ట్రమని బీపీఆర్ విఠల్ అధ్యయనాలు నిరూపించాయని నీళ్లు, నిధులు పుష్కలంగా ఉన్నా ప్రభుత్వం వాటిని వినియోగించలేకపోతోందని వివరించారు. కాంగ్రెస్ తెలంగాణకు శాశ్వత శత్రువని జయశంకర్ చెప్పేవారని గుర్తు చేస్తూ, తెలంగాణ ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ పోరాటం కొనసాగిస్తుందని ప్రకటించారు.

జయశంకర్ ఆశయాలే తెలంగాణకు దిక్సూచి.. కేసీఆర్‌తోనే రాష్ట్ర సాధన సాధ్యమైందని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ ప్రకటించారు. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆశయాల సాధనే ఆయనకు అందించే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. కార్యక్రమంలో మండలి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు మధుసూదనాచారి, మాజీ మంత్రులు జగదీశ్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు.

0
0
Report

రేపే ఏపీలో కొత్త సంక్షేమ పథకం ప్రారంభం.. ఒక్కొక్కరి బ్యాంకు ఖాతాలో రూ.25 వేలు

Chirala, Andhra Pradesh:

Nethanna Sevalo Scheme: మరో కొత్త సంక్షేమ పథకం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అమలు చేయనుంది.  ఒక్కొక్క కుటుంబంలో రూ.25 వేలు ఆర్థిక సహాయం అందించే పథకానికి రేపు ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం డబ్బులు జమ చేయనుంది. చేనేతలకు అండగా నిలువాలనే ఉద్దేశంతో ప్రారంభిస్తున్న పథకం పేరు 'నేతన్న సేవలో’ పథకం. చేనేత కుటుంబాలకు ఈ పథకం వర్తించనుంది. ఈ పథకం కింద ఒక్కో కుటుంబానికి రూ.25 వేలు అందిస్తున్నారు. 

నేత వృత్తి చేసే చేనేత కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం కొత్త పథకాన్ని ప్రారంభించనుంది. ఇప్పటికే ఉచిత విద్యుత్, రాయితీలు, 50 ఏళ్లకే పింఛన్ అందిస్తుండగా తాజాగా చేనేతల సంక్షేమానికి మరో పథకానికి శ్రీకారం చుట్టింది. నేతన్న సేవలో పేరుతో ప్రారంభిస్తున్న ఈ పథకం కింద ఒక్కో చేనేత కుటుంబానికి రూ.25 వేల చొప్పున ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించనుంది. 7వ తేదీన జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఈ పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్నారు.

నేతన్న సేవలో పథకంలో భాగంగా అర్హత కలిగిన ప్రతి నేతన్న కుటుంబానికి రూ.25 వేల సాయం దక్కనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 71,536 కుటుంబాలకు ఈ పథకం వర్తింపచేయనుండగా.. రూ.179 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేయనుంది. ఈ పథకమే కాకుండా ఇప్పటికే కొన్ని పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు చేనేత కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం అందిస్తోంది. చేనేత కుటుంబాలకు నెలకు 200 యూనిట్లు, పవర్‌లూమ్‌కు 500 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ అందిస్తున్న విషయం తెలిసిందే.

==> ఉచిత విద్యుత్‌తో 62,541 చేనేత కుటుంబాలు, 10,032 పవర్‌లూమ్ యూనిట్లకు ప్రయోజనం దక్కుతోంది. దీనికి ఏటా రూ.150 కోట్లు ఖర్చవుతోంది.
==> ఏడాదికి రూ.420 కోట్లు ఖర్చుచేసి 50 ఏళ్లు నిండిన 85 వేల మంది చేనేతలకు రూ.4 వేల చొప్పున ఏపీ  ప్రభుత్వం చెల్లిస్తోంది.
==> 109 ప్రాథమిక చేనేత సహకార సంఘాలకు క్యాష్ క్రెడిట్‌ ద్వారా రూ.79 కోట్లు అందించింది.
==> ఉప్పాడలో ప్రత్యేక మౌలిక సదుపాయాల ప్రాజెక్టు, మంగళగిరిలో హ్యాండ్లూమ్ పార్కుతో పాటు అమరావతిలోని శాఖమూరులో చేనేత, హస్తకళల మ్యూజియం ఏర్పాటు
==> విశాఖపట్నంలో రూ.4,200 కోట్ల పెట్టుబడితో సుస్థిర టెక్స్‌టైల్ రీసైక్లింగ్ యూనిట్ ఏర్పాటు

రేపు నేతన్న సేవలో పథకం ప్రారంభోత్సవ షెడ్యూల్‌
రేపు నేతన్న సేవలో పథకం ఏపీ ప్రభుత్వం లాంఛనంగా ప్రారంభించనుంది. చీరాల నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ పథకాన్ని ప్రారంభిస్తారు. శుక్రవారం ఉదయం 10.30 గంటలకు ఉండవల్లిలోని క్యాంప్ కార్యాలయం నుంచి బయలుదేరి వేటపాలెం మండలం కొత్తపేట గ్రామానికి ఉదయం 10.50 గంటలకు చేరుకుంటారు. 11.05 గంటలకు ప్రజావేదిక సభలో పాల్గొని ప్రసంగం చేస్తారు. మధ్యాహ్నం 01.35 గంటలకు జాండ్రపేటలో చేనేతల వర్క్‌షాప్‌లో లబ్ధిదారులతో ముఖాముఖి నిర్వహిస్తారు.

0
0
Report
Advertisement
Advertisement
Back to top