పెండింగ్ వేతనాలు చెల్లించాలంటూ ఆసుపత్రి ఎదుట నిరసన
Bellampalle, Kannal Rural, Telangana:గత 6 నెలలుగా తమకు జీతాలు చెల్లించడం లేదని మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణ ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట కాంటాక్ట్ కార్మికులు నిరసన తెలిపారు. అధికారులకు, నాయకులకుు ఎన్నిసార్లు విన్నవించుకున్న పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తమ వేతనాలను వెంటనే చెల్లించాలని కోరుతూ డీసీహెచ్ వైద్యులు డాక్టర్ కోటేశ్వర్ కు వినతి పత్రం అందజేశారు. కార్మికులకు వేతనాలను వెంటనే చెల్లించాలని 15 రోజుల క్రితం కాంట్రాక్టర్ కి షోకాజ్ నోటీస్ ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు.हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
Plane crash: ఘోర విమాన ప్రమాదం.. మేఘనిలో కుప్పకూలిన ఎయిర్ ఇండియా విమానం..
Hyderabad, Telangana:Ahmedabad Plane crash Video: అహ్మదాబాద్ విమానాశ్రయంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఎయిర్ ఇండియా విమానం మేఘానిగర్లో కుప్ప కూలిపోయింది. దీంతో ఆ ప్రాంతమంతా ఆకాశంలో నల్లటి పొగ పేరుకుపోయింది. చెట్టును తాకడంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. 242 మంది ప్రయాణీకులు బోర్డింగ్ చేసినట్లు సమాచారం. రెస్క్యూ టీమ్ వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఇక ఈ విమానం అహ్మదాబాద్ నుంచి లండన్ కు వెళుతుండగా ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. విమానాశ్రయం నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే మేఘానిననగర్ సమీపంలో కుప్పకూలిపోయింది. విమానాశ్రయం నుంచి ఇది దాదాపు 15 కిలోమీటర్ల దూరంలో ఉంది.
#PlaneCrash: Air India's AI171 (Ahmedabad- London) with around 242 passengers on board has reportedly crashed near #Ahmedabad (AMD) airport during take off.
Official confirmation awaited.#Aviation pic.twitter.com/7qmPfIwaaw
— The Chennai Skies (@ChennaiFlights) June 12, 2025
అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలో జరిగిన ఈ విమాన ప్రమాదం ఎయిర్ ఇండియా బోయింగ్ 787 డ్రీం లైనర్ గా సమాచారం. ఈ విమానం టేక్ ఆఫ్ అయిన కాసేపటిక కుప్పకూలింది. దీంతో భారీగా మంటలు చెలరేగాయి. అయితే ఈ ప్రయాణ సమయంలో 242 మంది ప్రయాణికులు ఉన్నారని అధికారులు వెల్లడించారు.
ఇక అహ్మదాబాద్ విమాన ప్రమాదం గురించి కేంద్ర హోం మంత్రి అమిత్ షా గుజరాత్ సీఎంతో మాట్లాడారు. ఇప్పటికే ఫోన్ చేసి ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. అయితే ఎయిర్ ఇండియా అధికారులు ఈ విమానం మధ్యాహ్నం 1: 17 గంటలకు టేక్ ఆఫ్ కాగా.. 1:50 గంటలకి ఎమర్జెన్సీ డిక్లేర్ చేశారు అని చెప్పారు. మొత్తంగా ఈ విమాన ప్రయాణ సమయంలో 242 మంది ప్రయాణికులు 10 మంది సిబ్బంది, ఇద్దరు పైలెట్లు ఉన్నట్లు సమాచారం. ఈ విమాన ప్రమాదంతో ఆ ప్రాంతాల్లో బంధువుల రోదనలు మిన్నంటాయి. వీటికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. భారీ సంఖ్యలో మరణాలు సంభవించి ఉండొచ్చని వార్తలు కూడా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న ఈ విమానం మేఘానీనగర్ లో కుప్పకూలింది. సమాచారం ప్రకారం ఈ విమానం ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ చేరుకుని అక్కడ నుంచి లండన్కు బయలుదేరుతుంది.
కూలిన విమానంలో మాజీ సీఎం..?
అయితే ఈ రోజు ఈ కుప్పకూలిన అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమానంలో మాజీ సీఎం విజయ రూపాని కూడా ఉన్నట్లు సమాచారం. ఆయనతో పాటు పలువురు ముఖ్య నేతలు ఉన్నట్లు కూడా వార్తలు బయటకు వస్తున్నాయి. మరిన్ని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Also Read: తల్లికి వందనం అకౌంట్లలోకి రూ.13,000.. మిగతా రూ.2000 కోత ఎందుకంటే?
Also Read: జియో సూపర్హిట్ ప్లాన్.. రూ.895 కే 11 నెలల వ్యాలిడిటీ పొందే ఛాన్స్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.
Karimnagar: కరీంనగర్ రైతులకు ఎరువుల కష్టం.. వానాకాలం సాగు వేళ వ్యాపారుల దోపిడీ!
Hyderabad, Telangana:Karimnagar Fertilizer Shortage Telugu News: వానాకాలం సాగు సీజన్ ప్రారంభం వేల ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని అన్నదాతలను ఎరువుల కోరతతో పాటు ధరల మాయాజాలం తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవైపు ఆకాశాన్ని తాకుతున్న పెట్టుబడి వ్యాయాయంతో పాటు మరోవైపు నకిలీల భయంతో సతమతమవుతున్న రైతులకు.. ఇప్పుడు ఎరువుల వ్యాపారుల దోపిడీ అదనపు శాపంగా మారింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది దాదాపు 12.29 లక్షల ఎకరాల్లో వరి సాగుకు రైతాంగం సర్వం సిద్ధం చేసుకున్న తరుణంలో.. ఎరువుల కృత్రిమ కోరతతో పాటు అక్రమ విక్రయాలు వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తించేలా చేస్తున్నాయి..
పాత స్టాక్కు కొత్త ధరలు..
మార్కెట్లోని కొత్త నిలువలు రాకముందే.. పాత స్టాకులను కొత్త ధరలకు విక్రయిస్తూ కొందరు వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపణలు ఊహించని స్థాయిలో వెల్లువెత్తుతూ వస్తున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వం నిర్ణయించిన గరిష్ట విక్రయ ధరల కంటే ఒక్కొక్క ఎరువు బస్తా పై దాదాపు రూ.200 నుంచి రూ.300 వరకు అదనంగా వసూలు చేస్తున్నట్లు సమాచారం. దీనిపై ప్రశ్నించిన రైతులకు ఎరువులు లేవంటూ తెగేసి చెప్తుండడంతో.. చేసేదేమీ లేక అడిగినంత ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది..
యూరియా కావాలంటే.. అవి కొనాల్సిందే..
రైతులను నిలుపునా ముంచుతున్న మరో ప్రధాన సమస్య లింక్ బిజినెస్.. డిమాండ్ ఎక్కువగా ఉన్న యూరియా లేదా ఇతర ముఖ్యమైన కాంప్లెక్స్ ఎరువులు కావాలంటే.. వాటితో పాటు వ్యాపారులకు లాభాలు తెచ్చిపెట్టే ఇతర పనికిరాని జింక్ తో పాటు సల్ఫర్ లేదా బయో ప్రొడక్ట్స్ ను తప్పకుండా కొనుగోలు చేయాలని డీలర్లు మొండి చేస్తున్నారట.. యూరియా బస్తా కావాలంటే రూ.300 విలువ చేసే మరో మందు డబ్బాను బలవంతంగా అంటగడుతున్నారని.. దీనివల్ల వారికి అనవసరమైన ఆర్థిక భారం పెరుగుతుందని ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కొంతమంది రైతులు చెబుతున్నారు..
Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!
అధికారుల నిఘా కరవు..
అక్రమంగా పెంచిన ధరలకు విక్రయిస్తున్న కారణంగా.. వ్యాపారులు రైతులకు ఎలాంటి అధికారిక బిల్లులు ఇవ్వడం లేదు.. బిల్లులు అడిగితే స్టాక్ లేదని సాకులు చెబుతున్నారు. అంతేకాకుండా పీఓఎస్ మిషన్ల ద్వారానే విక్రయాలు జరపాలని నిబంధనలు ఉన్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో అవి అమలు కావడం లేదు.. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా రూ.12.29 లక్షల ఎకరాల్లో సాగు అవుతున్న నేపథ్యంలో ఎరువుల అవసరం చాలా ఎక్కువగా ఉంది. దీనిని ఆసరాగా చేసుకొని సాగుతున్న ఈ దోపిడీపై వ్యవసాయ శాఖ అధికారులు తక్షణమే స్పందించాలని.. ఆస్క్ ఫోర్స్ బృందాలతో పాటు ఇతర అధికారులు ప్రత్యేకమైన తనిఖీలు నిర్వహించి.. బ్లాక్ మార్కెట్ కు తరలిస్తున్న వారిపై.. లూటీ చేస్తున్న డీలర్ల పై కఠిన చర్యలు తీసుకోవాలని ఉమ్మడి జిల్లా రైతాంగం డిమాండ్ చేస్తుంది.
Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
Sarvartha Siddhi Yoga: జూన్ 15న సర్వార్థ సిద్ధి యోగం.. ఈ 5 రాశుల వారికి దిమ్మతిరిగే ధనలాభం, బంపర్ ఆఫర్లు!
Hyderabad, Telangana:Sarvartha Siddhi Yoga Effect On Zodiac: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. జూన్ 15వ తేదీ జాల ప్రత్యేకమైనది ఎందుకంటే ఇదే రోజున ఈ సంవత్సరం మిధున సంక్రాంతి వచ్చింది. అయితే, ఈరోజు అత్యంత శుభప్రదమైన సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఈ యోగం చాలా శక్తివంతమైనదిగా కూడా చెప్పుకుంటారు. దీని కారణంగా అన్ని రాశుల వారిపై ఊహించని ప్రభావం పడుతుంది. దీంతో ఆయా రాశుల వారికి అర్థికంగా అద్భుతమైన లాభాలు కలుగుతాయి. సర్వార్థ సిద్ధి యోగం ప్రభావంతో కొన్ని రాశుల వారికి దిమ్మ తిరిగే ధన లాభాలు కలుగుతాయి.. ముఖ్యంగా విజయాలు సాధించడమే కాకుండా ఆర్థిక పరంగా ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. అలాగే అనుకుంటున్నా పనుల్లో ఊహించని ఆర్థిక లాభాలు పొందగలుగుతారు. ఏవైనా సమస్యలు ఉన్నవారికి ఈ సమయంలో తప్పకుండా పరిష్కారం దొరుకుతుంది. అయితే, ఈ శక్తివంతమైన యోగ ప్రభావంతో ఏ రాశుల వారికి మేలు జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ రాశులవారికి బంపర్ లాభాలు..
మిథున రాశి
మిథున సంక్రాంతి సమయంలో ఏర్పడే సర్వార్థ సిద్ది యోగం ప్రభావంతో వీరికి ఆత్మవిశ్వాసం ఊహించని స్థాయిలో పెరుగుతుంది.. ముఖ్యంగా ఉద్యోగాల్లో కొత్త బాధ్యతలు లభించడమే కాకుండా చాలా కాలంగా నిలిచిపోయిన పనులు కూడా సులభంగా పూర్తవుతాయి. కొత్త కాంట్రాక్టులు లేదా లాభాలకు అవకాశాలు ఉన్నాయి కుటుంబ సంబంధాలు కూడా గతంలో కంటే ఇప్పుడు మరింత మెరుగుపడతాయి.
సింహరాశి
సింహరాశిలో జన్మించిన వ్యక్తులకు ఈ సమయంలో కొత్త ఆదాయ మార్గాలు కూడా తెరుచుకుంటాయి. దీంతోపాటు ఆర్థికంగా కూడా చాలా వరకు కలిసి వస్తుంది. అలాగే ఉద్యోగాలు చేస్తున్న వ్యక్తులందరికీ తప్పకుండా పదోన్నతులు కూడా కలుగుతాయి. ఉన్నతాధికారుల అద్భుతమైన ప్రశంసలు కూడా అందుకుంటారు. అలాగే సమాజంలో గౌరవంతో పాటు పలుకుబడి కూడా విపరీతంగా పెరుగుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.
తులారాశి
సర్వార్ధ సిద్ధ యోగంతో తులా రాశి వారికి కూడా అదృష్టం విపరీతంగా పెరుగుతుంది. ఉన్నత విద్య కోసం విదేశీ ప్రయాణాలు చేయాలనుకుంటున్న వ్యక్తులకు ఈ సమయం అద్భుతంగా ఉండబోతోంది. వ్యాపారాల విస్తరణకు ఈ సమయంలో అద్భుతమైన ప్రణాళికలను రచించే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ఆర్థిక స్థిరత్వం పెరగడమే కాకుండా కుటుంబంలో సంతోషకరమైన వాతావరణ నెలకొంటుంది.
ధనస్సు రాశి
ధనస్సు రాశిలో జన్మించిన వ్యక్తులకు కూడా ఈ సర్వార్ధ సిద్దయోగ ప్రభావం అద్భుతమైన అవకాశాలను అందిస్తుంది. అంతేకాకుండా భాగస్వామ్య వ్యాపారాలు చేసే వారికి ఈ సమయం ఎంతో అద్భుతమైన అవకాశాలని అందిస్తుంది. ఉద్యోగాలు చేసే వారికి ప్రాజెక్టులలో విజయ అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా బంధాలు మరింత బలపడి విశేషమైన లాభాలు కలుగుతాయి.
కుంభరాశి
శని అధిపతిగా వ్యవహరించే కుంభ రాశి వారికి కూడా సర్వార్ధ సిద్ధియోగ ప్రభావంతో అన్ని పనుల్లో సానుకూలమైన ఫలితాలు రావడం ప్రారంభమవుతాయి. ముఖ్యంగా ఉద్యోగాలు లేదా వ్యాపారాల్లో పోటీదారుల కంటే వీరు ముందుకెళ్లే అవకాశాలున్నాయి.. గతంలో కంటే ఇప్పుడు ఆరోగ్యం మెరుగుపడడమే కాకుండా మానసిక ఒత్తిడి కూడా విపరీతంగా తగ్గుతుంది.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
గమనిక.. 
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Kakinada: ఇన్స్టాగ్రామ్ లవ్.. భర్తను నిద్రమాత్రలిచ్చి చంపిన భార్య, 3 నెలల తర్వాత ప్రియుడు పంపిన ఒక్క మెసేజ్తో కథ అడ్డం తిరిగింది!
Hyderabad, Telangana:Instagram Affair Wife Brutally Kill Husband: ఇన్స్టాగ్రామ్ పరిచయాలు హత్యలకు కారణమవుతున్నాయి. సోషల్ మీడియాను కేవలం సమాచారం కోసం వాడాలని అనుకునే లోపే, భార్యాభర్తలు ఒకరి ప్రాణాలు మరొకరు తీసుకునే పరిస్థితులు వస్తున్నాయి. కాకినాడ జిల్లాలో జరిగిన ఈ ఘటనలో కూడా ఇన్స్టాగ్రామ్ పరిచయం వివాహేతర బంధానికి దారితీసింది. సర్పవరం గ్రామానికి చెందిన పుల్లా దుర్గాప్రసాద్ (38)మరణంపై పోలీసులు అనుమానంతో కేసు నమోదు చేశారు. దుర్గాప్రసాద్ భార్య దేవికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆయన ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. రెండు ఏళ్ల క్రితం గుండెకు స్టంట్లు వేయించుకోవడం వల్ల ఆయన అనారోగ్యంతో ఇంటి వద్దే ఉండేవారు. ఈ సమయంలో దేవికి బాపట్ల వ్యక్తి అయిన గోపి సాయితో ఇన్స్టాగ్రామ్ లో పరిచయం ఏర్పడి, అది వివాహేతర సంబంధంగా మారింది. వీరు బహిరంగంగానే తిరగడం మొదలుపెట్టారు. భర్త దుర్గాప్రసాద్ అనుమానించి నిలదీసినా, దేవి తన ప్రియుడితో సంబంధాన్ని కొనసాగించింది. చివరకు భర్తను తొలగించుకోవడానికి ఆమె ఒక పథకం వేశారు. తన ప్రియుడి ద్వారా 15 నిద్రమాత్రలను తెప్పించుకుంది. మార్చి 13న ఖర్జూర జ్యూస్ లో 13 మాత్రలు కలిపి భర్తకు తాగించింది. ఆయన స్పృహ కోల్పోగానే ముఖంపై దిండు పెట్టి ఊపిరి ఆడకుండా చేసి చంపేసింది. ఆ తర్వాత భర్తకు గుండెపోటు వచ్చిందని కుటుంబ సభ్యులను నమ్మించి ఆసుపత్రికి తీసుకెళ్లింది, కానీ అక్కడ వైద్యులు మృతిని నిర్ధారించారు.
నిజం ఎలా తెలిసొచ్చినట్టంటే...
భర్త మరణం తర్వాత దేవి తన ప్రియుడితో మాట్లాడటం తగ్గించింది. దీనితో అనుమానపడిన ప్రియుడు, ఈ నెల 9వ తేదీన మృతుడి కుమార్తె ఫోన్కు వాట్సాప్ మెసేజ్ పంపాడు. అందులో 'నీ తంద్రిని మీ అమ్మే చంపింది, నిద్రమాత్రలు నేనే ఇచ్చాను' అని రాసి ఉంది. దీనితో మృతుడి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు నిందితురాలిని విచారించి అసలు నిజాన్ని బయటపెట్టారు. తాను భర్తను ఎలా చంపాడో ఆమె వివరించింది. వాట్సాప్ చాట్ స్క్రీన్షాట్లు, మొబైల్ డేటా, హత్యకు వాడిన దిండు , మిగతా నిద్రమాత్రలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దేవి, ప్రియుడు గోపి సాయిని పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచి, రిమాండ్కు తరలించారు.
READ ALSO: సీఐ రాజు బాగోతం.. భర్తపై ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను గర్భవతిని చేసి, టాబ్లెట్లు మింగించి ఘోరం!
READ ALSO: అమ్మతనానికే కళంకం.. ప్రియుడి కోసం 6 ఏళ్ల కూతురిని వాటర్ ట్యాంక్లో పడేసి అల్వాల్లో గుండెలవిసే దారుణం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Rahu Kethu Pooja: శ్రీకాళహస్తిలో ముకేశ్ అంబానీ కొడుకు అనంత్ రాహు కేతు పూజ
Nunna, Vijayawada, Andhra Pradesh:Mukesh Ambani Son Anant Ambani And Daughter In Law Offers Special Pooja At Srikalahasti TempleKTR: త్వరలో కేసీఆర్ బస్సు యాత్ర పక్కా: కేటీఆర్
Srikalahasti, Mitta Kandriga, Andhra Pradesh:KT Rama Rao: KCR Will Start Bus Yatra Soon Ahead Assembly Elections Watch CommentsHyderabad Rain: హైదరాబాద్లో దంచికొట్టిన వాన.. తెలంగాణ సీఎం విమానం దారి మళ్లింపు
Hyderabad, Telangana:Telangana CM Flight Diversion: మృగశిర కార్తె ప్రారంభమైన తర్వాత తెలంగాణలో వర్షాలు జోరుగా పడుతున్నాయి. నైరుతి రుతుపవనాలు ప్రవేశించడంతో రాష్ట్రవ్యాప్తంగా కుండపోత వానలు కురుస్తున్నాయి. రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో ఒక రోజు విరామంలో మరోసారి వరుణుడు దంచికొట్టాడు. శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ నగరమంతటా భారీ వర్షం కురిసింది. దాదాపు గంట వరకు నిరాటంకంగా పెద్ద ఎత్తున వాన పడింది. కుండపోత వర్షం ధాటికి నగరంలోని రోడ్లన్ని జలమయం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో హైదరాబాద్లో మరోసారి జనజీవనం స్తంభించింది. ఈ వర్షం ప్రభావంతో ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న విమానం దారి మళ్లింది. ఈ వివరాలు ఇలా ఉన్నాయి.
ట్రాఫిక్ జామ్
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో భారీ వర్షం పడింది. మేడ్చల్, శామీర్పేట్, అల్వాల్, బొల్లారం పరిసర ప్రాంతాల్లో గంటపాటు వర్షం దంచి కొట్టింది. పలు కాలనీల్లో జల ప్రవాహం పోటెత్తింది. రోడ్లు జలదిగ్భంధమయ్యాయి. ఈదురు గాలుల కారణంగా విద్యుత్ సరఫరాకు కొన్నిచోట్ల అంతరాయం ఏర్పడింది. వర్షం కారణంగా మేడ్చల్ జాతీయ రహదారి 44పై ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
హైదరాబాద్లోని కూకట్పల్లి, కేపీహెచ్బీ, జేఎన్టీయూ పరిసర ప్రాంతాలలో ఉరుములతో కూడిన వర్షం పడింది. ఉద్యోగులు ఇంటికి చేరుకున్న తర్వాత ఏకతాటిగా వర్షం పడుతుండడంతో కొద్దిగా ఉపశమనం కలిగించే విషయమైనా వివిధ పనుల మీద బయటికి వెళ్లే వారికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
పాతబస్తీలో..
హైదరాబాద్లోని పాతబస్తీలో కూడా జోరుగా వర్షం కురిసింది. పాతబస్తీ ఫలక్నుమా, బహదూర్పురా, కిషన్బాగ్, చార్మినార్, నూర్ఖాన్ బజార్, షా అలీ బందా హుస్సేనీ ఆలమ్లో భారీ వాన పడింది.
వర్షం కారణంగా శంషాబాద్ విమానాశ్రయంలో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఢిల్లీ నుంచి హైదరాబాద్ వస్తున్న ముఖ్యమంత్రి విమానం కూడా ప్రభావితమైంది. ల్యాండయ్యే అవకాశాలు లేకపోవడంతో విమానాన్ని బెంగళూరుకు దారి మళ్లించారు. హైదరాబాద్లో బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షం పడుతున్న నేపథ్యంలో ఢిల్లీ నుంచి శంషాబాద్ వస్తున్న ఇండిగో విమానం బెంగళూరుకు మళ్లించారు. శంషాబాద్ వస్తున్నప్పుడు మార్గమధ్యలో వాతావరణం అనుకూలించకపోవడంతో ల్యాండింగ్కు ఏటీసీ కంట్రోల్ అనుమతి ఇవ్వలేదు.
Ambani Temple Tour: తిరుమల ఆలయంలో ముకేశ్ అంబానీ కుటుంబం
Dharmavaram, Andhra Pradesh:Mukesh Ambani Visits Tirumala Temple Along With Anant Ambani And Radhika Merchant Watch VideoFood Adulteration: తిరుపతిలో దారుణం..హోటళ్లలో కుళ్లిన మాంసంతో బిర్యానీ..నాన్-వెజ్ ప్రియులకు షాకింగ్ న్యూస్!
Tirupati, Andhra Pradesh:Food Adulteration Tirupati: మస్త్ మస్త్ మటన్ బిర్యానీ, ఘుమఘుమలాడే చికెన్ బిర్యానీ అని హోటళ్లకు వెళ్లి లొట్టలేసుకుని తింటున్నారా? బోటీ భలేగా ఉంది.. పాయ అద్దిరిపోయిందంటూ తెగ జుర్రేస్తున్నారా? అయితే నాన్-వెజ్ ప్రియులారా.. ఒక్క నిమిషం ఆగండి! మీరు తింటున్నది తాజా మాంసం కాకపోవచ్చు, అది మీ ఆరోగ్యానికి తీవ్ర హాని కలిగించే కాలకూట విషం కూడా కావచ్చు. పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతి నగరంలో వెలుగుచూసిన కల్తీ మాంసం దందా వ్యవహారం ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది.
డబ్బే పరమావధిగా భావిస్తూ, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కల్తీగాళ్లు టన్నుల కొద్దీ కుళ్లిపోయిన మాంసాన్ని దర్జాగా హోటళ్లు, రెస్టారెంట్లకు సప్లై చేస్తూ జేబులు నింపుకుంటున్నారు. గత కొన్ని రోజులుగా ప్రజల నుంచి వస్తున్న వరుస ఫిర్యాదులపై తిరుపతి నగరపాలక సంస్థ అధికారులు ఉక్కుపాదం మోపారు. హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ నేతృత్వంలో అధికారులు.. నగరంలోని పెద్ద పీర్ల చావడి ప్రాంతంలో ఉన్న మటన్ మార్కెట్పై శనివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఫ్రీజర్లలో నిల్వ ఉంచిన మాంసాన్ని చూసి అధికారులు సైతం ఒక్కసారిగా విస్తుపోయారు.
వెలుగుచూసిన షాకింగ్ నిజాలు..
పొరుగు రాష్ట్రాల నుండి తక్కువ ధరకే తీసుకొచ్చిన మేకలు, పొట్టేళ్ల తలలు, కాళ్లు, బోటీలను ఎన్నో రోజులుగా ఫ్రీజర్లలో నిల్వ ఉంచి విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. చూపించడానికి కూడా వీల్లేనంతగా కుళ్లిపోయిన ఆ మాంసం నుండి కిలోమీటర్ల మేర కంపు కొడుతోంది. కొన్ని దుకాణాల్లో ఫ్రీజర్లలో గడ్డకట్టుకుపోయిన కుళ్లిన మాంసాన్ని బయటకు తీయడానికి తుప్పుపట్టిన ఇనుప చువ్వలను వాడారంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
15 దుకాణాలు సీజ్..!
ఈ ఆకస్మిక దాడుల్లో భాగంగా మొత్తం 15 దుకాణాల్లో నిల్వ ఉంచిన కుళ్లిన మాంసాన్ని అధికారులు గుర్తించారు. దాదాపు 1,000 కిలోలకు పైగా (ఒక టన్ను) కల్తీ మటన్ను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. ప్రజారోగ్యానికి తీవ్రమైన హాని కలిగిస్తూ, కల్తీ దందాకు పాల్పడుతున్న సదరు మటన్ షాపుల యజమానులపై పలు సెక్షన్ల కింద క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎన్నిసార్లు తనిఖీలు చేస్తున్నా కల్తీగాళ్లలో మార్పు రావడం లేదు. అందుకే బయట నాన్-వెజ్ తినేటప్పుడు, కొనేటప్పుడు వినియోగదారులు కూడా కాస్త అప్రమత్తంగా ఉండటం ఎంతో అవసరం!
Also Read: ఏపీలో కూటమి ప్రభుత్వంపై డిప్యూటీ CM పవన్ సంచలన వ్యాఖ్యలు..21 సీట్ల పోటీపై క్లారిటీ!
Also REad: దసరా, సంక్రాంతికి స్కూల్ సెలవుల లిస్టు వచ్చేసింది! ఈ ఏడాది 87 రోజులు సెలవులు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Remuneration Item Song: ఐటెంసాంగ్ ద్వారా భారీగా సంపాదించిన హీరోయిన్ ఈమెనే! ఒక్క పాటకి అన్ని కోట్ల రూపాయలా?
Hyderabad, Telangana:Highest Remuneration For Item Song: సినిమా ఇండస్ట్రీల్లో ఐటమ్ సాంగ్స్ కేవలం అభిమానులను అలరించడానికే కాదు.. కొన్నిసార్లు ఇవి సినిమా విజయానికి, మరోవైపు ప్రమోషన్లకు ప్రధాన బలంగా మారుతుంటాయి. మొన్నటి 'మున్నీ బద్నామ్ హుయీ' నుండి నిన్నటి 'ఆజ్ కీ రాత్' వరకు.. ఎన్నో పాటలు సినిమా కంటే పెద్ద హిట్గా నిలిచాయి. అందుకే స్టార్ హీరోయిన్లు కూడా ఈ ప్రత్యేక గీతాల్లో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. కేవలం మూడు, నాలుగు నిమిషాల పాట కోసం ఈ భామలు అందుకునే పారితోషికం కోట్లలో ఉంటుంది. భారతీయ చిత్ర పరిశ్రమలో ఐటమ్ సాంగ్స్ ద్వారా భారీగా క్రేజ్, రెమ్యునరేషన్ అందుకున్న టాప్ హీరోయిన్ల వివరాలను తెలుసుకుందాం.
1) సమంత రూత్ ప్రభు - రూ. 5 కోట్లు
ఐటమ్ సాంగ్స్ చరిత్రలోనే అత్యధిక పారితోషికం అందుకున్న నటిగా సమంత సరికొత్త రికార్డు సృష్టించింది. 'పుష్ప: ది రైజ్' సినిమాలోని 'ఊ అంటవా మావా ఊహూ అంటవా' పాట దేశవ్యాప్తంగా ఎలాంటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. సమంత కెరీర్ లోనే ఇది మొదటి స్పెషల్ సాంగ్ కావడం విశేషం. కేవలం 3 నిమిషాల నిడివి గల ఈ పాట కోసం సమంతకు ఏకంగా రూ. 5 కోట్లు చెల్లించారట.
2) సన్నీ లియోన్ - రూ. 3 కోట్లు
ఐటమ్ సాంగ్స్ అనగానే సన్నీ లియోన్ పేరు మొదటగా వినిపిస్తుంది. ఆమె కెరీర్ను మలుపు తిప్పిన 'బేబీ డాల్' పాట 2010వ దశకంలోనే అతిపెద్ద హిట్ డ్యాన్స్ ట్రాక్లలో ఒకటిగా నిలిచింది. ఆమె పాపులారిటీ పీక్స్లో ఉన్న సమయంలో ఒక్కో ఐటమ్ సాంగ్కు రూ.3 కోట్ల వరకు పారితోషికం వసూలు చేసేవారని టాక్.
3) మలైకా అరోరా - రూ. 2.5 కోట్లు
బాలీవుడ్లో ఐటమ్ నంబర్ల ట్రెండ్ను పూర్తిగా మార్చేసి, దేశవ్యాప్తంగా ఊపు ఊపిన పాట 'మున్నీ బద్నామ్ హుయీ'. 2010లో వచ్చిన 'దబంగ్' సినిమాలోని ఈ పాటలో మలైకా అరోరా చేసిన మాస్ స్టెప్స్, హుక్ స్టెప్స్ విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఆ సమయంలోనే ఈ పాట కోసం మలైకాకు రూ.2.5 కోట్లు చెల్లించారు. అయితే ఈమె 'దబంగ్' రీమేక్ 'గబ్బర్ సింగ్' ఐటెంసాంగ్లోనూ నటించడం గమనార్హం.
4) కత్రినా కైఫ్ - రూ.2 కోట్లు
'అగ్నిపథ్' సినిమాలోని 'చిక్నీ చమేలీ' పాట బాలీవుడ్ క్లాసిక్ ఐటమ్ సాంగ్స్ లో ఒకటిగా నిలిచింది. కత్రినా కైఫ్ వేసిన అద్భుతమైన మాస్ స్టెప్స్ ఈ పాటను మరో స్థాయికి తీసుకెళ్లాయి. ఈ సూపర్ హిట్ సాంగ్ కోసం కత్రినా రూ.2 కోట్లు అందుకుందని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.
5) నోరా ఫతేహి - రూ. 2 కోట్లు
ప్రస్తుతం బాలీవుడ్లో మోస్ట్ పాపులర్ డ్యాన్స్ ఆర్టిస్టులలో నోరా ఫతేహి ఒకరు. ఆమె డాన్స్తో యూట్యూబ్లో రికార్డులు సృష్టించిన 'దిల్బర్ దిల్బర్' పాట ఇప్పటికీ అందరి నోళ్లలో మారుమోగుతూనే ఉంది. ఈ వైరల్ సాంగ్ కోసం నోరాకు రూ. 2 కోట్లు చెల్లించినట్లు సమాచారం.
6) తమన్నా భాటియా - రూ.1 కోటి
ఇటీవల 2024లో సోషల్ మీడియాను షేక్ చేసిన పాటల్లో 'స్త్రీ 2' సినిమాలోని 'ఆజ్ కీ రాత్' ఒకటి. తమన్నా భాటియా తన గ్లామర్, ఉత్సాహభరితమైన నృత్యంతో ఈ పాటను సినిమా కంటే పెద్ద హిట్ చేసింది. ఈ క్రేజీ సాంగ్ కోసం తమన్నా సుమారు రూ. 1 కోటి పారితోషికం అందుకుందని తెలుస్తోంది.
వీరితో పాటు 'జలేబీ బాయి' పాటతో వెండితెరపై హాట్ డ్యాన్స్తో మెప్పించిన మల్లికా షెరావత్ కూడా ఈ ఐటమ్ సాంగ్స్ ద్వారా కోట్లాది రూపాయల పారితోషికాన్ని అందుకుందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.
Also Read: మ్యూజిక్ డైరెక్టర్ను బీచ్లో పాతిపెట్టిన అనిల్ రావిపూడి..ఇలా కూడా చేస్తారా గురూ!
Also REad: విజయ్ దళపతి విడాకులు క్యాన్సిల్.. భర్తతో కలిసుండేందుకు సంగీత అంగీకారం?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Tirumala Rains: తిరుమల, తిరుపతిలో కుండపోత వర్షం.. వణికిన నెల్లూరు జిల్లా
Nellore, Andhra Pradesh:Rain Alert: వర్షాకాలం ఆంధ్రప్రదేశ్లో జోరందుకుంది. వర్షాకాలం ప్రారంభమే భారీ వర్షాలు పడుతుండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తుండగా సాధారణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండడంతో దీని ప్రభావం ఏపీపై పడింది. దీంతో తిరుమల కొండతోపాటు తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం ఈ మూడు ప్రాంతాల్లో కుండపోత వర్షం పడింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. నగరంలో భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి తీవ్రమైన ఉక్కపోతతో ఇబ్బంది పడిన తిరుపతి నగరవాసులకు ఈ వర్షం పెద్ద ఉపశమనాన్ని ఇచ్చింది. ఒక్కసారిగా వాతావరణం చల్లబడటంతో ప్రజలకు ఊరట లభించింది. భారీ వర్షానికి నగరంలోని ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. లోతట్టు ప్రాంతాల్లో భారీగా నీరు చేరడంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగింది. తిరుపతి నగరంలోని తిలక్ రోడ్, లక్ష్మీపురం సర్కిల్, మాధవనగర్ వంటి ప్రాంతాల్లో వర్షపు నీరు రోడ్లపై నిలిచిపోయింది. డ్రైనేజీలు పొంగిపొర్లడంతో కాలినడకన వెళ్లే ప్రజలు, వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ట్రాఫిక్ను క్రమబద్ధీకరించడానికి అధికారులు చర్యలు చేపట్టారు.
ఏడుకొండలపై..
తిరుమలలో శుక్రవారం భారీ వర్షం కురిసింది. సుమారు గంటకు పైగా కురిసిన జోరు వానతో తిరుమలలోని ఆలయ పరిసరాలు జలమయమయ్యాయి. భారీ వర్షానికి రోడ్లపై భారీగా వర్షపు నీరు నిలిచిపోయింది. వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అధికారులు అప్రమత్తమై పరిస్థితిని పర్యవేక్షిస్తూ ప్రజలు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకున్నారు.
నెల్లూరులో
తిరుమల, తిరుపతితోపాటు నెల్లూరు జిల్లాలో భారీ వర్షం పడింది. నెల్లూరు నగరంతో పాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షంతో రోడ్లు జలమయమయ్యాయి. వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. వర్షంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
DA HIKE 2026: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పండగే.. DA పెంపుపై MODI సర్కార్ కీలక నిర్ణయం.. సాలరీ ఎంత పెరుగుతుందంటే?
Secunderabad, Telangana:DA HIKE 2026: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అలాగే పెన్షనర్లకు వేతనాలు సవరించేందుకు ఎనిమిదవ పే కమిషన్ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే ఈ పే కమిషన్ అధ్యయనం ప్రారంభించి దాదాపు 6 నెలల సమయం గడిచింది. మరో ఏడాది కాలంలోగా 8వ పే కమిషన్ సంబంధించి సిఫార్సులు కేంద్ర ప్రభుత్వానికి అందనున్నాయి. ఈ నేపథ్యంలో ఏడవ వేతన సంఘం సిఫార్సులే ఇంకా అమలు అవుతున్నాయని చెప్పాలి.
అయితే ఏడవ వేతన సంఘం సిఫార్సు చేసినటువంటి డీఏ పెంపుదల ఏడాదికి రెండుసార్లు జరుగుతుంది. 2026 ఏడాదికి సంబంధించిన మొదటి డి ఏ రెండు శాతం పెంచుతూ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రస్తుతం డిఏ 58శాతం నుంచి 60శాతానికి చేరుకుంది. డీఏ అంటే డియర్ నెస్ అలవెన్స్ అని అర్థం. పెరుగుతున్న ధరలు ద్రవ్యోల్బణం నుంచి ఉద్యోగులకు పెన్షనర్లకు ఉపశమనం కల్పించేందుకు ఉద్యోగులకు డిఏ.. పెన్షనర్లకు డిఆర్ చెల్లిస్తుంటారు.
2026 సంబంధించి ఇప్పటికే ఒక దఫా డి ఏ చెల్లించారు. అయితే మొత్తం 58% గా ఉన్న డి ఏ 60 శాతానికి చేరుకుంది. ఈ లెక్కన 18వేల రూపాయల వేతనం పొందే ఒక ఉద్యోగి అదనంగా 360 రూపాయల వేతనం పెరుగుతుంది. ఈ లెక్కన ఆరు నెలలకు గాను గమనిస్తే 2610 రూపాయలు అదనంగా లభిస్తాయి. ఇక రెండో దఫా కిందా జూలై నెల నుంచి డిసెంబర్ నెల వరకు వర్తించే డి ఏను మరో మూడు శాతం పెంచినట్లయితే అప్పుడు డిఏ 60% నుంచి 63 శాతానికి పెరుగుతుంది .
ఈ లెక్కన గమనిస్తే 18 బేసిక్ వేతనం లభించే ఉద్యోగికి మూడు శాతం డి ఏ పెంచినట్లయితే నెలకు 540 రూపాయలు అదనంగా లభిస్తాయి. అంటే దీని ఆరు నెలల మొత్తానికి లెక్కించినట్లయితే 5400 అవుతుంది. మరోవైపు 8వ పే కమిషన్ సంబంధించి తమ విజ్ఞప్తులను కమిషన్కు తెలియజేసేందుకు జూన్ 15వ తేదీ వరకు అవకాశం ఉంది. అప్పటివరకు ఉద్యోగులు లేదా పెన్షనర్లు ఉద్యోగ సంఘాలు తమ డిమాండ్లను ఎనిమిదవ పే కమిషన్ కి తెలియజేయడానికి అవకాశం ఉంది.
అయితే ఇది అధికారిక పోర్టల్ ద్వారా మాత్రమే ఛాన్స్ ఉంది. ఎలాంటి మెమొరండంలో స్వీకరించేందుకు కమిషన్ అవకాశం ఇవ్వలేదు. కేవలం ఆన్లైన్ ద్వారా మాత్రమే అవకాశం ఉంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగ సంఘాలు తమ డిమాండ్ తెలియజేస్తూ ఎనిమిదో వేతన సంఘానికి ఆన్లైన్ ద్వారా మెమోరండమ్స్ పంపుతున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే మరోవైపు ఉద్యోగ సంఘాలు ఈసారి వేతన విషయంలో గట్టిపట్టు పడుతున్నాయి. ఏడవ వేతనం సంఘం సిఫారసు చేసిన 2.57 కన్నా ఎక్కువ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ప్రకటించాలని పెద్దెత్తునా డిమాండ్లు వినిపిస్తున్నాయి. దీనిపై మరి వేతన సంఘం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.
Also Read: ఇంటిని నడిపే మహిళలు దేశ నిర్మాతలు .. కోర్టు వ్యాఖ్యలు వింటే గర్వపడతారు..!!
Also Read: కుత్బుల్లాపూర్, మేడ్చల్, శామీర్పేటలో ఇళ్ల స్థలాల రేట్లకు రెక్కలు
Also Read: ఉద్యోగులకు అలర్ట్.. మీ అకౌంట్లో PF Interest ఇంకా పడలేదా? అసలు కారణం ఇదే..!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Anil Ravipudi GV Prakash: మ్యూజిక్ డైరెక్టర్ను బీచ్లో పాతిపెట్టిన అనిల్ రావిపూడి..ఇలా కూడా మూవీ ప్రమోషన్స్ చేస్తారా గురూ :)!
Hyderabad, Telangana:Anil Ravipudi GV Prakash Promo: టాలీవుడ్లో కొన్ని కాంబినేషన్లు ఎప్పటికీ బోర్ కొట్టవు. ఆ ఇద్దరూ కలిశారంటే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురవాల్సిందే, ఫ్యామిలీ ఆడియన్స్కు పండగ రావాల్సిందే! అలాంటి ఒక క్రేజీ కాంబోనే విక్టరీ వెంకటేష్, బ్లాక్బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఇప్పటివరకు వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన 'ఎఫ్ 2', 'ఎఫ్ 3', 'సంక్రాంతికి వస్తున్నాం', 'మనశంకర వరప్రసాద్' వంటి నాలుగు సినిమాలు బాక్సాఫీస్ వద్ద వరుసగా బ్లాక్బస్టర్ విజయాలు సాధించాయి.
ఇప్పుడు ఈ సక్సెస్ ఫుల్ కాంబో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సారి ఇదొక భారీ మల్టీస్టారర్ ప్రాజెక్ట్గా రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమాలో వెంకటేష్తో పాటు నందమూరి కల్యాణ్ రామ్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తుండటంతో, సినిమాపై అంచనాలు అప్పుడే ఆకాశాన్ని తాకాయి.
జంధ్యాల సీన్ రీ-క్రియేషన్!
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ను చిత్ర బృందం పంచుకుంది. ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ స్వరాలు సమకూర్చనున్నారు. ఈ విషయాన్ని ప్రకటిస్తూ డైరెక్టర్ అనిల్ రావిపూడి షేర్ చేసిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
Thank you, @AnilRavipudi sir, for the warm welcome and for making even a Music Director announcement this entertaining❤️🔥
Had a great time shooting this fun concept, and looking forward to many more such memorable moments together. 😄
Extremely happy to join hands with you for… pic.twitter.com/dXQbODOZoO
— G.V.Prakash Kumar (@gvprakash) June 12, 2026
సముద్రం ఒడ్డున జీవీ ప్రకాష్ను పాతిపెట్టినట్లు చూపిస్తూ, దివంగత దర్శకుడు జంధ్యాల గారి చిత్రంలోని ఒక క్లాసిక్ కామెడీ సీన్ను వీరిద్దరూ రీ-క్రియేట్ చేశారు. అనిల్ రావిపూడి తనదైన శైలిలో చేసిన ఈ వెల్కమ్ వీడియో నెటిజన్లను ఎంతగానో నవ్విస్తోంది.
ఈ భారీ మల్టీస్టారర్ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్పై సాహు గారపాటి, హరీష్ పెద్దిలతో పాటు జీ స్టూడియోస్, సురేష్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్, నందమూరి కల్యాణ్ రామ్ హీరోలుగా నటిస్తున్నారు. వీరిద్దరి సరసన కీర్తి సురేష్, కృతి శెట్టిని ఎంపిక చేసినట్లు సమాచారం అందుతోంది.
త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ను వచ్చే ఏడాది సంక్రాంతి లేదా సమ్మర్ కానుకగా థియేటర్లలో విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
Also REad: విజయ్ దళపతి విడాకులు క్యాన్సిల్.. భర్తతో కలిసుండేందుకు సంగీత అంగీకారం?
Also REad: 'పెద్ది' సినిమాకు జాన్వీ ఎన్ని కోట్లు తీసుకుందో తెలుసా? ఒక్క సినిమాకే హీరోకి పోటీగా!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Ambani Family: ఆధ్యాత్మిక యాత్రలో ముకేశ్ అంబానీ కుటుంబం.. తిరుమల, శ్రీకాళహస్తి సందర్శన
Srikalahasti, Andhra Pradesh:Ambani Family Temple Tour: అపర కుబేడరుడు.. ప్రపంచంలోని అత్యంత ధనవంతుడు ముకేశ్ అంబానీ కుటుంబం ఆధ్యాత్మిక యాత్ర చేపట్టింది. ప్రముఖ క్షేత్రాలను సందర్శించి మొక్కులు తీర్చుకున్నారు. ఏపీలోని తిరుమల ఆలయంతోపాటు శ్రీకాళహస్తి ఆలయాన్ని సందర్శించారు. ఆయా ఆలయాల్లో స్వామివారిని దర్శించుకుని.. మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. పారిశ్రామికవేత్త కుటుంబానికి తిరుమల క్షేత్రంలో ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ కుటుంబం శ్రీవారి అభిషేక సేవలో పాల్గొన్నారు.అంబానీతో పాటు ఆయన కుమారుడు అనంత్ అంబానీ, కోడలు రాధికా మర్చంట్ మరియు రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ శ్రీవారిని దర్శించుకున్నారు.
తిరుమల, శ్రీకాళహస్తి పర్యటన కోసం గురువారం రాత్రి అంబానీ కుటుంబం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. రాత్రి తిరుమల కొండపైకి చేరుకున్న వారు శుక్రవారం స్వామివారిని దర్శించుకున్నారు. మొదట తిరుమల వేంకటేశ్వర స్వామిని రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ కుటుంబంతో సహా దర్శించుకున్నారు. ఆయనతోపాటు కుమారుడు అనంత్ అంబానీ, కోడలు రాధికా మర్చంట్ స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అంబానీ కుటుంబసభ్యులు అభిషేక సేవలో పాల్గొని స్వామి సేవలో తరించారు.
ఘన స్వాగతం
దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు అంబానీ కుటుంబానికి వేదాశీర్వచనం పలికారు. అనంతరం ఆలయ అధికారులు వారికి పట్టువస్త్రంతో సత్కరించి.. శ్రీవారి తీర్థప్రసాదాలను అందజేశారు. అంబానీ కుటుంబం తిరుమల శ్రీవారిని దర్శించుకోవడంతో ఆలయ పరిసరాల్లో సందడి వాతావరణం ఏర్పడింది. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కూడా స్వామిని దర్శించుకున్నారు. టీటీడీ అధికారులు, అర్చకులు ఘన స్వాగతం పలికి ప్రత్యేకంగా శ్రీవారి దర్శన ఏర్పాట్లు చేశారు.
శ్రీకాళహస్తిలో పూజలు
దక్షిణ కైలాసంగా ప్రఖ్యాతి చెందిన శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి శుక్రవారం ఉదయం రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ వచ్చారు. ఆలయానికి వచ్చిన అనంత్ అంబానీ బృందానికి ఆలయ అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక రాహుకేతు పూజలు నిర్వహించారు. అనంతరం కాళహస్తీశ్వరుడు, జ్ఞాన ప్రసునాంబ అమ్మవార్ల దర్శనం చేసుకున్నారు. గురుదక్షిణామూర్తి దగ్గర ఆలయ వేద పండితులు ఆశీర్వాదం చేయగా.. ఈవో, స్థానిక ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆయనకు స్వామివారి తీర్థప్రసాదాలతోపాటు చిత్రపటాన్ని అందజేశారు.
పులి సంచారం
తిరుపతిలో చిరుత పులి సంచారం మరోసారి స్థానికులు, విద్యార్థులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతిలో అటవీ ప్రాంతాన్ని ఆనుకుని ఉండే ఐకానిక్ శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ క్యాంపస్లోకి చిరుతపులి ప్రవేశించింది. క్యాంపస్లోని భవనాల మధ్య చిరుత కనిపించడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. తిరుపతి నగరంలో చిరుత పులుల సంచారం రోజురోజుకూ పెరిగిపోతోంది. తాజాగా ఎస్వీ యూనివర్సిటీ క్యాంపస్లో చిరుత ప్రత్యక్షమవడంతో విద్యార్థులు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని పరుగులు తీశారు. యూనివర్సిటీలోని ప్రముఖ చొప్పల రత్నం బిల్డింగ్ ఐ, జీ బ్లాక్ మధ్య చిరుతపులి సంచరిస్తుండటాన్ని గమనించిన విద్యార్థులు, స్థానికులు భయపడుతున్నారు. వెంటనే అప్రమత్తమైన విద్యార్థులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. అయితే సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకునేలోపే ఆ చిరుతపులి సమీపంలోని దట్టమైన అటవీ ప్రాంతంలోకి పారిపోయింది. చిరుత ఎప్పుడు ఎటువైపు నుంచి దాడి చేస్తుందోనని విద్యార్థులు, వర్సిటీ సిబ్బంది తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి క్యాంపస్ పరిసరాల్లో నిఘా పెంచాలని, విద్యార్థుల భద్రతకు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
తిరుమల కిటకిట
వేసవి సెలవుల ప్రభావం తిరుమల ఆలయంలో కొనసాగుతోంది. తిరుమలకు పెద్ద ఎత్తున భక్తులు దర్శించుకుంటున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 18 గంటలు సమయం పడుతోంది. అన్ని కంపార్ట్మెంట్లు నిండి నారాయణగిరి, ఔటర్ రింగ్ రోడ్డు, శిలాతోరణం, ఆక్టోపస్ బిల్డింగ్, గోగర్భం డ్యాం వరకు సుమారు 4 కిలోమీటర్ల మేర క్యూలైన్లో భక్తులు వేచి ఉన్నారు.
FIFA World Cup 2026: ఫుట్బాల్ మ్యాచ్లో హద్దు దాటిన లేడీ ఫ్యాన్..ప్రైవేట్ పార్ట్స్ కనబడేలా స్టేడియంలో రచ్చ..వీడియో!
Burtinle, Nugaal:FIFA World Cup Lady Fan Viral Video: ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫుట్బాల్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న 'ఫిఫా ప్రపంచకప్ 2026' టోర్నమెంట్ అత్యంత ఉత్కంఠభరితంగా ప్రారంభమైంది. గ్రూప్-ఏ లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్లోనే ఆతిథ్య మెక్సికో జట్టు 2-0 గోల్స్ తేడాతో సౌతాఫ్రికాను చిత్తు చేసి ఘనవిజయాన్ని అందుకుంది. అయితే, ఈ మ్యాచ్ ఆట పరంగానే కాకుండా.. రిఫరీ తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలు, గ్యాలరీలో ఒక మహిళా అభిమాని చేసిన హంగామాతో నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
గ్యాలరీలో హద్దులు దాటిన లేడీ ఫ్యాన్!
మ్యాచ్ ప్రారంభమైన 9వ నిమిషంలోనే మెక్సికో మిడ్ఫీల్డర్ ఎరిక్ లిరా అందించిన పాస్తో జూలియన్ క్వినోనెస్ అద్భుతమైన తొలి గోల్ సాధించాడు. ఆ సమయంలో గ్యాలరీలోని మెక్సికన్ మహిళా అభిమాని ఒకరు ఆనందంతో హద్దులు దాటి ప్రవర్తించింది. గోల్ పడిన సంతోషంలో ఒళ్లు మరిచి, తన ప్రైవేట్ భాగాలను (ఛాతిభాగం) బహిర్గతం చేస్తూ చిందులు వేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్గా మారి సెగలు పుట్టిస్తోంది. దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఆమె కావాలనే అలా చేసిందని కొందరు విమర్శిస్తుండగా, మెక్సికన్ సంస్కృతిలో ఇది సాధారణమే అని మరికొందరు సమర్థిస్తున్నారు.
No one brings the energy like Mexico fans ♥️ pic.twitter.com/43nhUQBuG2
— World Cup 2026 (@ofootball__) June 11, 2026
ఒకే మ్యాచ్లో 3 రెడ్ కార్డ్లు..
ఈ మ్యాచ్లో మెక్సికో విజయం కంటే రిఫరీ నిర్ణయాలే ఎక్కువగా హాట్ టాపిక్గా మారాయి. ఫుట్బాల్ చరిత్రలోనే అత్యంత అరుదుగా.. ఈ మ్యాచ్లో రిఫరీ ఏకంగా ముగ్గురు ఆటగాళ్లకు నేరుగా 'రెడ్ కార్డ్' చూపించి మైదానం వెలుపలికి పంపారు. కనీసం 'ఎల్లో కార్డ్' హెచ్చరికలు కూడా ఇవ్వకుండా రిఫరీ తీసుకున్న ఈ నిర్ణయంపై క్రీడా విశ్లేషకులు, ప్రేక్షకులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఓడిపోయిన దక్షిణాఫ్రికా ఫ్యాన్స్.. "ఈ మ్యాచ్లో రిఫరీకే 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు ఇవ్వాలి" అంటూ సోషల్ మీడియాలో వ్యంగ్యంగా ట్రోల్స్ చేస్తున్నారు.
వివాదాలు పక్కన పెడితే, ఆతిథ్య మెక్సికో జట్టు ఈ మ్యాచ్లో కొన్ని అద్భుతమైన మైలురాళ్లను అందుకుంది. మ్యాచ్ 67వ నిమిషంలో రాబర్టో అల్వరాడో ఇచ్చిన క్రాస్ను 35 ఏళ్ల సీనియర్ ప్లేయర్ హిమెనెజ్ నమ్మశక్యం కాని రీతిలో హెడర్ ద్వారా గోల్గా మలిచాడు. దీంతో ప్రపంచకప్ చరిత్రలోనే అత్యధిక వయసులో గోల్ కొట్టిన కొద్దిమంది ఆటగాళ్ల సరసన ఆయన నిలిచాడు.
మెక్సికోకు చెందిన కేవలం 17 ఏళ్ల గిల్బెర్టో మోరా ఈ మ్యాచ్లో బరిలోకి దిగాడు. దీని ద్వారా ఫిఫా ప్రపంచకప్ చరిత్రలో ఆతిథ్య దేశం తరఫున ఆడిన అత్యంత పిన్న వయస్కుడిగా మోరా సరికొత్త రికార్డు సృష్టించాడు.
సౌతాఫ్రికా కొంపముంచిన తప్పులు
దక్షిణాఫ్రికా జట్టు మొదట్లో గట్టి పోటీ ఇచ్చినప్పటికీ.. వారి గోల్కీపర్ రోన్వెన్ విలియమ్స్ చేసిన చిన్న పొరపాట్లు, డిఫెండర్ల మధ్య సమన్వయ లోపం ఆ జట్టును దెబ్బతీశాయి. లభించిన పరిమిత అవకాశాలను గోల్స్గా మలచడంలో సౌతాఫ్రికా స్ట్రైకర్లు విఫలమయ్యారు. తొలి మ్యాచ్లోనే 2-0తో ఘన విజయం సాధించడంతో మెక్సికో జట్టు, వారి అభిమానులు ఈసారి కప్పు తమదేనన్న ధీమాతో సంబరాలు చేసుకుంటున్నారు.
Also Read: ఫిఫా ఫుట్బాల్ ప్రపంచకప్లో భారత ఆటగాళ్లు..రొనాల్డోతో పోటీపడుతున్న తమిళ అబ్బాయి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
