పెండింగ్ వేతనాలు చెల్లించాలంటూ ఆసుపత్రి ఎదుట నిరసన
Bellampalle, Kannal Rural, Telangana:గత 6 నెలలుగా తమకు జీతాలు చెల్లించడం లేదని మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణ ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట కాంటాక్ట్ కార్మికులు నిరసన తెలిపారు. అధికారులకు, నాయకులకుు ఎన్నిసార్లు విన్నవించుకున్న పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తమ వేతనాలను వెంటనే చెల్లించాలని కోరుతూ డీసీహెచ్ వైద్యులు డాక్టర్ కోటేశ్వర్ కు వినతి పత్రం అందజేశారు. కార్మికులకు వేతనాలను వెంటనే చెల్లించాలని 15 రోజుల క్రితం కాంట్రాక్టర్ కి షోకాజ్ నోటీస్ ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు.हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
Monkey Video: ముస్లిం వివాహంలో వింత ఘటన.. తోడు పెళ్లికొడుకులా మారిన కోతి.. వీడియో!
Hyderabad, Telangana:Muslim Wedding Video Watch Here: సాధారణంగా పెళ్లిలో బంధుమిత్రుల సందడితో పాటు బాజాభజంత్రీల హోరు కనిపిస్తూ ఉంటుంది. పెళ్లి రెండు రోజులు ఇది సర్వసాధారణమే. కానీ తాజాగా ఒక ముస్లిం యువకుడి వివాహ వేడుకలు ఎవరు ఊహించని సంఘటన చోటుచేసుకుంది. పెళ్లి కొడుకు పక్కన స్నేహితుడో, బంధువు కూర్చోవడం ఒక ఆనవాయితీ. అయితే, ఇక్కడ మాత్రం ఒక కోతి వచ్చి పెళ్లికొడుకు పక్కనే తోడు పెళ్లి కొడుకులా.. కూర్చొని అందరినీ ఆశ్చర్యపోయేలా చేసింది. దీనికి సంబంధించిన ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో వైరల్ గా మారింది.
ఒక ముస్లిం యువకుడి వివాహ వేడుక ఘనంగా జరుగుతోంది.. బంధు మిత్రులందరికీ వేదికపై సందడి చేస్తున్నారు. సరిగ్గా పెళ్లి తంతు కొనసాగుతున్న సమయంలో ఎక్కడి నుంచి వచ్చిందో ఏమో కానీ.. ఒక కోతి హఠాత్తుగా వేదిక పైకి ప్రవేశించింది. అయితే, అక్కడ ఉన్న వారిని చూసి ఆ కోతి త్వరలోనే వెళ్ళిపోతుందనుకున్నప్పటికీ.. నేరుగా ప్రశాంతంగా పెళ్ళికొడుకు పక్కన ఖాళీగా ఉన్న చోట కూర్చుండిపోయింది..
ముస్లిం సాంప్రదాయ ప్రకారం.. పెళ్ళికొడుకు తలపాక ధరించి ఉండగా.. ఆ కోతి కూడా అతనిని ఏమాత్రం ఇబ్బంది కలిగించకుండా పక్కనే కూర్చుని ఉండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. సాధారణంగా కోతులు గుంపులు కనిపిస్తేనే అల్లరి చేయడం, వస్తువులను లాక్కొని వెళ్తూ ఉండడం మనం చూస్తూ ఉంటాం. కానీ ఈ కోతి మాత్రం ఎంతో క్రమశిక్షణతో కూర్చొని చుట్టూ జరుగుతున్న ఆ వేడుకను ఆసక్తిగా గమనిస్తూ ఉండిపోయింది. ఇది చూసిన పెళ్లి పెద్దలతో పాటు బంధువులు తులత ఆందోళన చెందినప్పటికీ.. ప్రవర్తన చూసి ఆశ్చర్యానికి గురైనట్లు తెలుస్తోంది.
Read more: Automatic Aarti Video: ఇక ఆటోమేటిక్ మిషన్తోనే దేవుడికి హారతి!
ఇది నిజంగా అల్లా పంపించిన అతిథి ఉండు ఉంటుందని అక్కడ ఉన్నవారు గుసగుసలాడుకోవడం మీరు చూడొచ్చు. ఈ అరుదైన దృశ్యాన్ని అక్కడివారు తమ మొబైల్లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోను చూసిన సోషల్ మీడియా వినియోగదారులు రకరకాలుగా స్పందిస్తూ వస్తున్నారు. కోతి రూపంలో దేవుడు ఆశీర్వదించడానికి వచ్చాడు అంటూ కొందరు కామెంట్స్ చేస్తుంటే.. మరికొంతమంది మాత్రం ఇలాంటి వింతలు మేము ఎప్పుడూ చూడలేదని కామెంట్లు పెడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ వీడియో మాత్రం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ గా మారింది.
Read more: Automatic Aarti Video: ఇక ఆటోమేటిక్ మిషన్తోనే దేవుడికి హారతి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Karimnagar: 44 డిగ్రీలు దాటిన భానుడి భగభగ.. కరీంనగర్ కాగుతోంది.. జగిత్యాల మండుతోంది!
Hyderabad, Telangana:Karimnagar Heatwave Alert Telugu News: ఇప్పటికే రాష్ట్రంలో సూర్యుడి ప్రతాపం మామూలుగా లేదు. కొన్నిచోట్ల ఎండలు రికార్డు స్థాయిలను దాటి కొత్త రికార్డులను తిరగరాస్తున్నాయి. దీని కారణంగా చాలామంది ఇబ్బంది పడాల్సి వస్తోంది. ఇక అప్పుడప్పుడు ఇదే సమయంలో ఎండలతో పాటు సాయంత్రం వేళలో వర్షం కూడా కురుస్తూ వస్తోంది. ఈదుడు గాలులతో కూడిన వర్షం కురుస్తూ పంటలకు, రైతన్నలకు ఊహించని స్థాయిలో నష్టాన్ని కలిగిస్తున్నాయి. ఒకవైపు ఎండలతో పాటు మరోవైపు వర్షాలు కురుస్తుండడంతో చాలామంది ఈ సమయంలో అనారోగ్య సమస్యల పారిన పడుతూ ఉన్నారు. ముఖ్యంగా ఎండల కారణంగా చాలామంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదిలా ఉంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సూర్యుడి ప్రతాపం మామూలుగా చూపించడం లేదు. వేసవి ప్రారంభంలోనే ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరుకోవడంతో జనం విలవిలలాడిపోతున్నారు. శనివారం నమోదైన గరిష్ట ఉష్ణోగ్రతలు చూస్తుంటే జిల్లా నిప్పుల కొలిమిలా తలపిస్తోంది. ఉదయం 9 గంటల నుంచి ఎండల తీవ్రత మొదలై.. మధ్యాహ్ననానికి వడగలుపులతో జనజీవనం స్తంభించిపోయేలా చేస్తోంది.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జగిత్యాల జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జగిత్యాల జిల్లా రాఘవపేట తో పాటు మేడిపల్లి ప్రాంతాల్లో ఏకంగా 43. 3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత రికార్డింగ్ రాష్ట్రంలోనే అత్యంత వేడి ప్రాంతాలుగా నిలిచాయి. అటు పెద్దపల్లి జిల్లాలోని కామంపూర్ తో పాటు కల్వచర్ల ప్రాంతాల్లో 44.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయి ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇలా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అనేక చోట్ల 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు సమాచారం..
ఈ ఎండలు కాలం ప్రారంభంలోనే ఇంత మెట్టుగా కొడుతుంటే.. రాబోయే రోజుల్లో వీటి ప్రభావం మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని నిపుణులు భావిస్తున్నారు. కాబట్టి ఎండకు బయట తిరిగేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా అవసరమైతే తప్ప 11:00 నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు బయటకు రావద్దని నిపుణులు సూచిస్తూ ఉన్నారు. అంతేకాకుండా బయట తిరిగేవారు తప్పనిసరిగా కొబ్బరినీళ్ళతో పాటు మజ్జిగ నీటిని ఎక్కువగా తీసుకోవడం మంచిది. వడదెబ్బ తగిలినట్లు అనిపిస్తే వెంటనే దగ్గర్లో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లడం మంచిది. రాబోయే రెండు మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు మరికొంత పెరిగే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరిస్తోంది. కాబట్టి చాలా జాగ్రత్తగా వుండి బయటి పనులు చేసుకోవడం చాలా మంచిది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Ashu Reddy Case: బిగ్బాస్ బ్యూటీపై అషురెడ్డిపై కేసు నమోదు..రూ.9.35 కోట్లు మోసం చేసినట్లు ఫిర్యాదు!
Hyderabad, Telangana:Ashu Reddy Cheating Case: సినీ నటి బిగ్బాస్ బ్యూటీ అషురెడ్డిపై కేసు నమోదయ్యింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి రూ.9.35 కోట్లు కాజేసిందనే ఆరోపణలతో ఆమెతో పాటు ఆమె కుటుంబ సభ్యులపై హైదరాబాద్లో సీసీఎస్లో ఫిర్యాదు అందింది.White House Suspect: వైట్ హౌస్ కాల్పుల నిందితుడు ఇతనే! ట్రంప్పై దాడి చేయబోయిన వ్యక్తి ఇతనే!
Washington, District of Columbia:White House Shooting Suspect: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై హత్యాయత్నం జరిగిన సంగతి తెలిసిందే. శనివారం రాత్రి జరిగిన విందు కార్యక్రమంలో ఓ సాయుధుడు భద్రతా వలయాన్ని దాటి హాల్లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించగా.. సెక్యూరిటీ గార్డ్స్ వెంటనే అతడ్ని అడ్డుకున్నారని ట్రంప్ తెలిపాడు. ఇందులో భాగంగా ఓ అధికారి కాల్పులకు గురయ్యాడు. కానీ, అధికారి ధరించిన బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వల్ల అతని ప్రాణాలు నిలిచాయి.White House Suspect: ట్రంప్పై దాడి చేయబోయిన వ్యక్తి ఇతనే! 'మానసిక రోగి' అని వ్యాఖ్యానించిన అమెరికా అధ్యక్షుడు!
Washington, District of Columbia:White House Shooting Suspect: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై హత్యాయత్నం జరిగిన సంగతి తెలిసిందే. శనివారం రాత్రి జరిగిన విందు కార్యక్రమంలో ఓ సాయుధుడు భద్రతా వలయాన్ని దాటి హాల్లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించగా.. సెక్యూరిటీ గార్డ్స్ వెంటనే అతడ్ని అడ్డుకున్నారని ట్రంప్ తెలిపాడు. ఇందులో భాగంగా ఓ అధికారి కాల్పులకు గురయ్యాడు. కానీ, అధికారి ధరించిన బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వల్ల అతని ప్రాణాలు నిలిచాయి.
శనివారం సాయంత్రం వాషింగ్టన్ హిల్టన్లో గందరగోళం చెలరేగిన ఈ ఘటన తర్వాత.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డిన్నర్ ఘటనలో పాల్గొన్న షూటర్ వీడియోను, అదుపులోకి తీసుకున్న నిందితుడి చిత్రాలతో పాటు పంచుకున్నారు. హోటల్ లాబీలో కాల్పులు జరిగినట్లు అనుమానిస్తున్న నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీంతో అక్కడ భయాందోళనలు చెలరేగి, విందుకు హాజరైన ట్రంప్, ఇతర ఉన్నతాధికారులను వెంటనే ఖాళీ చేయించాల్సి వచ్చింది. అధ్యక్షుడు ట్రంప్తో పాటు అతని భార్య మెలానియా ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్లను భద్రతా బలగాలు బాల్రూమ్ నుండి వేగంగా బయటకు తీసుకువచ్చి సురక్షిత ప్రాంతానికి తరలించాయి.
ఆ తర్వాత విలేకరుల సమావేశంలో మాట్లాడిన డొనాల్డ్ ట్రంప్.. నిందితుడిని పట్టుకున్నామని, అతడిని "తీవ్ర మానసిక రోగి" అంటూ వ్యాఖ్యానించాడు. అధికారులు ఆ వ్యక్తి అపార్ట్మెంట్లో సోదాలు చేశారని, నిందితుడు కాలిఫోర్నియా నివాసి అని ఆయన తెలిపారు. నిందితుడు అనేక ఆయుధాలతో ఉన్నాడని, సీక్రెట్ సర్వీస్ అధికారులు అడ్డుకునే ముందు ఒక భద్రతా చెక్పాయింట్పైకి దూసుకెళ్లడానికి ప్రయత్నించాడని ట్రంప్ చెప్పారు. ఈ ఘర్షణలో ఒక అధికారిపై కాల్పులు జరిగాయి. కానీ అతను ధరించిన బుల్లెట్ ప్రూఫ్ ప్రాణాలను కాపాడింది.
ట్రంప్ ఇలాంటి భద్రతా ముప్పును ఎదుర్కోవడం ఇది మొదటిసారి కాదు. జూలై 2024లో, పెన్సిల్వేనియాలోని బట్లర్లో జరిగిన ఒక ప్రచార ర్యాలీలో, స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 6:15 గంటల ప్రాంతంలో, సభా ప్రాంగణం వెలుపల ఎత్తైన ప్రదేశం నుండి ఒక దుండగుడు పలుమార్లు కాల్పులు జరపడంతో ఆయన హత్యాయత్నం నుండి ప్రాణాలతో బయటపడ్డారు.
ఆ బుల్లెట్ ట్రంప్ చెవిని తాకుతూ వెళ్ళగా, వెంటనే సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు ఆయనను వేదికపై నుండి కిందకు తీసుకువచ్చి, ఒక సురక్షితమైన వాహనశ్రేణిలో ఎక్కించారు. ఈ సంఘటన ఎన్నికల ప్రచార సమయంలో తీవ్రమైన భద్రతా ఆందోళనలను రేకెత్తించింది. ఇటీవలి చరిత్రలో ఒక అమెరికా అధ్యక్ష అభ్యర్థిపై జరిగిన అత్యంత తీవ్రమైన దాడులలో ఒకటిగా మిగిలిపోయింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
May 2026 Horoscope: మే నెలలో ఈ 4 రాశుల వారికి గోల్డెన్ పీరియడ్.. అదృష్టం మామూలుగా ఉండదు!
Hyderabad, Telangana:May 2026 Horoscope Latest News: మే నెలలో ఎన్నో రకాల శక్తివంతమైన గ్రహాలు సంచారాలు చేయబోతున్నాయి. అలాగే ఈ సమయంలో నక్షత్ర సంచారాలు కూడా జరుగుతాయి. దీనికి తోడు గ్రహ సంయోగాలు కూడా జరగబోతున్నాయి. దీని కారణంగా మనిషి జీవితాల్లో పెను మార్పులు సంభవించబోతున్నాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. అంతేకాకుండా సూర్యుడితో పాటు అంగారకుడు బుధుడు గ్రహాల కలయిక కారణంగా ఈ సమయంలో మహాగోచారం జరగబోతోంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ గోచారం ఎన్నో శక్తివంతమైన గ్రహాల కలయిక కారణంగానే ఏర్పడుతుంది. అయితే ఈ సమయంలో మూడు గ్రహాల కలయిక కారణంగానే ఇది ఏర్పడబోతోందని జ్యోతిష్యులు చెబుతున్నారు. దీని కారణంగా 12 రాశుల వారిపై ఊహించని ప్రభావం పడుతుంది. అదే విధంగా నాలుగు రాశుల వారికి మాత్రం గోల్డెన్ పిరియడ్ ప్రారంభం కాబోతోందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఆయా రాశుల వారికి అనుకోని ధన లాభాలు కూడా కలగబోతున్నాయి.
మే నెలలో సూర్యుడు తన ఉచ్చ స్థితిలో నుంచి వృషభరాశిలోకి ప్రవేశించగా.. కుజుడు తన సొంత రాశి అయిన మేషరాశిలో అడుగుపెట్టబోతున్నాడు. అదేవిధంగా బుధుడు కూడా తన గమనాన్ని మార్చుకోవడం వల్ల ఈ రెండు గ్రహాల కలయికతో కొన్ని రాశుల వారికి రాజయోగం పట్టబోతోంది. దీనివల్ల ధన లాభాలు కలగడమే కాకుండా ఇప్పటికే ఉన్న ఆర్థిక ఇబ్బందుల నుంచి పరిష్కారం లభిస్తుంది. సమాజంలో గౌరవ మర్యాదలు కూడా విపరీతంగా పెరుగుతాయి.
ఈ రాశులవారికి బంపర్ జాక్ఫాట్:
మేషరాశి
కుజుడు సొంత రాశిలోకి వెళ్లడం కారణంగా మేష రాశి వారికి ధైర్య సాహసాలు విపరీతంగా పెరుగుతాయి. నిలిచిపోయిన పనులు వేగంగా పూర్తి అవడమే కాకుండా.. ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. అంతేకాకుండా ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ లభించడమే కాకుండా.. వేతనాల పెంపు కూడా ఉండబోతోంది. దీని కారణంగా అనుకున్నంత స్థాయిలో వేతనాలు కూడా పొందగలుగుతారు.
వృషభ రాశి
సూర్యుడి ప్రభావంతో వృషభ రాశి వారికి ప్రభుత్వ రంగ పనుల్లో వస్తున్న సమస్యల నుంచి పరిష్కారం లభించి.. అద్భుతమైన విజయాలు సాధించే అవకాశాలున్నాయి. వ్యాపారస్తులకు పెట్టుబడుల నుంచి భారీ మొత్తంలో ధన లాభాలు కూడా కలుగుతాయి. కుటుంబంలో సుఖశాంతోషాలు కూడా నెలకొంటాయి. ముఖ్యంగా మానసిక పరిస్థితులు గతంలో కంటే ఇప్పుడు మరింత మెరుగుపడి ఎంతో ఆనందంగా ఉంటారు.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
మిథున రాశి
బుధుడి అనుగ్రహం వల్ల మిధున రాశి వారికి విపరీతంగా తెలివితేటలు పెరగబోతున్నాయి. దీని కారణంగా ఆలోచనత్మకంగా పనులు చేసి అనుకున్న పనుల్లో అఖండ విజయాలు సాధించగలుగుతారు. నూతన ఆదాయ వనరులు కూడా చాలావరకు లభించబోతున్నాయి. విదేశీ ప్రయాణాలు చేయాలనుకునే వారికి ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది.
సింహరాశి
సింహరాశిలో జన్మించిన వ్యక్తులకు కెరీర్ పరంగా గొప్ప గొప్ప అవకాశాలు కూడా లభించబోతున్నాయి. ఉన్నతాధికారుల సపోర్టుతో విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. సమాజంలో హోదా పెరగడమే కాకుండా.. భారీ మొత్తంలో ఆర్థిక లాభాలు కూడా పొందగలుగుతారు. ఆర్థిక పరిస్థితులు గతంలో కంటే ఇప్పుడు మరింత మెరుగుపడతాయి. అంతేకాకుండా అనుకున్నంత స్థాయిలో ధన లాభాలు కూడా సొంతం చేసుకోగలుగుతారు.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
AP Fuel Crisis: రాష్ట్రంలో మళ్లీ పెట్రోల్, డీజిల్ కొరత..బంకుల ముందు బారులు తీరిన వాహనాలు..సీఎం కీలక ఆదేశాలు!
Vijayawada, Andhra Pradesh:Fuel Crisis In Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పెట్రోల్ బంకుల్లో డీజిల్ కొరత ఏర్పడింది. సడెన్గా దాదాపుగా అన్ని బంకుల్లో నో స్టాక్ బోర్డు వెలిసింది. అయితే కొన్ని చోట్ల కేవలం రూ.500లకే పెట్రోల్ ఫిల్ చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ నో స్టాక్ బోర్డులు వెలసిన నేపథ్యంలో వాహనాదారుల్లో ఆందోళన నెలకొంది. ఏపీలో ఇంధన కొరతలపై ముఖ్యమంత్రి చంద్రబాబు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. రాష్ట్రంలోని బంకు యజమానులతో చర్చలు జరపాలని సీఎం అధికారులను ఆదేశించారు.
ఏపీ వ్యాప్తంగా శుక్రవారం నుంచి నో స్టాక్ బోర్డులు అక్కడక్కడ కనిపించగా.. శనివారం నాటికి ప్రతి జిల్లాల్లో పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడింది. ఇంధనం కోసం వాహనాదారులు బంకుల ఎదుట బారులు తీరారు. దీంతో రోడ్లపై పెద్ద పెద్ద క్యూలైన్లు కనిపిస్తున్నాయి. కాకినాడ, విజయవాడతో పాటు గోదావరి, పల్నాడు జిల్లాల్లో ఇంధన కొరత తీవ్రంగా ఏర్పడింది. పంట కోతకు వచ్చిన సమయంలో ఈ కొరత రైతులతో పాటు ఇతర వాహనదారులను తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. అదే విధంగా ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడం వల్ల సాధారణ ప్రజలకు కూడా తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు.
కొన్నిచోట్ల పెట్రోల్ మాత్రమే అందుబాటులో ఉండగా.. అది కూడా కేవలం రూ.500 మాత్రమే ఫిల్ చేసేందుకు బంకు యజమానులు రూల్ పెట్టారు. పెట్రోల్ అడపాదడపా అక్కడక్కడ బంకుల్లో అందుబాటులో ఉన్నా.. డీజిల్ మాత్రం ఎక్కడ లభించకపోవడం గమనార్హం. మరోవైపు రాష్ట్రంలో నో స్టాక్ బోర్డులు వెలియడం వల్ల అధికారులు అప్రమత్తమయ్యారు. పెట్రోల్, డీజిల్ సరఫరాపై నిజంగా కొరత ఉందా? లేదా బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్నారా? అనే అంశంపై ఇప్పుడు ఆరా తీస్తున్నారు. కావాలని కొరత ఏర్పడేలా చేస్తే బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని ఆయా జిల్లాల కలెక్టర్లు హెచ్చరిస్తున్నారు.
పశ్చిమాసియాలో ఇరాన్-అమెరికా, ఇజ్రాయిల్ మధ్య యుద్ధం నేపథ్యంలో ఈ కొరత ఏర్పడిందని బంకుల యజమానులు అంటున్నారు. ఇంతకు ముందు ఇంధన సరఫరా కంపెనీలు స్థానిక డీలర్లకు అప్పుగా పెట్రోల్, డీజిల్ సప్లయ్ చేసేవారని యజమానులు చెబుతున్నారు. కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో అప్పుగా ఇవ్వడం లేదని దీంతో కొరత ఏర్పడుతుందని వారు స్పష్టం చేశారు.
రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడడంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. ఇప్పటికే సీఎం చంద్రబాబు పైస్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. నో స్టాక్ బోర్డుల వెనుక కారణాన్ని తెలుసుకొని..సమస్య పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలని, అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆయిల్ సరఫరా కంపెనీలతో పాటు బంకుల యజమానులతో మాట్లాడి ఇబ్బంది లేకుండా చూడాలని తెలియజేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Attack On Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై హత్యాయత్నం..వైట్హోస్లో కాల్పుల కలకలం..
Washington, District of Columbia:Firing In White House: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై హత్యాయత్నం జరిగింది. శనివారం రాత్రి వైట్ హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్ కార్యక్రమంలో కాల్పులు జరిగాయి. దీంతో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇతర అగ్రశ్రేణి అమెరికా నాయకులను అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరికొందరు ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రాంగణంలోని బల్లల కింద దూరారు. అయితే ఈ ఘటనలో ఎవరికీ గాయాలైనట్లు సమాచారం లేదు. ఘటనపై ఇప్పటికే దర్యాప్తు జరుగుతోంది.
శనివారం రాత్రి జరిగిన డిన్నర్లో పెద్ద శబ్దాలు వినిపించడంతో, డొనాల్డ్ ట్రంప్, మెలానియా ట్రంప్లను హుటాహుటిన బయటకు తరలించారు. దీంతో భారీ భద్రతా ఏర్పాట్లు చోటుచేసుకున్నాయి. ప్రాంగణంలో భయాందోళనలు వ్యాపించడంతో సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు అధ్యక్షుడు, ప్రథమ మహిళను వేగంగా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. శబ్దాలు మారుమోగుతుండగా, డిన్నర్కు హాజరైనవారు వెంటనే మాట్లాడటం ఆపేశారు.
వందలాది మంది అతిథులు బల్లల కిందకు దూరగా.. సైనిక దుస్తులు ధరించిన సీక్రెట్ సర్వీస్ అధికారులు భోజనశాలలోకి ప్రవేశించారు. ఏజెంట్లు వారిని హాలు నుంచి బయటకు తీసుకువెళ్లే ముందు ట్రంప్, అతని భార్యను వేదిక వెనుకవైపు తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో 2,600 మంది అతిథులు పాల్గొన్నట్లు సమాచారం.
ఈ ఘటనతో సంబంధం ఉన్న ఒక అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారని, అతను బతికే ఉన్నాడని పరిస్థితిపై వైట్ హౌస్ వర్గాలు చెబుతున్నాయి. ఆరోపణలు ఎదుర్కొంటున్న షూటర్ను పట్టుకున్నట్లు ట్రంప్ తర్వాత ధృవీకరించారు. వైట్ హౌస్ కరస్పాండెంట్స్ అసోసియేషన్ డిన్నర్ వద్ద జరిగిన ఈ ఘటనకు సంబంధించిన అనుమానితుడిని పట్టుకున్నారని డొనాల్డ్ ట్రంప్ వెల్లడించడం సహా భద్రతా సిబ్బంది వేగవంతమైన చర్యను ప్రశంసించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Vaibhav Sooryavanshi Record: 15 ఏళ్లకే ప్రపంచ రికార్డు బద్దలు కొట్టిన సూర్యవంశీ..గేల్, రైనా రికార్డులు బ్రేక్!
Hyderabad, Telangana:Vaibhav Sooryavanshi Record In IPL: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 ప్రస్తుత లీగ్లో యువ ఆటగాళ్లు రాణిస్తున్నారు. ఒకరి తర్వాత ఒకరు పోటాపోటీగా సెంచరీలతో విజృంభిస్తున్నారు. తాజాగా సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ విధ్వంసకరమైన శతకం సాధించి.. దిగ్గజాలైన క్రిస్ గేల్, సురేష్ రైనా, ట్రావిస్ హెడ్ల రికార్డులను సమం చేశాడు.
నిన్నటి మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ తన ఐపీఎల్ కెరీర్లో రెండవ శతకాన్ని కేవలం 36 బంతుల్లోనే సాధించాడం విశేషం. మొత్తం 37 బంతులు ఎదుర్కోగా అందులో 12 సిక్సర్లు, 5 ఫోర్ల సహాయంతో 103 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్లో అతని స్ట్రైక్ రేట్ 278.37గా ఉండటం గమనార్హం.
వైభవ్ సూర్యవంశీ సాధించిన మూడు రికార్డులు ఇవే..
1. అభిషేక్ శర్మ సిక్సర్లు రికార్డు సమం..
ఒకే ఇన్నింగ్స్లో 10కి పైగా సిక్సర్లు కొట్టిన ఘనతను వైభవ్ రెండోసారి సాధించాడు. దీనితో, ఐపీఎల్ చరిత్రలో ఈ ఘనతను అత్యధికంగా (2 సార్లు) సాధించిన బ్యాట్స్మెన్ల జాబితాలో అతను అభిషేక్ శర్మతో కలిసి సంయుక్తంగా రెండో స్థానాన్ని పంచుకున్నాడు. ఈ ఘనతను 4 సార్లు సాధించిన వెస్టిండీస్ వీరుడు క్రిస్ గేల్ ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు.
2. పవర్ప్లేలో దూకుడు..గేల్, రైనా రికార్డు..
వైభవ్ సూర్యవంశీ పవర్ప్లే దశలో ఏకంగా 7 సిక్సర్లు కొట్టాడు. దీనితో పవర్ప్లేలో ఒకే ఇన్నింగ్స్లో చెరో 6 సిక్సర్లు కొట్టిన క్రిస్ గేల్, సురేష్ రైనా, ట్రావిస్ హెడ్ల రికార్డును అతను అధిగమించాడు. వైభవ్ ఇప్పుడు సనత్ జయసూర్య, అభిషేక్ శర్మ వంటి దిగ్గజాల సరసన చేరాడు.
3. టీ20లో అత్యంత వేగంగా 1,000 పరుగులు
వైభవ్ కేవలం 26 ఇన్నింగ్స్లలోనే 1,000 టీ20 పరుగులు పూర్తి చేసి ఫిలిప్ హ్యూస్, మహమ్మద్ వసీంల రికార్డును సమం చేశాడు. ముఖ్యంగా ఈ మైలురాయిని అత్యధిక బంతులు (473 బంతులు) వేసి చేరుకున్న అత్యంత వేగవంతమైన బ్యాట్స్మెన్ అతనే కావడం గమనార్హం.
మరోవైపు నిన్న పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు బ్యాటర్ కేఎల్ రాహుల్ అజేయంగా 152 పరుగులు చేసి ఐపీఎల్ చరిత్రలో కొత్త రికార్డు సృష్టించాడు. ఒక ఐపీఎల్ ఇన్నింగ్స్లో భారత బ్యాట్స్మెన్ చేసిన అత్యధిక వ్యక్తిగత పరుగుల రికార్డు రాహుల్ పేరిట ఉంది. ఇది రాహుల్ ఐపీఎల్ కెరీర్లో ఆరో సెంచరీ కాగా, మొత్తం టీ20 కెరీర్లో ఎనిమిదో సెంచరీ. ఈ ఇన్నింగ్స్తో రాహుల్, రోహిత్ శర్మ, సంజు సామ్సన్ల రికార్డులను సమం చేయడమే కాకుండా.. ఇషాన్ కిషన్, సురేష్ రైనా, రిషబ్ పంత్, ఆడమ్ గిల్క్రిస్ట్ల రికార్డులను కూడా అధిగమించాడు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Sunrisers Hyderabad: వైభవ్ సెంచరీ వృథా.. సన్రైజర్స్ హైదరాబాద్ వరుసగా నాలుగో విజయం
Jaipur, Rajasthan:Sunrisers Hyderabad Consecutive 4th Win: సొంత గడ్డపై హ్యాట్రిక్ విజయాలతో పూర్తి జోష్తో ఉన్న సన్రైజర్స్ హైదరాబాద్ ప్రత్యర్థి గడ్డపై కూడా ఆధిపత్య ప్రదర్శన చేస్తోంది. ఇంటా బయట దూకుడుగా ఆడుతూ ప్రత్యర్థి రాజస్థాన్ రాయల్స్ సొంతగడ్డ జైపూర్లోనే సన్రైజర్స్ హైదరాబాద్ చిత్తు చేసింది. వైభవ్ సూర్యవంశీ రికార్డు సెంచరీ చేసినా కూడా రాజస్థాన్ను ఓటమి నుంచి బయటపడలేదు. ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మకు తోడు క్లాసెన్ క్లాసిక్ బ్యాటింగ్తో హైదరాబాద్ మరో విజయం నమోదు చేసింది. 5 వికెట్ల తేడాతో రాజస్థాన్ను హైదరాబాద్ చిత్తుచేసింది.
Also Read: RR vs SRH Live: పవర్ప్లేలో భారీ స్కోర్.. రాజస్థాన్పై చితక్కొడుతున్న సన్రైజర్స్ బ్యాటర్లు
టాస్ ఓడిపోయి బ్యాటింగ్కు దిగిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ 10 పరుగులకే పరిమితమవగా.. వైభవ్ సూర్యవంశీ, ధ్రువ్ జురేల్ చెలరేగి ఆడారు. 37 పరుగుల్లో పరుగుల సునామీ సృష్టించిన వైభవ్ సూర్యవంశీ 103 పరుగులు చేసి శతకం బాదాడు. ఐదు ఫోర్లు, 12 సిక్సర్లతో చెలరేగి ఆడాడు. వైభవ్కు చక్కటి సహకారం అందిస్తూ ధ్రువ్ జురేల్ అర్ధ సెంచరీ నెలకొల్పాడు. 35 బంతుల్లో 51 పరుగులు చేయగా.. వాటిలో 8 ఫోర్లు ఉండగా.. ఒక సిక్సర్ బాదాడు. కెప్టెన్ రియాన్ పరాగ్ (7) తక్కువ పరుగులు చేయగా.. డొనొవన్ ఫెరెరా భారీ షాట్లు ఆడుతూ అత్యంత విలువైన 33 పరుగులు చేయగా.. షిమ్రాన్ హెట్మెయిర్ 11 స్కోర్ చేశాడు. సన్రైజర్స్ బౌలర్లు కొంత తడబడినట్టు కనిపిస్తోంది. సొంతగడ్డపై బ్యాటర్లను బోల్తా కొట్టించి విజయం సాధించగా జైపూర్లో మాత్రం వికెట్లు తీయడంలో తడబడ్డారు. ఈషాన్ మలింగ 2 వికెట్లు తీయగా.. ప్రఫుల్ హింగే, పాట్ కమిన్స్, నితీశ్ కుమార్ ఒక్కో వికెట్ తీశారు.
Kavitha TRS Party: బీఆర్ఎస్ పార్టీకి పంటి కింద రాయిలా కవిత! కేసీఆర్కు తలనొప్పిగా మారిన టీఆర్ఎస్!
Hyderabad, Telangana:Kavitha TRS Party News: తెలంగాణ రాష్ట్రంలో నేడు కొత్త రాజకీయ పార్టీ అవతరించింది. తెలంగాణ రాష్ట్ర సేన పేరిట మాజీ ముఖ్యమంత్రి కుమార్తె కవిత తన కొత్త రాజకీయ పార్టీని ప్రకటించింది. అయితే టీఆర్ఎస్ సెంటిమెంట్ కేసీఆర్కు ఇప్పుడు తలనొప్పిగా మారిందా?Trisha Cross Symbol: హీరో విజయ్ కోసం మతం మారిన త్రిష? సీక్రెట్గా పెళ్లి చేసుకున్నారా? వీడియోలో బట్టబయలు!
Nagalapuram, Tamil Nadu:Trisha Religion Convert: హీరో విజయ్, నటి త్రిష కృష్ణన్ మధ్య ఉన్న సంబంధం గురించి ఇప్పట్లో వార్తలు ఆగేలా కనిపించడం లేదు. ఇప్పటికే వీరిద్దరూ చెట్టాపట్టాలేసుకొని తిరగడం అనేక సార్లు మీడియా కంటపడగా.. ఇప్పుడు తాజాగా తన భార్య విడాకులు కోరడంతో త్రిష, విజయ్ మధ్య ప్రేమాయణం సాగుతోందని స్పష్టత వచ్చేసింది. అయితే ఇప్పుడు మరో సంచలనమైన వార్త ఇప్పుడు తమిళనాట తెగ చర్చ జరుగుతోంది. హీరో విజయ్ కోసం హీరోయిన్ త్రిష మతం మారినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇటీవల తమిళనాడులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో త్రిష ఓటు వేయడానికి వచ్చినప్పుడు చిత్రీకరించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇప్పుడు అదే వీడియో మత మార్పిడిపై వివాదానికి దారితీసింది. వైరల్ అయిన వీడియో ప్రకారం.. త్రిష కారు డాష్బోర్డ్పై ఒక క్రైస్తవ శిలువ స్పష్టంగా కనిపిస్తోంది. పుట్టుకతో హిందూ బ్రాహ్మణురాలైన త్రిష వాహనంలో శిలువ కనిపించడం ఆమె మతం మార్చుకుందా అనే అనుమానాలను రేకెత్తించింది. జోసెఫ్ విజయ్ క్రైస్తవ మతాన్ని అనుసరిస్తాడు కాబట్టి, అతని కోసం త్రిష మతం మారిందా లేదా వారిద్దరూ ఇప్పటికే రహస్యంగా వివాహం చేసుకున్నారా అనే అనుమానాలను నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు.
గత కొన్ని నెలలుగా విజయ్, అతని భార్య సంగీతల మధ్య బంధానికి బీటలు వారి.. ఇప్పటికే వారిద్దరి విడాకుల వ్యవహారం కోర్టులో ఉంది. దీనికి ప్రధాన కారణం విజయ్కి త్రిషతో ఉన్న సంబంధమే అని అనేక ఆరోపణలు ఉన్నాయి. విజయ్ రాజకీయ రంగ ప్రవేశం తర్వాత ఈ వదంతులు మరింత తీవ్రమయ్యాయి. చాలా మంది రాజకీయ నాయకులు కూడా విజయ్, త్రిషల వ్యవహారం గురించి బహిరంగంగా విమర్శించారు.
అయితే తాజాగా త్రిష ఓటు వేసిన తర్వాత మీడియాతో మాట్లాడిన ఓ వీడియో కూడా ఆసక్తికరంగా మారింది. ఓటు వేసిన తర్వాత, ఆమె విజిల్ సౌండ్తో కూడిన ఒక వీడియోను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. దీని ద్వారా ఆమె విజయ్ 'తమిళగ వెట్రి కజగం' పార్టీ గుర్తుకు మద్దతు తెలిపినట్లు పరోక్షంగా సూచించింది. ఈ పరిణామాలన్నీ వారిద్దరి మధ్య స్నేహానికి మించిన సంబంధం ఉందని సూచిస్తున్నాయి.
త్రిష మతం మారిందా?
తలపతి విజయ్కు క్రైస్తవ మతంపై ప్రగాఢ విశ్వాసం ఉంది. ఎన్నికలకు ముందు, ఆయన ఒక చర్చిలో మోకరిల్లి ప్రార్థిస్తున్న వీడియో వైరల్ అయింది. ఇప్పుడు త్రిష కారుపై శిలువ లాకెట్టు లేదా గుర్తు కనిపించడం అభిమానుల నుంచి ప్రశ్నలకు దారితీసింది. అయితే, నటి త్రిష గానీ, విజయ్ గానీ దీనిపై అధికారికంగా ఎలాంటి వివరణ ఇవ్వలేదు.
మొత్తం మీద, "త్రిష మతం మారిందా? ఆమె విజయ్ను పెళ్లి చేసుకోబోతోందా?" అనే ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి. ఇప్పటికీ, ఈ వదంతులు కోలీవుడ్ రంగంలో కలకలం సృష్టిస్తున్నాయి. భవిష్యత్తులో ఈ విషయం ఏ మలుపు తీసుకుంటుందో వేచి చూడాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Drug Overdose: పెళ్లికి ముందే కాబోయే భార్యతో 'కార్యం'.. ఆత్రుతలో వయగ్రా ఎక్కువ తీసుకుని మరణం
Gurugram, Haryana:Viral Crime News: కాబోయే భార్య తన గదికి వస్తుందని ఆ యువకుడు ఉబలాటపడ్డాడు. ఉబ్బితబ్బిబైపోయి ఎగిరిగంతేశాడు. ఏం చేయాలో పాలుపోక ఆ రోజు ఆఫీస్కు డుమ్మా కొట్టాడు. ఎలాగో తనకు కాబోయే భార్య కావడంతో పెళ్లికి ముందే కలుసుకోవాలని భావించాడు. తన భార్యతో మరింత ఎక్కువ ఆనందం పొందడానికి డ్రగ్స్ (వయాగ్ర) తీసుకున్నాడు. అయితే ఓవర్డోస్ కావడంతో పరిస్థితి విషమించి అతడు మరణించాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన ఢిల్లీకి సమీపంలోని గురుగ్రామ్లో చోటుచేసుకుంది. వైరల్గా మారిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
Also Read: Telangana Governor: హమ్మయ్య.. అజారుద్దీన్, కోదండరాం ఎమ్మెల్సీలుగా ఆమోదం
మహారాష్ట్రలోని నాగ్పూర్ ప్రాంతానికి చెందిన రోహిత్ లాల్ (29) గురుగ్రామ్లోని సెక్టార్ 53 ప్రాంతంలో నివసిస్తుండేవాడు. క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కార్యాలయంలో విధులు నిర్వహించే అతడికి ఇటీవల వివాహం నిశ్చయమైంది. దీంతో ఎంతో ఆనందపడిపోయాడు. తనకు కాబోయే భార్యతో ఫోన్లో మాట్లాడుకుంటున్న రోహిత్ లాల్.. ఆమెను తన గదికి రావాలని పిలిచాడు. దీంతో ఆమె వచ్చేందుకు అంగీకరించింది. ఆమె వస్తుండడంతో ఆనందంతో ఎగిరి గంతేశాడు.
Also Read: RCB vs GT: బెంగళూరు దూకుడుకు తేలిపోయిన సాయి సుదర్శన్ సెంచరీ.. గుజరాత్ టైటాన్స్ మరో ఓటమి
ఎలాగోలా తనకు కాబోయే భార్య కావడంతో కార్యం కూడా కావాలని రోహిత్ లాల్ భావించాడు. తన భార్యతో మరింత ఆనందం పొందడం కోసం అతడు వయగ్రా (లైంగిక సామర్థ్యాన్ని రెట్టింపు చేసే కొన్ని మందులు) వేసుకున్నాడు. అయితే రోజూ తనతో కలిసి వచ్చే రోహిత్ లాల్ ఉద్యోగానికి రాకపోవడంతో అతడికి అనుమానం వచ్చింది. ఫోన్ చేస్తే కూడా ఎత్తలేదు. గదికి వెళ్లి చూస్తే తీయడం లేదు. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు.
Also Read: Telangana RTC Strike: చర్చల అనంతరం ఆర్టీసీ సమ్మెపై భట్టి విక్రమార్క కీలక ప్రకటన
సమాచారం అందుకున్న పోలీసులు గదికి తలుపులు తెరిచి చూడగా రోహిత్ లాల్ అచేతనంగా బెడ్పై పడి ఉన్నాడు. లైంగిక సామర్థ్యాన్ని రెట్టింపు చేసే కొన్ని మందుల షీట్లు, హెల్త్ సప్లిమెంట్లు కనిపించాయి. విచారణలో తనకు కాబోయే భార్యను రూమ్కు పిలిచాడని.. ఆమె వచ్చేలోపే రోహిత్ లాల్ చనిపోయినట్లు అక్కడి పోలీసు అధికారి తెలిపారు. వయగ్రా ఓవర్ డోస్ తీసుకోవడంతో అతడు మృతిచెంది ఉంటాడని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఓవర్ డోసు తీసుకోవడంతో గుండెపోటుకు గురయి రోహిత్ లాల్ మరణించి ఉంటాడని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.
అతడి గదిలో లభించిన లైంగిక సామర్థ్యాన్ని రెట్టింపు చేసే కొన్ని మందులు షీట్లు, సప్లిమెంట్లు టెస్టింగ్ కోసం పంపామని.. రిపోర్టు వచ్చాకే అతడి మృతికి కారణం తెలుస్తుందని పోలీసులు చెబుతున్నారు. కాబోయే భార్య వస్తున్న విషయం తెలిసింది.. కానీ ఆమె వచ్చిందా? లేదా అనేది ఇంకా తేలలేదు. అన్ని కోణాల్లో విచారణ జరుగుతోందని అక్కడి పోలీసు అధికారి సత్యేందర్ రావల్ తెలిపారు. త్వరలోనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని చెప్పారు. రోహిత్ లాల్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Sahil Parakh Injury: ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్కు తీవ్ర గాయం..రక్త ధారలా కారడంతో వెంటనే ఆస్పత్రికి తరలింపు..
New Delhi, Delhi:Sahil Parakh Injured: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో నేడు ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. అయితే ఈ మ్యాచ్కు ముందు ప్రాక్టీస్ సెషన్లో ఓ షాకింగ్ సంఘటన జరిగింది. అరుణ్ జెట్లీ స్టేడియంలో ఆతిథ్య జట్టు ఢిల్లీ క్యాపిటల్స్కు సంబంధించిన ఓ యువ ఆటగాడికి తీవ్ర గాయమైంది. ఆ గాయం దెబ్బకి రక్తం బయటపడింది. దీంతో హుటాహుటిని ఆటగాడ్ని ఆస్పత్రికి తరలించారు.
అక్షర్ పటేల్ సారథ్యంలోని ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు శనివారం పంజాబ్ కింగ్స్తో మ్యాచ్ ఉన్న క్రమంలో ప్రాక్టీస్ సెషన్ లో ఈ సంఘటన జరిగింది. ప్రాక్టీస్ చేస్తుండగా, ఆ సమయంలో జట్టులోని యువ ఆటగాడు సాహిల్ పరాఖ్ ముఖానికి బంతి తగలడంతో తీవ్రంగా గాయపడ్డాడు. గాయం తీవ్రత ఎంత ఎక్కువగా ఉందంటే, వెంటనే మైదానానికి అంబులెన్స్ను పిలిపించి అతడిని ఆసుపత్రికి తరలించారు.
జీ తెలుగు న్యూస్ నివేదిక ప్రకారం.. బంతి అతని హెల్మెట్ను ఎంత బలంగా తాకిందంటే, అతని ముఖం నుండి రక్తం కారడం ప్రారంభమైంది. వెంటనే ప్రాక్టీస్ సెషన్ను నిలిపివేసి, వైద్య సిబ్బంది వెంటనే ప్రథమ చికిత్స అందించారు. అనంతరం ప్రత్యేక చికిత్స కోసం ఆటగాడిని అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు. ఇప్పటికే ఈ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును వరుస గాయల బెడద వెంటాడుతోంది. ఇప్పుడు మరో ఆటగాడు తీవ్ర గాయానికి లోనవ్వడం జట్టులో ఆందోళనను కలగజేస్తుంది. అయితే గాయం తీవ్రత గురించి ఢిల్లీ క్యాపిటల్స్ మేనేజ్మెంట్ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు.
A young Delhi Capitals player was hit hard on the face by the ball during practice, which caused a serious injury. An ambulance was called to the ground, and he was placed on a stretcher and taken to the hospital.😢
I hope he’s okay and hasn’t suffered any serious injury.🙏 pic.twitter.com/JX8Xjl6YOW
— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) April 24, 2026
సాహిల్ పరాఖ్ ఎవరు?
సాహిల్ పరాఖ్ 18 ఏళ్ల భారత క్రికెటర్. ఇతను జూన్ 7, 2007న మహారాష్ట్రలోని నాసిక్లో జన్మించాడు. ఇతను లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్, అలాగే మంచి బౌలర్ కూడా. ఐపీఎల్ 2026 సీజన్ కోసం గతేడాది జరిగిన వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ అతడిని రూ.30 లక్షలకు కొనుగోలు చేసింది. ఇతను దేశీయంగా మహారాష్ట్రకు, మహారాష్ట్ర ప్రీమియర్ లీగ్లో ఈగల్ నాసిక్ టైటాన్స్కు ప్రాతినిధ్యం వహించాడు.
పరాఖ్ మహారాష్ట్ర తరపున పాఠశాల స్థాయి నుంచి క్రికెట్తో తన ప్రస్థానాన్ని ప్రారంభించాడు. పాఠశాలల మధ్య జరిగే టోర్నమెంట్లలో నిలకడగా పరుగులు, వికెట్లు తీస్తూ రాణించాడు. ఆ తర్వాత మహారాష్ట్ర అండర్-19 జట్టుకు ఎంపికై, నమ్మకమైన టాప్-ఆర్డర్ బ్యాట్స్మన్గా, పార్ట్-టైమ్ బౌలర్గా స్థిరపడ్డాడు.
Also Read: IPL Slapgate Ad: చెంపదెబ్బ వీడియోతో రూ.కోటి సంపాదన..హర్బజన్పై శ్రీశాంత్ ఆరోపణ..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Telangana Governor: హమ్మయ్య.. ఎమ్మెల్సీలుగా అజారుద్దీన్, కోదండరాం రెడ్డి
Hyderabad, Telangana:Telangana Governor Quota MLC: తెలంగాణ మంత్రి అజారుద్దీన్కు భారీ ఊరట లభించింది. కాంగ్రెస్ పార్టీ గట్టి ఊపిరి పీల్చుకుంది. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అజారుద్దీన్కు ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం దాదాపు ఖాయమైంది. ఇప్పటికే గవర్నర్ వద్ద ఉన్న ఆ ఫైల్కు ఆమోద ముద్ర లభించింది. ఆ ఫైల్పై గవర్నర్ సంతకం చేశారని తెలుస్తోంది. ఇదొక్కటే కాకుండా ఎమ్మెల్సీ పదవి దక్కి.. దక్కకుండా పోతుండడంతో తీవ్ర అసహనంలో ప్రొఫెసర్ కోదండ రాంరెడ్డికి ఊరట లభించింది. ఆయన అభ్యర్థిత్వానికి కూడా గవర్నర్ ఆమోదం తెలిపినట్లు సమాచారం.
Also Read: RCB vs GT: బెంగళూరు దూకుడుకు తేలిపోయిన సాయి సుదర్శన్ సెంచరీ.. గుజరాత్ టైటాన్స్ మరో ఓటమి
గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా అజారుద్దీన్, కోదం రామ్రెడ్డికి కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది. అభ్యర్థిత్వం ఖరారు చేస్తూ ప్రభుత్వం పంపిన సిఫారసులను దాదాపు ఐదు నెలలకు పైగా గవర్నర్ ఆమోదం తెలపడం లేదు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా మైనార్టీకి చెందిన అజారుద్దీన్కు కాంగ్రెస్ పార్టీ మంత్రి పదవి ఇచ్చింది. ఆయన మంత్రిగా బాధ్యతలు చేపట్టి దాదాపు ఆరు నెలలకు చేరువవుతోంది. ఈ నేపథ్యంలో ఆయన మంత్రి పదవి ఉంటాదా? ఊడుతదా? అని తీవ్ర ఉత్కంఠ నేపథ్యంలో ఎట్టకేలకు గవర్నర్ ఆమోదం తెలిపారు.
Also Read: Telangana RTC Strike: చర్చల అనంతరం ఆర్టీసీ సమ్మెపై భట్టి విక్రమార్క కీలక ప్రకటన
కోదండ రాంరెడ్డి, అజారుద్దీన్కు ఎమ్మెల్సీలుగా నియమించాలని ఆగస్టు 30వ తేదీన కాంగ్రెస్ ప్రభుత్వం తీర్మానం చేసి గవర్నర్కు పంపించింది. తాజాగా ఆ తీర్మానంపై గవర్నర్ సంతకం చేయడంతో వారిద్దరు ఎమ్మెల్సీల నియామకానికి మార్గం సుగమమైంది. నేడో రేపో వారిని ఎమ్మెల్సీలుగా నియమిస్తూ గవర్నర్ అధికారిక ప్రకటన చేయనున్నారు. కోదండా రాంరెడ్డికి గవర్నర్ పదవి అనేది ఇలా వచ్చి అలా పోతోంది. గతంలో ఆయనను ఎమ్మెల్సీగా గవర్నర్ నియమించగా.. బీఆర్ఎస్ పార్టీ గట్టి పోరాటం చేయడంతో అతడి ఎమ్మెల్సీ పదవి పోయింది. ఇప్పుడు మళ్లీ ప్రతిపాదనలు పంపగా.. ఈసారి గవర్నర్ ఆమోదం తెలుపుతున్నారు. ఈసారయినా కోదండ రామిరెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఉంటుందా? ఉండదా? అనేది ఆసక్తికరంగా మారింది.
తనకు ఎమ్మెల్సీ పదవి దక్కబోతుండడంతో కోదండ రాంరెడ్డి స్పందించారు. ఎమ్మెల్సీ పదవి గురించి ఆలోచించడమే తాను మానేసినట్లు చెప్పారు. ఎందుకంటే అంతలా ఎమ్మెల్సీ పదవిపై విసిగి వేసారిపోయారు. ఎమ్మెల్సీ పదవి గురించి ఎవరూ అడిగినా సున్నితంగా వదిలేయమని.. చెప్పినట్లు తెలిపారు. తనకు పదవులు శాశ్వతం కాదని అర్థమైంది.. తనను విమర్శించే వాళ్లకి ఏం చెప్పలేనని పేర్కొన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
