రోడ్డు పై పశువుల సంచారం..వాహనదారులకు ఇబ్బందులు
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Atal Pension Yojana Increase Decision 2025:అటల్ పెన్షన్ యోజన కింద పెన్షన్ మొత్తాలను పెంచుతారా? లేదా ? అనే ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో స్పష్టత ఇచ్చింది. దేశవ్యాప్తంగా కోట్లాది మంది అసంఘటిత రంగ కార్మికులు ఈ పథకంపై ఆధారపడుతున్న నేపథ్యంలో.. పెన్షన్ పెంపుపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న అంశం మరింత ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం ఈ పథకానికి 84 మిలియన్లకు పైగా చందాదారులు ఉన్నారు.
అటల్ పెన్షన్ యోజన స్కీమును మే 2015లో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. దేశంలో సార్వత్రిక సామాజిక భద్రతా వ్యవస్థను బలోపేతం చేయడమే ఈ పథకపు ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది. ముఖ్యంగా అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులకు వృద్ధాప్యంలో స్థిరమైన ఆదాయం కల్పించాలనే ఉద్దేశంతో దీనిని అమలులోకి తీసుకొచ్చారు. ఈ పథకం కింద చందాదారులు తమ ఎంపిక ప్రకారం నెలకు రూ.1,000 నుంచి రూ.5,000 వరకు హామీ పెన్షన్ పొందే అవకాశం ఉంటుంది.
ఎంచుకున్న పెన్షన్ మొత్తాన్ని.. అలాగే చందాదారుడి చేరిక వయస్సును బట్టి నెలవారీ కాంట్రిబ్యూషన్ నిర్ణయిస్తుంది. ప్రస్తుతం ఈ సహకారం నెలకు కనీసంగా రూ.42 నుంచి గరిష్టంగా రూ.1,454 వరకు ఉంటుంది. తక్కువ ఆదాయం కలిగినవారు కూడా సులభంగా చేరేలా ఈ పథకాన్ని రూపొందించారు.
ఇటీవల అటల్ పెన్షన్ యోజన చందాదారుల్లో వచ్చిన ఓ సందేహం చర్చకు దారి తీసింది. ద్రవ్యోల్బణం పెరుగుతున్న నేపథ్యంలో, ఈ పథకం కింద కనీస పెన్షన్ మొత్తాన్ని ప్రభుత్వం పెంచుతుందా? అనే ప్రశ్న ఉత్పన్నమైంది. ఈ విషయంపై లోక్సభలో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అసంఘటిత రంగ కార్మికుల సామాజిక భద్రతను మరింత బలోపేతం చేయడానికి పెన్షన్ మొత్తాలను పెంచే యోచన ఉందా, లేదా కాంట్రిబ్యూషన్ నిర్మాణంలో మార్పులు చేయాలా, ద్రవ్యోల్బణానికి అనుగుణంగా పెన్షన్ విధానాన్ని తీసుకురావాలా అనే అంశాలపై స్పష్టత కోరారు.
దీనికి స్పందించిన ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి..ప్రస్తుతం అటల్ పెన్షన్ యోజన కింద పెన్షన్ మొత్తాలను పెంచే ప్రతిపాదన ఏదీ లేదని పార్లమెంటుకు లిఖితపూర్వక సమాధానంలో వెల్లడించారు. పెన్షన్ మొత్తాన్ని పెంచితే, చందాదారులు చెల్లించాల్సిన నెలవారీ సహకారం కూడా పెరుగుతుందని, దీని వల్ల తక్కువ ఆదాయం కలిగిన వారికి అదనపు ఆర్థిక భారం పడే అవకాశం ఉందని ప్రభుత్వం అభిప్రాయపడింది. అందుకే ప్రస్తుత నిబంధనలు, షరతులతోనే ఈ పథకాన్ని కొనసాగించాలని నిర్ణయించినట్లు స్పష్టం చేసింది.
ప్రభుత్వ గణాంకాల ప్రకారం, 2025 నవంబర్ 30 నాటికి అటల్ పెన్షన్ యోజనలో మొత్తం 84,517,419 మంది చందాదారులు నమోదయ్యారు. అంటే దాదాపు 84 మిలియన్ల మంది ఈ పథకంతో అనుసంధానమై ఉన్నారు. ఇది ఈ పథకం ప్రజల్లో ఎంత విశ్వాసం సంపాదించుకుందో చూపిస్తోంది. పెన్షన్ స్లాబ్ల వారీగా చూస్తే, అత్యధికంగా చందాదారులు రూ.1,000 పెన్షన్ స్లాబ్ను ఎంచుకున్నారు. మొత్తం చందాదారుల్లో సుమారు 86.9 శాతం మంది, అంటే 73 మిలియన్లకు పైగా ఈ స్లాబ్లో ఉన్నారు. రూ.2,000 పెన్షన్ స్లాబ్లో సుమారు 3 శాతం మంది ఉండగా, రూ.3,000 స్లాబ్లో 1.41 శాతం, రూ.4,000 స్లాబ్లో 0.53 శాతం మంది ఉన్నారు. అత్యధిక పెన్షన్ అయిన రూ.5,000 స్లాబ్ను దాదాపు 8.15 శాతం మంది, అంటే సుమారు 6.87 మిలియన్ల మంది ఎంపిక చేసుకున్నారు.
అటల్ పెన్షన్ యోజనలో నమోదు ప్రతి సంవత్సరం క్రమంగా పెరుగుతూ వస్తోంది. 2015–16 ఆర్థిక సంవత్సరంలో ఈ పథకంలో కేవలం 2.48 మిలియన్ల మంది మాత్రమే చేరారు. అయితే కాలక్రమేణా ప్రజల్లో అవగాహన పెరగడంతో, 2024–25 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఈ సంఖ్య 76 మిలియన్లకు మించిపోయింది. ప్రస్తుత 2025–26 ఆర్థిక సంవత్సరంలోనే, నవంబర్ 30 నాటికి 8.426 మిలియన్ల కొత్త చందాదారులు చేరారు. దీంతో మొత్తం చందాదారుల సంఖ్య 84.5 మిలియన్లను దాటింది.
ప్రభుత్వం స్పష్టంగా చెబుతున్నది ఏమిటంటే.. అటల్ పెన్షన్ యోజన ప్రధానంగా పేదలు, వెనుకబడిన వర్గాలు, అసంఘటిత రంగ కార్మికులను దృష్టిలో పెట్టుకొని రూపొందించింది. వృద్ధాప్యంలో వారికి కనీస ఆర్థిక భద్రత కల్పించడం, పదవీ విరమణ తర్వాత కూడా స్థిరమైన నెలవారీ పెన్షన్ అందించడం ఈ పథకపు అసలు ఉద్దేశ్యం. ప్రస్తుతం పెన్షన్ పెంపు ప్రణాళికలు లేకపోయినప్పటికీ.. ఈ పథకం లక్షలాది మందికి భవిష్యత్తుపై భరోసా కల్పిస్తూ కొనసాగుతోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
Ketu Blessing Effect On Zodiac: గ్రహాలు అప్పుడప్పుడు రాశి లేదా నక్షత్ర సంచారం చేయడానికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. దీనివల్ల వ్యక్తుల జాతకాల్లో గ్రహాలు మారి జీవితాల్లో అనేకమైన మార్పులు వస్తూ ఉంటాయి. ఈ గ్రహ ప్రభావాలు కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు అందిస్తే.. మరికొన్ని రాశుల వారికి ఆశుభ ఫలితాలను అందిస్తాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. అయితే జాతకంలో కొన్ని గ్రహాలు అశుభ స్థానంలో ఉంటే తప్పకుండా జీవితంలో ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అంతేకాకుండా కొన్ని చెడు గ్రహాలు అశుభ స్థానంలో ఉంటే అనేకమైన విషయాల్లో బలహీనపడటమే కాకుండా.. వ్యక్తులు వివిధ రకాల వ్యాధులను ఎదుర్కోవాల్సి వస్తుంది.
ముఖ్యంగా కేతువు లాంటి గ్రహం సంచారం చేసినప్పుడు అన్ని రాశుల వారిపై ప్రత్యేకంగా ప్రభావం చూపుతుంది. ఈ గ్రహం దాదాపు 18 నెలలకు ఒకసారి మాత్రమే రాశి ప్రవేశం చేస్తుంది. రాహువు కేతువు రెండు గ్రహాలు చాలా శక్తివంతమైనవిగా భావిస్తారు. అయితే ఈ రెండు గ్రహాలు చాలా అరుదుగా మాత్రమే సంచారం చేస్తాయి. కానీ కొన్ని సందర్భాల్లో నక్షత్ర సంచారం తప్పకుండా చేస్తాయి. ఇదిలా ఉంటే 2026 సంవత్సరంలో కేతువు గ్రహం నక్షత్ర సంచారం చేస్తుంది. 2026 సంవత్సరం ప్రారంభ నెల జనవరిలో పూర్వ ఫల్గుణి నక్షత్రంలోని మొదటి స్థానంలోకి వెళ్తుంది. ఆ తర్వాత కేతువు గ్రహం మార్చి 29 ఆదివారం మాఘ నక్షత్రంలోని నాల్గవ స్థానంలోకి ప్రవేశిస్తాడు. దీంతో రాబోయే ఏడాదిలో కేతువు రెండుసార్లు సంచారం చేస్తాడు.
వృశ్చిక రాశి
కేతువు సంచారంతో వృశ్చిక రాశి వారికి నో శుభ ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా వీరికి కెరీర్ పరంగా కలిసి వస్తుంది. ఈ సమయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఇక పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వ్యక్ తులు ఈ సమయంలో తప్పకుండా మంచి ఫలితాలు పొందగలుగుతారు. అలాగే చదువుకుంటున్న విద్యార్థులకు కూడా అద్భుతమైన లాభాలు కలుగుతాయి. ఈ సమయంలో ఉపాధ్యాయులతో పాటు ఇతర రంగాల్లో ఉన్న వ్యక్తులకు మేలు జరుగుతుంది. కొంతమందికి పెద్ద సమస్యల నుంచి అద్భుత పరిష్కారం లభిస్తుంది.
వృషభ రాశి
కేతు నక్షత్ర మార్పుల కారణంగా వృషభ రాశి వారికి ఆలోచన మార్పు విపరీతంగా పెరుగుతుంది. అంతేకాకుండా వీరికి మానసిక ఒత్తిడి క్రమక్రమంగా తగ్గి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. దీంతోపాటు ఉద్యోగాలు చేస్తున్న వ్యక్తులకు ఈ సమయంలో మంచి ప్రమోషన్స్ కూడా లభిస్తాయి. కార్యాలయాల్లో వస్తున్న అడ్డంకులు కూడా పూర్తిగా తొలగిపోతాయి. కుటుంబ సభ్యులతో సంబంధాన్ని మెరుగుపడడమే కాకుండా ఈ సమయం చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే వీరికి ఆత్మవిశ్వాసం కూడా ఊహించని స్థాయిలో పెరుగుతుంది. ముఖ్యంగా ఈ సమయంలో వృషభ రాశి వారు కొన్ని అద్భుతమైన పనుల్లో పాల్గొంటారు.
Also Read: Chatugrahi Yoga 2026: త్వరలో 4 గ్రహాల అరుదైన కలయికతో రాజయోగం.. జాక్ పాట్ కొట్టబోతున్న రాశులు ఇవే..
సింహరాశి
సింహరాశిలో జన్మించిన వ్యక్తులకు వచ్చే ఏడాది విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా వీరికి ఆర్థికంగా మానసికంగా చాలా వరకు కలిసి వస్తుంది. ఎప్పటినుంచో అనుకుంటున్నా పనులు కూడా ఎంతో సులభంగా చేయగలుగుతారు. అలాగే ఆరోగ్యం కూడా చాలా వరకు మెరుగుపడుతుంది. తీవ్ర దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులు అద్భుతమైన లాభాలు పొందగలుగుతారు. అంతేకాకుండా ఖర్చులు కూడా పూర్తిగా అదుపులో ఉండే అవకాశాలు ఉన్నాయి. దీనివల్ల వీరికి సంపాదన కూడా ఊహించని స్థాయిలో పెరుగుతుంది.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిష్య శాస్త్ర నిపుణుల నుంచి సేకరించి రాసింది మాత్రమే. దీనిని జీ తెలుగు న్యూస్ దృవీకరించదు.
Also Read: Chatugrahi Yoga 2026: త్వరలో 4 గ్రహాల అరుదైన కలయికతో రాజయోగం.. జాక్ పాట్ కొట్టబోతున్న రాశులు ఇవే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
EPF Pension Benefit: ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులకు భవిష్యత్తులో ఆర్ధిక భద్రత కల్పించేందుకు ఈపీఎఫ్ఓ కీలక పాత్ర పోషిస్తుంది. ఉద్యోగంలో ఉన్నప్పుడే కాదు.. రిటైర్మెంట్ తర్వాత కూడా ఉద్యోగులకు స్థిర ఆదాయం అందించాలన్న ఉద్దేశ్యంతో ఈపీఎఫ్ఓ పలు స్కీములను అమలు చేస్తోంది. వీటిలో ముఖ్యమైనవి ఈపీఎఫ్, ఈపీఎస్, ఉద్యోగుల లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీములు ఉన్నాయి.
పీఎఫ్ పై కంపెనీ వాటా ఎంత?
ఈపీఎఫ్ఓ రూల్స్ ప్రకారం.. ఉద్యోగి బేసిక్ సాలరీ, డీఏపై ప్రతినెలా 12శాతం ఉద్యోగి తన వాటాగా చెల్లించాలి. అదే సమయంలో కంపెనీ కూడా ఉద్యోగి జీతంపై నిర్ణీత శాతాన్ని చెల్లిస్తుంది. సంస్థ చెల్లించే మొత్తం మూడు భాగాలుగా విభజిస్తారు. అందులో 3.67శాతం ఈపీఎఫ్ అకౌంట్లో జమ అవుతుంది. మిగిలిన 8.33 శాతం ఈపీఎస్, బీమా స్కీమ్ కు వెళ్తుంది. ఈ విధంగా ఉద్యోగి భవిష్యత్తుకు పొదుపు, పెన్షన్ తోపాటు బీమా రక్షణ కూడా లభిస్తుంది.
ఈపీఎస్ ప్రయోజనాలు ఎలా పొందాలి?
ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ బెనిఫిట్స్ పొందాలంటే కొన్ని అర్హతలు, నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది.
-ఉద్యోగి ఈపీఎఫ్ సభ్యుడై ఉండాలి.
-కనీసం 10ఏళ్లు ఈపీఎస్ కు చందా చెల్లించాలి
-కనీసం 10ఏళ్ల సర్వీస్ పూర్తి చేసి ఉండాలి.
ఉద్యోగి 58 ఏళ్ల వయస్సు తర్వాత పెన్షన్ కు అర్హత ఉంటుంది. అయితే 50ఏళ్ల వయస్సు వచ్చిన తర్వాత తగ్గించిన పెన్షన్ ను పొందే ఛాన్స్ ఉంది. 58ఏళ్ల వయస్సు వచ్చిన తర్వాత కూడా ఉద్యోగి కావాలనుకుంటే ఈపీఎస్ కు చందాను కొనసాగించవచ్చు.
పెన్షన్ ఎలా లెక్కిస్తారు?
ప్రస్తుతం EPS కింద పెన్షన్ లెక్కించడానికి గరిష్ట పెన్షనబుల్ జీతాన్ని రూ.15,000గా నిర్ణయించారు. అంటే.. ఉద్యోగి అసలు జీతం ఎంత ఉన్నా.. పెన్షన్ లెక్కింపులో గరిష్టంగా రూ.15,000నే పరిగణనలోకి తీసుకుంటారు. దీని ప్రకారం ఈపీఎస్ కు గరిష్ట నెలవారీ కాంట్రిబ్యూషన్ రూ.1,250గా ఉంటుంది. గరిష్టంగా 35 సంవత్సరాల సర్వీస్ను మాత్రమే పెన్షన్ కోసం పరిగణిస్తారు.
EPS పెన్షన్ లెక్కింపు కోసం ఒక నిర్దిష్ట సూత్రం ఉంది. ఆ సూత్రం ప్రకారం:
పెన్షన్ = సగటు జీతం × పెన్షనబుల్ సర్వీస్ / 70
ఇక్కడ సగటు జీతం అంటే ఉద్యోగి గత 12 నెలల్లో పొందిన ప్రాథమిక జీతం, డీఏ సగటుగా నిర్ణయిస్తారు. ఉదాహరణకు, ఒక ఉద్యోగి పెన్షనబుల్ జీతం రూ.15,000గా ఉండి, 15 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేశాడని అనుకుందాం. అప్పుడు పెన్షన్ = 15,000 × 15 / 70. దీని ప్రకారం అతడికి నెలకు సుమారు రూ.3,214 పెన్షన్ లభిస్తుంది.
సర్వీస్ సంవత్సరాల లెక్కింపులో రౌండింగ్ విధానం కూడా వర్తిస్తుంది. ఉదాహరణకు, ఉద్యోగి 14 సంవత్సరాలు 7 నెలలు పనిచేసి ఉంటే, దాన్ని 15 సంవత్సరాలుగా పరిగణిస్తారు. ఇది ఉద్యోగికి కొంత ప్రయోజనకరంగా ఉంటుంది.
కనీస పెన్షన్ ఎంత?
ఈపీఎస్ కింద ప్రస్తుతం కనీస పెన్షన్ మొత్తాన్ని కూడా నిర్ణయించారు. ఒకప్పుడు ఇది రూ.1,000గా ఉండేది. తాజా నిర్ణయాల ప్రకారం కనీస పెన్షన్ రూ.2,500గా అమలులో ఉంది. అలాగే ఉద్యోగి 58 సంవత్సరాల వయస్సుకు ముందే పెన్షన్ తీసుకుంటే, ప్రతి ఏడాదికి 4 శాతం చొప్పున పెన్షన్ తగ్గుతుంది. అదే విధంగా, 60 సంవత్సరాల వయస్సు తర్వాత పెన్షన్ ప్రారంభిస్తే, ప్రతి ఏడాదికి అదనంగా 4 శాతం పెరుగుదలతో మొత్తం 8 శాతం అదనపు ప్రయోజనం లభిస్తుంది.
ఉద్యోగి మరణిస్తే..?
ఉద్యోగి మరణించినట్లయితే.. అతని కుటుంబానికి పెన్షన్ భద్రత కల్పిస్తుంది. జీవిత భాగస్వామి, పిల్లలు ఈ పెన్షన్ ప్రయోజనాలకు అర్హులు. అలాగే ఉద్యోగంలో ఉన్న సమయంలో వైకల్యం ఏర్పడినా EPS కింద పెన్షన్ సదుపాయం అందుతుంది.
పెన్షన్ ఫార్ములా ఏంటి?
ఈపీఎస్ ఫార్ములా నవంబర్ 15 , 1995 తర్వాత వ్యవస్థీకృత రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులకు వర్తిస్తుంది . ఈపీఎస్ నిబంధనల ప్రకారం , ఉద్యోగులు 58 సంవత్సరాల వయస్సు తర్వాత మాత్రమే పెన్షన్కు అర్హులు అవుతారు. అయితే , మీరు 58 సంవత్సరాల వయస్సుకు ముందు మీ పెన్షన్ను ఉపసంహరించుకుంటే , మీ పెన్షన్ ప్రతి సంవత్సరం 4 శాతం తగ్గుతుంది . అదేవిధంగా , మీరు 60 సంవత్సరాల వయస్సు తర్వాత మీ పెన్షన్ను ఉపసంహరించుకుంటే , మీరు సాధారణ పెన్షన్ మొత్తం కంటే 8 శాతం ఎక్కువ పొందుతారు .
15 ఏళ్ల సర్వీస్ తర్వాత మీరు ఎంత పెన్షన్ పొందుతారు ?
ఒక ఉద్యోగి రిటైర్డ్ అయినా కూడా, పెన్షన్ లెక్కించడానికి గరిష్ట జీతం రూ. 15,000గా పరిగణిస్తారు. ఈపీఎస్ కింద , జీతంతో సంబంధం లేకుండా, కనీస పెన్షన్ రూ. 2,500. గత 11 సంవత్సరాలుగా, కనీస పెన్షన్ రూ. 1,000. ఇప్పుడు, పెన్షన్ పొందదగిన జీతం రూ. 15,000, సర్వీస్ సంవత్సరాలు 15 సంవత్సరాలు అని అనుకుందాం. ఇప్పుడు, మనం ఈ సూత్రాన్ని వర్తింపజేస్తే.. EPS = సగటు జీతం x పెన్షన్ పొందదగిన సర్వీస్ / 70. దీని అర్థం 15 సంవత్సరాల సర్వీస్ కోసం మీ పెన్షన్ రూ. 3,214 అందుతుంది.
సాలరీ అకౌంట్ క్లోజ్ చేస్తే పెన్షన్ మొత్తం ఏమౌతుంది?
పెన్షనర్లు ఇప్పుడు భారతదేశంలోని ఏ బ్యాంకు శాఖ నుండి అయినా తమ పెన్షన్ పొందవచ్చు. ఈ నియమం జనవరి 1, 2025 నుండి అమలులోకి వచ్చింది.
10ఏళ్ల కంటే ఎక్కువ సర్వీస్ ఉంటే డబ్బును విత్డ్రా చేసుకోవచ్చా?
మీరు అత్యవసర పరిస్థితుల్లో మీ ఈపీఎఫ్ అకౌంట్ నుంచి డబ్బును విత్ చేసుకునే వెసులుబాటును కల్పించింది. కానీ మీరుఈపీఎస్ నుండి విత్డ్రా చేసుకోవడానికి అనుమతి లేదు. మీకు పెన్షన్ సర్టిఫికేట్ అందుతుంది. ఫారమ్ 10D దాఖలు చేయడం ద్వారా 58 సంవత్సరాల వయస్సు తర్వాత దీనిని క్లెయిమ్ చేసుకోవచ్చు .
మొత్తానికి ఈపీఎఫ్, ఈపీఎస్ స్కీములు ఉద్యోగి ఉద్యోగ జీవితం తర్వాత కూడా ఆర్థిక భద్రతను అందించే కీలక పథకాలుగా నిలుస్తున్నాయి. కాబట్టి ప్రైవేట్ రంగంలో పనిచేసే ప్రతి ఉద్యోగి ఈ పథకాల ప్రాముఖ్యతను అర్థం చేసుకుని, తమ భవిష్యత్తు కోసం వీటిని సద్వినియోగం చేసుకోవడం ఎంతో అవసరం ఉంటుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
Financial Planning Tips for Women 2026: నేటికాలం మహిళలు ఆర్థికంగా స్వతంత్రంగా ఎదుగుతున్నారు. సరైన కాలంలో సరైన నిర్ణయాలు తీసుకుంటే భవిష్యత్తులో కోటీశ్వరులు అవ్వడం సాధ్యం అవుతుంది. మీరు కూడా 2026 జనవరి 1వ తేదీన కొన్ని ఆర్థిక అలవాట్లను షురూ చేసినట్లయితే.. దీర్ఘకాలంలో భారీ సంపదను కూడబెట్టుకోవచ్చు. ఆదాయం ఎంత ఉంది అనేదానికంటే దాన్ని ఎలా నిర్వహిస్తున్నామన్నదే ముఖ్యం. ఈ నేపథ్యంలో మహిళలు కొత్త ఏడాదిలో తీసుకోవాల్సిన మూడు ముఖ్యమైన నిర్ణయాల గురించి తెలుసుకుందాం. ఈ నిర్ణయాలతో మీరు కోటీశ్వరులు అవడం సాధ్యం అవుతుంది.
మ్యూచువల్ ఫండ్ SIP:
మొదటగా మనం చర్చించాల్సిన స్కీమ్ మ్యూచువల్ ఫండ్ సిప్. ఇందులో ప్రతినెలా కొంత మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయండి. చిన్న మొత్తాలతో మొదలై.. భారీ సంపదగా మారుతుంది. ముఖ్యంగా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ దీర్ఘకాలంలో మంచి రాబడులను అందిస్తాయి. ఉదాహరణకు చెప్పుకుంటే నెలకు రూ. 5వేల చొప్పున 25ఏండు సిప్ చేస్తే 12శదాతం రాబడి వస్తుంది. చివరికి కోటికిపైగా మొత్తం కూడబెట్టుకోవచ్చు. మహిళలకు ఇది క్రమశిక్షణతో కూడిన పొదుపు అని చెప్పాలి. మార్కెట్ ఒడిదుడుకుల నుంచి భయపడకుండా పెట్టుబడి పెట్టేందుకు ఇది మంచి మార్గం అవుతుంది.
నేషనల్ పెన్షన్ స్కీమ్:
ఇక రెండవ స్కీమ్..నేషనల్ పెన్షన్ స్కీమ్. ఇది రిటైర్మెంట్ తర్వాత ఆర్థికంగా బలంగా ఉండేందుకు రూపొందించిన పథకం. ఉద్యోగం చేస్తున్నా.. వ్యాపారం చేస్తున్న మహిళలు కూడా ఈ స్కీమ్ లో అకౌంట్ తీసుకోవచ్చు. దీనిలో పెట్టే మొత్తానికి ట్యాన్స్ బెనిఫిట్ ఉంటుంది. దీర్ఘకాల పెట్టుబడి కావడంతో పదవి విరమణ సమయంలో పెద్ద మొత్తంలో నిధులు చేతికి అందుతాయి. కుటుంబ బాధ్యతలు తీర్చుకున్న తర్వాత కూడా స్వతంత్రంగా జీవించేందుకు ఈస్కీమ్ ఎంతగానో ఉపయోగపడుతుంది.
రికరింగ్ డిపాజిట్ :
మూడవది రికరింగ్ డిపాజిట్ స్కీమ్. ఇది రిస్క్ లేని స్కీమ్. మహిళలకు పూర్తి భద్రతనిస్తుంది. ప్రతినెలా కొంత మొత్తాన్ని బ్యాంకులో జమ చేసినట్లయితే.. మెచ్యూరిటీ తర్వాత ఒకేసారి పెద్ద మొత్తంలో డబ్బు అందుతుంది. పిల్లల చదువు, పెళ్లి ఖర్చులు లేదంటే అత్యవసరాల కోసం ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. మ్యూచువల్ ఫండ్స్ తో పోలిస్తే రాబడి తక్కువగా ఉన్నా కూడా భద్రత మాత్రం ఎక్కువగా ఉంటుంది.
టర్మ్ ఇన్సూరెన్స్:
ఈ మూడు స్కీముల్లో డబ్బులు ఇన్వెస్ట్ చేయగా మిగిలిన డబ్బులతో టర్మ్ ఇన్సూరెన్స్ కట్టండి. ఇది కుటుంబానికి భరోసానిస్తుంది. మహిళలు తప్పకుండా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. అనుకోని పరిస్థితులు ఎదురైనప్పుడు, కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో పడకుండా ఇది మీకు రక్షణగా నిలుస్తుంది. తక్కువ ప్రీమియంతో పెద్ద కవరేజీని పొందవచ్చు.
హెల్త్ ఇన్సూరెన్స్:
ఐదవది..చివరిది.. అత్యంత ముఖ్యమైంది. హెల్త్ ఇన్సూరెన్స్. అనారోగ్యం చెప్పిరాదు. అత్యవసర పరిస్థితుల్లో వైద్య ఖర్చుల కోసం హెల్త్ ఇన్సూరెన్స్ ఎంతగానో ఉపయోగపడుతుంది. అందుకే చిన్న వయస్సులోనే మంచి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే.. ఆసుపత్రి ఖర్చుల నుంచి కుటుంబాన్ని గట్టెక్కిస్తుంది.
వచ్చే కొత్త ఏడాది 2026లో ఈ ఐదు నిర్ణయాలు తీసుకుంటే మహిళలు ఆర్థికంగా బలంగా మారడమే కాదు..దీర్ఘకాలంలో కోటీశ్వరులుగా మారుతారు. సంపద అనేది ఒక రోజులోనే కూడబెడితే రాదు. రూపాయి రూపాయి పొదుపు చేస్తూ సరైన ప్రణాళి, క్రమశిక్షణ ఉంటే ప్రతి మహిళ తన ఆర్థిక భవిష్యత్తును తానే నిర్మించుకునే సత్తా ఉంటుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
Raktha Pinjara Video Watch Here: పసుపు పొలాల్లో పనిచేస్తున్న రైతులకు తృతిలో పేను ప్రమాదం తప్పింది. నిజామాబాద్ జిల్లాలోని ఉన్న ఓ పసుపు తోటలో అత్యంత ప్రమాదకరమైన రక్తపింజర పాము కలకలం సృష్టించింది. గత రెండు నెలల క్రితం ఇదే పాము కొంతమంది పసుపు తోటల్లో సంచారం చేస్తూ కనిపించింది.. దీంతో అప్పటి నుంచి కొంతమంది రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తూ వచ్చింది. అయితే, మరోసారి పసుపు పంటలు కొంతమంది రైతులు పనిచేస్తున్న క్రమంలో కనిపించడంతో వెంటనే వారు స్నేక్ క్యాచర్కి సమాచారం అందించారు. దీంతో అతను అక్కడికి చేరుకొని రెస్క్యూ చేపట్టిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. దీనికి సంబంధించిన వీడియోనే ఇప్పుడు చాలామంది సోషల్ మీడియా వినియోగదారులు పడి పడి వీక్షిస్తున్నారు. ఇంతకీ ఆ పామును ఎలా పట్టుకున్నారో? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. పసుపు తోటలో నీళ్లు పెడుతున్న రైతుకు ఎండిన ఆకుల మధ్య దాడి చేసేందుకు సిద్ధంగా ఉన్న రక్తపింజర పాము కనిపించింది. దీంతో వారి వెంటనే ప్రముఖ స్నేక్ క్యాచర్ మున్నాకి సమాచారం అందించారు. దీంతో అతను అక్కడికి చేరుకొని.. ఆకుల్లో కలిసిపోయిన పామును గుర్తించి మున్నా దానిని ఎంతో జాగ్రత్తగా పట్టుకునేందుకు ప్రయత్నించాడు. అయితే, ఈ పాము ఎండుటాకుల్లో ఉండడం వల్ల అది కొద్దిసేపు వరకు కనబడకుండా ఆకుల కింద ఉండిపోయింది. ఆ తర్వాత స్నేక్ క్యాచర్ ఆకులను కూడా అటు ఇటు జరపడంతో బయటపడింది.
రక్తపింజర్ పాముకు సంబంధించిన ఎన్నో అపోహాలు ఇప్పటికీ చాలామంది నమ్ముతూ ఉంటారు. రక్తపింజర బుసలు కొడుతుంటే దానికి దూరంగా ఉండాలని చెబుతూ ఉంటారు. లేకపోతే దాని బుసల నుంచి వచ్చే గాలి ఒంటికి పై పడి.. చర్మం మచ్చలుగా ఏర్పడుతుందని చాలామంది ఇప్పటికీ ఊళ్ళల్లో రైతులు నమ్ముతూ ఉన్నారు. అయితే ఈ మూఢనమ్మకాన్ని స్నేక్ క్యాచర్ మున్నా కొట్టి పారేశాడు.. పాము బుసలు కొట్టడం అనేది కేవలం తనని తాను ప్రమాదం నుంచి రక్షించుకోవడానికి ఇచ్చే ఒక సంకేతమని.. ఇలా బుసలు కొడితే ఎలాంటి మచ్చలు రావని.. ముఖ్యంగా చర్మ సమస్యలు అసలు రావని ఆయన వీడియోలో పేర్కొన్నారు.
ప్రముఖ స్నేక్ క్యాచర్ మున్నా వీడియోలు మాట్లాడుతూనే ఆ పాములు పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. చివరికి ఆ పామును పట్టుకొని.. ఓ సంచిలో బంధించాడు. ఇలా బంధించిన పాములు అతను ఓ అడవి ప్రదేశానికి తీసుకెళ్లి అక్కడ విడిచిపెట్టాడు. సాధారణంగా పసుపు పొలాల్లో ఇలాంటి పాములు సంచారం చేయడం సర్వసాధారణమే. కానీ సంచారం చేసే క్రమంలో తప్పకుండా వాటిని గుర్తించి వెంటనే స్నేక్ క్యాచర్స్కి సమాచారం అందించడం మంచిదని కొంతమంది వన్యప్రాణి సంరక్షకులు చెబుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Redmi Note 15 5G Launch Date: ప్రముఖ స్మార్ట్ఫోన్ కంపెనీ Xiaomi విడుదల చేసే మొబైల్కి అద్భుతమైన డిమాండ్ ఉంటుంది. ప్రీమియం ఫీచర్స్తో కూడిన స్మార్ట్ఫోన్స్ని అతి తక్కువ ధరల్లో విడుదల చేయడంలో ఈ కంపెనీ ఎప్పుడు ముందుంటుంది. ముఖ్యంగా Redmi పేరుతో విడుదల చేసే నోట్ సిరీస్ మొబైల్స్కి మార్కెట్లో ఎక్కువ డిమాండ్ ఉంటుంది. దీనిని దృష్టిలో పెట్టుకొని నోట్ సిరీస్ పేరుతోనే ఇప్పటివరకు అనేక మొబైల్స్ను విడుదల చేసింది. అయితే, అతి త్వరలోనే నోట్ 15 సిరీస్ కూడా భారత్లో విడుదల కాబోతోంది. విడుదలకు ముందే ఈ మొబైల్ ఇటీవల ఓ దేశంలో అమ్మకానికి కనిపించింది. ఇప్పుడు దీనికి సంబంధించిన వివరాలే సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్గా మారాయి. ఇంతకీ ఈ స్మార్ట్ఫోన్ ఎక్కడ అమ్మకానికి అందుబాటులో ఉందో? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
REDMI నోట్ 15 సిరీస్(REDMI Note 15 5G)ను కంపెనీ చైనాతో పాటు ఇటీవలే పోలాండ్ దేశంలో విడుదల చేసింది. ఈ సిరీస్ స్మార్ట్ఫోన్ అద్భుతమైన మోడల్స్తో అందుబాటులోకి వచ్చాయి. అయితే, ఇటీవలే బెల్జియం క్యారియర్ టెలినెట్ వెబ్సైట్లో ఒక మోడల్ అమ్మకానికి అందుబాటులోకి వచ్చింది.. అధికారిక లాంచింగ్కి ముందే ఈ స్మార్ట్ ఫోన్ ధర పూర్తి వివరాలు షాపింగ్ వెబ్సైట్లో అందుబాటులోకి వచ్చాయి. అయితే, ఇప్పుడు ఇవే సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈ మోడల్కు సంబంధించిన ధర, స్పెసిఫికేషన్స్, ఫీచర్స్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
పోలాండ్లో REDMI నోట్ 15 5G (REDMI Note 15 5G) స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి వచ్చింది. దీనిని కంపెనీ 128 జీబీ సిరీస్తో విడుదల చేసింది. దీని ధర రూ.29,662తో అందుబాటులోకి వచ్చింది. అయితే, ఇది వివిధ స్టోరేజ్ వేరియంట్లలో లభిస్తున్నట్లు కూడా సమాచారం. స్టోరేజ్ వేరియంట్ను బట్టి ధర అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన వివరాలను ఇప్పటికీ కంపెనీ Xiaomi అధికారికంగా ఎలాంటి ప్రకటనగా చేయలేదు. కానీ ఈ ఫోన్ మాత్రం అందుబాటులోకి రావడం వల్ల చాలామంది ఆశ్చర్యానికి గురయ్యారు. REDMI నోట్ 15 5G స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ఫీచర్స్ వివరాల్లోకి వెళ్తే.. దీనిని ఎంతో శక్తివంతమైన క్వాల్కమ్ యొక్క స్నాప్డ్రాగన్ 6 Gen 3 చిప్సెట్తో అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read: Kia Vision Ev: త్వరలోనే కియా నుంచి సూపర్ EV కారు.. ఇక మార్కెట్లో అద్భుతమే!
అలాగే ఈ స్మార్ట్ఫోన్ ఎంతో శక్తివంతమైన 5,520mAh బ్యాటరీతో లాంచ్ అయింది. ఇక చైనాలో విడుదలైన మొబైల్ మాత్రం 5,800 mAh బ్యాటరీతో అందుబాటులోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్ఫోన్ బ్యాటరీ చార్జింగ్ కోసం కంపెనీ దీనికి 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టును కూడా అందిస్తోంది. అంతేకాకుండా ఇది 6.77-అంగుళాల OLED డిస్ప్లేతో విడుదలైంది. ఇక ఇది 1,080 × 2,392 పిక్సెల్ల రిజల్యూషన్తో అందుబాటులోకి వచ్చింది. ఇక ఈ మొబైల్ వెనక కెమెరా మాడ్యూల్ వివరాల్లోకి వెళితే.. ఇందులోని కంపెనీ 108MP ప్రధాన కెమెరాతో అందుబాటులోకి వచ్చింది. అంతేకాకుండా అదనంగా 8MP అల్ట్రా-వైడ్, 2MP రెండు కెమెరాలను కలిగి ఉంటుంది. దీంతోపాటు చైనీస్ వేరియంట్ 50MP ప్రధాన కెమెరాతో పాటు అదనంగా 20MP కెమెరా కూడా లభిస్తుంది. ఇవే కాకుండా ఎన్నో రకాల కనెక్టివిటీ ఫీచర్లను కూడా కలిగి ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read: Kia Vision Ev: త్వరలోనే కియా నుంచి సూపర్ EV కారు.. ఇక మార్కెట్లో అద్భుతమే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
PSL Vs IPL Clash 2026: ఈ ఏడాది పాకిస్థాన్కు వరుసగా దెబ్బ మీద దెబ్బ తగులుతున్నాయి. పెహల్గామ్ ఘటన తర్వాత ఆపరేషన్ సింధూర్తో పాక్ని భారత్ వణికించింది. అదే రీతిలో అటు మహిళలు, పురుషుల క్రికెట్లో కూడా పాకిస్థాన్పై టీమ్ఇండియా ఆధిపత్యం చలాయించింది. ఇప్పుడు మరోసారి పాకిస్థాన్కు మరో గట్టి దెబ్బ తగిలింది. అది బీసీసీఐ నిర్వహించే ఐపీఎల్ రూపంలో. అదెలాగో ఇప్పుడు చూద్దాం.
మంగళవారం అనగా డిసెంబరు 16న జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వేలం ఇప్పుడు పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)ను చిక్కుల్లోకి నెట్టేసింది. వచ్చే ఏడాది ఒకే సమయంలో అనగా మార్చి 2026లో ఈ రెండు లీగ్లు ప్రారంభం కానున్నాయి. అయితే గతంలో పాకిస్థాన్ సూపర్ లీగ్లో ప్రాతినిధ్యం వహించిన 11 మంది విదేశీ ఆటగాళ్లను ఇప్పుడు ఐపీఎల్ ఎగరేసుకుపోయింది. దీని ఫలితంగా పాకిస్థాన్ సూపర్ లీగ్కు సుమారు రూ.27.3 కోట్ల నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది.
అటు నుంచి ఇటువైపు..
పాకిస్థాన్ వేదికగా జరుగుతోన్న సూపర్ లీగ్లోని వివిధ జట్ల తరఫున ఆడుతున్న 11 మంది కీలక ఆటగాళ్లను ఐపీఎల్ యాజమాన్యాలు నిన్న జరిగిన వేలంలో భారీ ధరలకు దక్కించుకున్నాయి. ఇందులో 10 మందిని వేలంలో కొనగా, మిచెల్ ఓవెన్ను పంజాబ్ కింగ్స్ ముందే రిటైన్ చేసుకుంది.
పీఎస్ఎల్ నుంచి ఐపీఎల్కు మారిన ఆటగాళ్ల జాబితా ఇక్కడ ఉంది..
| ప్లేయర్ పేరు | ఐపీఎల్ టీమ్ | ధర (రూ. కోట్లలో) | పాత పీఎస్ఎల్ టీమ్ |
| జేసన్ హోల్డర్ | గుజరాత్ టైటాన్స్ | ₹7.00 | ఇస్లామాబాద్ యునైటెడ్ |
| బెన్ ద్వార్షుయిస్ | పంజాబ్ కింగ్స్ | ₹4.40 | ఇస్లామాబాద్ యునైటెడ్ |
| ఆడమ్ మిల్నే | రాజస్థాన్ రాయల్స్ | ₹2.40 | కరాచీ కింగ్స్ |
| ఫిన్ అలెన్ | కేకేఆర్ | ₹2.00 | క్వెట్టా గ్లాడియేటర్స్ |
| అకీల్ హోసేన్ | సీఎస్కే | ₹2.00 | క్వెట్టా గ్లాడియేటర్స్ |
| కైల్ జేమీసన్ | ఢిల్లీ క్యాపిటల్స్ | ₹2.00 | క్వెట్టా గ్లాడియేటర్స్ |
| టిమ్ సైఫర్ట్ | కేకేఆర్ | ₹1.50 | కరాచీ కింగ్స్ |
| మాథ్యూ షార్ట్ | సీఎస్కే | ₹1.50 | ఇస్లామాబాద్ యునైటెడ్ |
వీరితో పాటు ల్యూక్ వుడ్ (₹75 లక్షలు), జోర్డాన్ కాక్స్ (₹75 లక్షలు) కూడా ఐపీఎల్ బాట పట్టినట్లు తెలుస్తోంది.
చిక్కుముడి.. ఐపీఎల్కే మొగ్గు!
నివేదికల ప్రకారం.. ఐపీఎల్, పీఎస్ఎల్ రెండు సీజన్లు కూడా వచ్చే ఏడాది మార్చి 26 నుండే ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఒకే సమయంలో రెండు లీగ్లు పోటీ పడితే, ఆటగాళ్లు సహజంగానే ఆర్థికంగా లాభదాయకమైన, ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ఉన్న ఐపీఎల్కే మొదటి ప్రాధాన్యత ఇస్తారు. ఆటగాళ్లు పీఎస్ఎల్ను వదిలి ఐపీఎల్ను ఎంచుకోవడం వల్ల పాకిస్తాన్ లీగ్ తన కళను కోల్పోయే ప్రమాదం ఉంది. ఇది పీఎస్ఎల్ నిర్వాహకులకు పెద్ద తలనొప్పిగా మారింది. దీంతో పీఎస్ఎల్ నిర్వాహకులు దిద్దుబాటు చర్యలు మొదలుపెడుతున్నట్లు సమాచారం.
ఫ్రాంచైజీలకు సవాలు
పాకిస్థాన్ సూపర్ లీగ్కు చెందిన క్వెట్టా గ్లాడియేటర్స్, ఇస్లామాబాద్ యునైటెడ్ వంటి జట్లు తమ ప్రధాన విదేశీ ఆటగాళ్లను కోల్పోవడం వల్ల ఆ జట్లు భారీగా బలహీనపడ్డాయి. ఇప్పుడు ఆ స్థానాలను భర్తీ చేసేందుకు కొత్త ఆటగాళ్లను వెతుక్కోవడం పీఎస్ఎల్ ఫ్రాంచైజీలకు పెద్ద సవాలుగా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కీలక అంశం ఇప్పుడు చర్చలో ఉంది. అదే 8వ వేతన సంఘం అమలు. 7వ వేతన సంఘం పదవీకాలం 2025 డిసెంబర్ 31తో ముగియనుంది. దీంతో తదుపరి వేతన సంఘం ఎప్పుడు అమల్లోకి వస్తుంది? జీతాలు ఎంత వరకు పెరుగుతాయి? బకాయిలు ఎంత వస్తాయి? అనే అంశాలపై ఉద్యోగుల్లో ఆసక్తి పెరుగుతోంది.
అయితే ప్రభుత్వం ఇప్పటికే 8వ వేతన సంఘాన్ని నోటిఫై చేసింది. జస్టిస్ రంజన్ దేశాయ్ నేతృత్వంలో కమిషన్ ఏర్పాటు కూడా అయ్యింది. దీనికి సంబంధించిన నిబంధనలు Tor కూడా ఆమోదం పొందాయి. ఈ కమిషన్కు తన నివేదికను సిద్ధం చేయడానికి సుమారు 18 నెలల సమయం అడిగింది. గత వేతన సంఘాల అనుభవాన్ని బట్టి చూస్తే.. నివేదిక సమర్పించిన తర్వాత ప్రభుత్వం దానిని పరిశీలించి ఆమోదించడానికి మరో 3 నుంచి 6 నెలల సమయం తీసుకునే అవకాశం ఉంటుంది. అందువల్ల 8వ వేతన సంఘం అమలు 2027 చివర్లో లేదా 2028 ప్రారంభంలో జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు అంచనాలు చెబుతున్నాయి.
అయితే.. 8పే కమిషన్ అమలు ఆలస్యమైనా కూడా.. సిఫార్సులను జనవరి 1, 2026 నుంచి అమలులోకి తెస్తే ఉద్యోగులకు భారీగా బకాయిలు లభించే అవకాశం ఉంది. అంటే రెండు సంవత్సరాల పాటు పెరిగిన జీతానికి సంబంధించిన మొత్తం ఒకేసారి అందుతుంది. ఇదే కారణంగా వేతన సంఘం ఆలస్యం అయినా ఉద్యోగులకు ఆర్థికంగా కొంత మేలు జరిగే అవకాశం ఉంటుంది.
జీతాలు ఎంత వరకు పెరిగే అవకాశం?
మార్కెట్ నిపుణులు.. అంబిట్ క్యాపిటల్ వంటి ఆర్థిక సంస్థల అంచనాల ప్రకారం.. 8వ వేతన సంఘం అమలుతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పెన్షన్లలో 30 నుంచి 34 శాతం వరకు పెరుగుదల ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ పెంపు ప్రధానంగా ఫిట్మెంట్ ఫ్యాక్టర్పై ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం చర్చలో ఉన్న ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 1.83 నుంచి 2.46 మధ్య ఉండవచ్చని అంచనాలు ఉన్నాయి. అయితే.. ఎక్కువగా 2.28 ఫిట్మెంట్ ఫ్యాక్టర్ను ఆధారంగా తీసుకుంటున్నారు. సాధారణంగా కొత్త వేతన నిర్మాణం అమలుకు ముందు, ప్రస్తుత డీఏను ప్రాథమిక వేతనంలో విలీనం చేయడం జరుగుతుంది.
ఉదాహరణకు.. ప్రస్తుతం ఒక ఉద్యోగి ప్రాథమిక వేతనం రూ. 18,000గా ఉంటే.. డీఏ కలిపి అతని స్థూల జీతం సుమారు రూ. 35,000 ఉంటుంది. ఇందులో 34 శాతం పెరుగుదల జరిగితే.. కొత్త స్థూల జీతం సుమారు రూ. 46,900కి చేరుతుంది. అంటే నెలకు దాదాపు రూ. 11,900 అదనపు ఆదాయం పెరుగుతుంది.
బకాయిలు ఎంత వరకు రావచ్చు?
ఒకవేళ 8వ వేతన సంఘం సిఫార్సులు 2028 జనవరిలో అమలులోకి వచ్చి.. అవి 2026 జనవరి 1 నుంచి వర్తింపజేస్తే.. ఉద్యోగులకు మొత్తం 24 నెలల బకాయిలు చెల్లించాల్సి ఉంటుంది.
-నెలవారీ జీత పెరుగుదల: సుమారు రూ. 11,900
-బకాయిల కాలవ్యవధి: 24 నెలలు
-మొత్తం బకాయిలు: దాదాపు రూ. 2.85 లక్షలు
అంటే బేసిక్ సాలరీ ఉన్న ఉద్యోగికే దాదాపు రూ. 2.8 నుంచి రూ. 3 లక్షల వరకు బకాయిలు రావచ్చు. వేతన స్థాయి ఎక్కువగా ఉన్నవారికి ఈ మొత్తం మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.
బకాయిల ప్రాధాన్యత ఏమిటి?
ప్రతి వేతన సంఘంలోనూ బకాయిలు ఉద్యోగులకు ఒక పెద్ద ఆర్థిక ప్రయోజనంగా మారాయి. 7వ వేతన సంఘం సమయంలో కూడా ఉద్యోగులు భారీ మొత్తంలో బకాయిలు పొందారు. అందువల్ల.. అమలు ఆలస్యమైనా.. బకాయిల రూపంలో ఆ ఆలస్యాన్ని కొంతవరకు భర్తీ చేసే అవకాశం ఉంటుంది.
8వ వేతన సంఘం ఏ అంశాలను సమీక్షిస్తుంది?
8వ వేతన సంఘం పరిధి కేవలం ప్రాథమిక వేతనానికి మాత్రమే పరిమితం కాదు. ఇది HRA, ఇతర భత్యాలు, పెన్షన్, డీఏ/డీఆర్, గ్రాట్యుటీ, పదవీ విరమణ ప్రయోజనాలు, వేతన సమానత్వం, ప్రోత్సాహక నిర్మాణం వంటి అనేక కీలక అంశాలను సమీక్షిస్తుంది. కమిషన్ నివేదికను సమర్పించిన తర్వాత, ప్రభుత్వం అన్ని అంశాలపై తుది నిర్ణయం తీసుకుంటుంది.
ప్రస్తుత నిబంధనల ప్రకారం ఉద్యోగులకు డీఏ, డీఆర్ చెల్లింపులు కొనసాగుతాయి. ఉద్యోగులు ఇప్పుడు ఫిట్మెంట్ ఫ్యాక్టర్, అమలు తేదీ, బడ్జెట్ కేటాయింపులపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
Redmi K90 Ultra Price Features: ప్రముఖ చైనీస్ స్మార్ట్ఫోన్ దిగ్గజ సంస్థ Redmi నుంచి మరో కొత్త స్మార్ట్ ఫోన్ రిలీజ్ కాబోతుంది. తన ఫ్లాగ్షిప్ సిరీస్లో ఆకర్షణీయమైన ఫీచర్స్ కలిగిన Redmi K90 Ultraను విడుదల చేసేందుకు సిద్ధమైంది. సాధారణ మొబైల్స్ కంటే భిన్నంగా ఈ స్మార్ట్ఫోన్ను రూపొందించారంటూ.. ఏకంగా 10,000 mAh జంబో బ్యాటరీతో అందుబాటులోకి తీసుకురావడం విశేషంగా మారింది.
ఇటీవలే Redmi సంస్థ తన K90 సిరీస్లో భాగంగా Redmi K90, Redmi K90 Pro Max మోడళ్లను 7,100 mAh బ్యాటరీలతో మార్కెట్లోకి విడుదల చేయగా.. ఇప్పుడు దాని ఆల్ట్రా వేరియంట్ ఇప్పుడు రికార్డు సృష్టించబోతుంది.
Redmi K90 Ultra స్మార్ట్ఫోన్ ప్రధాన ఫీచర్లు
ఈ స్మార్ట్ఫోన్ ప్రీమియం డిజైన్, టాప్-ఎండ్ స్పెసిఫికేషన్లతో రానుందని సమాచారం. లీకైన సమాచారం ప్రకారం దీని ఫీచర్లు ఇలా ఉండవచ్చని కొన్ని నివేదికలు వెల్లడిస్తున్నాయి. గేమింగ్ ప్రియుల కోసం ఇందులో అత్యంత శక్తివంతమైన MediaTek Dimensity 9500 చిప్సెట్ను అమర్చినట్లు తెలుస్తోంది. ఇది మల్టీ-టాస్కింగ్, హై-ఎండ్ గేమింగ్కు అద్భుతమైన వేగాన్ని ఇస్తుందని చెబుతున్నారు.
బ్యాటరీ & ఛార్జింగ్
ఈ ఫోన్ ప్రధాన ఆకర్షణ దీని 10,000 mAh బ్యాటరీ సెటప్. దీనికి తోడు 100 W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, ఫుల్-స్పీడ్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది.
సినిమాటిక్ అనుభవం కోసం డాల్బీ విజన్ సపోర్ట్తో కూడిన హై-రిజల్యూషన్ డిస్ప్లేతో ఇది మార్కెట్లోకి రానుంది. రెడ్మీ కే90 అల్ట్రా బేస్ వేరియంట్ 16 GB RAMతో ప్రారంభం కానుండగా.. ఇది ఫోన్ పనితీరును మరింత మెరుగుపరుస్తుంది.
ఫోటోగ్రఫీ కోసం Redmi ఇందులో పవర్ఫుల్ కెమెరా సెటప్ను అందిస్తోంది. అందులో భాగంగా ప్రైమరీ కెమెరా 50 MP మెయిన్ సెన్సార్.. టెలిఫోటో కెమెరా 50 MP.. 8 MP అల్ట్రా-వైడ్ కెమెరాతో చివరిగా 20 MP కెపాసిటీతో సెల్ఫీ కెమెరా ఇవ్వనున్నారు.
ఎప్పుడు మార్కెట్లోకి వస్తుంది?
గతంలో వచ్చిన Redmi K80 Ultra తరహాలోనే కొత్తగా రాబోతున్న Redmi K90 Ultra ఉన్నప్పటికీ.. బ్యాటరీ, ప్రాసెసర్ పరంగా కొన్ని భారీ మార్పులు జరిగినట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్ఫోన్కు సంబంధించిన పూర్తి వివరాలను, ధరను కంపెనీ త్వరలోనే అధికారికంగా వెల్లడించనుంది. మునుపటి మోడళ్ల కంటే ఇది మరింత ప్రీమియంగా ఉండబోతోందని మార్కెట్ వర్గాల అంచనా.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
BRS Party MLAs: అధికారికంగా కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలపై తెలంగాణ స్పీకర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. నిస్సిగ్గుగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా అధికార పార్టీలో చేరిన వారిపై వేటు వేయకుండా వారికి క్లీన్చిట్ ఇచ్చారు. ఐదుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు ఆధారాలు లేవని ప్రకటించారు. దీంతో వారి పార్టీ ఫిరాయింపులపై అనర్హత పిటిషన్లను తోసిపుచ్చారు. స్పీకర్ నిర్ణయం అందరినీ విస్మయానికి గురి చేయగా.. బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. స్పీకర్ నిర్ణయాన్ని తప్పుబట్టింది.
Also Read: Traffic Challan: వాహనదారులకు అలర్ట్..! లంచం ఇస్తే ట్రాఫిక్ చలాన్ రద్దవుతుందా?
ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల అంశం విషయంలో ఐదుగురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తోసిపుచ్చారు. పార్టీ ఫిరాయించినట్లు ఎటువంటి ఆధారాలు లేవని తేల్చి చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు గూడెం మహిపాల్ రెడ్డి (పటాన్చెరు), తెల్లం వెంకటరావు (భద్రాచలం), ప్రకాష్ గౌడ్ (రాజేంద్రనగర్), అరికెపూడి గాంధీ (శేరిలింగంపల్లి), బండ్ల కృష్ణమోహన్ (గద్వాల) కాంగ్రెస్లో చేరిన విషయం తెలిసిందే. బహిరంగంగా కాంగ్రెస్ కండువా కప్పుకుని కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో ఈ ఎమ్మెల్యేలు పాల్గొంటున్నారు.
Also Read: Govt Employees: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త.. సెలవులు పొడగింపు!
తమ పార్టీ గుర్తు కారుపై గెలిచిన ఈ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరడాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా పరిగణించింది. మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించడాన్ని సవాల్ చేస్తూ న్యాయ పోరాటానికి దిగింది. సుప్రీంకోర్టు డిసెంబర్ 18వ తేదీలోపు నిర్ణయం తీసుకోవాలని చెప్పగా.. ఆగమేఘాల మీద స్పీకర్ ఆ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ను తోసిపుచ్చారు. మిగిలిన ఐదు మందిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
Also Read: IPL Mini Auction: కుర్రోళ్లకు కోట్లు కోట్లు.. ఐపీఎల్ మినీ వేలంలో వజ్రాలను పట్టారు
బీఆర్ఎస్ పార్టీ తీవ్ర ఆగ్రహం
ఆధారాలు లేవని అనర్హత పిటిషన్లను తిరస్కరించడంపై బీఆర్ఎస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. స్పీకర్ నిర్ణయాన్ని తప్పుబట్టింది. బహిరంగంగా.. నిస్సిగ్గుగా కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేల విషయంలో ఆధారాలు లేవని చెప్పడంపై మండిపడింది. స్పీకర్ నిర్ణయాన్ని న్యాయస్థానంలో సవాల్ చేసేందుకు గులాబీ పార్టీ సిద్ధమైంది. కాంగ్రెస్లో చేరిన వారిని వదిలేది లేదని బీఆర్ఎస్ పార్టీ స్పష్టం చేసింది. రేపు సుప్రీంకోర్టులో ఎలాంటి పరిణామాలు జరగనున్నాయో ఉత్కంఠ నెలకొంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Ayesha Takia Plastic Surgery: సినిమా ఇండస్ట్రీలో నటీనటుల కెరీర్ చాలా చిత్రంగా ఉంటుంది. కొందరు ఏళ్లపాటు సినిమాల్లో వరుస అవకాశాలతో దశాబ్దాల పాటు రాణిస్తే, మరికొందరు ఓవర్ నైట్ స్టార్డమ్ తెచ్చుకొని..అంతే వేగంగా కనుమరుగవుతారు. అలాంటి వాళ్లలో అక్కినేని నాగార్జున హీరోగా నటించిన 'సూపర్' మూవీ హీరోయిన్ అయేషా టాకియా ఒకరు. టాలీవుడ్లో చేసింది తక్కువ సినిమాలే అయినా.. ఇప్పటికీ ఆమె అందచందాలతో కుర్రాళ్ల గుండెల్లో చెరగని ముద్ర వేసింది.
టాలీవుడ్లో మెరుపు తీగలా వచ్చెళ్లింది..
కింగ్ నాగార్జున, డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కిన 'సూపర్' సినిమాతో అయేషా టాకియా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ సినిమా బాక్సాఫీసు వద్ద ఆశించిన విజయం సాధించకపోయినా.. హీరోయిన్ ఆయేషా టకియా అందానికి సినీ ప్రేమికులు ఫిదా అయ్యారు. "తెలుగు ఇండస్ట్రీకి మరో క్రేజీ బ్యూటీ దొరికింది" అని అందరూ అనుకునేలోపే ఆమె టాలీవుడ్కు దూరమై బాలీవుడ్ బాట పట్టింది. ఆ సినిమా తర్వాత ఆయేషా మరో తెలుగు సినిమాలో నటించలేదు.
పెళ్లి..మత మార్పిడి..సినిమాలకు స్వస్తి
హీరోయిన్గా కెరీర్ పీక్ స్టేజ్లో ఉండగానే అయేషా టాకియా పెళ్లి చేసుకొని సినిమాలకు పూర్తిగా దూరమైంది. సమాజ్ వాదీ పార్టీ సీనియర్ నాయకుడు అబూ అజ్మీ కొడుకు, వ్యాపారవేత్త ఫర్హాన్ అజ్మీని హీరోయిన్ ఆయేషా టకియా వివాహం చేసుకుంది. ఫర్హాన్ను పెళ్లి చేసుకోవడం కోసం అయేషా..మత మార్పిడి కూడా చేసుకుంది. దాదాపు పదమూడేళ్లుగా ఆమె వెండితెరకు దూరంగా ఉంటూ తన వ్యక్తిగత జీవితానికే ప్రాధాన్యతనిస్తోంది.
గుర్తుపట్టలేనంతగా మారిన రూపం
ప్రస్తుతం సోషల్ మీడియాలో అయేషా టాకియాకు సంబంధించిన కొన్ని ఫోటోలు వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. 'సూపర్' సినిమాలో ఎంతో ముద్దుగా, గ్లామరస్గా ఉన్న ఈ భామ.. ఇప్పుడు పూర్తిగా గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. ముఖ కవళికల్లో వచ్చిన మార్పులు చూసి ఆమె ఏవైనా సర్జరీలు చేయించుకుందా? అని నెటిజన్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు తన చిరునవ్వుతో వెండితెరను ఏలిన ఈ డ్రీమ్ గర్ల్, ఇప్పుడు లైమ్ లైట్కు దూరంగా సామాన్య గృహిణిగా తన జీవితాన్ని గడుపుతోంది.
Also REad: IPL Auction 2026: ఐపీఎల్ 2026 వేలం పూర్తయ్యింది..ఐపీఎల్లో ఇప్పుడన్న డేంజరస్ టీమ్ ఏదో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Kedi Movie Director Kiran Kumar Passed Away: తెలుగు చలనచిత్ర పరిశ్రమ (Tollywood)లో మరో విషాదం చోటుచేసుకుంది. అక్కినేని నాగార్జున నటించిన 'కేడీ' చిత్ర దర్శకుడు కిరణ్ కుమార్ (కేకే) బుధవారం ఉదయం కన్నుమూశారు. ఆయన హఠాన్మరణంతో టాలీవుడ్లో విషాద ఛాయలు అలముకున్నాయి.
సినిమా ప్రస్థానం
కిరణ్ కుమార్ కేవలం దర్శకుడిగానే కాకుండా, అంతకుముందు పలు చిత్రాలకు రచయితగా, సహాయ దర్శకుడిగా పనిచేశారు. 2010లో కింగ్ నాగార్జున హీరోగా నటించిన 'కేడీ' సినిమాతో ఆయన దర్శకుడిగా వెండితెరకు పరిచయమయ్యారు. ఈ సినిమా ఆయనకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. అయితే ప్రస్తుతం ఉన్న స్టార్ డైరెక్టర్లలో సందీప్ రెడ్డి వంగా, కేడీ డైరెక్టర్ కిరణ్ కుమార్ వద్దనే పనిచేయడం గమనార్హం.
విడుదలకు సిద్ధంగా ఉన్న తదుపరి చిత్రం
చాలా కాలం విరామం తర్వాత డైరెక్టర్ కిరణ్ కుమార్ మళ్ళీ మెగా ఫోన్ పట్టారు. ఆయన డైరెక్షన్లో రూపొందిన ‘కేజేక్యూ: కింగ్.. జాకీ.. క్వీన్’ (KJQ) అనే సినిమాకి సంబంధించిన షూటింగ్ ఇప్పటికే పూర్తి అయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మరికొద్ది రోజుల్లోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఈ క్రమంలో సినిమా విడుదల చూడకుండానే ఆయన మరణించడం అభిమానులను, చిత్ర బృందాన్ని తీవ్రంగా కలిచివేస్తోంది.
'కేడీ' డైరెక్టర్ కిరణ్ కుమార్ మృతి పట్ల పలువురు టాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన మరణం పరిశ్రమకు తీరని లోటని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని పలువురు సినీ నటులు, దర్శకులు నివాళులు అర్పించారు. సోషల్ మీడియా ఆయన ఫ్యాన్స్ సంతాపాన్ని తెలియజేస్తున్నారు.
Also Read: IPL Auction 2026: ఐపీఎల్ 2026 వేలం పూర్తయ్యింది..ఐపీఎల్లో ఇప్పుడన్న డేంజరస్ టీమ్ ఏదో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Bharat Taxi App Launch Date: కేంద్ర ప్రభుత్వం త్వరలోనే దేశీయ రవాణా రంగంలో అద్భుతమైన మార్పులకు శ్రీకారం చుట్టబోతోంది. ప్రముఖ ప్రైవేట్ క్యాబ్ సంస్థలు ఉబర్తో పాటు ఓలాకు దీటుగా భారత్ ట్యాక్సీ (Bharat Taxi) యాప్ను తీసుకు రాబోతున్నట్లు తెస్తోంది. భారత ప్రజలకు కొత్త సంవత్సరం గిఫ్ట్గా దీని సేవలను జనవరి 1వ తేది నుంచి అందుబాటులో తీసుకు రాబోతున్నట్లు కేంద్ర రవాణా శాఖ నిర్ణయించింది. ఇందులో భాగంగా రోజు క్యాబ్లు వినియోగించే ప్రజలకు చాలా మేలు జరుగుతుంది.
ప్రస్తుతం భారతదేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో క్యాబ్ సేవలు ప్రైవేటు కంపెనీల చేతుల్లోనే ఉన్నాయి. దీని కారణంగా కొన్ని కంపెనీలు డిమాండ్ను బట్టి చార్జీలను ఇష్టానుసారంగా పెంచుతూ వస్తున్నాయి. అలాగే రైడ్ క్యాన్సిలేషన్ ఫీజులతో పాటు డ్రైవర్ల ప్రవర్తన వంటి అంశాలపై ఇప్పటికి ప్రయాణికుల నుంచి ఎన్నో ఫిర్యాదు వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రతి సామాన్యుడు అతి తక్కువ ధరలోనే నగరాల్లో అన్ని ప్రదేశాలకు సురక్షితంగా ప్రయాణాన్ని అంచడమే లక్ష్యంగా చేసుకుని క్రేంద్రం ఈ యాప్ను అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది.
ఈ ప్రాజెక్టులో భాగంగా ఇప్పటికే కంపెనీ ప్రత్యేకమైన పనులను కూడా ప్రారంభించింది. ఇందులో భాగంగా డ్రైవర్ల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఇప్పటికీ భారత్లోని ప్రధాన నగరాల్లో భారత్ ట్యాక్సీ యాప్లో దాదాపు 56 వేల మంది డ్రైవర్లు పేర్లను నమోదు చేసినట్లు కేంద్రం అధికారికంగా వెల్లడించింది. అయితే, ప్రైవేటు కంపెనీతో పోలిస్తే.. ఈ యాప్లో డ్రైవర్ల నుంచి వసూలు చేసే కమిషన్ చాలా తక్కువగా ఉండడమే దీనికి ప్రధాన కారణమని సమచారం.. అయితే, ఈ కమిషన్ తగ్గడం వల్ల డైవర్ల ఆదాయం భారీగా పెరుగుతుంది.
Also Read: Kia Vision Ev: త్వరలోనే కియా నుంచి సూపర్ EV కారు.. ఇక మార్కెట్లో అద్భుతమే!
ఈ భారత్ ట్యాక్సీ (Bharat Taxi) యాప్ వల్ల ప్రయాణికులకు చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా ప్రైవేట్ క్యాబ్లతో పోలిస్తే 16 నుంచి 25 శాతం వరకు తక్కువ ధరలకే ప్రయాణం చేయడానికి సాధ్యమవుతుందని సమాచారం.. అలాగే సర్జ్ ప్రైసింగ్ నుంచి కూడా చాలా వరకు ఉపశమనం లభిస్తుంది. దీంతో పాటు ఇది ప్రభుత్వ పర్యవేక్షణ ఉండటంతో భద్రతా ప్రమాణాలను కూడా కఠినంగా అమలు చేసే అవకాశాలు ఉన్నాయి. మొదటి విడతలో భాగంగా హైదరాబాద్తో పాటు ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి నగరాల్లో ఈ సేవలను ప్రారంభించబోతున్నట్లు కేంద్రం యోచిస్తోంది. ఆ తర్వాత దశలవారీగా దేశమంతటా విస్తరించే ఛాన్స్లు ఉన్నాయి.
Also Read: Kia Vision Ev: త్వరలోనే కియా నుంచి సూపర్ EV కారు.. ఇక మార్కెట్లో అద్భుతమే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook