లడ్డూ అపవిత్రం: హిందూ సంఘాలు తిరుమలలో హోమం నిర్వహించాయి!
Bellampalle, Telangana:కలియుగ దైవం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదాన్ని అపవిత్రం చేసిన కారణంగా బెల్లంపల్లి పట్టణంలోని సుభాష్ నగర్ బస్తీలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో హిందూ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో హోమం చేయడం జరిగింది. నాయకులు మాట్లాడుతూ హిందువుల ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా లడ్డూను అపవిత్రం చేసి సనాతన ధర్మంపై కుట్ర చేస్తున్నారన్నారు. హిందూ ధర్మం జోలికి వస్తే సహించేది లేదని హెచ్చరించారు.हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
Karimnagar: పన్ను ఎగవేతే లక్ష్యం.. చీకటి వ్యాపారానికి కరీంనగర్ అడ్డా..
Karimnagar, Telangana:Karimnagar Zero Bill Scam Latest News: ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా జీరో బిల్లు వ్యాపారం ఇప్పుడు యదేచ్చగా సాగుతూ ప్రభుత్వ ఆదాయానికి భారీ గండి కొడుతోంది. GST ఎగవేత లక్ష్యంగా సాగుతున్న ఈ అక్రమ దందా వల్ల ప్రభుత్వ ఖజానాకు చేరాల్సిన కోట్లాది రూపాయల ఆదాయం పక్కదారి పడుతోంది. కరీంనగర్ లోని ప్రకాశం గంజ్తో పాటు గోదావరిఖని, జగిత్యాల వంటి ప్రధాన వ్యాపార కేంద్రాల్లో ఈ దందాలు మూడు పువ్వులు ఆరుకాయలుగా వర్ధిల్లుతూ వస్తోంది.
ముఖ్యంగా భవన నిర్మాణ రంగంలో కీలకమైన సిమెంటుతో పాటు ఐరన్, ఇతర వస్తువులు, వ్యవసాయానికి సంబంధించిన ఎరువుల విక్రయాలు జీరో బిల్లుల దండ ఎక్కువగా సాగుతోంది. నిబంధనల ప్రకారం ప్రతి లావాదేవీకి జిఎస్టి బిల్లు తప్పనిసరి. కానీ కొందరు బడా వ్యాపారులు పన్ను ఎగవేసేందుకు ఎలాంటి బిల్లులు లేకుండా అమ్మకాలు కొనసాగిస్తున్నారు. మహారాష్ట్రతో పాటు కర్ణాటక, ఛత్తీస్గఢ్ వంటి ఇతర రాష్ట్రాల నుంచి ఎటువంటి పత్రాలు లేకుండా సరుకులను తరలిస్తున్నారు. వీటిని ఊరు శివారులోని రహస్యం గోదాముల్లో నిల్వ ఉంచి.. చీకటి పడ్డాక చిల్లర వర్తకులకు సరఫరా చేస్తూ వస్తున్నారు..
వాణిజ్య పన్నుల శాఖ అధికారుల అండదండలతోనే.. ఈ వ్యాపారం కోట్లలో సాగుతూ ఉందని విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. చెక్పోస్టుల వద్ద తనిఖీలు నామమాత్రం గానే సాగుతున్నాయని.. లారీకి ఇంత అని మామూలు అందడంతో అక్రమ రవాణాకు అడ్డు లేకుండా పోతుందని తెలుస్తోంది.. ఏటా వెలకోట్ల టర్నోవర్ జరిగే కరీంనగర్ మార్కెట్లో.. కాగితాలపై మాత్రం తక్కువ లావాదేవీలను చూపిస్తూ అధికారులను మేనేజ్ చేస్తున్నట్లు కూడా ఆరోపణలు వస్తున్నాయి..
వ్యాపారులు జీరో బిల్లుల పేరుతో సామాన్య ప్రజల నుంచి పూర్తిస్థాయిలో ధరను వసూలు చేస్తూ.. ప్రభుత్వానికి మాత్రం పన్ను చెల్లించడం లేదు.. ఒకవేళ వినియోగదారుడు బిల్లు అడిగితే అదనంగా పన్ను కట్టాలని భయపెట్టి.. బిల్లు లేకుండా తక్కువ ధరలకే ఇస్తున్నామని నమ్మిస్తున్నారు. దీనివల్ల వినియోగదారుడు నాణ్యత లేని వస్తువులు కొన్న చట్టపరంగా ఫిర్యాదు చేసే అవకాశం లేకుండా పోతావని సమాచారం..
Read more: OnePlus Nord 5: అమెజాన్ ధమాకా.. రూ.5,000 లోపే OnePlus Nord 5.. ఈ డీల్ వదులుకోవద్దు!
ప్రభుత్వ ఆదాయాన్ని గండి కొడుతున్న ఈ వ్యవస్థపై ఉన్నత అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతగానో ఉంది. స్పెషల్ టాస్క్ ఫోర్స్ బృందాలతో పాటు ఇతర అధికారులు కలిసి గోదాములపై దాడులు నిర్వహించి.. అక్రమంగా నిల్వచేసిన సరుకు సీజ్ చేయాలని స్థానికులు కోరుతున్నారు. పన్ను ఎగవేత దారులపై కఠిన చర్యలు తీసుకుంటేనే ప్రభుత్వ ఖజానాకు ఆదాయం చేరుతుందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు..
Read more: OnePlus Nord 5: అమెజాన్ ధమాకా.. రూ.5,000 లోపే OnePlus Nord 5.. ఈ డీల్ వదులుకోవద్దు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
Luxury Cars At 5 Lakhs: రూ.5 లక్షలకే ఆడి, BMW కార్లు.. కళ్లు చెదిరే ఆఫర్లు!
Hyderabad, Telangana:Second-Hand Luxury Cars At 5 Lakhs News: ఖరీదైన లగ్జరీ కారు కొనాలనేది మధ్యతరగతి ప్రజల కల.. సాధారణ వినియోగదారులు రోడ్లమీద లగ్జరీకారులను చూసి వాటిని ఫాలో అవుతుంటారు. అంటే ఆ కార్లు అంటే వారికి ఎంతో ఇష్టం. కానీ, ఈ కార్లు 50 లక్షల నుంచి కోట్ల రూపాయల వరకు ఉంటాయి. అయితే, సెకండ్ హ్యాండ్ కార్లు మాత్రం అత్యంత తక్కువ ధరల్లో లభిస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఢిల్లీ లాంటి కొన్నిచోట్లనైతే సాధారణ కార్ల ధరల్లోనే సెకండ్ హ్యాండ్ లగ్జరీ కార్లు లభిస్తూ ఉంటాయి. ఢిల్లీలోని రోహిణి సెక్టర్లో ఉన్న ఆటో కింగ్ సెకండ్ హ్యాండ్ కార్లకు సంబంధించిన షోరూం లో మెర్సిడెస్ బెంచ్, ఆడి, బిఎమ్డబ్ల్యూ వంటి దిగ్గజ బ్రాండ్ల కార్లు సాధారణ కార్ల ధరలకే లభిస్తున్నాయి. కేవలం రూ. 99,000 నుంచే కార్ల అందుబాటులో ఉండడం విశేషం..
సాధారణంగా మారుతి స్విఫ్ట్ కార్ ధర షోరూం ప్రైస్ దాదాపు రూ.8 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఉంటుంది. అయితే, ఇక్కడ మెర్సిడెస్ బెంజ్ c200 పెట్రోల్ కారు ధర కేవలం రూ.4.90 లక్షల కే లభిస్తోంది. అంటే మారుతి స్విఫ్ట్ కారు సగం ధరకే ఈ కారు లభించడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇక ఆడి ఏ సిక్స్ మెట్రిక్స్ వంటి ప్రీమియం లగ్జరీ కార్ కూడా ఇక్కడ 5.95 లక్షలకే అందుబాటులో ఉండడం విశేషం. ఇంత తక్కువ ధరకే లగ్జరీ కార్లు లభించడంతో చాలామంది ఆశ్చర్యపోయి అక్కడికి వెళ్లి మరి విక్రయించే వారిని ధరలు అడుగుతున్నారు..
Read more: OnePlus Nord 5: అమెజాన్ ధమాకా.. రూ.5,000 లోపే OnePlus Nord 5.. ఈ డీల్ వదులుకోవద్దు!
ఇవే కాకుండా ఎస్యూవీ (SUV) ప్రియుల కోసం మహీంద్రతో పాటు టాటా బ్రాండ్కు సంబంధించిన ఫ్యామిలీ కార్స్ కూడా చాలా తక్కువ ధరల్లో అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా మహీంద్రా ఎక్స్యూవీ 500 (XUV 500) కేవలం రూ. 3.90 లక్షలకే అందుబాటులో ఉంది. అలాగే ఎంతో శక్తివంతమైన కారుగా భావించే ఫోర్డ్ కంపెనీకి చెందిన ఎండీవర్ (3.2 ఆటోమేటిక్) రూ. 11.90 లక్షలకు లభిస్తోంది. దీంతోపాటు స్కార్పియో, థార్, ఫార్చ్యూనర్ వంటి కార్ల సగం ధరలకు అందుబాటులో ఉన్నాయి. అలాగే ఇక్కడ కేవలం రూ.50 వేలు లేదా లక్ష రూపాయలు డౌన్ పేమెంట్ కడితే చాలు.. ఇక్కడ మీకు నచ్చిన కార్ ను సొంతం చేసుకోవచ్చు. అంతేకాకుండా ప్రత్యేకమైన ఫైనాన్స్ సదుపాయం కూడా అందిస్తున్నారు.
ఈ కార్ బజార్లో కేవలం ఢిల్లీ వరకే కాకుండా.. ఫ్యాన్ ఇండియా సర్వీసులను కూడా కొన్ని సెకండ్ హ్యాండ్ షోరూమ్స్ వాళ్ల అందిస్తున్నారు. ఏ రాష్ట్రంలో ఉన్న.. మీరు కొనుగోలు చేసిన కారును ఇంటికి పంపించేలా ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కూడా ఉంది. అంతేకాకుండా తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ పంజాబ్ హర్యానా వంటి రాష్ట్రాలకు చెందిన వారికి రిజిస్ట్రేషన్ బదిలీ ప్రక్రియను కూడా దగ్గరుండి కార్లను విక్రయించే వారు పూర్తి చేస్తున్నారు. అయితే, చాలా తక్కువ ధరల్లో కార్లు అందుబాటులోకి రావడం వల్ల, యూజ్డ్ కార్లు కొనుగోలు చేసేటప్పుడు ఇంజన్ కండిషన్ తో పాటు యాక్సిడెంట్ హిస్టరీని కూడా ఒకసారి పరిశీలించడం చాలా మంచిదని కొంతమంది నిపుణులు సూచిస్తున్నారు.
Read more: OnePlus Nord 5: అమెజాన్ ధమాకా.. రూ.5,000 లోపే OnePlus Nord 5.. ఈ డీల్ వదులుకోవద్దు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
Harish Rao: తెలంగాణ హైకోర్టుపై హరీశ్ రావు హర్షం.. సత్యమేవ జయతే!
Hyderabad, Telangana:Telangana High Court: కాళేశ్వరం కమిషన్పై హైకోర్టు వెలువరించిన తీర్పుపై బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్ రావు స్పందించారు. హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తూ 'ఎక్స్' వేదికగా ప్రకటన చేశారు. సత్యమేవ జయతే అని ప్రకటించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా అంతిమంగా ధర్మం జయిస్తుందని తెలిపారు. ముమ్మాటికీ కాళేశ్వరం తెలంగాణకు ప్రాణేశ్వరం అని ప్రకటించారు. కేసీఆర్, తనపై ఇచ్చిన తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు.
Also Read: KCR Harish Rao: రేవంత్ రెడ్డికి ఎదురుదెబ్బ.. హైకోర్టులో కేసీఆర్, హరీశ్ రావుకు భారీ ఊరట
'సత్యమేవ జయతే.. ఎవరెన్ని కుట్రలు చేసినా న్యాయస్థానాల్లో అంతిమంగా ధర్మం జయిస్తుంది. సత్యం నినదిస్తుందని ఈరోజు మరోసారి నిరూపితమైంది' అని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి హరీశ్ రావు ప్రకటించారు. 'ప్రాథమిక హక్కులు, సహజ న్యాయ సూత్రాలను విస్మరిస్తూ నడిపిన విచారణను ఉన్నత న్యాయస్థానం తప్పుబట్టింది. వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించేలా కమిషన్ చేసిన వ్యాఖ్యలు చెల్లవని.. ఆ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోరాదని స్పష్టంగా తీర్పు ఇచ్చింది' అని మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు.
Also Read: KCR Highlights: జగిత్యాలలో కేసీఆర్ 3.0.. ప్రజా ఆశీర్వాద సభ టాప్ 10 హైలెట్స్
'కాంగ్రెస్ ప్రభుత్వ రాజకీయ కుట్రలు బట్టబయలయ్యాయి. ప్రజా సమస్యలు పక్కనపెట్టి డ్రామాలు ఆడిన రేవంత్ రెడ్డి నిజస్వరూపం హైకోర్టు తీర్పుతో తేటతెల్లం అయ్యింది. ఇప్పటికైనా కక్షసాధింపులు, రాజకీయ దుష్ప్రచారం మానేసి వెంటనే రెండు పిల్లర్ల మరమ్మతులు పూర్తి చేసి తెలంగాణ రైతుల ప్రయోజనాలు కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నాం' అని మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు. 'ఎవరు ఔనన్నా కాదన్నా ముమ్మాటికీ కాళేశ్వరం తెలంగాణకు ప్రాణేశ్వరం' అని మాజీ మంత్రి హరీశ్ రావు ప్రకటించారు.
సత్యమేవ జయతే ✊
కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను నిలిపివేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టు.
పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక అంతా ట్రాష్.. చెత్త బుట్టలో వేయాల్సిందే!
కమిషన్ పేరుతో కాళేశ్వరం ప్రాజెక్టు… pic.twitter.com/WpRc4b1KS3
— BRS Party (@BRSparty) April 22, 2026
ఈ తీర్పుపై బీఆర్ఎస్ పార్టీ స్పందిస్తూ కీలక ప్రకటన చేసింది. 'సత్యమేవ జయతే. కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను నిలిపివేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టు. పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక అంతా ట్రాష్.. చెత్త బుట్టలో వేయాల్సిందే! కమిషన్ పేరుతో కాళేశ్వరం ప్రాజెక్టు లక్ష్యాన్ని దెబ్బతీయాలనే రేవంత్ ప్రభుత్వ కుట్రలను తిప్పికొట్టిన హైకోర్టు' అని వివరించింది.
సత్యమేవ జయతే..
ఎవరెన్ని కుట్రలు చేసినా న్యాయస్థానాల్లో అంతిమంగా ధర్మం జయిస్తుందని, సత్యం నినదిస్తుందని ఈరోజు మరోసారి నిరూపితమైంది.
ప్రాథమిక హక్కులు, సహజ న్యాయ సూత్రాలను విస్మరిస్తూ నడిపిన విచారణను ఉన్నత న్యాయస్థానం తప్పుబట్టింది. వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించేలా కమిషన్…
— Harish Rao Thanneeru (@BRSHarish) April 22, 2026
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
KCR Harish Rao: రేవంత్ రెడ్డికి ఎదురుదెబ్బ.. హైకోర్టులో కేసీఆర్, హరీశ్ రావుకు భారీ ఊరట
Hyderabad, Telangana:Telangana High Court: కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏర్పాటుచేసిన పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్తోపాటు హరీశ్ రావు, నాటి అధికారులక భారీ ఊరట లభించింది. పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై తదుపరి చర్యలు కేసీఆర్, హరీశ్ రావుపై తీసుకోరాదని ధర్మాసనం ఆదేశించింది. సమర్పించిన నివేదిక ప్రకారం ఎలాంటి చర్యలు చేపట్టకూడదని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.
Also Read: SRH vs DC Highlights: ఉప్పల్లో ఢిల్లీ చిత్తు.. అభిషేక్ సెంచరీతో హైదరాబాద్ హ్యాట్రిక్ విజయం
కాళేశ్వరం ప్రాజెక్టులపై కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. కాళేశ్వరం ప్రాజెక్టును కూలేశ్వరం అని విమర్శలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం 2024 మార్చి 14వ తేదీన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ను నియమించింది. ఆ కమిషన్ను నియమిస్తూ జారీ చేసిన జీఓ 6ను రద్దు చేయాలని బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు, ఐఏఎస్ అధికారులు స్మితా సబర్వాల్, ఎస్కే జోషిలు వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు.ఈ పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్తో కూడిన ధర్మాసనం సుదీర్ఘ విచారణ చేపట్టగా.. దానిపై తెలంగాణ హైకోర్టు నేడు బుధవారం తీర్పు ఇచ్చింది.
Also Read: GT vs MI Highlights: తిలక్ వర్మ బ్యాట్తో విధ్వంసం.. బంతిలో అశ్వనీ విశ్వరూపం
పీసీ ఘోష్ కమిషన్ విచారణ చేపట్టి ప్రభుత్వానికి 665 పేజీల నివేదికను సమర్పించింది. ప్రాజెక్టులోని వైఫల్యాలకు నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ బాధ్యుడు అని నివేదికలో కమిషన్ తెలిపింది. కాళేశ్వరం ప్రాజెక్టు రూ.38,500 కోట్ల అంచనాల నుంచి రూ.1.10 లక్ష కోట్లకు పెరిగిందని కమిషన్ ఆరోపించింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్లపై కమిషన్ విచారణ చేపట్టింది. ఈ కమిషన్పై వేసిన పిటిషన్ను విచారణ చేపట్టిన హైకోర్టు ఎవరిపై ఎలాంటి చర్యలు తీసుకోరాదని ఆదేశించింది. అయితే జీవో 6ను రద్దు చేయాలని విజ్ఞప్తి చేయగా.. న్యాయస్థానం మాత్రం కమిషన్ ఏర్పాటును సమర్ధించింది. చర్యలు తీసుకోరాదని ఆదేశించడంతో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
వాదనలు పరిశీలించిన హైకోర్టు కమిషన్ ఏర్పాటు సరైనదేనని పేర్కొంది. కమిషన్ తన నివేదిక రూపొందించే ప్రక్రియలో అవసరమైన నిబంధనలు పూర్తిగా పాటించలేదని ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో కమిషన్ నివేదికలోని నిర్ధారణలు 'ప్రస్తుతం అమల్లోకి రాకూడదు' అని స్పష్టం చేసింది. ఈ నివేదిక ఆధారంగా పిటిషనర్లపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ప్రభుత్వం, సంబంధిత అధికారులకు హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Rahu Transit 2026: రాహువు సంచారంతో గోల్డెన్ డేస్.. ఆ రాశుల వారికి కాసుల వర్షం కురవాల్సిందే!
Hyderabad, Telangana:Rahu Transit Into Aquarius Effect On Zodiac: జ్యోతిష్య శాస్త్రంలో రాహువు గ్రహాన్ని అత్యంత కీడు గ్రహంగా, మాయాగ్రహంగా పిలుస్తారు. ఈ గ్రహం ఒక రాసి నుంచి మరొక రాశికి మారినప్పుడల్లా మానవ జీవితాలపై అత్యంత ప్రత్యేకమైన ప్రభావం పడుతుంది. రాహువు కుంభ రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. అతి త్వరలోనే ఇది జరగబోతోంది. అయితే సాధారణంగా రాహు అంటే భయపడేవారు ఉన్నప్పటికీ.. ఈ సంచారం కారణంగా కొన్ని రాశుల వారికి ఊహించని అదృష్టం లభిస్తుంది. ఆర్థికంగా ఊహించని వృద్ధిని సాధించగలుగుతారు. రాహు కుంభరాశిలో ఉన్నప్పుడు కొన్ని రాశుల వారికి గోల్డెన్ పీరియడ్ కూడా ప్రారంభమవుతుంది. కాబట్టి ఆయా రాశుల వారికి ఆర్థికంగా అద్భుతమైన మేలు జరుగుతుంది.
ఈ రాశులవారికి బంపర్ లాభాలు:
మేష రాశి
మేషరాశిలో జన్మించిన వ్యక్తులకు రాహు సంచారం చాలా శుభప్రదంగా ఉండబోతోంది. వీరు గత కొంతకాలంగా ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందుల నుంచి తప్పకుండా ఉపశమనం లభించబోతోంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ రావడమే కాకుండా.. జీతాల్లో భారీ మార్పులు ఉండబోతున్నాయి. వీరు చేసే ఎలాంటి పనులైన అద్భుతమైన అదృష్టాన్ని తెచ్చిపెట్టబోతున్నాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. అంతేకాకుండా విదేశాలకు వెళ్లాలనుకునే వారి కోరికలు కూడా ఈ సమయంలో నెరవేరబోతున్నాయి.
వృషభరాశి
వృషభ రాశిలో జన్మించిన వ్యక్తులకు రాహు అనుగ్రహం వల్ల వృత్తిపరంగా గొప్ప గొప్ప మార్పులు సంభవించబోతున్నాయి. కొత్త బాధ్యతలు స్వీకరించడమే కాకుండా వీరు తప్పకుండా సమాజంలో ప్రతిష్టలు పొందగలుగుతారు. వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు కూడా లభించబోతున్నాయి. ఇవి భవిష్యత్తులో భారీ లాభాలను తెచ్చిపెట్టే అవకాశాలున్నాయి. రాజకీయ రంగాల్లో ఉన్న వ్యక్తులకు ఈ సమయం అత్యంత అనుకూలంగా ఉండబోతోంది.
మిథున రాశి
రాహు సంచారం కారణంగా మిథున రాశి వారికి కూడా ఈ సమయంలో విపరీతమైన అదృష్టం లభించబోతోంది. పెండింగ్లో ఉన్న పనులు వేగంగా పూర్తి అవడమే కాకుండా.. తల్లిదండ్రుల నుంచి వస్తున్న ఆస్తులు కూడా వీరికి చేరుతాయి. అంతేకాకుండా విద్యార్థులు తప్పకుండా పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు కూడా సాధించగలుగుతారు. తీర్థయాత్రలకు లేదా విదేశాలకు వెళ్లాలనుకునే వారి కోరికలు కూడా నెరవేరబోతున్నాయి. ఆకస్మిక ధన లాభాలు కలిగే సూచనలు కనిపిస్తున్నాయి.
కుంభరాశి
కుంభరాశిలో జన్మించిన వ్యక్తులకు ఈ సమయంలో ఊహించని స్థాయిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. దీనివల్ల అన్ని రకాల పనులు ఎంతో సులభంగా చేయగలుగుతారు. సమాజంలో మీ మాటకు విలువ కూడా విపరీతంగా పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తగా ఉండి.. ముందుకు సాగడం చాలా మంచిది. అలాగే ఇప్పటికే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు తప్పకుండా అప్పుడప్పుడు వైద్యులను సంప్రదించడం మంచిదని నిపుణులు సూచిస్తూ ఉన్నారు..
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
PM Modi: రక్తపాతంతో గెలవలేరు.. ఉగ్ర కుట్రలు సాగనివ్వం.. ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరిక!
Hyderabad, Telangana:PM Modi Honors Pahalgam Martyrs Latest News: భారతదేశ సర్వభౌమత్వానికి.. శాంతికి విగాథం కలిగించే ఏ ప్రతికూల శక్తి అయిన గట్టిగా ఎదుర్కొంటామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.. జమ్ము కాశ్మీర్లో పహల్గామ్ వద్ద జరిగిన కిరాతక ఉగ్రదాడికి నేటితో ఏడాది పూర్తయిన సందర్భంగా.. ఆ దాడిలో అమరులైన వారికి ఆయన నివాళులర్పించారు. సోషల్ మీడియా వేదికగా మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ. ఉగ్రవాదంపై పోరులో భారత్ ఎన్నటికీ వెనకాడదని స్పష్టం చేశారు..
పహల్గాం ఉగ్రవాద దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారిని దేశం ఎప్పటికీ మర్చిపోదు.. వారి త్యాగం ప్రతి భారతీయుడు గుండెల్లో నిలిచి ఉంటుంది.. అని ప్రధాని పేర్కొన్నారు.. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇస్తూ.. ఒక దేశంగా మనం దుఃఖంలోనూ.. సంకల్పంలోనూ ఐక్యంగా ఉన్నాం. ఉగ్రవాది ఏ రూపంలో ఉన్న.. ఏ పేరుతో వచ్చిన భారత్ దానికి తలోగ్గే ప్రసక్తే లేదని.. మోదీ తెలిపారు. అమాయకుల రక్తాన్ని చిందించే ఉగ్రవాదుల నీచమైన కుట్రలు ఎప్పటికీ సఫలం కావని ప్రధాని హెచ్చరించారు..
గతేడాది సరిగ్గా ఇదే రోజున పహాల్గాం ప్రాంతంలో ఉగ్రవాదులు అత్యంత పాషవికంగా జరిపిన కాల్పుల్లో 26 మంది పౌరులు ప్రాణాలు కోల్పోగా.. మరో 17 మంది తీవ్రంగా గాయపడ్డ సంగతి తెలిసిందే. ఈ ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా పెను సంచలనాన్ని సృష్టించింది. సరిహద్దుల అవతల నుంచి సాగుతున్న ఉగ్రవాదుల కుట్రలను తుడిచి పెట్టేందుకు భారత సైన్యం అప్పటినుంచి ఆపరేషన్లను మరింత ఉధృతం చేసింది..
దేశ భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదని కేంద్ర ప్రభుత్వం ఈ సందర్భంగా మరోసారి స్పష్టం చేసింది. ఉగ్రవాదాన్ని సమూలంగా అణచివేయడమే లక్ష్యంగా అంతర్జాతీయ వేదికలపై కూడా భారత్ గళాన్ని వినిపిస్తూ వస్తోంది. దేశ అంతర్గత భద్రతను దెబ్బతీయాలని చూసే శక్తులకు తగిన బుద్ధి చెబుతామని.. రక్షణ రంగంలో తీసుకుంటున్న సంస్కరణలు ఉగ్రవాదుల గుండెల్లో భయాన్ని రేపుతున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Also Read: TGSRTC Strike: చర్చలు విఫలం.. తెలంగాణ సర్కారుపై ఆర్టీసీ కార్మికుల సమ్మె అస్త్రం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
RTC Strike Update: స్తంభించిన రవాణా వ్యవస్థ.. రోడ్డెక్కిన ప్రైవేటు వాహనాలు..
Hyderabad, Telangana:Sircilla RTC Strike Update Telugu: రాష్ట్రవ్యాప్తంగా పిలుపులో భాగంగా సిరిసిల్ల జిల్లాలో ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉధృతంగా కొనసాగుతోంది. కార్మికులందరూ విధులను బహిష్కరించి నిరసనల్లో పాల్గొనడంతో ప్రభుత్వ రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. సిరిసిల్లతోపాటు వేములవాడ దిబోకు చెందిన వందలాది బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి.. అయితే ప్రయాణికుల ఇబ్బందులను గమనించిన యంత్రాంగం ప్రైవేటు వాహనాలను అనుమతించడంతో జిల్లాలో ప్రైవేటు బస్సులు యధావిధిగా నడుస్తూ ఉన్నాయి.
సమ్మె ప్రభావంతో బుధవారం ఉదయం నుంచి రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రధాన డిపోలు నిశ్శబ్దంగా మారిపోయాయి.. వేములవాడ తో పాటు సిరిసిల్ల, కరీంనగర్, కామారెడ్డి, సిద్దిపేట డిపోలకు చెందిన బస్సులు కూడా నిలిచిపోయాయి. దీనివల్ల నిత్యం వేల సంఖ్యలో ప్రయాణించే సామాన్య ప్రజలతో పాటు వేములవాడ రాజన్న దర్శనానికి వచ్చే భక్తులకు తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదు..
ఆర్టీసీ బస్సులు అందుబాటులో లేకపోవడంతో జిల్లా యంత్రాంగం ప్రైవేటు డ్రైవర్లతో పాటు వాహనాలతో ప్రత్యామ్నాయంగా ఏర్పాట్లను చేసింది. సిరిసిల్ల పాత బస్టాండ్ వద్ద ప్రైవేట్ బస్సులతో పాటు మినీ వ్యాన్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీంతో ప్రయాణికులకు కొంతమేర ఊరట లభించింది. కరీంనగర్, కామారెడ్డి మార్గాల్లో ప్రైవేటు వాహనాలు నడుస్తుండడంతో అత్యవసర పనులు ఉన్నవారు గమ్యస్థానాలకు చేరుకోగలుగుతున్నారు అయితే సాధారణ రోజుల్లో కంటే రద్దీ ఎక్కువగా ఉండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు ఆర్టీసీ కార్మికులు తమ డిమాండ్ల సాధన కోసం ఆందోళన ఉదృతం చేశారు. సిరిసిల్ల కొత్త బస్టాండ్ వద్దకు భారీ సంఖ్యలో చేరుకున్న కార్మికులతో పాటు నాయకులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రత్యేకమైన నినాదాలు చేస్తున్నారు. మా న్యాయమైన డిమాండ్లను పరిష్కరించే వరకు విధుల్లో చేరే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కార్మికుల నిరసనతో కొత్త బస్టాండ్ ప్రాంగణంలో వాహనాలు నిలిచిపోయినట్లు తెలుస్తోంది. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు భారీగా మోహరించినట్లు సమాచారం.
Also Read: TGSRTC Strike: చర్చలు విఫలం.. తెలంగాణ సర్కారుపై ఆర్టీసీ కార్మికుల సమ్మె అస్త్రం..
ప్రస్తుత పరిస్థితుల దృశ్య ప్రయాణికులు తమ ప్రయాణాలను ముందుగానే ప్లాన్ చేసుకోవాలని.. ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణించేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. సమ్మె ఎప్పుడు ముగుస్తుందనే అంశంపై స్పష్టత లేకపోవడంతో సామాన్యుల్ లో ఆందోళన వ్యక్తం అవుతుంది. అయితే అధికారులు మాత్రం త్వరలోనే ఆర్టీసీకి సంబంధించిన సంఘాల నేతలతో చర్చించే అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తోంది.
Also Read: TGSRTC Strike: చర్చలు విఫలం.. తెలంగాణ సర్కారుపై ఆర్టీసీ కార్మికుల సమ్మె అస్త్రం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
TGSRTC Strike: టీజీఎస్ఆర్టీసీ జేఏసీ డిమాండ్లు ఏంటి? సమ్మెతో ఆర్టీసీకి ఒక రోజు నష్టం ఎంతో తెలుసా?
Hyderabad, Telangana:What Are TGSRTC JAC Key Demands: ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తమ డిమాండ్లను నెరవేర్చాలని ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు అర్ధరాత్రి నుంచి సమ్మె మొదలైంది. అయితే వేల సంఖ్యలో బస్సులు డిపోలకే పరిమితం అవ్వడంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ప్రైవేట్ ఉద్యోగులు, కూలీలు బస్సులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దిల్షుఖ్ నగర్, జూబ్లీహిల్స్, ఎంజీబీఎస్, లకఢీకాపూల్ లో పెద్ద ఎత్తున ప్రయాణీకులు బస్సులు లేక ఇబ్బందులు పడుతున్నారు. మరికొంతమంది నడక మార్గంలో వెళ్తున్నారు. హైదరాబాదులో 20 లక్షల మంది వరకు ఆర్టీసీ పైనే ఆధారపడి ఉన్నారు. ఇక ప్రైవేట్ ట్రావెల్స్ అయితే అదనంగా వారి నుంచి డబ్బు దండుకునే అవకాశం ఉంది.
ఈరోజు మరోసారి చర్చలు..
ఆర్టీసీ సమ్మె కారణంగా రవాణా వ్యవస్థకు తీవ్ర అంతరాయం కలిగింది. ఎంజీబీఎస్ లో కూడా బస్సులు డిపోకే పరిమితం కావడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వంతో చర్చలు విఫలం అవ్వడంతో ఆర్టీసీ జేఏసీ నేతలు నేడు సమ్మెకు దిగారు. అయితే ఈరోజు ఆర్టీసీ జేఏసీ నేతలతో మరోసారి చర్చలకు అవకాశం ఉండగా సమ్మెపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
టీజీఎస్ఆర్టీసీ చేసిన డిమాండ్లు ఏంటి..?
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం మేనిఫెస్టోలోని వాగ్దానాలు అన్నింటిని నెరవేర్చాలని టీజీఎస్ఆర్టీసీ జేఏసీ డిమాండ్ చేసింది. అంతే కాదు ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలి. పెండింగ్లో బిల్లులు క్లియర్ చేయాలి. 2017 నుంచి అలవెన్సులను కూడా పెంచాలి. 2021 నాటి పే రివిజన్ అంటే (30% ఫిట్ మెంట్) అమలు కూడా చేయాలి. కొత్త బస్సులు కొనుగోలు చేసి వర్క్ షాపులను మరింత బలోపేతం చేయాలి. ఆర్టీసీ అప్పులను ప్రభుత్వం టేక్ ఓవర్ చేయాలి. బడ్జెట్లో 3 శాతం కేటాయించాలి. ఇక ఎనిమిది గంటల షిఫ్ట్ కూడా అమలు చేయాలని ఆర్టీసీ జేఏసీ డిమాండ్ చేస్తోంది.
ఆర్టీసీకి ఒకరోజు ఎంత నష్టమంటే..?
సమస్యల పరిష్కారం కోసం జరిగిన చర్చల విఫలం కావడంతో ఆర్టీసీ సమ్మెకు దిగింది. అయితే సంస్థకు భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉంది. సాధారణంగా ఆర్టీసీకి డైలీ రూ.13 కోట్ల నుంచి రూ.16 కోట్ల వరకు ఆదాయం లభిస్తుంది. పండుగ రోజుల్లో అయితే రూ. 18 కోట్లు వరకు వస్తుంది. ఆర్టీసీ మొత్తం 9,375 బస్సులు ఉండగా.. ఒక్కో బస్సుకు రోజుకు సగటున రూ.18 వేల వరకు ఆదాయం వస్తుందని అంచనా.
Also Read: కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె.. డిపో నుంచి కదలని బస్సులు, జేఏసీ నాయకుల అరెస్ట్..!
Also Read: రేపటి నుంచి ఆర్టీసీ బంద్.. నేటి అర్ధరాత్రి నుంచే డిపోలకే పరిమితం కానున్న బస్సులు!
సమ్మెతో డేంజర్ బెల్స్..
సమ్మె విచ్చిన్నం చేసేందుకు ప్రభుత్వం ప్రైవేటు డ్రైవర్లతో బస్సులు నడిపించాలని చూస్తోంది. కానీ హైదరాబాద్ రోడ్లమీద బస్సు నడపడం అనుభవం లేని డ్రైవర్లకు ప్రాణ సంకటంగా మారుతుంది. గతంలో ప్రైవేట్ డ్రైవర్ల వల్ల జరిగిన ప్రమాదాలు రికార్డులు బయటపెడుతున్నాయి. అంతేకాదు బస్సు బయటకు వస్తే అడ్డుకుంటామని జేఏసీ కూడా హెచ్చరికలు చేస్తోంది. శాంతి భద్రతల దృష్ట్యా 5000 మంది పోలీసులను డిపోల వద్ద హోంశాఖ మొహరించేందుకు యత్నిస్తోంది.
మెట్రో కిటకిట ..
అర్ధరాత్రి నుంచి బస్సులు డిపోలకే పరిమితం అవడంతో ప్రయాణికులు మెట్రో, ఎంఎంటీఎస్ రైళ్లు ఆశ్రయిస్తున్నారు. ఇదే అదనుగా ప్రైవేట్ ట్రావెల్స్ వాహనాలు అధిక ఛార్జీలతో దండుకునే ఆస్కారం ఉంది.
విధులకు హాజరవ్వండి… RTC ఎండీ
ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తూనే అందరు విధులకు హాజరు కావాలని ఎండి వై నాగిరెడ్డి కోరారు. ఐఏఎస్ అధికారుల కమిటీ సమస్యల పరిష్కారానికి నాలుగు వారాల సమయం పడుతుందన్నారు. దశలవారీగా డిమాండ్లు నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. కొందరు తప్పుదోవ పట్టించి సమ్మెకు పిలుపునిస్తున్నారని, ఇది సామాన్య ప్రజలపై తీవ్ర ఇబ్బందులు కలిగిస్తుందని కార్మికులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
Second-hand Cars: బంపర్ ఆఫర్.. బైక్ ధరకే కారు.. సగం ధరకే స్విఫ్ట్.. థార్పై రూ. 8 లక్షల డిస్కౌంట్!
Hyderabad, Telangana:Second-hand Cars In Delhi: సొంతంగా కారు కొనుక్కోవాలని సగటు మధ్యతరగతి మనిషి కల.. అయితే కొత్త కార్ల ధరలు కొన్ని కారణాలవల్ల ఆకాశాన్ని తాకుతున్న తరుణంలో చాలామంది సెకండ్ హ్యాండ్ మార్కెట్ వైపు వెళ్ళిపోతున్నారు. అత్యంత తక్కువ ధరల్లో సెకండ్ హ్యాండ్ కార్లను కొనుగోలు చేసి వారి కల నెరవేర్చుకుంటున్నారు. ముఖ్యంగా చాలామంది దేశ రాజధాని ఢిల్లీలోని రోహిణి సెక్టార్ త్రీ లో ఉన్న సెకండ్ హ్యాండ్ మోటార్ షో రూమ్స్ లో సెకండ్ హ్యాండ్ కార్లు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇందులో భాగంగానే అక్కడున్న సెకండ్ హ్యాండ్ కార్ల షోరూమ్స్ ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్ అందిస్తూ వస్తున్నాయి. ముఖ్యంగా కొన్ని వాహనాలు అయితే ఇక్కడ సగం కంటే తక్కువ ధరల్లో లభించడం విశేషం..
రోహిణి సెక్టార్ 3లో ఉన్న మోటార్ షోరూమ్స్ లో కేవలం రూ.35 వేల నుంచి అద్భుతమైన కార్లు లభిస్తున్నాయి. పాత మోటార్ సైకిల్స్ ధరకి ఇక్కడ కార్లు దొరకడం వల్ల దేశంలోని నలుమూలల నుంచి వచ్చి ఇక్కడ సెకండ్ హ్యాండ్ కార్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా కుటుంబ అవసరాల కోసం వినియోగించే హ్యాచ్బ్యాక్ తో పాటు SUV కార్లు కూడా భారీ డిస్కౌంట్లతో లభిస్తున్నాయి. దీంతో చాలామంది ఇక్కడ ఈ కార్లను కొనుగోలు చేసి ఇతర రాష్ట్రాల్లోకి వెళ్లి బిజినెస్ కూడా చేస్తున్నారు.
ముఖ్యంగా ఇక్కడ సెకండ్ హ్యాండ్ థార్ రాక్స్ (Thar ROXX) అత్యంత చీపు ధరల్లో లభిస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో విపరీతమైన క్రేజ్ ఉన్న థార్ రాక్స్ మోడల్పై ఏకంగా రూ. 6 నుంచి 8 లక్షల వరకు డిస్కౌంట్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కలిగిన స్విఫ్ట్ కారును సగం ధరకే అంటే సుమారు రూ. 4.5 లక్షలకే విక్రయిస్తున్నారు. ఇక లగ్జరీ బ్రాండ్లకు సంబంధించిన కార్లు అయితే సగం కంటే తక్కువ ధరల్లో లభిస్తున్నాయి. ఇక్కడ మెర్సిడెస్ బెంజ్ వంటి విలాసవంతమైన కార్లపై 90 నుండి 95 శాతం వరకు డిస్కౌంట్ తో అందుబాటులో ఉన్నాయి. కేవలం రూ. 10.90 లక్షలకే మెర్సిడెస్ కారును సొంతం చేసుకోవచ్చు.
సాధారణంగా ఢిల్లీలోని కొన్ని సెకండ్ హ్యాండ్ మోటార్స్ షోరూమ్స్ లో సెకండ్ హ్యాండ్ కార్లకు ఎలాంటి గ్యారెంటీని అందించరు.. కానీ ఇక్కడ కొనుగోలు చేసే వారికి మాత్రం ప్రతీ కారుపై 500 కిలోమీటర్ల వారంటీని బాండ్ రూపంలో అందిస్తున్నారు. అంతేకాకుండా మొదటి సర్వీసింగ్ ఉచితం తో పాటు ఉచిత ఆర్సి ట్రాన్స్ఫర్ వంటి సదుపాయాలను కూడా అందిస్తున్నారు. కేవలం రూ.25 వేల నుంచి రూ.30 వేలు డౌన్ పేమెంట్ చెల్లించి కారుని ఇంటికి తీసుకెళ్లే సదుపాయాన్ని కూడా అందిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఎక్కడ ఉన్న హోం డెలివరీ చేసే సదుపాయం అందుబాటులో ఉండడం విశేషం. పాత కార్లను వినియోగించేవారు ఇక్కడ ఎక్స్చేంజ్ కూడా చేసుకోవచ్చు..
Also Read: iQOO 15: అమెజాన్లో ఐక్యూ 15 భారీ ధర తగ్గింపు.. రూ.77 వేల ఫోన్ కేవలం రూ.31,999కే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Guru Gocharam 2026: పునర్వాసులో గురుడు.. ఈ 4 రాశుల వారికి ఇక రాజభోగమే.. అదృష్టం మామూలుగా లేదు!
Hyderabad, Telangana:Guru Gocharam 2026 Effect 4 Zodiac Signs: జ్యోతిష్య శాస్త్రంలో అత్యంత శుభగ్రహంగా భావించే బృహస్పతి కదలికలు జరిపాడు. ఏప్రిల్ 20వ తేదీ ఉదయం 4 గంటల సమయంలో పునర్వాసు నక్షత్రంలోని రెండో పాదంలోకి సంచారం చేశాడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. రెండో పాదంలోకి వెళ్లడం ఎంతో ప్రత్యేకమైనదిగా భావిస్తారు. అయితే, మే 14వ తేదీ వరకు అదే పాదంలో ఉండబోతున్నాడు. పునర్వాసు నక్షత్రం రెండవ పాదానికి అధిపతిగా శుక్రుడు వ్యవహరిస్తాడు. అలాంటిది గురు గ్రహం అక్కడికి వెళ్లడం చాలా శుభ్రమని కొంతమంది జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల కొన్ని రాశుల వారి జీవితాల్లో ఊహించని మార్పులు సంభవించబోతున్నాయట. ముఖ్యంగా జీవితంలో పురోగతి లభించడమే కాకుండా అన్ని రకాల సమస్యలు పరిష్కారం కాబోతున్నాయి. ఆర్థికంగా ఎంతో మేలు జరుగుతుందని.. కోరుకున్న కోరికలు పూర్తిగా నెరవేరే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అయితే ఈ సమయంలో అత్యధిక లాభాలు పొందబోతున్న అదృష్ట రాశులేవో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
బృహస్పతి నక్షత్ర సంచారంతో ఈ రాశులవారికి గుడ్ లక్!
మేషరాశి
బృహస్పతి నక్షత్ర సంచారం వల్ల మేషరాశి వారికి అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా నిరుద్యోగులకు ఈ సమయంలో కోరుకున్న ఉద్యోగం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వ్యాపార రంగాల్లో స్థిరపడిన వ్యక్తులకు వారి పంట పండబోతోంది. పెట్టిన పెట్టుబడులకంటే రెట్టింపు ఆదాయం పొందగలుగుతారు. గతంలో వ్యాపారాల్లో నిలిచిపోయిన అనేక పనులు ఇప్పుడు వేగవంతంతో పూర్తవుతాయి. అలాగే ఆధ్యాత్మిక చింతన కూడా విపరీతంగా పెరిగి.. మానసికంగా చాలా అద్భుతంగా ఉండగలుగుతారని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.
కర్కాటక రాశి
కర్కాటక రాశిలో జన్మించిన వ్యక్తులకు ఈ కాలం గోల్డెన్ పీరియడ్ అని భావించవచ్చు. ఎందుకంటే గురు గ్రహ ప్రభావంతో వీరికి ఆకస్మిక ధన లాభాలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కుటుంబంలో ఉన్న కలహాలు పూర్తిగా తొలగిపోయి.. శాంతి వాతావరణం నెలకొనబోతోంది. ముఖ్యంగా కుటుంబంలో ఉన్న అనేక సమస్యలకు ఈ సమయం పరిష్కారం చూపబోతోంది. సమాజంలో మీకు గౌరవ మర్యాదలు కూడా రెట్టింపు అవుతాయి. అనుకున్న పనులు జరిగి మానసికంగా అద్భుతంగా ఉండగలుగుతారు.
కన్యా రాశి
కన్య రాశిలో జన్మించిన వ్యక్తులకు ఈ సమయం పట్టిందల్లా బంగారమే కాబోతోంది. విదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థులకైనా పూర్తిగా నెరవేరబోతుంది.. దీనివల్ల ఎంతో సులభంగా విదేశాలకు వెళ్లి అక్కడ చదువులు చదివే అవకాశాలు కనిపిస్తున్నాయి. కోర్టు సంబంధిత కేసుల్లో నిమగ్నమైన వ్యక్తులకు ఈ సమయంలో మీకు అనుకూలంగా కోర్టు తీర్పులు ఉండబోతున్నాయి. తండ్రి వైపు నుంచి ఆస్తులు కూడా చాలా వరకు కలిసి వచ్చే అవకాశాలున్నాయి. ఆరోగ్యం కూడా చాలా వరకు మెరుగు పడుతుంది.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి దీర్ఘకాలికంగా వేధిస్తున్న ఆర్థిక సమస్యలు పూర్తిగా తీరిపోతాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఈ సమయం అత్యంత అనుకూలంగా ఉండబోతోంది. అంతేకాకుండా సంతాన ప్రాప్తి కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్తలు కూడా అందుతాయి. రాజకీయాలతో పాటు సామాజిక రంగాల్లో ఉన్నవారికి పదవియోగం కూడా అద్భుతంగా లభించబోతోంది. అంతేకాకుండా ఎన్నో రకాల సమస్యలకు ఈ సమయం అద్భుతమైన పరిష్కారంగా నిలవబోతోంది.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
NIMS Recruitment 2026: నిరుద్యోగులకు అదిరిపోయే వార్త.. నిమ్స్లో 643 పోస్టుల భర్తీకి సర్కార్ గ్రీన్ సిగ్నల్!
Hyderabad, Telangana:NIMS Recruitment 2026 Latest News: తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు ప్రభుత్వం మరోసారి తీపి కబురు అందించబోతోంది. రాష్ట్రంలో ప్రతిష్టాత్మకమైన నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (NIMS)లో ఖాళీగా ఉన్న వివిధ కేటగిరి పోస్టుల భర్తీకి సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మొత్తం 643 ఖాళీలను ప్రత్యక్ష నియామక పద్ధతి ద్వారా భర్తీ చేసేందుకు ఆర్థిక శాఖ తాజాగా జీవో జారీ చేసినట్లు సమాచారం. ముఖ్యంగా వైద్య సేవలో కీలకమైన స్టాఫ్ నర్స్ పోస్టులు అత్యధికంగా ఉండడంతో అభ్యర్థుల్లో ఆశలు చిగురించాయి.. అయితే వీటికి సంబంధించిన అన్ని రకాల వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రభుత్వ ఆదేశాల ప్రకారం.. ఈ 643 పోస్టులలో మెజారిటీ వాట స్టాఫ్ నరుసులకే దక్కింది.. మొత్తం 375 స్టాఫ్ నర్స్ పోస్టులను భర్తీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. వీటితోపాటు ల్యాబ్ టెక్నీషియన్ లతో పాటు ఫార్మసిస్టులు, అసిస్టెంట్ ప్రొఫెసర్లతో పాటు ఇతర పారామెడికల్ సిబ్బంది ఖాళీలను కూడా ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయబోతున్నట్లు సమాచారం. పెరుగుతున్న రోగుల సంఖ్యకు అనుగుణంగా వైద్య సేవలను మెరుగుపరచడంలో భాగంగానే ఈ భారీ నియామక ప్రక్రియ చేపట్టబోతున్నట్లు తెలుస్తోంది.
Also Read: Inter Admissions 2026: బీసీ గురుకులాల్లో ఇంటర్ ప్రవేశాలు.. నేటి నుంచే దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం!
డిపార్ట్మెంటల్ సెలక్షన్ కమిటీ (DSC) ద్వారా ఈ నియామకాలు జరగబోతున్నట్లు సమాచారం. ఈ మేరకు రోస్టర్ పాయింట్లతో పాటు అభ్యర్థుల అర్హతలు, స్థానిక క్యాడర్ వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి వీలైనంత త్వరగా అధికారిక నోటిఫికేషన్ విడుదల చేయాలని ప్రభుత్వ అధికారులు ఆదేశించినట్లు సమాచారం. పారదర్శకతకు పెద్దపీట వేస్తూ.. మెరిట్ ఆధారంగానే ఎంపిక ప్రక్రియ కొనసాగాలని ప్రభుత్వం స్పష్టం చేసిందట..
గత కొంతకాలంగా వైద్య ఆరోగ్యశాఖలో నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్న వేలాదిమంది నర్సింగ్ విద్యార్థులకు ఇది గొప్ప అవకాశం అని కొంతమంది నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నిమ్స్ వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో పని చేయడం ద్వారా మెరుగైన ఉపాధితో పాటు వృత్తిపరమైన గుర్తింపు లభిస్తుందని అభ్యర్థులు కూడా భావిస్తున్నారు. వచ్చే కొన్ని వారాల్లో దరఖాస్తు ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలతో పాటు వెబ్సైట్ లింకులు కూడా అందుబాటులోకి రాబోతున్నట్లు సమాచారం.
Also Read: Inter Admissions 2026: బీసీ గురుకులాల్లో ఇంటర్ ప్రవేశాలు.. నేటి నుంచే దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Inter Admissions 2026: బీసీ గురుకులాల్లో ఇంటర్ ప్రవేశాలు.. నేటి నుంచే దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం!
Hyderabad, Telangana:MJPTBCWREIS Inter Admissions 2026: తెలంగాణ రాష్ట్రంలోని నిరుపేద, వెనకబడిన తరగతుల విద్యార్థులకు నైపుణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్న మహాత్మ జ్యోతిబా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ నివాస విద్యాసంస్థల సొసైటీ (MJPTBCWREIS), 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం అడ్మిషన్ల నోటిఫికేషన్ను ప్రారంభించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బీసీ గురుకులాల జూనియర్ కళాశాలలో ప్రవేశాల కోసం అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులును స్వీకరిస్తున్నట్లు తెలిపింది. ఇప్పటికే దీనికి సంబంధించిన అధికారిక నోటిఫికేషన్ కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది..
సొసైటీ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ ఈనెల 22వ తేదీ నుంచి ప్రారంభం కాబోతోంది. ఆసక్తి గల విద్యార్థులు మే 12వ తేదీ వరకు అధికారిక వెబ్సైట్ ద్వారా తమ దరఖాస్తులను సమర్పించుకోవచ్చు. ఈసారి అడ్మిషన్ల కోసం ఎలాంటి ప్రవేశ పరీక్ష నిర్వహించడం లేదని.. కేవలం పదో తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగానే మెరిట్ జాబితాను రూపొందించి సీట్లను కేటాయిస్తామని అధికారులు ఇప్పటికే స్పష్టం చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బాలుర, బాలికల కళాశాలలో భారీ సంఖ్యలో సీట్లు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా బాలుర కళాశాలలో దాదాపు 12,640 సీట్లకు పైగా ఖాళీలు ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా బాలికల కళాశాలలో దాదాపు 12 వేల సీట్లు అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం 24 వేలకు పైగా సీట్లకు గాను నోటిఫికేషన్ వెల్లడించింది. ఇందులో భాగంగా ఎంపీసీతో పాటు BPC, CEC వంటి ప్రధాన గ్రూపులతో పాటు కొన్ని ఒకేషనల్ కోర్సుల్లో కూడా ప్రవేశాలు కల్పిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
ఇప్పటికే మహాత్మా గాంధీ జ్యోతిబాపూలే BC గురుకుల పాఠశాలలో పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులకు ఒక ప్రత్యేకమైన గమనిక సొసైటీ జారీ చేసింది. ఆయా స్కూల్లలో చదివి పాసైన విద్యార్థులు ఇంటర్ ప్రవేశాల కోసం మళ్లీ కొత్తగా దరఖాస్తు చేసుకోనవసరం లేదని.. వారికి ఇన్ హౌస్ కోటా కింద నేరుగా అడ్మిషన్లు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. కేవలం ఇతర పాఠశాలల నుంచి వచ్చే విద్యార్థులు మాత్రమే ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవలసి ఉంటుందని నోటిఫికేషన్ లో తెలిపారు..
దరఖాస్తు సమయంలో విద్యార్థులు తమ పదవ తరగతి హాల్ టికెట్ నెంబర్తో పాటు క్యాస్ట్ సర్టిఫికెట్, ఇన్కమ్ సర్టిఫికెట్ పత్రాలతో పాటు ఆధార్ కార్డు వివరాలను సిద్ధంగా ఉంచుకోవాలని.. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ప్రాధాన్యత ఉంటుందని.. రిజర్వేషన్ నిబంధనల ప్రకారం సీట్ల కేటాయింపు జరుగుతుందని సొసైటీ కన్వీనర్ ఒక ప్రకటనలో వెల్లడించారు. అయితే అయితే ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి mjpabcwreis.cgg.gov.in వెబ్సైట్ను సందర్శించవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Ketu Transit 2026: కేతువు సంచారం.. ఏప్రిల్ 21 నుంచి ఈ రాశుల జాతకాలు మారబోతున్నాయా?
Hyderabad, Telangana:Ketu Transit In Magha Nakshatra 2026 Effect On Zodiac: ఖగోళ మార్పుల్లో అత్యంత కీలకమైనదిగా కేతువు సంచారం భావిస్తారు. ఎందుకంటే అన్ని గ్రహాలతో పోలిస్తే ఈ గ్రహానికి ఎంతో ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. దీంతోపాటు ఈ గ్రహాన్ని అత్యంత కీడు గ్రహంగా కూడా చెప్పుకుంటారు. ఇంతటి ప్రత్యేకత కలిగిన గ్రహం తప్పకుండా సంచారం చేసినప్పుడు అన్ని రాశుల వారిపై తీవ్ర ప్రభావం పడుతుంది. ముఖ్యంగా ఏప్రిల్ 20వ తేదీన కేతువు మాఘ నక్షత్రంలోకి ప్రవేశించింది. అయితే, ఈ నక్షత్ర సంచారం కారణంగా కొన్ని రాశుల వారి జీవితాల్లో ఎన్నో మార్పులు సంభవించబోతున్నాయి. మాఘ నక్షత్రంలోకి కేతువు గ్రహం సంచారం చేయడం కారణంగా ద్వాదశ రాశుల వారిపై ఊహించని ప్రభావం పడుతుంది. ఆయా రాశుల వారికి ఆర్థిక ఆరోగ్య విషయాల్లో రాబోయే కొద్ది రోజులు సమస్యలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి తప్పకుండా చాలా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు సూచిస్తూ ఉన్నారు.
కేతువు సంచారం వల్ల ముఖ్యంగా మేష రాశితో పాటు వృశ్చికం, మకర రాశుల వారికి మిశ్రమ ఫలితాలు కలుగుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. అలాగే సింహ రాశి వారికి అధిపతి అయిన సూర్యుడి నక్షత్రంలోకి ఈ సంచారం జరగడం కారణంగా కొన్ని రాశుల వారికి ఘర్షణ వాతావరణం తలెత్తే.. అవకాశాలు కనిపిస్తున్నాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండి జీవితాన్ని ముందుకు సాగించడం ఎంతో మంచిది. లేదంటే తీవ్ర సమస్యల భారిన పడే అవకాశాలు కూడా తలెత్తుతాయి..
ముఖ్యంగా ఈ సమయంలో తప్పకుండా వ్యాపార రంగాల్లో ఉన్న వ్యక్తులు పెట్టుబడిల విషయంలో ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది. భాగస్వామ్య వ్యాపారాల్లో అనేక మనస్పార్ధాలు వచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. దీంతోపాటు ఊహించని ఖర్చులు పెరగడం వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. పొదుపుపై దృష్టి సారించడం మంచిదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ సమయంలో మానసిక ఆందోళనతో పాటు నిద్రలేమి సమస్యలు ఎదురయ్యే అవకాశాలున్నాయి. ఆహార నియమాల పట్ల శ్రద్ధ వహించాల్సి ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా మానసిక ఆందోళనతో పాటు నిద్రలేమి వంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఆహార నియమాల పట్ల కూడా ప్రత్యేకమైన శ్రద్ధ వహించాల్సి ఉంటుంది.
కేతువు ప్రతికూల ప్రభావం తగ్గించుకోవడానికి జ్యోతిష్య శాస్త్ర నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు. ప్రతిరోజు గణేశుడిని ఆరాధించడంతోపాటు సంకటహర చతుర్దశి రోజున వ్రతం ఆచరించడం వల్ల అనేక శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే పేదలకు దానధర్మాలు చేయడం వల్ల కూడా ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా ఈ సమయంలో పేదలకు నల్ల నువ్వులను దానం చేయడం వల్ల దోష నివారణ జరుగుతుందని పండితులు చెబుతున్నారు. అలాగే గ్రహ ఫలితాలు అనేది వ్యక్తిగత జీవితంపై కూడా ఆధారపడి ఉంటాయి. కావున ఈ సమయంలో తప్పకుండా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు నడవడం మంచిది..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
GT vs MI Highlights: తిలక్ వర్మ బ్యాట్తో విధ్వంసం.. బంతిలో అశ్వనీ విశ్వరూపం
Ahmedabad, Gujarat:Mumbai Indians Won By 99 Runs: ఐపీఎల్ 2026ను తొలి మ్యాచ్ను విజయం ప్రారంభించిన ముంబై ఇండియన్స్ అహ్మదాబాద్ వేదికగా సంచలన ప్రదర్శన కనబర్చింది. ఒక్క బ్యాటింగ్ కాదు.. బౌలింగ్లోనూ అద్భుతం చేసి గుజరాత్ టైటాన్స్ 99 పరుగుల తేడాతో చిత్తు చేసింది. పాయింట్లపరంగా ఆఖరులో ఉన్న ముంబై ఇండియన్స్ భారీ విజయంతో పాయింట్లు మెరుగుపరుచుకుని ముందుడుగు వేసింది. తిలక్ వర్మ రికార్డు బ్రేకింగ్ సెంచరీతో విధ్వంసం సృష్టించగా.. నాలుగు వికెట్లతో అశ్వనీ కుమార్ విశ్వరూపం ప్రదర్శించాడు. గుజరాత్ టైటాన్స్ బౌలింగ్, బ్యాటింగ్లో పేలవ ప్రదర్శన కనబర్చి భారీ ఓటమిని మూటగట్టుకుంది. ఈ మ్యాచ్కు సంబంధించిన విశేషాలు ఇలా ఉన్నాయి.
Also Read: KCR Highlights: జగిత్యాలలో కేసీఆర్ 3.0.. ప్రజా ఆశీర్వాద సభ టాప్ 10 హైలెట్స్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
KCR Highlights: జగిత్యాలలో కేసీఆర్ 3.0.. ప్రజా ఆశీర్వాద సభ టాప్ 10 హైలెట్స్
Jagtial, Telangana:BRS Party Jagtial Meeting: అధికారంలోని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం.. ఆరు గ్యారంటీల పేరిట మోసం చేయడంతో తెలంగాణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పదేళ్లు ఆదర్శంగా ఉన్న తెలంగాణ మళ్లీ సంక్షోభంలో పడుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ మళ్లీ ప్రజల్లోకి వచ్చారు. దాదాపు ఏడాది తర్వాత కేసీఆర్ భారీ బహిరంగ సభలో పాల్గొని కీలక ప్రసంగం చేశారు. మళ్లీ తెలంగాణలో అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీ అని సంపూర్ణ విశ్వాసంతో ప్రకటించారు.
Also Read: KCR Full Speech: జగిత్యాలలో గులాబీ బాస్ కేసీఆర్ గర్జన.. 'నేను చావను.. మళ్లీ వస్తా!'
సీఎం పేరు లేకుండా..
జగిత్యాల వేదికగా బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, మోసాలు ఎత్తిచూపారు. అంతకుముందు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సీనియర్ నాయకులు, మాజీ మంత్రి జీవన్ రెడ్డికి గులాబీ కండువా కప్పి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానం పలికారు. అనంతరం ప్రసంగిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు ఏకరువు పెట్టారు. మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీ అని జోష్యం చెప్పారు. ప్రజా ఆశీర్వాద సభకు సంబంధించి టాప్ 10 ముఖ్యాంశాలు తెలుసుకుందాం. సభలో ప్రస్తుతం సీఎం పేరు ఎక్కడా ప్రస్తావించకపోవడం కేసీఆర్ మీటింగ్ లో ప్రధాన హైలెట్ అంశం.
Also Read: KCR Meeting Live: రేవంత్ రెడ్డిపై కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు.. లాగులు పగిలేదాకా సంపాలి
కవిత్వంతో ప్రారంభం
జగిత్యాల సభ ప్రారంభమే కేసీఆర్ కవిత్వంతో ప్రారంభించారు. 'చీకట్లో దడుచుకుంటే ఒక చెట్టే నీ చుట్టూరా అరణ్యమై భయపెడుతది. గుండె ధైర్యం ఉంటే అదే నీవెంట పెద్ద సైన్యమై నడుస్తుంది' అని అలిశెట్టి ప్రభాకర్ కవిత్వాన్ని ప్రస్తావించారు. జగిత్యాల ప్రాంతానికి చెందిన కవి అలిశెట్టి ప్రభాకర్ను గుర్తుచేసుకున్నారు.
జీవన్ రెడ్డితో అనుబంధం
వయసు పరంగా దాదాపు ఒకటే కావడంతో తమ రాజకీయ జీవితాన్ని కేసీఆర్ గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డితో ఉన్న అనుబంధాన్ని కేసీఆర్ పంచుకున్నారు. 'జీవన్ రెడ్డి నేను మంచి స్నేహితులం, పార్టీలు వేరైనా కలిసి పనిచేశాం. జగిత్యాల ప్రజల దీవెనతో ఆరు పర్యాయాలు ఎమ్మెల్యేగా జీవన్ రెడ్డి గెలిచారు' అని నెమరు వేసుకున్నారు. కుటుంబసభ్యులుగా కలిసి ఉందామని తాను జీవన్ రెడ్డికి చెప్పినట్లు కేసీఆర్ వెల్లడించారు. పార్టీలో చేరిన తొలి రోజే ప్రధాన కార్యదర్శిగా జీవన్ రెడ్డిని ప్రకటిస్తూ కేసీఆర్ ప్రకటన చేశారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో రాగానే జీవన్ రెడ్డికి మంచి పదవి వస్తుందని కూడా హామీ ఇచ్చారు.
దుర్బర తెలంగాణ
జగిత్యాల సభ నుంచి మరోసారి ఉమ్మడి ఏపీలో తెలంగాణ ఎదుర్కొన్న పరిస్థితులను కేసీఆర్ గుర్తుచేసుకున్నారు. తెలంగాణ ఏర్పడకముందు ఉన్న సంక్షోభం, కరెంట్ కష్టాలు, నీళ్ల గోస, వలసల బతుకులు కేసీఆర్ తలచుకుని భావోద్వేగానికి లేనయ్యారు. కాంగ్రెస్, బీజేపీ, టీడీపీలు తెలంగాణకు చేసిన ద్రోహాన్ని ప్రజలకు మరోసారి గుర్తుచేశారు. ఆ తర్వాత తెలంగాణ స్వరాష్ట్రం కోసం తాను చేసిన ఉద్యమం.. తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని చరిత్రను ప్రజలకు వివరించారు.
తెలంగాణ సాధించుకున్నా
చంద్ర బాబు నాయుడు ద్రోహం.. ఆయన పాలనలో రైతుల కష్టాలను కేసీఆర్ తెలిపారు. 'చంద్రబాబు కరెంట్ చార్జీలు పెంచితే తగ్గించమని నేను లెటర్ రాశా. కరెంట్ చార్జీలు తగ్గించమని ప్రజలు రోడ్ల పైకి వస్తే బషీర్ బాగ్ లో మిట్ట మధ్యాహ్నం ప్రజలను పిట్టల్లా కాల్చివేశారు. అది చూసి నా మనస్సు చలించి పోయింది, లాభం లేదు తెలంగాణ కోసం ఒక్కడినే బయలుదేరిన. తెలంగాణ కోసం నేను బయలుదేరితే నన్ను చాలా మంది అవమానించారు. అవమానాలు తట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నా' అని తెలంగాణ ఉద్యమ ప్రస్థానానికి కారణాలను కేసీఆర్ వివరంచారు.
మిషన్ భగీరథ
తన మానసపుత్రిక మిషన్ భగీరథ పథకాన్ని కేసీఆర్ గుర్తుచేసుకున్నారు. ఐదేళ్లపాటు మిషన్ భగీరథతో ఇంటింటికి నీళ్లు ఇస్తే ఇప్పుడు ఎందుకు రావడం లేదో చెప్పాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీశారు. 'మిషన్ భగీరథ నీళ్లు రాకపోతే లాగులు పగిలేదాక చంపాలి కదా? ఏం చేస్తున్నట్లు?' అని ప్రజలను ప్రశ్నించారు.
చావు కోరుకునే వారికి హెచ్చరిక
ఇక కొందరు కాంగ్రెస్ పార్టీ నాయకులు తన చావు కోరుకుంటుండగా వారిపై కేసీఆర్ నిప్పులు చెరిగారు. 'పొద్దున లేస్తే కేసీఆర్ చావాలని మాట్లాడుతున్నారు. నా కొడక నేను సచ్చేది లేదు' అని కుండబద్దలు కొడుతూ తనను విమర్శించిన వారికి హెచ్చరిక జారీ చేశారు.
చిలుకకు చెప్పినట్లు
కాంగ్రెస్కు ఓటేస్తే మళ్లీ పాత రోజులు వస్తాయని చెప్పినట్లు కేసీఆర్ గుర్తుచేశారు. 'ఓట్లు వేసేటప్పుడు చిలుకకు చెప్పినట్లు చెప్పారు. నా మాట కొంతమంది విన్నారు కొంతమంది వినలేదు' అని ప్రజలు కాంగ్రెస్కు ఓటు వేసి మోసపోయిన విధానాన్ని కేసీఆర్ వివరించారు.
రైతుల కష్టాలు ఏకరువు
ప్రజా ఆశీర్వాద సభ ద్వారా తెలంగాణ రైతుల కష్టాలను కేసీఆర్ ఏకరువు పెట్టారు. 'ఒకే దఫా వేయాల్సిన రైతు బంధు నెలకు ఒకసారి వేస్తున్నారు. డబ్బులు లేక చిప్ప పట్టుకొని అడుక్కుంటున్నారు. యూరియా బస్తా కోసం యాప్లు పట్టుకొని తిరుగుతున్నారు. తాగునీళ్ల కోసం గోస పడే పరిస్థితి వచ్చింది. మక్కలు కొనే పరిస్థితి లేదు. పంట వేసిన దగ్గర నుంచి కొనే వరకు బీఆర్ఎస్ పార్టీ రైతులకు అండగా నిలిచింది' అని ప్రజలకు కేసీఆర్ గుర్తుచేశారు.
ఆర్థిక పరిస్థితిపై
రాష్ట్ర ఆర్థిక ఆదాయం దిగజారిపోవడాన్ని కేసీఆర్ సభలో ప్రస్తావించారు. రియల్ ఎస్టేట్ లేదని.. చేనేత కార్మికులు అవస్థ పడుతున్నారని.. ఉద్యోగులకు సంబంధించి కూడా కేసీఆర్ స్పందించారు. రాష్ట్రంలో ఎవరినీ కదిలించిన ప్రతి ఒక్కరు బాధపడుతున్నారని గుర్తుచేశారు. కాంగ్రెస్ పార్టీ కాకి మాటలే చెప్పింది తప్పా ఒక్కరికి మంచి చేయలేకపోతుందని ఒక మాటలో కాంగ్రెస్ వైఫల్యాలు, మోసాలు కేసీఆర్ వివరించారు.
హైడ్రాపై సంచలన ప్రకటన
హైదరాబాద్లో విధ్వంసం చేస్తున్న హైడ్రాపై కేసీఆర్ సంచలన ప్రకటన చేశారు. 'బోడ ముండా హైడ్రా తెచ్చారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి మొదటి సంతకంతోనే హైడ్రా తీసి అవతల పడేస్తాం' అరని ప్రకటించారు. '6 గ్యారెంటీలు, 420 హామీలుతో కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేశారు. తెలంగాణ పునర్నిర్మాణ యజ్ఞం మళ్లీ మొదలు కావాల్సిందే. తెలంగాణ పునర్నిర్మాణ యజ్ఞం జగిత్యాల జై యాత్ర నుంచే మొదలు కాబోతుంది' అని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
