icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

Tamil Nadu Exit Poll: తమిళనాడులో హీరో విజయ్ సీఎం అవుతాడా? ఎగ్జిట్ పోల్స్ సర్వే ఏం చెబుతోంది?

Nagalapuram, Tamil Nadu:

Tamil Nadu Exit Poll 2026: తమిళనాడు 2026 అసెంబ్లీ ఎన్నికల్లో అధికార డీఎంకే కూటమి మ‌రోసారి అధికారం చేప‌ట్ట‌నుంద‌ని పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ సర్వే వెల్లడించింది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 84 శాతంపైగా ఓటింగ్ నమోదవ్వగా.. గత 2021 ఎన్నికల కంటే 11 శాతం ఎక్కువగా ఓటింగ్ పెరిగింది. తమిళనాడు చరిత్రను పరిశీలిస్తే గత నాలుగు దశాబ్దాల్లో రాష్ట్రంలో ప్రతి ఐదేళ్లకు ప్రభుత్వం మారే సంప్రదాయం ఉంది. అయితే 2016లో మాత్రం జయలలిత నేతృత్వంలో ఏఐడీఎంకే వరుసగా రెండోసారి అధికారం చేపట్టారు. ఇప్పుడు డీఎంకే కూడా రెండోసారి అధికారం చేపట్టే అవకాశాలున్నట్టు సర్వేలో తేలింది. 

అధికార డీఎంకే, ప్రతిపక్ష ఏఐడీఎంకే కూటముల మధ్య తీవ్ర పోటీ ఉన్నా డీఎంకే ఆధిపత్యం కనిపిస్తోందని సర్వేలో తేలింది. సినీ నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ రెండు కూటములకు గట్టి పోటీ ఇస్తుందని సర్వేలో వెల్లడైంది. తమిళనాడులో 234 అసెంబ్లీ స్థానాలుండగా మ్యాజిక్ ఫిగర్ 118 స్థానాలు. డీఎంకే కూటమి 125-145 స్థానాలతో అధికారం చేప‌ట్ట‌నుంద‌ని సర్వేలో తేలింది. ఏఐడీఎంకే 65-80 స్థానాలతో మరోసారి ప్రతిపక్షానికే పరిమితమయ్యే అవకాశాలున్నాయి. టీవీకే 18-24 స్థానాలు, ఇతరులు 2-6 స్థానాలు గెలుపొందే అవకాశాలున్నాయి.

అలాగే ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో అధికార డీఎంకే కూటమి 38.4 శాతం, ఏఐడీఎంకే 31.5 శాతం, టీవీకే 23.6 శాతం, ఇతరులు 6.5 శాతం ఓట్లు పొందే అవకాశాలున్నట్లు పీపుల్స్ సర్వే చెబుతోంది. ఎన్నికల సర్వేలో 3 శాతం ప్లస్ ఆర్ మైనస్ ఉండే అవకాశం ఉందని తెలిపింది.

మహిళలు డీఎంకేకు 37.8 శాతం, ఏఐడీఎంకేకు 30.2 శాతం, టీవీకేకు 26 శాతం, ఇతరులకు 6 శాతం మద్దతివ్వగా... పురుషులు డీఎంకేకు 39.5 శాతం, ఏఐడీఎంకేకు 32.6 శాతం, టీవీకేకు 21.1 శాతం, ఇతరులకు 6.8 శాతం మద్దతిచ్చినట్లు తేలింది. అలాగే రాష్ట్రంలోని యువ ఓటర్లు అనగా 18 నుండి 24 ఏళ్ల మధ్య నూతన యువ ఓటర్లలో డీఎంకేకు 34.9 శాతం, ఏఐడీఎంకు 25.8 శాతం, టీవీకేకు 32.3 శాతం, ఇతరులకు 7 శాతం మద్దతిచ్చినట్టు సర్వేలో తేలింది. సినీ నటడు విజయ్ యువ ఓటర్లపై భారీ ఆశలు పెట్టుకున్నా అధికార డీఎంకే వైపు యువత మొగ్గు చూపినట్టు సర్వేలో వెల్లడైంది.

డీఎంకే, ఏఐడీఎంకే ప్రత్యక్షంగా పోటీ పడకుండా వారి మిత్రపక్షాలు పోటీ పడిన స్థానాల్లో టీవీకే గట్టి పోటీ ఇచ్చిందని సర్వేలో తేలింది. ప్రధాన అభ్య‌ర్థుల‌ స్థానాలను పరిశీలిస్తే డీఎంకే అధినేత ముఖ్యమంత్రి స్టాలిన్ కొలతూరులో, ఏఐడీఎంకే అధినేత మాజీ ముఖ్యమంత్రి పళని స్వామి ఎడప్పాడిలో విజయం దిశగా కొనసాగుతారని పీపుల్స్ సర్వే చెప్పింది. మరో ఏఐడీఎంకే మాజీ సీఎం పన్నీరు సెల్వం ఎన్నికల ముందు డీఎంకేలో చేరి బోడినాయకనూర్ నుండి పోటీ చేస్తుండగా అక్కడ టీవీకే నుండి గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు.

సినీ నటుడు టీవీకే అధినేత విజయ్ రెండు స్థానాల్లో పోటీ చేస్తుండగా పెరంబూర్ నుండి గెలిచే అవకాశాలుండగా, ఈస్ట్ తిరుచిరాపల్లిలో వెనకబడినట్టు సర్వేలో తేలింది. అలాగే డిప్యూటీ సీఎం, ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ చపాక్ నుండి పోటీ పడుతుండగా ఆయన అక్కడ టీవీకే పార్టీ నుండి గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు.

శ్రీపెరంబదూర్ నుండి పోటీలో ఉన్న కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు సెల్వ అక్కడ టీవీకే చేతిలో వెనుకబడినట్టు సర్వేలో తేలింది. తెలంగాణ మాజీ గవర్నర్ తమిళ సై సౌందరరాజన్ మైలాపూర్‌లో బీజేపీ తరఫున పోటీ పడుతుండగా ఆమె టీవీకే చేతిలో ఓడిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.

తమిళనాడు బీజేపీ చీఫ్ నయనార్ నాగేందర్ పోటీ పడుతున్న సత్తూరులో ఆయన గెలిచే అవకాశాలున్నట్టు సర్వేలో తేలింది. సినీ నటుడు దివంగత విజయ్‌కాంత్ సతీమణి, డీఎండీకే చీఫ్ ప్రేమలత గతంలో విజయ్‌కాంత్ గెలిచిన విరుదాచలం నుండి పోటీ పడుతుండగా ఆమె మూడో స్థానానికే పరిమితమయ్యే అవకాశాలున్నాయి. 

తమిళ రాజకీయాల్లో వృద్ధ నేత. కరుణానిధి సన్నితులైన 86 ఏళ్ల దురై మురుగన్ డీఎంకే తరఫున కాట్పాడి నుండి పోటీ పడుతుండగా ఆయన ఇప్పుడు పదకొండవ సారి గెలిచే అవకాశాలున్నాయి. ఏఐడీఎంకే మిత్రపక్షం పీఎంకే చీఫ్ అన్బమణి రాందాస్ సతీమణి సౌమ్య అన్బమణి రాందాస్ ధర్మపురి నుండి పోటీ చేస్తుండగా ఆమె టీవీకే నుండి గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు.

డీఎంకే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు టీవీకే, ఏఐడీఎంకే మధ్య చీలిపోతున్నాయి. టీవీకే, పీఎమ్‌కే (ఆర్), శశికళ కూటమితో ఏఐడీఎంకే నష్టపోతోందని సర్వే తెలియజేస్తోంది. ముఖ్యంగా ఏఐడీఎంకే ట్రెడిషనల్ ఓటు బ్యాంకు అయిన తేవర్ శశికళ కూటమి, ఓపీఎస్ వల్ల, వన్నియార్ ఓటు పీఎమ్‌కే (ఆర్) పార్టీ వల్ల నష్టపోతుంది. తద్వారా గ్రాస్ రూట్‌లో ఏఐడీఎంకే చాలా స్థానాల్లో దెబ్బతింది.

ఎస్సీ యూత్ టీవీకే ఆకర్షించగా, వీసీకే మద్దతుతో డీఎమ్‌కే తన ఎస్సీ ఓటు బ్యాంకు పదిలపరుకుంటుంది. విజయ్ వల్ల డీఎంకే కొంత క్రిస్టియన్ ఓట్లు కోల్పోపోతున్నప్పటికీ, ముస్లింలు డీఎంకే వైపే మొగ్గు చూపారు. డీఎంకే ప్రభుత్వ పథకాలతో మహిళలు ఆ కూటమి వైపు మొగ్గు చూపారు.

Also REad: Exit Poll Results 2026: హీరో విజయ్ సీఎం అవుతాడా? పశ్చిమబెంగాల్‌లో బీజేపీ అధికారంలోకి వస్తుందా? 2026 అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్..

Also REad: Telangana Pending Dues: ఉద్యోగులకు, పెన్షనర్లకు శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం..రూ.1000 కోట్ల పెండింగ్ బకాయిలు విడుదల!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Exit Poll Results 2026: హీరో విజయ్ సీఎం అవుతాడా? పశ్చిమబెంగాల్‌లో బీజేపీ అధికారంలోకి వస్తుందా? 2026 అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్..

Hyderabad, Telangana:

Exit Poll Results 2026 Updates: దేశంలో ఇటీవలే ప్రారంభమైన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ నేటితో ప్రశాంతంగా ముగిసింది. మే 4వ తేదీన వెలువడనున్న అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కోసం యావత్ భారత్ ఎదురుచూస్తోంది. అయితే ఏ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారం చేజెక్కిచ్చుకోబోతుందనే అంశంలో ఎగ్జిట్ పోల్ సర్వే వచ్చేసింది.

బీజేపీకి 'బెంగ'ల్ తప్పదా?

 పార్టీ తృణమూల్ (TMC)  ఎన్డీఏ (NDA) కాంగ్రెస్ (INC) సీపీఎం (CPM) ఇతరులు
 సీట్లు      170 - 190      120 - 130  1 - 4  0 - 2 1 - 5

ఈ సర్వే ప్రకారం భారతీయ జనతా పార్టీ ఎంతో ఆశలు పెట్టుకున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ ‌పోల్‌ను పరిశీలిస్తే.. బీజేపీ నేతృత్వంలోని ఎన్టీఏ (NDA) కూటమికి మరోసారి పరాభవం తప్పదని అంచనా వేస్తున్నారు. సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీ మరోసారి అధికారం చేపట్టబోతోందని సర్వే చెబుతోంది. అధికార టీఎంసీ పార్టీ 170 నుంచి 190 స్థానాల్లో విజయం సాధించే అవకాశం కనిపిస్తోంది.

అలాగే ఎన్డీఏ కూటమికి 120 -130 స్థానాలు.. కాంగ్రెస్‌ (INC)కు 1-4 సీట్లు.. సీపీఎం (CPM) పార్టీకి 0-2 స్థానాలతో పాటు ఇతరులు 1-5 సీట్లలో గెలిచే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్ సర్వే చెబుతోంది. అయితే పశ్చిమ బెంగాల్‌లోని 294 అసెంబ్లీ ఎన్నికల స్థానాలకు గానూ మ్యాజిక్ మార్క్ 148 స్థానాల్లో గెలుపొందిన వారే అధికారం చేపట్టే అవకాశం ఉంది. దీంతో సర్వే ప్రకారం పశ్చిమ బెంగాల్‌లో మరోసారి దీదీ అధికారం చేపట్టబోతోందని అంచనాలు వెల్లడిస్తున్నాయి. మమతా బెనర్జీ వరుసగా నాలుగో సారి అధికారం చేపట్టి రికార్డు నెలకొల్పే అవకాశం ఉంది. 

కేరళలో మారనున్న అధికారం..

 పార్టీ కాంగ్రెస్ (UDF)  ఎల్‌డీఎఫ్ (LDF) బీజేపీ (BJP) ఇతరులు
 సీట్లు      76 - 81   61 - 66  3 - 4 0 - 1

కేరళ విషయానికొస్తే ఎగ్జిట్ పోల్స్ ప్రకారం కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యూడీఎఫ్ (UDF) కూటమి.. అధికారం చలాంచి దిశగా వెళుతుందని సర్వేలు చెబుతున్నాయి. కాంగ్రెస్ యూడీఎఫ్ కూటమికి 76 - 81 స్థానాల్లో గెలుపొందుతుందని.. అలాగే సీఎం పినరయి విజయ్ పార్టీ ఎల్‌డీఎఫ్ (LDF) పార్టీకి 61 - 66 సీట్లు.. భారతీయ జనతా పార్టీకి 3 నుంచి 4 సీట్లు.. ఇతరులు సున్నా లేదా ఒక అసెంబ్లీ స్థానాల్లో నెగ్గే అవకాశం కనిపిస్తోంది.

ఏప్రిల్ 23న జరిగిన ఎన్నికల్లో 140 అసెంబ్లీ స్థానాలకు గాను 74% పైగా ఓటింగ్ నమోదయింది. మ్యాజిక్ ఫిగర్ 71 స్థానాలు చేరుకున్నవారు అధికారం చేపట్టనున్నారు. ఈ సర్వే ప్రకారం కాంగ్రెస్ నేతృత్వంలోని (UDF) గెలుపు ఖాయమని.. పినరయ్ విజయన్ సీఎం స్థానం నుంచి తప్పుకోక తప్పదని సర్వేలు చెబుతున్నాయి. 

మరోసారి ఎన్డీఏ..

 పార్టీ కాంగ్రెస్ + ఎన్డీఏ (NDA) ఇతరులు
 సీట్లు 40 - 46  84 - 90 2 - 3

అస్సాం రాజకీయాల విషయానికొస్తే అధికార బీజేపీ ఎన్డీఏ కూటమి అలాగే కాంగ్రెస్ నాయకత్వంలోని మహాజోత్ కూటమి మధ్య తీవ్ర ఉత్కంఠపోరు నెలకొంది. బీజేపీ తరఫున సీఎం హిమంత విశ్వ శర్మ దూకుడుగా ప్రచారం చేశారు. అస్సాంలో 126 అసెంబ్లీ స్థానాలకు జరిగిన పోటీల్లో అధికార ఎన్డీఏ కూటమి మరోసారి అధికారం చేపట్టబోతోందని సర్వే చెబుతోంది. బీజేపీ కూటమికి 46 శాతం ఓట్లతో 84 - 90 స్థానాల్లో గెలుపు ఖాయంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ కూటమికి 42 శాతం ఓట్లతో 40 - 46 స్థానాలు.. ఇతరులు 2 -3 స్థానాల్లో నెగ్గే అవకాశం ఉంది. 

తమినాడులో వాళ్లదే అధికారం..

 పార్టీ డీఎంకే (DMK)  అన్నాడీఎంకే (AIADMK) టీవీకే (TVK)
 సీట్లు 130 - 141      84 - 90  4 - 8

ఈసారి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు మరింత ఆసక్తికరంగా సాగాయి. గత ఎన్నికల్లో ద్విముఖ పోరుగా ఉన్న అసెంబ్లీ ఎన్నికలు.. హీరో విజయ్ రాకతో త్రిముఖ పోరుగా మారాయి. సీఎం స్టాలిన్ నాయకత్వంలో అధికార ద్రవిడ మున్నేట్ర కజగం (DMK) పార్టీ ప్రచారంలో దూసుకుపోయింది. అయితే పళని స్వామి నాయకత్వంలోని అన్నా డీఎంకే (AIADMK) మాత్రం కొంత వెనుకబడిందని వార్తలు వినిపిస్తున్నాయి. తమిళనాట అధికారమే లక్ష్యంగా బరిలో దిగిన హీరో విజయ్ తమిళ వెట్రి కజగం (TVK) పార్టీ ప్రభావం చూపలేకపోయింది. 

ఏప్రిల్ 23న జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎలక్షన్స్ లో 234 అసెంబ్లీ స్థానాలకు 80 శాతానికి పైగా ఓటింగ్ నమోదయింది. అయితే తమిళనాడు ఎన్నికల చరిత్రలో ఇదే అత్యధిక ఓటింగ్ కావడం విశేషం. ఎగ్జిట్ పోల్ సర్వే ప్రకారం తమిళనాడు రాష్ట్రంలో మరొకసారి అధికార డీఎంకే పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుందని అంచనా వేస్తున్నారు. ఈ పార్టీకి 130 - 141 స్థానాల్లో గెలుపొందే అవకాశం కనిపిస్తోంది. అలాగే అన్నా డీఎంకే పార్టీకి 84 - 90 స్థానాలు.. విజయ్ టీవీకే పార్టీకి 4 - 8 స్థానాలు రావొచ్చని అంచనాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో 234 అసెంబ్లీ స్థానాలకు గానూ మ్యాజిక్ మార్క్ 118 స్థానాల్లో గెలుపొందిన పార్టీ అధికారం చేపడుతోంది. 

పుదుచ్చేరి బీజేపీదే?!

 పార్టీ ఎన్డీఏ (NDA)  కాంగ్రెస్ (SPA) టీవీకే (TVK)
 సీట్లు 17 - 19      11 - 12  1 - 2

అదేవిధంగా పుదుచ్చేరి అసెంబ్లీ ఎలక్షన్స్ లో మొత్తం 30 స్థానాలకు గాను భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ ఎక్కువ 17 నుంచి 19 స్థానాల్లో గెలుపొందే అవకాశం కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని కూటమికి 11 నుంచి 12 స్థానాలు.. అలాగే సినీ నటుడు విజయ స్థాపించిన టీవీకే పార్టీకి 1 - 2 స్థానాల్లో విజయం సాధించే అవకాశం కనిపిస్తోంది. పుదుచ్చేరిలో ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తుందని అంచనా. 

మొత్తంగా హైదరాబాద్‌లోని ఎస్ఏఎస్ గ్రూపు చెందిన ఐఐటిఎస్ గ్రూప్ విడుదల చేసిన ఎగ్జిట్ పోల్ అసెంబ్లీ ఎలక్షన్స్ 2026లో జరిగిన ఐదు రాష్ట్రాల్లో ఫలితాలు ఇలా రాబోతున్నాయని అంచనా వేయడం జరిగింది. ఒక మాటలో చెప్పాలంటే కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఏఫ్ (UDF), అస్సాంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ (NDA), తమిళనాడులో అధికార డీఎంకే (DMK), వెస్ట్ బెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ (TMC), పుదుచ్చేరిలో ఎన్డీఏ (NDA) కూటమి విజయకేతనం ఎగురవేసే అవకాశం కనిపిస్తుంది.

(గమనిక: పైన పేర్కొన్న ఎగ్జిట్ పోల్స్ సమాచారం కేవలం అంచనా మాత్రమే. కొన్నిసార్లు ఇందుకు భిన్నంగా కూడా ఫలితాలు రావొచ్చు లేదా దీనికి అనుగుణంగా వెలువడొచ్చు. కానీ, దీన్నే అంతిమంగా ఖరారు చేసుకోరాదు.)

Also Read: Telangana Pending Dues: ఉద్యోగులకు, పెన్షనర్లకు శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం..రూ.1000 కోట్ల పెండింగ్ బకాయిలు విడుదల!

Also Read: Vande Bharat Derail: వందేభారత్ రైలుకు తృటిలో తప్పిన ప్రమాదం..పట్టాలు తప్పిన రన్నింగ్ ట్రైన్..అంతలోనే

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement

Telangana Pending Dues: ఉద్యోగులకు, పెన్షనర్లకు శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం..రూ.1000 కోట్ల పెండింగ్ బకాయిలు విడుదల!

Hyderabad, Telangana:

Telangana Pending Dues Released: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. గతంలో అసెంబ్లీ వేదికగా ఇచ్చిన హామీ మేరకు డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఉద్యోగులతో పాటు రిటైర్డ్ ఉద్యోగులకు తీపికబురు అందించారు. ఉపముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాల మేరకు, ఉద్యోగుల పెండింగ్ బకాయిల కోసం రూ.1000 కోట్ల నిధులను తెలంగాణ ప్రభుత్వం బుధవారం విడుదల చేసింది. డిప్యూటీ సీఎం సూచన మేరకు ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా ఈ మేరకు నిధుల విడుదల చేశారు. 

​గతేడాది ఉద్యోగ సంఘాలతో జరిగిన చర్చల నేపథ్యంలో ప్రభుత్వం నెలకు రూ.700 కోట్లు విడుదల చేస్తామని హామీ గతంలో ఇచ్చింది. ఈ విధంగా మార్చి 2026 వరకు ప్రతినెల ఉద్యోగులకు ఇచ్చిన మాటను  ప్రభుత్వం అమలు చేస్తోంది. అయితే, ఉద్యోగుల ఆర్థిక అవసరాలను, ఇబ్బందులను స్వయంగా మానిటర్ చేసిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క..ఈ ఆర్థిక సంవత్సరం నుంచి ఆ మొత్తాన్ని రూ.1000 కోట్లకు పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో ఏప్రిల్ నెలలో రూ.1000 కోట్లను యుద్ధ ప్రాతిపదికన విడుదల చేశారు. 

అదే విధంగా ​రిటైర్డ్ ఉద్యోగుల పట్ల తెలంగాణ ప్రభుత్వం అత్యంత సానుకూలంగా స్పందించింది. అక్టోబర్ 2025 వరకు పెండింగ్‌లో ఉన్న రిటైర్డ్ ఉద్యోగుల జనరల్ ప్రావిడెంట్ ఫండ్ (GPF) బకాయిలన్నింటినీ ఈ నిధులతో పూర్తిగా క్లియర్ చేయడం జరిగింది. రిటైర్మెంట్ తర్వాత సెటిల్మెంట్‌ కోసం ఎదురుచూస్తున్న వారికి ఇదో గొప్ప ఊరటనిచ్చే అంశం.

అలాగే ఉద్యోగుల ఆరోగ్య అవసరాలకు సంబంధించి మెడికల్ బిల్లులను ఆలస్యం చేయకుండా, ప్రాధాన్యత క్రమంలో చెల్లింపులు చేసేందుకు అధికారులకు ఆదేశాలు అందాయి. ప్రస్తుతం మెడికల్ బిల్లుల చెల్లింపులు ఎంతో వేగంగా జరుగుతున్నాయి. ​మెడికల్ బిల్లులు, స్కాలర్‌షిప్‌లకూ మోక్షం ​ఉద్యోగుల ఆరోగ్య భద్రత విషయంలో రాజీపడకూడదని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఒక్క రోజు కూడా జాప్యం లేకుండా మెడికల్ బిల్లుల చెల్లింపులు రెగ్యులర్‌గా జరిగేలా యంత్రాంగం చర్యలు చేపట్టింది. తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చొరవతో పెద్ద మొత్తంలో నిధులు విడుదల కావడం పట్ల ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

Also Read: Chitra Pournami 2026: అరుణాచలంలో గిరి ప్రదక్షిణకు అత్యంత శుభ ముహూర్తం..ఈ పవిత్ర ఘడియల్లో స్వామి దర్శనం అపూర్వం!

Also Read: Watermelon At Night: రాత్రిపూట పుచ్చకాయ తింటే చనిపోతారా? ముంబై ఫ్యామిలీ మృత్యువాత వెనుక కారణం ఇదే!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Watermelon At Night: రాత్రిపూట పుచ్చకాయ తింటే చనిపోతారా? ముంబై ఫ్యామిలీ మృత్యువాత వెనుక కారణం ఇదే!

Hyderabad, Telangana:

Watermelon At Night Good Or Bad: ముంబైలో ఒక కుటుంబం తమ బంధువులతో కలిసి రాత్రి భోజనంలో బిర్యానీ తిన్నారు. ఆ తర్వాత ఇంటికి తిరిగి వచ్చాక, బంధువులు వెళ్ళిపోయాక ఇంట్లో ఉంచిన పుచ్చకాయను ఆ నలుగురు బయటకు తీసి తిన్నారు. అది తిన్న కొద్దిసేపటికే వారి శారీరక పరిస్థితి మారిపోయింది. ఒకరి తర్వాత ఒకరుగా వాంతులు, విరేచనాలు చేసుకున్నారు. అంతలోనే నలుగురినీ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ వారు మరణించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు, వారు తిన్న ఆహారాన్ని ఫోరెన్సిక్ పరీక్ష కోసం పంపారు. మరణానికి కారణం పరీక్షలు జరుగుతున్నాయి. బిర్యానీ తిన్న తర్వాత గ్యాస్ ట్రబుల్ సమస్య వస్తుందని అందరికి తెలుసు. కానీ, బిర్యానీ లేదా పుచ్చకాయలో ఏదైనా రసాయనం కలిసిందా? అనేది తెలియాల్సి ఉంది. 

ఈ సంఘటన ఇప్పుడు ప్రజల మనసుల్లో అనేక ప్రశ్నలను రేకెత్తించింది. ఈ అలర్జీ పుచ్చకాయ వల్ల వచ్చిందా? ఆ పండు వల్ల ఎలాంటి ప్రభావాలు ఉండవచ్చు? దాన్ని తినడం వల్ల ఇంత పెద్ద ప్రభావం ఎందుకు పడింది? ప్రజలు తమలో తాము అనేక రకాలుగా ఆలోచిస్తున్నారు. 

ఈ విషయంపై ఓ పోషకాహార నిపుణులు మాట్లాడుతూ.. పుచ్చకాయ వల్ల ఫుడ్ పాయిజనింగ్ కలగదని చెప్పారు. అయితే కొన్ని సందర్భాల్లో పరిస్థితులను బట్టి తీవ్రమైన అనారోగ్యాలను దారితీసే అవకాశం ఉందని తెలియజేశారు. పుచ్చకాయలో అధిక నీటి శాతం, సహజ చక్కెర ఉండటం వల్ల, ఆ పండు కొద్దిగా కలుషితమైనా అందులో వేగంగా వ్యాపిస్తుంది. పుచ్చకాయ తీపి కోసం గ్లూకోజ్ నీళ్లు లేదా చక్కెర నీటిని కలుపుతారని కూడా అంటున్నారు. సహజంగా కాకుండా ఇతర ద్రవాలను అందులో కలపడం వల్ల కల్తీ జరిగే అవకాశం ఉంది. 

పుచ్చకాయ వల్ల ఫుడ్ పాయిజనింగ్ రావడం కొత్తేమీ కాదు. అటువంటి కృత్రిమ సారం కలిపిన పుచ్చకాయను తిన్నప్పుడు, ఆహార నొప్పి, వాంతులు, కడుపు, విరేచనాలు వంటివి సంభవించవచ్చు. అంతేకాకుండా, పిల్లలు దీని బారిన పడినప్పుడు కడుపు నొప్పి, విరేచనాలు వంటివి కలగవచ్చు. ఇలా జరిగితే ప్రాణాలకే ప్రమాదం రావొచ్చు. కలుషిత ఆహారం తినే ముందు వాటిలో కల్తీ జరిగిందో లేదా అని నిర్ధారించుకున్న తర్వాతే వాటిని తినడం మేలు. 

పుచ్చకాయను ఎప్పుడు తినవచ్చు?
మీరు పుచ్చకాయను తినే సమయం కూడా దాని జీర్ణక్రియలో కీలక పాత్ర పోషిస్తుంది. నిద్రలో జీర్ణక్రియ నెమ్మదిస్తుంది. అందువల్ల, రాత్రి ఆలస్యంగా (ముఖ్యంగా రాత్రి 7 గంటల తర్వాత) పండ్లు లేదా భారీ భోజనం మానుకోవడం ఉత్తమం అని వైద్యుల సూచిస్తున్నారు.

పుచ్చకాయ తినడానికి ఉత్తమ సమయం ఉదయం భోజనానికి ముందు లేదా తర్వాత కొంత సమయం తర్వాత తినొచ్చు. అలాగే పగటిపూట చిరుతిండిగానూ పుచ్చకాయ తినొచ్చు. రాత్రి ఆలస్యంగా పండ్లు తినడం వల్ల మాత్రమే ఫుడ్ పాయిజనింగ్ రాదు, కానీ ఆ పండ్లు కలుషితమైతే లేదా శరీరానికి జీర్ణక్రియ సరిగా లేకపోతే, జీర్ణ సంబంధిత రుగ్మతలు పెరిగే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. 

(గమనిక: పైన పేర్కొన్న సమాచారం కేవలం కొన్ని నివేదికల ఆధారంగా రూపొందించింది. దీన్ని పాటించే ముందు సంబంధిత వైద్య నిపుణుడ్ని సంప్రదించడం మేలు. దీన్ని జీ తెలుగు న్యూస్ ధ్రువీకరించడం లేదు.)

Also Read: Vande Bharat Derail: వందేభారత్ రైలుకు తృటిలో తప్పిన ప్రమాదం..పట్టాలు తప్పిన రన్నింగ్ ట్రైన్..అంతలోనే

Also Read; Kohli IPL 9000 Runs: మరో 11 పరుగుల దూరంలో విరాట్ కోహ్లీ ప్రపంచ రికార్డు..ఐపీఎల్ చరిత్రలో ఒకేఒక్క మొనగాడు!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement

Snake Video: ఫ్యాన్సీ క్లిప్ అనుకుంటే పొరపాటే.. అమ్మాయి జడలో ప్రత్యక్షమైన పాము పిల్ల.. వీడియో..

Hyderabad, Telangana:

 Snake In Hair Video Watch Now: ప్రస్తుతం సోషల్ మీడియాలో రకరకాల వింతలతో పాటు విశేషాలు వైరల్ అవ్వడం సర్వసాధారణమైపోయింది. అయితే తాజాగా వెలుగులోకి వచ్చిన ఒక వీడియో మాత్రం సోషల్ మీడియా వినియోగదారుల వెన్నుల్లో వెనుక పుట్టిస్తుంది. సాధారణంగా మహిళలు తమ జడలను పూలతోనో.. అందమైన క్లిప్పులతోను అలంకరించుకుంటారు. కానీ ఇక్కడ ఒక యువతి ఏకంగా పాము పిల్లను తన జడలో పెట్టుకొని కనిపించడం ఇప్పుడు అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసేలా చేస్తోంది. దీనికి సంబంధించిన వీడియో క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. 

వైరల్ అవుతున్న వీడియోను గమనిస్తే.. ఒక యువతి ఒకచోట కూర్చుని ఉండగా.. ఆమె వెనక ఉన్న జడ మధ్యలో ఒక చిన్న పాము పిల్ల చుట్టలు చుట్టుకొని ఉండడం మీకు కనిపిస్తుంది. ఆ పాము ప్రాణాలతోనే ఉండి.. అటు ఇటు కదులుతూ పడక విప్పడానికి ప్రయత్నిస్తున్నట్లుగా స్పష్టంగా కనిపిస్తోంది. మొదట చూసినవారు అదేదో ఫ్యాన్సీ హెయిర్ క్లిప్ అని అనుకున్నారు.. కానీ ఆ పాము చిన్నగా కదులుతూ కనిపించడంతో అది నిజమైన పామని నిర్ధారించుకొని అందరూ షాక్ అయిపోయారు..

ఈ ఘటనకు సంబంధించిన చిన్న క్లిప్పు ఇప్పుడు సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో వైరల్ అవుతుంది. వీడియో పై సోషల్ మీడియాలో భిన్నభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అందరు ఇది కావాలని చేసిన సాహసం అని కామెంట్లలో రాసుకు వస్తే.. మరి కొంతమంది ఫ్రాంక్ వీడియో కావచ్చు అని భావిస్తున్నారు. ఆ యువతి ముఖంలో ఎక్కడ భయం లేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఈ వీడియో చూసిన మరికొంతమంది మాత్రం బహుశా ఆ యువతీ నిద్రపోతున్న సమయంలో లేదా ఆరు బయట కూర్చున్నప్పుడు పాము పిల్ల ఆమె జడలోకి దూరి ఉండొచ్చని కామెంట్లు చేస్తున్నారు..

ఇక ఈ వీడియో చూసిన మరి కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు మాత్రం అమ్మో చూస్తుంటేనే భయం వేస్తోంది.. ఆ పాము గాని కరిస్తే పరిస్థితి ఏంటని కామెంట్ చేయగా.. పాములు ఎక్కడ దూరి ఉంటాయో చెప్పలేం.. మహిళలు జడ వేసుకునే ముందు జాగ్రత్తగా చూసుకోవాలని కొంతమంది సూచిస్తూ కామెంట్లు పెడుతున్నారు. పాము పిల్ల చిన్నదైనప్పటికీ దాని విషయం ప్రాణాంతకం కావచ్చు అని నిపుణులు చెబుతున్నారు.

 
 
 
 
 

Also Read:  Samar Cobra Video: అత్యంత అరుదైన సమర్ కోబ్రా.. పడగ విప్పి ఏం చేస్తుందో చూడండి.. వీడియో!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

  

0
0
Report

Kondagattu: అంజన్న క్షేత్రానికి అరుదైన గౌరవం.. కేంద్ర ప్రభుత్వ దివ్య భారత్ జాబితాలో కొండగట్టు!

Hyderabad, Telangana:

Kondagattu Anjanna Temple News: తెలంగాణలోని అత్యంత శక్తివంతమైన పుణ్యక్షేత్రంగా పేరున జగిత్యాల జిల్లాలోని కొండగట్టు అంజన్న ఆలయానికి అరుదైన గౌరవం దక్కింది.. భారత ప్రభుత్వ మేధోమథన సంస్థ (Think Tank) నీతి ఆయోగ్‌ తాజాగా ప్రచురించిన దివ్యభారత్ పుస్తకంలో ఈ క్షేత్ర విశేషాలను అందించడం విశేషం. దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రాల జాబితాలో అంజన్న ఆలయానికి చోటు లభించడం రెండు తెలుగు రాష్ట్రాలకే గర్వకారణం.. ఈ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయాన్ని అత్యంత శక్తివంతమైనదిగా భావిస్తారు. ఇక్కడ కోరుకున్న కోరికలు నెరవేరడమే కాకుండా ఎలాంటి సమస్యలైనా తొలగిపోతాయని ఒక నమ్మకం..

దేశ విదేశాల నుంచి వచ్చే పర్యాటకులకు భారతదేశంలోని అపురూపమైన సాంస్కృతితో పాటు ఆధ్యాత్మిక, పర్యాటక ప్రాంతాల గురించి సమగ్ర అవగాహన కల్పించే లక్ష్యంతో నీతి అయోగ్ ఈ పుస్తకాన్ని రూపొందించింది. విభిన్న రాష్ట్రాల నుంచి ఎంపిక చేసిన కొన్ని ముఖ్యమైన ప్రాంతాలను మాత్రమే ఇందులో చేర్చారు.. ఈ ఘనతను మన కొండగట్టు ఆంజనేయ స్వామి దక్కించుకోవడం తెలంగాణ ఆధ్యాత్మిక వైభవానికి నిదర్శనం..

ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఎన్నో చారిత్రక, పురాతన ఆలయాలు ఉన్నప్పటికీ.. కేవలం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి క్షేత్రానికే ఈ ప్రతిష్టాత్మక పుస్తకంలో చోటుదక్కడ గర్వకారణం.. హనుమంతుడు సంజీవని పర్వతాన్ని తీసుకెళ్తున్న సమయంలో ఒక భాగం ఇక్కడ పడిందని పురాణ గాధలు చెబుతూ ఉంటాయి.. చుట్టూ కొండలతో పాటు ఆకుపచ్చని ప్రకృతి మధ్య కొలువైన ఈ ఆలయం పర్యాటక ప్రాంతంగా కూడా ఎంతో విశిష్టమైంది.. కేవలం తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా వేలాదిమంది భక్తులు ఇక్కడికి తరలివస్తు ఉంటారు.

నీతి అయోగ్ ప్రచురణలో చోటుదక్కడ వల్ల ఈ క్షేత్రం గురించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం లభిస్తుంది. దీనివల్ల భవిష్యత్తులో విదేశీ పర్యటకుల రాకలు పెరగడమే కాకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి ఆలయ అభివృద్ధికి మరిన్ని నిధులు వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కొండగట్టు ఆలయ అభివృద్ధి కోసం వందల కోట్ల రూపాయల కేటాయింపులు చేసిన నేపథ్యంలో.. కేంద్ర సంస్థ నుంచి లభించిన ఈ గుర్తింపు అంజన్న క్షేత్ర అభివృద్ధికి మరింత సహాయపడుతుందని ఆలయ కమిటీతో పాటు భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు..

Also Read:  Samar Cobra Video: అత్యంత అరుదైన సమర్ కోబ్రా.. పడగ విప్పి ఏం చేస్తుందో చూడండి.. వీడియో!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report

Karimnagar News: కరీంనగర్ పాస్‌పోర్ట్ సేవా కేంద్రం కీలక నిర్ణయం.. వెయిటింగ్ పీరియడ్‌కు చెక్!

Hyderabad, Telangana:

Karimnagar Latest News: ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాసులకు పాస్‌పోర్ట్ సేవల విషయంలో ఇకపై ఆలస్యం ఉండదు.. కరీంనగర్ ప్రాంతీయ పాస్‌పోర్ట్ సేవా కేంద్రం లో అపాయింట్మెంట్ స్లాట్ల సంఖ్య అధికారులు భారీగా పెంచారు. విదేశీ ప్రయాణాలతో పాటు ఉన్నత చదువుల కోసం పాస్పోర్ట్ దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుండడంతో వెయిటింగ్ పీరియడ్‌ను తగ్గించేందుకు ఈ కీలకమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. దీనివల్ల ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పాస్‌పోర్ట్ అప్లై చేసుకునే వారికి తొందరలోనే లభించబోతోంది. అంతేకాకుండా మరిన్ని ప్రత్యేకమైన సేవలను కూడా అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది.

ఇప్పటివరకు కరీంనగర్ కేంద్రంలో రోజుకు కేవలం 220 స్లాట్లు మాత్రమే అందుబాటులో ఉండేవి. దీనివల్ల అపాయింట్మెంట్ దొరకడానికి దరఖాస్తుదారులకు చాలా సమయం పట్టేది. తాజా నిర్ణయంతో ఈ సంఖ్య నాలుగు వందలకు పెంచారు. అంతేకాకుండా పాస్‌పోర్ట్‌లకు సంబంధించిన కొన్ని రకాల ప్రత్యేకమైన సేవలను కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు. అయితే, స్లాట్‌ల పెంపుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెళ్లడైనట్లు తెలుస్తోంది..

గతంలో ఉన్న 160 స్లాట్లకు 310కి పెంచగా.. అదనపు స్లాట్లతో పాటు ఇతర సేవలను కూడా మెరుగుపరిచినట్లు తెలుస్తోంది. పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ కోటాను కూడా 30కి పెంచినట్లు సమాచారం.. సాధారణంగా కరీంనగర్ కేంద్రంలో అపాయింట్మెంట్ లభించాలంటే దాదాపు 8 నుంచి 12 రోజులపాటు సమయం పట్టేది.. స్లాట్‌ల సంఖ్య దాదాపు రెట్టింపు కావడంతో.. ఇకపై దరఖాస్తు చేసుకున్న నాలుగు రోజుల్లోపే అపాయింట్మెంట్ లభించే అవకాశం ఉంది. దీనివల్ల అత్యావసరంగా విదేశాలకు వెళ్లాల్సిన వారికి, విద్యార్థులకు ఎంతగానో ఊరట లభించబోతోంది.

ఈ పెంచిన స్లాట్‌ల విధానంతో పాటు మెరుగుపరిచిన సేవలు మే 4వ తేదీ నుంచి పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాబోతున్నట్లు అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ తేదీ నుంచి దరఖాస్తులు ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకునేటప్పుడు అదనపు కోటాను కూడా అందుబాటులో ఉంచబోతున్నారు. పాస్పోర్టుకు సంబంధించిన సేవలలో పారదర్శకతను పెంచడంతో పాటు ప్రజలకు వేగవంతమైన సేవలను అందించడమే లక్ష్యంగా ఈ మార్పులు చేసినట్లు తెలుస్తోంది..స్లాట్ల పెరుగుదలతో కరీంనగర్ పాస్‌పోర్ట్ కేంద్రంపై ఒత్తిడి తగ్గడమే కాకుండా ఉమ్మడి జిల్లా పరిధిలోని ప్రజలకు వారి సొంత ప్రాంతాల్లోనే ఎంతో సులభంగా పాస్‌పోర్ట్ పనులు అయిపోతాయి..

Also Read:  Samar Cobra Video: అత్యంత అరుదైన సమర్ కోబ్రా.. పడగ విప్పి ఏం చేస్తుందో చూడండి.. వీడియో!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report
Advertisement

King Cobra Video: స్టౌపై గిన్నెలో తిష్టవేసిన భారీ కింగ్ కోబ్రా.. వీడియో చూస్తే వణికిపోవాల్సిందే!

Hyderabad, Telangana:

 King Cobra Video Watch: సాధారణంగా వంటగదిలోకి వెళ్తే గరిటల చప్పుడు తో పాటు వంటకాల సువాసనలు ఆస్వాదిస్తూ ఉంటాం.. కానీ ఆ ఇంట్లో మాత్రం ఊహించని భయంకర దృశ్యం ఎదురైంది. వంట రూమ్ లోకి వెళ్లిన ఇంటి యజమాని ఒక్కసారిగా షాక్కు గురైయ్యాడు. అక్కడ స్టవ్ మీద ఉన్న ఒక బౌల్లో ఏకంగా ఒక భారీ కింగ్ కోబ్రా పడగ విప్పి కూర్చొని ఉంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ఇప్పుడు ఈ వీడియో చూసిన వారంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోతూ ఉన్నారు..

వైరల్ అవుతున్న వీడియో వివరాల్లోకి వెళ్తే.. ఒక నివాస ఇంట్లోని వంట గదిలో గ్యాస్ స్టవ్ పైన బౌల్ లోపల ఒక కింగ్ కోబ్రా చుట్టలు చుట్టుకొని కూర్చొని ఉంది. ఆ ప్రమాదకరమైన పాము కేవలం అక్కడ ఉండడమే కాకుండా.. తన పడకను పైకి లేపి అటు ఇటు గమనిస్తూ అత్యంత భయంకరంగా కనిపించడం వీడియోలో చూడొచ్చు. చల్లదనం కోసమో లేదా ఆహారం కోసమో ఆ పాము అక్కడి వచ్చి ఉంటుందని భావిస్తూ ఉన్నారు. 

ఇంటి యజమాని వంట గదిలోకి వెళ్లి ఆ దృశ్యాన్ని చూసి మొదట ఆశ్చర్యానికి గురయ్యాడు. అప్రమత్తంగా పామును గమనిస్తుండగా.. అది మరింత ఆగ్రహానికి గురైనట్లు ఈ వీడియోలో మీరు చూడొచ్చు. యజమాని దాని సమీపానికి వెళ్ళగానే ఆ ప్రమాదకరమైన కింగ్ కోబ్రా ఒక్కసారిగా ముందుకు ముందుకు వస్తూ కాటేసే ప్రయత్నం చేసింది. పడక విప్పి బుసలు కొడుతూ ఆ పాము నానా హంగామా సృష్టించింది.. దాని ఆగ్రహం చూసి యజమాని ఆ ప్రమాదకరమైన పాముకు దూరంగా ఉన్నాడు..

 
 
 
 
 

Also Read:  Samar Cobra Video: అత్యంత అరుదైన సమర్ కోబ్రా.. పడగ విప్పి ఏం చేస్తుందో చూడండి.. వీడియో!

ఈ భయంకరమైన దృశ్యాన్ని ఎవరు కెమెరాలు చిత్రీకరించి సోషల్ మీడియాలో షేర్ చేశారు. అంతే ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన సోషల్ మీడియా వినియోగదారులు వంటగదిలోకి వెళ్లేటప్పుడు కూడా అప్రమత్తంగా ఉండాలని కామెంట్లు పెడుతున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో లేదా అటవీ ప్రాంతాలకు దగ్గరగా ఉండేవారు వస్తువులను ముట్టుకునే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఏది ఏమైనా ప్రస్తుతం ఈ భయంకరమైన పాము కు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో హల్చల్ చేస్తోంది.

Also Read:  Samar Cobra Video: అత్యంత అరుదైన సమర్ కోబ్రా.. పడగ విప్పి ఏం చేస్తుందో చూడండి.. వీడియో!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

  

0
0
Report

Telangana: సర్పంచ్ భార్య.. సంతకం భర్తది! సిరిసిల్ల జిల్లాలో వింత ఘటన..

Sircilla, Telangana:

Rajanna Sircilla News: రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలంలో ఒక వింతైన ఘటన వెలుగులోకి వచ్చింది. మహిళా సాధికారత కోసం ప్రభుత్వం రిజర్వేషన్లు కల్పించి మహిళలను పదవుల్లో కూర్చోబెడుతుంటే.. క్షేత్రస్థాయిలో మాత్రం భర్త పాలన కొనసాగుతోందని విమర్శలకు ఈ ఘటన నిదర్శనంగా నిలుస్తోంది. అధికార రిజిస్టర్లు సర్పంచ్‌కు బదులుగా ఆమె భర్త సంతకం చేయడం ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. 

మంగళవారం మండలంలోని రంగపేట గ్రామ అంగన్వాడీ కేంద్రంలో ఆఫ్టర్ కేర్ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు.  ఈ కార్యక్రమానికి గ్రామ ప్రతినిధులతో పాటు అధికారులు హాజరయ్యారు. ఈ కార్యక్రమం విజయవంతంగా ముగిసిన అనంతరం.. నిబంధనల ప్రచారం విచ్చేసిన ఆధితులు వివరాలతో పాటు వారి అభిప్రాయాలను అంగన్వాడి అధికారిక రిజిస్టర్లు నమోదు చేయాల్సి ఉంటుంది. అయితే ఈ సమయంలోనే అసలు విషయం బయటపడింది..

అతిథుల సంతకాలు సేకరిస్తున్న క్రమంలో ప్రోటోకాల్ ప్రకారం.. ముందుగా గ్రామ సర్పంచ్ సంతకం చేయాల్సి ఉంటుంది.. అయితే, అక్కడ ఉన్న సర్పంచ్ భాగ్యలక్ష్మి కంటే ముందే ఆమె భర్త పరశురాములు చొరవ తీసుకున్నారు.. అధికారిక రిజిస్టర్లు సర్పంచ్ సంతకం చేయాల్సిన చోట ఆయన సంతకం చేసి.. పక్కన బ్రాకెట్లో సర్పంచ్ అని రాశారు.. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే భర్త సంతకం చేసిన తర్వాతే సర్పంచ్ భార్య దాని కింద సంతకం చేశారు. ఇది చూసిన అక్కడి సిబ్బందితో పాటు అతిధులు ఒక్కసారిగా ఆశ్చర్య పోయారట..

ప్రభుత్వ నిబంధనలు ప్రకారం ఏ అధికారిక పత్రం మీదైన సర్పంచ్ మాత్రమే సంతకం చేయాల్సి ఉంటుంది.. భర్తకు ఎటువంటి అధికారిక హోదా లేకపోయినప్పటికీ.. ఏకంగా రిజిస్టర్‌లోని సంతకం చేయడంపై అక్కడి అధికారులతో పాటు విపక్షాలు మండిపడుతున్నాయి. ప్రభుత్వ రికార్డుల్లో అనధికార వ్యక్తులు సంతకం చేయడం చట్ట విరుద్ధమని మేధావులు సైతం పేర్కొంటున్నారు. మహిళా సర్పంచులు ఉన్నచోట వారి భర్తలు షాడో సర్పంచులుగా వ్యవహరిస్తున్నారని చెప్పడానికి ఇదొక నిదర్శనమని గ్రామస్తులు గుసగుసలాడుతున్నారు..

Also Read:  Samar Cobra Video: అత్యంత అరుదైన సమర్ కోబ్రా.. పడగ విప్పి ఏం చేస్తుందో చూడండి.. వీడియో!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Python Video: కాలువలో కొండచిలువ.. ప్రాణాలకు తెగించి బయటకు లాక్కొచ్చిన వృద్ధుడు! వీడియో..

Hyderabad, Telangana:

 Old Man Catching Python Viral Video Watch: సాధారణంగా పాము కనిపిస్తేనే ఆమడ దూరం పరిగెత్తే వారు ఎందరో ఉంటారు. అలాంటిది ఏకంగా ఒక భారీ కొండచిలువను అది కూడా ఒక వృద్ధుడు అత్యంత నిస్సహాయ స్థితిలో భయం లేకుండా పట్టుకోవడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అంతేకాకుండా ఆ వ్యక్తి ఒక పెద్ద కాలువలో నుంచి ఆ పామును పట్టుకొని రక్షించేందుకు బయటకు తీసుకురావడం ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ గా మారింది. దీనికి సంబంధించిన వీడియో చూసిన వారంతా ఆశ్చర్యానికి గురవుతున్నారు.

వృద్ధుడు కొండచిలువను ఎక్కడ పట్టాడు?
వైరల్ అవుతున్న వీడియో వివరాల్లోకి వెళ్తే.. ఒక లోతైన నీటి కాలువలు భారీ కొండచిలువ ఉన్నట్లు స్థానికులు గుర్తించారు.. అయితే దానిని పట్టుకోవడానికి ఎవరు సహించని తరుణంలో.. ఒక వృద్ధుడు రంగంలోకి దిగాడు. ఆ వృద్ధుడు ఆ కాలువలోకి దిగి ఆ భారీ సర్పాన్ని పట్టుకొని పైకి తీసుకొస్తున్న తీరును మీరు ఈ వీడియోలో కళ్ళకు కట్టినట్లు చూడొచ్చు.. సాధారణంగా వృద్ధులు ఇలాంటి పనులు చేసేందుకు వెనకాడుతూ ఉంటారు. 

ఆ వృద్ధుడు చేసిన పనికి సోషల్ మీడియా వినియోగదారులంతా ఆశ్చర్యపోతున్నారు. ఆ వృద్ధుడు తన ఎడమ చేతిలో కొండచిలువ తలభాగం కదలకుండా బలంగా పట్టుకున్నాడు. మరో చేతిలో తోక భాగాన్ని పట్టుకొని ఆ భారీ జీవికి ఎలాంటి హాని కలిగించకుండా ఎంతో సులభంగా పట్టుకొని పనికి తీసుకురావడం మీరు చూడొచ్చు. వయస్సు పై పడినప్పటికీ ఆయన ఎంతో చురుకుగా కాలువ లోపలి నుంచి గట్టుపైకి ఆ కొండచిలువను పట్టుకొని తీసుకురావడం విశేషం.. సాధారణంగా ఇలాంటి స్థితిలో ఉన్నప్పుడు చాలామంది ఇంట్లో కదల లేకుండా మంచానికే పరిమితం అవుతారు. కానీ ఈ తాత మాత్రం అత్యంత ప్రమాదకరమైన కొండచిలువను రక్షిస్తున్న తీరు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

 
 
 
 
 

ఈ వీడియో ఎవరో మొబైల్ ఫోన్‌లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అధి కాస్త కొన్ని గంటల్లోనే లక్షలాది వ్యూస్ సంపాదించుకుంది. వయస్సు కేవలం అంకె మాత్రమే.. ధైర్యం ఉంటే ఏదైనా సాధ్యమే అంటూ సోషల్ మీడియా వినియోగదారులు కామెంట్లు చేస్తూ వస్తున్నారు. ఇక మరి కొంతమంది అంత పెద్ద పాముతో అప్రమత్తంగా ఉండాలని.. ఇది ప్రాణాలకే ప్రమాదం కావచ్చుని సూచిస్తున్నారు. ఏది ఏమైనా ఇప్పుడు ఈ వీడియో మాత్రం సోషల్ మీడియా వినియోగదారులను ఆకట్టుకుంటుంది..

Also Read:  Samar Cobra Video: అత్యంత అరుదైన సమర్ కోబ్రా.. పడగ విప్పి ఏం చేస్తుందో చూడండి.. వీడియో!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

  

0
0
Report
Advertisement

Lakshmi Narayana Rajayoga: శుక్ర, బుధుల కలయికతో లక్ష్మీనారాయణ యోగం.. ఆ 4 రాశుల వారికి తిరుగుండదు ఇక!

Hyderabad, Telangana:

Lakshmi Narayana Rajayoga Effect On Zodiac: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. అన్ని గ్రహాలు కదలికలు చేయడం కారణంగా కొన్ని రాశుల వారిపై ప్రత్యేకమైన ప్రభావం పడుతూ ఉంటుంది. అది జీవితంలో ఎన్నో రకాల మార్పులకు దారి తీయవచ్చు. ముఖ్యంగా కొన్ని రకాల శక్తివంతమైన రాజయోగాలు ఏర్పడడం వల్ల దాని ప్రభావంతో కొన్ని రాశుల వారు రాత్రికి రాత్రే కోటీశ్వరులయ్యే యోగం కూడా ఉంటుంది. లక్ష్మీనారాయణ రాజయోగం వంటి రాజయోగాల ప్రభావం వల్ల ఆయా రాశుల వారికి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం తెలివితేటలు వ్యాపారానికి కారకుడైన శుక్రుడితో పాటు బుధుడి కలయిక కారణంగా ఈ యోగం ఏర్పడబోతోంది. దీని ఫలితంగా నాలుగు  రాశుల వారికి అదృష్టం తిరిగి వస్తుంది. అలాగే ఆర్థిక సమస్యలు కూడా ఎంతో సులభంగా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి.

మే 14వ తేదీన శుక్రుడు మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు.. అలాగే మే 29న బుధుడు కూడా ఈ రాశిలోకి సంచారం చేస్తాడు. దీని ఫలితంగా ఈ శుభయోగం ఏర్పడబోతోంది. ఈ యోగంతో నాలుగు రాశుల వారికి సంపాదన విపరీతంగా లభిస్తుంది. ముఖ్యంగా స్త్రీ, పురుషులకు ఈ సమయంలో అదృష్టం తిరిగి వస్తుంది. లక్ష్మీనారాయణ రాజయోగం ప్రభావం తో వృత్తిపరంగా అద్భుతమైన పురోగతి కూడా లభించే అవకాశాలు ఉన్నాయి. 

ఈ రాజయోగం వల్ల ఎవరికి లాభం?
ధనుస్సు రాశి
లక్ష్మీనారాయణ రాజయోగ ప్రభావంతో అదృష్టం విపరీతంగా పెరుగుతుంది. ముఖ్యంగా కొత్త ఉద్యోగాలు కూడా లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. పాత ఉద్యోగాల్లో జీతాలు విపరీతంగా పెరుగుతాయి. వ్యాపారాలు చేస్తున్న వారికి ఈ సమయంలో భారీ లాభాలు కలిగే అవకాశాలున్నాయి. ముఖ్యంగా చాలా కాలంగా పెండింగ్లో ఉన్న కేసులు కూడా ఈ సమయంలో సులభంగా పరిష్కారమవుతాయి. అంతేకాకుండా విదేశాలకు వెళ్లాలనుకునే వ్యక్తులకు ఈ సమయంలో అద్భుతమైన అవకాశాలు కూడా లభించుతాయి. కాబట్టి ఆందోళన చెందకుండా కెరీర్ పై ప్రత్యేకమైన శ్రద్ధ వహించడం చాలా మంచిది. 

మిధున రాశి 
మిథున రాశిలో జన్మించిన వ్యక్తులకు ఈ సమయంలో ఉత్తమ ఫలితాలు కలుగుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఉద్యోగాల్లో గొప్ప అభివృద్ధి లభించడమే కాకుండా.. వ్యాపారాలు చేస్తున్న వారికి విశేషమైన ప్రయోజనాలు కలిగే అవకాశాలున్నాయి. నిలిచిపోయిన పనులు కూడా ఇప్పుడు సులభంగా పూర్తవుతాయి. అంతేకాకుండా డబ్బులు సమస్యలు కూడా ఎంతో సులభంగా తొలగిపోయి అవకాశాలు కనిపిస్తున్నాయి. వీరికి ఈ సమయంలో అనేక రకాల దీర్ఘకాలిక సమస్యలు దూరం అవుతాయి..

కన్య రాశి 
కన్యారాశిలో జన్మించిన వ్యక్తులకు లక్ష్మీనారాయణ రాజయోగం కారణంగా ఉద్యోగాల్లో అద్భుతమైన పురోగతి కూడా లభించబోతోంది. వీరికి కొత్త బాధ్యతలు లభించడమే కాకుండా బాస్ మిమ్మల్ని అద్భుతంగా నమ్మి ప్రమోషన్స్ ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. పాత పనుల్లో ఏర్పడిన జాప్యం ఇప్పుడు పూర్తిగా తొలగిపోబోతోంది. దీని కారణంగా ఆపనుల్లో కూడా విజయాలు సాధించగలుగుతారు. అలాగే వ్యాపార రంగాల్లో ఉన్న వ్యక్తులకు వ్యాపారం విపరీతంగా పెరుగుతుంది. ఈ సమయంలో భారీ అభివృద్ధి కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా మానసిక సమస్యల నుంచి ఎంతో సులభంగా ఉపశమనం కలుగుతుంది. 

తులారాశి 
తులా రాశిలో జన్మించిన వ్యక్తులకు ఎంతో శక్తివంతమైన ఈ లక్ష్మీనారాయణ రాజయోగం కారణంగా అదృష్టం కలిసి రాబోతోంది. వ్యాపారాల్లో అద్భుతమైన విజయాలు కూడా కలుగుతాయి. కొత్త ఒప్పందా కుదుర్చుకోవడమే కాకుండా.. విపరీతమైన పెట్టుబడులు పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే డబ్బు గురించి ఆలోచించే వారికి కూడా ఈ సమయం చాలా అద్భుతంగా ఉండబోతోంది. ముఖ్యంగా కొత్త ఆదాయ మార్గాలు లభించి సంపాదన కూడా విపరీతంగా పెరుగుతుంది. అనుకున్న ధన లాభాలు పొంది.. ఊహించని విజయాలు సాధించగలుగుతారు..

NOTE: ఇది కేవలం జ్యోతిష్య నిపుణుల సమాచారం, నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది..

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report

Dharmapuri Temple: ధర్మపురి క్షేత్ర పునర్నిర్మాణానికి ప్రజలు సహకరించాలి.. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పిలుపు!

Hyderabad, Telangana:

Dharmapuri Temple Latest News: దక్షిణ కాశీగా పేరుగాంచిన ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ సర్వతోముఖాభివృద్ధికి ప్రజలు, భక్తులు పూర్తిస్థాయిలో సహకరించాలని రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావుతో పాటు జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ తో కలిసి ఆలయాన్ని సందర్శించారు. స్వామివారికి ప్రత్యేకమైన పూజలు నిర్వహించిన అనంతరం.. ఆలయ మాస్టర్ ప్లాన్ పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించినట్లు సమాచారం. అంతేకాకుండా అధికారులతో గుడికి సంబంధించిన డెవలప్మెంట్ అంశాలను కూడా చర్చించినట్లు తెలుస్తోంది.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. గత ప్రభుత్వాలు ధర్మపురి ఆలయ అభివృద్ధిని పూర్తిగా విస్మరించాయని విమర్శించారు. ఎంతో చరిత్ర కలిగిన ఈ ఆలయ అభివృద్ధి అప్పట్లో కేవలం మాటలకే పరిమితం చేశారని.. సరైన నిధులు కేటాయించకుండా భక్తుల సౌకర్యాలను గాలికి వదిలేసారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా పోయిన ప్రభుత్వాన్ని ధర్మపురి ఆలయ అభివృద్ధికి ఏమాత్రం సహాయం చేయలేవని అన్నారు.. ధర్మపురి క్షేత్ర వైభవాన్ని చాటి చెప్పేలా.. భక్తులకు మెరుగైన వసతులు కల్పించడమే ప్రస్తుత ప్రభుత్వ ధ్యేయమని మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం ఆధ్యాత్మిక క్షేత్రాల అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు. ముఖ్యంగా 2027 గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకొని.  అప్పటికి వచ్చే లక్షలాదిమంది భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించినట్లు మంత్రి అడ్డూరి లక్ష్మణ్ తెలిపారు..

భక్తులకు గంటల తరబడి వేచి ఉండకుండా ఆధునిక క్యూలైన్ కాంప్లెక్స్ నిర్మాణాలను చేపడతామని మాస్టర్ ప్లాన్లు పేర్కొన్నారు. అంతేకాకుండా స్నాన గాట్లతో పాటు ప్రత్యేకమైన భద్రత, పరిశుభ్రతకు పెద్దపీట వెయ్యబోతున్నట్లు కూడా ఆ ప్లాన్‌లో వివరించారు. దీంతోపాటు ఆలయానికి వచ్చే రహదారుల విస్తరణతో పాటు పార్కింగ్ సదుపాయాలు, దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం తక్కువ ధరకే వసతి కల్పించబోతున్నట్లు కూడా తెలిపారు. 

Also Read: Chandrababu: విశాఖ విశ్వనగరం అన్‌స్టాపబుల్.. ఎవరూ ఆపలేరు: చంద్రబాబు

దేవాదాయ శాఖ కమిషనర్‌తో పాటు కలెక్టర్ తో సమీక్ష నిర్వహించిన మంత్రి.. మాస్టర్ ప్లాన్ పనుల్లో నాణ్యత పాటించాలని సూచించారు. నిధుల కోరత లేకుండా చూస్తామని.. గడువులోగా పనులు పూర్తి చేయాలని ఆదేశాలు కూడా జారీ చేశారు. భక్తుల మనోభావాలకు అనుగుణంగా.  ఆగమన శాస్త్రం నిబంధనలు పాటిస్తూనే అభివృద్ధి పనులు చేపట్టాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రజా ప్రతినిధులతో పాటు ఆలయ అర్చకులు, అధికారులు పాల్గొన్నారు..

Also Read: Chandrababu: విశాఖ విశ్వనగరం అన్‌స్టాపబుల్.. ఎవరూ ఆపలేరు: చంద్రబాబు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report

Singer Mangli: యూట్యూబ్‌ చానళ్లపై మంగ్లీ ఫిర్యాదు! మేనేజర్‌ తీవ్ర ఆరోపణలు

Hyderabad, Telangana:

Mangli Micro Finance Scam: కొన్ని వారాలుగా మైక్రో ఫైనాన్స్‌ వ్యవహారంలో తీవ్ర ఆరోపణలు, వివాదాలు ప్రముఖ గాయని మంగ్లీ చుట్టూ తిరుగుతున్నాయి. ఈ వ్యవహారంలో తన ప్రమేయం లేదని.. జరుగుతున్న ప్రచారం అసత్యం.. దురుద్దేశంపూర్వకంగా తనపై ఆరోపణలు చేస్తున్నారని ఇప్పటికే మంగ్లీ కొట్టిపారేశారు. పోలీస్‌ కమిషనర్‌, డీజీపీని కలిసి నేరుగా ఫిర్యాదు చేశారు. తన సోషల్‌ మీడియా వేదికగా కూడా ప్రకటనలు చేస్తున్నారు. అయినా కూడా యూట్యూబ్‌ చానళ్లలో తనపై ప్రచారం జరుగుతూనే ఉంది. దీంతో యూట్యూబ్‌ చానళ్లపై ఆమె వ్యక్తిగత కార్యదర్శి సైబర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Also Read: AP Summer Camps: విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్‌.. త్వరలో 1,389 సమ్మర్‌ క్యాంపులు

హైదరాబాద్ సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు చేసిన అనంతరం హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో వ్యక్తిగత మేనేజర్ మేఘ్ రాజు కీలక విషయాలు వెల్లడించారు. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ సింగర్ మంగ్లీని టార్గెట్ చేస్తూ అసభ్యకర పోస్టులు పెడుతున్నారని ఆరోపించారు. అసభ్యకర పోస్టులు పెడుతున్న వారిపై  చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కావాలనే మంగ్లీని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారని మండిపడ్డారు.

Also Read: Chandrababu: విశాఖ విశ్వనగరం అన్‌స్టాపబుల్.. ఎవరూ ఆపలేరు: చంద్రబాబు

మంగ్లీపై మధు నాయక్, సుబ్బు, తిరుమలేష్, హిమకాంత్ రెడ్డిలతో పాటు  కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కావాలనే బురద జల్లుతూ అసత్యపు ప్రచారాలు చేస్తున్నారని వ్యక్తిగత మేనేజర్ మేఘ్ రాజు తెలిపారు. దీనిని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. మంగ్లీతో పాటు కుటుంబాన్ని ఇందులోకి లాగి ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు. మంగ్లీ కూడా పలు సందర్భాల్లో స్పష్టంగా బాధితులకు అండగా ఉంటానని హామీ ఇచ్చిందని వ్యక్తిగత మేనేజర్ మేఘ్ రాజు గుర్తు చేశారు. 

గాయని మంగ్లీపై ఆరోపణలు గుప్పించిన హిమకాంత్ రెడ్డి ప్రస్తుతం ఎక్కడ ఉన్నాడని వ్యక్తిగత మేనేజర్ మేఘ్ రాజు ప్రశ్నించారు. మంగ్లీపై కావాలనే గ్లోబల్ ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగ్లీ ఎక్కడ ఎండర్స్మెంట్ చేయలేదని తెలిపారు. త్వరలో నిజనిజాలు బహిర్గతం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కేసులో మంగ్లీ ప్రమేయం ఉందా లేదా అనేదానిపై విచారణ కొనసాగుతోందని వ్యక్తిగత మేనేజర్ మేఘ్ రాజు చెప్పారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report
Advertisement
Advertisement
Back to top