లడ్డూ అపవిత్రం: హిందూ సంఘాలు తిరుమలలో హోమం నిర్వహించాయి!
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Bestune Xiaoma Mini EV Price In India: సాధారణంగా ఎలక్ట్రిక్ కారు అనగానే లక్షల ధర, తక్కువ రేంజ్ (మైలేజ్) గుర్తుకు వస్తాయి. కానీ చైనాకు చెందిన బెస్ట్ట్యూన్ (Bestune) కంపెనీ రూపొందించిన షావోమా (Xiaoma) మినీ ఎలక్ట్రిక్ కారు ఈ అంచనాలను తలకిందులు చేస్తోంది. అత్యంత తక్కువ ధరకే కళ్లు చెదిరే మైలేజీని అందిస్తూ ఆటోమొబైల్ రంగాన్ని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
1,200 కిలోమీటర్ల రేంజ్!
ఈ కారుకు చెందిన అతిపెద్ద బలం దాని మైలేజ్. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 1,200 కిలోమీటర్లు ప్రయాణించవచ్చని కంపెనీ పేర్కొంటోంది. దీనికి ప్రధాన కారణాలు చాలా ఉన్నాయి. రేంజ్ ఎక్స్టెండర్ టెక్నాలజీ ద్వారా బ్యాటరీ ఛార్జింగ్ అయిపోయినా కూడా లోపల ఉండే చిన్న ఇంజిన్ సహాయంతో కారు మరింత దూరం ప్రయాణించేలా చేస్తుంది. 800V ఆర్కిటెక్చర్తో ఇది బ్యాటరీని చాలా వేగంగా ఛార్జ్ చేయడానికి సహకరిస్తుంది. LFP బ్యాటరీ సహాయంతో భద్రత, మన్నిక కోసం లిథియం ఐరన్ ఫాస్ఫేట్ బ్యాటరీని వినియోగించారు.
ధర ఎంత? మార్కెట్లోకి ఎప్పుడంటే?
మధ్యతరగతి ప్రజలే లక్ష్యంగా వస్తున్న ఈ కారు ధర భారత్లో సుమారు రూ. 3.5 లక్షల నుండి రూ. 6 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది. ఇది 2026 ఏడాది చివరి నాటికి భారత రోడ్లపై సందడి చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
డిజైన్, ఫీచర్లు..
చూడటానికి బొమ్మ కారులా ముద్దుగా ఉండే ఈ కారు, ఫీచర్ల విషయంలో మాత్రం బాహుబలిలా ఉంటుంది. చదరపు హెడ్ల్యాంప్లు, డ్యూయల్-టోన్ రంగులు, ఏరోడైనమిక్ చక్రాలతో ఎక్స్టీరియర్ ఆకర్షణీయంగా ఉంటుంది. అలాగే ఇంటీరియర్లో డాష్బోర్డ్ మధ్యలో 7 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ప్రీమియం లుక్ ఇచ్చే డ్యూయల్-టోన్ థీమ్ ఉన్నాయి. చిన్న కారు అయినప్పటికీ డ్రైవర్ కోసం ఎయిర్ బ్యాగ్ సౌకర్యం కల్పించారు. ఈ కారు కేవలం 3 మీటర్ల పొడవు ఉండటం వల్ల నగరాల్లో పార్కింగ్ సమస్యలు ఉండవు.
భారత మార్కెట్లోకి వస్తే, ఇది ఇప్పటికే ఉన్న టాటా టియాగో EV, MG కామెట్ EV వంటి కార్లకు గట్టి పోటీని ఇస్తుంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించాలనుకునే వారికి, ముఖ్యంగా సిటీలో తిరిగే చిన్న కుటుంబాలకు ఇది ఒక అద్భుతమైన ఆప్షన్గా మారనుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Liquor bottles found near police quarters in Tirumala: తిరుమలలో ప్రస్తుతం వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతున్నాయి. జవవరి 8 వరకు కూడా ఇదే విధంగా భక్తులకు ఉత్తర ద్వారం గుండా టీటీడీ దర్శనాలు కల్పించనుంది. ఈ క్రమంలో తిరుమలలో ప్రస్తుతం భారీగా భక్తజన సంద్రంగా మారిపోయింది. ఎక్కడ చూసిన కూడా జనాలే కన్పిస్తున్నారు. వసతి ప్రదేశాలన్ని నిండిపోయాయి. వైకుంఠ దర్శనాలు కూడా ఒక రోజు పడుతుంది. మొత్తంగా తిరుమలలో వైకుంఠ దర్శనాల వేళ పోలీసుల క్వార్టర్స్ ఖాళీ ప్రదేశంలో పదుల సంఖ్యలో ఖాళీ మద్యం బాటిళ్లు కన్పిస్తున్నాయి.
తిరుమలలో మద్యం బాటిళ్లు కలకలం.
పోలీసు అతిథిగృహం ఎదుట పదుల సంఖ్యలో మద్యం బాటిళ్లు కనిపించడంతో నిఘా లోపాలపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అలిపిరి తనిఖీ కేంద్రం దాటుకొని నిత్యం మద్యం తిరుమలకు చేరుతోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.#Tirumala #TTD #Liquor pic.twitter.com/LlEhZyGzeQ
— greatandhra (@greatandhranews) January 4, 2026
దీనిపై దుమారం రాజుకుంది. అలిపిరి చెక్ పోస్ట్ ను దాటుకుని లిక్కర్ బాటిళ్లు పైవరకు ఎలా వచ్చాయంటూ అపోసిషన్ పార్టీ భగ్గుమంటుంది. తిరుమల పవిత్రతను కాపాడటమంటే ఇదేనా అంటూ ఫైర్ అవుతుంది. మొత్తంగా తిరుమలలో ప్రస్తుతం పోలీసు క్వార్టర్స్ వద్ద మద్యం బాటిళ్లు బైటపడటంపై భక్తులుకూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
టీటీడీ విజిలెన్స్ అధికారులు ఏంచేస్తున్నారంటూ తీవ్రస్థాయిలో ఫైర్ అవుతున్నారు. మొత్తంగా వైకుంఠ దర్శనాల వేళ ఈ ఘటన వివాదాస్పదంగా మారింది.
Read more: Tirumala: తిరుమల శ్రీవారికి ఊహించని విరాళం.. ఆ ఒక్క భక్తుడు ఇచ్చిన మొత్తం ఎంతో తెలుసా?
మరోవైపు ఇప్పటికే తిరుపతిలోని గోవింద రాజస్వామి ఆలయం గోపురం మీద ఎక్కి మందుబాబు హల్ చల్ చేసిన విషయం తెలిసిందే. అతను తనకు మద్యం కావాలని డిమాండ్ చేశాడు. గంటల పాటు శ్రమించి అతడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన మరువక ముందే తిరుమలలో మద్యం బాటిళ్లు బైటపడటం ఆందోళన కరంగా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Bhogapuram Airport Trail Run: ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నం, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి సిద్ధమవుతోంది. విమానాశ్రయ నిర్మాణంలో అత్యంత కీలకమైన ఘట్టం 'ట్రయల్ రన్' (సురక్షిత ల్యాండింగ్) శనివారం విజయవంతంగా పూర్తయింది.
తొలి విమానం ల్యాండింగ్
ఢిల్లీ నుండి బయలుదేరిన ఎయిర్ ఇండియా వ్యాలిడేషన్ ఫ్లైట్ భోగాపురం రన్వేపై సురక్షితంగా ల్యాండ్ అయింది. దీని ప్రత్యేకత ఏమిటంటే.. ఈ తొలి విమానంలోనే కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రయాణించి భోగాపురం చేరుకోవడం విశేషం. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా భారీ విమానాలు కూడా ల్యాండ్ అయ్యేలా డిజైన్ చేసిన ఈ రన్వే భద్రతా ప్రమాణాలపై అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు.
ప్రాజెక్ట్ ముఖ్యాంశాలు
భోగాపురం విమానాశ్రయం కేవలం ప్రయాణ కేంద్రం మాత్రమే కాదు, ఈ ప్రాంత ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చే కీలక ప్రాజెక్ట్.
| అంశం | వివరాలు |
| మొత్తం విస్తీర్ణం | సుమారు 2,203 ఎకరాలు |
| అంచనా వ్యయం | రూ. 4,750 కోట్లు |
| తొలి విడత సామర్థ్యం | ఏడాదికి 60 లక్షల మంది ప్రయాణికులు |
| ప్రారంభ లక్ష్యం | 2026 జూన్ నాటికి |
ఉత్తరాంధ్రకు చేకూరే ప్రయోజనాలు
ఈ అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి వస్తే విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాలతో పాటు పొరుగు రాష్ట్రమైన ఒడిశాకు కూడా భారీ ప్రయోజనం కలుగుతుంది. విదేశీ పెట్టుబడులు పెరగడంతో పాటు పర్యాటక రంగం కొత్త పుంతలు తొక్కుతుంది.
ఉపాధి అవకాశాలు..
వేల సంఖ్యలో ప్రత్యక్షంగా, పరోక్షంగా స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. భోగాపురం ఎయిర్పోర్ట్ ద్వారా ప్రస్తుతం విశాఖ ఎయిర్పోర్ట్పై ఉన్న విమాన ప్రయాణ భారం తగ్గుతుంది.
ట్రయల్ రన్ విజయవంతం కావడంతో, రానున్న రోజుల్లో మరిన్ని సాంకేతిక పరీక్షలు (Technical Trials) నిర్వహించనున్నారు. జూన్ నాటికి 100 శాతం పనులు పూర్తి చేసి, ప్రజలకు విమాన సేవలను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం, నిర్మాణ సంస్థ శరవేగంగా పని చేస్తున్నాయి.
Also Read: Mumbai Affair Attack: న్యూఇయర్ వేళ ముంబై ఉలిక్కిపడే ఘటన..లవర్ ప్రైవేట్ పార్ట్ కట్ చేసిన వివాహిత!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Budhaditya Yoga Effect On Zodiac 2025: చూస్తుండగానే జనవరి మొదటి వారం కూడా ప్రారంభమైంది. అయితే, ఈ వారం చాలా శుభ్రమైనదని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ వారంలో బుధాదిత్య రాజయోగం ఏర్పడబోతోంది. ధనస్సు రాశిలో సూర్యుడు, బుధుడి సంయోగం కారణంగానే ఈ శక్తివంతమైన బుధాదిత్య రాజయోగం ఏర్పడుతుందని వారు చెబుతున్నారు. ఈ యోగం కారణంగా ఐదు రాశుల వారు చాలా లాభపడతారని, అంతేకాకుండా అదృష్టాన్ని పొందగలుగుతారని వారు అంటున్నారు. అయితే బుధాదిత్య రాజయోగం కారణంగా అత్యద్భుతమైన విజయం సాధించబోయే రాశులేవో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఈ రాశిలవారికి బంపర్ లాభాలు:
వృషభ రాశి
2026 మొదటి వారం వృషభ రాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా ప్రేమ జీవితం పరంగా విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే ఈ సమయం చాలా శృంగార భరితంగా మారుతుంది. ముఖ్యంగా శుక్రుడి బుధుడి కలయిక కారణంగా వ్యాపారాలు కూడా చాలా వరకు లాభసాటిగా మారుతాయి అలాగే ఇప్పటికి ప్రేమ సంబంధాలు కొనసాగిస్తున్న వారికి పెళ్లిళ్లు కూడా జరిగిపోతాయి. ప్రభుత్వ ఉద్యోగాల్లో పనులు చేస్తున్న వ్యక్తులకు విశేషమైన ప్రయోజనాలు కలిగే ఛాన్సులు ఉన్నాయి.
మిథున రాశి
జనవరి మొదటి వారం మిథున రాశి వారికి చాలా లాభదాయకంగా ఉండబోతోంది. ఈవారం కొత్త కొత్త అవకాశాలు పొందడమే కాకుండా.. పాత సంబంధాలు మరింత బలపడే ఛాన్సులు కనిపిస్తున్నాయి. ఉన్నత అధికారుల నుంచి సపోర్టు పొందడమే కాకుండా కెరీర్పరంగా బోలేడు లాభాలు పొందగలుగుతారు. ఆర్థిక ప్రణాళికలు కూడా అనుకున్నట్లు జరుగుతాయి. ఆరోగ్యం కోసం డబ్బులు ఖర్చు చేయాల్సి వచ్చినప్పటికీ.. భారీ మొత్తంలో ఇతర పనుల నుంచి డబ్బులు కూడా పొందగలుగుతారు.
తులారాశి
తులా రాశిలో జన్మించిన వ్యక్తులకు మొదటివారం చాలా లాభదాయకంగా ఉండబోతోంది. ముఖ్యంగా వీరు సీనియర్ల నుంచి సహకారం పొందడమే కాకుండా.. తల్లిదండ్రుల నుంచి అద్భుతమైన లాభాలు పొందుతారు. ముఖ్యంగా ఈ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలకు కూడా వెళ్తారు. అలాగే వీరు తప్పకుండా దూర ప్రయాణాలు కూడా చేయగలుగుతారు. పనుల్లో ఉన్నత అధికారుల నుంచి మంచి సపోర్టు కూడా లభిస్తుంది.
మకర రాశి
మొదటి వారం మకర రాశి వారికి చాలా లాభదాయకంగా ఉంటుంది ముఖ్యంగా వీరికి కూడా అనుకున్న కోరికలు నెరవేరుతాయి. కుటుంబ సభ్యుల నుంచి పూర్తి సపోర్టు పొంది.. అద్భుతమైన లాభాలు పొందగలుగుతారు. అలాగే వైవాహిక జీవితం పరంగా ఆనందం కూడా విపరీతంగా పెరుగుతుంది. ఇతరుల నుంచి బహుమతులు బంధరమే కాకుండా గౌరవాన్ని కూడా సంపాదిస్తారు. ముఖ్యంగా చాలా కాలంగా ఎదుర్కొంటున్న సమస్యలు కూడా ఈ సమయంలో కాస్త పరిష్కారం అవుతాయి.
Also Read : Chatugrahi Yoga 2026: త్వరలో 4 గ్రహాల అరుదైన కలయికతో రాజయోగం.. జాక్ పాట్ కొట్టబోతున్న రాశులు ఇవే..
కుంభరాశి
2026 సంవత్సరం కుంభరాశి వారికి లాభదాయకంగానే ఉంటుంది. ముఖ్యంగా మొదటి భారం ఎన్నో రకాల అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి. రెండు గ్రహాల సంయోగంతో వీరికి గణనీయమైన బహుమతులు లభిస్తాయి. ఉద్యోగాల్లో కూడా పురోగతి లభించి అనేక రకాల అవకాశాలు పొందగలుగుతారు. అలాగే పోగొట్టుకున్న డబ్బులు కూడా తిరిగి పొందుతారు. ఆధ్యాత్మికత విషయాలపై ఆకర్షితులవుతారు. అంతేకాకుండా ఎన్నో రకాల లాభాలు పొందుతారని జ్యోతిష్యులు చెబుతున్నారు.
Also Read : Chatugrahi Yoga 2026: త్వరలో 4 గ్రహాల అరుదైన కలయికతో రాజయోగం.. జాక్ పాట్ కొట్టబోతున్న రాశులు ఇవే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
PM E-Drive Scheme 2026: ప్రస్తుతం మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల సందడి భారీగా పెరిగింది. మరోవైపు ఆటోలు టాక్సీలు కూడా ఎలక్ట్రిక్ వాహనాలు వైపు మొగ్గు చూపుతున్నాయి. ఈ సందర్భంలో కేంద్ర ప్రభుత్వం ఒక పథకాన్ని నిరుద్యోగ యువత కోసం అందుబాటులోకి తెచ్చింది దీని ద్వారా ఎలక్ట్రిక్ వాహనాలను సబ్సిడీ రేటు పైన తీసుకోవచ్చు. PM E-Drive Scheme 2026.. EV Vehicle Subsidy పథకం ద్వారా ఎలక్ట్రిక్ వాహనాలను తక్కువ ధరకు పొంది చక్కగా వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు. ఈ పథకం కింద ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసినప్పుడు సబ్సిడీ ఎలా పొందవచ్చో వివరంగా ఇప్పుడు మనం తెలుసుకుందాం
PM E-Drive Scheme 2026 పథకం లక్ష్యం:
దేశంలో ఎలక్ట్రానిక్ వాహనాల (EVs) వాడకాన్ని పెంచడం, పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడం, ఈవీ వాహనాలను తక్కువ ధరలకు ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం. దీని ప్రధాన ఉద్దేశ్యంగా చెప్పవచ్చు.
సబ్సిడీ వివరాలు:
కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన ఈ స్కీం ప్రకారం ఎలక్ట్రిక్ వాహనాల పైన సబ్సిడీ పొందవచ్చు అది ఎలాగో తెలుసుకుందాం.
>>ఎలక్ట్రిక్ టూ వీలర్స్ (E2W): బ్యాటరీ కెపాసిటీని బట్టి ఒక్కో వాహనానికి గరిష్టంగా రూ. 10,000 వరకు సబ్సిడీ వస్తుంది.
>>ఎలక్ట్రిక్ త్రీ వీలర్స్ (E3W): గరిష్టంగా రూ. 50,000 వరకు సబ్సిడీ లభిస్తుంది.
>>ఎలక్ట్రిక్ బస్సులు (E-Buses): గరిష్టంగా రూ. 35 లక్షల వరకు సబ్సిడీ వస్తుంది.
>>ఎలక్ట్రిక్ ట్రక్కులు (E-Trucks): గరిష్టంగా రూ. 1.25 కోట్లు వరకు సబ్సిడీ లభిస్తుంది (ఎక్స్-ఫ్యాక్టరీ ప్రైస్ పైన 10% డిస్కౌంట్ తో పాటు).
ఈ పథకం ద్వారా ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు కూడా ప్రభుత్వం మద్దతు అందించడం దీని ప్రత్యేకతగా చెప్పవచ్చు.
సబ్సిడీని ఇలా పొందవచ్చు:
>> ఎలక్ట్రిక్ వాహనాలపై సబ్సిడీని PM E-Drive డిజిటల్ వోచర్ ద్వారా పొందవచ్చు. ఈ వోచర్ ఆధార్ అథెంటికేషన్ ద్వారా లభిస్తుంది.
>> ముందుగా ఈ స్కీమ్ అందుబాటులో ఉన్న ఆథరైజ్డ్ షోరూమ్కు వెళ్లి మీ అవసరాలకు తగిన వాహనాన్ని ఎంచుకోవాలి.
>> ఆ తర్వాత వాహన డీలర్ PM E-Drive పోర్టల్ ద్వారా సబ్సిడీ ప్రాసెస్ ప్రారంభిస్తారు.
>> యాప్ ద్వారా ఫోటో, ఆధార్ స్కాన్ చేసి, ఆధార్ బేస్డ్ e-KYC పూర్తి చేస్తారు.
>> రిజిస్టర్డ్ మొబైల్ నంబర్కు వచ్చిన లింక్ ద్వారా డిజిటల్ వోచర్ డౌన్లోడ్ చేసుకోవాలి.
>> వోచర్పై సంతకం చేసి డీలర్కు ఇవ్వాలి. డీలర్ దానిని పోర్టల్లో అప్లోడ్ చేస్తారు. సబ్సిడీ మొత్తం ఇన్స్టంట్గా వెహికల్ ధర నుండి డిడక్ట్ అవుతుంది, మిగిలిన బ్యాలెన్స్ మాత్రమే మనం చెల్లించాలి.
ఈ స్కీం కోసం అర్హతలు ఇవే:
>> భారతీయ పౌరుడై ఉండాలి.
>> వాహనాన్ని ఆథరైజ్డ్ డీలర్ వద్ద మాత్రమే కొనాలి.
>> EV వాహన తయారీదారు PM E-Drive స్కీమ్ కింద రిజిస్టర్ అయి ఉండాలి.
>> వాహనంలో అడ్వాన్స్డ్ బ్యాటరీ ఉండాలి.
>> ఒక ఆధార్పై ఒక కేటగిరీలోని వాహనానికి మాత్రమే సబ్సిడీ వస్తుంది.
>> మొబైల్ నంబర్ ఆధార్తో లింక్ అయి ఉండాలి.
>> వాహనం తప్పనిసరిగా RTO తో రిజిస్టర్ అయి ఉండాలి.
సబ్సిడీకి అర్హత లేని వాహనాలు ఇవే:
>> ప్రైవేట్ ఎలక్ట్రిక్ కార్లు.
>> ప్రభుత్వ శాఖలు కొనుగోలు చేసే వాహనాలు.
>> సెకండ్ హ్యాండ్ లేదా రీసేల్ వాహనాలు (కేవలం కొత్త వాహనాలకు మాత్రమే).
సబ్సిడీ ఉన్న EV బైక్ల వివరాలు (Eligible EV Bike Models):
PM E-Drive పోర్టల్ AY ఏ బైక్లకు సబ్సిడీ ఉందో తెలుసుకోవచ్చు. Ola (రోడ్స్టర్ ఎక్స్ప్రెస్, S1 ప్రో, S1), Ather (450 SHR) వంటి మోడళ్లకు సబ్సిడీ యాక్టివ్గా ఉంది.
పూర్తి వివరాల కోసం https://pmedrive.heavyindustries.gov.in సైటును సంప్రదించండి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Sreeleela behaviour in tirumala que line video: తిరుమలల ఇటీవల వైకుంఠఏకాదశి నేపథ్యంలో ఉత్తర ద్వార దర్శనాలను టీటీడీ కల్పించింది. డిసెంబర్ 30 నుంచి జనవరి 1 వరకు లక్కీడీప్ లో టొకెన్లు వచ్చిన వారికి టీటీడీ దర్శనాలు కల్పించింది. డిసెంబర్ 30 వైకుంఠ ఏకాదశి నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి రాజకీయా నాయకులు, సెలబ్రీటీలు భారీగా తిరుమలకు తరలివచ్చారు. మరోవైపు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు నటి శ్రీలీల కూడా వచ్చింది. అయితే.. తిరుమల క్యూలైన్ లో శ్రీలీల స్వామివారిదర్శనం కోసం వెళ్తుంది.ఇంతలో ఆమె వెనకాల ఒక యువకుడు సైతం శ్రీలీలను వెనుకనుంచి ఫాలో అవుతున్నారు. బయట నుంచి కొంత మంది వీరి ఫోటోలను తీసుకుంటున్నారు.
అయితే.. శ్రీలీల పవిత్రమైన తిరుమల ఆలయంలో అది కూడా క్యూలైన్ లో ఉన్న విషయం మర్చిపోయి పలు మార్లు ఆ కుర్రాడి వంక నవ్వుతూ చూడటం, అతను సైతం నటిని చూడటం జరిగింది. అతను కూడా శ్రీలీల వంక నవ్వుతూ అదేదో బైట మూవీథియేటర్లో లేదా షాపింగ్ మాల్స్ లో ఉన్న విధంగా ప్రవర్తించారు. దీంతో ఈ వీడియో కాస్త నెట్టింట వైరల్ గా మారింది. దీనిపై శ్రీవారి భక్తులు సీరియస్అవుతున్నారు. స్వామివారి దర్శనాలకు వచ్చి ఇదెక్కడి పనులు అంటూ మండిపడుతున్నారు.
ఇలాంటి వారి వల్లే మిగతా భక్తులు కూడా వెకిలిగాప్రవర్తిస్తున్నారని సీరియస్ అవుతున్నారు. అసలైతే..ఎంత సెలబ్రీటీలు అయితే ఇతరుల్నిచూడాల్సిన అవసరం ఏంటని, శ్రీవారిని దర్శించుకొవడంపై వారి కాన్సన్ ట్రెషన్ ఉంటే ఇలాంటివి జరగవని మరికొంత మంది అంటున్నారు. మొత్తంగా క్యూలైన్ లో శ్రీలీల ప్రవర్తనపై నెట్టింట దుమారం రాజుకుంది. ఇలాంటి పనులు చేయోద్దని టీటీడీ ఇప్పటికే పలుమార్లు సెలబ్రీటీల్ని అందరిని హెచ్చరించింది.
Read more: Naa Anveshana: నా అన్వేషణ యూట్యూబర్ కు బిగ్ షాక్.. పోలీసులకు ఫిర్యాదు చేసిన ఫెమస్ నటి..
అయిన కూడా కొంత మంది టీటీడీ హెచ్చరికలను బేఖాతరుచేస్తున్నారు. ప్రస్తుతం శ్రీలీల ప్రవర్తనపై కొంత మంది భక్తులు మండిపడుతుండగా, మరికొంత మంది ఏదో అభిమాని అని నార్మల్గా నవ్వారో ఏమో.. ప్రతి దాన్ని కాంట్రవర్సీ కోణంలో చూడటం ఏంటని కిస్సిక్ పాపకు మద్దతు తెలుపుతున్నారు. మొత్తంగా శ్రీలీల ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది.
Nothing Phone 3A Price Drop In Flipkart: ఎప్పటినుంచో మీరు నథింగ్ ఫోన్ (3a)స్మార్ట్ ఫోన్ (Nothing Phone (3a)) కొనుగోలు చేయాలని అనుకుంటూ ఉన్నారా? అయితే మీకు సమయం రానే వచ్చింది ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్కార్ట్లో జనవరి రెండు నుంచి ఆరవ తేదీ వరకు జరుగుతున్న ప్రత్యేకమైన సేల్లో భాగంగా ఈ మొబైల్ కొనుగోలు చేసే వారికి భారీ డిస్కౌంట్ లభిస్తుంది. ముఖ్యంగా ఈ మొబైల్ పై ఎన్నో రకాల ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే, దీనిపై ఉన్న ఆఫర్స్ వివరాలేంటో? ఎంత తగ్గింపు దరకు లభిస్తుందో ఇప్పుడు తెలుసుకోండి.
నథింగ్ ఫోన్ (3a) (128 GB) స్మార్ట్ ఫోన్కు సంబంధించిన ఫీచర్స్ వివరాల్లోకి వెళ్తే.. ఇది మార్కెట్లోకి 6.77 అంగుళాల Full HD+ అమోలెడ్ (AMOLED) డిస్ప్లే తో అందుబాటులోకి వచ్చింది. అంతేకాకుండా 120Hz అడాప్టివ్ రీఫ్రెష్ రేట్, 3000 nits గరిష్ట బ్రైట్నెస్ సపోర్టుతో లభిస్తోంది. అలాగే ఈ మొబైల్ క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 7s జెన్ 3 (Qualcomm Snapdragon 7s Gen 3) ప్రాసెసర్ పై రన్ అవుతుంది. ఇక ఈ మొబైల్కు సంబంధించిన వెనక భాగంలోకి వెళ్తే.. బ్యాక్ సెటప్లో అద్భుతమైన కెమెరా మాడ్యూల్ని కలిగి ఉంటుంది. ఇది చాలా ప్రత్యేకమైన 50MP మెయిన్ కెమెరా (OIS)తో పాటు అదనంగా 50MP టెలిఫోటో లెన్స్, 8MP అల్ట్రావైడ్ కెమెరా కెమెరాలను కూడా కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. దీంతోపాటు ఫ్రంట్ భాగంలో 32MP ఫ్రంట్ కెమెరా కూడా లభిస్తుంది.
దీనిని కంపెనీ ఎంతో ప్రత్యేకమైన 5000 mAh బ్యాటరీ, 50W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో అందుబాటులోకి తీసుకువచ్చింది. ముఖ్యంగా ఇది ఆండ్రాయిడ్ 15 ఆధారిత నథింగ్ OS 3.1 ఆపరేటింగ్ సిస్టం కలిగి ఉంటుంది. కంపెనీ ఈ మొబైల్కు దాదాపు మూడేళ్ల పాటు ఆండ్రాయిడ్ అప్డేట్స్ అందిస్తోంది. అలాగే ఈ మొబైల్కు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా అందుబాటులో ఉంది.
Also Read: Google Pixel 9A మొబైల్పై రూ.28 వేల బోనస్.. ఎలా కొనుగోలు చేయాలో తెలుసా?
ఈ నథింగ్ ఫోన్ (3a) (Nothing Phone (3a)) స్మార్ట్ ఫోన్పై అందుబాటులో ఉన్న ఆఫర్స్ వివరాల్లోకి వెళ్తే.. మార్కెట్లో ఈ మొబైల్ను కంపెనీ ధర MRP రూ.27,999తో విక్రయిస్తోంది.. అయితే, ఫ్లిప్కార్ట్ స్పెషల్ సేల్లో భాగంగా కొనుగోలు చేసే వారికి ఏకంగా 11 శాతం తగ్గింపుతో కేవలం రూ.24, 999కే అందుబాటులో ఉంది. ఇక అదనంగా తగ్గింపు పొందడానికి ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, ఎస్బిఐ బ్యాంకు క్రెడిట్ కార్డులను వినియోగించి పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఇలా పేమెంట్ చేసే వారికి రూ.3000 తగ్గింపు లభిస్తుంది.
అలాగే నథింగ్ ఫోన్ (3a) స్మార్ట్ఫోన్ను మరింత తగ్గింపు పొందడానికి ఎక్స్చేంజ్ బోనస్ ఆఫర్ను కూడా వినియోగించవచ్చు దీనిని వినియోగించాలనుకునే వారు తప్పకుండా ఫ్లిప్కార్ట్కి ఏదైనా బ్రాండ్కు సంబంధించిన మంచి కండిషన్తో కూడిన పాత స్మార్ట్ ఫోన్ను ఎక్స్చేంజ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా చేస్తే ఏకంగా రూ.22 వేల వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో మీరు ఈ మొబైల్ను కేవలం రూ.2,999 లోపే పొందవచ్చు.
Also Read: Google Pixel 9A మొబైల్పై రూ.28 వేల బోనస్.. ఎలా కొనుగోలు చేయాలో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Moto X70 Air Pro Launch News: ప్రముఖ చైనీస్ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ మోటరోలా మార్కెట్లోకి త్వరలోనే కొత్త స్మార్ట్ ఫోన్లు విడుదల చేసేందుకు సిద్ధమైంది. దీనిని కంపెనీ అత్యంత సుల్లింగ్ డిజైన్తో అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా దీనిని మోటరోలా మొట్టమొదటిసారిగా పెరిస్కోప్ కెమెరాతో అందుబాటులోకి తీసుకురాబోతోంది. అయితే, మోటరోలా సిగ్నేచర్నే భారత మార్కెట్లోకి కంపెనీ మోటార్ల ఎడ్జ్ 70 అల్ట్రాగా లాంచ్ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కానీ కంపెనీ వరల్డ్ వైడ్గా ప్రీమియం ఫీచర్స్తో Moto X70 Air Pro స్మార్ట్ ఫోన్ విడుదల చేయబోతోంది. ఈ మొబైల్కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఇటీవలే వస్తున్న వార్తల ప్రకారం.. Moto X70 Air Pro స్మార్ట్ ఫోన్ చైనాకు సంబంధించిన సర్టిఫికేషన్ ఏజెన్సీ డేటాబేస్లో కనిపించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇది XT2603-1 మోడల్ నెంబర్తో అందుబాటులోకి రాబోతున్నట్లు వార్త వివరాలు చెబుతున్నాయి. అలాగే ఇది మోస్ట్ పవర్ఫుల్ ఫీచర్లతో విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఇది చాలా పెద్దదైన 6.78-అంగుళాల OLED డిస్ప్లేతో విడుదల కాబోతోంది. అంతేకాకుండా ఇది 1.5K రిజల్యూషన్ను కలిగి ఉంటుంది. దీంతోపాటు ఈ మొబైల్ ను కంపెనీ ఎంతో శక్తివంతమైన Snapdragon 8 Gen 5 చిప్సెట్ ప్రాసెసర్తో లాంచ్ చేయబోతోంది. అలాగే ఇది ఎంతో శక్తివంతమైన 50-మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
Moto X70 Air Pro స్మార్ట్ ఫోన్ను కంపెనీ మొత్తం మూడు వేరియంట్లలో అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులోని చివరి వేరియంట్ 16 జిబి ర్యామ్ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఫ్రంట్ భాగంలో 50-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా కూడా లభిస్తోంది. ఇక ఈ స్మార్ట్ ఫోన్కు సంబంధించిన బ్యాటరీ వివరాల్లోకి వెళ్తే.. ఇది ఎంతో శక్తివంతమైన 5,100 mAh బ్యాటరీని కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. దీంతోపాటు ఇది 90 W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో లాంచ్ కాబోతోంది. అలాగే దీనికి ప్రత్యేకమైన వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ను కూడా అందిస్తోంది. ఇక ఈ మొబైల్లో ఇన్-డిస్ప్లే ఫింగర్ప్రింట్ సెన్సార్ ఫీచర్ కూడా అందుబాటులో ఉంది. అయితే, ఈ స్మార్ట్ ఫోన్కు సంబంధించిన మరిన్ని వివరాలను కంపెనీ అధికారికంగా వెల్లడించే అవకాశాలున్నాయి. త్వరలోనే కంపెనీ అధికారిక విడుదల తేదీని కూడా ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read: Google Pixel 9A మొబైల్పై రూ.28 వేల బోనస్.. ఎలా కొనుగోలు చేయాలో తెలుసా?
ఇక ఇటీవల భారత దేశంలో మోటరోలా ఎడ్జ్ 70 స్మార్ట్ ఫోన్ కూడా లాంచ్ అయింది. ఇది అద్భుతమైన 6.7-అంగుళాల 1.5K AMOLED డిస్ప్లేతో అందుబాటులోకి వచ్చింది. దీంతోపాటు చాలా ప్రత్యేకమైన 300Hz టచ్ శాంప్లింగ్ రేట్ సపోర్టును కలిగి ఉంటుంది. అంతేకాకుండా 1,600 నిట్ల పీక్ బ్రైట్నెస్ సపోర్ట్ను కూడా కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మొబైల్ చాలా ప్రత్యేకమైన స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్తో లాంచ్ అయింది. ఇది ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్లో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్ట్తో అందుబాటులోకి వచ్చింది. ఇక ఈ మొబైల్ 5000mAh బ్యాటరీ 68W టర్బోపవర్ చార్జింగ్ సపోర్టును కలిగి ఉంటుంది.
Also Read: Google Pixel 9A మొబైల్పై రూ.28 వేల బోనస్.. ఎలా కొనుగోలు చేయాలో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Cucumber With Curd Side Effects: మనం సాధారణంగా భోజనంలో పెరుగు లేదా దోసకాయ రైతాను ఇష్టంగా తినేవారు చాలా మంది ఉన్నారు. ఈ రెండూ ఆరోగ్యానికి మంచివే అని అంతా అనుకుంటుంటాం. కానీ, ఆయుర్వేదం ప్రకారం కొన్ని ఆహార పదార్థాలను కలిపి తినకూడదట. దీన్నే బ్యాడ్ ఫుడ్ కాంబినేషన్ అంటారు. ఈ జాబితాలో పెరుగు, దోసకాయ కలయిక కూడా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఎందుకు మంచిది కాదు?
ఆయుర్వేద శాస్త్రం ప్రకారం ప్రతి ఆహారానికి ఒక నిర్దిష్టమైన స్వభావం (గుణం), శక్తి, జీర్ణ ప్రభావం ఉంటాయి. దోసకాయ, పెరుగు లక్షణాలు పరస్పరం విరుద్ధంగా ఉండటమే దీనికి ప్రధాన కారణమని చెబుతున్నారు.
పెరుగు బరువైనది, వేడిని తట్టుకునే స్వభావం కలిగి ఉంటుంది. దోసకాయ చల్లని స్వభావం కలిగి ఉండి, నీటి శాతాన్ని ఎక్కువగా కలిగి ఉంటుంది. ఈ రెండింటినీ కలిపి తీసుకున్నప్పుడు శరీరంలో 'చల్లని శక్తి' విపరీతంగా పెరిగి జీర్ణ ప్రక్రియ మందగిస్తుంది.
ఆయుర్వేదం ప్రకారం మనం తిన్న ఆహారం అరగడానికి శరీరంలో 'అగ్ని' (Metabolic heat) అవసరం. ఈ రెండు పదార్థాలు శరీర ఉష్ణోగ్రతను తగ్గించడం వల్ల జీర్ణక్రియకు అవసరమైన వేడి తగ్గుతుంది. దీనివల్ల ఆహారం సరిగ్గా అరగక కడుపులో కిణ్వ ప్రక్రియ మొదలవుతుంది.
దీనివల్ల కలిగే ఆరోగ్య సమస్యలు
పెరుగు, దోసకాయ కలిపి తీసుకోవడం వల్ల స్వల్పకాలికంగా, దీర్ఘకాలికంగా పలు ఇబ్బందులు ఎదురవుతాయట. కడుపు ఉబ్బరం, గ్యాస్, అజీర్ణం, కడుపు నొప్పి వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందట.
తిన్న ఆహారం సరిగ్గా అరగకపోవడం వల్ల గుండెల్లో మంట లేదా ఆమ్లత్వం ఏర్పడుతుంది. ఈ విరుద్ధ కలయిక వల్ల చర్మ సమస్యలు లేదా శ్వాసకోశ ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఈ రెండూ చల్లని స్వభావం కలిగి ఉండటం వల్ల శరీరంలో కఫ దోషం పెరిగి జలుబు, దగ్గు వంటి సమస్యలు తలెత్తవచ్చు.
ప్రత్యామ్నాయం ఏమిటి?
మీరు రైతా తినాలనుకుంటే, పెరుగులో దోసకాయకు బదులుగా వేయించిన జీలకర్ర పొడి, కొద్దిగా మిరియాల పొడి లేదా సైంధవ లవణం వంటి జీర్ణక్రియను వేగవంతం చేసే పదార్థాలను చేర్చుకోవచ్చు. అలాగే దోసకాయను విడిగా సలాడ్ రూపంలో తీసుకోవడం ఉత్తమం.
(గమనిక: పైన పేర్కొన్న సమాచారం కేవలం కొన్ని నివేదికల ఆధారంగా రూపొందించింది. దీన్ని పాటించే ముందు సంబంధిత నిపుణుడ్ని సంప్రదించడం మేలు. దీన్ని జీ తెలుగు న్యూస్ ధ్రువీకరించడం లేదు.)
Also Read: Mumbai Affair Attack: న్యూఇయర్ వేళ ముంబై ఉలిక్కిపడే ఘటన..లవర్ ప్రైవేట్ పార్ట్ కట్ చేసిన వివాహిత!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
School Holidays Extension: ఉత్తర భారతదేశాన్ని వణికిస్తున్న శీతల గాలుల ప్రభావం బీహార్ రాష్ట్రంపై తీవ్రంగా ఉంది. రాష్ట్రంలో చలి తీవ్రత విపరీతంగా పెరగడంతో విద్యార్థుల భద్రత దృష్ట్యా పాఠశాలలకు సెలవులను పొడిగిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా రాజధాని పాట్నా సహా పలు జిల్లాల్లో విద్యాసంస్థల నిర్వహణపై కొత్త ఆంక్షలు విధించారు.
పాట్నాలో పాఠశాలల పరిస్థితి
పాట్నా జిల్లా మేజిస్ట్రేట్ (DM) డాక్టర్ త్యాగరాజన్ ఎస్ఎం జారీ చేసిన తాజా ఉత్తర్వుల ప్రకారం.. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, ప్రీ-స్కూల్స్, అంగన్వాడీ కేంద్రాలు జనవరి 5 వరకు సెలవులను ప్రకటించారు.
అయితే 6వ తరగతి నుండి ఆపై తరగతుల విద్యార్థులకు పాఠశాల సమయాన్ని సవరించారు. ఇకపై తరగతులు ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 3:30 వరకు మాత్రమే నిర్వహించాలని ఆదేశించారు. ఇప్పటికే నిర్ణయించిన ప్రీ-బోర్డు పరీక్షలు లేదా ప్రత్యేక కోచింగ్ తరగతులకు ఈ సమయ నియంత్రణ నుండి మినహాయింపు ఉంటుంది.
పాట్నా మాత్రమే కాకుండా బీహార్లోని ఇతర ప్రాంతాల్లోనూ చలి తీవ్రత ఎక్కువగా ఉంది. బాంకా, ముజఫర్పూర్ జిల్లాల్లో 8వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు జనవరి 5 వరకు సెలవులు ప్రకటించారు. గతంలో జనవరి 2 వరకు ఉన్న సెలవులను వాతావరణ పరిస్థితుల దృష్ట్యా జనవరి 5 వరకు పొడిగించారు.
వాతావరణ శాఖ (IMD) హెచ్చరికలు
రాబోయే రోజుల్లో చలి మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. బీహార్లోని ఏడు జిల్లాలైన.. గోపాల్గంజ్, సివాన్, ముజఫర్పూర్, దర్భంగా, సహర్సా, మధేపురా, పూర్నియా జిల్లాల్లో శీతల గాలులు (Cold Waves) వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. పశ్చిమ గాలుల ప్రభావంతో ఉత్తర బీహార్లోని పలు ప్రాంతాల్లో పొగమంచు కమ్ముకుంటుందని, వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
చివరిగా.. పిల్లలు చలి బారిన పడకుండా ఉండేందుకు తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని, విద్యా సంస్థలు ప్రభుత్వ ఆదేశాలను కచ్చితంగా పాటించాలని అధికారులు స్పష్టం చేశారు.
Also Read: Mumbai Affair Attack: న్యూఇయర్ వేళ ముంబై ఉలిక్కిపడే ఘటన..లవర్ ప్రైవేట్ పార్ట్ కట్ చేసిన వివాహిత!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
TSRTC Recruitment 2025 Apply Online: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGRTC) నిరుద్యోగులకు తీపి కబురు అందించింది. సంస్థలో ఖాళీగా ఉన్న ట్రాఫిక్, మెకానికల్ సూపర్వైజర్ ట్రైనీ పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించింది. అర్హత గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచించారు.
ఖాళీల వివరాలు
మొత్తం 198 పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఇందులో భాగంగా ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీ కోసం 84 పోస్టులు, అలాగే మెకానికల్ సూపర్వైజర్ ట్రైనీ కోసం 114 పోస్టులను భర్తీ చేయనున్నారు.
అర్హతలు & వయోపరిమితి
ఈ పోస్టులకు విద్యార్హతగా సంబంధిత విభాగంలో అభ్యర్థులు కనీసం డిప్లొమా లేదా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. జూలై 1, 2025 నాటికి 18 నుండి 25 ఏళ్ల మధ్య వయోపరిమితిని నిర్ణయించారు. మరోవైపు ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ (EWS) అభ్యర్థులకు 5 ఏళ్ల సడలింపు ఉంటుంది. అలాగే ఎక్స్-సర్వీస్మెన్ (ESM) అభ్యర్థులకు 3 ఏళ్ల సడలింపు ఉంటుంది.
దరఖాస్తుకు కావాల్సిన పత్రాలు..
అభ్యర్థులు దరఖాస్తు సమయంలో కొన్ని పత్రాలను సిద్ధం చేసుకోవాలి. వాటిలో పదో తరగతి సర్టిఫికేట్ (డేట్ ఆఫ్ బర్త్ నిర్ధారణ కోసం), 1వ తరగతి నుండి 7వ తరగతి వరకు స్టడీ సర్టిఫికేట్లు (లేదా రెసిడెన్స్ సర్టిఫికేట్), తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన లేటెస్ట్ కమ్యూనిటీ సర్టిఫికేట్తో పాటు ఏప్రిల్ 1, 2025 తర్వాత పొందిన నాన్-క్రీమీ లేయర్ (BC అభ్యర్థులకు) లేదా EWS సర్టిఫికేట్ తప్పనిసరిగా ఉండాలి.
జీతం & ఎంపిక విధానం
ఎంపికైన వారికి నెలకు రూ. 27,080 నుండి రూ. 81,400 వరకు జీతంతో పాటు ఇతర ప్రయోజనాలు ఉంటాయి. అయితే ఈ పోస్టుల కోసం రాత పరీక్ష, ధృవపత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇందుకోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి జనవరి 20, 2026 వరకు సమయం ఉంది.
జనరల్ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.800 ఉండగా.. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.400 చెల్లించాల్సి ఉంది. అభ్యర్థులు TGRTC అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్కు సంబంధించిన పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్సైట్ను సందర్శించండి.
Also Read: Mumbai Affair Attack: న్యూఇయర్ వేళ ముంబై ఉలిక్కిపడే ఘటన..లవర్ ప్రైవేట్ పార్ట్ కట్ చేసిన వివాహిత!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook