icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

Cobra In Puja Room Video: దేవుడి గదిలో శ్రీరాముడి ఫోటో పక్కనే భారీ నాగుపాము.. వీడియో వైరల్..

Hyderabad, Telangana:

 Cobra In Puja Room Viral video Watch: ఒక నాగుపాముకు సంబంధించిన అరుదైన దృశ్యం ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. సామాజిక మాధ్యమాల్లో నిత్యం ఎన్నో పాముల వీడియోలు కనిపిస్తూ ఉంటాయి.. కానీ దేవుడి గదిలో ప్రత్యక్షమైన ఒక అత్యంత ప్రమాదకరమైన నాగుపాము కు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఒక ఇంటిలోని పూజా గదిలో.. సాక్షాత్తు శ్రీరాముడి ఫోటో పక్కనే అత్యంత ప్రమాదకరమైన నాగుపాము పడకవిప్పి కూర్చోవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది..

సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో లేదా శివారు ప్రాంతాల్లో పాములు ఇళ్ళలోకి రావడం చూస్తూ ఉంటాం.. అయితే, ఈ ఘటనలో నాగుపాము నేరుగా ఇంట్లోని దేవుడి గదిలోకి ప్రవేశించింది.. నిత్యం పూజలు చేసే ఆ గదిలో.. శ్రీరాముడి పటాన్ని ఆనుకొని నిలబడింది. ఉదయాన్నే పూజ చేద్దామని వెళ్లిన ఇంటి యజమాని.. అక్కడ మృత్యుల పడక విప్పి బుసలు కొడుతున్న భారీ నాగుపామును చూసి ఒక్కసారిగా షాక్కు గురైయ్యాడు.. ప్రాణ భయంతో గది బయటకు పరుగులు తీసి.. కుటుంబ సభ్యులను అప్రమత్తం చేశాడు..

పూజా గదిలో నాగుపాము ఉన్నదని కుటుంబ సభ్యులు ఇంటి బయటకు వెళ్లి ఇతరులకు చెప్పడంతో.. ఈ వింతను చూసేందుకు స్థానికులు సైతం భారీగా తరలివచ్చారు. కొందరు భక్తితో దానికి నమస్కరించుకోగా.. మరి కొంతమంది అత్యంత ప్రమాదకరమైన విశ్వసర్పం కావడంతో వెంటనే పాములు పట్టే వారికి సమాచారం అందించారు.. సమాచారం అందుకున్న వెంటనే అక్కడికి చేరుకున్న స్నేక్ క్యాచర్.. ఎంతో చాకచక్యంగా ఆ నాగుపామును పట్టుకునేందుకు ప్రయత్నం చేశారు. పూజా సామాగ్రిల మధ్య ఉన్న పాములు ఎలాంటి గాయం లేకుండా.. సురక్షితంగా స్నేక్ స్టిక్ సహాయంతో పట్టుకున్నట్లు సమాచారం..

 
 
 
 
 

Also Read:  Video Viral: సాయం ముసుగులో అరాచకం.. యువతి ప్రైవేటు పార్ట్ మీద చెయ్యి వేసి మరీ.!. వీడియోపై దుమారం..

ఆ సమయంలో అక్కడున్న వారు తమ స్మార్ట్‌ఫోన్స్‌లో రికార్డు చేసిన వీడియోలతో పాటు ఫోటోలను ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. అంతే ఇలా పోస్ట్ చేసిన వీడియో ఒక్కసారిగా వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన వారంతా రకరకాలుగా స్పందిస్తూ వస్తున్నారు.. సాక్షాత్తు ఆ రాముడికి రక్షణగా శేష సర్పం వచ్చినట్లుంది అని కొంతమంది రాముడు భక్తులు కామెంట్లు చేస్తున్నారు.. కానీ వన్యప్రాణి ప్రేమికులు మాత్రం దాన్ని సురక్షితంగా అడవి ప్రాంతంలో వదిలిపెట్టాలని కోరుతున్నారు. ఏది ఏమైనా ఇలా పూజా గదిలోకి నాగుపాము రావడం ఇదే మొదటిసారిగా భావించవచ్చు..

Also Read:  Video Viral: సాయం ముసుగులో అరాచకం.. యువతి ప్రైవేటు పార్ట్ మీద చెయ్యి వేసి మరీ.!. వీడియోపై దుమారం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్.. - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..

  

0
0
Report

Kondagattu: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!

Hyderabad, Telangana:

Kondagattu Temple Coconut Scam Telugu: తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ సన్నిధిలో మామూళ్ల పర్వం ఊహించని స్థాయిలో పెరుగుతోంది. స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చే సాధారణ భక్తులను ఆసరాగా చేసుకుని కొందరు ఆలయ తాత్కాలిక సిబ్బందితోపాటు వర్కర్లు నిలువు దోపిడీకి పాల్పడుతున్నారు. ఆలయ ఆవరణలో కొబ్బరికాయలు కొట్టేచోట భక్తులనుంచి ముక్కు పిండి డబ్బులు వసూలు చేస్తున్న వైనం ఇప్పుడు తీవ్ర సంచలనంగా మారింది. దీనికి సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారి.. ఆలయ అధికారుల తీరును ఎండగడుతోంది.

కొబ్బరికాయ కొట్టాలన్నా పన్ను కట్టాల్సిందే..
సాధారణంగా ఆలయానికి వచ్చే భక్తులు తమ మొక్కులు తీర్చుకోవడానికి తప్పకుండా కొబ్బరికాయలను స్వామివారికి సమర్పించుకుంటారు. అయితే కొండగట్టులో కొబ్బరికాయలు కొట్టే స్థలంలో ఉండే కొంతమంది వర్కర్లు భక్తుల నుంచి ఒక్కొక్క కొబ్బరికాయకు 10 రూపాయల చొప్పున వస్తువులు చేస్తున్నారు.. డబ్బులు ఇవ్వనిదే.. కాయలు కొట్టేది లేదంటూ భక్తులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు గొడవలు ఎందుకని అడిగినంత ఇచ్చుకుంటున్నారు. కొంతమంది వందల సంఖ్యలో కొబ్బరికాయలు కొట్టే వారు కూడా వీరికి డబ్బులు వేల సంఖ్యలో సమర్పిస్తున్నట్లు సమాచారం..

కొబ్బరి నీళ్లతో వ్యాపారం..
ఈ దోపిడీ ఇంతటితో ఆగలేదు.. భక్తులు కొట్టిన కొబ్బరికాయల నుంచి వచ్చే నీళ్లను వృధా పోనివ్వకుండా.. పట్టుకుంటున్న సదరు సిబ్బంది.. వాటిని తిరిగి భక్తులకే భారీ ధరలకు విక్రయిస్తున్నారు.. ఒక చిన్న ప్లాస్టిక్ గ్లాస్ కొబ్బరినీళ్లను దాదాపు రూ.20 అమ్ముతుండగా.. లీటర్ బాటిల్ కొబ్బరినీళ్లను ఏకంగా రూ.100 రూపాయల చొప్పున విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. స్వామివారి ప్రసాదంగా భావించే కొబ్బరి నీళ్లను ఇలా బహిరంగంగా బ్లాక్ మార్కెట్ తరహాలో అమ్ముతుండడం గమనార్హం..

Also Read: Telangana Heat Waves: తెలంగాణలో మరింత తీవ్రంగా ఎండలు.. బయటకు వెళ్లాలంటే భయపడే పరిస్థితి..

అధికారుల మౌనం.. సోషల్ మీడియా వినియోగదారుల ఘాటు కామెంట్లు..
ఆలయ ప్రాంగణంలో ఎంత బహిరంగంగా భక్తులను దోచుకుంటున్నప్పటికీ.. అక్కడి ఆలయ ఉన్నత అధికారులు కానీ.. ఆలయ సిబ్బంది కానీ పట్టించుకోలేకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.. ఆలయ అధికారుల అండదండలతోనే ఈ మామూళ్ల పర్వం సాగుతూ ఉందని భక్తులు ఆరోపిస్తూ వస్తున్నారు.. స్థానికులు తీసిన ఈ దోపిడీకి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమవుతుండడంతో సోషల్ మీడియా వినియోగదారులు తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు.. భక్తిని కూడా వ్యాపారం చేసేసారు.. స్వామి సన్నిధిలో దండుపాల్యం ముఠా అంటూ ఘాటుగా విమర్శిస్తున్నారు.. ఇప్పటికైనా దేవాదాయ శాఖ ఉన్నత అధికారులు స్పందించి.. కొండగట్టులో సాగుతున్న ఈ కొబ్బరి దోపిడీకి అడ్డుకట్ట వేయాలని.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తూ వస్తున్నారు..

Also Read: Telangana Heat Waves: తెలంగాణలో మరింత తీవ్రంగా ఎండలు.. బయటకు వెళ్లాలంటే భయపడే పరిస్థితి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

0
0
Report

Ketu Transit 2026: మాఘ నక్షత్రంలోకి కేతువు సంచారం.. ఈ 4 రాశుల వారికి కష్టాల కాలం..

Hyderabad, Telangana:

Ketu Transit In Magha Nakshatra 2026 Effect: జ్యోతిష్య శాస్త్రంలో కేతువు గ్రహాన్ని ఛాయాగ్రహంగా పరిగణిస్తూ ఉంటారు. అంతే కాకుండా దీనిని రహస్యం ఆధ్యాత్మికతకు కారక గ్రహంగా కూడా చెప్పుకుంటూ ఉంటారు. ఈ గ్రహం ఎల్లప్పుడూ వక్రగతిలో ఒక రాసి నుంచి మరొక రాశికి ప్రవేశిస్తుంది. ఇదిలా ఉంటే.. కేతువు గ్రహం మే 31వ తేదీన ఆదివారం తెల్లవారి జామున రెండు గంటల సమయంలో మాగ నక్షత్రంలోని మూడవ దశలోకి సంచారం చేసింది.. ఈ గ్రహం ఆగస్టు రెండవ తేదీ వరకు కూడా ఇదే స్థితిలో కొనసాగుతూ ఉంటుంది. అయితే, కేతువు సంచారం నాలుగు రాశుల వారికి అనేక సవాలను తీసుకువచ్చే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ సమయంలో ఆయా  రాశుల వారికి ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి. దీంతోపాటు దీర్ఘకాలిక సమస్యల బారిన పడే అవకాశాలున్నాయి.. కాబట్టి ఈ సమయంలో ఏ రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

మిథున రాశి 
కేతువు స్థానంలో మార్పులు రావడం కారణంగా మిధున రాశి వారిపై ఊహించని ప్రభావం పడుతుంది. దీని కారణంగా వీరికి అనేక సవాళ్లు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. మాట విషయంలో చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది.. తప్పుడు మాటలు వివాదాలకు దారి తీయవచ్చు పనుల్లో నిర్లక్ష్యం వహించవద్దని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ సమయంలో వ్యాపారాలు చాలా కష్టంగా మారే అవకాశాలుంటాయి కాబట్టి పెట్టుబడులు పెట్టకపోవడం ఎంతో మంచిది. ముఖ్యంగా ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. కాబట్టి కొంత డబ్బులపరంగా ఆచితూచి వ్యవహరించడం మంచిది. అలాగే మీ మనస్సు కూడా అశాంతిగా మారవచ్చు.

కర్కాటక రాశి 
కర్కాటక రాశిలో జన్మించిన వ్యక్తులకు కేతువు స్థానంలో మార్పుల కారణంగా మానసికంగా ఊహించని స్థాయిలో ఒత్తిడికి గురవుతూ ఉంటారు. అంతేకాకుండా ఊహించని ఆందోళన వంటి సమస్యలు కూడా ఇవ్వవచ్చు అలాగే కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. లేదంటే అనేక సమస్యలకు దారి తీయవచ్చు ముఖ్యంగా కుటుంబ జీవితంలో ఊహించని సవాళ్లు ఎదురవుతాయి.  ఈ సమయంలో ఉద్యోగాలు చేసే వారు చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది.. లేదంటే పనుల మధ్య సమతుల్యత లేకపోవడం కారణంగా ఇతర సమస్యలకు దారి తీయవచ్చు.. సమాజంలో మాట తీరు పట్ల ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది.

ధనస్సు రాశి 
ధనస్సు రాశిలో జన్మించిన వ్యక్తులకు కూడా కేతువు ప్రభావం ఎంతో ప్రతికూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా వీరి జీవితంలో అనేక విషయాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. పనిలో కష్టపడటానికి వెనకాడకండి.. అంతేకాకుండా ఉద్యోగాలు చేసేవారు ఈ సమయంలో కష్టపడితేనే మంచి ఫలితాలు పొందగలుగుతారు. లేదంటే అనేక రకాల సమస్యలు తలెత్తవచ్చు. ముఖ్యంగా పాత ప్రాజెక్టులు ఈ సమయంలో ప్రారంభించడం మంచిది లేదంటే వాటిలో కూడా నష్టాలు కూడా వస్తాయి. ఆస్తి సంబంధిత సమస్యలు ఉన్నవారు తప్పకుండా కొంత వేచి చూడాల్సి ఉంటుంది.

మీన రాశి 
కేతువు సంచార ప్రభావంతో మీన రాశి వారికి ఈ సమయం ఎంతో ఆశుభ్రంగా ఉండబోతుంది. ముఖ్యంగా వీరికి ఈ సమయంలో మానసిక ఒత్తిడి ఊహించని స్థాయిలో పెరుగుతుంది. అధిక ఆందోళన కారణంగా అసౌకర్యాలు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. పనుల్లో చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండకపోవడం మంచిదని జ్యోతిష్యులు చెబుతున్నారు.. జీవితంలో ఆకస్మిత హెచ్చుతగ్గులు కూడా పెరుగుతాయి. ఇప్పటికే శని ప్రభావంతో బాధపడుతున్న ఈ రాశి వారు ఈ సమయంలో మరిన్ని సమస్యల బారిన పడాల్సి వస్తుంది.

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

గమనిక.. 

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report
Advertisement

Jupiter-venus Conjunction: గురు, శుక్రుల అద్భుత కలయిక.. ఈ 4 రాశుల వారికి ఇక తిరుగుండదు, అపార ధనలాభం!

Hyderabad, Telangana:

Jupiter-Venus Conjunction Effect On Zodiac: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. గురు గ్రహానికి అత్యంత ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. అయితే, ఈ గ్రహం మిథున రాశిలోకి సంచార దశలో ఉంది.. జూన్ 2న గురు గ్రహం కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తుంది. ఈ గ్రహం అక్టోబర్ 31వ తేదీ వరకు ఈ స్థానంలోనే ఉంటుంది.. సంపదతో పాటు శ్రేయస్సులకు కారకుడైన శుక్రుడు జూన్ 8న ఈ కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. ఆ తర్వాత జూలై 4వ తేదీన సింహరాశిలోకి వెళ్తాడు. ఫలితంగా జూన్ నెలలో కర్కాటక రాశిలో గురు, శుక్ర గ్రహాల సంయోగం జరుగుతుంది. ఈ సంయోగం కారణంగా కొన్ని రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది ముఖ్యంగా కోరుకున్న కోరికలు నెరవేరడమే కాకుండా సమస్యలు ఎంతో సులభంగా పరిష్కారమవుతాయి. అలాగే ఆత్మవిశ్వాసం కూడా ఊహించని స్థాయిలో పెరుగుతుంది.

ఈ రాశుల వారికి జాక్పాట్..
వృషభ రాశి 
గురు శుక్ర గ్రహాల కలయిక కారణంగా వృషభ రాశి వారికి రోజు వారి ఆదాయం ఊహించని స్థాయిలో పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు కూడా ఎంతో సులభంగా పూర్తవుతాయి. ఆర్థిక పరిస్థితులు గతంలో కంటే ఇప్పుడు మరింత అనుకూలంగా మారుతాయి. అదృష్టం మీకు తోడు ఉండడం కారణంగా జీవితంలో ఊహించని విజయాలు సాధించగలుగుతారు. వ్యాపారాల్లో పెద్ద పెద్ద ప్రాజెక్టు లభించే అవకాశాలున్నాయి డబ్బుకు ఈ సమయంలో ఎలాంటి కోరత ఉండదు.. అలాగే సమాజంలో మీకు అద్భుతమైన ప్రశంసలు కూడా లభిస్తాయి. ఈ సమయంలో వివాహ అవకాశాలు కూడా లభిస్తాయి.

తులారాశి 
తులా రాశిలో జన్మించిన వ్యక్తులకు శుక్రుడు, గురు గ్రహాల కలయిక కారణంగా ఈ సమయం చాలా బాగుంటుంది. వ్యాపారవేత్తలకు అద్భుతమైన పురోగతి కూడా లభిస్తుంది. అంతేకాకుండా పెద్ద ప్రాజెక్టులు కూడా లభించి.. విశేషమైన ప్రయోజనాలు పొందుతారు. ఉద్యోగాల్లో సమస్యలు కూడా తొలగిపోతాయి. జీతం కూడా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా డబ్బు సంబంధిత సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. సమాజసేవ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ సమయంలో మంచి పనులు చేయడం వల్ల అద్భుతమైన లాభాలు పొందుతారు.

ధనస్సు రాశి 
ధనస్సు రాశి వారికి ఈ సమయం ఎంతో లాభదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా అదృష్టం అనుకున్నంత స్థాయిలో పెరుగుతుంది.. డబ్బు సమస్యలు కూడా పరిష్కారం కాబోతున్నాయి. బ్యాంకు బ్యాలెన్స్ కూడా ఊహించని స్థాయిలో పెరిగి చాలాకాలంగా నిలిచిపోయిన పనులు డబ్బులతో పూర్తి చేయగలుగుతారు. కుటుంబ సమస్యలు మీకు అనుకూలంగా మారి వాటిని పరిష్కరించుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా ఈ సమయంలో అశాంతికి దూరంగా ఉండటం చాలా మంచిది.. మానసిక ప్రశాంతత కూడా విపరీతంగా లభించి.. ఆందోళన నుంచి సులభంగా విముక్తి లభించబోతోంది. 

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

మీన రాశి 
జూన్ నెలలో గురు శుక్ర గ్రహాలు కలయిక కారణంగా మీన రాశి వారికి ఈ సమయంలో అద్భుతమైన పురోగతి లభించబోతోంది.. ముఖ్యంగా వ్యాపార రంగాలలో నిమగ్నమైన వారికి మంచి పురోగతి కూడా లభిస్తుంది.. ఉద్యోగాల్లో అద్భుతమైన అవకాశాలు లభించడం కారణంగా మంచి లాభాలు పొందగలుగుతారు. అంతేకాకుండా వైవాహిక జీవితంలో ఊహించని పురోగతి లభిస్తుంది జీవిత భాగస్వామి మీకు తోడుగా ఉంటాడు. ఫలితంగా పెద్ద ప్రమాదాల నుంచి ఎంతో సులభంగా విముక్తి లభిస్తుంది. ఆరోగ్యం కూడా చాలా వరకు కుదుటపడి విశేషమైన ధన లాభాలు పొందే అవకాశాలున్నాయి.

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

గమనిక.. 

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report

IPL Final Highlights: గుజరాత్‌ టైటాన్స్‌ ఓటమి.. ఐపీఎల్‌ 2026 చాంపియన్‌ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు

Ahmedabad, Gujarat:

IPL 2026 Champion RCB: ఐపీఎల్‌ ప్రారంభమైన 18 ఏళ్ల తర్వాత ట్రోఫీ సాధించిన రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు వరుసగా రెండో ట్రోఫీని కూడా ఖాతాలో వేసుకుంది. 2026 సీజన్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చిన బెంగళూరు జట్టు ఫైనల్‌లో గుజరాత్‌ టైటాన్స్‌పై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ వీరోచిత పోరాటంతో ఐపీఎల్‌ 2026 ట్రోఫీని ముద్దాడింది. క్వాలిఫయర్‌ తొలి మ్యాచ్‌తోపాటు ఫైనల్‌లోనూ పూర్తిస్థాయిలో వైఫల్యం ప్రదర్శించిన గుజరాత్‌ టైటాన్స్‌ రన్నరప్‌గా నిలిచింది.

Also Read: RCB vs GT Highlights: గుజరాత్‌ టైటాన్స్‌ స్వల్ప స్కోర్‌.. బెంగళూరుదే ఐపీఎల్‌ ట్రోఫీ

సొంతగడ్డపై ఆడిన గుజరాత్‌ టైటాన్స్‌ ఘోరంగా విఫలమైంది. వరుసగా రెండో ట్రోఫీ సాధించాలనే కసితో ఉన్న రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు చేతిలో పరాజయం పొందింది. ఏ ఒక్క బ్యాటర్‌ కూడా భారీ ఇన్నింగ్స్‌ నమోదు చేయకపోగా.. బౌలర్లు కూడా ఘోరంగా విఫలమవడంతో ట్రోఫీని చేజార్చుకుని గుజరాత్‌ టైటాన్స్‌ రన్నరప్‌తో సరిపెట్టుకుంది. పూర్అద్భుతంగా బౌలింగ్‌ వేసి ప్రత్యర్థిని తక్కువ పరుగులకు కట్టడి చేశారు. ఆరంభం నుంచి వికెట్లు తీస్తూ బౌలర్లు గుజరాత్‌ నడ్డి విరిచారు. ఫలితంగా 00 ఓవర్‌లలో కుప్పకూలింది. ఈ మ్యాచ్‌ విశేషాలు ఇలా ఉన్నాయి.

గుజరాత్‌ టైటాన్స్‌ విధించిన 156 పరుగుల లక్ష్యాన్ని 5 వికెట్ల తేడాతో రాజస్థాన్‌ రాయల్స్‌ ఛేదించి చాంపియన్‌గా నిలిచింది. విరాట్‌ కోహ్లీ వీరోచిత పోరాటంతో బెంగళూరు జట్టు వరుసగా రెండోసారి ఐపీఎల్‌ ట్రోఫీని చేజిక్కించుకుంది. క్వాలిఫయర్‌ తొలి మ్యాచ్‌లో ఓడించిన జట్టునే ఫైనల్‌లో ఓడించి బెంగళూరు అద్భుత ప్రదర్శన కనబర్చింది. ఫ్రాంచైజీ టోర్నీకి వీడ్కోలు పలుకుతాడనే కోహ్లీకి ఇది చిరస్మరణీయ విజయంతో అతడికి వీడ్కోలు పలికిందని క్రికెట్‌ వర్గాలు చెబుతున్నాయి.

Also Read: Govt Employees: రేవంత్ రెడ్డికి భారీ షాక్‌.. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల సంచలన నిర్ణయం

గుజరాత్ బ్యాటర్లు విఫలం
అహ్మదాబాద్‌ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది. ప్రత్యర్థి బ్యాటింగ్‌కు ఆహ్వానించడంతో గుజరాత్‌ టైటాన్స్‌ తొలుత బ్యాటింగ్‌కు దిగి నిర్ణీత 20 ఓవర్‌లలో 8 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది. ఏ ఒక్క బ్యాటర్‌ కూడా భారీ ఇన్నింగ్స్‌ నమోదు చేయలేకపోయారు. మంచి జోరులో ఉన్న కెప్టెన్‌ శుభమన్‌ గిల్‌ 8 బంతుల్లో 10 పరుగులు చేసి ఔటవడంతో భారీ షాక్‌ తగిలింది. స్టార్‌ బ్యాటర్‌ సాయి సుదర్శన్‌ మరోసారి తీవ్ర నిరాశపరిచాడు. 12 బంతులు ఆడి 12 పరుగులు చేసి వెనుదిరిగాడు. టాప్‌ బ్యాటర్లు ఔటవడంతో తీవ్ర నిరాశకు గురయిన వేళ నిశాంత్‌ సింధు కొద్దిగా పోరాడి 18 బంతుల్లో 20 పరుగులు చేసి ఔటయ్యాడు. జోస్‌ బట్లర్‌ కొద్దిసేపు గ్రౌండ్‌లో నిలబడి 23 బంతులు ఆడాడు. 20 పరుగులు చేసి సింధు ఔటవగా.. అర్షద్‌ ఖాన్‌ 6 బంతుల్లో 15 పరుగులు చేశాడు. బ్యాటర్లందరూ చేతులెత్తేసిన వేళ వాషింగ్టన్‌ సుంర్‌ గొప్పగా పోరాడి అర్ధ సెంచరీ చేశాడు. 

రెండో ట్రోఫీ కోసం బెంగళూరు బౌలర్లు అద్భుతంగా బంతులు వేసి గుజరాత్‌ టైటాన్స్‌ బ్యాటర్లను భారీ దెబ్బతీశారు. సాధారణ స్కోర్‌ కూడా బ్యాటర్లను చేయకుండా బెంగళూరు బౌలర్లు నియంత్రించారు. జోష్‌ హేజిల్‌వుడ్‌ పొదుపుగా బౌలింగ్‌ చేసి రెండు వికెట్లు తీయగా.. అదే స్థాయిలో బౌలింగ్‌ చేసిన రషీక్‌ సలామ్‌ కూడా రెండు వికెట్లు పడగొట్టాడు. భువనేశ్వర్‌ కూడా రెండు వికెట్లతో సత్తా చాటాడు. కృనాల్‌ పాండ్యా ఒక వికెట్‌కు పరిమితమయ్యాడు.

0
0
Report

Govt Employees: రేవంత్ రెడ్డికి భారీ షాక్‌.. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల సంచలన నిర్ణయం

Baddipadaga, Telangana:

Telangana Govt Employees: ఎన్నో హామీలు, ఎన్నో ఆశలు.. ఎన్నో డిమాండ్లు.. ఎన్నో సమస్యల పరిష్కారంపై హామీ ఇచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం నిలువునా మోసం చేస్తుండడంతో తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులతోపాటు ప్రభుత్వ మాజీ ఉద్యోగులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఈ క్రమంలో అధికారంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రతిపాదించిన కొత్త ఉద్యోగుల పథకం (నూతన ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్, హెల్త్ కేర్ ట్రస్ట్) అమలు విధానంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొత్త ఉద్యోగుల ఆరోగ్య పథకంపై ఉపాధ్యాయ, ఉద్యోగ వర్గాలలో తీవ్ర గందరగోళానికి, ఆందోళనకు దారితీసింది. ఈ క్రమంలో ఉద్యోగులు, పింఛన్‌దారులు, టీచర్లు ప్రభుత్వానికి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Also Read: RCB vs GT Highlights: గుజరాత్‌ టైటాన్స్‌ స్వల్ప స్కోర్‌.. బెంగళూరుదే ఐపీఎల్‌ ట్రోఫీ

ముందస్తు సమాచారం.. స్పష్టమైన మార్గదర్శకాలు లేకుండా ఏకపక్షంగా ఉపాధ్యాయుల బేసిక్ పే నుంచి 1.5 శాతం నిర్బంధంగా జీతాల కోత విధించడాన్ని తప్పుబట్టారు. కొత్త ఆరోగ్య పథకంలో సీపీఎస్ (కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్) రిటైర్డ్ ఉద్యోగులపై ప్రభుత్వం అవలంభిస్తున్న సాంకేతిక వివక్షపై 'కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ యూనియన్' (టీఎస్‌సీపీఎస్‌ఈయూ) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రస్తుత కొత్త ఆరోగ్య పథకం విధానంలోని పలు అన్యాయమైన అంశాలను ఎండగట్టారు.

హెల్త్ కార్డుల మంజూరు, వాటి వినియోగంపై ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి స్పష్టమైన మార్గదర్శకాలను విడుదల చేయలేదని సీపీఎస్‌ ఉద్యోగుల సంఘం గుర్తుచేసింది. కొత్త ఆరోగ్య పథకం కింద ఏయే కార్పొరేట్, ప్రైవేట్ ఆసుపత్రులలో ఉచిత వైద్యం అందుతుందో స్పష్టమైన జాబితా లేదని.. ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి అధికారిక ఒప్పందాలు చేసుకోలేదని తెలిపింది. కనీసం ఉద్యోగుల సమ్మతి (ఆప్షన్) తీసుకోకుండా.. డీడీఓలకు సమాచారం ఇవ్వకుండా కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించిందని ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం హెల్త్ కార్డులు చేతికి రాకముందే.. ముందస్తుగా వేతనాల్లో 1.5 శాతం కోత విధించడం అత్యంత అన్యాయమని ప్రకటించారు.

Also Read: KTR Challenge: దమ్ముంటే రేవంత్‌ రెడ్డి 420 హామీలు అమలు చేయాలి: కేటీఆర్‌

ప్రభుత్వం హెల్త్ కేర్ ట్రస్ట్‌లో తన వంతుగా జమ చేయాల్సిన 1.5 శాతం మ్యాచింగ్ గ్రాంట్ నిధులను ముందస్తుగా జమ చేయలేదని సీపీఎస్‌ ఉద్యోగుల సంఘం తెలిపింది. ఒకపక్క కరువు భత్యాలు (డీఏలు) ఇవ్వకుండా.. కొత్త పీఆర్‌సీ ఊసెత్తకుండా ఇలా జీతాల్లో కోతలు పెట్టడం అక్షేపణీయమని సీపీఎస్‌ ఉద్యోగులు ఖండించారు. కొత్త ఆరోగ్య పథకంతో భవిష్యత్తులో రాష్ట్రంలోని 2.60 లక్షల మంది సీపీఎస్ ఉద్యోగులు, ఇప్పటికే రిటైరైన సుమారు 3 వేల మంది తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని 'టీఎస్‌సీపీఎస్‌ఈయూ' ఆవేదన వ్యక్తం చేసింది.

'సాధారణ పాతన పింఛన్‌ పథకం (ఓపీఎస్‌) ఉద్యోగుల తరహాలో సీపీఎస్ రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్ పేమెంట్ ఆర్డర్ (పీపీఓ) నంబర్ ఉండదు. ఈ సాంకేతిక కారణాన్ని చూపుతూ రిటైర్డ్ సీపీఎస్ ఉద్యోగులను ఈ ఉచిత ఆరోగ్య పథకానికి దూరం పెట్టడం సరైనది కాదు' అని సీపీఎస్‌ ఉద్యోగుల సంఘం తెలిపింది. సర్వీసులో ఉన్నంత కాలం ప్రతి నెల మూల వేతనం నుంచి 1.5 శాతం నిధులు కట్ చేసి, రిటైర్ అయిన మరుక్షణం నుంచి హెల్త్ స్కీమ్‌ను వర్తింపజేయకపోతే రిటైర్డ్ ఉద్యోగుల ఆరోగ్య భద్రతకు భరోసా ఏదని సంఘం ప్రశ్నించింది.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి గందరగోళ పరిస్థితులను అదుపు చేయాలని, ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడాలని సీపీఎస్‌ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఆసుపత్రులతో అధికారిక ఒప్పందాలు కుదుర్చుకుని.. పూర్తి విధి విధానాలు పారదర్శకంగా ప్రకటించిన తర్వాతే ఉద్యోగుల సమ్మతితో ఈ పథకాన్ని ముందుకు తీసుకువెళ్లాలని కోరారు. అప్పటివరకు వేతన కోతలను నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారు.

ప్రాన్ నంబర్ ద్వారా సీపీఎస్ పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యుల సమగ్ర డేటాలను ఐఎఫ్ఎంఐఎస్ మాడ్యూల్ ద్వారా సేకరించాలని సీపీఎస్‌ ఉద్యోగ సంఘం కోరింది. పీపీఓ నంబర్ లేకపోవడంతో వారి ప్రాన్ ఐడీల ఆధారంగానే వివరాలు అప్‌లోడ్ చేసుకునేలా సాఫ్ట్‌వేర్ వెసులుబాటు కల్పించాలని విజ్ఞప్తి చేసింది. రిటైర్డ్ సీపీఎస్ ఉద్యోగులకు నగదు రహిత వైద్యం వర్తించకపోతే ప్రస్తుతం విధుల్లో ఉన్న సీపీఎస్ ఉద్యోగుల ఖాతాల నుంచి కూడా ఎలాంటి డబ్బులను హెల్త్ ట్రస్ట్‌కు జమచేయవద్దని ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లతోపాటు రిటైర్డ్‌ ఉద్యోగులు స్పష్టం చేశారు.

0
0
Report
Advertisement

Telangana BJP: ఎంపీ ఈటల రాజేందర్‌పై పోస్టర్లు కలకలం.. తెలంగాణ బీజేపీ ఖండన

Baddipadaga, Telangana:

Eatala Rajender Poster: తెలంగాణ రాజకీయాల్లో ఎంపీ ఈటల రాజేందర్‌పై జరుగుతున్న ప్రచారం ఒక్కసారిగా కలకలం రేపింది. బీఆర్‌ఎస్‌ పార్టీలో సీనియర్‌ నాయకుడిగా కొనసాగిన ఈటల బీజేపీలో చేరిన తర్వాత ఆయనకు వ్యతిరేకంగా గళం వినిపిస్తోంది. పెద్ద ఎత్తున దుష్ప్రచారం జరుగుతుండడం రాజకీయాల్లో కీలక పరిణామంగా మారింది. ఈ క్రమంలో ఉన్నఫళంగా హైదరాబాద్‌లో పోస్టర్లు, బ్యానర్లు కలకలం రేపాయి. బీజేపీకి శాపంగా ఈటల మారాడని ప్రచారం జరగడంతో తెలంగాణ బీజేపీ స్పందించింది. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కీలక ప్రకటన విడుదల చేశారు.

తమ ఎంపీ ఈటల రాజేందర్‌పై జరుగుతున్న ప్రచారాన్ని బీజేపీ నాయకత్వం ఖండించింది. ఈటలను కించపరిచేలా ఏర్పాటుచేసిన బ్యానర్లను తెలంగాణ బీజేపీ నాయకులు, కార్యకర్తలు ముక్తకంఠంతో ఖండిస్తున్నామని ప్రకటించారు. ఇది ఒక నాయకుడిపై వ్యక్తిగత దాడి మాత్రమే కాదని.. తెలంగాణ బీజేపీ ఎదుగుదలను చూసి భయపడుతున్న ప్రత్యర్థి రాజకీయ శక్తుల అసురక్షిత భావానికి నిదర్శనం అని తెలంగాణ బీజేపీ తెలిపింది.

'దాదాపు 40 ఏళ్ల రాజకీయ అనుభవం కలిగిన సీనియర్ నాయకుడు ఈటల రాజేందర్‌.. ప్రజా జీవితంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నాయకుడు. అలాంటి వ్యక్తిని  కించపరిచే ప్రయత్నం చేయడం నీచ రాజకీయాలకు పరాకాష్ఠ' అని తెలంగాణ బీజేపీ నాయకత్వం తెలిపింది. ప్రజల్లో బీజేపీకి పెరుగుతున్న ఆదరణను జీర్ణించుకోలేని అధికార పార్టీతో పాటు ఇతర ప్రత్యర్థి శక్తుల పాత్రపై కూడా సమగ్ర విచారణ జరగాలని బీజేపీ నాయకులు డిమాండ్‌ చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. 

'తెలంగాణ బీజేపీ పూర్తిగా ఐక్యంగా ఉంది. ఇలాంటి కుట్రలు బీజేపీ ఐక్యతను దెబ్బతీయలేవు. తెలంగాణ ప్రజలు నిజాన్ని గమనిస్తున్నారు' అని తెలంగాణ బీజేపీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు తెలిపారు. లేఖ విడుదల చేసిన వారిలో ఎమ్మెల్యేలు ఏలేటి మహేశ్వర్ రెడ్డి, పాయల్ శంకర్, కాటిపల్లి వెంకట రమణ రెడ్డి, డాక్టర్‌ పాల్వాయి హరీష్ బాబు, పవార్ రామరావు పటేల్, పైడి రాకేష్ రెడ్డి, ధన్‌పాల్ సూర్యనారాయణ, ఎమ్మెల్సీలు ఏవీఎన్ రెడ్డి, డాక్టర్‌ సి అంజి రెడ్డి, మల్కా కొమరయ్య ఉన్నారు.

నీ ఏడుపే బీజేపీకి శాపం
ఈటల రాజేందర్‌ను లక్ష్యంగా చేసుకుని హైదరాబాద్‌ శివారు మేడ్చల్‌లోని ఈటెల ఇంటి వద్ద ఓఆర్ఆర్ సర్వీస్ వద్ద వెలసిన ఫ్లెక్సీలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. 'నీ ఏడుపే బీజేపీకి శాపం' అనే శీర్షికతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో ఈటలపై పలు విమర్శలు చేశారు. రాష్ట్ర అధ్యక్ష పదవి రాలేదని, సీఎం అభ్యర్థిగా ప్రకటించలేదని, కేంద్ర మంత్రి పదవి దక్కలేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారంటూ ఫ్లెక్సీల్లో పేర్కొన్నారు. రెండు చోట్ల ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం కల్పించడంతో పాటు ఓటమి అనంతరం మల్కాజిగిరి ఎంపీ టికెట్ ఇచ్చింది బీజేపీ అని గుర్తు చేశారు.
ప్రధాని నాయకత్వంలో గెలుపొందిన తర్వాత కూడా "నా ఇమేజ్‌తోనే గెలిచాను" అని చెప్పడం రాజకీయ నైతికత కాదని ఫ్లెక్సీల్లో విమర్శించారు. బీసీ నాయకుడు ఎదుగుతుంటే అసహనం ఎందుకని, ఎంపీ ధర్మపురి అరవింద్‌కు లభిస్తున్న ఆదరణను చూసి కడుపుమంట ఎందుకని ప్రశ్నించారు. 'నేను బీసీ నాయకుడిని.. నేనే ప్రత్యామ్నాయం' అనే భావన నుంచి బయటకు రావాలని ఈటలకు సూచిస్తూ ఫ్లెక్సీల్లో వ్యాఖ్యలు చేశారు.

0
0
Report

RCB vs GT Highlights: గుజరాత్‌ టైటాన్స్‌ స్వల్ప స్కోర్‌.. బెంగళూరుదే ఐపీఎల్‌ 2026 ట్రోఫీ

Ahmedabad, Gujarat:

RCB On The Race IPL 2026: ఐపీఎల్‌ 2026 ట్రోఫీ ఫైనల్‌ పోరు ఉత్కంఠగా సాగుతోంది. సొంతగడ్డపై ఆడుతున్న గుజరాత్‌ టైటాన్స్‌ తక్కువ పరుగులు నమోదు చేసింది. వరుసగా రెండో ట్రోఫీ సాధించాలనే కసితో ఉన్న రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు బౌలర్లు అద్భుతంగా బౌలింగ్‌ వేసి ప్రత్యర్థిని తక్కువ పరుగులకు కట్టడి చేశారు. ఆరంభం నుంచి వికెట్లు తీస్తూ బౌలర్లు గుజరాత్‌ నడ్డి విరిచారు. ఫలితంగా 00 ఓవర్‌లలో కుప్పకూలింది. ఈ మ్యాచ్‌ ఫస్ట్‌ ఇన్నింగ్స్‌ ఇలా ఉంది.

అహ్మదాబాద్‌ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది. ప్రత్యర్థి బ్యాటింగ్‌కు ఆహ్వానించడంతో గుజరాత్‌ టైటాన్స్‌ తొలుత బ్యాటింగ్‌కు దిగి నిర్ణీత 20 ఓవర్‌లలో 8 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది. ఏ ఒక్క బ్యాటర్‌ కూడా భారీ ఇన్నింగ్స్‌ నమోదు చేయలేకపోయారు. ఒక సిక్సర్‌ కొట్టేందుకు 12 ఓవర్లు ఎదురుచూడాల్సి వచ్చిందంటే ఎంతలా బ్యాటర్లు కష్టపడ్డారో అర్థమవుతోంది.

మంచి జోరులో ఉన్న కెప్టెన్‌ శుభమన్‌ గిల్‌ 8 బంతుల్లో 10 పరుగులు చేసి ఔటవడంతో భారీ షాక్‌ తగిలింది. స్టార్‌ బ్యాటర్‌ సాయి సుదర్శన్‌ మరోసారి తీవ్ర నిరాశపరిచాడు. 12 బంతులు ఆడి 12 పరుగులు చేసి వెనుదిరిగాడు. టాప్‌ బ్యాటర్లు ఔటవడంతో తీవ్ర నిరాశకు గురయిన వేళ నిశాంత్‌ సింధు కొద్దిగా పోరాడి 18 బంతుల్లో 20 పరుగులు చేసి ఔటయ్యాడు. జోస్‌ బట్లర్‌ కొద్దిసేపు గ్రౌండ్‌లో నిలబడి 23 బంతులు ఆడాడు. 20 పరుగులు చేసి సింధు ఔటవగా.. అర్షద్‌ ఖాన్‌ 6 బంతుల్లో 15 పరుగులు చేశాడు. బ్యాటర్లందరూ చేతులెత్తేసిన వేళ వాషింగ్టన్‌ సుంర్‌ గొప్పగా పోరాడి అర్ధ సెంచరీ చేశాడు. 

రెండో ట్రోఫీ కోసం బెంగళూరు బౌలర్లు అద్భుతంగా బంతులు వేసి గుజరాత్‌ టైటాన్స్‌ బ్యాటర్లను భారీ దెబ్బతీశారు. సాధారణ స్కోర్‌ కూడా బ్యాటర్లను చేయకుండా బెంగళూరు బౌలర్లు నియంత్రించారు. జోష్‌ హేజిల్‌వుడ్‌ పొదుపుగా బౌలింగ్‌ చేసి రెండు వికెట్లు తీయగా.. అదే స్థాయిలో బౌలింగ్‌ చేసిన రషీక్‌ సలామ్‌ కూడా రెండు వికెట్లు పడగొట్టాడు. భువనేశ్వర్‌ కూడా రెండు వికెట్లతో సత్తా చాటాడు. కృనాల్‌ పాండ్యా ఒక వికెట్‌కు పరిమితమయ్యాడు.

0
0
Report

Sobhita Dhulipala: సోషల్ మీడియాలో ట్రోల్స్‌పై నోరు విప్పిన నాగచైతన్య భార్య..అందరికి ఇచ్చిపడేసింది!

Hyderabad, Telangana:

Sobhita Dhulipala News: టాలీవుడ్ నటుడు అక్కినేని నాగచైతన్యతో ప్రేమ, ఆ తర్వాత జరిగిన వివాహం కారణంగా నటి శోభితా ధూళిపాళ గత కొన్నేళ్లుగా సోషల్ మీడియాలో నిరంతరం హాట్ టాపిక్‌గా నిలుస్తూనే ఉంది. వీరిద్దరి వ్యక్తిగత విషయాలపై నెటిజన్లు, మీడియా రకరకాల ఊహాగానాలతో కథనాలు అల్లారు. 2024 ఆగస్టులో నిశ్చితార్థం, అదే ఏడాది డిసెంబర్‌లో అత్యంత వైభవంగా వివాహం చేసుకున్న ఈ జంట.. ఇండస్ట్రీలోనే మోస్ట్ టాక్డ్ సెలబ్రిటీ వెడ్డింగ్స్‌లో ఒకటిగా నిలిచింది. అయితే, పెళ్లయిన కొన్ని నెలల తర్వాత శోభిత తన వైవాహిక జీవితంపై, అలాగే తనపై వచ్చే నెగెటివిటీ, ట్రోల్స్‌పై ఎట్టకేలకు ఒక ఇంటర్వ్యూలో మనసు విప్పింది.

ట్రోల్స్‌పై శోభిత సానుకూల దృక్పథం
తన వ్యక్తిగత జీవితంపై జరుగుతున్న చర్చలపై శోభిత ఎంతో సానుకూలంగా స్పందించింది. సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలపై ప్రజలకు ఉండేది కేవలం సహజమైన ఉత్సుకత మాత్రమేనని, అందుకే వారు అంతగా మాట్లాడుకుంటారని ఆమె సానుకూలంగా అభిప్రాయపడింది.

"నేను ఎప్పుడూ నా వ్యక్తిగత జీవితాన్ని ప్రశాంతంగా గడపడానికి ఇష్టపడతాను. నా చుట్టూ ఇతరులు చేసే ప్రతి చర్చకు లేదా విమర్శకు స్పందించాల్సిన అవసరం నాకు లేదు. కాలక్రమేణా నా ఆలోచనా విధానంలో చాలా మార్పు వచ్చింది. ఇప్పుడు ఇతరులు నాపై చేసే నెగెటివ్ కామెంట్లు నా మనశ్శాంతిని ఏమాత్రం దెబ్బతీయలేవు" అని శోభిత ధీమాగా వెల్లడించింది.

ఈ సందర్భంగా సోషల్ మీడియాలో వచ్చే విమర్శలను, ట్రోల్స్‌ను శోభిత మారుతున్న వాతావరణ పరిస్థితులతో పోల్చడం విశేషం. "సోషల్ మీడియాలో ప్రతి చిన్న విషయంపై విపరీతమైన చర్చలు రావడం సర్వసాధారణం. నేను వీటన్నింటినీ వాతావరణ మార్పుల లాంటివేనని అనుకుంటాను. సమాజంలో కూడా కొన్ని వాతావరణ పద్ధతులు ఉంటాయి. దేన్నీ మనం మరీ అంత సీరియస్‌గా తీసుకోకూడదు, ఎందుకంటే ఇవేవీ శాశ్వతం కావు" అని శోభితా చెప్పుకొచ్చింది. 

రూమర్లకు అతీతంగా వైవాహిక బంధం
2021లో సమంతతో నాగచైతన్య విడాకులు తీసుకున్న తర్వాత, 2022 నుండి చైతూ-శోభిత డేటింగ్‌లో ఉన్నట్లు అనేక వార్తలు వచ్చాయి. ఇన్నేళ్లూ ఎన్నో రూమర్లు వచ్చినా, నిశ్చితార్థం జరిగే వరకు ఈ జంట ఎక్కడా నోరు మెదపలేదు. ప్రస్తుతం శోభిత ఇచ్చిన ఈ ఇంటర్వ్యూను బట్టి చూస్తే.. ఆమె బయటి ప్రపంచం, సోషల్ మీడియా ఏమనుకుంటుంది అనే దానికంటే, తన భర్త నాగచైతన్యతో కలిసి తన వ్యక్తిగత సంతోషాన్ని ఆస్వాదించడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు స్పష్టమవుతోంది.

Also Read: స్టార్ యాంకర్‌తో హైపర్ ఆది పెళ్లి..ఎట్టకేలకు పెళ్లిపై స్టార్ కమెడియన్ క్లారిటీ!

Also Read: బాలకృష్ణ చిన్న కూతురు ఒక్క వీడియోతో పాపులర్..ఆమె గురించి ఈ విశేషాలు తెలుసా?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement

South Coast Railway Zone: నెరవేరిన ఆంధ్రుల కల..రేపటి నుంచి విశాఖ కేంద్రంగా దక్షిణా కోస్తా రైల్వే జోన్ ప్రారంభం!

Visakhapatanam, Andhra Pradesh:

South Coast Railway Zone Start Date: ఆంధ్రప్రదేశ్ ప్రజల దశాబ్దాల కల నెరవేరబోతోంది. విశాఖపట్నం కేంద్రంగా 'దక్షిణ కోస్తా రైల్వే జోన్' (South Coast Railway Zone) జూన్ 1 నుంచి అధికారికంగా అందుబాటులోకి రానుంది. ఈ నూతన జోన్ ఏర్పాటుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను రైల్వే బోర్డు శరవేగంగా పూర్తి చేస్తోంది.

కొత్త జోన్ ప్రారంభ ప్రక్రియ పనులను సకాలంలో పూర్తి చేయడం కోసం అనుబంధ జోన్లు, డివిజన్ల పరిధిలోని ఉద్యోగుల ఆదివారం సెలవును రైల్వే శాఖ రద్దు చేసింది. సిబ్బంది అంతా అత్యవసరంగా విధులకు హాజరుకావాలని ఆదేశాలు జారీ అయ్యాయి.

అలాగే ఈ నూతన రైల్వే జోన్ పరిధిలోకి రానున్న విజయవాడ, గుంతకల్లు, గుంటూరు డివిజన్ల డివిజనల్ రైల్వే మేనేజర్లు (DRMs) పాలనాపరమైన బదిలీలు, అధికారిక ప్రక్రియల నిమిత్తం విశాఖపట్నం చేరుకుంటున్నారు.

ఈ దక్షిణ కోస్తా రైల్వే జోన్‌కు సంబంధించిన అధికారిక సమాచార మార్పిడి, పాలనాపరమైన కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు వీలుగా బాలాజీ కిరణ్ను చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ (CPRO)గా నియమించారు. జూన్ 1 నుంచి ఈ దక్షిణ కోస్తా రైల్వే జోన్ పూర్తిస్థాయిలో అమల్లోకి రానుండటంతో, ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే మౌలిక వసతుల కల్పన, రవాణా రంగ అభివృద్ధిలో సరికొత్త అధ్యాయం ప్రారంభం కానుంది.

Also REad: భారత్‌లో ప్రజలు ఏడాది పాటు బంగారం కొనకపోతే ఏం జరుగుతుంది? గోల్డ్ రేట్ తగ్గిపోతుందా?

Also Read: ఢిల్లీ రాజకీయాల్లోకి వైఎస్ షర్మిళ..కర్ణాటక నుంచి రాజ్యసభ సీటు..రాహుల్ గాంధీతో భేటీ!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

KTR Challenge: దమ్ముంటే రేవంత్‌ రెడ్డి 420 హామీలు అమలు చేయాలి: కేటీఆర్‌

Secunderabad, Telangana:

Congress 420 Promises: తెలంగాణలో సవాళ్లు, ప్రతి సవాళ్లు కొనసాగుతున్నాయి. రేవంత్‌ రెడ్డి విసిరిన సవాల్‌కు మాజీ మంత్రి కేటీఆర్‌ స్పందించి ప్రతి సవాల్‌ విసిరారు. దమ్ముంటే ఇచ్చిన 420 హామీలు అమలు చేస్తేనే ఎన్నికల్లో పోటీ చేస్తానని రేవంత్‌ రెడ్డి ప్రకటించాలని భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఛాలెంజ్‌ చేశారు. రైతుల మోటార్లకు మీటర్లు పెడితే ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పి రేవంత్‌ రెడ్డి మరోసారి అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read: Alcohol Consumption: దేశంలోనే తెలంగాణ నంబర్‌వన్‌.. మద్యపానంలో జాతీయ రికార్డు బద్దలు

హైదరాబాద్‌లోని సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, యువ నాయకుడు మన్నె క్రిశాంక్‌తో కలిసి పాల్గొన్న కేటీఆర్‌ కీలక ప్రసంగం చేశారు. 'డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, ఇందిరమ్మ ఇండ్లు కట్టకుంటే ఎన్నికల్లో పోటీ చేయం, మోటార్లకు మీటర్లు పెట్టకుంటే పోటీ చేయం అన్న సవాళ్లు కాకుండా, 420 హామీలు, ఆరు గ్యారెంటీలు అమలు చేయకుంటే పోటీ చేయమని ప్రకటించాలి' అంటూ కాంగ్రెస్‌ పార్టీ, రేవంత్‌ రెడ్డికి మాజీ మంత్రి కేటీఆర్ సవాల్‌ విసిరారు. రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రైతులకు కేవలం 3 గంటల కరెంట్ ఇస్తే సరిపోతుందని చెప్పాడనని గుర్తుచేశారు. 

'సరిగ్గా అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని ఆచరణలోకి తీసుకువచ్చేందుకే రైతు డిస్కం ఏర్పాటు. 24 గంటల ఉచిత కరెంట్‌ను ఎగగొట్టేందుకే ఈ ప్రత్యేక రైతు డిస్కమ్‌. కేసీఆర్ గుర్తులు చెరిపేస్తాన్నంటున్న రేవంత్ రెడ్డి.. చివరికి రైతులకు ఇచ్చే 24 గంటల కరెంట్‌ను కూడా ఆపే కుట్ర చేస్తున్నారు' అని మాజీ మంత్రి కేటీఆర్‌ ఆందోళన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి చెప్పింది చేయడని, ఇచ్చిన హామీ నెరవేర్చడనే విషయం తెలంగాణ ప్రజలకు అర్థమైందని తెలిపారు.

Also Read: Dmart Offers: స్కూల్స్‌ రీపెన్‌ వేళ డీమార్ట్‌ భారీ ఆఫర్లు.. తక్కువ ఖర్చుకే ఎక్కువ

రైతులకు ఉచిత విద్యుత్‌ను పూర్తిగా రద్దు చేసేందుకు ప్రత్యేకంగా రైతు డిస్కం తీసుకొస్తున్నారని మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ప్రారంభించిన ఉచిత విద్యుత్‌ను రైతులకు అందకుండా చేసేందుకు కాంగ్రెస్ కుట్ర చేస్తోందని మండిపడ్డారు. లోపల ఇంతటి దారుణమైన రైతు వ్యతిరేక కుట్రను దాచుకొని.. పైకి మాత్రం ఉచిత విద్యుత్‌ కోసమే ప్రత్యేక రైతు డిస్కమ్‌ తీసుకువస్తున్నామని రేవంత్ రెడ్డి అబద్ధాలు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రైతు డిస్కమ్‌ అంటే రైతు మెడకు ఉరి
నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉందో, రేవంత్ రెడ్డికి రైతుల మీద అంతే ప్రేమ ఉందని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి రైతు డిస్కమ్‌ అంటే రైతు మెడకు ఉరి పెట్టినట్టే అని పేర్కొన్నారు. రైతు డిస్కమ్‌ ద్వారా ఉచిత కరెంట్‌ను పూర్తిగా రద్దు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారని న్నారు. తెలంగాణ రైతులపై జరుగుతున్న ఈ కుట్రను నగరంలో ఉన్న తెలంగాణ పౌరులు కూడా వ్యతిరేకించి వారికి అండగా నిలవాలని మాజీ మంత్రి కేటీఆర్‌ పిలుపునిచ్చారు.

రేవంత్ రెడ్డి చెప్పింది చేయడని.. ఇచ్చిన హామీ నెరవేర్చడనే విషయం తెలంగాణ ప్రజలకు అర్థమైందని కేటీఆర్ పేర్కొన్నారు. ఈరోజు రైతు డిస్కమ్‌పై రేవంత్ రెడ్డి చెబుతున్న మాటలు అన్నీ ముమ్మాటికి అబద్ధాలేనని విమర్శించారు. ఆయన ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయకుండా.. తెలంగాణలోని అన్ని వర్గాలను మోసం చేసిన విషయాన్ని ప్రజలు, రైతులు గుర్తుంచుకోవాలని సూచించారు.

0
0
Report

Kaleshwaram: కాళేశ్వరంలో భక్తుల జాతర.. త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు, ముక్తేశ్వరుడి దర్శనం!

Hyderabad, Telangana:

Kaleshwaram Latest News: ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాలేశ్వరం ఆదివారం భక్తజన సంద్రమైంది.. ఎటు చూసినా శివనామ స్మరణతో మారు మోగిపోతోంది. గోదావరితో పాటు ప్రాణహిత, అంతర్వాహిని సరస్వతీ నదుల సంయోగం అయిన పవిత్ర త్రివేణి సంగమం తీరంలో పుణ్యస్నానాలు ఆచరించి.. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తుతున్నారు.. ప్రధాన ఉత్సవాలు ముగింపు దశకు చేరుకోవడంతో.. చివరి రెండు రోజులు మాత్రమే సమయం ఉండడంతో వివిధ ప్రాంతాల నుంచి జనం తండోపతండాలుగా తరలివస్తున్నారు. కనుచూపు మేరలో త్రివేణి సంగమ తీరమంతా భక్తులు ఏర్పాటు చేసుకున్న తాత్కాలిక గుడారాలతో జనారణ్యంగా  దర్శనమిస్తూ వస్తోంది.

ఉత్సవాల ముగింపు సమయం దగ్గర పడటంతో పరిసర ప్రాంతాల ప్రజలతో పాటు ఉమ్మడి కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాలనుంచి పెద్ద ఎత్తున భక్తులు కాళేశ్వరానికి చేరుకుంటున్నారు. ప్రైవేట్ వాహనాలతో పాటు ఆర్టీసీ బస్సుల్లో భక్తులు తరలిరావడంతో కాలేశ్వరం పరిసర రహదారులన్నీ కిక్కిరిసిపోయాయి. భక్తులు తెల్లవారి జామునే లేచి త్రివేణి సంగమ పవిత్ర జలాల్లో పుణ్యస్నానాలు ఆచరించడంతోపాటు తమ పితృదేవతలకు పిండ ప్రదానాలు, తర్పణాలు వదులుతున్నారు. అనంతరం నదీ తీరాన దీపాలు వెలిగించి ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తూ వస్తున్నారు. 

నదీ స్నానాలు ముగించుకున్న భక్తులు శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి క్యూ లైన్‌లలో వేచి ఉంటున్నారు.. భక్తుల రద్దీ సాధారణం కంటే చాలా ఎక్కువగా ఉండడంతో దర్శనానికి గంటల తరబడి సమయం పడుతోంది. అయినప్పటికీ భక్తులు ఎంతో ఓపికగా క్యూలైన్లోనే నిలబడి స్వామివార్లను దర్శించుకుంటున్నారు. ఆలయ అధికారులతో పాటు అర్చకులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తున్నారు. మహాముక్తేశ్వరుడికి అభిషేకంతో పాటు అర్చనలు చేస్తూ భక్తులంతా భక్తిలో మునిగిపోతున్నారు..

Also Read: Telangana Heat Waves: తెలంగాణలో మరింత తీవ్రంగా ఎండలు.. బయటకు వెళ్లాలంటే భయపడే పరిస్థితి..

చివరి రోజుల్లో రద్దీ మరింత పెరిగే అవకాశాలు ఉండడంతో పోలీసు యంత్రాంగంతో పాటు ఆలయ కమిటీ అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. నది తీరంలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ప్రత్యేకమైన గజ ఈతగాళ్లను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఘాట్‌ల వద్ద భద్రతను మరింత పతిష్టం చేశారు. తాగునీటితో పాటు పారిశుద్ధ్యం పై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. త్రివేణి సంగమం సాక్షిగా సాగుతున్న ఈ ఆధ్యాత్మిక సంబరం భక్తుల్లో సరికొత్త భక్తి భావాన్ని నింపుతోంది..

Also Read: Telangana Heat Waves: తెలంగాణలో మరింత తీవ్రంగా ఎండలు.. బయటకు వెళ్లాలంటే భయపడే పరిస్థితి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

0
0
Report
Advertisement

Viral Video: బాబోయ్.. కంచం నిండా మిరపకాయలు పెట్టుకుని ఎలా తినేస్తున్నాడో చూడండి.. వైరల్ వీడియో!

Hyderabad, Telangana:

 Green Chilli Eating Challenge Viral Video Watch: సోషల్ మీడియా పుణ్యమా అని నిత్యం ఏదో ఒక వింత వీడియో సోషల్ మీడియా వినియోగదారుల ముందుకు వస్తూనే ఉంది. లైకులతో పాటు వ్యూస్ కోసం కొందరు చేసే సాహసాలు ఒక్కొక్కసారి ఆశ్చర్యపోయేలా చేస్తే.. మరికొన్నిసార్లు భయాందోళనకు గురి చేస్తూ ఉంటాయి.. తాజాగా అలాంటి కోవాకు చెందిన ఆశ్చర్యం కలిగించే వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో వైరల్ అవుతూ వస్తోంది. సాధారణంగా కూరగాయల్లో ఒకటో రెండో పచ్చిమిరపకాయలు ఎక్కువైతేనే కారంతో నోరంతా మండిపోతూ ఉంటుంది.. కానీ ఈ వీడియోలో వ్యక్తి మాత్రం అత్యంత ఘాటైన పచ్చిమిరపకాయలను థియేటర్లలో లభించే పాప్‌కార్న్ తిన్నట్లు రెండు చేతులతో గుప్పిళ్ళకొద్దీ నోట్లో వేసుకుని నమిలేస్తున్నాడు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియోనే వైరల్‌గా మారింది.. 

వైరల్ అవుతున్న ఈ వీడియోలో సదరు వ్యక్తి తన ముందు ఒక పెద్ద కంచం నిండా పచ్చిమిరపకాయలను పెట్టుకొని కూర్చుని ఉన్నాడు.. దాదాపు రెండు నుంచి మూడు కేజీలకు పైగా ఉన్న ఆ పచ్చిమిరపకాయలను అతని ఏమాత్రం లెక్కచేయకుండా తినడం ప్రారంభించాడు. ఒకటి రెండు కాదు.. ఒకేసారి పదుల సంఖ్యలో మిరపకాయలను రెండు చేతులతో తీసుకొని నోట్లో కుక్కుకుంటూ.. కటకటా నములుతూ మింగేస్తున్నాడు.. ఈ దృశ్యాలు చూస్తున్న వారికే నోరు మండిపోయేలా ఉన్నాయి..

మిరపకాయల్లోని ఘాటుతో పాటు క్యాప్సైసిన్ ప్రభావంతో కాసేపటికే ఆ వ్యక్తి తీవ్ర ఇబ్బందికి గురయ్యాడు. కళ్ల వెంట నీళ్లు తిరగడంతో పాటు ముఖమంతా ఎర్రగా మారిపోవడం.. కారంతో విలవిలలాడటం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది.. అయినప్పటికీ మొండిగా ఆ కారాన్ని భరిస్తూ.. మధ్య మధ్యలో కాస్త ఇబ్బంది పడుతూనే అతని ప్లేట్లో ఉన్న మిరపకాయలన్నింటిని ఖాళీ చేసే ప్రయత్నం చేస్తున్నాడు..

 
 
 
 
 

ఈ షాకింగ్ వీడియో ఇప్పుడు ఇన్స్టాగ్రామ్‌లో విపరీతంగా వైరల్ అవుతుంది. ఈ వీడియోను ఇప్పటివరకు కొన్ని వేల మందికి పైగా సోషల్ మీడియా వినియోగదారులు వీక్షించినట్లు తెలుస్తోంది. అయితే వీడియో చూసిన సోషల్ మీడియా వినియోగదారులు రకరకాలుగా స్పందిస్తూ వస్తున్నారు.. వీడికి కడుపులో పేగులు బద్దలై పోవడం ఖాయమని.. వ్యూస్ కోసం ఇంత పిచ్చా అని అంటూ సోషల్ మీడియా వినియోగదారులు వీడియో కింద కామెంట్లు పెడుతూ వస్తున్నారు..

Also Read:  Video Viral: సాయం ముసుగులో అరాచకం.. యువతి ప్రైవేటు పార్ట్ మీద చెయ్యి వేసి మరీ.!. వీడియోపై దుమారం..

మరో వైపు వైద్య నిపుణులు కూడా ఈ వీడియో పై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకేసారి ఎన్ని పచ్చిమిరపకాయలు తింటే కడుపులో తీవ్రమైన అల్సర్లు రావడంతో పాటు పెద్ద పేగులు కాలిపోవడం, అంతర్గత రక్తస్రావం జరిగి ప్రాణాలకే ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని.. ఎవరు కూడా ఇలాంటి పిచ్చి పనులు ప్రయత్నించవద్దని హెచ్చరిస్తున్నారు. సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యేందుకు ఇలాంటి కంటెంట్ తెచ్చుకోవడం అసలు సరికాదని వారు చెబుతున్నారు..

Also Read:  Video Viral: సాయం ముసుగులో అరాచకం.. యువతి ప్రైవేటు పార్ట్ మీద చెయ్యి వేసి మరీ.!. వీడియోపై దుమారం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్.. - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..

  

0
0
Report

RCB vs GT: ఐపీఎల్‌ ఫైనల్‌పై పోలీసుల తీవ్ర ఆంక్షలు.. బెంగళూరు ఫ్యాన్స్‌కు తీవ్ర నిరాశ!

Bengaluru, Karnataka:

Bengaluru Police: టాటా ఐపీఎల్ 2026 నేటితో ముగియనుండగా ఆదివారం ఫైనల్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్‌ టైటాన్స్‌ ఆడుతున్న విషయం తెలిసిందే. టైటిల్‌ రేసులో రాయల్‌ చాలెంజర్స్‌ ఉండడంతో వారి సొంత గడ్డ బెంగళూరులో ఉత్సాహ వాతావరణం ఉంది. తమ జట్టు గెలిస్తే సంబరాలు చేసుకునేందుకు భారీ ప్రణాళికలు వేసుకోగా.. వారికి బెంగళూరు పోలీసులు తీవ్ర నిరాశకు గురి చేశారు. ఒకవేళ బెంగళూరు జట్టు గెలిస్తే సంబరాలు చేసుకోవడానికి ఎలాంటి అనుమతి లేదని పోలీసులు ప్రకటించారు. ఐపీఎల్‌ ఫైనల్‌ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా రోజంతా బెంగళూరు నగరంలో తీవ్ర ఆంక్షలు విధించారు. గతేడాది ఆర్‌సీబీ ట్రోఫీ గెలిచిన సందర్భంగా నిర్వహించిన వేడుకల్లో 11 మంది చనిపోవడంతో బెంగళూరు పోలీసులు అప్రమత్తమై తీవ్ర ఆంక్షలు విధించారు.

Also Read: Alcohol Consumption: దేశంలోనే తెలంగాణ నంబర్‌వన్‌.. మద్యపానంలో జాతీయ రికార్డు బద్దలు

ఐపీఎల్‌ ఫైనల్‌ మ్యాచ్‌కు ముందు.. మ్యాచ్ సమయంలో.. తర్వాత నగరంలో ఎలాంటి సంబరాలు, కార్యక్రమాలకు అనుమతి లేదని బెంగళూరు పోలీసులు తేల్చి చెప్పారు. శాంతిభద్రతలు పరిరక్షించేందుకు బెంగళూరు పోలీసులు ఈ కఠిన నిర్ణయాలు తీసుకున్నాయి. ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ పోలీసులు కీలక ప్రకటన చేశారు. నగరంలో ట్రాఫిక్ జామ్‌లు, శాంతిభద్రతల సమస్యలు, వేడుకలతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు బెంగళూరు నగరంలో ప్రత్యేక ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు.

ఐపీఎల్‌ ఫైనల్‌ మ్యాచ్ ఫలితం తర్వాత అభిమానులు బహిరంగ ప్రదేశాల్లో గుంపులుగా చేరి వేడుకలు చేసుకోరాదని పోలీసులు సూచించారు. ఈ వేడుకలతో ప్రజల భద్రతకు ముప్పు వాటిల్లడమే కాకుండా ఇబ్బందులు ఎదురవుతాయని పోలీసులు వివరించారు. ఈ క్రమంలో టపాసులు పేల్చడం, బైక్ ర్యాలీలు చేయడం వంటివి నిషేధం అని బెంగళూరు పోలీసులు స్పష్టం చేశారు. సంబరాల పేరుతో టపాసులు కాల్చడం, ఊరేగింపులు చేయడం వంటివి నిషేధించారు.

Also Read: Dmart Offers: స్కూల్స్‌ రీపెన్‌ వేళ డీమార్ట్‌ భారీ ఆఫర్లు.. తక్కువ ఖర్చుకే ఎక్కువ

లైవ్‌ స్ట్రీమ్‌పై ఆంక్షలు
ఐపీఎల్‌ ఫైనల్‌ మ్యాచ్‌కు సంబంధించి బెంగళూరు నగరంలో స్క్రీనింగ్‌లపై కూడా పోలీసులు ఆంక్షలు విధించారు. ముందస్తు అనుమతి లేకుండా బహిరంగ ప్రాంతాల్లో ఎల్‌ఈడీ స్క్రీన్‌లను ఏర్పాటు చేయడాన్ని పోలీసులు నిషేధించారు. మాల్స్, పబ్‌లు, రెస్టారెంట్లు లేదా ఇతర ప్రాంతాల వెలుపల సాధారణ ప్రజలకు కనిపించేలా మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారాలను నిర్వహించరాదని పోలీసులు ఆదేశించారు.

ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
సోషల్ మీడియాలో పుకార్లు, రెచ్చగొట్టే సందేశాలు లేదా ద్వేషపూరిత కంటెంట్‌ను షేర్ చేయవద్దని నెటిజన్లకు బెంగళూరు పోలీసులు సూచించారు. ప్రత్యర్థి జట్ల అభిమానులను ఎగతాళి చేయడం, రెచ్చగొట్టడం లేదా అవమానించడం వంటివి చేయవద్దని, ఇవి అనవసరమైన గొడవలకు దారితీస్తాయని పోలీసులు స్పష్టం చేశారు. పైన పేర్కొన్న అంశాలను ఉల్లంఘించినా లేదా ప్రజా భద్రతకు, శాంతిభద్రతలకు భంగం కలిగించేలా ప్రవర్తించిన వారిపై కఠినమైన చర్యలు ఉంటాయని పోలీసులు హెచ్చరించారు.

ఇవి నిషేధం
బైక్ ర్యాలీలు, మితిమీరిన వేగంతో వెళ్లడం, ప్రమాదకరమైన స్టంట్లు చేయడం, అనవసరంగా హారన్లు కొట్టడం, రోడ్ల దిగ్బంధం, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం, ప్రజా జీవనానికి ఇబ్బంది కలిగించడం, గొడవలకు దిగడం, వేడుకల పేరుతో అసభ్యంగా ప్రవర్తించడం

0
0
Report

Kavitha: ఆ విషయం రేవంత్‌ రెడ్డి ప్రెస్‌మీట్‌ పెట్టి చెప్పగలడా? మాజీ ఎమ్మెల్సీ కవిత నిలదీత

Hyderabad, Telangana:

Farmer Discom Proposal: రైతు డిస్కం ఏర్పాటు చేసి మిగతా రెండు డిస్కంలు ప్రైవేట్ పరం చేసే కుట్ర జరుగుతోందని మాజీ ఎమ్మెల్సీ కవిత ఆందోళన వ్యక్తం చేశారు. తాము అలాంటి ప్రయత్నాలు చేయడం లేదని రేవంత్‌ రెడ్డి ప్రెస్‌మీట్ పెట్టి చెప్పగలరా? తెలంగాణ రక్షణ సేన వ్యవస్థాపకురాలు కవిత నిలదీశారు. ఉచిత విద్యుత్ తీసేయం, మోటార్లకు మీటర్లు పెట్టబోమని ప్రజలకు స్పష్టతనివ్వాలని కోరారు. విద్యుత్ సంస్కరణాల్లో భాగంగా కేంద్రం చేపడుతున్న చర్యలకు రాష్ట్రం వత్తాసు పలుకుతోందని మండిపడ్డారు.

ఎట్టి పరిస్థితుల్లో పర్మిషన్ ఇవ్వొద్దు
'రైతులకు సంబంధించి డిస్కం విషయంలో ఈఆర్సీ వారి అభిప్రాయాలు తీసుకోవాలి. రైతులకు నష్టం చేసే ఈ డిస్కం కు ఈఆర్సీ ఎట్టి పరిస్థితుల్లో పర్మిషన్ ఇవ్వొద్దు' అని మాజీ ఎమ్మెల్సీ కవిత కోరారు. తెలంగాణ జాగృతి తరఫున కేసు కూడా వేశామని.. పర్మిషన్ ఇస్తే సుప్రీంకి వెళ్లైనా అడ్డుకుంటామని ప్రకటించారు. దసరా పండుగలోపు పాలమూరు ఎత్తిపోతల పథకంలో లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ ప్రారంభించకపోతే తెల్లారి నుంచే పాదయాత్ర చేస్తానని కవిత తెలిపారు.

'రైతు డిస్కం గురించి ఆరు నెలల పాటు రహాస్యంగా ఉంచిన తర్వాత నిన్న చిట్‌చాట్‌లో రేవంత్‌ రెడ్డి మాట్లాడారు. 24 గంటల కరెంట్ ఎత్తివేయం, మోటార్లకు మీటర్లు పెట్టమని చెబుతున్నారు. అలా చేస్తే ఎన్నికలకే వెళ్లమని అంటున్నారు. కానీ ఈ మాటను ఆయన ప్రెస్‌మీట్ ద్వారా చెప్పాలి. లేదంటే తర్వాత నేను అనలేదని మాట మార్చుతారు. బహిరంగ సభల్లో ఇచ్చిన మాటలనే తప్పిన రేవంత్‌ రెడ్డికి ఇది ఒక లెక్క కాదు. అప్పుడు నమ్మిన ప్రజలు, రాసిన పత్రికలు పూల్స్ అవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది' అని కవిత వివరించారు.

ప్రైవేట్ పరం చేసే కుట్ర
'రైతు డిస్కం ఏర్పాటు చేసి మిగతా రెండు డిస్కంలను ప్రైవేట్ పరం చేసే కుట్ర చేస్తున్నారు. మిగతా రెండు డిస్కమ్‌లను ప్రైవేట్ పరం చేస్తే ఎన్నికల్లో ప్రజలను ఓట్లు అడగబోమని రేవంత్ రెడ్డి ప్రజలకు స్పష్టతనివ్వాలి' అని మాజీ ఎమ్మెల్సీ కవిత సవాల్‌ చేశారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కుట్రలతో తమకు అనుమానం కలుగుతోందని తెలిపారు. సోలార్ ప్యానెల్స్‌కు సంబంధించి ఇండియాలో బ్యాటరీలు తయారు చేసే కంపెనీలకు అవకాశం అంటూ కేంద్రం చెబుతోందని చెప్పారు. అలా అయితే ఒక రిలయన్స్, ఒక అదానీ కంపెనీలకు మాత్రమే అవకాశం ఉంటుందని కవిత వివరించారు. 

'చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకొని సోలార్ ప్యానెల్స్, బ్యాటరీలు తయారు చేసే చాలా కంపెనీలు ఉన్నాయి. ఆయా కంపెనీలన్నింటికీ చరమగీతం పాడేలా కుట్ర చేస్తున్నారు. కేవలం ఐదు రోజులు సమయం ఇవ్వటంతో చాలా చిన్న కంపెనీలకు నష్టం జరిగే పరిస్థితి ఉంటుంది. చిన్న వ్యాపారులంతా కూడా దీనిపై ధర్నా చేస్తామని చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం వ్యాపారులందరికీ అవకాశం ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి' అని మాజీ ఎమ్మెల్సీ కవిత తెలిపారు.

విద్యుత్ సంస్కరణాల్లో భాగంగా కేంద్రం ఒక్కొక్క జీవో ఇస్తుంటే ప్రైవేటుపరం చేసేందుకు అనుకూలంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ఉన్నాయని తెలంగాణ రక్షణ సేన వ్యవస్థాపకురాలు కవిత ఆందోళన వ్యక్తం చేశారు. 'రైతు డిస్కమ్‌కు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో పర్మిషన్ ఇవ్వవద్దని ఈఆర్సీని కోరుతున్నాం. దీన్ని కచ్చితంగా మేము ఆపి తీరుతాం' అని ప్రకటించారు. ఈ డిస్కమ్‌కు సంబంధించి వినియోగదారులంతా కూడా రైతులేనని స్పష్టం చేశారు. అందుకే వారి అభిప్రాయాలు తీసుకోవాలని.. మొత్తం తెలంగాణలోని అన్ని జిల్లాల్లో పబ్లిక్ హియరింగ్ పెట్టాలని కోరారు.

సుప్రీంకోర్టు వరకు వెళ్లి అడ్డుకుంటా
ఒక వేళ ఈఆర్సీ పర్మిషన్ ఇచ్చినా సరే సుప్రీంకోర్టు వరకు వెళ్లి దాన్ని అడ్డుకుంటామని మాజీ ఎమ్మెల్సీ కవిత ప్రకటించారు. ఇప్పటికే తెలంగాణ జాగృతి స్వచ్చంధ సంస్థ ద్వారా తాము కేసు వేశామని తెలిపారు. 'రైతు భరోసా ఇప్పుడు రెండు ఎకరాలలోపు వారికే ఇచ్చారు. రైతు రుణమాఫీ 30 శాతం మందికి కాలేదు. బోనస్ ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారు. చివరి గింజ వరకు ధాన్యం కొంటమని చెప్పి ఇప్పటికీ కొనుగోలు సరిగా చేయటం లేదు' అని రేవంత్ రెడ్డి వైఫల్యాలను కవిత వివరించారు.

రైతు బీమాను యాక్సిడెంటల్ బీమాగా మార్చేసే కుట్ర చేశారని. ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం చేపట్టిన అన్ని చర్యలు రైతులకు వ్యతిరేకంగానే ఉన్నాయని రేవంత్‌ రెడ్డి రైతులకు చేసిన ద్రోహాన్ని మాజీ ఎమ్మెల్సీ కవిత వివరించారు. 'ఈ ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే మీడియా హైడ్రాను సమర్థిస్తూ వార్తలు రాస్తోంది. బడా వ్యక్తులు చేసే కబ్జాలపై నేను ఇచ్చిన ఫిర్యాదులను హైడ్రా పక్కన పెట్టింది. అంటే పెద్ద వాళ్లను కాపాడుతూ పేద వాళ్లను ఇబ్బంది పెట్టేలా హైడ్రా చర్యలు ఉన్నాయి' అని మాజీ ఎమ్మెల్సీ కవిత తెలిపారు.

త్వరలో పాదయాత్ర
పాలమూరు ప్రాజెక్ట్ గురించి మేము అడగగానే ముఖ్యమంత్రి రివ్యూ చేస్తానని చెప్పారు. ఆయన కుమ్మెర అనే గ్రామానికి వెళ్తున్నట్లు తెలిసింది. అదే గ్రామంలో కులవివక్షతో ఒక పసిగుడ్డును చంపేశారు. 
రేవంత్‌ రెడ్డి ఆ కుటుంబాన్ని పరామర్శించి వారిని ఆదుకోవాలి' అని కోరారు. పాలమూరు ప్రాజెక్టులో భాగంగా లక్ష్మీదేవిపల్లిలో రిజర్వాయర్ ప్రారంభించాలని.. దసరాలోపు ప్రభుత్వం ఆ పని మొదలు పెట్టకపోతే ఆ మరుసటి రోజు నుంచే పాదయాత్ర చేస్తామని కవిత ప్రకటించారు.

0
0
Report
Advertisement
Advertisement
Back to top