icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

NEET అభ్యర్థులకు గుడ్ న్యూస్.. జూన్ 21న ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం..

Hyderabad, Telangana:

Tgsrtc Free Bus Travel Latest News: వైద్య విద్యా కోర్సుల్లో అడ్మిషన్ కోసం  నీట్ (NEET) పరీక్ష రాసే విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తను అందించింది. జూన్ 21వ తేదీన జరగబోతున్న నీట్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులందరికీ టీజీఎస్ఆర్‌టీసీ (TGSRTC) బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ.. విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా పరీక్షా కేంద్రాలకు చేరుకునేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

హాల్ టికెట్ చూపిస్తే చాలు.. ఫ్రీ జర్నీ..
మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాల మేరకు.. జూన్ 21న పరీక్ష రాయబోయే విద్యార్థులు తమ వెంట  నీట్ హాల్ టికెట్ ఉంచుకుంటే సరిపోతుంది. బస్సు ఎక్కేటప్పుడు కండక్టర్‌కు హాల్ టికెట్‌తో పాటు ఏదైనా గుర్తింపు కార్డు చూపిస్తే.. పరీక్షా కేంద్రాలకు ఉచితంగా ప్రయాణించవచ్చని అధికారిక ప్రకటనలో భాగంగా పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రధాన నగరాల్లోని పరీక్షా కేంద్రాలకు వచ్చే విద్యార్థులకు ఆర్థిక భారం తప్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం..

ఆర్టీసీ MDకి మంత్రి కీలక ఆదేశాలు..
ఈ ఉచిత ప్రయాణ నిర్ణయాన్ని క్షేత్రస్థాయిలో పక్కాగా అమలు చేయాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్.. ఆర్టీసీ ఎండీకి స్పష్టమైన ఆదేశాలు అధికారికంగా జారీ చేశారు. పరీక్ష రోజున విద్యార్థుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి.. పరీక్షా కేంద్రాల మార్గాల్లో ప్రత్యేక బస్సులను నడపాలని సూచించారు. ఏ ఒక్క విద్యార్థి కూడా రవాణా సౌకర్యం లేక ఇబ్బంది పడకూడదని, అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.

Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!

సర్కార్ సానుకూల స్పందన..
ఇటీవల దేశవ్యాప్తంగా నీట్ పరీక్షకు సంబంధించి జరిగిన పరిణామాల నేపథ్యంలో రీ-ఎగ్జామ్ రాయబోతున్న విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. ఈ తరుణంలో గ్రామీణ విద్యార్థులపై ప్రయాణ ఖర్చుల భారం పడకుండా ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని ఎన్‌ఎస్‌యూఐ (NSUI) సహా పలు విద్యార్థి సంఘాలు మంత్రిని కలిసి విజ్ఞప్తి చేశాయి. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సానుకూల నిర్ణయం తీసుకోవడంపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

0
0
Report

Trigrahi Yog In Cancer 2026: జూన్ 22 నుంచి ఈ 4 రాశుల వారికి గోల్డెన్ డేస్.. మోస్ట్ పవర్‌ఫుల్ త్రిగ్రహ యోగం!

Hyderabad, Telangana:

Trigrahi Yog In Cancer 2026 Effect On Zodiac: జూన్ 22వ తేదిన ఒక ఖగోళ సంయోగం జరగబోతోంది. ఈ సమయంలో ఎంతో శక్తివంతమైన త్రిగ్రహ యోగం ఏర్పడబోతోంది. ముఖ్యంగా ఈ సమయంలో కొన్ని రాశులవారు వృత్తితో పాటు వ్యాపారంలో గొప్ప పురోగతి సాధించే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా కొన్ని గ్రహాలు ఈ సమయంలో కలయిక జరపడం కారణంగా మోస్ట్ పవర్‌ఫుల్ త్రిగ్రహ యోగం ఏర్పడింది. ఈ యోగం జూన్ 22న కర్కాటక రాశిలో ఏర్పడబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారిపై ఊహించని ప్రభావం పడుతుంది.

జ్యోతిష్య శాస్త్ర ప్రకారం.. జూన్ 2న దేవదేవుడైన గురుడు కర్కాటక రాశిలోకి సంచారం చేయగా.. జూన్ 8న ఐశ్వర్యానికి అధిపతి అయిన శుక్రుడు అదే రాశిలోకి సంచారం చేశాడు.. ఇదిలా ఉంటే జూన్ 22న బుధుడు కూడా కర్కాటక రాశిలోకి ప్రవేశించబోతున్నాడు.. దీని ఫలితంగా.. మూడు ప్రధాన శుభ గ్రహాలైన బుధ, గురు, శుక్ర గ్రహాల కలయిక ఒకే రాశిలో జరగడం కారణంగా ఈ శక్తివంతమైన త్రిగ్రహ యోగం ఏర్పడబోతోంది. ఈ శక్తివంతమైన యోగంతో నాలుగు రాశులవారి జీవితాల్లో గోల్డెడ్‌ డేస్‌ ప్రారంభం కాబోతున్నాయి. ముఖ్యంగా ఉద్యోగాల పాటు, వ్యాపారాలు, వృత్తి పరంగా చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ సమయంలో భారీగా పురోగతి కలుగుతుంది. 

కర్కాటక రాశి:
మోస్ట్‌ పవర్‌ఫుల్ త్రిగ్రహ యోగంతో వ్యాపారాలు చేసేవారికి నిలిపోయిన పనులు కూడా తిరిగి పొందే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా మార్కెటింగ్‌తో పాటు మీడియా, రచన లేదా డిజిటల్ కంటెంట్‌తో సంబంధం ఉన్న వ్యక్తులకు ఈ సమయం ఎంతో లాభదాయకంగా ఉంటుంది. అంతేకాకుండా పని చేసే చోట గౌరవంతో పటు సామాజిక హోదా కూడా లభించే అవకాశాలు ఉన్నాయి. గతంలో పెండింగ్‌లో ఉన్న పనులు కూడా ఈ సమయంలో సులభంగా పూర్తవుతాయి. భాగస్వామ్య వ్యాపారంలో పెద్ద ఆర్థిక లాభాలతో పాటు ఈ సమయంలో తప్పకుండా ఇళ్లతో పాటు కార్లు కూడా కొనుగోలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే వ్యాపారాలు చేస్తున్నవారికి బంపర్‌ లాభాలు కలుగుతాయి. 

కన్యారాశి: 
మోస్ట్‌ పవర్‌ఫుల్ త్రిగ్రహ యోగం ఏర్పడడం వల్ల కన్యా రాశివారికి ఇది స్వర్ణయుగం కాబోతోందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అంతేకాకుండా పనికి తగ్గ ప్రశంసలు కూడా లభిస్తాయి. అంతేకాకుండా అధికారుల నుంచి మంచి సపోర్ట్‌ కూడా లభించి.. కెరీర్‌ పరంగా చాలా బాగా ఎదిగే అవకాశాలు ఉన్నాయి. వీరికి ఈ సమయంలో అనేక కొత్త ఆదాయ మార్గాలు లభించడమే కాకుండా బ్యాంక్‌ బ్యాలెన్స్‌ కూడా ఊహించని స్థాయిలో పెరుగుతుంది. గతంలో పెట్టి పెట్టుబడుల నుంచి ఊహించని స్థాయిలో ఆర్థిక లాభాలు కూడా పొందుతారు. 

మీన రాశి: 
మోస్ట్‌ పవర్‌ఫుల్‌ త్రిగ్రాహి యోగం ఎఫెక్ట్‌తో మీన రాశివారికి ఈ సమయంలో అదృష్టం విపరీతంగా పెరుగుతుంది. అలాగే వీరు తప్పకుండా సానుకూలమైన ప్రభావంతో ముందుకు సాగుతారు. దీంతో ఉద్యోగాలు చేసేవారికి పని ప్రదేశాల్లో అనుకూలమైన వాతావరణం నెలకొంటుంది. అంతేకాకుండా కొత్త బాధ్యతలతో పాటు పదవులు కూడా పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీరు ఈ సమయంలో మంచి ప్రదేశాలకు ఉద్యోగ బదిలీలు కూడా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కుటుంబంలో ఆనందం కూడా రెట్టింపు అవుతుంది. జీవితంలో శాంతి కూడా విపరీతంగా నెలకొంటుంది. మానసిక సమస్యలు కూడా దూరమవుతాయి. 

వృషభ రాశి: 
ఈ శక్తివంతమైన త్రిగ్రహ యోగం ఎఫెక్ట్‌తో వృషభ రాశి వారికి ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా అద్బుతమైన ఫలితాలు కలుగుతాయి. వీరికి పనుల్లో విజయాలు కూడా కలుగుతాయి. దీంతో పాటు ధైర్యం, బలంతో పాటు నిర్ణయం తీసుకునే సామర్థ్యం విపరీతంగా పెరుగుతాయి. బుధ గ్రహ ప్రభావంతో ఉద్యోగాల పరంగా అద్భుతమైన పదోన్నతులు కలుగుతాయి. అంతేకాకుండా వీరికి ఈ సమయంలో తప్పకుండా పదోన్నతులు కలుగుతాయి. ముఖ్యంగా మార్కెట్‌తో పాటు మీడియా, రచన రంగాల్లో పనులు చేస్తున్నవారికి అద్భుతమైన ప్రయోజనాలు కలిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ సమయంలో భారీ మొత్తంలో ప్రజెక్ట్‌లు కూడా సొంతం చేసుకునే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. 

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

గమనిక.. 

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..

0
0
Report
Advertisement

Nagamani Video: నాగమణికి కాపలాగా రెండు భారీ కింగ్ కోబ్రాలు.. వీడియో వైరల్..

Hyderabad, Telangana:

 Nagamani Video Watch Here: ప్రస్తుతం సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక వింత వీడియో వైరల్ అవుతూనే ఉంటుంది. అయితే, తాజాగా నెట్టింట హల్‌చల్ చేస్తున్న ఒక వీడియో మాత్రం నెటిజన్స్‌ను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ వీడియోలో ప్రమాదకరమైన రెండు భారీ కింగ్‌ కోబ్రాలు.. అత్యంత అరుదైన నాగమణికి రక్షణగా నలవడమే కాకుండా మరో పాము కూడా దీనికి రక్షణగా నిలిచేందుకు రావడం చూసిన సోషల్‌ మీడియా వినియోగదారులు ఆశ్చర్యపోతున్నారు. అయితే, ఈ వీడియోకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

అరుదైన నాగమణి..
ఈ వీడియోలో.. రెండు అత్యంత విషపూరీతమైన భారీ కింగ్ కోబ్రా కనిపిస్తాయి. విశేషం ఏమిటంటే.. ఆ రెండు పాముల ముందు ఒక ప్రకాశవంతమైన వింత రాయి ఉండడం మీరు చూడొచ్చు.. దీనిని నెటిజన్లు  నాగమణిగా పిలుస్తున్నారు. ఆ రెండు సర్పాలు ఆ నాగమణికి రక్షణగా నిలిచినట్లు, ఎవరైనా దగ్గరకు వస్తే దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆ వీడియోలో కనిపిస్తోంది. అంతేకాకుండా ఈ పాములకు రక్షణగా మరో పాముకు కూడా రావడం మీరు ఈ వీడియోలో క్లియర్‌గా చూడొచ్చు..

షాక్‌లో నెటిజన్లు..
ఈ వీడియో సెషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లైన ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్‌, ఫేస్‌బుక్‌లలో ఊహించని స్థాయిలో వైరల్ అయ్యాయి. ఈ వీడియోను కేవలం కొన్ని గంటల్లోనే లక్షలాది మందికి పైగా ఈ వీడియోను వీక్షించారు. అంతేకాకుండా వారు ఈ వీడియోపై వివిధ రకాలుగా స్పందిస్తూ వస్తున్నారు. ఈ వీడియో చూసిన కొందరు నిజంగానే నాగమణి ఉంటుందా? అని కామెంట్లు పెడుతున్నారు. అలాగే సినిమాల్లోనే అనుకున్నాం.. నిజ జీవితంలో కూడా నాగమణిని చూడటం ఆశ్చర్యం కలిగిస్తోందని కామెంట్స్‌ పెడుతున్నారు. ఇక మరికొంతమంది ఇది దేవుడి లీల అంటూ కామెంట్స్ రాస్తూ వస్తున్నారు. 

 
 
 
 
 

సైన్స్ ఏం చెబుతోంది? 
సైన్స్‌తో పాటు వన్యప్రాణి నిపుణుల తెలిపిన వివరాల ప్రకారం.. పాముల దగ్గర  నాగమణి లేదా  నాగ రత్నం లాంటివి ఉంటాయనేది కేవలం ఒక కల్పిత కథ మాత్రమేనని.. నిజ జీవితంలో అలాంటివి ఎక్కడా లేవని.. ఇంత వరకు ఎవరు చూడలేదని చెబుతున్నారు..

Also Read:  Video Viral: సాయం ముసుగులో అరాచకం.. యువతి ప్రైవేటు పార్ట్ మీద చెయ్యి వేసి మరీ.!. వీడియోపై దుమారం..

గ్రాఫిక్స్ (VFX)?

ఈ వైరల్ వీడియోను చూస్తే.. ఇది పక్కాగా గ్రాఫిక్స్ (VFX) లేదా ఎడిటింగ్ ట్రిక్ అని స్పష్టమవుతోంది. పాముల ముందు ఒక మెరిసే ఎల్‌ఈడీ (LED) రాయిని లేదా ఆర్టిఫిషియల్ లైటింగ్‌ను ఉంచి ఈ వీడియోను క్రియేట్ చేసి ఉండవచ్చని చాలా మంది టెక్‌ నిపుణులతో పాటు నెటిజన్స్‌ భావిస్తున్నారు.. లైకులు, వ్యూస్‌తో పాటు ఫాలోవర్లను పెంచుకోవడం కోసమే కొందరు ఇలాంటి తప్పుడు వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు.

Also Read:  Video Viral: సాయం ముసుగులో అరాచకం.. యువతి ప్రైవేటు పార్ట్ మీద చెయ్యి వేసి మరీ.!. వీడియోపై దుమారం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్.. - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..Twitter, Facebook 

  

0
0
Report

EPFO Organise PMVBRY: కొత్త ఉద్యోగులకు కేంద్రం గుడ్‌న్యూస్.. పీఎఫ్ అకౌంట్లో రూ.15,000 జమ..ఎప్పుడంటే?

Hyderabad, Telangana:

EPFO Organise PMVBRY News: ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఆధ్వర్యంలో జూన్ 19న ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్ ఘర్ యోజన (PMVBRY) కింద దేశవ్యాప్తంగా భారీ కార్యక్రమాలు జరగనున్నాయి. అధికారిక ఉపాధిని ప్రోత్సహిస్తూ, కార్మికులకు సామాజిక భద్రత కల్పించడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ మెగా డ్రైవ్ ను చేపట్టింది. 

న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరగనున్న ప్రధాన జాతీయ కార్యక్రమంతో పాటు దేశంలో 200 పారిశ్రామిక, ఉపాధి కేంద్రాలలో ప్రాంతీయ కార్యక్రమాలు జరగనున్నాయి. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా పలు సంస్థల్లో ఈ ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించనున్నారు.

రూ.2,400 కోట్ల ప్రయోజనాల పంపిణీ..
జూన్ 19న న్యూఢిల్లీలో జరిగే ప్రధాన జాతీయ స్థాయి కార్యక్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ హాజరయ్యే అవకాశం ఉంది. ఇందులో భాగంగా అర్హులైన అభ్యర్థులకు గానూ దాదాపుగా రూ.2,400 కోట్ల విలువైన ప్రయోజనాలను పంపిణీ చేయనున్నారు.

ఈ కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం కొత్తగా ఉద్యోగాలు చేరిన యువతకు యజమానులు అధికారికంగా అపాయింట్మెంట్ లెటర్లను అందజేస్తారు. ఈ ప్రాంతీయ కార్యక్రమంలో ఉద్యోగులు, యజమానులు, పరిశ్రమ ప్రతినిధులు, కార్మిక రంగ నిపుణులు పాల్గొని అవగాహన పెంచనున్నారు. 

PMVBRY పథకం లక్ష్యాలు ప్రయోజనాలు..
3.5 కోట్లకు పైగా ఉద్యోగాల సృష్టించడమే ఈ పథకం లక్ష్యమని అధికారులు చెబుతున్నారు. ఈ పథకం ద్వారా దేశంలో భారీగా అర్థవంతమైన ఉద్యోగ అవకాశాలు సృష్టించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పథకం కింద కొత్తగా ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించే యువతకు నెలకు రూ.15,000 వరకు ఆర్థిక ప్రయోజనాలు అందుతాయి. 

అలాగే కంపెనీలు లేదా యజమానులు సంస్థల తమ వద్ద అదనపు ఉద్యోగాలను సృష్టించడం ద్వారా వారికి ప్రభుత్వం తరఫున ప్రత్యేక ప్రోత్సాహాలు లభిస్తాయి. ఈ పథకం ద్వారా దేశంలో వ్యవస్థీకృత కార్మిక రంగం మరింత బలోపేతం అవుతుందని ఇది దీర్ఘకాలిక ఆర్థిక వృద్ధిని, శక్తిని అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతుందని విధాన రూపకర్తలు భావిస్తున్నారు.

Also Read: విశాఖపట్నంపై కన్నేసిన పాకిస్థాన్..బంగాళఖాతంలోకి పాక్ సబ్‌మెరైన్ ఎంట్రీ!

Also REad: భారీగా తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు..ట్రంప్ ప్రకటనతో ఒక్కసారి పడిపోయిన ఇంధన ధరలు!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Pakistan Submarine: విశాఖపట్నంపై కన్నేసిన పాకిస్థాన్..బంగాళఖాతంలోకి పాక్ సబ్‌మెరైన్ ఎంట్రీ!

Visakhapatnam, Andhra Pradesh:

Pakistan Submarine In Bay Of Bengal: తాజాగా పాకిస్థాన్ నౌక దళానికి చెందిన కమాండర్ ఉమర్ ఫరూక్ కి చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా చర్చనీయం అయ్యాయి. చైనా నుంచి పాకిస్తాన్ కొనుగోలు చేస్తున్న కొత్త హంగోర్ శ్రేణి జలంతర్గాములతో తమ సైనిక శక్తి కేవలం అరేబియా సముద్రానికి పరిమితం కాదని, బంగాళాఖాతం లో వీటిని మోహరిస్తామని ఆయన స్పష్టం చేశారు. 

చైనా అండతో పాక్ వ్యూహాలు..
పాకిస్తాన్ ప్రస్తుతం తమ నౌక దళాన్ని ఆధునికరించే పనిలో పడింది. ఇందులో భాగంగా చైనా నుంచి 8 హాంగోర్ శ్రేణి సబ్‌మెరైన్లను కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదిర్చుకుంది. ఇప్పటికీ అందులో మొదటిది పాకిస్తాన్ చేతికి వచ్చింది. 

హంగూర్ శ్రేణి ప్రత్యేకత.. 
ఇవి ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపొషన్ (AIP) సాంకేతికతతో పనిచేస్తాయి. సాధారణంగా డీజిల్-ఎలక్ట్రికల్ సబ్ మెరైన్ల కంటే ఇవి చాలా ఎక్కువ రోజులు నీటి అడుగున దాగుండగలవు. అందుకే వీటిని గుర్తించడం శత్రు దేశాలకు చాలా కష్టంగా మారుతుంది. 

భారత్ కి ఎందుకు చికాకు? 
భారతదేశానికి బంగాళాఖాతం ఎంతో వ్యూహాత్మకమైన ప్రాంతం. 12 నాటికలు మేళ్ల ప్రాదేశికత జలాలు దాటితే అది అంతర్జాతీయ సముద్ర ప్రాంతం అవుతుంది. అయితే పాక్ మోహారింపులు భారత్‌కు కొన్ని ఇబ్బందులు తెచ్చిపెట్టే అవకాశం ఉంది. 

భారత తూర్పు నావెల్ కమాండ్ విశాఖపట్నం కేంద్రంగా పనిచేస్తుంది. మన అను జలంథర్ గాముల తయారీతో పాటు కీలకమైన ఐఎన్ఎస్ వర్షా బేస్ కూడా ఇక్కడే ఉంది. బంగ్లాదేశ్, మయన్మార్ వంటి దేశాలతో భారత్‌కు ఉన్న కీలక సముద్ర వాణిజ్య మార్గాలు కూడా దీనిగుండే సాగుతాయి. 

వాస్తవానికి భారత నావికా దళం ముందు పాక్ నేవి చాలా బలహీనమైనది. మన దగ్గర విమాన వాహక నౌకలు ఉన్నాయి. పాక్ మాత్రం చైనా,  టర్కీ మీద ఆధారపడుతుంది. కాబట్టి పాత సబ్‌ మెరైన్లు ఇక్కడికి వచ్చిన యుద్ధ గమనాన్ని మార్చలేవు. కానీ, నిరంతరం నిఘా పెట్టాల్సి రావడం భారత్‌కు చికాకు కలిగించే విషయమే!

బంగ్లాదేశ్ తో మారుతున్న సమీకరణాలు..
2024లో బంగ్లాదేశ్ లో షేక్ హసీనా ప్రభుత్వం పడిపోయిన తర్వాత, అక్కడ మారిన రాజకీయ పరిస్థితులను పాక్ తనకు అనుకూలంగా మార్చుకుంటుంది. 1971 తర్వాత తొలిసారిగా బంగ్లాదేశ్-పాక్ మధ్య నేరుగా సముద్ర వాణిజ్యం మొదలైంది. గత నవంబర్ లో పాక్ యుద్ధ నౌక పీఎన్ఎస్ సైఫ్ బంగ్లాదేశ్ లోని చిట్టగాంగ్ తీరంలో నాలుగు రోజులు పాటు నిలిచి ఉండటం గమనార్హం. ఈ మిత్ర తోనే పాక్ కు బంగాళాఖాతంలోకి రావడానికి మరింత ధైర్యం ఇస్తుంది. 

1971 ఫ్లాష్ బ్యాక్..
1971 బంగ్లాదేశ్ విముక్తి యుద్ధంలో పాకిస్తాన్ కు చెందిన పాత 'పీఎన్ఎస్ హంగోర్' సబ్ మెరైన్‌ను భారత యుద్ధ నౌక 'ఐఎన్ఎస్ ఖుంక్రీ' ముంచేసింది. అయితే భారత తక్షణమే స్పందించిన పాక్ గర్వకారణంగా భావించిన 'పీఎన్ఎస్ ఘాజీ' జలంతర్గామిని విశాఖ తీరంలోనే జల సమాధి చేసింది. ఈ దెబ్బతో కేవలం 13 రోజుల్లోనే పార్కు మోకాళ్లు పై కూర్చుంది. యుద్ధం తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు పాక్ సబ్మెర్లను బంగాళాఖాతం వైపు చూస్తున్నాయి.

Also Read: భారీగా తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు..ట్రంప్ ప్రకటనతో ఒక్కసారి పడిపోయిన ఇంధన ధరలు!

Also Read: జేబులో రూ.500 పెట్టుకొని ముంబై వచ్చి..ఇప్పుడు బాలీవుడ్‌నే ఏలుతుంది ఈ హీరోయిన్!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement

Tecno Pova 8 5g: భారత మార్కెట్లోకి పవర్‌ఫుల్ టెక్నో పోవా 8 5G.. నేటి నుంచే సేల్స్ ప్రారంభం!

Hyderabad, Telangana:

Tecno Pova 8 5g Launched In India News: భారత స్మార్ట్‌ఫోన్‌ ప్రియుల కోసం ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ టెక్నో (Tecno) సంస్థ అదిరిపోయే శుభవార్తను అందించింది. అద్బుతమైన ఫీచర్స్‌తో గత వారం విడుదలైన Tecno Pova 8 స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన విక్రయాలు జూన్ 18న ప్రారంభమయ్యాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌ ఇప్పుడు భారత్‌లో అందుబాటులో ఉంది. ఇది ఎంతో శక్తివంతమైన 8,000mAh బ్యాటరీ, అద్భుతమైన డిజైన్‌తో కూడిన ఈ ఫోన్ ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ ఫ్లిప్‌కార్ట్ (Flipkart)తో పాటు ఇతర ఈ కామర్స్‌ వెబ్‌సైట్స్‌లో కూడా అందుబాటులోకి వచ్చింది. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఇక ఈ స్మార్ట్‌ఫోన్‌ భాతర మార్కెట్‌లో రెండు స్టోరేజ్‌ వేరియంట్స్‌లో అందుబాటులోకి వచ్చిన్నట్లు తెలుస్తోంది. ఇందులో మొదటి స్టోరేజ్‌ వేరియంట్‌ 6GB ర్యామ్‌తో పాటు 128GB స్టోరేజ్ ఆప్షన్‌లో ధర రూ.29,999 నుంచి ప్రారంభమవుతుంది. ఇక రెండవ వేరియంట్‌ 8GB ర్యామ్‌తో పాటు 128GB స్టోరేజ్‌తో ధర రూ.31,999తో అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ ఫోన్ సిల్వర్ వైట్‌తో పాటు ఆరెంజ్, గ్రీన్ రంగులలో మార్కెట్‌లోకి అందుబాటులోకి వచ్చింది..

మెగా 8000mAh బ్యాటరీ.. 
ఈ టెక్నో పోవా 8 5G స్మార్ట్‌ఫోన్‌లో అతిపెద్ద హైలైట్ దీనిలోని శక్తివంతమైన 8,000mAh భారీ బ్యాటరీ.. దీనికి 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా అందుబాటులో ఉంది.. దీనిని ఒక్కసారి పూర్తి ఛార్జ్ చేస్తే.. దాదాపు 1,198 గంటల స్టాండ్‌బై టైమ్‌తో పాటు 17 గంటలకు పైగా వీడియో ప్లేబ్యాక్‌ను ఇది అందిస్తుందని కంపెనీ క్లైమ్‌ చేస్తూ వస్తోంది.

అద్భుతమైన డిస్‌ప్లే...
టెక్నో పోవా 8 5G స్మార్ట్‌ఫోన్‌లో ప్రీమియం 6.76 అంగుళాల పూర్తి HD+ IPS డిస్‌ప్లేను కలిగి ఉంటుందని కంపెనీ వెల్లడించింది.. గేమింగ్‌తో పాటు స్క్రోలింగ్ సున్నితంగా ఉండేందుకు ఇందులో 144Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌ను కూడా అందించారు. ఎండలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపించేలా 950 నిట్స్ బ్రైట్‌నెస్ సపోర్ట్ కూడా లభిస్తోంది. ఫోన్ వెనుక భాగంలో నోటిఫికేషన్లు, లైటింగ్ కోసం ప్రత్యేకమైన  అలైవ్ మ్యాట్రిక్స్ (Alive Matrix) డిస్‌ప్లేను కూడా అందుబాటులోకి తీసుకు వచ్చింది..

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

శక్తివంతమైన ప్రాసెసర్‌తో పాటు కెమెరా..
ఇందులో కంపెనీ ఎంతో శక్తివంతమైన మీడియాటెక్ డైమెన్సిటీ 7100 (MediaTek Dimensity 7100) ఆక్టా-కోర్ ప్రాసెసర్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చింది.. ఇది ఆండ్రాయిడ్ 16 ఆధారిత HiOS 16 పై రన్ అవుతుందని కంపెనీ తెలిపింది.. ఇక ఈ స్మార్ట్‌ఫోన్‌లోకి కెమెరా విషయానికి వస్తే.. దీని వెనుక భాగంలో ఎంతో శక్తివంతమైన 50 మెగాపిక్సెల్ Sony LYT-600 ప్రైమరీ కెమెరాను కూడా కలిగి ఉంటుంది. ఇక ముందు భాగంలో సెల్ఫీల కోసం.. చాలా ప్రత్యేకమైన 13 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.. అదేవిధంగా ఏఐ క్యామ్, పోర్ట్రెయిట్, సూపర్ నైట్ మోడ్ వంటి ఎన్నో ఫీచర్లు ఇందులో అందుబాటులోకి తీసుకు వచ్చిన్నట్లు తెలుస్తోంది. 

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report

OnePlus N6: ఏకంగా 8000mAh బ్యాటరీతో OnePlus N6.. ఈ నెలలోనే భారత్‌లో లాంచ్.. ధర ఎంతంటే?

Hyderabad, Telangana:

OnePlus N6 India Launch: స్మార్ట్‌ఫోన్ ప్రియులకు OnePlus కంపెనీ అద్భుతమైన సర్‌ప్రైజ్ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఊహించని బడ్జెట్‌ రేంజ్‌లో అద్భుతమైన బ్యాటరీ సెటప్‌లో మార్కెట్‌లోకి సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌ కాబోతోంది. ఇది ప్రీమియం డిజైన్‌తో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా భారతీయ వినియోగదారులను ఆకట్టుకునేందుకు మరో ఎన్నో రకాల కొత్త కొత్త ఫీచర్స్‌తో లాంచ్‌ అయ్యేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇది OnePlus N6 స్మార్ట్‌ఫోన్‌ పేరుతో విడుదల కాబోతోంది. ముఖ్యంగా దీనిని కంపెనీ వన్‌ప్లస్ నార్డ్ (Nord) సిరీస్ ధరల కంటే చాలా తక్కువ ధరలోనే అందుబాటులోకి తీసుకు రావడం విశేషం.. అయితే, దీనిని కంపెనీ జూన్‌ 30వ తేదిన అధికారికంగా విడుదల చేసేందుకు కంపెనీ సిద్ధమైన్నట్లు తెలుస్తోంది. 

మార్కెట్లోనే అతిపెద్ద బ్యాటరీ.. 
సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ X ద్వారా వన్‌ప్లస్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ కొత్త OnePlus N6 స్మార్ట్‌ఫోన్‌లో ఏకంగా 8,000 mAh భారీ బ్యాటరీతో అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు కంపెనీ యోచిస్తోంది.. రూ. 25,000 లోపు ధర కలిగిన స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్‌లో ఇంతటి భారీ కెపాసిటీ ఉన్న బ్యాటరీని అందించడం ఇదే తొలిసారి అని కంపెనీ క్లెయిమ్ చేస్తూ వస్తోంది.. ఇటీవల మార్కెట్లోకి వచ్చిన ప్రీమియం మోడల్ వన్‌ప్లస్ నార్డ్ CE 6 లోనూ ఇదే కెపాసిటీ బ్యాటరీ ఉన్నప్పటికీ.. అంతకంటే చాలా తక్కువ ధరలోనే ఈ ఫీచర్‌ను N6 మోడల్‌లో వన్‌ప్లస్ కంపెనీ అందుబాటులోకి తీసుకు రావడం ఆశ్చర్యం..

ఆకట్టుకునే లుక్.. అదిరిపోయే ఫీచర్లు..
డిజైన్ పరంగా చూస్తే.. ఈ OnePlus N6 స్మార్ట్‌ఫోన్‌ మోడల్ ఫ్లాట్ ఫ్రేమ్‌తో పాటు ఫ్లాట్ రియర్ ప్యానెల్‌తో చాలా స్టైలిష్‌గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా బ్యాక్ ప్యానెల్ పైభాగంలో కెమెరా మాడ్యూల్ ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది.. ఫోన్‌కు కుడివైపున భాగంలో చాలా స్టైలిష్‌లో పవర్ బటన్, వాల్యూమ్ కంట్రోల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.. కంపెనీ తన నార్డ్ సిరీస్‌లో ఇటీవల విడుదల చేసిన Nord CE6 Lite ఫీచర్ల లాగే ఉండడం విశేషం... ఈ బడ్జెట్ మొబైల్‌లోనూ మెరుగైన డిస్‌ప్లేతో పాటు లేటెస్ట్ మీడియాటెక్ డైమెన్సిటీ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ లేటెస్ట్ ఓఎస్ సపోర్ట్‌ ఫీచర్స్‌ కూడా అందుబాటులో ఉండే అవకాశాలు ఉన్నాయి..

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

ఆకర్షణీయమైన కలర్‌ ఆప్షన్స్‌..
ఈ మొబైల్‌ను వినియోగదారులకు అద్భుతమైన గ్రీన్‌తో పాటు బ్లాక్‌ కలర్‌ ఆప్షన్స్‌లో అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. దీని ధర మార్కెట్‌లో దాదాపు రూ.20 వేల కంటే చాలా తక్కువగానే ఉండే అవకాశాలు ఉన్నాయని టెక్‌ నిపుణులు భావిస్తున్నారు. ఎప్పటి నుంచో భారీ బ్యాటరీతో పాటు నిరంతరం ప్రయాణాలు చేసేవారికి, ముఖ్యంగా డెలివరీ బాయ్స్‌కు ఈ OnePlus N6 ఒక అద్భుతమైన ఆప్షన్‌గా నిలిచే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. జూన్ 30న జరగబోయే లాంచ్ ఈవెంట్‌లో భాగంగా ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్‌తో పాటు పూర్తి స్పెషికేషన్‌ వివరాలను కంపెనీ వెల్లడించే అవకాశాలు ఉన్నాయి. 

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report

Tirumala VIPs: తిరుమలకు పోటెత్తిన వీఐపీలు.. భర్తతో కలిసి సమంత దర్శనం

Tirupati Urban, Andhra Pradesh:

Samantha At Tirumala: వేసవి సెలవులు ముగిసినా కూడా తిరుమల ఆలయానికి భక్తుల తాకిడి తగ్గడం లేదు. భారీ ఎత్తున భక్తులు ఆలయాన్ని సందర్శించేందుకు వస్తున్నారు. భక్తులు పెద్ద ఎత్తున వస్తుండడంతో తిరుమలలో రద్దీ కొనసాగుతోంది. ఇక తిరుమల వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు పలువురు ప్రముఖులు తరలివచ్చారు. సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు తిరుమల ఆలయాన్ని సందర్శించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

క్రీడా, రాజకీయ ప్రముఖులు
ప్రముఖ క్రీడా నిర్వాహకులు, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు చాముండేశ్వరి నాథ్, పాండిచ్చేరి మంత్రి మల్లాది కృష్ణారావు తిరుమల స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ఏపీలోని  నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు బైరెడ్డి శబరి తిరుమల శ్రీవారి సేవలో పాల్గొన్నారు. వారికి టీటీడీ అధికారులు దగ్గరుండి ప్రత్యేక దర్శనం చేయించి తీర్థ ప్రసాదాలు అందించారు. ఆలయం వెలుపల టీడీపీ నంద్యాల ఎంపీ శబరి మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో నంద్యాల పార్లమెంట్‌ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు ఎంపీ బైరెడ్డి శబరి వెల్లడించారు.

బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు
తెలంగాణకు మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు పువ్వాడ అజయ్ కుమార్ కుటుంబసమేతంగా తిరుమల స్వామివారిని దర్శించుకున్నారు. రాజకీయ ప్రముఖులతో పాటు బుల్లితెర సెలబ్రిటీలు కూడా తిరుమలలో సందడి చేశారు. కామెడీ షో జబర్దస్త్ టీం సభ్యులు ప్రసాద్, రోహిణి శ్రీవారి సేవలో పాల్గొన్నారు. స్వామివారి కృపతో తాము మరిన్ని మంచి అవకాశాలు అందుకోవాలని ప్రార్థించినట్లు అనంతరం మీడియాతో వారు తెలిపారు. శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులను చూసేందుకు భక్తులు ఆలయ పరిసరాల్లో ఆసక్తి కనబరిచారు.

మా ఇంటి బంగారం బృందం
తమ సినిమా విడుదలకు ముందు రోజు మా ఇంటి ఇంటి బంగారం సినిమా బృందం తిరుమల ఆలయాన్ని సందర్శించింది. సినీ నటి సమంత, తన భర్త రాజ్‌ నిడిమోరుతోపాటు దర్శకురాలు నందిని రెడ్డి, నటి, యాంకర్‌ శ్రీముఖి తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. మా ఇంటి బంగారం సినిమా విజయవంతం కావాలని స్వామిని కోరుకున్నారు. రేపు మాఇంటి బంగారం సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న నేపథ్యంలో సినిమా ఘన విజయం సాధించాలని కోరుకుంటూ చిత్ర యూనిట్ శ్రీవారిని దర్శించుకున్నట్లు తెలిపారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వీరికి ఆశీర్వచనం అందించి, స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. దర్శనం ముగించుకుని ఆలయం వెలుపలికి వచ్చిన సమంత, శ్రీముఖిలను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. నవ్వుతూ పలకరిస్తూ.. సమంత, శ్రీముఖి అభిమానులతో కాసేపు సెల్ఫీలు దిగారు. దీంతో తిరుమల ఆలయ పరిసర ప్రాంతాల్లో కాసేపు సందడి వాతావరణం నెలకొంది

సమంత మాటలు
అనంతరం సమంత మాట్లాడుతూ.. 'రేపు మా మాఇంటి బంగారం సినిమా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా స్వామివారి ఆశీస్సుల కోసం తిరుమల వచ్చాం. దర్శనం చాలా అద్భుతంగా జరిగింది. సినిమా కచ్చితంగా ప్రేక్షకుల అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉంది. మీ అందరి ఆశీస్సులు మా సినిమాపై ఉండాలని కోరుకుంటున్నాం. కుటుంబంతో కలిసి చూడదగ్గ సినిమా' అని వివరించారు.

0
0
Report
Advertisement

england vs croatia: క్రొయేషియాపై ఇంగ్లండ్ ఘన విజయం.. రెండు గోల్స్‌తో మెరిసిన కెప్టెన్ హ్యారీ కేన్..!!

BBhoomi4h ago
Secunderabad, Telangana:

england vs croatia: ఫిఫా ప్రపంచకప్ 2026 మెగా టోర్నీలో గ్రూప్-L మొదటి మ్యాచ్‌లోనే ఫుట్‌బాల్ ప్రియులకు అసలైన మజా లభించింది. డల్లాస్ స్టేడియంలో జరిగిన ఈ హై-వోల్టేజ్ పోరులో క్రొయేషియాపై 4-2 తేడాతో ఇంగ్లాండ్ సంచలన విజయం సాధించింది. 2018 ప్రపంచకప్ సెమీఫైనల్ ఓటమికి ఇంగ్లాండ్ ఈ మ్యాచ్‌తో పర్ఫెక్ట్ రివెంజ్ తీర్చుకుంది. మొత్తం 6 గోల్స్ నమోదైన ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ కేన్ రెండు గోల్స్‌తో చెలరేగగా, యువ తారలు జూడ్ బెల్లింగ్‌హామ్, మార్కస్ రాష్‌ఫోర్డ్ చెరొక గోల్‌తో ఇంగ్లాండ్‌కు 3 పాయింట్లు తెచ్చిపెట్టారు.
 
మ్యాచ్ 12వ నిమిషంలోనే తీవ్ర నాటకీయత చోటుచేసుకుంది. క్రొయేషియా కెప్టెన్ లూకా మోడ్రిక్ ఒత్తిడిలో నోని మడుయెకేను కింద పడేయడంతో రిఫరీ ఇంగ్లాండ్‌కు పెనాల్టీ ఇచ్చాడు. హ్యారీ కేన్ కొట్టిన మొదటి కిక్‌ను క్రొయేషియా కీపర్ లివాకోవిచ్ అడ్డుకున్నప్పటికీ.. కిక్‌కు ముందే డిఫెండర్ జోస్కో గార్డియోల్ డి-ఏరియాలోకి రావడంతో రిఫరీ మళ్లీ అవకాశం ఇచ్చాడు. ఈసారి కేన్ ఎలాంటి తప్పు చేయకుండా బంతిని గోల్‌గా మలిచి 1-0 ఆధిక్యాన్ని అందించాడు.
 
36వ నిమిషం: లూకా సుకిచ్ అద్భుతమైన డ్రిబ్లింగ్‌తో ఇంగ్లాండ్ డిఫెన్స్‌ను ఛేదించి ఇచ్చిన పాస్‌ను మార్టిన్ బటురినా గోల్‌గా మార్చి స్కోరును 1-1తో సమం చేశాడు.

42వ నిమిషం : డెక్లాన్ రైస్ వేసిన పర్ఫెక్ట్ కార్నర్ కిక్‌ను హ్యారీ కేన్ గాల్లోకి లేచి సూపర్ హెడర్‌తో గోల్ చేసి ఇంగ్లాండ్‌ను 2-1 ఆధిక్యంలో నిలిపాడు.

ఫస్ట్ హాఫ్ ఇంజూరీ టైమ్ : హాఫ్ టైమ్‌కు ముందే ఇంగ్లాండ్ డిఫెన్స్ పొరపాటును వాడుకున్న పీటర్ మోసెస్ఒక అద్భుతమైన వాలీ షాట్‌తో గోల్ కొట్టి స్కోరును 2-2తో మళ్లీ సమం చేశాడు.

సెకండ్ హాఫ్ లో ఇంగ్లాండ్ మరింత దూకుడు పెంచింది. 47వ నిమిషంలో రియల్ మాడ్రిడ్ స్టార్ జూడ్ బెల్లింగ్‌హామ్ డిఫెండర్లను ముప్పుతిప్పలు పెడుతూ డిగువ-ఎడమ మూలలోకి బంతిని పంపి ఇంగ్లాండ్‌కు 3-2 ఆధిక్యాన్ని ఇచ్చాడు.

ఇక 85వ నిమిషంలో బుకాయో సాకా అందించిన తెలివైన పాస్‌ను అందుకున్న మార్కస్ రాష్‌ఫోర్డ్ ఏమాత్రం కంగారు పడకుండా క్రొయేషియా కీపర్‌కు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా క్లాసిక్ ఫినిషింగ్‌తో నాల్గో గోల్ (4-2) సాధించాడు. ఇదే మ్యాచ్ విన్నింగ్ గోల్‌గా నిలిచింది. 198 క్యాప్స్‌తో తన 5వ వరల్డ్ కప్ ఆడుతున్న లూకా మోడ్రిచ్ సేనకు.. కేన్, బెల్లింగ్‌హామ్ జోడి కోలుకోలేని షాకిచ్చింది. కెప్టెన్‌గా కేన్ అనుభవం, యువ ఆటగాళ్ల వేగం ఇంగ్లాండ్‌ను టోర్నీలో హాట్ ఫేవరెట్‌గా నిలబెట్టాయి.

Also Read: రూ. 2లక్షల డౌన్ పేమెంట్ తో Skoda Kylaq కారును ఇంటికి తీసుకెళ్లొచ్చు

Also Read: నిస్సాన్ మాగ్నైట్ SUV.. రూ.లక్ష డౌన్ పేమెంట్ తర్వాత ఎంత

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Sai Krishna Case: కోర్టును ఆశ్రయించిన రౌడీషీటర్ సాయికృష్ణ తల్లి..పోలీసులే తన కొడుకును చంపారంటూ..

Vijayawada, Andhra Pradesh:

Sai Krishna Missing Case: రౌడీ షీటర్ సాయికృష్ణ మిస్సింగ్ వెనుక పోలీసుల హస్తం ఉన్నట్టు ఆయన తల్లి విజయలక్ష్మి విజయవాడ రెండో ఏజీఎం కోర్టును ఆశ్రయించింది. కృష్ణలంక పోలీస్ స్టేషన్ కి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌ను క్షేమంగా భద్రపరచాలని ఆమె తన పిటీషన్ లో కోరింది. అసలు నిజాలు బయటకు రావాలంటే ఆధారాలు కాపాడడం ఎంతో అవసరమని ఆమె పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై విజయవాడ కోర్టు ఈరోజు తన తీర్పును వెలువరించనుంది.

పోలీసులపై తీవ్ర ఆరోపణలు.. 
విజయలక్ష్మి తన పిటిషన్ లో కృష్ణలంక పోలీసులపై సంచలన ఆరోపణలు చేసింది. తన కుమారుడు సాయికృష్ణ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి తీవ్రంగా చిత్రహింసలు పెట్టారని ఆరోపించింది. ఈ క్రమంలో కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో సాయికృష్ణ లాక్ అప్ డెత్ అయ్యి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అంతేకాకుండా సీఐ నాగరాజు తన ఫోన్ బలవంతంగా లాక్కొని, దాని నుండి వేరే వాళ్లకు కాల్ చేసిన ఆమె పిటిషన్ లో పేర్కొన్నారు. 

రంగంలోకి విచారణ అధికారి.. 
ఈ కేసును తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం దీన్ని విచారించేందుకు ప్రత్యేక అధికారిని నియమించింది. రాజమండ్రి ఎస్పీ నర్సింహ కిషోర్‌ను ఈ కేసుకు ప్రత్యేక అధికారిగా నియమించారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఆయన ఈ రోజు కృష్ణలంక పోలీస్‌ స్టేషన్‌ను సందర్శించనున్నారు. 

"నా కొడుకు బతికి ఉన్నాడో లేదో కూడా చెప్పడం లేదు" అని సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి కన్నీరు మున్నీరవుతున్నారు. స్థానిక పోలీసులపై నమ్మకం లేదని, సాయి కృష్ణ మిస్సింగ్ పై సిబిఐ దర్యాప్తు జరిపించాలని బాధితుని కుటుంబ సభ్యులకు డిమాండ్ చేస్తున్నారు.

Also Read: వైఎస్ జగన్ ఇంటి దగ్గరకు వెళ్లి మంత్రి లోకేష్ సవాల్..దమ్ముంటే డీఎస్సీపై చర్చకు రండి!

Also REad: పల్నాడు రైతాంగానికి శుభవార్త..రెండేళ్లలో వరికపుడిశెల ప్రాజెక్టుకు గ్రీన్‌సిగ్నల్..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Govt Employees: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు జాక్‌పాట్‌.. డీఏ పెంచుతూ ప్రభుత్వం ప్రకటన

Baddipadaga, Telangana:

Telangana DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు ఎంతో కాలంగా ఊరిస్తున్న డీఏ పెంపుపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ప్రభుత్వ ఉద్యోగ వర్గాలకు తెలంగాణ ప్రభుత్వం భారీ శుభవార్త వినిపించింది. ఉద్యోగులకు సంబంధించి కరువు భత్యం (డీఏ) పెంచింది. డీఏ పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఈ తీపి కబురు వినిపించారు. 1.62 శాతం డీఏ పెంచుతూ ప్రకటన చేశారు. అయితే డీఏ పెంపుతో ప్రభుత్వ ఉద్యోగులందరికీ కాదు కేవలం విద్యుత్‌ శాఖలోని ఉద్యోగులకు మాత్రమే పెంచడం గనార్హం.

తెలంగాణ విద్యుత్ సంస్థల ఉద్యోగులు, ఆర్టిజన్లు, పెన్షనర్లకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డీఏ పెంచింది. 1.621 శాతం కరువు భత్యం (డీఏ) పెంపునకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీంతో తెలంగాణ విద్యుత్‌ ఉద్యోగులకు ప్రస్తుతం 17.651 శాతంగా ఉన్న డీఏ 19.272 శాతానికి పెరగనుంది. డీఏ పెంపుతో మొత్తం 70,804 మంది ఉద్యోగులు, ఆర్టిజన్లు, పెన్షనర్లకు భారీ ప్రయోజనం లభించనుంది.

విద్యుత్‌ శాఖపై హైదరాబాద్‌లోని సచివాలయంలో బుధవారం డిప్యూటీ సీఎం, విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని భవిష్యత్ కార్యాచరణపై సమీక్ష చేశారు. 2035-36 నాటికి తెలంగాణలో విద్యుత్ డిమాండ్ 34,137 మెగావాట్లకు చేరుకునే అవకాశం ఉండడంతో అధికారులతో చర్చించారు. విద్యుత్‌ డిమాండ్‌కు అనుగుణంగా అవసరమైన మౌలిక సదుపాయాల విస్తరణకు ఇప్పటి నుంచే సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయాలని విద్యుత్‌ శాఖ మంత్రిగా భట్టి విక్రమార్క ఆదేశించారు. వర్షాకాలం ప్రారంభమవడంతో విద్యుత్ సరఫరాలో అంతరాయ తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. భారీ వర్షాలు, ప్రకృతి విపత్తుల సమయంలో కూడా వినియోగదారులకు నిరంతరం విద్యుత్ అందించాలని.. దీనికోసం క్షేత్రస్థాయిలో విద్యుత్‌ ఉద్యోగులు అందరూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.

ప్రభుత్వంపై అదనపు ఆర్థిక భారం
డీఏ పెంపుతో రెగ్యులర్ ఉద్యోగులు, ఆర్టిజన్లు, పెన్షనర్లకు నేరుగా ఆర్థిక ప్రయోజనం చేకూరనుంది.  ఉద్యోగులకు ప్రకటించిన డీఏ పెంపుతో తెలంగాణ ప్రభుత్వంపై రూ.9.39 కోట్ల అదనపు భారం పడుతుందని అధికారులు అంచనా వేశారు. తెలంగాణ పవర్ సెక్టార్ పరిధిలోని ట్రాన్స్‌కో, జెన్‌కో, సదరన్ డిస్కమ్‌, నార్తర్న్ డిస్కమ్‌లలో పని చేసే ఉద్యోగులందరికీ డీఏ పెంపు వర్తించనుంది. ఇన్నాళ్లు ఆశగా ఎదురుచూస్తున్న డీఏపై ప్రభుత్వం ప్రకటన చేయడంతో విద్యుత్‌ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

డీఏ పెంపు లబ్ధి పొందేది వీరే
టీజీ ట్రాన్స్‌కో
టీజీ జెన్‌కో
సదరన్ డిస్కం
నార్తర్న్ డిస్కమ్‌

లబ్ధి పొందే మొత్తం ఉద్యోగులు: 71,387 మంది

0
0
Report
Advertisement

Surprising Fact: మన కళ్ళు ఎన్ని మెగాపిక్సెల్స్? వాటి రిజల్యూషన్ ఎంతో తెలిస్తే మీరు ఆశ్చర్యపోవాల్సిందే..!!

BBhoomi18h ago
Secunderabad, Telangana:

Technology Science: మనం కొత్తగా స్మార్ట్‌ఫోన్ కొన్నప్పుడు, మొదటగా చూసేది దాని కెమెరానే. అది ఎన్ని పిక్సెల్స్ ఉందో తెలుసుకుంటాం.  8 మెగాపిక్సెల్స్.. 200 మెగాపిక్సెల్స్..లేదంటే  అంతకంటే ఎక్కువ ఉందా అని చూస్తుంటాం. కానీ.. మీరు ఈ స్క్రీన్‌ను, ఈ ప్రపంచాన్ని చూసే మీ కళ్ళ రిజల్యూషన్ ఎంత ఉంటుందో అని ఎప్పుడైనా ఆలోచించారా? ఈ ప్రశ్నకు  ప్రఖ్యాత శాస్త్రవేత్త.. ఫోటోగ్రాఫర్ డాక్టర్ రోజర్ క్లార్క్ చేసిన పరిశోధన సమాధానం చెబుతోంది.. మానవ కన్నును ఒక డిజిటల్ కెమెరాలా పరిగణిస్తే.. అది 576 మెగాపిక్సెల్‌లను కలిగి ఉంటుంది. ఈ 576 మెగాపిక్సెల్ సంఖ్యను ఎలా నిర్ధారించారో..  మన కళ్ళు ఏ ఆధునిక కెమెరా కంటే ఎలా భిన్నమైనవో.. మరింత అధునాతనమైనవో తెలుసుకుందాం. 

డిజిటల్ కెమెరాలో, మెగాపిక్సెల్స్ అంటే దాని సెన్సర్‌పై ఉండే పిక్సెల్స్ లేదా కాంతిని గ్రహించే చుక్కల సంఖ్య అని అర్థం. మానవ కంటిలో, ఈ పనిని కంటి వెనుక భాగంలో ఉండే తెర వంటి రెటీనా నిర్వహిస్తుంది. రెటీనాలో రాడ్లు.. కోన్‌లు అనే రెండు ప్రత్యేక రకాల కాంతి సున్నితమైన  కణాలు ఉంటాయి. వాటి విధులు ఏంటో తెలుసుకుందాం. 

రాడ్లు: ఇవి మసక వెలుతురులో లేదా చీకటిలో చూడటానికి మనకు సహాయపడతాయి. ఇవి సుమారుగా 12 కోట్ల సంఖ్యలో ఉంటాయి.

కోన్‌లు: ఇవి రంగులను,  సూక్ష్మంగా ఉండే వివరాలను స్పష్టంగా చూడటానికి మనకు సహాయపడతాయి. వీటి సంఖ్య సుమారు 6 నుండి 7 మిలియన్ల వరకు ఉంటుంది.

డాక్టర్ క్లార్క్ మొత్తం మానవ దృష్టి క్షేత్రాన్ని.. వివరాలను గ్రహించే కంటి సామర్థ్యాన్ని ఒక గణిత సూత్రంలోకి మార్చినప్పుడు, మన మొత్తం దృశ్య క్షేత్రాన్ని కవర్ చేయడానికి ఒక డిజిటల్ కెమెరాకు 576,000,000 పిక్సెల్‌లు, లేదా 576 మెగాపిక్సెల్‌లు అవసరమవుతాయని తేలింది.

కంటి కెమెరా, స్మార్ట్‌ఫోన్ కెమెరా: అసలైన తేడా ఏమిటి?

కాగితంపై మన కన్ను 576 మెగాపిక్సెల్స్ అయినప్పటికీ..  అది కెమెరాలాగా ఒకేసారి మొత్తం స్క్రీన్ అంతటా హై రిజల్యూషన్ చిత్రాలను సంగ్రహించదు. కెమెరాలు.. కళ్ళు పనిచేసే విధానంలో కొన్ని ప్రాథమిక తేడాలు ఉన్నాయి.

మన కంటిలోని ఫోవియా అని పిలిచే.. ఒక చిన్న భాగం మాత్రమే ప్రతిదాన్నీ స్పష్టమైన వివరాలతో చూస్తుంది. ఈ ప్రాంతం మన మొత్తం దృష్టి క్షేత్రంలో కేవలం 2 డిగ్రీలను మాత్రమే సూచిస్తుంది. మిగిలినది అస్పష్టంగా ఉంటుంది. మన కళ్ళు నిరంతరం వేగంగా కదులుతాయి.. మన మెదడు ఈ అస్పష్టమైన ప్రాంతాలను కలిపి ఒక స్పష్టమైన, సంపూర్ణ చిత్రాన్ని అందిస్తుంది. నిజానికి మన కళ్ళు కాంతిని సేకరించే ఒక మాధ్యమం మాత్రమే. అసలైన పని చేసేది మన మెదడు. మన కళ్ళు పంపే సమాచారాన్ని మెదడు విశ్లేషించి.. నిరంతర వీడియోను సృష్టిస్తుంది. జూమ్ చేసినప్పుడు కెమెరా చిత్రాలు అస్పష్టంగా కనిపిస్తాయి.  కానీ మన కళ్ళు రెప్పపాటులో దృష్టిని మార్చుకుంటాయి. నాణ్యత తక్కువగా ఉందని మనకు ఎప్పుడూ అనిపించనివ్వవు. అంతేకాకుండా, మన కళ్ళ డైనమిక్ రేంజ్ ప్రపంచంలోని అత్యంత ఖరీదైన కెమెరా కంటే కూడా చాలా రెట్లు మెరుగ్గా ఉంటుంది.

 మీరు 200-మెగాపిక్సెల్ కెమెరాను చూసి వావ్ అనే ముందు.. ఒకసారి అద్దంలో మీ కళ్లను చూసుకోండి. ఏ సాంకేతికత కూడా సాటిరాని 576-మెగాపిక్సెల్ సూపర్‌కంప్యూటర్ లెన్స్‌ను ప్రకృతి ఇప్పటికే మీకు ప్రసాదించిందని తెలుసుకోండి. 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

KTR: ఖమ్మంలో ఉన్నది ముగ్గురు మొనగాళ్లు కాదు.. మోసగాళ్లు: కేటీఆర్

Paleru, Telangana:

Khammam Politics: 'రాష్ట్రంలో రెవెన్యూ పడిపోతా ఉంది. కానీ రెవెన్యూ మంత్రి (పొంగులేటి శ్రీనివాస రెడ్డి) అవినీతి సామ్రాజ్యం వందల వేల రెట్లు పెరిగిపోయింది. బాంబుల మంత్రి పొంగులేటి ఎంత సంపాదించాడంటే నోట్లు లెక్కపెట్టే మెషీన్లు కూడా అలసిపోతున్నాయి. రెండు సంవత్సరాల కింద ఈడి దాడి చేసిన ఇప్పటిదాకా దానిపైన కనీస ప్రకటన రాలేదు. ఆనాడు ఈడీ దాడి చేసి పట్టుకున్న రూ.వందల కోట్లపైన కనీసం ప్రకటన లేదు. పొంగులేటి ఈడీ దాడిపై బీజేపీ, కాంగ్రెస్ ఎందుకు మాట్లాడలేదు?' అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌ ప్రశ్నించారు. 'రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుంది కానీ డిప్యూటీ సీఎం భట్టి ఆదాయం, కమీషన్ దందాలు మాత్రం జోరుగా సాగుతున్నాయి' అని భట్టి విక్రమార్కపై కూడా మాజీ మంత్రి కేటీఆర్‌ విమర్శలు చేశారు.

బీజేపీతో పొంగులేటి లాలూచీ
పాలేరు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌ కీలక ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా ఖమ్మం జిల్లాకు చెందిన భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌ రావుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 'బీజేపీతో పొంగులేటికి ఉన్న లాలూచీ కారణంగానే ఈడీ పొంగులేటి శ్రీనివాస రెడ్డిపై కేసు పెట్టలేదు. తెలంగాణలో కోటి ఎకరాలు తెలంగాణ రాష్ట్రంలో వివాదస్పద జాబితాలో పెట్టి వాటిని దోచుకుంటున్నాడు. కోటి ఎకరాలపైన ఆంక్షలు పెట్టి ఆ భూములను బెదిరించి సెటిల్‌మెంట్లు చేయించుకుంటూ నికృష్టమైన పనులు చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి దొంగ అయితే పొంగులేటి గజ దొంగ మాదిరిగా దోచుకుంటున్నాడు. పొంగులేటి డైలాగులు, అహంకారం ప్రజలందరూ చూశారు' అని పొంగులేటిపై మాజీ మంత్రి కేటీఆర్‌ సంచలన ఆరోపణలు చేశారు.

ఎంత అహంకారం?
'పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీసీ మంత్రులు కొండా సురేఖని మాట్లాడనియ్యకుండా మైక్ కట్ చేశారు. పక్కన ఉన్న మరో బీసీ మంత్రి వాకిటి శ్రీహరి మీద కాగితాలు విసిరేశారు. ఎంత అహంకారం కాకుంటే తోటి మంత్రులతో అంత అహంకారంగా ప్రవర్తిస్తాడు. బీసీ మంత్రులు కూడా పొంగులేటి మాదిరే ప్రజలతో ఎనుకోబడ్డ వారు అని గుర్తుంచుకోవాలి' అని పొంగులేటికి కేటీఆర్‌ హితవు పలికారు. 'అధికారులను పట్టుకొని సెన్సు ఉందా అని అహంకారంతో పొంగులేటి మాట్లాడుతున్నాడు. ఈరోజు నేను అడుగుతున్నాను నీకు సెన్స్ ఉందా పొంగులేటి? ఇష్టానుసారంగా దోచుకోవడానికి, అక్రమ మైనింగ్ చేయడానికి నీ కుమారుడిని అడ్డుపెట్టుకొని వట్టినాగులపల్లిలో గజదొంగల భూములు దోచుకోవడానికి నీకు సెన్స్ ఉందా అని అడుగుతున్నారు' అని మండిపడ్డారు.

పాలేరులో ఎగిరేది గులాబీ జెండా
'వట్టినాగులపల్లిలో పదుల ఎకరాలపైన మీ కొడుకు, కిరాయి మూకలు పంపి వాళ్లపై దాడి చేసింది వాస్తవం కాదా? నీ కొడుకుపై పోలీస్ కేసు నమోదు చేస్తే ట్రాన్స్‌ఫర్ చేసింది వాస్తవం కాదా? నీ అన్యాయాలు, అక్రమాలు అహంకారం ప్రజలు చూడట్లేదు అనుకుంటున్నావా?' అని పొంగులేటిని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ నిలదీశారు. అందుకే పాలేరులో ఎప్పుడు ఎన్నిక వచ్చినా గులాబీ జెండా మాత్రమే ఎగురుతుందని ధీమా వ్యక్తం చేశారు.

మాట మీద నిలబడే సత్తా ఉందా?
'గృహ నిర్మాణ శాఖ మంత్రిగా 20 లక్షల ఇండ్లు కడితేనే ఓట్లు అడుగుతా అన్నావు కదా ఆ మాట మీద నిలబడే సత్తా ఉన్నదా? మరి సగం కాలం అయిపోయింది 10 లక్షల ఇండ్లు కట్టావా? లేదా నువ్వు కడతా అన్న 20 లక్షల ఇండ్లు నీ రాఘవ కంపెనీ ఏమైనా కడుతుందా? ఖమ్మంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు ఎన్ని ఇండ్లు ఇచ్చావు?' అని పొంగులేటిని మాజీ మంత్రి కేటీఆర్‌ ప్రశ్నించారు. వారికి రూ.6 లక్షలు ఇండ్లు కట్టుకోవడానికి ఇస్తామన్నావు ఆ మాట ఎక్కడ పోయింది? అని అడిగారు. 

కమీషన్ల కుమ్ములాటలో మంత్రులు
'అయినా నీకు ఇల్లు కట్టే తెలివి ఎక్కడిది, వెలుగుమట్ల మాదిరి ఇండ్లు కూలగొట్టడం, విధ్వంసం తప్ప వికాసం తెల్వదు. విధ్వంసం తప్ప వికాసం తెలవని దండుపాళ్యం ముఠా మీది' అని కాంగ్రెస్‌ నాయకులపై మాజీ మంత్రి కేటీఆర్‌ విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ రైతుల నుంచి పీల్చి పిండుకున్న భూమి శిస్తు కేసీఆర్ తీసేశారని గుర్తుచేశారు. కానీ కాంగ్రెస్ పార్టీ మళ్లీ భూమి శిస్తు పెట్టి రైతులను వేధించేందుకు సిద్ధమవుతున్నదని తెలిపారు. రేవంత్ రెడ్డి, రెవెన్యూ మంత్రి పొంగులేటి భూమి శిస్తు పెడతామని చెబుతున్నారు. భూమి శిస్తు పేరుతో రైతుల నుంచి ముక్కు పిండి డబ్బులు వసూలు చేస్తారా? ములుగు జిల్లాలో పొంగులేటి వేల కోట్ల ఇసుక దందా కోసం స్కెచ్ వేశాడు, చివరికి సమ్మక్క సారక్క జాతర్ల టెండర్లను కూడా పొంగులేటి వదిలిపెట్టలేదు. సమ్మక్క సారక్క జాతరలో కూడా కమీషన్ల కుమ్ములాటల కోసం మంత్రులు కొట్లాడుకున్నారు' అని మాజీ మంత్రి కేటీఆర్‌ గుర్తుచేశారు.

0
0
Report
Advertisement
Advertisement
Back to top