ఇసుక సరఫరాను వెంటనే పునరుద్ధరించాలని భారీ ర్యాలీ
Bellampalle, Kannal Rural, Telangana:మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో ఇసుక కొరత వల్ల తమకు ఉపాధి కరువైందని భవన నిర్మాణ ఐక్య కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. భవన నిర్మాణాలకు ఇసుక సరఫరాను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం పట్టణంలో భారీ ఎత్తున ర్యాలీ చేపట్టారు. కాంట చౌరస్తా నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ కొనసాగింది. ఇసుక కొరత వల్ల ఉపాధి లేక కార్మికులు పస్తులు ఉంటున్నారని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
సమసప్తక యోగం ఎఫెక్ట్.. జూలై 4 నుంచి ఈ 5 రాశుల వారికి ఊహించని ధనలాభం, ఇక సువర్ణ కాలమే!
Hyderabad, Telangana:Venus-Ketu Samasaptaka Yoga 2026 Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. గ్రహాల సంచారాలకు, వాటి కలయికలు మానవ జీవితాలపై, ద్వాదశ రాశులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. ఇదిలా ఉంటే జూలై 4వ తేదీన శుక్రుడు, కేతువుల కలయిక కారణంగా అత్యంత అరుదైన, శక్తివంతమైన సమసప్తక యోగం ఏర్పడబోతోంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. శుక్రుడిని రాక్షస గురువు అని పిలుస్తారు.. అలాగే రాహు, కేతువులను కూడా కీడు గ్రహాలుగా పరిగణిస్తారు. అందుకే ఈ అద్భుతమైన యోగం కారణంగా కొన్ని రాశుల వారికి అదృష్టం వరించడమే కాకుండా.. విపరీతమైన ధనలాభాలు కలుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా 5 రాశుల వారు ఈ కాలంలో సువర్ణ కాలం ప్రారంభమవుతుంది. ముఖ్యంగా ఆయా రాశులవారికి ఈ సమయంలో అద్బుతమైన ప్రయోజనాలు కలుగుతాయి.
ఈ రాశుల వారికి ఊహించని ప్రయోజనాలు:
మేష రాశి (Aries)
మేష రాశి వారికి శుక్ర, కేతువుల కలయిక ఐదవ స్థానంలో జరగడం కారణంగా ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది. దీని శుభ ప్రభావంతో వీరు తప్పకుండా ఉన్నత విద్యను అభ్యసించి.. విద్యార్థులు పోటీ పరీక్షలలో అద్భుతమైన విజయాలు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సంతానం కలగడం కారణంగా కుటుంబంలో ఆనందం విపరీతంగా పెరుగుతుంది. తల్లిదండ్రులకు సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. వీరికి మానసిక బలం, ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతాయి. ఉద్యోగ రంగంలో మీ సృజనాత్మకతకు పైఅధికారుల నుంచి ప్రత్యేక ప్రశంసలు, పదోన్నతులు లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.
వృషభ రాశి (Taurus)
వృషభ రాశి వారికి ఈ సమసప్తక యోగం నాల్గవ స్థానంలో ఏర్పడింది.. దీని వల్ల వీరి జీవితంలో సానుకూల మార్పులు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. రియల్ ఎస్టేట్ లేదా భూములపై పెట్టుబడులు పెట్టడానికి ఇది అత్యంత అనుకూలంగా మారుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. చాలా కాలంగా నిలిచిపోయిన కొత్త ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేసే కల నెరవేరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. శుక్రుడి అనుగ్రహంతో మానసిక ప్రశాంతత లభించడమే కాకుండా.. తల్లితో ఉన్న బంధం మరింత మెరుగుపడుతుంది.
సింహ రాశి (Leo)
సింహ రాశిలోనే ఈ ప్రత్యేక యోగం ఏర్పడుతుంది.. దీనివల్ల వీరికి సమాజంలో మరింత గుర్తింపు లభిస్తుంది.. వీరికి ఈ సమయంలో తప్పకుండా గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు గణనీయంగా పెరుగుతాయి. తెలివితేటలు, నైపుణ్యంతో చాలా కాలంగా పెండింగ్లో ఉన్న ముఖ్యమైన పనులను విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు. మీపై మీరు శ్రద్ధ వహించడానికి, కుటుంబంతో కలిసి ఆనందంగా గడపడానికి ఇది అనుకూలమైన సమయంగా భావించవచ్చు.
తులా రాశి (Libra)
తులా రాశి వారికి ఈ యోగం పదకొండవ స్థానంగా భావించే.. లాభ స్థానంలో ఏర్పడబోతోంది. దీని ప్రభావంతో ఊహించని మార్గాల ద్వారా మీకు భారీగా ఆదాయం లభిస్తుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఆర్థిక పరిస్థితి గతంలో కంటే చాలా మెరుగుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యాపారంలో కొత్త భాగస్వాములు కూడా లభిస్తారు. అన్నదమ్ములు లేదా అక్కాచెల్లెళ్ల నుంచి ఆశించిన సపోర్ట్ కూడా లభిస్తుంది.. మీ మనస్సులో చాలా కాలంగా నెరవేరని కోరికలు ఈ సమయంలో పూర్తివుతాయి.
కుంభ రాశి (Aquarius)
కుంభ రాశి వారికి ఏడవ స్థానంలో ఈ యోగం ఏర్పడుతుంది.. దీనివల్ల అవివాహితులకు అనుకూలమైన వివాహ సంబంధాలు కుదురుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. వివాహితుల జీవితంలో ప్రేమ, పరస్పర అవగాహన, ఆనందం కూడా పెరుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. భాగస్వామ్య వ్యాపారాలు (Partnership Business) చేసే వారికి భారీ లాభాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కుటుంబంతో లేదా ప్రియమైన వారితో కలిసి ఆహ్లాదకరమైన ప్రాంతాలకు ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
గమనిక.. 
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..
మీ వంటగదిలోని ఈ 3 వస్తువులతో.. ముఖంపై అవాంఛిత రోమాలకు శాశ్వతంగా చెక్ పెట్టండి!
Hyderabad, Telangana:DIY Facial Hair Removal: చాలామంది మహిళలు ముఖం మృదువుగా, కాంతివంతంగా కనిపించాలని ఫేషియల్ హెయిర్ను తరచూ తొలగించుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. ఇందుకోసం థ్రెడ్డింగ్, వాక్సింగ్ వంటి పద్ధతులను వాడుతుంటారు.. దీనివల్ల సెలూన్లకు వెళ్లి ఖర్చు చేయడమే కాకుండా కొందరిలో చర్మ సమస్యలు కూడా వస్తున్నాయి. కానీ, మన పూర్వీకులు వాడే ఒక చక్కని ఇంటి చిట్కాతో ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించుకోవచ్చు. మన భారతీయ సంప్రదాయ సౌందర్య సాధనాల్లో శనగపిండికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. శనగపిండితో పాటు గోధుమపిండి , చక్కెరను కలిపి వాడటం వల్ల ఫేషియల్ హెయిర్ సమస్య క్రమంగా తగ్గుతుంది.
దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.. కేవలం వెంట్రుకలను తొలగించడమే కాకుండా ముఖానికి కొత్త కళను, కాంతిని కూడా అందిస్తుంది. సెలూన్కు వెళ్లే బదులు 10 రోజులకు ఒకసారి ఇంట్లోనే ఇలా చేయడం వల్ల ముఖం మృదువుగా మారుతుంది. ఇది ఒక మంచి ఎక్స్ఫోలియేటర్గా కూడా పనిచేస్తుంది.
ఇంట్లో ఉండే ఈ మూడు వస్తువులు థ్రెడ్డింగ్, వాక్సింగ్కు అద్భుతమైన ప్రత్యామ్నాయం. ఇవి సహజమైనవి కాబట్టి ముఖానికి మంచి కాంతిని ఇస్తూ వెంట్రుకలను తొలగిస్తాయి. భారతీయ సంప్రదాయాల్లో వాడే ఈ పద్ధతి వెంట్రుకల మూలాల నుండి వాటిని తొలగించడమే కాకుండా, అవి మళ్ళీ పెరగకుండా ఆలస్యం చేస్తుంది. అంతేకాకుండా చర్మంపై ఉన్న మృతకణాలను (dead skin cells) తొలగించి ముఖాన్ని కాంతివంతంగా మారుస్తుంది.
ఫేషియల్ హెయిర్ మాస్క్ తయారీ విధానం..
ఒక స్పూన్ గోధుమపిండి, ఒక స్పూన్ శనగపిండి, అర చెంచా చక్కెర తీసుకోవాలి. ముందుగా గోధుమపిండిని, శనగపిండిని పెనంపై దోరగా వేయించాలి). పిండి మాడిపోకుండా జాగ్రత్త వహించి, గోల్డెన్ రంగు వచ్చాక చల్లారనివ్వాలి. తర్వాత ఒక గిన్నెలో గోరువెచ్చని నీరు పోసి అందులో చక్కెరను కరిగించి, వేయించిన పిండిని కలిపి మెత్తని పేస్టులా తయారు చేసుకోవాలి.
READ Also: వర్షాకాలంలో వారానికి ఒక్కసారైనా ముఖానికి ఆవిరి పడుతున్నారా? ఈ 7 అద్భుత ప్రయోజనాలు తెలిస్తే?!
READ Also: ఒత్తయిన పొడవాటి జుట్టు మీ సొంతం.. ఇంట్లోనే ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే హెయిర్ ఫాల్కి శాశ్వతంగా బైబై!
ఫేషియల్ మాస్క్ వేసుకునే విధానం..
ఈ మాస్క్ వేసుకునే ముందు ముఖంపై ఉన్న మేకప్ లేదా మాయిశ్చరైజర్ను పూర్తిగా తొలగించాలి. శుభ్రమైన ముఖంపై ఈ మాస్క్ను అప్లై చేసి పూర్తిగా ఆరనివ్వాలి. అది ఆరిన తర్వాత, మృదువుగా సర్క్యులర్ మోషన్లో రుద్దాలి. ఇలా చేయడం వల్ల వెంట్రుకలు బలహీనపడి ఊడిపోతాయి. క్రమం తప్పకుండా వాడటం వల్ల వెంట్రుకల పెరుగుదల తగ్గుతుంది.
సెలూన్ వెళ్లకుండా ప్రత్యామ్నాయం కోరుకునే వారు ఈ పేస్ట్ను ఉపయోగించవచ్చు. ఇది తక్షణమే ఫలితాలను ఇవ్వకపోయినా, సహజంగా వెంట్రుకల పెరుగుదలను ఆలస్యం చేస్తుంది. మంచి ఫలితాల కోసం ప్రతి 10 రోజులకు ఒకసారి ఈ మాస్క్ను వాడాలి. అప్పుడు రాను రాను వెంట్రుకలు తగ్గుతాయని మీరు గమనిస్తారు.
అయితే, ఇది తక్షణ ఫలితాల కోసం వాడే ప్రత్యామ్నాయం కాదు. సెన్సిటివ్ స్కిన్ ఉన్నవారు ముందుగా ప్యాచ్ టెస్ట్ తప్పనిసరిగా చేసుకోవాలి. ముఖంపై ఏదైనా దురద అనిపిస్తే దీనిని వాడకండి. మన భారతీయ సంప్రదాయంలో చిన్న పిల్లలకు కూడా శనగపిండిని వాడుతుంటారు, కాబట్టి ఇది వెంట్రుకల తొలగింపుకు చాలా సురక్షితమైన, మంచి రెమెడీ.(Disclaimer: పాఠకులారా ఈ వ్యాసం కేవలం సాధారణ సమాచారం, సలహాలను మాత్రమే అందిస్తుంది. ఇది ఎంతమాత్రం వృత్తిపరమైన సలహా కాదు. ఈ సమాచారానికి జీ తెలుగు న్యూస్ ఎటువంటి బాధ్యత వహించదు.)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Shadashtak Yog 2026: శుక్ర, శనుల అరుదైన కలయిక.. ఈ 4 రాశుల తలరాతలు మారబోతున్నాయి!
Hyderabad, Telangana:Shadashtak Yoga Effect On Zodiac: జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం, వాటి కలయికలు, నక్షత్ర సంచారాలకు ఎంతో ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంటుంది. కొన్ని అరుదైన గ్రహాల స్థితులు మానవ జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే 2026 జూలై 23, గురువారం ఉదయం 9 గంటల 46 నిమిషాలకు ఒక అత్యంత శక్తివంతమైన, అరుదైన ఖగోళ మార్పు సంభవించబోతోంది. శుక్రుడు, శని గ్రహాలు ఒకదానికొకటి 150 డిగ్రీల కోణంలోకి రాబోతున్నాయి. దీని కారణంగానే ఎంతో శక్తివంతమైన, అరుదైన షడష్టక యోగం ఏర్పడబోతోందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఈ యోగం వల్ల కొన్ని రాశుల వారి తలరాతలు పూర్తిగా మారిపోబోతున్నాయి. ముఖ్యంగా 4 రాశుల వారికి ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి.. కాసుల వర్షం కురవడమే కాకుండా.. ప్రేమ జీవితం కూడా అద్భుతంగా మారబోతోందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అయితే, ఈ సమయంలో ఏయే రాశులవారికి ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ రాశులవారికి బంపర్ జాక్పాట్..
మేష రాశి:
అరుదైన షడష్టక యోగం వల్ల మేష రాశి జాతకులకు గోల్డెన్ డేస్ మొదలు కాబోతున్నాయి. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి పదోన్నతులు, ఊహించని గుర్తింపు లభిస్తుంది.. సమాజంలో మీ వ్యక్తిత్వానికి ప్రత్యేక గౌరవం పెరుగుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. క్లిష్ట సమయాల్లో సరైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం విపరీతంగా పెరుగుతుంది. ఆర్థికంగా ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. అకస్మాత్తుగా ధనలాభం కలిగే ఛాన్స్ కూడా లభిస్తుంది. ఇక ప్రేమ వ్యవహారాల్లో గత కొంతకాలంగా వేధిస్తున్న సమస్యలన్నీ తొలగిపోయి.. మీ భాగస్వామితో బంధం మరింత బలపడుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.
కర్కాటక రాశి:
శుక్ర, శనుల ఈ ప్రత్యేక కలయిక కర్కాటక రాశి వారికి కొత్త వెలుగులను ప్రసాదించబోతోందని జ్యోతిష్యులు చెబుతున్నారు. మీ జీవితంలో ఉన్న నెగటివ్ ఎనర్జీ తొలగిపోయి.. సానుకూలత మరింత పెరుగుతుంది. జీవితంలోని అనేక సంక్లిష్ట సమస్యలకు సులభమైన పరిష్కారాలు లభిస్తాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్ లభించే అవకాశాలు కూడా ఉన్నాయి. దీనివల్ల ఆర్థిక స్థితి పూర్తిగా మారిపోతుంది.. వైవాహిక జీవితంలో సుఖసంతోషాలు విపరీతంగా పెరుగుతాయి. భౌతిక సుఖాలు, విలాసాలు విపరీతంగా పెరుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.
తులా రాశి:
ఈ షడష్టక యోగం తులా రాశివారికి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. వీరికి ఈ సమయం గోల్డెన్ టైమ్గా భావించవచ్చు. అంతేకాకుండా అదృష్టం విపరీతంగా పెరుగుతుంది. ఈ రాశివారికి ఇది అద్భుతమైన సమయంగా మారవచ్చు. ఉద్యోగంలో ఉన్నత స్థానాలకు చేరుకుంటారు. వ్యాపారంలో భారీ లాభాలు కలుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ప్రేమ జీవితంలో ఆనందం రెట్టింపు అవుతుంది. ఇప్పటికే వ్యాపారాలు చేస్తున్నవారికి పెద్ద పెద్ద డీల్స్ ఫైనల్ అవుతాయి. ముఖ్యంగా ప్రేమ జీవితంలో అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
మిథున రాశి:
మిథున రాశి వారికి ఈ యోగం అద్భుతమైన సమయాన్ని తీసుకు రాబోతోందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. వ్యాపారస్తులకు ఈ సమయంలో భారీ లాభాలు కలిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. సమాజంలో ప్రభావవంతమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి.. ఇవి భవిష్యత్తులో మీకు ఎంతో సహాయపడతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. సుదీర్ఘకాలంగా నిలిచిపోయిన పనులు వేగంగా పూర్తవుతాయి. కోర్టు కేసులు లేదా వివాదాల నుంచి వీరు తప్పకుండా విజయవంతంగా బయటపడే సూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావారణం నెలకొంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.. అందరి ఆరోగ్యం కుదుటపడుతుంది. ముఖ్యంగా ప్రేమ జీవితంలో ప్రశాంతత నెలకొంటుంది.
(నోట్: ఈ సమాచారం కేవలం జ్యోతిష్య నిపుణుల అంచనాలు, ఇంటర్నెట్లో సమాచారం ఆధారంగా రాయబడింది. దీనిని నమ్మడం అనేది మీ వ్యక్తిగత విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది.)
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..
మేడిసన్ స్క్వేర్ గార్డెన్లో టేలర్ స్విఫ్ట్ గ్రాండ్ వెడ్డింగ్..మూడేళ్ల ప్రేమాయణానికి శుభం కార్డు..!!
Secunderabad, Telangana:Taylor Swift And Travis Kelce Officially Married: పాప్ స్టార్ టేలర్ స్విఫ్ట్ , ఫుట్బాల్ స్టార్ ట్రావిస్ కెల్సీల అభిమానుల నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడింది. ఈ జంట న్యూయార్క్లోని చారిత్రాత్మక మాడిసన్ స్క్వేర్ గార్డెన్లో అధికారికంగా వివాహం చేసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ప్రముఖులు వారి అంగరంగ వైభవమైన వేడుకకు హాజరయ్యారు. సోషల్ మీడియా నుండి మీడియా వరకు.. ఈ మెగా-వెడ్డింగ్ గురించే అందరూ చర్చించుకుంటున్నారు.
వీరి మూడేళ్ల ప్రేమాయణం జూలై 4న న్యూయార్క్లో జరిగిన ఒక ప్రైవేట్ వివాహ వేడుకతో ముగిసింది. ఈ వార్తను టేలర్ స్విఫ్ట్ పబ్లిసిస్ట్ అధికారికంగా ధృవీకరించారు. మాన్హాటన్లోని ప్రసిద్ధ క్రీడా వేదిక అయిన మాడిసన్ స్క్వేర్ గార్డెన్ వెలుపల ఒక పెద్ద తెరపై జస్ట్ మ్యారీడ్ అని ప్రదర్శించగా.. గ్రామీ అవార్డు గెలుచుకున్న కాన్సాస్ సిటీ చీఫ్స్ స్టార్ అయిన టేలర్ స్విఫ్ట్, రాయిటర్స్కు పంపిన ఒక ఈమెయిల్లో వెంటనే ఈ వివాహాన్ని ధృవీకరించారు.
ఎంతో వైభవంగా జరిగిన వివాహా వేడుకకు హాలీవుడ్, సంగీత ప్రపంచానికి చెందిన అనేక మంది ప్రముఖులతో పాటు కుటుంబ సభ్యులు, స్నేహితులు హాజరయ్యారు. హాలీవుడ్ హాస్యనటుడు ఆడమ్ శాండ్లర్ ఈ వేడుకను నిర్వహించారని ఆ ప్రకటనలో తెలిపారు. ఈ ఘనమైన వివాహానికి ముందు, స్విఫ్ట్ స్వస్థలమైన నాష్విల్లో కేవలం అత్యంత సన్నిహితుల సమక్షంలో వారు రహస్యంగా వివాహం చేసుకున్నారని వార్తలు వచ్చాయి. తమ వివాహం ఎప్పటికీ గుర్తుండిపోయేలా.. ఈ జంట అమెరికాలోని 20 స్థానిక, జాతీయ స్వచ్ఛంద సంస్థలకు భారీ మొత్తంలో విరాళాలు అందించి తమ ఉదారతను ప్రదర్శించారు. టేలర్ స్విఫ్ట్ అత్యంత సన్నిహితులు, సంగీత పరిశ్రమ ప్రముఖులైన ఎడ్ షీరన్ , సబ్రినా కార్పెంటర్, ఆరోన్ డెస్నర్ ఈ వివాహానికి హాజరయ్యారు. సుమారు 1,000 నుండి 1,200 మంది అతిథుల సమక్షంలో టేలర్, ట్రావిస్ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు.
టేలర్ పెళ్లి బాధ్యతలు తీసుకున్న మార్క్ సీడ్:
ఈ వైభవోపేతమైన వివాహాన్ని రహస్యంగా.. విలాసవంతంగా జరిపించే బాధ్యతను హాలీవుడ్ ప్రఖ్యాత సెలబ్రిటీ వెడ్డింగ్ ప్లానర్ అయిన మార్క్ సీడ్ అతని బృందానికి అప్పగించారు. సోషల్ మీడియా, ప్రచారానికి దూరంగా.. తన వీఐపీ క్లయింట్లు అత్యంత గోప్యతను పాటించడం మార్క్ సీడ్ జాగ్రత్తలు తీసుకున్నారు. మార్క్ సీడ్ .. హాలీవుడ్ తారల కోసం అత్యద్భుతమైన విలాసవంతమైన వివాహ ఏర్పాట్లు చేయడంలో ఆయన చాలా ఫేమస్ అని చెప్పాలి.
పెళ్లికి సుమారు 50 మిలియన్ డాలర్లు:
న్యూయార్క్లోని మాడిసన్ స్క్వేర్ గార్డెన్లో జరిగిన ఈ అద్భుతమైన వివాహానికి 50 మిలియన్ డాలర్ల వరకు ఖర్చు చేశారు. ఈ భారీ బడ్జెట్లో అధిక భాగం వేదికను బుక్ చేసుకోవడానికి, కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేయడానికి, ఆడంబరమైన అలంకరణలకు, అతిథులకు ఆహారపానీయాలు అందించడానికి వెచ్చించారు. మాడిసన్ స్క్వేర్ గార్డెన్ను అద్దెకు తీసుకోవడానికి, అలాగే అద్భుతమైన వివాహ పెవిలియన్, సెట్ను నిర్మించడానికి మాత్రమే సుమారు 28 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనా.
2023లో స్నేహంగా ప్రారంభమైన వారి ప్రయాణం, ఆ తర్వాత ప్రేమగా వికసించింది. ఈ జంట 2025 ఆగస్టు 26న ఇన్స్టాగ్రామ్ ద్వారా తమ నిశ్చితార్థాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. 14 సార్లు గ్రామీ అవార్డు విజేత టేలర్ స్విఫ్ట్, మూడుసార్లు సూపర్ బౌల్ ఛాంపియన్ ట్రావిస్ కెల్సీల వివాహం వారి అభిమానులకు ఒక కల నిజమైన క్షణం అని చెప్పాలి. .
Also Read: మరో 15రోజులు బంగారం, వెండి జోలికి వెళ్లకండి.. అమెరికా తీసుకున్న ఈ నిర్ణయం బులియన్ మార్కెట్లో
Also Read: భారీగా పడిపోనున్న గోల్డ్ రేట్.. 2 నెలల్లో తులం 1లక్షకు చేరే ఛాన్స్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
తిరుమల శ్రీవారి సేవలో రెండు రాష్ట్రాల గవర్నర్లు
Dharmavaram, Andhra Pradesh:Two Other Governors Visits Tirumala Temple Watch Videoరేపు మిడ్జిల్కు రేవంత్ రెడ్డి.. ఏర్పాట్లు పూర్తి
Midjil, Telangana:All Set To Revanth Reddy Midjil Tour A Head 20 Years Complete In Political Careerతిరుమలలో దిల్ రాజు, రాఘవేంద్రరావు.. ఇతర ప్రముఖులు
Dharmavaram, Andhra Pradesh:Cine Actors And MLAs Visits To Tirumala Temple Watch VideoPrashna Ravan Arrest: యూట్యూబర్ ప్రశ్న రావణ్ అరెస్టు.. వైసీపీ Vs జనసేన కార్యకర్తల మధ్య తోపులాట!
Machilipatnam, Andhra Pradesh:Heavy Rain Alert: రాబోయే 2 గంటల్లో భారీ వర్షం..తెలుగు రాష్ట్రాలకు బిగ్ వార్నింగ్..
Hyderabad, Telangana:Heavy Rain Alert News: దేశవ్యాప్తంగా ఎల్నినో ప్రభావంతో నైరుతి రుతుపవనాలు మందకొడిగా సాగుతున్నాయి. అయితే కొన్ని ప్రాంతాల్లో వర్షాలు భారీగా పెరిగాయి. రాబోయే రెండు గంటల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు భారీగా కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలియజేసింది.రేపు రాజకీయ జన్మనిచ్చిన మిడ్జిల్కు రేవంత్ రెడ్డి.. షెడ్యూల్ ఇదే!
Midjil, Telangana:Revanth Reddy Midjil Visit: రాజకీయాల్లోకి అరంగేట్రం చేసిన అనంతరం తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచి రేవంత్ రెడ్డి 20 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా తనకు రాజకీయ జీవితాన్ని ఇచ్చిన ప్రాంతానికి రేపు రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. తన రెండు దశాబ్దాల రాజకీయ వార్షికోత్సవాన్ని చేసుకోనున్నారు. జెడ్పీటీసీ నుంచి ముఖ్యమంత్రి వరకు తాను ఎదగడానికి కారణమైన గడ్డకు కృతజ్ఞత చెప్పుకునేందుకు మిడ్జిల్ ప్రాంతంలో రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు.
20 ఏళ్ల రాజకీయ ప్రస్థానానికి జన్మనిచ్చిన నేలకు వందనం చెప్పేందుకు రేవంత్ రెడ్డి వెళ్తారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. రేపు శనివారం ముఖ్యమంత్రి నాగర్కర్నూల్, మహబూబ్నగర్ జిల్లాల్లో పర్యటించనున్నారు. ప్రజాప్రతినిధిగా తన తొలి విజయానికి వేదికైన మిడ్జిల్ మండలానికి ముఖ్యమంత్రి హోదాలో వెళ్లనుండడంతో ఈ పర్యటన రాజకీయంగా, భావోద్వేగంగా ప్రత్యేకత సంతరించుకుంది. తనకు రాజకీయ జన్మనిచ్చిన నేలపై ప్రజలకు కృతజ్ఞతలు తెలపడంతోపాటు పలు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపనలు చేయనున్నారు.
షెడ్యూల్ ఇదే!
==> రేపు ఉదయం 11.45 గంటలకు హైదరాబాద్ నుంచి ముఖ్యమంత్రి ప్రత్యేక హెలికాప్టర్లో నాగర్కర్నూల్ జిల్లాకు బయలుదేరుతారు.
==> 12.30 గంటలకు ఉర్కొండపేట హెలిప్యాడ్కు చేరుకుంటారు. అక్కడి నుంచి ఆంజనేయస్వామి గుడికి వెళ్లి స్వామివారిని దర్శనం చేసుకొని ప్రత్యేక పూజలు చేస్తారు.
==> ఆలయ అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి భూమి పూజ చేసి శంకుస్థాపన. అనంతరం ఆలయ ఆవరణలో తన తొలి రాజకీయ ప్రయాణంలో వెంట నడిచిన ఆనాటి అనుచరులు, ముఖ్య నాయకులు, ఆనాటి పెద్దలతో మాటామంతీ జరపనున్నారు. వారితో కలిసి మధ్యాహ్న భోజనం చేయనున్నారు.
==> మధ్యాహ్నం 2.30 గంటలకు ఉర్కొండపేట నుంచి రోడ్డు మార్గంలో మహబూబ్నగర్ జిల్లా మిడ్జిల్కు బయలుదేరుతారు.
==> 2.45 గంటలకు మిడ్జిల్ మండలం వెల్జాల క్రాస్ రోడ్డుకు చేరుకుని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహ ఆవిష్కరణ
==> మధ్యాహ్నం 3 గంటలకు మిడ్జిల్ బహిరంగ సభా ప్రాంగణంలో వివిధ అభివృద్ధి పనులకు భూమి పూజ, శంకుస్థాపనలు చేయనున్నారు.
==> సాయంత్రం 3.15 గంటలకు మిడ్జిల్లో జరిగే బహిరంగ సభలో రేవంత్ రెడ్డి ప్రసంగం
కృతజ్ఞతా సభ
2006లో మిడ్జిల్ జడ్పీటీసీగా గెలిచి ప్రజాప్రతినిధిగా రాజకీయాల్లో తొలి అడుగు వేసిన రేవంత్ రెడ్డి, 20 ఏళ్ల ప్రజా ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంటున్న వేళ అదే నేలపై ముఖ్యమంత్రిగా ప్రజలకు తన కృతజ్ఞతలు తెలపనున్నారు. జెడ్పీటీసీ నుంచి ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీ, టీపీసీసీ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి స్థాయి వరకు సాగిన తన ప్రస్థానంలో మిడ్జిల్ ప్రజల ఆశీర్వాదం కీలకమని భావిస్తున్నారు.
ముగ్గురు మంత్రులు వర్సెస్ ఒకే ఒక్కడు.. ఆసక్తిగా ఖమ్మం జిల్లా రాజకీయాలు
Khammam, Telangana:Khammam Politics: బీఆర్ఎస్ పార్టీ హయాంలో పువ్వాడ అజయ్ కుమార్ ఖమ్మం జిల్లాలో ఒక వెలుగు వెలిగిన నాయకుడు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తరువాత సైలెంటయ్యారు. ఓటమిని జీర్ణించుకోకపోవడం.. వ్యక్తిగత కారణాలతో అజయ్ గులాబీ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా కనిపించలేదు. ప్రస్తుతం రెండు నెలల నుంచి జిల్లాలో విసృతంగా ఆయన పర్యటిస్తున్నారు. వారానికి రెండు, మూడు సార్లు జిల్లాలో పర్యటిస్తున్నారు. దీంతో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులలో ఉత్సాహం కనిపిస్తుంది. కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న ఆ పార్టీ నాయకులు కూడా ఇప్పుడు చురుగ్గా మారారు.
మరోవైపు రాష్ట్ర పార్టీ కూడా ఖమ్మం జిల్లాపై దృష్టి సారించింది. ఎందుకంటే ముగ్గురు కీలక మంత్రులు జిల్లాలో ఉండడంతో వారిని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తుంది. ఎన్నడూ లేని రీతిలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు వరుస పర్యటనలు చేశారు. దీంతో ఒక్కసారి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ నాయకుల మధ్య మాటల యుద్దం కొనసాగింది. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో కూడా ప్రజల్లో కొంత అసహనం ఉండడంతో దానిని క్యాచ్ చేసుకునే పనిలో బీఆర్ఎస్ పార్టీ ఉందని చెప్పవచ్చు. పార్టీ బలోపేతం, కార్యకర్తలకు భరోసా ఇవ్వటానికి మాజీ మంత్రి అజయ్కి పార్టీ ఆదిష్టానం కీలక బాధ్యతలు ఇచ్చినట్లు తెలుస్తోంది. అందుకే పువ్వాడ జిల్లాలో యాక్టివ్ అయ్యారని తెలుస్తోంది. మరోవైపు కేటీఆర్తో పువ్వాడ అజయ్కు సన్నిహిత సంబంధాలు ఉండడం జిల్లాలో పువ్వాడకు కలిసొచ్చింది. కీలక నాయకులు ఉన్నప్పటికీ పువ్వాడపైనే భారం వేసినట్లు సమాచారం.
ఖమ్మం జిల్లాలో ఉన్న ముగ్గురు మంత్రుల పనితీరుపై పువ్వాడ అజయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా ఖమ్మం నియోజకవర్గంలో గెలిచి మంత్రి అయిన తుమ్మల నాగేశ్వరరావును లక్ష్యంగా అజయ్ కుమార్ ఆరోపణలు చేస్తున్నారు. గతంలో తన హయాంలో ఖమ్మంలో జరిగిన అభివృద్దిని వివరిస్తున్నాయి. కాంగ్రెస్ హయాంలో అభివృద్ధి శూన్యం అంటూ తుమ్మలపై విరుచుపడుతున్నాడు. మళ్లీ వచ్చే ఎన్నికల్లో తుమ్మల వర్సెస్ పువ్వాడ అనే రీతీలో అజయ్ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాడు. ఇటీవల కాలంలో పార్టీ సభ్యత్వ నమోదుకు సంబంధించి కూడా ఆయా నియోజకవర్గాలపై దృష్టి పెట్టారు. దీంతో క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం కోసం అజయ్ కుమార్ ప్రయత్నాలు చేస్తున్నారు. గత మూడు అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కో సీటుకే పరిమితమైన బీఆర్ఎస్ పార్టీని.. వచ్చే ఎన్నికల్లో మెజార్టీ అసెంబ్లీ సీట్లు సాధిస్తామనే ధీమాలో ఉన్నట్లు తెలుస్తుంది. అందుకే ఎన్నికలకు ఇంకా సమయం ఉన్న క్రమంలో ఇప్పటి నుంచే పువ్వాడ జిల్లాలో వ్యూహాలు అమలు చేస్తున్నారని సమాచారం.
అయితే అజయ్ కుమార్కు బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఆశీస్సులు ఉన్న జిల్లా నాయకులు ఆయనకు సహకరించడం లేదనే ప్రచారం నడుస్తుంది. మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకట వీరయ్య, కందాల ఉపేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ తాత మధు, మాజీ జెడ్పీ చైర్మన్ కమల్ రాజ్తో పాటు పలువురు ఒక జట్టుగా పనిచేస్తున్నారని సమాచారం. వీరంతా అజయ్ పర్యటనలో అంటిముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారనే ప్రచారం ఉంది. మరోవైపు పార్టీలో ఎలాంటి సమస్యలు ఉన్న కలిసికట్టుగా ఉండి వచ్చే ఎన్నికలలో జిల్లాలో మెరుగైన ఫలితాలు సాధిస్తామని పువ్వాడ చెబుతున్నారు. చూడాలి పువ్వాడ అజయ్ వ్యూహాలు ఏ మేరకు ఫలిస్తాయో.
తెలంగాణ అప్పుల చిట్టా ఇదే! జూపల్లికి మాజీ మంత్రి హరీశ్ రావు బహిరంగ లేఖ
Hyderabad, Telangana:Telangana Debts: బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో చేసిన అప్పులపై కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోందని ఆ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్ రావు ఖడించారు. రెండున్నరేళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంపై మోపిన అప్పుల గురించి వివరిస్తూ మంత్రి జూపల్లి కృష్ణారావుకి బహిరంగ లేఖ రాశారు. లేఖతో పాటు విడియోలు, ఇతర ఆధారాలను మంత్రికి వాట్సప్ ద్వారా పంపించారు. అప్పులపై పదే పదే దుష్ప్రచారం చేస్తున్నారని సాక్ష్యాధారాలతో సహా నిరూపించారు.
'బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో చేసిన అప్పుల గురించి రేవంత్ రెడ్డి, మంత్రివర్గ సభ్యులు పదేపదే దుష్ప్రచారం చేస్తున్నారు. మీ ప్రచారం పూర్తిగా అవాస్తవమని ఆధారాలతో సహా ఎన్నిసార్లు వివరించినా మీ తీరు మారక పోవడం శోచనీయం' అని కాంగ్రెస్ తీరుపై మాజీ మంత్రి హరీశ్ రావు అసహనం వ్యక్తం చేశారు. తొమ్మిదిన్నరేళ్లలో బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం తీసుకున్న రుణాలు, గ్యారెంటీ ఇచ్చి ప్రభుత్వం చెల్లించే రుణాలు మొత్తం కలిపితే రూ.4.17 లక్షల కోట్లు మాత్రమేనని నేను అసెంబ్లీలో తెలిపా. నేను చెప్పిన ఆ లెక్కలకు కట్టుబడి ఉంటా. ఎక్కడైనా చర్చకు సిద్దమని అసెంబ్లీలోనే స్పష్టంగా ప్రకటించా' అని బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు గుర్తుచేశారు..
'మీరు (జూపల్లి) రాసిన లేఖలో కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్ 2023 నుంచి జూన్ 2026 వరకు చేసిన అప్పు రూ.1,77,058 కోట్లు అని పేర్కొన్నారు. కానీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) లెక్కల ప్రకారం జూన్ 30, 2026 నాటికి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మొత్తం అప్పు రూ.1,86,067 కోట్లు' అని లేఖలో మాజీ మంత్రి హరీశ్ రావు ప్రస్తావించారు. '2026 మార్చి 18న అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మీ ప్రభుత్వం చేసిన ఎఫ్ఆర్బీఎం, అన్ని రకాల అప్పు కలిపి రూ.3,47,294 కోట్లు అని స్వయంగా ప్రకటించారు' అని వీడియోతో సహా హరీశ్ రావు వివరించారు.
'మీలాగా మేము మాట మార్చడం లేదు, పూటకో తీరుగా అంకెలు మార్చి చెప్పడం లేదు. మేము చెప్పిన లెక్కలకు కట్టుబడి ఉన్నాం. నేటికి మా లెక్కల ప్రకారం, సుమారు 4.5 లక్షల కోట్ల అప్పు వివిధ మార్గాల ద్వారా మీ ప్రభుత్వం తీసుకున్న విషయం బహిరంగ రహస్యమే' అని మంత్రులకు మాజీ మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. 'బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం చేసిన అప్పుల విషయంలో నేను అసెంబ్లీలో చేసిన ప్రసంగం వీడియో, మీ ప్రభుత్వం చేసిన అప్పుల విషయంలో రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చేసిన ప్రకటన వీడియో, మీ అప్పులకు సంబంధించిన ఆర్బీఐ అధికారిక లెక్కలను మీ వాట్సాప్కు పంపిస్తున్నా. వాటిని ఒకసారి పరిశీలించి, వాస్తవాలు తెలుసుకోవాలని కోరుతున్నా' అని లేఖలో జూపల్లికి హరీశ్ రావు సూచించారు. ఇకనైనా అప్పుల విషయంలో రేవంత్ రెడ్డి, మంత్రులు తప్పుడు ప్రచారం మానుకోవాలని హితవు పలికారు.
iQOO నుంచి పవర్ఫుల్ ఫోన్.. 6500mAh బ్యాటరీతో iQOO Z11i విడుదల.. ధర ఎంతంటే?
Hyderabad, Telangana:iQOO Z11i Launch: ప్రముఖ స్మార్ట్ఫోన్ బ్రాండ్ iQOO తన సరికొత్త బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్ఫోన్ iQOO Z11i స్మార్ట్ఫోన్ను అధికారికంగా మార్కెట్లోకి లాంచ్ చేసింది.. వినియోగదారులను ఆకట్టుకునేలా అద్భుతమైన ఫీచర్లతో.. ముఖ్యంగా భారీ బ్యాటరీతో ఈ స్మార్ట్ఫోన్ చైనా మార్కెట్లో అడుగుపెట్టిన్నట్లు కంపెనీ అధికారంగా వెల్లడించింది.. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు, ధర, ఫీచర్ల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
ధరకి సంబంధించిన వివరాలు..
ఈ iQOO Z11i స్మార్ట్ఫోన్ మొత్తం మూడు స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులోకి వచ్చిన్నట్లు కంపెనీ తెలిపింది. మొదటి వేరియంట్ 6GB ర్యామ్తో పాటు 128GB స్టోరేజ్ వేరియంట్ భారత కరెన్సీలో సుమారు రూ.18,000తో అందుబాటులోకి వచ్చింది. ఇక రెండవ వేరియంట్ 8GB ర్యామ్తో పాటు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన ధర రూ.21,000తో లభించనుంది. ఇక చివరి హైఎండ్ వేరియంట్ 8GB ర్యామ్తో పాటు 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.24,000లతో అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్ ఇంక్ షాడో (Ink Shadow), కింగ్ఫెంగ్ (Qingfeng)తో పాటు డెసర్ట్ గోల్డ్ (Desert Gold) అనే మూడు ఆకర్షణీయమైన రంగుల్లో అందుబాటులోకి వచ్చింది.
డిస్ప్లే అద్భుతం..
ఈ స్మార్ట్ఫోన్లో 6.74 అంగుళాల LCD ప్యానెల్ డిస్ప్లేను అందించినట్లు కంపెనీ తెలిపింది.. ఇది HD ప్లస్ (1600 x 720 పిక్సెల్స్) రెసల్యూషన్తో అందుబాటులోకి వచ్చింది. స్మూత్ యూజర్ ఎక్స్పీరియన్స్ కోసం 120Hz రిఫ్రెష్ రేట్తో పాటు 1200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ను కలిగి ఉంటుందని కంపెనీ తెలిపింది.. ఇందులో వాటర్డ్రాప్ నాచ్ డిజైన్ను వినియోగించిన్నట్లు తెలుస్తోంది.. కంటి రక్షణ కోసం TÜV Rheinlandలో బ్లూ లైట్ సర్టిఫికేషన్, DC డిమ్మింగ్ ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.
పవర్ఫుల్ పర్ఫార్మెన్స్..
ఈ స్మార్ట్ఫోన్ శక్తివంతమైన స్నాప్డ్రాగన్ 4 జెన్ 2 (Snapdragon 4 Gen 2) చిప్సెట్ ప్రాసెసర్తో రన్ అవుతున్నట్లు కంపెనీ తెలిపింది.. ఇదిలా ఉంటే మైక్రో SD కార్డ్ ద్వారా స్టోరేజ్ను మరింత పెంచుకునే సదుపాయం కూడా అందుబాటులో ఉంది.. ఇది ఆండ్రాయిడ్ 16 ఆధారిత OriginOS 6 ఆపరేటింగ్ సిస్టమ్పై పనిచేస్తుంది.
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
ఫోటోగ్రఫీ విషయానికి వస్తే.. iQOO Z11i వెనుక భాగంలో ఆటోఫోకస్ లెన్స్తో కూడిన 13 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా ఉంది. ఇది 1080p క్వాలిటీతో వీడియో రికార్డింగ్ చేసే సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంటుంది. అలాగే సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ముందు భాగంలో 5 మెగాపిక్సెల్ కెమెరాను కూడా కలిగి ఉండడం విశేషం.. భద్రత కోసం సైడ్-మౌంటెడ్ ఫింగర్ప్రింట్ స్కానర్ను కూడా అందిస్తోంది.. అలాగే ఇది మోస్ట్ పవర్ఫుల్ 6500mAh భారీ బ్యాటరీని కూడా కలిగి ఉంటుంది.
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Karimnagar: చిన్నారులే టార్గెట్.. కరీంనగర్లో నకిలీ ఫుడ్ రాకెట్ బట్టబయలు..
Hyderabad, Telangana:Karimnagar Latest News: చిన్నారుల అమాయకత్వాన్ని, వారు ఇష్టపడే రంగురంగుల ప్యాకెట్లను ఆసరాగా చేసుకుని కొందరు కేటుగాళ్లు కల్తీ ధందాకు తెరలేపారు. ఆకర్షణీయమైన ప్యాకింగ్తో లోపల విషాన్ని నింపి మార్కెట్లోకి వదులుతున్నట్లు తేలింది.. కరీంనగర్ నగరంలోని గంజ్ ప్రాంతంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు శనివారం జరిపిన ఆకస్మిక దాడుల్లో భారీగా నకిలీ, కల్తీ ఆహార పదార్థాలు పట్టుబడటం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.
నకిలీ కుర్కురేలు..
కరీంనగర్ గంజ్ హోల్సేల్ మార్కెట్ కేంద్రంగా ఎలాంటి అనుమతులు లేకుండా.. నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న ఈ నకిలీ వ్యాపారాన్ని ఫుడ్ సేఫ్టీ అధికారులు బట్టబయలు చేశారు. ముఖ్యంగా పిల్లలు ఎంతో ఇష్టంగా తినే కుర్కురేలను హ్యాపీ బర్త్ డే అనే ఆకర్షణీయమైన బ్రాండ్ పేరుతో ప్యాక్ చేసి విక్రయిస్తున్నారు. వీటితో పాటు చిన్న ప్లాస్టిక్ ట్యూబ్లలో నింపిన రంగు రంగుల లిక్విడ్ పెప్సీ ప్యాకెట్లను అధికారులు భారీగా స్వాధీనం చేసుకున్నారు. ఆ రంగులు.. రసాయనాలు చిన్నారుల ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీసే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు.
అడ్రస్ లేదు.. తయారీ వివరాలు లేవు..
ఈ దాడికి సంబంధించిన వివరాలను ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ (FSO) అంకిత్ రెడ్డి మీడియాకు వెల్లడించారు. పట్టుబడిన ప్యాకెట్లపై ఎలాంటి కంపెనీ అడ్రస్ కానీ.. తయారీ తేదీ (Manufacturing Date), ఎక్స్పైరీ తేదీ (Expiry Date) లేదా కనీసం ఎఫ్ఎస్ఎస్ఏఐ (FSSAI) లైసెన్స్ నంబర్ వంటి ప్రాథమిక వివరాలు కూడా లేవని ఆయన తెలిపారు. ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో నాణ్యతా ప్రమాణాలు లేకుండా వీటిని తయారు చేసి.. కేవలం లాభాల కోసమే మార్కెట్లోకి సరఫరా చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
స్ట్రాంగ్ వార్నింగ్..
ఈ ఉదంతం నేపథ్యంలో మార్కెట్లో ఇలాంటి నాణ్యత లేని.. కల్తీ ఆహార పదార్థాలను విక్రయించినా లేదా నిల్వ చేసినా కఠిన చర్యలు ఉంటాయని అధికారులు హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించే తయారీదారులకు.. వ్యాపారులకు నోటీసులు జారీ చేసినట్లు FSO అంకిత్ రెడ్డి పేర్కొన్నారు. చిన్నారుల ఆరోగ్యంతో ఆడుకుంటే సహించేది లేదని.. రాబోయే రోజుల్లో దాడులను మరింత ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. చిరుతిళ్ల పేరుతో మార్కెట్లోకి వస్తున్న ఇలాంటి ప్రమాదకరమైన రసాయనాలతో కూడిన పదార్థాల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సైతం సూచిస్తున్నారు. వీధి అరుగులపై.. చిన్న చిన్న బడ్డీ కొట్టుల్లో దొరికే ఇలాంటి లోకల్ బ్రాండ్స్ వల్ల పిల్లల్లో లివర్, కిడ్నీ సమస్యలతో పాటు గ్యాస్ట్రిక్ ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది.
Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
ట్రాఫిక్ క్లియరెన్స్ కోసం హైడ్రా కూల్చివేతలు.. కన్నీరు పెడుతున్న బాధితులు!
Hyderabad, Telangana:Hydra Demolition Drive At Moti Nagar News: హైదరాబాద్లోని మోతినగర్, బోరబండ రోడ్డు ప్రధాన సిగ్నల్ ఏరియాలో హైడ్రా (HYDRA) అధికారులు శనివారం ఉదయం భారీ కూల్చివేతలు చేపట్టారు. రహదారి పక్కన ఉన్న అక్రమ నిర్మాణాలతో పాటు ఫుట్పాత్లను ఆక్రమించి ఏర్పాటు చేసిన షాపులను JCBల సహాయంతో నేలమట్టం చేశారు. మోతినగర్ చౌరస్తాలో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ ఇబ్బందులను దృష్ట్యా.. రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగానే ఈ కఠిన చర్యలు తీసుకున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. ఫుట్పాత్లు, రోడ్డు మార్జిన్లను క్లియర్ చేయడం వల్ల వాహనాల రాకపోకలు సాఫీగా సాగుతాయని.. ప్రజల ఇబ్బందులు తొలగిపోతాయని హైడ్రా వర్గాలు వెల్లడించాయి.
ముందుగా నోటీసులు ఇచ్చామన్న అధికారులు..
ఈ ఆక్రమణల తొలగింపు ప్రక్రియ ఒక్కసారిగా చేపట్టింది కాదని.. స్థానిక వ్యాపారులకు, నివాసితులకు చట్టప్రకారం ముందస్తు నోటీసులు జారీ చేశామని అధికారులు తెలిపారు. నిబంధనలను ఉల్లంఘించి రోడ్డును ఆక్రమించుకున్నందు వల్లే ఈ చర్యలు అనివార్యమయ్యాయని హైడ్రా అధికారులు పేర్కొన్నారు. ఈ కూల్చివేతలతో మోతినగర్ జంక్షన్లో ఎన్నాళ్లుగానో వేధిస్తున్న ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని స్థానిక వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.
కన్నీరుమున్నీరవుతున్న బాధితులు..
మరోవైపు అధికారుల చర్యలపై బాధితుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఎలాంటి ముందస్తు సమాచారంతో పాటు నోటీసులు ఇవ్వకుండానే రాత్రికి రాత్రే వచ్చి షాపులను కూల్చివేశారని బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెద్ద పెద్ద కోట్లలో ఉండే అక్రమ నిర్మాణాలను వదిలేసి.. రోడ్డు పక్కన చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే మా లాంటి పేదలపై కక్ష సాధిస్తున్నారని.. ఉన్నపళంగా షాపులు కూల్చేస్తే ఇప్పుడు మేము రోడ్డున పడ్డామని.. మాకు జీవనోపాధి ఎలా? అని బాధితులు ప్రశ్నిస్తున్నారు.
ఆసరా కోల్పోయిన అనాథలు..
ఈ కూల్చివేతల్లో ఎందరో పేదలు తమ ఏకైక జీవనాధారాన్ని కోల్పోయారు. భర్తను కోల్పోయి.. ఒక చిన్న షాపు పెట్టుకుని పిల్లలను పోషించుకుంటున్న ఒక మహిళ తన ఆవేదనను వ్యక్తం చేస్తూ.. కన్నీరుమున్నీరైంది. తనకున్న ఒక్కగానొక్క ఉపాధి మార్గాన్ని కూడా అధికారులు లాగేసుకున్నారని.. ఇప్పుడు బతకడం ఎలాగో అర్థం కావడం లేదన్నారు. లక్షలాది రూపాయల పెట్టుబడులు పెట్టి..అప్పులు తెచ్చుకుని నడుపుకుంటున్న దుకాణాలు నేలమట్టం కావడంతో వ్యాపారులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు.
Read more: Harish Rao: తెలంగాణ భవన్ వద్ద హైటెన్షన్.. హరీష్ రావు అరెస్ట్.. మరోసారి హీటెక్కిన తెలంగాణ రాజకీయాలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.
