ఇసుక సరఫరాను వెంటనే పునరుద్ధరించాలని భారీ ర్యాలీ
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Gustavo Petro warning by Trump: వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా బలగాలు అరెస్టు చేసిన తర్వాత లాటిన్ అమెరికా ప్రాంతం మొత్తం తీవ్ర ఉద్రిక్తతకు లోనవుతోంది. ఈ సైనిక చర్య ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర విమర్శలకు దారి తీసిన వేళ, ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక దేశాధ్యక్షుడిని బహిరంగంగా హెచ్చరించడం సంచలనంగా మారింది. ఈసారి ట్రంప్ కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రోను లక్ష్యంగా చేసుకున్నారు.
టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ ప్రచురించిన కథనం ప్రకారం, మదురో అరెస్టు అనంతరం ట్రంప్ కొలంబియా అధ్యక్షుడిని ఉద్దేశించి జాగ్రత్తగా ఉండాలి అంటూ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఇలా హెచ్చరించడం ఇది తొలిసారి కాదు. గతంలో కూడా పెట్రోపై ట్రంప్ ఇలాంటి వ్యాఖ్యలు చేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో ఈ హెచ్చరిక మరింత తీవ్రతను సంతరించుకుంది. వాషింగ్టన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ, “గుస్తావో పెట్రో కొకైన్ తయారీకి సంబంధించిన కార్యకలాపాల్లో ఉన్నాడు. కొలంబియాలో కొకైన్ తయారు చేసి అమెరికాకు అక్రమంగా రవాణా చేస్తున్నారు. అందుకే అతను తన ప్రాణాల గురించి జాగ్రత్తగా ఆలోచించాలి” అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు లాటిన్ అమెరికా దేశాల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించాయి.
న్యూయార్క్ పోస్ట్ కథనం ప్రకారం, మదురో అరెస్టును ప్రకటించిన సందర్భంలోనే ట్రంప్ మెక్సికో, క్యూబా దేశాలపై కూడా పరోక్ష హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది. వెనిజులాపై దాడి మెక్సికోను ఉద్దేశించి కాదని చెబుతూనే, మాదకద్రవ్యాల ముఠాలపై కఠిన చర్యలు అవసరమని ట్రంప్ వ్యాఖ్యానించారు. అదే సమయంలో కొలంబియా, క్యూబా నాయకులపై తీవ్ర విమర్శలు చేశారు.ట్రంప్ వ్యాఖ్యలకు లాటిన్ అమెరికా దేశాల నుంచి వెంటనే ప్రతిస్పందన వచ్చింది. మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షీన్బామ్ పార్డో ఒక అధికారిక ప్రకటన విడుదల చేస్తూ, వెనిజులాపై అమెరికా సైనిక చర్యను తీవ్రంగా ఖండించారు. ఇది సార్వభౌమ దేశంపై జరిగిన దురాక్రమణగా అభివర్ణించారు. వెనిజులా ప్రభుత్వం, ప్రజలపై అన్ని రకాల దాడులను తక్షణమే నిలిపివేయాలని అమెరికాను కోరారు.
కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో కూడా స్పందిస్తూ, అమెరికా చర్యలను లాటిన్ అమెరికా సార్వభౌమాధికారంపై నేరుగా చేసిన దాడిగా పేర్కొన్నారు. ఈ చర్యలు ప్రాంతాన్ని మానవతా సంక్షోభం వైపు నెట్టివేస్తాయని హెచ్చరించారు. వాషింగ్టన్ విధానాలు శాంతికి కాకుండా అస్థిరతకు దారి తీస్తున్నాయని ఆయన విమర్శించారు. బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డ సిల్వా కూడా అమెరికా దాడిని తీవ్రంగా ఖండించారు. ఇది అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ఇలాంటి చర్యలు హింస, గందరగోళం నిండిన ప్రపంచానికి తొలి అడుగుగా మారతాయని హెచ్చరించారు. చిలీ అధ్యక్షుడు గాబ్రియేల్ బోరిక్ శాంతియుత పరిష్కారం కోసం పిలుపునిచ్చారు. క్యూబా అధ్యక్షుడు మిగ్యుల్ డియాజ్-కెయిన్ అమెరికా చర్యలను నేరపూరిత దాడిగా అభివర్ణించారు.
ఉరుగ్వే ప్రభుత్వం కూడా ఒక ప్రకటన విడుదల చేస్తూ, ఈ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నామని, అమెరికా సైనిక జోక్యాన్ని ఎప్పటిలాగే తిరస్కరిస్తున్నామని స్పష్టం చేసింది. మొత్తం మీద, మదురో అరెస్టు తర్వాత ట్రంప్ తీసుకుంటున్న దూకుడు వైఖరి లాటిన్ అమెరికా మొత్తాన్ని ఒక కొత్త రాజకీయ సంక్షోభం వైపు నడిపిస్తున్నదన్న అభిప్రాయం బలపడుతోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
School Holiday Tomorrow: భారతదేశ వ్యాప్తంగా తీవ్రమైన చలిగాలులు, దట్టమైన పొగమంచు కారణంగా ఉత్తర భారతంలోని పలు రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థుల భద్రత దృష్ట్యా కీలక నిర్ణయం తీసుకున్నాయి. జనవరి 5, 2026 (సోమవారం) నాడు కూడా స్కూళ్లకు అధికారులు సెలవును ప్రకటించాయి. ఇంతకీ ఏయే రాష్ట్రాల్లో పాఠశాలలు మూసివేతగా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.
ఉత్తర ప్రదేశ్ వ్యాప్తంగా తీవ్రమైన చలి, వాటి తీవ్రమైన గాలుల కారణంగా రాష్ట్ర ప్రభుత్వం రేపు అనగా జనవరి 5 (సోమవారం) అన్ని స్కూళ్లకు సెలవును ప్రకటించారు. అలాగే చలితీవ్రత కారణంగా పంజాబ్ రాష్ట్రంలో స్కూళ్లకు జనవరి 7 వరకు సెలవులకు ప్రభుత్వం ఆదేశించింది.
అలాగే దేశ రాజధాని ఢిల్లీలో గాలి కాలుష్య తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో శీతాకాలపు సెలవులను జనవరి 15 వరకు రాష్ట్రప్రభుత్వం స్కూళ్లకు సెలవును ప్రకటించింది. చలిగాలుల కారణంగా హర్యానా రాష్ట్రంలో జనవరి 15 వరకు స్కూల్స్ క్లోజ్ అవ్వనున్నాయి. అలాగే రాజస్థాన్లో జనవరి 5న, అస్సాంలో తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్న క్రమంలో జనవరి 6 వరకు స్కూళ్లకు సెలవులను ప్రకటించారు.
ఉత్తర ప్రదేశ్లో కఠిన నిబంధనలు:
ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆదేశాల మేరకు, రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ (CBSE/ICSE తో సహా) పాఠశాలలు జనవరి 5 వరకు సెలవులను ప్రకటించారు. ముఖ్యంగా నోయిడా, ఘజియాబాద్ ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కారణంగా ప్రయాణాలు ప్రమాదకరంగా మారడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
దక్షిణ భారతదేశంలో పరిస్థితి..
ఉత్తర భారతం చలితో వణుకుతుంటే, దక్షిణ రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటకలలో పరిస్థితి భిన్నంగా ఉంది. ఇక్కడ శీతాకాలపు సెలవులు ఇప్పటికే ముగియడంతో, జనవరి 5వ తేదీన పాఠశాలలు యథావిధిగా పనిచేస్తాయి.
గమనిక: వాతావరణ పరిస్థితుల ఆధారంగా సెలవుల పొడిగింపుపై నిర్ణయాలు జిల్లా కలెక్టర్ల స్థాయిలో చివరి నిమిషంలో మారే అవకాశం ఉంది. కాబట్టి విద్యార్థులు, తల్లిదండ్రులు స్థానిక వార్తలు లేదా పాఠశాల యాజమాన్యం ఇచ్చే అధికారిక సమాచారాన్ని అనుసరించాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Vijay Thalapathy Net Worth: దశాబ్దాల కాలంగా కోలీవుడ్ బాక్సాఫీస్ను ఏలుతున్న విజయ్ దళపతి, ఇప్పుడు వెండితెరపై తన చివరి ప్రయాణానికి సిద్ధమయ్యారు. ఆయన నటిస్తున్న ఆఖరి చిత్రం 'జన నాయకుడు' (తమిళంలో జన నాయగన్) సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల కానుంది. ఈ క్రమంలో సినిమాలకు గుడ్ బై చెప్పి పూర్తిస్థాయి రాజకీయాల్లోకి (TVK పార్టీ) వెళ్తున్న విజయ్ సంపాదన, విలాసవంతమైన జీవితంపై నెట్టింట ఆసక్తికర చర్చ నడుస్తోంది.
రాజభవనం లాంటి ఇల్లు
చెన్నైలోని నీలాంకరై తీర ప్రాంతంలో విజయ్కు ఒక అద్భుతమైన విల్లా ఉంది. దాని విలువ దాదాపుగా రూ. 80 కోట్ల విలువ ఉంటుందని అంచనా. అమెరికన్ నటుడు టామ్ క్రూజ్ ఇంటి స్ఫూర్తితో దీనిని నిర్మించినట్లు సమాచారం. అధునాతన స్మార్ట్ హోమ్ టెక్నాలజీ, ఆటోమేటెడ్ లైటింగ్, ప్రశాంతమైన వాతావరణం ఈ ఇంటి సొంతం.
గ్యారేజీలో విలాసవంతమైన కార్లు
హీరో విజయ్కు కార్లంటే అమితమైన ఇష్టమట. ఆయన వద్ద ఉన్న కార్ల సేకరణ చూస్తే ఎవరైనా ముక్కున వేలేసుకోవాల్సిందే. రోల్స్ రాయిస్ ఘోస్ట్ కారు విలువ దాదాపుగా రూ.6 కోట్లకు పైగా ఉంటుందట. అలాగే రూ. 1 కోటి విలువైన మెర్సిడెస్-బెంజ్ GL-క్లాస్, రూ.95 లక్షలు విలువైన BMW X5 కారు విజయ్ వద్ద ఉన్నట్లు తెలుస్తోంది. వీటితో పాటు ఆడి, మినీ కూపర్ వంటి మరికొన్ని లగ్జరీ కార్లు కూడా ఆయన గ్యారేజీలో ఉన్నాయట.
సంపాదన, మొత్తం ఆస్తి
దక్షిణాదిలోనే అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే హీరోలలో విజయ్ ఒకరు. తన చివరి చిత్రాలకు ఆయన ఒక్కో సినిమాకు దాదాపు రూ.150 కోట్లు తీసుకుంటున్నారని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అనేక నివేదికల ప్రకారం.. విజయ్ నికర ఆస్తి విలువ సుమారు రూ.500 కోట్ల పైమాటే ఉంటుందని అంచనా.
సినిమాలకు గుడ్బై..రాజకీయాల్లోకి ఎంట్రీ
హీరో విజయ్ స్థాపించిన తమిళనాడు వెట్రీ కజగం (TVK) పార్టీపై తమిళనాట భారీ అంచనాలు ఉన్నాయి. సినిమాల్లో సంపాదించిన పాపులారిటీని, ఆస్తులను ఇప్పుడు ప్రజా సేవ కోసం వెచ్చించేందుకు ఆయన సిద్ధమయ్యారు. 'జన నాయకుడు' సినిమాతో చివరగా థియేటర్లలో సందడి చేసి, ఆపై పూర్తిస్థాయి రాజకీయ నాయకుడిగా ప్రజల్లోకి వెళ్లనున్నారు. ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. దీన్ని చూసిన టాలీవుడ్ ప్రేక్షకులు ఇది నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన 'భగవంత్ కేసరి' రీమేక్ అంటున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Business Ideas: బంగారం ధర భారీగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో మీరు బంగారు ఆభరణాలను ధరించాలని మోజుపడుతున్నారా అయితే ఒకప్పుడు వేలల్లో పలికిన తులం బంగారం, ఇప్పుడు లక్షల్లోకి చేరుకుంది. కనీసం ఒక చిన్న నెక్లెస్ కొనుగోలు చేయాలన్న మూడు నుంచి ఐదు లక్షల రూపాయల వరకు ఖర్చయ్య పరిస్థితి ఏర్పడింది. అంతే కాదు ఇంత ఖరీదైన డిజైన్స్ ఉన్న బంగారం నెక్లెస్ ధరించి బయటకు వెళితే సేఫ్టీ కూడా ఉండదు. దొంగల కన్ను పడిందంటే మీ నెక్లెస్ మాయం అవడం ఖాయం.
ఎందుకంటే ధరలు లక్షల్లోకి వెళ్లిపోయాయి ఈ సమయంలో దొంగలు ఎంత రిస్క్ తీసుకునేందుకు ఆయన ఏమాత్రం వెనుకాడరు. ప్రస్తుతం బంగారం ధర విపరీతంగా పెరిగిపోయిన ఈ నేపథ్యంలో అంత ఖరీదైన బంగారు నగలను ధరించి బయటకు వెళితే ప్రాణాపాయం ఉందనే మాట కూడా నిజమే అని చెప్పవచ్చు. ఇటీవల నగరంలో చైన్ స్నాచింగ్ కేసుల్లో మహిళలు తీవ్రంగా గాయపడిన సంఘటనలు చూడవచ్చు. అయితే మరి మీకు నచ్చిన ఎంపిక చేసుకున్న చక్కటి నగలను ఇక మీరు ధరించలేము అని బాధపడుతున్నారా అయితే దీన్నే మీరు ఒక చక్కటి వ్యాపార అవకాశంగా మార్చుకోవచ్చు.
వన్ గ్రామ్ గోల్డ్ దీనికి చక్కటి పరిష్కారంగా చెప్పవచ్చు. మార్కెట్లో ఇది ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ వన్ గ్రామ్ గోల్డ్ అనేది పూర్తిగా తక్కువ ధరతో లభించే ఒక ఇమిటేషన్ జ్యువెలరీ. కేవలం 100 రూపాయల నుంచి వెయ్యి రూపాయలు మధ్యలో లభిస్తాయి. ఉదాహరణకు మీరు వడ్డానం లాంటి పెద్ద నగను ధరించాలి అనుకున్నట్లయితే వన్ గ్రామ్ గోల్డ్ ధరించడం ద్వారా మీ కోరిక తీర్చుకోవచ్చు. 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ బిజినెస్ చేయడం ద్వారా ప్రస్తుతం చక్కటి ఆదాయం లభించే అవకాశం ఉంది అని చెప్పవచ్చు. ముఖ్యంగా మహిళలు 1 గ్రామ్ గోల్డ్ బిజినెస్ చేయడం ద్వారా మంచి ఆదాయం పొందవచ్చు.
మార్కెట్లో లభిస్తున్న ట్రెండీ డిజైన్స్ అలాగే గొలుసులు, నెక్లెస్లు, ట్రెండీ చెవి కమ్మలు వంటివి హోల్సేల్ మార్కెట్లో కొనుగోలు చేసి మీరు రిటైల్ గా విక్రయించినట్లయితే చక్కటి ఆదాయం పొందవచ్చు. మీరు ఈ బిజినెస్ ప్రారంభించాలి అనుకున్నట్లయితే ఒక లేడీస్ ఎంపోరియం ప్రారంభించి అందులో అన్ని వస్తువులతో పాటు ఈ వన్ గ్రామ్ జ్యువెలరీ కూడా చక్కగా ఏర్పాటు చేసుకున్నట్లయితే మంచి లాభాలను పొందవచ్చు.
మీకు హోల్సేల్ మార్కెట్లో వీటి ధర చాలా తక్కువగా లభిస్తుంది. మీరు వీటి పైన దాదాపు 50 శాతం నుంచి 60 శాతం వరకు ప్రాఫిట్ మార్జిన్ పొందే అవకాశం ఉంది. ఉదాహరణకు మీరు 100 రూపాయలకు ఒక చైన్ కొనుగోలు చేస్తే దానిని 150 రూపాయలు నుంచి 160 రూపాయల వరకు అమ్మవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
Rare Yellow Python Video Watch: నివాస ప్రాంతాల్లో తరచుగా పాముల సంచారం సాధారణ ప్రజలను ఎంతగానో భయాందోళనకు గురి చేస్తూ ఉంటుంది. గత కొన్ని ఏళ్ల నుంచి అడవుల్లో వివిధ కారణాలవల్ల వనరుల కోరత ఏర్పడడం వల్ల చాలా ప్రాణులు అడవుల నుంచి బయటికి వచ్చి జనాలు నివసించే ప్రాంతాల్లో సంచారం చేస్తున్నాయి. ఇందులో భాగంగానే పాములు కూడా జనాలు తిరిగే ప్రాంతాల్లో కనిపిస్తూ ఉన్నాయి. వీటిని పట్టుకోవడానికి కొంతమంది స్నేక్ క్యాచర్స్ క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. ఇలా పట్టుకుంటున్న సందర్భంలో వీడియోను తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. తాజాగా పాత ఇంటి పైకప్పు కింద భాగంలో సంచారం చేస్తున్న భారీ కొండచిలువను పట్టుకునే క్రమంలో చోటు చేసుకున్న ఉత్కంఠ భరితమైన ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
ఈ వీడియోకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఓ గ్రామంలో నివాస ప్రాంతంలో గత కొద్ది రోజులుగా పెంపుడు కోళ్లతో పాటు, కుక్కలు, దూడలు మాయమవడం ప్రారంభమయ్యాయి. అయితే స్థానికులు దీనిని చూసి అడవి నుంచి గ్రామంలో పెద్ద అడవి జంతువు ఏదైనా సంచారం చేస్తూ.. చంపి ఆహారంగా తింటున్నావని అనుకున్నారు. కానీ పాత రేకుల షెడ్డు పైకప్పు పై భారీ కొండచిలువ కనిపించడంతో అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు. ఆశ్చర్యపోయి స్నేక్ క్యాచర్స్ కి సమాచారం అందించారు. వెంటనే వారు రంగంలోకి దిగి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు.
అయితే, ఆ గ్రామంలో సంచారం చేసిన పాము దాదాపు 9 మీటర్ల పొడవు ఉండడం.. పసుపు రంగులో ఉండడం మీరు ఈ వీడియోలో కనిపించడం మీరు చూడొచ్చు. అంతేకాకుండా అరుదైన కొండచిలువ ఎంతో భయానకంగా కనిపిస్తోంది. ఇది మనిషి అంత లావుగా ఉండడం కూడా మీరు చూడొచ్చు. అయితే, పైకప్పుకు దగ్గరగా ఉన్న ప్రాంతంలో ఈ కొండచిలువ ఉండడంతో దానిని అక్కడి నుంచి బయటికి తీసుకువచ్చేందుకు చాలామంది శ్రమ పడటం మీరు ఈ వీడియోలో క్లియర్గా చూడొచ్చు. ఎంతో శ్రమపడి ఆ ప్రమాదకరమైన పాములు పైనుంచి కిందికి తీసుకువచ్చారు.
ఈ సమయంలో పాము తనని తాను రక్షించుకోవడానికి.. పై కప్పు కింద ఉన్న ఇనుప చట్కాలను చుట్టుకొని ఉండిపోయింది.. దీని కారణంగా వారు దానిని బయటికి తీసుకువచ్చేందుకు శ్రమ పడాల్సి వచ్చింది. అయితే, అతి కష్టం మీద దాని తోక పట్టుకొని లాగే ప్రయత్నాన్ని చేశారు. ఇలా నెమ్మదిగా ఆ పామును కిందికి తీసుకు వచ్చిన తర్వాత ఒక పెద్ద సంచిలో ఈ భారీ పామును బంధించడం మీరు చూడొచ్చు. ఇలా బంధించిన పామును సురక్షితమైన ప్రదేశానికి తీసుకువెళ్లి వదిలిపెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియోనే సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Rahu Transit 2026 Effect On Zodiac: జ్యోతిష్య శాస్త్రంలో రాహు గ్రహాన్ని చాయాగ్రహంగా పరిగణిస్తారు. అంతేకాకుండా దీనిని నీడ గ్రహంగా కూడా చెప్పుకుంటారు. అన్ని గ్రహాలతో పోలిస్తే ఈ గ్రహం ఎప్పుడు కీడు ప్రభావాన్ని అన్ని రాశుల వారిపై చూపుతూ ఉంటుంది. ఇలాంటి ప్రత్యేకమైన ప్రాముఖ్యత కలిగిన రాహువు గ్రహం జనవరి 25వ తేదీన ఏడు గంటల సమయంలో శతభిషా నక్షత్రం మూడవ స్థానంలోకి సంచారం చేయబోతోంది. ఇలా సంచారం చేయడం కొన్ని రాశుల వారికి మంచి ఫలితాలను అందిస్తే.. మరికొన్ని రాశుల వారికి కీడు ఫలితాలను అందిస్తుంది. ముఖ్యంగా రాహు శతభిషా నక్షత్రంలోని మూడవ దశలోకి ప్రవేశించడం వల్ల నాలుగు రాశుల వారికి ఎంతో మేలు జరుగుతుంది. ఈ సమయంలో ఆర్థికంగా కలిసి రావడమే కాకుండా బోలెడు ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా దీర్ఘకాలిక సమస్యలు పూర్తిగా తొలగిపోయే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే, రాహువు నక్షత్ర సంచారంతో ఏ రాశుల వారికి చాలా మేలు జరుగుతుందో తెలుసుకోండి.
ఈ రాశులవారికి జాక్పాట్!
వృషభ రాశి
వృషభ రాశిలో జన్మించిన వ్యక్తులకు రాహువు సంచారం వల్ల చాలా శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా కెరీర్ పరంగా అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి. కార్యాలయాల్లో సొంత గుర్తింపు లభించడమే కాకుండా భవిష్యత్తు ప్రణాళికలపై దృష్టి సారించే అవకాశాలు ఉన్నాయి. అలాగే డబ్బు సంపాదించడానికి వీరు వివిధ మార్గాలను కూడా ఎంచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ సమయంలో ఖర్చులు కూడా పెరగవచ్చు.
కన్యారాశి
కన్యరాశిలో జన్మించిన వ్యక్తులకు రాహు సంచార ప్రభావంతో గణనీయమైన లాభాలు రావడం ప్రారంభమవుతాయి. కెరీర్ పరంగా అద్భుతమైన పురోగతి లభించడమే కాకుండా ఉద్యోగాల్లో ఊహించని మార్పులు వస్తాయి. ఉద్యోగాలు చేస్తున్న వ్యక్తులకు పదోన్నతులు కూడా కలుగుతాయి. అంతేకాకుండా కమ్యూనికేషన్, మీడియా రంగాల్లో బలాలు చేస్తున్న వ్యక్తులకు ఈ సమయం చాలా లాభాలనందిస్తుంది.
Also Read: Chatugrahi Yoga 2026: త్వరలో 4 గ్రహాల అరుదైన కలయికతో రాజయోగం.. జాక్ పాట్ కొట్టబోతున్న రాశులు ఇవే..
తులారాశి
రాహు గ్రహం సంచారంతో తులారాశి వారికి బోలెడు లాభాలు కలిగే అవకాశాలున్నాయి. వీరికి అదృష్టం ప్రకాశించి అన్ని సానుకూలమైన ఫలితాలు కలుగుతాయి. వ్యక్తిగత జీవితం ఊహించని స్థాయిలో మెరుగుపడుతుంది. పోటీ పరీక్షల్లో బాగా రాణించగలిగి అద్భుతమైన ఫలితాలు పొందగలుగుతారు. గందరగోళం తొలగిపోయి.. అనేక రకాల సమస్యల నుంచి ఒక ఉపశమనం కలుగుతుంది.
మీన రాశి
మీన రాశిలో జన్మించిన వ్యక్తులకు కూడా ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది. సానుకూల ఆలోచనలతో ముందుకు సాగుతారు. విదేశాలకు వెళ్లాలనుకునే కోరికలు కూడా నెరవేరుతాయి. చాలా కాలంగా ఉన్న ఎన్నో రకాల పెండింగ్లో ఉన్న పనులు కూడా పూర్తవుతాయి. దీంతోపాటు ఈ సమయంలో అద్భుతమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఆర్థికంగా అద్భుతమైన లాభాలు కలుగుతాయి.
Also Read: Chatugrahi Yoga 2026: త్వరలో 4 గ్రహాల అరుదైన కలయికతో రాజయోగం.. జాక్ పాట్ కొట్టబోతున్న రాశులు ఇవే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Mana Shankara Vara Prasad Garu Trailer: మెగాస్టార్ అభిమానులు ఎన్నో రోజులుగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చేసింది. సంక్రాంతి బరిలో ఉన్న చిరు కొత్త మూవీ 'మన శంకరవరప్రసాద్' ట్రైలర్ వచ్చేసింది. ఈ థియేట్రికల్ ట్రైలర్ను మూవీ యూనిట్ తిరుపతిలో విడుదల చేసింది. డైరెక్టర్ అనిల్ రావిపూడి చిరంజీవిని సరికొత్త కోణంలో చూపిస్తూ, పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ను సిద్ధం చేశారని ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతోంది.
ట్రైలర్ హైలైట్స్:
చిరంజీవి బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ, కామెడీ టైమింగ్ అభిమానులకు 'శంకర్ దాదా' రోజులను గుర్తుచేస్తున్నాయి. ఈ సినిమాలో నయనతార హీరోయిన్గా నటిస్తుండగా, విక్టరీ వెంకటేష్ ఒక ప్రత్యేక అతిథి పాత్రలో మెరవడం సినిమాకు పెద్ద అసెట్గా మారింది.
వీరిద్దరి కాంబినేషన్ స్క్రీన్పై మ్యాజిక్ క్రియేట్ చేయబోతోందని మేకర్స్ అంటున్నారు. హిలేరియస్ ఎంటర్టైన్మెంట్తో పాటు ఎమోషన్స్ కూడా జోడించి అనిల్ ఈ సినిమాను మలిచినట్లు కనిపిస్తోంది.
ప్రమోషన్ల జాతర: పల్లె నుంచి పట్నం వరకు!
'మన శంకర వర ప్రసాద్' మూవీ ట్రైలర్ లాంచ్ సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న చిత్ర యూనిట్, ఆదివారం సాయంత్రం తిరుపతిలో భారీ ఈవెంట్ను నిర్వహించింది. ఇక రేపటి నుంచి ప్రమోషన్లు ఊపందుకోనున్నాయి. పల్లె నుంచి పట్నం వరకు ఈ సినిమా ప్రమోషన్స్ను జోరుగా నిర్వహించేందుకు చిత్రబృందం రెడీ అయ్యింది.
ఈ క్రమంలో రేపు అనగా జనవరి 5న నెల్లూరులో సెలబ్రేషన్స్తో మొదలుపెట్టి ఆ తర్వాత జనవరి 6న విశాఖపట్నం, జనవరి 7న హైదరాబాద్, జనవరి 8న తాడేపల్లిగూడెం, జనవరి 9న అనంతపూర్, జనవరి 10న వరంగల్, జనవరి 11న బెంగళూరులో ప్రచార కార్యక్రమాలను నిర్వహించనున్నారు.
విడుదల ఎప్పుడు?
మరో 9 రోజుల్లో, అంటే జనవరి 12న సంక్రాంతి కానుకగా ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. థియేటర్లలో మెగా సందడి మొదలు కావడానికి కౌంట్డౌన్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పటికే విడుదలైన పాటలు చార్ట్బస్టర్లుగా నిలవగా, ఇప్పుడు ట్రైలర్ సినిమా రేంజ్ను అమాంతం పెంచేసింది. బాక్సాఫీస్ వద్ద మెగాస్టార్ మళ్ళీ తన సత్తా చాటడానికి సిద్ధమయ్యారు. అనిల్ రావిపూడి డైరెక్షన్లో 'మన శంకరవరప్రసాద్ గారు' సంక్రాంతి విజేతగా నిలుస్తుందని చిత్రయూనిట్ చెబుతోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Venezuela President Wife Trump: ప్రపంచ రాజకీయ యవనికపై పెను సంచలనం చోటుచేసుకుంది. శనివారం అమెరికా 'ఆపరేషన్ అబ్సొల్యూట్ రిసాల్వ్' (Operation Absolute Resolve) పేరుతో అమెరికా సైన్యం వెనిజులాపై ఆకస్మిక దాడి చేసి, ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్య సిలియా ఫ్లోర్స్లను అదుపులోకి తీసుకుంది. అయితే మదురో భార్యను కూడా నిర్భంధించి తీసుకెళ్లడాన్ని ప్రపంచ దేశాలు తప్పుబడుతున్నాయి.
అసలేం జరిగింది?
శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత అమెరికా వైమానిక దళం వెనిజులా రాజధాని కారకాస్పై బాంబుల వర్షం కురిపించింది. ప్రధానంగా సైనిక స్థావరాలు, కీలక ప్రభుత్వ భవనాలే లక్ష్యంగా ఈ దాడులు జరిగాయి. దాడులు జరిగిన కొద్దిసేపటికే మదురో దంపతులను అమెరికా సైన్యం బందీలుగా పట్టుకుంది. "మదురో దంపతులను న్యూయార్క్కు తరలిస్తున్నాం" అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచారు.
అమెరికా చర్యకు వెనుక ఉన్న ప్రధాన కారణాలు
డొనాల్డ్ ట్రంప్, అమెరికా ప్రభుత్వం ఈ దాడికి ప్రధానంగా 'మాదకద్రవ్యాల అక్రమ రవాణా'ను కారణంగా చూపుతున్నాయి. అమెరికాలోకి భారీగా డ్రగ్స్ పంపిస్తున్న ముఠాలకు మదురో సూత్రధారి అని అమెరికా ఆరోపిస్తోంది.
2020లోనే మదురోపై న్యూయార్క్ కోర్టులో అభియోగాలు నమోదయ్యాయి. అతని సమాచారం కోసం గతంలోనే మిలియన్ల డాలర్ల రివార్డును కూడా ప్రకటించారు. వెనిజులాలో మదురో పాలన నియంతృత్వంగా మారిందని, దానిని అంతం చేయడమే తమ లక్ష్యమని అమెరికా వాదిస్తోంది.
ప్రపంచ దేశాల్లో కొన్ని అనుకూలంగా మాట్లాడుతుండగా. మరికొన్ని వ్యతిరేక భావాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఈ దాడి అంతర్జాతీయ దౌత్య సంబంధాలను కుదిపేస్తోందని ఆయా దేశాలు భయపడుతున్నాయి. రష్యా, చైనా, ఇరాన్, క్యూబా వంటి దేశాలు అమెరికా చర్యను తీవ్రంగా వ్యతిరేకించాయి. ఇది ఒక దేశ సార్వభౌమాధికారంపై జరిగిన దాడి అని, ఐక్యరాజ్యసమితి వెంటనే జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశాయి.
అయితే అర్జెంటీనా వంటి దేశాలు అమెరికా చర్యను సమర్థించాయి. "చివరి శ్వాస వరకు పోరాడుతాం" అని వెనిజులా రక్షణ మంత్రి వ్లాదిమిర్ పాడ్రినో ప్రకటించారు. సాంకేతికత, ఆయుధ సంపత్తి విషయంలో అమెరికాతో పోలిస్తే వెనిజులా చాలా బలహీనంగా ఉంది.
వెనిజులా సైన్యం
వెనిజులా సైన్యంలో సుమారు 1.9 లక్షల మంది క్రియాశీల సైనికులు ఉన్నప్పటికీ, అమెరికాకు సంబంధించిన అదునాతన వైమానిక, నావికా దళాల ముందు వారు నిలబడటం కష్టమని రక్షణ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
చివరిగా..ఈ పరిణామం దక్షిణ అమెరికా ఖండంలో యుద్ధ మేఘాలకు దారితీస్తుందా లేదా అనేది ఇప్పుడు ప్రపంచ దేశాల ముందున్న పెద్ద ప్రశ్నగా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Manju Warrier Bike Trip: ఆత్మవిశ్వాసం ఉంటే వయసు కేవలం ఒక అంకె మాత్రమేనని నిరూపిస్తున్నారు మలయాళీ స్టార్ హీరోయిన్ మంజు వారియర్. వ్యక్తిగత జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా, వాటన్నింటినీ దాటుకుని సెకండ్ ఇన్నింగ్స్లో దూసుకుపోతున్న ఆమె, తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక వీడియో నెట్టింట వైరల్గా మారింది.
అది బైక్ రైడింగ్ కాదు..ఒక సాహసం!
సాధారణంగా 47 ఏళ్ల వయసులో ఫిట్నెస్ను కాపాడుకోవడమే కష్టమనుకుంటారు. కానీ మంజుs వాsరిsయర్s మాsత్sరం ఏకంగా భారీ బైక్పై నిలబడి స్టంట్స్ చేస్తూ అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆమె వాడుతున్నది BMW R1250GS అడ్వెంచర్ బైక్. దీని విలువ సుమారు రూ.28 లక్షలుగా ఉంది. వేగంగా వెళ్తున్న బైక్పై సీటుపై నుంచి లేచి నిలబడి, బ్యాలెన్స్ చేస్తూ ఆమె చేసిన సాహసం చూసి కుర్ర హీరోయిన్లు సైతం షాక్ అవుతున్నారు.
ప్రేరణ కలిగించిన అజిత్ కుమార్
స్టార్ హీరోయిన్ మంజు వారియర్కు ఈ బైక్ రైడింగ్ పిచ్చి ఈ మధ్య కాలంలోనే మొదలైంది. గతంలో కోలీవుడ్ సూపర్ స్టార్ అజిత్ కుమార్ నేతృత్వంలో జరిగిన 2500 కిలోమీటర్ల లడఖ్ బైక్ ట్రిప్లో మంజు కూడా పాల్గొన్నారు. ఆ ట్రిప్ ఇచ్చిన స్ఫూర్తితోనే ఆమె సొంతంగా బైక్ నడపాలని నిర్ణయించుకుని, టూ వీలర్ లైసెన్స్ తీసుకున్నారు. లైసెన్స్ రాగానే ఖరీదైన BMW లగ్జరీ బైక్ను కొనుగోలు చేసి, షూటింగ్లకు విరామం దొరికినప్పుడల్లా రోడ్లపైకి వచ్చేస్తున్నారు.
జీవితమే ఒక పాఠం..
మంజు వారియర్ జీవిత ప్రయాణం ఎంతో మంది మహిళలకు స్ఫూర్తిదాయకంగా మారింది. భర్త కోసం స్టార్ హోదాలో ఉన్నప్పుడే సినిమాలకు దూరమయ్యారు. వివాదాలు, విడాకులు, కూతురు దూరం కావడం వంటి బాధాకరమైన సంఘటనలు ఎదురైనా కుంగిపోలేదు. మళ్ళీ ఇండస్ట్రీలోకి వచ్చి అటు సినిమాలు, ఇటు క్లాసికల్ డ్యాన్స్తో పాటు ఇప్పుడు ఇలా అడ్వెంచర్ స్పోర్ట్స్లోనూ సత్తా చాటుతున్నారు.
మంజు వాడుతున్న BMW R 1250 GS మోడల్ భారత మార్కెట్లో అత్యంత శక్తివంతమైన అడ్వెంచర్ బైక్లలో ఒకటి. దీని ఎక్స్-షోరూమ్ ధరలు రూ. 20.45 లక్షల నుండి ప్రారంభమవుతాయి. జర్మన్ టెక్నాలజీతో రూపొందిన ఈ బైక్ను నడపాలంటే ఎంతో నైపుణ్యం, ధైర్యం ఉండాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Bestune Xiaoma Mini EV Price In India: సాధారణంగా ఎలక్ట్రిక్ కారు అనగానే లక్షల ధర, తక్కువ రేంజ్ (మైలేజ్) గుర్తుకు వస్తాయి. కానీ చైనాకు చెందిన బెస్ట్ట్యూన్ (Bestune) కంపెనీ రూపొందించిన షావోమా (Xiaoma) మినీ ఎలక్ట్రిక్ కారు ఈ అంచనాలను తలకిందులు చేస్తోంది. అత్యంత తక్కువ ధరకే కళ్లు చెదిరే మైలేజీని అందిస్తూ ఆటోమొబైల్ రంగాన్ని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
1,200 కిలోమీటర్ల రేంజ్!
ఈ కారుకు చెందిన అతిపెద్ద బలం దాని మైలేజ్. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 1,200 కిలోమీటర్లు ప్రయాణించవచ్చని కంపెనీ పేర్కొంటోంది. దీనికి ప్రధాన కారణాలు చాలా ఉన్నాయి. రేంజ్ ఎక్స్టెండర్ టెక్నాలజీ ద్వారా బ్యాటరీ ఛార్జింగ్ అయిపోయినా కూడా లోపల ఉండే చిన్న ఇంజిన్ సహాయంతో కారు మరింత దూరం ప్రయాణించేలా చేస్తుంది. 800V ఆర్కిటెక్చర్తో ఇది బ్యాటరీని చాలా వేగంగా ఛార్జ్ చేయడానికి సహకరిస్తుంది. LFP బ్యాటరీ సహాయంతో భద్రత, మన్నిక కోసం లిథియం ఐరన్ ఫాస్ఫేట్ బ్యాటరీని వినియోగించారు.
ధర ఎంత? మార్కెట్లోకి ఎప్పుడంటే?
మధ్యతరగతి ప్రజలే లక్ష్యంగా వస్తున్న ఈ కారు ధర భారత్లో సుమారు రూ. 3.5 లక్షల నుండి రూ. 6 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది. ఇది 2026 ఏడాది చివరి నాటికి భారత రోడ్లపై సందడి చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
డిజైన్, ఫీచర్లు..
చూడటానికి బొమ్మ కారులా ముద్దుగా ఉండే ఈ కారు, ఫీచర్ల విషయంలో మాత్రం బాహుబలిలా ఉంటుంది. చదరపు హెడ్ల్యాంప్లు, డ్యూయల్-టోన్ రంగులు, ఏరోడైనమిక్ చక్రాలతో ఎక్స్టీరియర్ ఆకర్షణీయంగా ఉంటుంది. అలాగే ఇంటీరియర్లో డాష్బోర్డ్ మధ్యలో 7 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ప్రీమియం లుక్ ఇచ్చే డ్యూయల్-టోన్ థీమ్ ఉన్నాయి. చిన్న కారు అయినప్పటికీ డ్రైవర్ కోసం ఎయిర్ బ్యాగ్ సౌకర్యం కల్పించారు. ఈ కారు కేవలం 3 మీటర్ల పొడవు ఉండటం వల్ల నగరాల్లో పార్కింగ్ సమస్యలు ఉండవు.
భారత మార్కెట్లోకి వస్తే, ఇది ఇప్పటికే ఉన్న టాటా టియాగో EV, MG కామెట్ EV వంటి కార్లకు గట్టి పోటీని ఇస్తుంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించాలనుకునే వారికి, ముఖ్యంగా సిటీలో తిరిగే చిన్న కుటుంబాలకు ఇది ఒక అద్భుతమైన ఆప్షన్గా మారనుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook