ఇసుక సరఫరాను వెంటనే పునరుద్ధరించాలని భారీ ర్యాలీ
Bellampalle, Kannal Rural, Telangana:మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో ఇసుక కొరత వల్ల తమకు ఉపాధి కరువైందని భవన నిర్మాణ ఐక్య కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. భవన నిర్మాణాలకు ఇసుక సరఫరాను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం పట్టణంలో భారీ ఎత్తున ర్యాలీ చేపట్టారు. కాంట చౌరస్తా నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ కొనసాగింది. ఇసుక కొరత వల్ల ఉపాధి లేక కార్మికులు పస్తులు ఉంటున్నారని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
Honor నుంచి మైండ్ బ్లోయింగ్ ఫోన్.. ఏకంగా 7,700mAh బ్యాటరీ, ప్రత్యేక AI బటన్..
Hyderabad, Telangana:Honor 600 Smart 5G: ప్రముఖ చైనీస్ స్మార్ట్ఫోన్ కంపెనీ Honor స్మార్ట్ఫోన్ ప్రియులకు అద్భుతమైన శుభవార్తను చెప్పెందుకు సిద్ధమైంది. భారీ బ్యాటరీ సామర్థ్యంతో సరికొత్త 5G స్మార్ట్ఫోన్ను లాంచ్ చేసేందుకు రెడీ అయ్యింది. దీనిని కంపెనీ Honor 600 Smart 5G పేరుతో సరికొత్త మోడల్ను కంపెనీ త్వరలోనే మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకు రాబోతోంది. ఇప్పటికే ఫ్రాన్స్కు చెందిన అధికారిక హానర్ వెబ్సైట్లో ఈ ఫోన్ 'కమింగ్ సూన్' (Coming Soon) ట్యాగ్తో లిస్ట్ అవ్వడంతో దీనిపై భారీ అంచనాలు పెరిగాయి..
ఛార్జింగ్ టెన్షన్కు చెక్..
ఈ Honor 600 Smart 5G స్మార్ట్ఫోన్ అతిపెద్ద హైలైట్ దీని బ్యాటరీ సామర్థ్యం. సాధారణంగా స్మార్ట్ఫోన్లలో 5000mAh లేదా 6000mAh బ్యాటరీలను చూస్తుంటాం.. కానీ Honor ఒక అడుగు ముందుకు వేసి ఇందులో ఏకంగా 7,700mAh భారీ బ్యాటరీని అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు 45W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా లభించడం విశేషం. ఒక్కసారి ఛార్జ్ చేస్తే రోజులకు రోజులు బ్యాటరీ బ్యాకప్ ఇచ్చేలా ఈ ఫోన్ను డిజైన్ చేసిన్నట్లు తెలుస్తోంది..
ప్రత్యేక AI బటన్..
టెక్నాలజీ పరంగా చూస్తే.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టూల్స్ను వినియోగదారులు సులభంగా యాక్సెస్ చేయడానికి వీలుగా ఈ స్మార్ట్ఫోన్లో ఒక ప్రత్యేకమైన AI బటన్ను అందించిన్నట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్ఫోన్ సరికొత్త ఆండ్రాయిడ్ 16 ఆధారిత మ్యాజిక్ ఓఎస్ 10.0 (MagicOS 10.0) ఆపరేటింగ్ సిస్టమ్పై రన్ అవుతుంది.. అంతేకాకుండా, ఇందులో శక్తివంతమైన స్నాప్డ్రాగన్ 4 జెన్ 4 (Snapdragon 4 Gen 4) ప్రాసెసర్ను వినియోగించిన్నట్లు సమాచారం..
డిస్ప్లే, కెమెరా..
Honor 600 Smart 5G మొబైల్కి సంబంధించని ఫీచర్స్ వివరాల్లోకి వెళితే.. ఈ ఫోన్ 1,020 నిట్స్ పీక్ బ్రైట్నెస్తో 6.87 ఇంచుల HD+ (1592 × 720 పిక్సెల్స్) LCD డిస్ప్లేను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా వెనక భాగంలో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను అందుబాటులోకి తీసుకు వచ్చారు. ఇందులో అద్భుతమైన సౌండ్ ఎక్స్పీరియన్స్ కోసం డ్యూయల్ స్టీరియో స్పీకర్లను అందించారు.
ఈ స్మార్ట్ఫోన్ ప్రస్తుతం వెబ్సైట్లో వైట్తో పాటు బ్లాక్ కలర్ ఆప్షన్లలో అందుబాటులోకి వచ్చింది. బడ్జెట్ ధరలోనే అదిరిపోయే ఫీచర్లు, భారీ బ్యాటరీ బ్యాకప్తో రాబోతున్న ఈ హానర్ 600 స్మార్ట్ 5G ఫోన్ మార్కెట్లో వన్ ప్లస్, శామ్సంగ్, వివో వంటి బ్రాండ్లకు గట్టి పోటీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. త్వరలోనే దీని ధరతో పాటు లాంచ్ తేదీల అధికారిక వివరాలు వెల్లడించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Allu Arjun Stampede Case: తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్కు నాంపల్లి కోర్టు నోటీసులు..కోర్టులో హాజరు కావాల్సిందేనంటూ ఆదేశం!
Hyderabad, Telangana:Allu Arjun Stampede Case News: హైదరాబాదులోని సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించిన ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. రాబోయే సోమవారం నాడు కోర్టు ముందు వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని న్యాయస్థానం ఆయనను ఆదేశించింది.
ఈ ఘోర ప్రమాదానికి సంబంధించి చిక్కడపల్లి పోలీసులు ఇప్పటికే 23 మందిని నిందితులుగా చేర్చుతూ కోర్టులో ఛార్జ్షీటు దాఖలు చేశారు. వీరిలో 19 మంది నిందితులకు నాంపల్లి కోర్టు తాజాగా సమన్లు జారీ చేసింది.
ఈ కేసులో ప్రధాన నిందితులుగా సంధ్య థియేటర్కు చెందిన యాజమాన్యం, సిబ్బందిని A1 నుంచి A10 వరకు ఛార్జ్షీట్లో చేర్చారు. అలాగే ఏ 11 నిందితుడిగా నటుడు అల్లు అర్జున్ పేరును పోలీసులు ఈ కేసులో చేర్చారు.
ఏం జరిగిందంటే?
2024 డిసెంబర్ 4 తేదీన ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్ వద్ద 'పుష్ప 2' సినిమా బెనిఫిట్ షో ప్రదర్శించనున్నారు. ఈ సందర్భంగా నటుడు అల్లు అర్జున్ అక్కడికి రావడంతో భారీగా అభిమానులు తరలివచ్చారు. ఆ సమయంలో తీవ్రమైన తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ దురదృష్టకర తొక్కిసలాటలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోగా.. ఆమె కుమారుడు శ్రీ తేజ తీవ్రంగా గాయపడ్డాడు.
తాజాగా ఈ కేసులో నాంపల్లి కోర్టు నుంచి నోటీసులు అందుకున్న నిందితులంతా సోమవారం నాడు కోర్టుకు వ్యక్తిగతంగా హాజరు కావాల్సి ఉంటుంది. నిందితుల హాజరు నమోదు ప్రక్రియ పూర్తయిన తర్వాత.. నాంపల్లి కోర్టు ఈ కేసు పై అధికారికంగా ట్రయల్ విచారణ ప్రారంభించనుంది.
Also Read: హీరోయిన్గా బుల్లితెర మెగాస్టార్ కూతురు..హీరోయిన్లనే తలదన్నే అందం దివిజ!
Also Read: ఆర్ఆర్ఆర్లో నటించిన చిన్నారి మల్లి ఇప్పుడెలా ఉందో తెలుసా? ఇంత అందంగా ఉందేంట్రా బాబూ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Oppo Reno 16c 5G: అరాచకమైన ఫీచర్స్.. 6,500mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Oppo కొత్త ఫోన్!
Hyderabad, Telangana:Oppo Reno 16c 5g Launching Soon: ప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీ కంపెనీ ఒప్పో భారత మార్కెట్లోకి మరో అద్బుతమైన స్మార్ట్ఫోన్ను విడుదల చేసేందుకు సిద్ధమైంది. దీనిని కంపెనీ అంతర్జాతీయంగా ఎంతో పేరు పొందించిన Reno సిరీస్లో మార్కెట్లోకి లాంచ్ కాబోతోంది. దీనిని కంపెనీ Oppo Reno 16c 5G మోడల్లో భారత్లో అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు కంపెనీ సిద్ధమైన్నట్లు తెలుస్తోంది. ఇది ఎంతో శక్తివంతమైన ఫీచర్స్తో పాటు అద్భుతమైన బ్యాటరీతో, అత్యంత చీప్ ధరలో లాంచ్ కాబోతున్నట్లు తెలుస్తోంది.
లీకైన ధర, వేరియంట్లు..
ప్రముఖ టిప్స్టర్ అందించిన సమాచారం ప్రకారం.. ఈ Oppo Reno 16c 5G స్మార్ట్ఫోన్ భారత మార్కెట్లోకి మొత్తం రెండు వేరియంట్స్తో అందుబాటులోకి రాబోతోంది. దీని బేస్ వేరియంట్ 256GB ఇంటర్నల్ స్టోరేజ్తో రూ. 34,999 ధరతో విడుదల కాబోతోంది. ఇక రెండవ వేరియంట్ 12GB ర్యామ్తో పాటు 256GB స్టోరేజ్ ధర రూ. 37,999తో లాంచ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. దీనిని కంపెనీ ఎంతో అద్బుతమైన ఇది పాప్ వైట్, ట్విలైట్ వయొలెట్ వంటి కలర్ ఆప్షన్స్లో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.
డిస్ప్లే, పవర్ఫుల్ ప్రాసెసర్..
Oppo Reno 16c 5G స్మార్ట్ఫోన్ 6.57-ఇంచుల ఫుల్ హెచ్డీ+ (Full HD+) అమోలెడ్ (AMOLED) డిస్ప్లేతో విడుదల కాబోతోంది. అంతేకాకుండా ఇది 120Hz రీఫ్రెష్ రేట్ను సపోర్ట్ను కలిగి ఉంటుంది. కాబట్టి దీనివల్ల స్క్రోలింగ్తో పాటు గేమింగ్ ఎక్స్పీరియన్స్ అత్యంత స్మూత్గా ఉంటుందని టెక్ నిపుణులు తెలుపుతున్నారు. ఇక ఈ స్మార్ట్ఫోన్కి సంబంధించిన పర్ఫార్మెన్స్ వివరాల్లోకి వెళితే.. ఇందులో 4 నానోమీటర్ల టెక్నాలజీతో తయారు చేసిన పవర్ఫుల్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 (MediaTek Dimensity 7300) ఆక్టా-కోర్ ప్రాసెసర్ను కలిగి ఉంటుందని లీక్ అయిన వివరాలు చెబుతున్నాయి. ఇది LPDDR5X ర్యామ్తో పాటు UFS 3.1 స్టోరేజ్ సపోర్ట్తో వస్తుండటం వల్ల మల్టీటాస్కింగ్ ఎంతో సులభంగా చేసుకోవచ్చు.
అద్భుతమైన ట్రిపుల్ కెమెరా సెటప్..
ఈ స్మార్ట్ఫోన్లో కంపెనీ అద్భుతమైన కెమెరా సెటప్ను అందించిన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా దీని వెనక భాగంలో ఎంతో ప్రత్యేకమైన ట్రిపుల్ కెమెరా సెటప్ను కలిగి ఉంటుంది. అందులో అద్భుతమైన ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్ట్తో కూడిన 50 మెగాపిక్సెల్ కలిగిన ప్రైమరీ కెమెరాను కలిగి ఉంటుంది. అంతేకాకుండా అదనంగా 3.5x ఆప్టికల్ జూమ్ సామర్థ్యం గల 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ కెమెరాను కూడా ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్ కెమెరా కూడా ఉంటుంది. దీంతో పాటు ఫ్రంట్ భాగంలో వీడియో కాలింగ్ కోసం పవర్ఫుల్ 50 మెగాపిక్సెల్ కెమెరాను అందించిన్నట్లు తెలుస్తోంది.
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
మెగా బ్యాటరీ, సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్..
ఈ స్మార్ట్ఫోన్ అత్యంత అద్భుతమైన భారీ 6,500mAh బ్యాటరీ సామర్థ్యంతో లాంచ్ కాబోతోంది.. దీనిని వేగంగా ఛార్జ్ చేసేందుకు కంపెనీ 45W సూపర్ ఊక్ (SuperVOOC) ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని అందించిన్నట్లు లీక్ అయిన వివరాలు చెబుతున్నాయి. అలాగే ఈ స్మార్ట్ఫోన్ సరికొత్త IP69 రేటింగ్తో అందుబాటులోకి వస్తోంది. దీని వల్ల దుమ్ముతో పాటు వాటర్ నుంచి ఫోన్కు పూర్తి రక్షణ లభించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. కనెక్టివిటీ పరంగా ఇందులో 5G నెట్వర్క్, ఎన్ఎఫ్సీ (NFC), స్టీరియో స్పీకర్ల సపోర్ట్ కూడా లభిస్తోంది..
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
FiFa World Cup 2026: ఫిఫా వరల్డ్ కప్లో Mexico సరికొత్త చరిత్ర.. రౌండ్ ఆఫ్ 32కు చేరిన తొలి జట్టుగా రికార్డ్..!!
Secunderabad, Telangana:Mexico vs South Korea 1-0 Match Highlights: ఆతిథ్య దేశమైన మెక్సికో.. శుక్రవారం దక్షిణ కొరియాపై 1-0 తేడాతో విజయం సాధించి 2026 ఫీఫా ప్రపంచ కప్ రౌండ్ ఆఫ్ 32లో తన స్థానాన్ని పదిలం చేసుకుంది. లూయిస్ రోమో చేసిన గోల్ తో మెక్సికో తన విజయాన్ని ఖాయం చేసింది. దీంతో ప్రపంచ కప్లో తమ మొదటి 2 మ్యాచ్లలో క్లీన్ షీట్ సాధించి.. విజయం సాధించిన 1998లో ఫ్రాన్స్ తర్వాత మొదటి ఆతిథ్య దేశంగా మెక్సికో రికార్డు క్రియేట్ చేసింది. క్లీన్ షీట్ అంటే.. మెక్సికోతో జరిగిన 2 మ్యాచ్లలోనూ ప్రత్యర్థులు ఒక్క గోల్ కూడా చేయకపోవడమని అర్థం.
గోల్ లేకుండా ముగిసిన ఫాస్టాఫ్ తర్వాత.. మెక్సికో స్కోరింగ్ను ప్రారంభించింది. 50వ నిమిషంలో లూయిస్ రోమో గోల్ చేశాడు... హెడర్తో బంతిని అడ్డుకోవడానికి కొరియా గోల్ కీపర్ చేసిన ప్రయత్నం విఫలమవడంతో మెక్సికో ఆ గోల్ను సాధించింది. ఆ తర్వాత స్కోరును సమం చేయడానికి కొరియా తీవ్రంగా ప్రయత్నించినా.. ఫలితం లేకుండా పోయింది. దీంతో సౌతాఫ్రికాతో జరిగిన మొదటి మ్యాచ్లో మెక్సికో విజయం సాధించింది.
ప్రపంచ కప్ చరిత్రలో తొలిసారిగా.. మెక్సికో తమ మొదటి రెండు గ్రూప్ దశ మ్యాచ్లను ఒక్క గోల్ కూడా ఇవ్వకుండా గెలుచుకుంది. గతంలో వారు 2002 (1-0 క్రొయేషియా, 2-1 ఈక్వెడార్), 2018 (1-0 జర్మనీ, 2-1 దక్షిణ కొరియా)లలో తమ ప్రారంభ మ్యాచ్లను గెలుచుకున్నారు. కానీ ఆ రెండు టోర్నమెంట్లలోనూ వారు తమ రెండవ మ్యాచ్లో గోల్ ఇచ్చారు.
లూయిస్ రోమో తన సొంత గడ్డపై మెక్సికో తరఫున గోల్ చేశాడు. ప్రపంచ కప్ టోర్నమెంట్లో తన క్లబ్ అయిన సిడి గ్వాడలజారా సొంత మైదానంలో తన జాతీయ జట్టు తరఫున గోల్ చేసిన ఆటగాడికి అత్యంత ఇటీవలి ఉదాహరణగా చెబుకుంటే.. జోహన్నెస్బర్గ్లోని సాకర్ సిటీలో జరిగిన 2010 ప్రపంచ కప్ ప్రారంభ మ్యాచ్లో సిఫివే త్షబలాల (కైజర్ చీఫ్స్). ఈ ఘనతను 1970 ప్రపంచ కప్లో ఎస్టాడియో అజ్టెకాలో మెక్సికో తరఫున జేవియర్ ఫ్రాగోసో (క్లబ్ అమెరికా) సాధించాడు.
గ్రూప్ Aలో అగ్రస్థానంలో నిలిచిన మెక్సికో, జూన్ 30న మెక్సికో సిటీలో జరిగే రౌండ్ ఆఫ్ 32లో గ్రూప్ C, E, F, H లేదా E నుండి మూడవ స్థానంలో నిలిచిన జట్టుతో తలపడుతుంది. 1994 నుండి బ్రెజిల్ (8)ను అధిగమించి, మెక్సికో (9) అత్యధిక సార్లు ప్రపంచ కప్ గ్రూప్ దశకు అర్హత సాధించింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Telangana ప్రజలకు అలర్ట్.. ఆ 3 రోజులు రిజిస్ట్రేషన్లు బంద్, ఎందుకో తెలుసా?
Hyderabad, Telangana:Telangana Registration Department Updates News: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా భూములకు సంబంధించిన క్రయ విక్రయాలు జరిపే వారికి, రిజిస్ట్రేషన్ల కోసం ఎదురుచూస్తున్న ప్రజలకు ఒక ముఖ్యమైన గమనిక. ఈ నెల 26వ తేదీ నుంచి 28వ తేదీ వరకు మూడు రోజుల పాటు రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ సేవలకు తాత్కాలికంగా బ్రేక్ పడబోతోంది.. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖకు సంబంధించిన అధికారిక వెబ్సైట్తో పాటు దాని అనుబంధ ఆన్లైన్ సేవలు ఈ సమయంలో పనిచేయవని ఆ శాఖ ఐజీ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారికంగా వెల్లడించారు.. షెడ్యూల్ చేసిన సర్వర్ మెయింటెనెన్స్ పనుల కారణంగానే ఈ తాత్కాలిక అంతరాయం ఏర్పడుతోందని ఆయన స్పష్టం చేశారు.
ఐదేళ్ల తర్వాత అప్గ్రేడ్..
గడిచిన ఐదేళ్ల కాలంలో సర్వర్ల నిర్వహణ పనులు ఈ స్థాయిలో చేపట్టడం ఇదే తొలిసారి. సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత పెంచడమే కాకుండా అన్ని రకాల సెక్యూరీలను దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తులో ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ఈ తాత్కాలికంగా బ్రేక్ అని ఐజీ తెలిపారు. అప్డేట్ చేసిన తర్వాత సర్వర్ వ్యవస్థ ఎటువంటి సాంకేతిక లోపాలు లేకుండా మరింత వేగంగా పనిచేస్తాయని తెలిపారు. ఆన్లైన్ డేటాతో పాటు భద్రతా ప్రమాణాలు (Security Standards) మరింత పటిష్టం కాబోతున్నాయని వెల్లడించారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో నాణ్యత పెరిగి.. ప్రజలకు సులభతరమైన అనుభూతి లభిస్తుందని తెలిపారు..
స్మార్ట్ ప్లానింగ్..
ఈ మూడు రోజుల విరామం వల్ల సాధారణ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ముందస్తుగా వ్యూహాత్మక ప్లాన్ వేసిన్నట్లు తెలుస్తోంది.. జూన్ 26వ తేదిన మొహర్రం పండుగ సందర్భంగా ప్రభుత్వ సెలవు దినం ఉండమే కాకుండా.. జూన్ 28 ఆదివారం సాధారణ వీక్లీ ఆఫ్, జూన్ 27 కేవలం ఈ ఒక్క రోజు మాత్రమే ప్రభుత్వ ఆఫీసులు మళ్లీ తిరిగి ప్రారంభమవుతాయి. కాబట్టి ఈ ఒక్కరోజు మాత్రమే ఈ భూ రిజిస్ట్రేషన్లు బంద్ ఉంటాయి.. ఈ విధంగా ప్లాన్ చేయడం వల్ల పని దినాల్లో కేవలం ఒక్క రోజు మాత్రమే రిజిస్ట్రేషన్ సేవలు నిలిచిపోతాయని, తద్వారా ప్రజలపై పడే ప్రభావం ఒకటే రోజు ఉంటుందని ఐజీ వివరించారు.
Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!
29 నుంచి సేవలు యథావిధి..
ఈ అంతరాయాన్ని దృష్టిలో ఉంచుకుని.. ప్రజలు తమ భూ క్రయ విక్రయాలతో పాటు రిజిస్ట్రేషన్ సంబంధిత పనులను ముందస్తుగానే ప్లాన్ చేసుకోవాలని అధికారులు సూచించారు. ఈ నెల 29వ తేదీ సోమవారం నుంచి అన్ని సేవలు ఎప్పటిలాగే పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తాయని ఐజీ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. అధికారులు చేపట్టే ఈ సాంకేతిక అభివృద్ధి పనులకు ప్రజలందరూ సహకరించాలని ఆయన కోరారు.
Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
Venus Transit 2026: జూలై 29న సూర్యుడి నక్షత్రంలోకి శుక్రుడి ప్రవేశం.. ఈ 4 రాశుల వారికి ఇక తిరుగుండదు, అదృష్టమే అదృష్టం!
Hyderabad, Telangana:Venus Transit In Uttara Phalguni Nakshatra 2026 Telugu News: వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం.. కొన్ని గ్రహాలకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. అంతేకాకుండా కొన్నింటిని శక్తివంతమైన గ్రహాలుగా కూడా పరిగణిస్తారు. అలాగే ధనానికి సూచికగా కూడా కొన్ని గ్రహాలు ఉంటాయి. అయితే, ఈ గ్రహాల ప్రభావంతో అన్ని రాశులవారి జీవితాల్లో కీలక మార్పులు వస్తూ ఉంటాయి. ఇదిలా ఉంటే.. జూలై 29న ఆనందం, శ్రేయస్సు, ప్రేమ, కళ, ఆకర్షణలకు సూచికగా భావించే శుక్రుడు ఉదయం 4 గంటల సమయంలో ఉత్తర ఫల్గుణి నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. అయితే, ఇది సూర్యుడి నక్షత్రంగా భావిస్తారు. ఈ సమయంలో సూర్యుడి నక్షత్రంలోకి శుక్రుడు ప్రవేశించడం కారణంగా ఈ కింది రాశులవారి జీవితాల్లో ఊహించని మార్పులు రాబోతున్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా కొన్ని రాశులవారు ఈ సమయంలో ఆర్థిక లాభాలు, వృత్తిలో విజయం, సామాజిక హోదా పెరగడమే కాకుండా ఊహించని ధన లాభాలు కలుగబోతున్నాయి. అనుకున్న పనుల్లో ఊహించని విజయాలు సొంతం చేసుకుంటారు. దీర్ఘకాలిక సమస్యలు కూడా దూరం కాబోతున్నాయి. అయితే ఈ సమయంలో శుక్రుడి సంచారంతో ఏయే రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
శుక్రుడి ప్రభావంతో ఈ రాశులవారికి బంపర్ జాక్పాట్:
తులారాశి
శుక్రుడి శక్తివంతమైన ప్రభావంతో తులా రాశివారికి ఈ సమయంలో చాలా శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా జీవిత భాగస్వామి పూర్తి సపోర్ట్తో క్లిష్టతరమైన పరిస్థితుల నుంచి ఎంతో సులభంగా బయటపడే ఛాన్స్లు కూడా ఉన్నాయి. అలాగే ఆర్థిక పరిస్థితులు కూడా సులభంగా మెరుగుపడతాయి. దీంతో పాటు నిలిచిపోయిన పనులు కూడా సులభంగా ఊపందుకుంటాయి. ముఖ్యంగా ఉద్యోగాలు చేసేవారికి అద్భుతమైన పదోన్నతులు లభించి.. సమయంలో గౌరవం కూడా సులభంగా పొందుతారు.
మేష రాశి
శుక్రుడి సంచారం ప్రభావంతో మేష రాశివారికి వ్యాపారాల, వృత్తిపరంగా అద్భుతమైన లాభాలు కలుగుతాయి. అంతకాకుండా జీవితంలో వీరు తప్పకుండా సానుకూలమైన ఫలితాలు కూడా పొందుతారు. ఈ సమయంలో వివేకం పెరగడంతో పాటు అద్భుతమైన నిర్ణయాలు కూడా తీసుకుంటారు. ముఖ్యంగా భవిష్యత్తులో ఆర్థిక లాభాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు ముఖ్యమైన పనుల్లో అద్భుతమైన విజయాలు కూడా సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా కుటుంబ సభ్యుల సపోర్ట్తో సంబంధాలు కూడా మెరుగుపడతాయి. అలాగే వీరికి ఈ సమయంలో అవగాహన కూడా పెరుగుతుంది.
మిథున రాశి
సూర్యుడి నక్షత్రంలోకి శుక్రుడి ప్రవేశించడం వల్ల మిథున రాశివారికి ఈ సమయంలో అద్భుతమైన ధన లాభాలు కలుగుతాయి. అలాగే వ్యక్తుత్వ వికాశం కూడా రెట్టింపు అవుతుంది. దీని కారణంగా ఆత్మవిశ్వాసం కూడా గతంలో కంటే ఇప్పుడు మరింత పెరుగుతుంది. అంతేకాకుండా భూములు కొనుగోలు చేయాలనుకునేవారికి ఈ సమయం ఎంతో అద్భుతంగా ఉంటుంది. వీరు తప్పకుండా ఈ సమయంలో మంచి మంచి శుభవార్తలు కూడా వింటారు. వీరికి ఈ సమయంలో తప్పకుండా మానసిక ఒత్తిడి నుంచి కూడా ఉపశమనం కలుగుతుంది. అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కూడా కలుగుతుంది.
సింహరాశి
సింహ రాశివారికి ఈ సమయంలో తప్పకుండా మతపరమైన కార్యకలాపాలపై ఆసక్తి విపరీతంగా పెరుగుతుంది. వీరికి తప్పకుండా జీవితంలో సానుకూలమైన లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా జీవితంలో ముందుకు సాగుతారు. అలాగే ఆర్థిక పరిస్థితులు కూడా చాలా వరకు మెరుగుపడతాయి. సంబంధాలు కూడా విపరీతంగా మెరుగుపడతాయి. ఆరోగ్యం కూడా చాలా వరకు మెరుగుపడుతుంది. దీర్ఘకాలిక సమస్యలు కూడా దూరమవుతాయి. ప్రేమ సంబంధాలు కూడా ఊహించని స్థాయిలో మెరుగుపడతాయి.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
గమనిక.. 
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..
IPL 2027 Schedule: ఐపీఎల్ అభిమానులకు గుడ్న్యూస్..94 మ్యాచ్లతో మెగా టోర్నీ..ఆర్సీబీకి పండగే!
Mumbai, Maharashtra:IPL 2027 94 Matches: ప్రపంచంలోనే అత్యంత ఆదరణ పొందిన క్రికెట్ లీగ్ 'ఇండియన్ ప్రీమియర్ లీగ్' (ఐపీఎల్) రాబోయే 2027 సీజన్ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఒక భారీ మెగా ప్లాన్ను సిద్ధం చేసినట్లు సమాచారం. ఇప్పటివరకు 74 మ్యాచ్లతో సాగుతున్న ఈ టోర్నీని, మరింత గ్రాండ్గా మార్చడానికి మ్యాచ్ల సంఖ్యతో పాటు షెడ్యూల్లోనూ కీలక మార్పులు చేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
వచ్చే ఐపీఎల్ సీజన్లో క్రికెట్ ప్రేమికులకు డబుల్ వినోదం అందనుందని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుత ఫార్మాట్ ప్రకారం జరుగుతున్న 74 మ్యాచ్ల సంఖ్యను ఏకంగా 94కు పెంచాలని బీసీసీఐ భావిస్తున్నట్లు క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి. మ్యాచ్ల సంఖ్య భారీగా పెరుగుతుండటంతో, షెడ్యూల్లో ఒకే రోజు రెండు మ్యాచ్లు జరిగే రోజుల సంఖ్య కూడా గణనీయంగా పెరగనుంది.
వేసవి తాపానికి బ్రేక్..
సాధారణంగా ఐపీఎల్ మ్యాచ్లు మార్చి చివరి వారంలో ప్రారంభమై మే ఆఖరు వరకు జరుగుతాయి. అయితే ఏప్రిల్, మే నెలల్లో ఉండే తీవ్రమైన ఎండల కారణంగా దేశీ, విదేశీ ఆటగాళ్లు శారీరకంగా తీవ్రంగా అలసిపోతున్నారు. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు 2027 సీజన్ను కాస్త ముందుగానే ప్రారంభించాలని బీసీసీఐ కొత్త ప్రతిపాదనను సిద్ధం చేసింది.
ప్రతిపాదించిన షెడ్యూల్ ప్రకారం.. 2027లో రాబోయే 20వ ఐపీఎల్ సీజన్ను మార్చి 10, 2027 నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. అలాగే 94 మ్యాచ్లతో కూడిన ఈ టోర్నీని మే 15న ముగించేందుకు ప్రణాళిక చేస్తున్నారని సమాచారం. ఇలా షెడ్యూల్ను ముందుకు జరపడం వల్ల మే నెలలోని పీక్ ఎండల నుండి ఆటగాళ్లకు ఉపశమనం లభించడమే కాకుండా, ఆ తర్వాత జరిగే ఐసీసీ టోర్నమెంట్లకు సిద్ధమవడానికి తగినంత సమయం దొరుకుతుంది.
ఆర్సీబీ హ్యాట్రిక్ సాధిస్తుందా?
2025లో ఛాంపియన్గా నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఈ ఏడాది కూడా అదే ఫామ్ను కొనసాగించి 'బ్యాక్-టు-బ్యాక్' ట్రోఫీలను ముద్దాడింది. ఈ నేపథ్యంలో, రాబోయే చారిత్రాత్మక 20వ సీజన్లో ఆర్సీబీ 'హ్యాట్రిక్' కొడుతుందా.. లేక ముంబై, చెన్నై, కోల్కతా వంటి మాజీ ఛాంపియన్లు పునరాగమనం చేస్తాయా అన్నది అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది.
మ్యాచ్ల సంఖ్య 94కు పెంచడం వల్ల ఆటగాళ్లపై పనిభారం పెరిగే అవకాశం ఉంది. దీన్ని బీసీసీఐ ఎలా బ్యాలెన్స్ చేస్తుందనేది చూడాలి. మరోవైపు వచ్చే సీజన్కు ముందు జరగబోయేది మెగా వేలమా లేక మినీ వేలమా అనే ఉత్కంఠ కూడా నెలకొంది. వీటన్నింటిపై రాబోయే కొన్ని నెలల్లో బీసీసీఐ నుండి అధికారిక ప్రకటనలు వెలువడే అవకాశం ఉంది.
Also Read: హృదయాలను గెలిచిన జపాన్ ఫ్యాన్స్..మ్యాచ్ తర్వాత చెత్తను శుభ్రం చేసిన అభిమానులు!
Also Read: పాకిస్థాన్ బౌలర్ మెడ పట్టుకున్న టీమ్ఇండియా బ్యాటర్..సోషల్ మీడియాలో వైరల్ వీడియో!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
YS Jagan: సాయికృష్ణ కేసులో సీబీఐ దర్యాప్తు చేయాలి.. దోషులను శిక్షించాలి: వైఎస్ జగన్
Vijayawada, Andhra Pradesh:YS Jagan With Saikrishna: విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో లాకప్డెత్కు గురయ్యాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న గాదె సాయికృష్ణ తల్లిని, అతడి కుటుంబ సభ్యులను వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరామర్శించారు. కృష్ణలంకలో ఉంటున్న వారి ఇంటికి వెళ్లి మాట్లాడిన ఓదార్చారు. అనంతరం అక్కడే మీడియాతో మాట్లాడారు. 'మే నెలలోనే ఇలాంటి ఘటనలు రెండు జరిగాయి. కృష్ణలంక సీఐ వేధిస్తున్నాడని క్రాంతికుమార్ ఆత్మహత్య. మే 9వ తేదీన సాయికృష్ణను తీసుకెళ్లిన పోలీసులు. కొడుకు కోసం పోలీస్స్టేషన్ చుట్టూ తిరిగిన తల్లి. కొడుకు ఫొటోకు దండ వేసుకోమన్న సీఐ. వారిచ్చిన ఫిర్యాదును చెత్తబుట్టలో వేసిన పోలీసులు' అని తీవ్ర ఆరోపణలు చేశారు.
అందుకే కృష్ణలంక సీఐ సస్పెండ్
'సాయికృష్ణను చంపేసిన తర్వాత పోలీసులే దహనం చేసి ఆ తర్వాత సాయికృష్ణ తల్లితో బేరసారాలు. హైకోర్టును సాయికృష్ణ తల్లి ఆశ్రయించి హెబియస్ కార్పస్ పిటిషన్ వేయడంతోనే పోలీసుల్లో భయం' అని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తెలిపారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. చివరకు సాయికృష్ణను చంపారని ఒప్పుకున్నారని.. అందుకే కృష్ణలంక సీఐని సస్పెండ్ చేశారని పేర్కొన్నారు. ఇద్దరి చావుకు కృష్ణలంక సీఐ కారణం అని.. అయినా కేసు పెట్టకుండా కేవలం సస్పెన్షన్ చేశారని ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసులో సీఐనే బాధ్యుడిని చేయడం సరికాదని.. నేరంలో విజయవాడ సీపీ, డీజీపీకి భాగం ఉందని ప్రకటించారు. అందరిపైనా మర్డర్ కేసు పెట్టి శిక్షించాలని మాజీ సీఎం వైఎస్ జగన్ డిమాండ్ చేశారు.
దగ్గరుండి ప్రోత్సాహం
'విజయవాడ నడిబొడ్డున అంటే రాష్ట్రానికి రాజధాని ప్రాంతం. ఇక్కడి నుంచి కూతవేటు దూరంలోనే ముఖ్యమంత్రి నివాసం. ఆ పక్కనే ఉన్న ఈ తల్లి ఎంత దారుణంగా ఈ ఘటన జరిగిందో చెబుతూ రోదిస్తున్నది. చంద్రబాబు దగ్గరుండి ప్రోత్సహిస్తున్న కొంతమంది పోలీసులు, వీరు చేసే పనులతో రాష్ట్రంలో ఏదైనా అన్యాయం జరిగితే పోలీసు స్టేషన్కు పోవడానికి కూడా భయపడే పరిస్ధితి నెలకొంది' అని మాజీ సీఎం వైఎస్ జగన్ ఆందోళన వ్యక్తం చేశారు.
'మే నెలలో సాయికృష్ణది ఓ ఘటన అయితే క్రాంతికుమార్ అనే వ్యక్తిది ఇంకో ఘటన. అది ఆత్మహత్య ఘటన. పలానా సీఐ, పలానా పోలీసు స్టేషన్ పరిధి. రోజూ నన్ను కొడుతున్నాడు, నేను తట్టుకోలేకపోతున్నా. నా చావుకు కారణం ఆ సీఐ అని మరణ వాంగ్మూలం ఇస్తూ తాను ఆత్మహత్య చేసుకున్న పరిస్ధితి. మే 9న సాయికృష్ణ ఘటన కూడా జరిగింది' అని వైఎస్సార్సీపీ అధినేత వైఎస జగన్ వివరించారు.
నీ కొడుకు ఫొటోకు దండ వేసుకో
'సాయికృష్ణ తల్లి పోలీసుస్టేషన్ చుట్టూ తిరిగితే నీ కొడుకు ఫొటోకు దండ వేసుకో అంటూ ఈ తల్లిని హేళనగా మాట్లాడిన పరిస్ధితి. ఆరోజు నుంచి ఈ తల్లి నా కొడుకును చూపించమని బాధపడుతున్న పరిస్ధితులు మన కళ్ల ఎదుటే కనిపిస్తున్నాయి. ఈ ఘటన మీద డీజీపీ ఆఫీసుకు వెళ్లి ఫిర్యాదు చేస్తే అది ఏమైంది? చివరికి చెత్త బుట్టలోకి వెళ్లింది. డీజీపీ ఫిర్యాదును సీపీకి పంపించడం, సీపీ యాక్షన్ తీసుకోకుండా మిగతా వాళ్లను పిలిపించి బేరం పెట్టించే కార్యక్రమం చేశారు' అని వైఎస్ జగన్ ఆరోపించారు.
'ఒకే పోలీసు స్టేషన్లోనే సీఐ, ఏసీపీ, కమిషనర్, డీజీపీ ఇలా మొత్తం ఒకరినొకరు కాపాడుకుంటూ మొత్తం అందరికీ తెలిసి స్టేషనలో జరిగిన ఒక హత్య అని మాజీ సీఎం వైఎస్ జగన్ తెలిపారు. 'ఇంత పెద్ద హేయమైన కార్యక్రమం జరిగిందంటే ఆ సీఐని, బాధ్యుడైన కమిషనర్ను, డీజీపీని మర్డర్ కేసు పెట్టి శిక్షించాల్సింది పోయి కేవలం సీఐని సస్పెన్షన్ మాత్రమే చేశారు. అంటే అందరూ పకడ్పందీగా, కలిసికట్టుగా నేరం చేసి తూతూ మంత్రంగా, కంటితుడుపు చర్యగా, టెంపరరీగా ఓ అధికారిని తప్పించారు. ఇదా మనం ఈ రాష్ట్రంలో చూడాల్సింది' అని కూటమి ప్రభుత్వంపై వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని
'సాయికృష్ణ కేసులో కోర్టు పాత్ర లేదు. వీళ్లే చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని ఏకంగా ఇద్దరు పిల్లలు ఒకే నెలలో చనిపోవడానికి కారణమయ్యారు. ఈ కేసులో సీబీఐ దర్యాప్తు జరగాలి.. ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారనేది బయటికి రావాలి' అని వైఎస్ జగన్ కోరారు. న్యాయపోరాటంలో ఈ తల్లికి, చనిపోయిన మరో పిల్లాడి కుటుంబానికి వైఎస్సార్సీపీ సంపూర్ణంగా అండగా ఉంటుందని ప్రకటించారు.
'ఇదంతా ఎంత కంటితుడుపు చర్య అంటే, అసలు యాక్షనే తీసుకోలేదు. మే 9వ తేదీ నుంచి రెండు మర్డర్ ఘటనలు జరిగితే ఇప్పుడు జూన్లో బయటికి వచ్చిన తర్వాత కంటి తుడుపు చర్యగా అరెస్టులు కూడా చేయకుండా సస్పెన్షన్లు చేస్తున్నారంటే, ఏ విధంగా వీళ్లంతా క్రై మ్ ను బయటికి రాకుండా చేస్తున్నారో అర్థమవుతోంది. ఈ తల్లి దగ్గరకు పంచాయతీలు చేసి.. సర్దుబాట్లు చేసుకునేందుకు బేరసారాలు చేస్తూ ఇక్కడ టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన ఇన్ఛార్జ్లు మాట్లాడుతున్నారంటే రాష్ట్రంలో ఎలాంటి దారుణమైన పరిస్ధితులు ఉన్నాయో గమనించాలి' అని వైఎస్ జగన్ తెలిపారు. ప్రజల ప్రాణాలతో ఎలా చెలగాటం ఆడుతున్నారనే దానికి ఇది ఇంకొక నిదర్శనం అని పేర్కొన్నారు.
అందరూ నిర్లక్ష్యపు వైఖరి
'సాయికృష్ణ కేసుపై కచ్చితంగా సీబీఐ విచారణకు పోవాలి. బాధ్యులు ఎవరెవరైతే ఉన్నారో సీఐ దగ్గరి నుంచి ఏసీపీ, కమిషనర్, డీజీపీ, హోంమంత్రి వరకూ అందరూ నిర్లక్ష్యపు వైఖరితో ఉన్నారు. కాబట్టి సీబీఐ దర్యాప్తు జరగాల్సిందే' అని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ స్పష్టం చేశారు. దోషులు ఎవరో తెలిసి ఎలా కాపాడుతున్నారు? ఎందుకు రోటీన్ పద్ధతిలో ఇలాంటి లాకప్ డెత్లు జరుగుతున్నాయో తెలియాలంటే సీబీఐ రావాల్సిందేనని డిమాండ్ చేశారు.
Oppo Reno 15a: ఇక ఛార్జింగ్ కష్టాలకు గుడ్ బై.. 2 రోజులు వచ్చే బ్యాటరీతో ఒప్పో కొత్త ఫోన్.. అన్ని అదుర్స్!
Hyderabad, Telangana:Oppo Reno 15a Launch Date: ప్రముఖ మొబైల్ కంపెనీ ఒప్పో (Oppo) మిడ్-రేంజ్ సెగ్మెంట్లో మరో సరికొత్త స్మార్ట్ఫోన్ను అందుబాటులోకి తీసుకు వచ్చింది.. సరికొత్త ఫీచర్లతో పాటు అద్భుతమైన డిజైన్తో ఒప్పో రెనో 15A (Oppo Reno 15A) స్మార్ట్ఫోన్ను జపాన్ మార్కెట్లో అధికారికంగా లాంచ్ చేసింది.. ఇది మంచి బ్యాటరీ లైఫ్ కోరుకునే వినియోగదారులను టార్గెట్ చేస్తూ.. ఇందులో కంపెనీ ఏకంగా 7000mAh భారీ బ్యాటరీతో పాటు 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా వంటి హై-ఎండ్ ఫీచర్లతో ఈ స్మార్ట్ఫోన్ మార్కెట్లోకి విడుదలైంది.. ఈ స్మార్ట్ఫోన్ ఒప్పో రెనో 15Fకి రీబ్రాండెడ్ వెర్షన్గా అందుబాటులోకి వచ్చిన్నట్లు తెలుస్తోంది..
ధర వివరాలు..
ఈ Oppo Reno 15A స్మార్ట్ఫోన్ ప్రస్తుతం జపాన్ మార్కెట్లో అందుబాటులో ఉంది.. ప్రస్తుతం ఇది ఆఫ్టర్గ్లో పింక్, ట్విలైట్ నేవీతో పాటు అరోరా బ్లూ వంటి అద్భుతమైన రంగుల్లో అందుబాటులోకి వచ్చింది. దీనికి సంబంధించిన ధరల వివరాల్లోకి వెళితే.. దీని మొదటి స్టోరేజ్ వేరియంట్ 8GB RAM + 128GB స్టోరేజ్తో ధర రూ.38,000తో అందుబాటులోకి వచ్చింది. అంతేకాకుండా రెండవది 12GB RAM + 256GB స్టోరేజ్తో ధర రూ. 45,100తో లభిస్తోంది. అదేవిధంగా అక్కడ మొదటి సేల్లో భాగంగా కొనుగోలు చేసేవారికి స్పెషల్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
ప్రీమియం డిస్ప్లే..
ఒప్పో రెనో 15A ఫోన్లో కంపెనీ అద్భుతమై 120Hz రిఫ్రెష్ రేట్తో కూడిన 6.6-ఇంచుల Full HD+ AMOLED డిస్ప్లేను కలిగి ఉండబోతోంది.. ఇది 1,400 నిట్స్ పీక్ బ్రైట్నెస్ సపోర్ట్తో పాటు 10-బిట్ కలర్ డెప్త్కు సపోర్ట్ చేస్తుందని కంపెనీ క్లైమ్ చేస్తోంది. స్క్రీన్ ప్రొటక్షన్ కోసం AGC Dragontrail STAR D ప్లస్ గ్లాస్ను కూడా వినియోగించిన్నట్లు తెలుస్తోంది.. అలాగే సెక్యూరిటీ కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్ప్రింట్ సెన్సార్ ఫీచర్ కూడా లభిస్తోంది. ఈ ఫోన్ శక్తివంతమైన స్నాప్డ్రాగన్ 6 జెన్ 1 (Snapdragon 6 Gen 1) ప్రాసెసర్పై రన్ అవుతుంది.
భారీ బ్యాటరీ..
ఈ ఫోన్ ప్రధాన ఆకర్షణ దీని బ్యాటరీ.. ఇందులో కంపెనీ మోస్ట్ పవర్ఫుల్ 7,000mAh సామర్థ్యం గల భారీ బ్యాటరీని అందించింది.. దీనికి తోడు 80W ఫాస్ట్ చార్జింగ్తో పాటు 55W PPS చార్జింగ్ సపోర్ట్ ఉండటం వల్ల ఫోన్ చాలా స్పీడ్గా చార్జ్ అవుతుంది. ఒక్కసారి చార్జ్ చేస్తే రెండు రోజుల పాటు బ్యాటరీ ఛార్జింగ్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని కంపెనీ వెల్లడించింది..
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
కెమెరా లవర్స్ కోసం 50MP సెల్ఫీ కెమెరా..
ఫోటోగ్రఫీకి సంబంధించిన వివరాల్లోకి వెళితే.. దీని వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్ను అందుబాటులోకి తీసుకు వచ్చిన్నట్లు తెలుస్తోంది. అందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్తో కూడిన 50MP ప్రధాన కెమెరాతో పాటు అదనంగా 8MP అల్ట్రా-వైడ్ లెన్స్, 2MP మాక్రో కెమెరా అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది.. ఇక సెల్ఫీల కోసం.. ఇందులో ప్రత్యేకంగా ముందు భాగంలో 50MP పవర్ఫుల్ కెమెరాను అందించారు..
కొత్త ఫీచర్లు ఇవే..
ఈ ఒప్పో రెనో 15A స్మార్ట్ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత కలర్ ఓఎస్ 16 (ColorOS 16)తో అందుబాటులోకి వచ్చింది.. ఇందులో వాటర్తో పాటు డస్ట్ నుంచి ప్రొటక్షన్ కోసం దీనికి IP66, IP68తో పాటు IP69 రేటింగ్స్ అందించిన్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా ఇందులో NFC, బ్లూటూత్ 5.1, యూఎస్బీ టైప్-సి ఆడియో, మైక్రో ఎస్డీ కార్డ్ స్లాట్ వంటి అద్భుతమైన ఫీచర్లు కూడా లభిస్తున్నాయి. అయితే, దీనిని త్వరలోనే భారత మార్కెట్లోకి విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తోంది.
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Karimnagar: కరీంనగర్లో NEET రీ-ఎగ్జామ్.. అక్కడ సెక్షన్ 163 అమలు.. ఇవి బంద్!
Hyderabad, Telangana:NEET 2026 Re-Exam in Karimnagar: రాష్ట్రంలోని అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగనున్న నీట్ 2026 రీ-ఎగ్జామినేషన్కు కరీంనగర్ రూరల్ యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లను చేస్తూ వస్తోంది.. జూన్ 21వ తేదీన కరీంనగర్ రూరల్ మండలం పరిధిలోని బొమ్మక్కల్ మైనారిటీ రెసిడెన్షియల్ కాలేజీలో ఈ పరీక్ష జరగబోతోంది.. ఈ నేపథ్యంలో పరీక్షా కేంద్రం పరిసరాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా.. అక్రమాలకు తావులేకుండా ఉండేదుకు భారీ భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా పరీక్షా కేంద్రం చుట్టూ 200 మీటర్ల పరిధిలో సెక్షన్ 163 అమలు చేస్తున్నట్లు MRO జి. లక్ష్మీనర్సింహారావు ఒక ప్రకటనలో అధికారికంగా వెల్లడించారు.
మధ్యాహ్నం 2 నుంచి ఆంక్షలు..
జూన్ 21వ తేదిన మధ్యాహ్నం 2:00 గంటల నుంచి సాయంత్రం 5:15 గంటల వరకు పరీక్షా సమయాల్లో ఈ ఆంక్షలు అత్యంత కఠినంగా అమలులో ఉంటాయని MRO స్పష్టం చేశారు. ఈ సమయంలో పరీక్షా కేంద్రం పరిసరాల్లో నలుగురు అంతకంటే ఎక్కువ మంది గుమిగూడటంపై పూర్తి నిషేధం ఉంటుందని అధికారులు తెలిపారు. ధర్నాలతో పాటు నిరసనలు లేదా గుంపులుగా ఉండడాన్ని చట్టవిరుద్ధంగా పరిగణిస్తామని హెచ్చరించారు. అదేవిధంగా శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా మైకులు.. లాడ్స్పీకర్లు వాడటాన్ని కూడా పూర్తిగా నిషేధించినట్లు తెలిపారు.
జిరాక్స్ కేంద్రాల బంద్..
పరీక్షల్లో ఎలాంటి అవకతవకలతో పాటు లీకేజీలు, కాపీయింగ్ వంటి ఉదంతాలు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్తగా అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పరీక్షా కేంద్రానికి సమీపంలో ఉన్న అన్ని జిరాక్స్, కొరియర్తో పాటు ఇంటర్నెట్ సెంటర్లను పరీక్ష ముగిసే వరకు మూసివేయాలని MRO లక్ష్మీనర్సింహారావు ఆదేశించారు. నిబంధనలను ఉల్లంఘించి ఎవరైనా జిరాక్స్ సెంటర్లు తెరిచినా లేదా గుంపులుగా తిరిగినా వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!
ప్రశాంత వాతావరణంలో పరీక్షలు..
విద్యార్థులు ఎలాంటి ఆందోళన చెందకుండా.. ప్రశాంతమైన వాతావరణంలో పరీక్ష రాసేలా అధికారులు, పోలీస్ యంత్రాంగం సమన్వయంతో పనిచేస్తున్నారు. పరీక్షా కేంద్రం వద్ద సీసీ కెమెరాల నిఘాతో పాటు గట్టి పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేయబోతున్నట్లు తెలుస్తోంది. స్థానిక ప్రజలు, విద్యార్థుల తల్లిదండ్రులు అధికారుల ఆదేశాలకు లోబడి, పరీక్షలు సజావుగా సాగేందుకు సహకరించాలని తహశీల్దార్ ఈ సందర్భంగా కోరారు. లేదంటే చట్టం తన పని తాను చేసుకుని వెళ్తుందని తెలిపారు.
Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
NEET అభ్యర్థులకు గుడ్ న్యూస్.. జూన్ 21న ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం..
Hyderabad, Telangana:Tgsrtc Free Bus Travel Latest News: వైద్య విద్యా కోర్సుల్లో అడ్మిషన్ కోసం నీట్ (NEET) పరీక్ష రాసే విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తను అందించింది. జూన్ 21వ తేదీన జరగబోతున్న నీట్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులందరికీ టీజీఎస్ఆర్టీసీ (TGSRTC) బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ.. విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా పరీక్షా కేంద్రాలకు చేరుకునేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
హాల్ టికెట్ చూపిస్తే చాలు.. ఫ్రీ జర్నీ..
మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాల మేరకు.. జూన్ 21న పరీక్ష రాయబోయే విద్యార్థులు తమ వెంట నీట్ హాల్ టికెట్ ఉంచుకుంటే సరిపోతుంది. బస్సు ఎక్కేటప్పుడు కండక్టర్కు హాల్ టికెట్తో పాటు ఏదైనా గుర్తింపు కార్డు చూపిస్తే.. పరీక్షా కేంద్రాలకు ఉచితంగా ప్రయాణించవచ్చని అధికారిక ప్రకటనలో భాగంగా పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి హైదరాబాద్తో పాటు ఇతర ప్రధాన నగరాల్లోని పరీక్షా కేంద్రాలకు వచ్చే విద్యార్థులకు ఆర్థిక భారం తప్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం..
ఆర్టీసీ MDకి మంత్రి కీలక ఆదేశాలు..
ఈ ఉచిత ప్రయాణ నిర్ణయాన్ని క్షేత్రస్థాయిలో పక్కాగా అమలు చేయాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్.. ఆర్టీసీ ఎండీకి స్పష్టమైన ఆదేశాలు అధికారికంగా జారీ చేశారు. పరీక్ష రోజున విద్యార్థుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి.. పరీక్షా కేంద్రాల మార్గాల్లో ప్రత్యేక బస్సులను నడపాలని సూచించారు. ఏ ఒక్క విద్యార్థి కూడా రవాణా సౌకర్యం లేక ఇబ్బంది పడకూడదని, అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!
సర్కార్ సానుకూల స్పందన..
ఇటీవల దేశవ్యాప్తంగా నీట్ పరీక్షకు సంబంధించి జరిగిన పరిణామాల నేపథ్యంలో రీ-ఎగ్జామ్ రాయబోతున్న విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. ఈ తరుణంలో గ్రామీణ విద్యార్థులపై ప్రయాణ ఖర్చుల భారం పడకుండా ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని ఎన్ఎస్యూఐ (NSUI) సహా పలు విద్యార్థి సంఘాలు మంత్రిని కలిసి విజ్ఞప్తి చేశాయి. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సానుకూల నిర్ణయం తీసుకోవడంపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
BJP Janasena: తెలంగాణలో జనసేన యాక్టివ్..పవన్తో పొత్తుకు సిద్ధమైన బీజేపీ నేతలు?
Hyderabad, Telangana:BJP Janasena Alliance: తెలంగాణ రాష్ట్రంలో రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తామని చెప్పిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాటలపై ఇప్పుడు తెలంగాణలో చర్చ నడుస్తోంది. ఇదివరకే తెలంగాణలో బీజేపీ సింగిల్గా పోటీ చేస్తుందని ఎన్.రామచంద్రరావు ప్రకటించగా..అయితే ఇప్పుడు మరోసారి జనసేన పార్టీ తెలంగాణలో యాక్టివ్గా మారింది. దీంతో సింగిల్ పోటీ చేసేందుకు జనసేన సిద్ధమైన నేపథ్యంలో.. బీజేపీ మరోసారి జనసేనతో పొత్తు పెట్టుకునే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.Trigrahi Yog In Cancer 2026: జూన్ 22 నుంచి ఈ 4 రాశుల వారికి గోల్డెన్ డేస్.. మోస్ట్ పవర్ఫుల్ త్రిగ్రహ యోగం!
Hyderabad, Telangana:Trigrahi Yog In Cancer 2026 Effect On Zodiac: జూన్ 22వ తేదిన ఒక ఖగోళ సంయోగం జరగబోతోంది. ఈ సమయంలో ఎంతో శక్తివంతమైన త్రిగ్రహ యోగం ఏర్పడబోతోంది. ముఖ్యంగా ఈ సమయంలో కొన్ని రాశులవారు వృత్తితో పాటు వ్యాపారంలో గొప్ప పురోగతి సాధించే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా కొన్ని గ్రహాలు ఈ సమయంలో కలయిక జరపడం కారణంగా మోస్ట్ పవర్ఫుల్ త్రిగ్రహ యోగం ఏర్పడింది. ఈ యోగం జూన్ 22న కర్కాటక రాశిలో ఏర్పడబోతోంది. దీని కారణంగా కొన్ని రాశులవారిపై ఊహించని ప్రభావం పడుతుంది.
జ్యోతిష్య శాస్త్ర ప్రకారం.. జూన్ 2న దేవదేవుడైన గురుడు కర్కాటక రాశిలోకి సంచారం చేయగా.. జూన్ 8న ఐశ్వర్యానికి అధిపతి అయిన శుక్రుడు అదే రాశిలోకి సంచారం చేశాడు.. ఇదిలా ఉంటే జూన్ 22న బుధుడు కూడా కర్కాటక రాశిలోకి ప్రవేశించబోతున్నాడు.. దీని ఫలితంగా.. మూడు ప్రధాన శుభ గ్రహాలైన బుధ, గురు, శుక్ర గ్రహాల కలయిక ఒకే రాశిలో జరగడం కారణంగా ఈ శక్తివంతమైన త్రిగ్రహ యోగం ఏర్పడబోతోంది. ఈ శక్తివంతమైన యోగంతో నాలుగు రాశులవారి జీవితాల్లో గోల్డెడ్ డేస్ ప్రారంభం కాబోతున్నాయి. ముఖ్యంగా ఉద్యోగాల పాటు, వ్యాపారాలు, వృత్తి పరంగా చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ సమయంలో భారీగా పురోగతి కలుగుతుంది.
కర్కాటక రాశి:
మోస్ట్ పవర్ఫుల్ త్రిగ్రహ యోగంతో వ్యాపారాలు చేసేవారికి నిలిపోయిన పనులు కూడా తిరిగి పొందే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా మార్కెటింగ్తో పాటు మీడియా, రచన లేదా డిజిటల్ కంటెంట్తో సంబంధం ఉన్న వ్యక్తులకు ఈ సమయం ఎంతో లాభదాయకంగా ఉంటుంది. అంతేకాకుండా పని చేసే చోట గౌరవంతో పటు సామాజిక హోదా కూడా లభించే అవకాశాలు ఉన్నాయి. గతంలో పెండింగ్లో ఉన్న పనులు కూడా ఈ సమయంలో సులభంగా పూర్తవుతాయి. భాగస్వామ్య వ్యాపారంలో పెద్ద ఆర్థిక లాభాలతో పాటు ఈ సమయంలో తప్పకుండా ఇళ్లతో పాటు కార్లు కూడా కొనుగోలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే వ్యాపారాలు చేస్తున్నవారికి బంపర్ లాభాలు కలుగుతాయి.
కన్యారాశి:
మోస్ట్ పవర్ఫుల్ త్రిగ్రహ యోగం ఏర్పడడం వల్ల కన్యా రాశివారికి ఇది స్వర్ణయుగం కాబోతోందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అంతేకాకుండా పనికి తగ్గ ప్రశంసలు కూడా లభిస్తాయి. అంతేకాకుండా అధికారుల నుంచి మంచి సపోర్ట్ కూడా లభించి.. కెరీర్ పరంగా చాలా బాగా ఎదిగే అవకాశాలు ఉన్నాయి. వీరికి ఈ సమయంలో అనేక కొత్త ఆదాయ మార్గాలు లభించడమే కాకుండా బ్యాంక్ బ్యాలెన్స్ కూడా ఊహించని స్థాయిలో పెరుగుతుంది. గతంలో పెట్టి పెట్టుబడుల నుంచి ఊహించని స్థాయిలో ఆర్థిక లాభాలు కూడా పొందుతారు.
మీన రాశి:
మోస్ట్ పవర్ఫుల్ త్రిగ్రాహి యోగం ఎఫెక్ట్తో మీన రాశివారికి ఈ సమయంలో అదృష్టం విపరీతంగా పెరుగుతుంది. అలాగే వీరు తప్పకుండా సానుకూలమైన ప్రభావంతో ముందుకు సాగుతారు. దీంతో ఉద్యోగాలు చేసేవారికి పని ప్రదేశాల్లో అనుకూలమైన వాతావరణం నెలకొంటుంది. అంతేకాకుండా కొత్త బాధ్యతలతో పాటు పదవులు కూడా పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీరు ఈ సమయంలో మంచి ప్రదేశాలకు ఉద్యోగ బదిలీలు కూడా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కుటుంబంలో ఆనందం కూడా రెట్టింపు అవుతుంది. జీవితంలో శాంతి కూడా విపరీతంగా నెలకొంటుంది. మానసిక సమస్యలు కూడా దూరమవుతాయి.
వృషభ రాశి:
ఈ శక్తివంతమైన త్రిగ్రహ యోగం ఎఫెక్ట్తో వృషభ రాశి వారికి ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా అద్బుతమైన ఫలితాలు కలుగుతాయి. వీరికి పనుల్లో విజయాలు కూడా కలుగుతాయి. దీంతో పాటు ధైర్యం, బలంతో పాటు నిర్ణయం తీసుకునే సామర్థ్యం విపరీతంగా పెరుగుతాయి. బుధ గ్రహ ప్రభావంతో ఉద్యోగాల పరంగా అద్భుతమైన పదోన్నతులు కలుగుతాయి. అంతేకాకుండా వీరికి ఈ సమయంలో తప్పకుండా పదోన్నతులు కలుగుతాయి. ముఖ్యంగా మార్కెట్తో పాటు మీడియా, రచన రంగాల్లో పనులు చేస్తున్నవారికి అద్భుతమైన ప్రయోజనాలు కలిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ సమయంలో భారీ మొత్తంలో ప్రజెక్ట్లు కూడా సొంతం చేసుకునే ఛాన్స్లు కూడా ఉన్నాయి.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
గమనిక.. 
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..
Nagamani Video: నాగమణికి కాపలాగా రెండు భారీ కింగ్ కోబ్రాలు.. వీడియో వైరల్..
Hyderabad, Telangana:Nagamani Video Watch Here: ప్రస్తుతం సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక వింత వీడియో వైరల్ అవుతూనే ఉంటుంది. అయితే, తాజాగా నెట్టింట హల్చల్ చేస్తున్న ఒక వీడియో మాత్రం నెటిజన్స్ను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ వీడియోలో ప్రమాదకరమైన రెండు భారీ కింగ్ కోబ్రాలు.. అత్యంత అరుదైన నాగమణికి రక్షణగా నలవడమే కాకుండా మరో పాము కూడా దీనికి రక్షణగా నిలిచేందుకు రావడం చూసిన సోషల్ మీడియా వినియోగదారులు ఆశ్చర్యపోతున్నారు. అయితే, ఈ వీడియోకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
అరుదైన నాగమణి..
ఈ వీడియోలో.. రెండు అత్యంత విషపూరీతమైన భారీ కింగ్ కోబ్రా కనిపిస్తాయి. విశేషం ఏమిటంటే.. ఆ రెండు పాముల ముందు ఒక ప్రకాశవంతమైన వింత రాయి ఉండడం మీరు చూడొచ్చు.. దీనిని నెటిజన్లు నాగమణిగా పిలుస్తున్నారు. ఆ రెండు సర్పాలు ఆ నాగమణికి రక్షణగా నిలిచినట్లు, ఎవరైనా దగ్గరకు వస్తే దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆ వీడియోలో కనిపిస్తోంది. అంతేకాకుండా ఈ పాములకు రక్షణగా మరో పాముకు కూడా రావడం మీరు ఈ వీడియోలో క్లియర్గా చూడొచ్చు..
షాక్లో నెటిజన్లు..
ఈ వీడియో సెషల్ మీడియా ప్లాట్ఫారమ్లైన ఇన్స్టాగ్రామ్, ఎక్స్, ఫేస్బుక్లలో ఊహించని స్థాయిలో వైరల్ అయ్యాయి. ఈ వీడియోను కేవలం కొన్ని గంటల్లోనే లక్షలాది మందికి పైగా ఈ వీడియోను వీక్షించారు. అంతేకాకుండా వారు ఈ వీడియోపై వివిధ రకాలుగా స్పందిస్తూ వస్తున్నారు. ఈ వీడియో చూసిన కొందరు నిజంగానే నాగమణి ఉంటుందా? అని కామెంట్లు పెడుతున్నారు. అలాగే సినిమాల్లోనే అనుకున్నాం.. నిజ జీవితంలో కూడా నాగమణిని చూడటం ఆశ్చర్యం కలిగిస్తోందని కామెంట్స్ పెడుతున్నారు. ఇక మరికొంతమంది ఇది దేవుడి లీల అంటూ కామెంట్స్ రాస్తూ వస్తున్నారు.
సైన్స్ ఏం చెబుతోంది?
సైన్స్తో పాటు వన్యప్రాణి నిపుణుల తెలిపిన వివరాల ప్రకారం.. పాముల దగ్గర నాగమణి లేదా నాగ రత్నం లాంటివి ఉంటాయనేది కేవలం ఒక కల్పిత కథ మాత్రమేనని.. నిజ జీవితంలో అలాంటివి ఎక్కడా లేవని.. ఇంత వరకు ఎవరు చూడలేదని చెబుతున్నారు..
Also Read: Video Viral: సాయం ముసుగులో అరాచకం.. యువతి ప్రైవేటు పార్ట్ మీద చెయ్యి వేసి మరీ.!. వీడియోపై దుమారం..
గ్రాఫిక్స్ (VFX)?
ఈ వైరల్ వీడియోను చూస్తే.. ఇది పక్కాగా గ్రాఫిక్స్ (VFX) లేదా ఎడిటింగ్ ట్రిక్ అని స్పష్టమవుతోంది. పాముల ముందు ఒక మెరిసే ఎల్ఈడీ (LED) రాయిని లేదా ఆర్టిఫిషియల్ లైటింగ్ను ఉంచి ఈ వీడియోను క్రియేట్ చేసి ఉండవచ్చని చాలా మంది టెక్ నిపుణులతో పాటు నెటిజన్స్ భావిస్తున్నారు.. లైకులు, వ్యూస్తో పాటు ఫాలోవర్లను పెంచుకోవడం కోసమే కొందరు ఇలాంటి తప్పుడు వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు.
Also Read: Video Viral: సాయం ముసుగులో అరాచకం.. యువతి ప్రైవేటు పార్ట్ మీద చెయ్యి వేసి మరీ.!. వీడియోపై దుమారం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్.. - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..Twitter, Facebook
EPFO Organise PMVBRY: కొత్త ఉద్యోగులకు కేంద్రం గుడ్న్యూస్.. పీఎఫ్ అకౌంట్లో రూ.15,000 జమ..ఎప్పుడంటే?
Hyderabad, Telangana:EPFO Organise PMVBRY News: ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఆధ్వర్యంలో జూన్ 19న ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్ ఘర్ యోజన (PMVBRY) కింద దేశవ్యాప్తంగా భారీ కార్యక్రమాలు జరగనున్నాయి. అధికారిక ఉపాధిని ప్రోత్సహిస్తూ, కార్మికులకు సామాజిక భద్రత కల్పించడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ మెగా డ్రైవ్ ను చేపట్టింది.
న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరగనున్న ప్రధాన జాతీయ కార్యక్రమంతో పాటు దేశంలో 200 పారిశ్రామిక, ఉపాధి కేంద్రాలలో ప్రాంతీయ కార్యక్రమాలు జరగనున్నాయి. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా పలు సంస్థల్లో ఈ ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించనున్నారు.
రూ.2,400 కోట్ల ప్రయోజనాల పంపిణీ..
జూన్ 19న న్యూఢిల్లీలో జరిగే ప్రధాన జాతీయ స్థాయి కార్యక్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ హాజరయ్యే అవకాశం ఉంది. ఇందులో భాగంగా అర్హులైన అభ్యర్థులకు గానూ దాదాపుగా రూ.2,400 కోట్ల విలువైన ప్రయోజనాలను పంపిణీ చేయనున్నారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం కొత్తగా ఉద్యోగాలు చేరిన యువతకు యజమానులు అధికారికంగా అపాయింట్మెంట్ లెటర్లను అందజేస్తారు. ఈ ప్రాంతీయ కార్యక్రమంలో ఉద్యోగులు, యజమానులు, పరిశ్రమ ప్రతినిధులు, కార్మిక రంగ నిపుణులు పాల్గొని అవగాహన పెంచనున్నారు.
PMVBRY పథకం లక్ష్యాలు ప్రయోజనాలు..
3.5 కోట్లకు పైగా ఉద్యోగాల సృష్టించడమే ఈ పథకం లక్ష్యమని అధికారులు చెబుతున్నారు. ఈ పథకం ద్వారా దేశంలో భారీగా అర్థవంతమైన ఉద్యోగ అవకాశాలు సృష్టించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పథకం కింద కొత్తగా ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించే యువతకు నెలకు రూ.15,000 వరకు ఆర్థిక ప్రయోజనాలు అందుతాయి.
అలాగే కంపెనీలు లేదా యజమానులు సంస్థల తమ వద్ద అదనపు ఉద్యోగాలను సృష్టించడం ద్వారా వారికి ప్రభుత్వం తరఫున ప్రత్యేక ప్రోత్సాహాలు లభిస్తాయి. ఈ పథకం ద్వారా దేశంలో వ్యవస్థీకృత కార్మిక రంగం మరింత బలోపేతం అవుతుందని ఇది దీర్ఘకాలిక ఆర్థిక వృద్ధిని, శక్తిని అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతుందని విధాన రూపకర్తలు భావిస్తున్నారు.
Also Read: విశాఖపట్నంపై కన్నేసిన పాకిస్థాన్..బంగాళఖాతంలోకి పాక్ సబ్మెరైన్ ఎంట్రీ!
Also REad: భారీగా తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు..ట్రంప్ ప్రకటనతో ఒక్కసారి పడిపోయిన ఇంధన ధరలు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
