Back
Mancherial504251blurImage

సేవాజ్యోతి శరణాలయంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు

KASARLA RAMESH
Sep 07, 2024 15:44:35
Bellampalle, Kannal Rural, Telangana
మంచిర్యాల జిల్లా తాండూర్ మండల సేవాజ్యోతి శరణాలయంలో బాలగణేశ్ మండలి శ్రీ వినాయక చవితి పూజ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. బాలగణేశ్ మట్టి ప్రతిమను మండపంలో ప్రతిష్టించి పూజలు నిర్వహించారు. అందరికీ ఆ భగవంతుని ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని కోరుతూ పిల్లలు, పెద్దలు అందరూ కలిసి భజనలు కీర్తనలు పాడారు. రానున్న తరాలకు హిందూ సంస్కృతి సాంప్రదాయాలు తెలిపేందుకు ఇలాంటి వేడుకలు నిర్వహిస్తున్నామని శరణాలయం నిర్వాహకురాలు శ్రీదేవి పేర్కొన్నారు.
0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com