లోటస్ పాఠశాలలో ఘనంగా శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
OnePlus 13s Price Drop: ఎప్పటినుంచో మంచి స్మార్ట్ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అమెజాన్ మీకోసం అద్భుతమైన అవకాశాన్ని అందిస్తుంది. ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్లో వన్ప్లస్ కంపెనీ ఇటీవలే మార్కెట్లోకి విడుదల చేసిన వన్ ప్లస్ 13 సిరీస్ లో అందుబాటులోకి వచ్చిన OnePlus 13s మోడల్ అతి తక్కువ ధరలో అందుబాటులో ఉంది. ముఖ్యంగా ఈరోజే కొనుగోలు చేసే వారికి ఎన్నో రకాల ప్రత్యేకమైన స్పెషల్ ఆఫర్స్ లభిస్తున్నాయి. అయితే, దీనిపై ఉన్న ఆఫర్స్ వివరాలు, ఫీచర్స్తో పాటు స్పెసిఫికేషన్స్ ఇప్పుడు తెలుసుకుందాం..
OnePlus 13s స్మార్ట్ఫోన్ అద్భుతమైన ఫీచర్లతో అందుబాటులోకి వచ్చింది. దీనిని కంపెనీ ఎంతో శక్తివంతమైన 6.32 అంగుళాల 1.5K LTPO ProXDR డిస్ప్లేతో విడుదల చేసింది. అలాగే ఈ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్ను కలిగి ఉంటుంది. ముఖ్యంగా ఇందులో కంపెనీ ఎంతో శక్తివంతమైన Snapdragon 8 Elite చిప్సెట్ ప్రాసెసర్ను అందుబాటులో ఉంచింది. ఇక వెనక భాగంలోని కెమెరాకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. వన్ ప్లస్ కంపెనీ Sony LYT-700 సెన్సార్ తో కూడిన 50MP మెయిన్ కెమెరా కలిగి ఉంటుంది. దీంతోపాటు అదనంగా 50MP టెలిఫోటో లెన్స్ కెమెరాను కూడా లభిస్తుంది. అలాగే ఫ్రంట్ భాగంలో సెల్ఫీ కోసం ఇందులో కంపెనీ 32MP కెమెరాను కూడా అందుబాటులో ఉంచింది.
ఈ స్మార్ట్ఫోన్లో హైలెట్ ఏందంటే బ్యాటరీ తో పాటు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్.. ఈ మొబైల్లో కంపెనీ ఎంతో శక్తివంతమైన 5,850mAh బ్యాటరీని అందిస్తోంది. దీంతోపాటు 80W SUPERVOOC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా లభిస్తుంది. అలాగే ఇది ఎంతో ప్రత్యేకత తో కూడిన ఆండ్రాయిడ్ 15 ఆధారిత OxygenOS 15 ఆపరేటింగ్ సిస్టంపై రన్ అవుతుంది. ప్రస్తుతం మార్కెట్లో ఈ స్మార్ట్ఫోన్ ధర MRP రూ.57,999తో అందుబాటులో ఉంది. అయితే, దీనిని అమెజాన్లో ఇప్పుడే కొనుగోలు చేసే వారికి ఏకంగా 12 శాతం తగ్గింపుతో కేవలం రూ.50,999కే లభిస్తోంది. అలాగే మరింత తగ్గింపు ధరకు పొందడానికి బ్యాంకు డిస్కౌంట్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. ఇందులో భాగంగా కొనుగోలు చేసే వారికి మరింత తగ్గింపు ధరకే దీనిని సొంతం చేసుకోవచ్చు.
Also Read: Redmi 14C 5G Offer: రెడ్మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్ఫోన్..అదిరిపోయే ఆఫర్!
ఇక ఈ మొబైల్పై ఉన్న బ్యాంక్ ఆఫర్స్ వివరాల్లోకి వెళ్తే.. దీనిని హెచ్డిఎఫ్సి బ్యాంకు క్రెడిట్ కార్డు వినియోగించి పేమెంట్ చేసే వారికి రూ.3000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో పాటు అమెజాన్ పే ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డులను వినియోగించి పేమెంట్ చేస్తే.. పైన పేర్కొన్న డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో ఈ మొబైల్ కేవలం రూ.47,999కే పొందవచ్చు. అలాగే ఎక్స్చేంజ్ బోనస్ ఆఫర్ వినియోగించే వారికి ఈ మొబైల్ మరింత చీప్ ధరకు పొందవచ్చు.
మీ దగ్గర ఉన్న పాత వన్ప్లస్ స్మార్ట్ఫోన్ను ఎక్స్చేంజ్ ఆఫర్స్లో భాగంగా.. ఎక్స్చేంజ్ చేస్తే మొబైల్ కండిషన్ను బట్టి ఏకంగా రూ. 48 వేల వరకు బోనస్ లభిస్తుంది. ఇలా పొందిన బోనస్ని మొబైల్ ధర నుంచి మైనస్ చేస్తే.. ఈ మొబైల్ను కేవలం రూ.1,999 లోపే పొందవచ్చు.. అంతేకాకుండా మరిన్ని డిస్కౌంట్ ఆఫర్స్ను దీనిని తక్కువ ధరకే పొందే అవకాశం కూడా ఉంది.
Also Read: Redmi 14C 5G Offer: రెడ్మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్ఫోన్..అదిరిపోయే ఆఫర్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
BSNL Senior Executive Recruitment 2026: ప్రభుత్వరంగ టెలికాం దిగ్గజం భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) నిరుద్యోగులకు తీపి కబురు అందించింది. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ బ్రాంచ్లలో ఖాళీగా ఉన్న సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మంచి జీతం, ప్రభుత్వ ఉద్యోగం ఆశించే వారికి ఇది ఒక అద్భుతమైన అవకాశం. డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో భర్తీ చేయనున్న ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను బీఎస్ఎన్ఎల్ ఆహ్వానిస్తోంది.
ఖాళీల వివరాలు
మొత్తం 120 పోస్టులను రెండు ప్రధాన విభాగాల్లో భర్తీ చేస్తున్నారు.
సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (టెలికాం): 95 పోస్టులు
సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (ఫైనాన్స్): 25 పోస్టులు
అర్హతలు & వయోపరిమితి
టెలికాం కేటగిరీ కోసం కనీసం 60% మార్కులతో బీఈ (BE) లేదా బీటెక్ (B.Tech) పూర్తి చేసి ఉండాలి. అలాగే ఫైనాన్స్ కేటగిరీ కోసం కనీసం సీఏ (CA) లేదా సీఎంఏ (CMA) ఉత్తీర్ణత సాధించి ఉండాలి. నోటిఫికేషన్లో పేర్కొన్న విధంగా సంబంధిత విభాగంలో పని అనుభవం ఉండాలి.
అదే విధంగా వయస్సు (మార్చి 7, 2026 నాటికి) 21 నుండి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఓబీసీలకు 3 ఏళ్లు, ఎస్సీ/ఎస్టీలకు 5 ఏళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 15 ఏళ్ల వరకు వయోపరిమితిలో మినహాయింపు ఉంటుంది.
జీతభత్యాలు
ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.24,900 నుండి రూ.50,500 వరకు వేతనం అందుతుంది. దీనితో పాటు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇతర అలవెన్సులు కూడా ఉంటాయి. అభ్యర్థులను ఆన్లైన్ రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. పరీక్షలో ప్రతిభ కనబరిచిన వారికి తుది నియామక ఉత్తర్వులు అందజేస్తారు.
దరఖాస్తు రుసుము , విధానం
జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్: రూ. 2,500
ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ: రూ. 1,250
ముఖ్యమైన తేదీలు
| వివరం | తేదీ |
| దరఖాస్తుకు చివరి తేదీ | మార్చి 7, 2026 (రాత్రి 10 గంటల వరకు) |
| దరఖాస్తు సవరణ | మార్చి 8 నుండి మార్చి 15, 2026 వరకు |
| ఆన్లైన్ రాత పరీక్ష తేదీ | మార్చి 29, 2026 |
టెలికాం రంగంలో కెరీర్ ప్రారంభించాలనుకునే ఇంజనీరింగ్, ఫైనాన్స్ గ్రాడ్యుయేట్లకు ఇది గొప్ప అవకాశం. ఆసక్తి గల అభ్యర్థులు గడువు ముగిసేలోపు బీఎస్ఎన్ఎల్ అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
OnePlus Nord 5 Price Cut: వన్ ప్లస్ బ్రాండ్కి సంబంధించిన మంచి మొబైల్ తక్కువ ధరకే కొనుగోలు చేయాలనుకుంటున్నారా? 2025 సంవత్సరంలో జూలై నెలలో విడుదలైన వన్ ప్లస్ నార్డ్ 5 ఇప్పుడు అమెజాన్లో అత్యంత తక్కువ ధరకే లభిస్తుంది. ముఖ్యంగా చీప్ ధరకే ఈ మొబైల్ పొందాలనుకునే వారికి ఇది అద్భుతమైన అవకాశంగా భావించవచ్చు. ఇప్పుడు దీనిపై ఎన్నో రకాల డిస్కౌంట్ ఆఫర్స్తో పాటు కొన్ని రకాల స్పెషల్ ఆఫర్స్ లభిస్తున్నాయి. ఆ ఆఫర్స్ ఏంటో? దానికి సంబంధించిన ఫీచర్స్ వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
వన్ప్లస్ నార్డ్ 5 (OnePlus Nord 5) స్మార్ట్ఫోన్ అద్భుతమైన 6.83-అంగుళాల Swift AMOLED డిస్ప్లేను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇది చాలా ప్రత్యేకమైన 1.5K రిజల్యూషన్, 144Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్తో అందుబాటులోకి వచ్చింది. అలాగే ఇది ఎంతో శక్తివంతమైన Qualcomm Snapdragon 8s Gen 3 ప్రాసెసర్ ను కలిగి ఉంటుంది.
ఇది అద్భుతమైన ప్రాసెసర్ను కలిగి ఉండటం వల్ల.. గేమింగ్ చేసే యువతకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా మల్టీ టాస్కింగ్ చేయాలనుకున్న వ్యక్తులకు ఈ మొబైల్ చాలా బెస్ట్గా భావించవచ్చు. అంతేకాకుండా ఈ మొబైల్ స్క్రోలింగ్ కూడా చాలా అద్భుతంగా సున్నితంగా ఉంటుంది. దీనివల్ల ఎక్కువసేపు ఈ స్మార్ట్ ఫోన్ను వినియోగించినప్పటికీ ఇలాంటి అసౌకర్యం కలగదు. ఇక వెనక భాగంలో ఈ స్మార్ట్ఫోన్లో కంపెనీ ఎంతో ప్రత్యేకమైన Sony LYT-700, OIS సెన్సార్తో కూడిన 50MP ప్రధాన కెమెరాను కలిగి ఉంటుంది. ఇది అదనంగా 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాను కలిగి ఉంటుంది. దీంతో పాటు ఫ్రంట్ భాగంలో స్పెషల్గా 50MP సెల్ఫీ కెమెరాతో లభిస్తోంది.
OnePlus Nord 5 స్మార్ట్ఫోన్ ఎంతో శక్తివంతమైన 6,800 mAh భారీ బ్యాటరీతో పాటు 80W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టును కలిగి ఉంటుంది. దీంతోపాటు ఇది Android 15 ఆధారిత OxygenOS 15 ఆపరేటింగ్ సిస్టంపై రన్ అవుతుంది. ఇక ఈ మొబైల్ ఎంతో ప్రత్యేకమైన డిజైన్లు కలిగే ఉంటుంది. ఈ స్మార్ట్ఫోన్కు సంబంధించిన డిజైన్ వివరాల్లోకి వెళ్తే..ఇది వెనుక భాగంలో గ్లాస్తో ప్రత్యేకమైన ప్లాస్టిక్ ప్రేమ్తో వస్తోంది. అంతేకాకుండా ఇందులో అలర్ట్ స్లైడర్కు బదులుగా ప్లస్కి బటన్ను పరిచయం చేశారు. దీనివల్ల మొబైల్ వినియోగదారులకు కొన్ని రకాల ఆప్షన్స్ మరింత సులభతరం అయ్యాయి.
ఈ మొబైల్ కి సంబంధించిన ధర వివరాల్లోకి వెళ్తే.. దీనిని కంపెనీ మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంచింది.. అయితే, బేస్ వేరియంట్ పై ప్రత్యేకమైన డిస్కౌంట్ లభిస్తుంది. ఈ వేరియంట్ ధర MRP రూ.33,999 కాగా.. అమెజాన్లో HDFC బ్యాంకుతో పాటు యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులను వినియోగించి పేమెంట్ చేసే వారికి రూ.1,500 తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా దీనిని ఎక్స్చేంజ్ ఆఫర్ వినియోగించి పేమెంట్ చేసే వారికి రూ.32,000 బోనస్ లభిస్తుంది. అయితే, ఇది మీరు ఎక్స్చేంజ్ చేసే పాత మొబైల్ కండిషన్ను బట్టి ఆధారపడి ఉంటుంది. ఇక ఈ అన్ని రకాల ఆఫర్స్ పోను ఈ మొబైల్ కేవలం రూ.1,999లోపే పొందవచ్చు.
Also Read: Redmi 14C 5G Offer: రెడ్మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్ఫోన్..అదిరిపోయే ఆఫర్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
8th Pay Commission Fraud: ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్దారులు కొన్ని నెలలుగా ఎదురుచూస్తున్న కొత్త వేతన సంఘం మరింత ఆలస్యమవుతోంది. కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుండడంతో ఉద్యోగ వర్గాలు తీవ్రంగా ఎదురుచూస్తున్నారు. జనవరి 2026 నుంచి అమలు కావాల్సిన కొత్త వేతన సంఘం అతీగతీ లేదు. పాలకవర్గం నియమించి తర్వాత ప్రభుత్వం పట్టించుకోలేదు. త్వరలోనే వస్తుందని ఆశిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్దారులను కొందరు అమాయకంగా మోసం చేస్తున్నారు. ఉద్యోగుల ఆశలను తమ పెట్టుబడిగా చేసుకుని సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. ఏపీకే ఫైల్స్, వాట్సప్ సందేశాలతో మోసాలకు పాల్పడుతున్న ఘటనలు పెరిగిపోతుండడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఉద్యోగులు, పింఛన్దారులకు కేంద్ర ప్రభుత్వం కీలక హెచ్చరికలు జారీ చేసింది.
Also Read: Maha Shivaratri: మహా శివరాత్రి తర్వాతి రోజు ఏం చేయాలి? ఉపవాసం తర్వాతి రోజు ఏం తినాలి?
ఎనిమిదో వేతన సంఘంలో జీతాలు పెరుగుతాయని ఆశగా ఎదురుచూస్తున్న ఉద్యోగులు, పింఛన్దారులను సైబర్ నేరస్తులు సులువుగా మోసం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లే లక్ష్యంగా సైబర్ మోసగాళ్లు సరికొత్త మోసాలకు తెరలేపారు. 8వ వేతన సంఘం ప్రకారం జీతం ఎంత పెరుగుతుందో కచ్చితంగా అంచనా (క్యాలికులేట్) వేసి చెబుతామంటూ వాట్సప్లో సందేశాలు పంపుతున్నారు. మీకు పెరిగే జీతాన్ని అంచనా వేసి చెబుతామంటూ నేరగాళ్లు వాట్సప్లో సందేశం పెడుతూనే.. ‘8వ సీపీసీ శాలరీ కాలిక్యులేటర్’, ‘శాలరీ రివిజన్ టూల్’ పేరుతో ఏపీకే ఫైల్స్ను జత చేస్తున్నారు.
Also Read: BRS Clean Sweep: బీఆర్ఎస్ పార్టీ క్లీన్ స్వీప్.. కేసీఆర్కు గూడెం మహిపాల్ రెడ్డి గిఫ్ట్
ఆ ఏపీకే ఫైల్ను డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేయడంతో ఉద్యోగులు, పింఛన్దారులకు సంబంధించిన వివరాలు అన్నీ సైబర్ నేరస్తులకు చిక్కుతున్నారు. ఏపీకే ఫైల్స్ ఇన్స్టాల్ చేసుకున్న ఫోన్ మొత్తం సైబర్ నేరగాళ్ల ఆధీనంలోకి వెళ్తుంది. ఫోన్ యజమాని వ్యక్తిగత డేటా, బ్యాంకుల సమాచారం, ఎస్ఎంఎస్, ఓటీపీలు అన్నీ కూడా మోసగాళ్లకు చేరిపోతాయి. దీంతో ఉద్యోగులు, పింఛన్దారులకు తెలియకుండానే బ్యాంకుల నుంచి నగదు బదిలీ జరుగుతున్నాయి. తమ అకౌంట్లు ఖాళీ అవుతుండడంతో ఉద్యోగులు, పింఛన్దారులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు.
Also Read: Mahabubnagar: చరిష్మా లేని రేవంత్ రెడ్డి.. సొంత జిల్లాలో కాంగ్రెస్కు ఎన్ని స్థానాలు అంటే?
8వ వేతన సంఘం పేరిట మోసాలు పెరిగిపోతుండడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. చాలా చోట్ల పలు కేసులు నమోదవడంతోపాటు సైబర్ నేరాల నియంత్రణకు ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా ఉద్యోగులు, పింఛన్దారులకు కొన్ని ముఖ్యమైన సూచనలు ప్రభుత్వం చేసింది. కేంద్ర ప్రభుత్వం ఎట్టిపరిస్థితుల్లోనూ వాట్సాప్ ద్వారా ఎలాంటి ఏపీకే ఫైల్స్ పంపదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ కొత్త సైబర్ స్కామ్పై జాగ్రత్తగా ఉండాలంటూ కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులతోపాటు పింఛన్దారులను ప్రభుత్వం హెచ్చరించింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
3 Hindu Candidates Won In Bangladesh Elections 2026: బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో ముగ్గురు హిందూ అభ్యర్థులు గెలిచి రికార్డు కైవసం చేసుకున్నారు. ప్రస్తుతం ఉన్న బంగ్లా పరిస్థితుల్లో ఇలా హిందూవులు గెలవడం మరింత ఆసక్తిని కలిగిస్తోంది. అయితే, ఈ ముగ్గురు అభ్యర్థులు కూడా బీఎన్పీ పార్టీ తరఫున గెలిచారు. ఇక ఈ బంగ్లాదేశ్ పార్లమెంటరీ ఎన్నికలు ఇటీవల జరిగిన సంగతి తెలిసిందే. మొత్తం బీఎన్పీ పార్టీ 212 స్థానాలు గెలుచుకొని మెజారిటీ సాధించింది. ప్రధాన ప్రత్యర్థి జమాత్ ఈ ఇస్లామి కేవలం 68 సీట్లతో సరిపెట్టుకుంది.
అయితే బంగ్లాదేశ్ ఎన్నికల్లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ముగ్గురు హిందూ అభ్యర్థులు. వారు బంగ్లా సార్వత్రిక ఎన్నికల్లో గెలిచారు. ప్రత్యర్థులపై భారీ ఓట్ల తేడాతో వీరు గెలుపొందారు. వీరు ముగ్గురు బీఎన్పీ పార్టీ తరఫున ఎన్నికల్లో బరిలోకి దిగారు. ఆ ప్రాంతాల్లో గెలిచి రికార్డు బ్రేక్ చేశారు. బంగ్లాదేశ్ ఎన్నికల్లో BNP పార్టీ తరఫున బరిలోకి దిగిన గయేశ్వర్ చంద్రరాయ్ ఢాకా-3 నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ఆయన జమాత్ ఈ ఇస్లామి పార్టీ అభ్యర్థి మహమ్మద్ షాహినూర్ ఇస్లాంపై గెలుపొందారు. మొత్తంగా 15,899 ఓట్ల తేడాతో గయేశ్వర్ గెలిచారు. గతంలో రాష్ట్ర మంత్రిగా , BNP స్టాండింగ్ కమిటీ సభ్యుడుగా పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది.
తర్వాత చెప్పుకోవాల్సింది లాయర్ దీపెన్ దేవాన్ ఆయన కూడా ఈ బంగ్లాదేశ్ పార్లమెంటరీ ఎన్నికల్లో బీఎన్పీ పార్టీ తరఫు నుంచి నిలబడి గెలిచారు. ప్రధానంగా రంగమతి పార్లమెంటు సీటు నుంచి ఈయన మొత్తంగా ప్రత్యర్థిపై 9678 ఓట్ల తేడాతో గెలిచారు.
బంగ్లాదేశ్ ఎన్నికల్లో చివరగా చెప్పుకోవాల్సింది నితాయ్ చౌదరి. ఆయన కూడా మగురా 2 పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగి విజయం సాధించారు. ప్రభావంతమైన మైనారిటీ వ్యక్తిగా పరిగణిస్తా.రు మొత్తంగా 30 వేలకు పైగా ఓట్ల తేడాతో జమాత్ ఇ ఇస్లాం అభ్యర్థి ముస్తార్షిత్ బిల్లా ను ఓడించారు. ఈ ఎన్నికల్లో జమాత్ కు చెందిన ఏకైక హిందూ అభ్యర్థి మాత్రం ఓడిపోయారు. ఖుల్నా1 స్థానంలో పోటీ చేసిన కృష్ణ నంది 70 వేలకు పైగా ఓట్లు సాధించినప్పటికీ BNP అభ్యర్థి చేతిలో ఓడిపోవడం గమనార్హం.
ఇదిలా ఉండగా బంగ్లాదేశ్ ప్రజల ప్రయోజనాలు తమ విదేశాంగ విధానాన్ని నిర్ణయిస్తాయని BNP చీఫ్ తారిఖ్ రెహమాన్ అన్నారు. ఇండియాతో సంబంధాలకు సంబంధించి మీడియా అడిగిన ప్రశ్నలకు ఆయన ఈ సమాధానం ఇచ్చారు. ఈ గెలుపు బంగ్లాది.. ఇప్పుడు మనం స్వేచ్ఛను పొందాం హక్కులను అసలైన అర్ధాన్ని తిరిగి సంపాదించుకున్నాం . ప్రజాస్వామ్యం కోసం పోరాడిన వారికి ఈ విజయాన్ని అంకితం ఇస్తున్న అన్నారు..
ఇక భారత్లో ఆశ్రయం పొందుతున్న బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనాను అప్పగించమని కోరుతామని అక్కడి తాజా ఎన్నికల్లో గెలుపొందిన BNP పార్టీ ప్రకటించింది. ఇప్పటికే పలుమార్లు తమ అభ్యర్థనను భారత్కు తెలియజేసినట్లు సమాచారం. పొరుగుదేశంలో ప్రధానంగా సత్సంబంధాలు ఏర్పరచుకోవడానికి విదేశాంగ శాఖ స్థాయిలో దీని పరిష్కరిస్తామని ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందన్నారు. ఇక 2024 ఆగస్టు లో బంగ్లాదేశ్ లో జరిగిన అంతర్గత అల్లర్ల కారణంగా హసీనా భారత్ కు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత బంగ్లాలో ఐసిజే కోర్టు ఆమెకు మరణశిక్ష కూడా విధించింది.
Also Read: 'ప్రగతిశీల బంగ్లాదేశ్కు అండగా నిలుస్తాం'.. తారిక్ చారిత్రాత్మక విజయంపై ప్రధాని మోదీ అభినందనలు..!
Also Read: ప్రపంచంలోనే అతిచిన్న 10 దేశాలు.. మ్యాప్లో వెతికినా కనిపించవు..! కాలినడకనే చుట్టేయొచ్చు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.
Nara Lokesh On Kova Bun Incident: కర్నూలుకు చెందిన 'కోవా బన్' వ్యాపారి షేక్ వలీకి జరిగిన అవమానంపై ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పందించారు. సోషల్ మీడియా వేదికగా వలీకి అండగా నిలుస్తామని హామీ ఇవ్వడమే కాకుండా, త్వరలోనే ఆయనను వ్యక్తిగతంగా కలుస్తానని ప్రకటించారు. కర్నూలులో కోవా బన్ విక్రయించే వలీపై కొందరు వ్యక్తులు తప్పుడు ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంపై మంత్రి లోకేష్ తీవ్రంగా స్పందించారు.
మంత్రి లోకేష్ తన 'ఎక్స్' (ట్విట్టర్) ఖాతాలో వలీకి మద్దతుగా పోస్ట్ చేస్తూ కింది విషయాలను పంచుకున్నారు. చిరు వ్యాపారి వలీపై జరిగిన ఆరోపణలు తనను కలచివేశాయని, ఆయనకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని స్పష్టం చేశారు. వలీ తయారు చేసే ప్రసిద్ధ 'కోవా బన్' రుచి చూసేందుకు తాను చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. కర్నూలు పర్యటనలో భాగంగా లేదా అమరావతిలో వలీని త్వరలోనే కలుస్తానని లోకేష్ పేర్కొన్నారు.
ఐక్యతకు భంగం కలిగిస్తే సహించేది లేదు
సమాజంలో మత సామరస్యాన్ని లేదా ఐక్యతను దెబ్బతీసే విధంగా ప్రవర్తించే వారిపై లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అకారణంగా ఒక వ్యక్తిని లక్ష్యంగా చేసుకుని దుష్ప్రచారం చేయడం సరికాదని హితవు పలికారు. ఇలాంటి ప్రవర్తనకు సభ్య సమాజంలో స్థానం లేదని ఆయన కుండబద్దలు కొట్టారు.
ఏం జరిగిందంటే?
కొద్దిరోజుల క్రితం కర్నూలులో కోవా బన్ విక్రయించే వలీ వ్యాపారంపై కొందరు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేశారు. దీనివల్ల ఆయన వ్యాపారం దెబ్బతినడమే కాకుండా మానసిక వేదనకు గురయ్యారు. ఈ విషయం మంత్రి లోకేష్ దృష్టికి రావడంతో ఆయన సానుకూలంగా స్పందించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Maha shivratri Deeksha Dos And Donts: పరమశివుడి కోసం మహాశివరాత్రి రోజు చేసే ఉపవాస దీక్ష అత్యంత నియమ నిష్టతో చేయాల్సి ఉంది. ఒకపొద్దును పవిత్రంగా చేసి భగవన్నామస్మరణలో మునగాలి. ఉపవాసం రోజంతా దైవ చింతనలో మునగాలి. ఉపవాసం సాయంత్రం ఫలహారంతో విరమించాలి. తర్వాతి రోజు అంటే మహా శివరాత్రి తర్వాతి రోజు ఉపవాసం చేసిన వారు ఎలా ఉండాలనేది ఒక పద్దతి ఉంది. మహా శివరాత్రి తర్వాతి రోజు కూడా చాలా పద్ధతిగా ఉండాలి. ఉపవాసం విరమించామని ఎలా పడితే అలా ఉండరాదు. ఆ రోజు కూడా నియమ నిష్టతో ఉండాలి. మహాశివరాత్రిని పద్ధతిగా చేయాల్సి ఉంటుంది. అలా చేయనివారు మహాశివరాత్రికి ఉపవాసం, జాగరణ వంటివి చేయరాదు.
ఉపవాసం విరమించిన తర్వాతి రోజు ఆహారం మితంగా తినాలి. ఉపవాసం ఉన్నాం కదా అని తర్వాతి రోజు ఇష్టానుసారంగా తినరాదు. అలా చేస్తే అనారోగ్యానికి గురవుతారు. వాంతులు, విరేచనాలు అయ్యే ఆస్కారం ఉంది. ఉపవాసం ఉన్నవారు సాత్విక ఆహారం తీసుకోవాలి. అంటే పాలన్నం.. దద్దోజనం (పెరుగన్నం) వంటి సాత్విక ఆహారం తీసుకోవాలి. నూనె, ఉప్పు, కారం అధికంగా ఉన్న ఆహారాన్ని తినరాదు. వీటికి దూరంగా ఉంటే మంచిది. రోజంతా ఉపవాసం ఉన్నవారు తర్వాత ఉప్పు, కారాలతో కూడిన ఆహారం తీసుకుంటే కడుపు ఉబ్బరం, అజీర్తి వంటి సమస్యలు రావొచ్చు. ఇక మాంసాహారం.. మద్యం, ధూమపానం వంటి జోలికి వెళ్లరాదు. తమ పనులు చేసుకుంటే శివరాధన చేయాలి.
Also Read: Mahabubnagar: చరిష్మా లేని రేవంత్ రెడ్డి.. సొంత జిల్లాలో కాంగ్రెస్కు ఎన్ని స్థానాలు అంటే?
ఇలా జాగరణ చేయరాదు
మహాశివరాత్రి రోజు తప్పనిసరిగా జాగరణ చేస్తారు. ఉపవాసం చేసేవారితోపాటు ఇతర భక్తులు కూడా జాగరణ చేయవచ్చు. ఉదయం ఆరు గంటల వరకు జాగరణ చేయాల్సి ఉంటుంది. అయితే జాగరణను ఎలా పడితే అలా చేస్తే ప్రతిఫలం లభించదు. జాగరణ పేరిట రాత్రిళ్లు విచ్చలవిడిగా తిరగడం చేయరాదు. సినిమాలు, ఆటలు వంటి చేయరాదు. ఒకవేళ సినిమాలు చూస్తే భక్తికి సంబంధించినవై ఉండాలి. జాగరణ అంటే భగవంతుడిని స్మరించడమే. తెల్లవార్లు మెలకువతో శివరాధన చేస్తే జాగరణకు ప్రతిఫలం లభిస్తుంది.
Also Read: KTR: మున్సిపల్ ఫలితాలతో సంతృప్తి చెందాం.. 2029లో కేసీఆర్ సీఎం కావడం పక్కా: కేటీఆర్
ఎన్నో ప్రయోజనాలు
మహా శివరాత్రి ఆధ్యాత్మికంగా ఎంత పవిత్రమైనది.. విశిష్టమైనదో.. ఆరోగ్యకరంగా.. మానసికపరంగా అంతే ముఖ్యమైనది. మహాశివరాత్రి రోజు ఉపవాసం ఒక్కటే కాదు భగవంతుడి నామస్మరణ చేయడం.. నిష్టగా ఉండడం.. జాగరణ చేయడం వంటి వాటి వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఆహారం అంటే అమితంగా ఇష్టపడే వారు ఉపవాసం ఉంటే కొంత నోటికి తాళం వేసిన వారవుతారు. అంతేకాకుండా తినకుండా కూడా ఉండగలమనే ఒక నమ్మకం ఏర్పడుతుంది. ఆహారం వృథా చేసేవారు ఆకలి విలువ తెలియదు. శివరాత్రి ఉపవాసం ఉంటే ఆకలి విలువ తెలియడంతో పాటు ఆహారాన్ని వృథా చేయరు. ఇకపై పద్ధతిగా తింటారు. శివరాత్రి రోజు చేసే కఠిన ఉపవాస దీక్షతో ఇంద్రియాలను నియంత్రించుకుంటారు. ఇంద్రియాలను నియంత్రించుకుంటే మన శరీరం మన ఆధీనంలో ఉంటుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Realme Pad 3 5g Price Cut: ఎప్పటినుంచో మంచి టాబ్లెట్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే, మీకు సమయం రానే వచ్చేసింది.. ఇటీవల ప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీ కంపెనీ రియల్ మీ విడుదల చేసిన రియల్ మీ పాడ్ 3 (Realme Pad 3)టాబ్లెట్ అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్స్తో అందుబాటులోకి వచ్చింది. ఇది ప్రీమియం ఫీచర్స్ తో పాటు అద్భుతమైన కెమెరా సెటప్ ను కలిగి ఉంది. ముఖ్యంగా అద్భుతమైన ఆపరేటింగ్ సిస్టంపై రన్ అవుతుంది. అయితే, ఈ టాబ్లెట్కు సంబంధించిన పూర్తి వివరాలు, ఇది ఏయే డిస్కౌంట్ ఆఫర్స్తో లభిస్తుందో? ఇప్పుడు మనం తెలుసుకుందాం..
రియల్ మీ ప్యాడ్ 3 (Realme Pad 3) అద్భుతమైన ఫీచర్లతో అందుబాటులోకి వచ్చింది. దీనిని కంపెనీ 11.61 అంగుళాల 2.8K LCD డిస్ప్లేతో విడుదల చేసింది. అంతేకాకుండా 120Hz రిఫ్రెష్ రేట్, 550 నిట్స్ బ్రైట్నెస్తో లభిస్తోంది. ఇక ఇది ఎంతో శక్తివంతమైన మీడియాటెక్ డైమెన్సిటీ 7300-మ్యాక్స్ (MediaTek Dimensity 7300-Max) ప్రాసెసర్ పై రన్ అవుతోంది. అలాగే 8 జిబి ర్యామ్, 128 GB, 256 జిబి స్టోరేజ్ ఆప్షన్స్లో అందుబాటులోకి వచ్చింది. అంతేకాకుండా ఇది ప్రస్తుతం మార్కెట్లో వివిధ వేరియంట్లలో అందుబాటులో ఉంది.
ఈ (Realme Pad 3)టాబ్లెట్కు సంబంధించిన బ్యాటరీ వివరాల్లోకి వెళితే.. ఇది ఎంతో శక్తివంతమైన 12,200mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. అంతేకాకుండా చార్జ్ చేసేందుకు ప్రత్యేకంగా 45W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు కూడా లభిస్తుంది. అలాగే అదనంగా దీనికి కంపెనీ 6.5W రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ ను కూడా అందిస్తోంది. ఇక ఈ టాబ్లెట్కు సంబంధించిన వెనక భాగం వివరాల్లోకి వెళ్తే.. ఇది ఎంతో శక్తివంతమైన 8MP కెమెరా బ్యాక్ ప్రధాన కెమెరాను కలిగి ఉంటుంది. అంతేకాకుండా వీడియో కాల్స్ కోసం ఫ్రంట్ భాగంలో 8MP కెమెరా కూడా అందుబాటులో ఉంది. ఈ టాబ్లెట్ ఆండ్రాయిడ్ 16 (Android 16) ఆధారిత realme UI 7.0 ఆపరేటింగ్ సిస్టంపై రన్ అవుతుంది. ఇందులో కంపెనీ డాల్బీ అట్మోస్ సపోర్టుతో కూడిన క్వాడ్ (4) స్పీకర్లు సౌండ్ సెటప్ ను కూడా అందిస్తోంది..
ప్రస్తుతం మార్కెట్లో ఈ టాబ్లెట్ మొత్తం మూడు స్టోరేజ్ ఆప్షన్స్ లో అందుబాటులో ఉంది. ఇందులో నీ మొదటి స్టోరేజ్ ఆప్షన్ 8 జిబి ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్.. దీని ధర రూ.26,999 నుంచి ప్రారంభమవుతుంది. ఇక రెండవది సేమ్ ఇదే స్టోరేజ్ వేరియంట్ కానీ.. ఇది వైఫైతో పాటు 5G సపోర్టుతో అందుబాటులోకి వచ్చింది. ఇది మార్కెట్లో ధర రూ.29,999 నుంచి ప్రారంభమవుతుంది. ఇక ఇందులోనే 256 జిబి వేరియంట్ రూ.31,999తో లభిస్తోంది. అయితే, అత్యంత తగ్గింపు ధరకే కొనుగోలు చేయాలనుకునేవారు.. బ్యాంకు డిస్కౌంట్ ఆఫర్స్ వినియోగించాల్సి ఉంటుంది.. కెనరా బ్యాంకుకు సంబంధించిన క్రెడిట్ కార్డు వినియోగించి పేమెంట్ చేస్తే.. ఏకంగా దీనిపై రూ.2 వేల వరకు తగ్గింపు లభిస్తుంది.
Also Read: Redmi 14C 5G Offer: రెడ్మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్ఫోన్..అదిరిపోయే ఆఫర్!
అలాగే ఈ స్మార్ట్ (Realme Pad 3) ట్యాబ్ను ఫ్లిప్కార్ట్ అనుసంధాన యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో పాటు ఎస్బిఐ బ్యాంకు క్రెడిట్ కార్డులను వినియోగించి పేమెంట్ చేస్తే రూ.1,489 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. అంతేకాకుండా దీనిపై ఎక్స్చేంజ్ బోనస్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. ఈ ఆఫర్లో భాగంగా ఏదైనా స్మార్ట్ ఫోన్ లేదా యాపిల్ బ్రాండ్, సాంసంగ్ బ్రాండ్లకు సంబంధించిన టాబ్లెట్లను ఎక్స్చేంజ్ చేస్తే ఏకంగా రూ.27,250 వరకు బోనస్ లభిస్తుంది. దీంతో ఈ ఆఫర్స్ అన్నీ పోను.. ఈ కొత్త ట్యాబ్ కేవలం రూ.3 వేల లోపే పొందవచ్చు.
Also Read: Redmi 14C 5G Offer: రెడ్మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్ఫోన్..అదిరిపోయే ఆఫర్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
India Vs Pakistan Match Weather Forecast: క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్ - పాకిస్థాన్ మ్యాచ్కు సమయం ఆసన్నమైంది. కానీ, ప్రస్తుతం కొలంబోలో నెలకొన్న వాతావరణం ఫ్యాన్స్ను ఆందోళనకు గురిచేస్తోంది. నేడు అనగా ఫిబ్రవరి 15 సాయంత్రం జరగాల్సిన ఈ హై-వోల్టేజ్ పోరుపై వరుణుడి ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.
తాజా వెదర్ రిపోర్ట్
ప్రారంభ అంచనాలతో పోలిస్తే.. ప్రస్తుత రిపోర్ట్స్ క్రికెట్ ప్రేమికులకు కొంత ఊరటనిస్తున్నాయి. సాయంత్రం 6 గంటలకు వర్షం పడే అవకాశం 51% గా ఉంది. దీనివల్ల టాస్ వేయడంలో ఆలస్యం జరగవచ్చు. అయితే రాత్రి 7 గంటలకు (మ్యాచ్ ప్రారంభ సమయం) మాత్రం వర్షం ముప్పు 40% కి తగ్గే అవకాశం ఉంది. ఆ తర్వాత రాత్రి 8:30 గంటల సమయానికి వర్షం పడే సూచనలు కేవలం 27% మాత్రమే ఉన్నాయి. రాత్రి 9 గంటల తర్వాత ఆకాశం క్లియర్ అయ్యే అవకాశం కనిపిస్తోంది.
వాతావరణ పరిస్థితులను బట్టి నిపుణులు కింది అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. వర్షం వల్ల మ్యాచ్ ఆలస్యమైతే ఓవర్ల సంఖ్యను తగ్గించే అవకాశం ఉంది. మ్యాచ్ ఫలితం తేలాలంటే డక్వర్త్ లూయిస్ (DLS) పద్ధతి ప్రకారం ఇరు జట్లు కనీసం 5 ఓవర్ల పాటు ఆడాల్సి ఉంటుంది. ప్రేమదాస స్టేడియంలో అత్యాధునిక డ్రైనేజీ వ్యవస్థ ఉంది. వర్షం ఆగిపోయిన కొద్ది నిమిషాల్లోనే గ్రౌండ్ను సిద్ధం చేసే సదుపాయం ఉండటం ప్లస్ పాయింట్.
అభిమానుల ఆందోళన
ఈ మ్యాచ్ ఫిబ్రవరి 15, ఆదివారం కావడంతో ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది టీవీల ముందు కూర్చోవడానికి సిద్ధమయ్యారు. ముఖ్యంగా అభిషేక్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్ వంటి స్టార్ ఆటగాళ్ల ప్రదర్శన చూడాలని ఆరాటపడుతున్న ఫ్యాన్స్కు వరుణుడు అడ్డుపడకూడదని కోరుకుంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల ప్రకారం మ్యాచ్ పూర్తిగా రద్దయ్యే అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయి.
కొలంబో వాతావరణం క్షణక్షణం మారిపోతుంటుంది. వర్షం వల్ల కొద్దిసేపు ఆట ఆగినా, రాత్రికి పూర్తి స్థాయి లేదా కుదించిన ఓవర్లతోనైనా ఫలితం వస్తుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Motorola Edge 60 Fusion Price Cut: ఎప్పటినుంచో మోటరోలా బ్రాండ్కి సంబంధించిన మంచి మొబైల్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? మీకు అవకాశం రానే వచ్చేసింది.. ప్రముఖ మోటరోలా సంస్థ ఇటీవల మార్కెట్లోకి విడుదల చేసిన మోటరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ (Motorola Edge 60 Fusion) స్మార్ట్ఫోన్ అత్యంత తక్కువ ధరలోనే ఫ్లిప్కార్ట్లో అందుబాటులో ఉంది. ఇది ఎన్నో రకాల అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ప్రీమియం కెమెరా సెటప్తో లాంచ్ అయింది. అయితే, ఈ స్మార్ట్ఫోన్పై ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆఫర్స్ వివరాలు ఏంటో? ఇది ఏయే ఫీచర్లతో లభిస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
మోటోరోలా Edge 60 Fusion 5G స్మార్ట్ ఫోన్ 6.67 అంగుళాల 1.5K ఆల్-కర్వ్డ్ P-OLED డిస్ప్లేను కలిగి ఉంటుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్తో అందుబాటులోకి వచ్చింది. దీంతోపాటు డిస్ప్లే రక్షణ కోసం కంపెనీ Corning Gorilla Glass 7i ప్రొటెక్షన్ కూడా అందిస్తోంది..
ఈ మోటోరోలా Edge 60 Fusion మొబైల్ ఎంతో శక్తివంతమైన MediaTek Dimensity 7400 (4nm) చిప్సెట్ ప్రాసెసర్ పై లాంచ్ అవుతుంది. దీంతోపాటు వెనక భాగంలో అద్భుతమైన Sony LYT-700C సెన్సార్, OIS సపోర్ట్తో 50MP మెయిన్ కెమెరా లభిస్తోంది. దీంతోపాటు 13MP అల్ట్రావైడ్ కెమెరాను కలిగి ఉంటుంది. ఇక ఫ్రంట్ భాగంలో వీడియో కాలింగ్ కోసం కంపెనీ 32MP కెమెరా కెమెరాను కూడా అందిస్తోంది. ఇది చాలా ప్రత్యేకమైన ఫోర్ కే రికార్డింగ్ సపోర్టును కూడా కలిగి ఉంటుంది. ఇక ఈ Motorola Edge 60 Fusion మొబైల్ ఎంతో శక్తివంతమైన 5500 mAh భారీ బ్యాటరీ, ఇది 68W టర్బో చార్జింగ్ సపోర్ట్తో లాంచ్ అయింది.
ఈ మోటోరోలా Edge 60 Fusion మొబైల్ చాలా అద్భుతమైన ఆండ్రాయిడ్ 15 (Android 15) ఆధారిత ఆపరేటింగ్ సిస్టంపై రన్ అవుతుంది. మూడేళ్ల పాటు ఆండ్రాయిడ్ అప్డేట్స్తో పాటు నాలుగేళ్ల పాటు ప్రత్యేకమైన సెక్యూరిటీ అప్డేట్స్ అందిస్తోంది. ఇక మార్కెట్లో ఇది వివిధ స్టోరేజ్ ఆప్షన్స్లో అందుబాటులో ఉంది. ముఖ్యంగా 8gb ర్యామ్, 256gb ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన వేరియంట్ రూ.22 వేలలోపు లభిస్తుంది. 12gb ర్యామ్ 256 జిబి ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన వేరియంట్ రూ.24 వేల లోపు అందుబాటులో ఉంది.
Also Read: Redmi 14C 5G Offer: రెడ్మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్ఫోన్..అదిరిపోయే ఆఫర్!
ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్లో భాగంగా ఈ రోజే కొనుగోలు చేయాలనుకునే వారికి బేస్ వేరియంట్పై అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. ఇది మార్కెట్లో రూ.24,999 కాగా.. 16 శాతం తగ్గింపుతో కేవలం రూ.20,999కే అందుబాటులో ఉంది. దీంతోపాటు ఫ్లిప్కార్ట్ అనుసంధాన యాక్సిస్ బ్యాంకు ఒక క్రెడిట్ కార్డు వినియోగించి పేమెంట్ చేస్తే రూ. 2 వేల వరకు తగ్గింపు లభిస్తుంది. అలాగే సాధారణ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో పాటు ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, ఫ్లిప్కార్ట్ అనుసంధాన ఎస్బిఐ బ్యాంకు క్రెడిట్ కార్డులను వినియోగించి పేమెంట్ చేస్తే రూ.1,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఇక ఎక్స్చేంజ్ బోనస్ వినియోగించాలనుకునేవారు ఏదైనా స్మార్ట్ఫోన్ ఎక్స్చేంజ్ చేస్తే రూ.19 వేల వరకు బోనస్ లభిస్తుంది. దీంతో ఈ మోటోరోలా Edge 60 Fusion మొబైల్ కేవలం రూ.1,999 లోపే పొందవచ్చు..
Also Read: Redmi 14C 5G Offer: రెడ్మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్ఫోన్..అదిరిపోయే ఆఫర్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Side Effects of Watermelon: వేసవి కాలంలో పుచ్చకాయ ఒక అద్భుతమైన వరప్రసాదం. శరీరానికి చల్లదనాన్ని ఇస్తూ, దాహాన్ని తీర్చే ఈ పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే, కొన్ని రకాల అనారోగ్య సమస్యలు ఉన్నవారికి పుచ్చకాయ అమృతంలా కాకుండా విషంలా మారే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. పుచ్చకాయలో 90 శాతం నీరు, విటమిన్ ఎ, సి, బి6, ఫైబర్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అయినప్పటికీ, కింది సమస్యలు ఉన్నవారు దీనిని పరిమితంగానే తీసుకోవాలి.
మధుమేహం
పుచ్చకాయలో సహజ చక్కెరలు ఎక్కువగా ఉంటాయి. దీని గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా ఎక్కువే. డయాబెటిస్ ఉన్నవారు దీనిని అధికంగా తింటే రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి వైద్యుల సలహా మేరకు స్వల్ప పరిమాణంలోనే తీసుకోవాలి.
జీర్ణకోశ సమస్యలు
పుచ్చకాయలో 'లైకోపీన్' అనే పదార్థం ఉంటుంది. ఇది గుండెకు మంచిదే అయినప్పటికీ, అధికంగా తీసుకుంటే గ్యాస్, కడుపు ఉబ్బరం, విరేచనాలు వంటి సమస్యలు రావచ్చు. సున్నితమైన జీర్ణవ్యవస్థ ఉన్నవారు దీనిని మితంగా తినాలి.
కిడ్నీ సమస్యలు
పుచ్చకాయలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. సాధారణంగా ఇది గుండెకు మంచిదే, కానీ కిడ్నీ సమస్యలు ఉన్నవారికి ఇది ప్రమాదకరం. రక్తంలో పొటాషియం స్థాయిలు పెరిగితే గుండె లయ తప్పడం, కండరాల బలహీనత వంటి సమస్యలు తలెత్తవచ్చు.
ఎలక్ట్రోలైట్ అసమతుల్యత
అతిగా పుచ్చకాయ తినడం వల్ల శరీరంలో నీటి శాతం విపరీతంగా పెరిగి, సోడియం స్థాయిలు తగ్గిపోతాయి. దీనిని 'వాటర్ ఇంటాక్సికేషన్' అని పిలుస్తారు. దీనివల్ల కాళ్లలో వాపులు, అలసట, మెదడుపై ప్రభావం పడే అవకాశం ఉంది.
పుచ్చకాయ తినేటప్పుడు పాటించాల్సిన జాగ్రత్తలు..
1) రాత్రి సమయంలో పుచ్చకాయ తింటే జీర్ణక్రియ మందగిస్తుంది. తరచుగా మూత్ర విసర్జన జరగడం వల్ల నిద్రకు భంగం కలుగుతుంది.
2) కొంతమందికి ఖాళీ కడుపుతో పుచ్చకాయ తింటే ఎసిడిటీ వచ్చే అవకాశం ఉంది.
3) రోజుకు 200 నుండి 300 గ్రాముల కంటే ఎక్కువ తీసుకోకపోవడం ఉత్తమం.
గమనిక: పుచ్చకాయ ఆరోగ్యకరమైన పండే అయినప్పటికీ, పైన పేర్కొన్న ఆరోగ్య సమస్యలు ఉన్నవారు, గర్భిణీలు తమ ఆహారంలో దీనిని చేర్చుకునే ముందు పోషకాహార నిపుణులను సంప్రదించడం మంచిది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Indian Gold Or Dubai Gold Which Is Better: దుబాయ్ అనగానే గుర్తొచ్చేది ఆకాశహర్మ్యాలు, మెరిసిపోయే బంగారం. భారత్తో పోలిస్తే అక్కడ పసిడి ధర తక్కువని, నాణ్యత అధికమని చాలా మంది ప్రయాణికులు దుబాయ్లో బంగారం కొనేందుకు ఆరాటపడుతుంటారు. అయితే, కస్టమ్స్ నిబంధనలు, పన్నుల లెక్కలు తెలియకుండా బంగారం కొంటే లాభం కంటే నష్టమే ఎక్కువ జరిగే అవకాశం ఉంది.
భారతదేశం కంటే దుబాయ్లో బంగారం చౌకగా ఉండటానికి ప్రధాన కారణం అక్కడి పన్ను విధానం. కానీ, దానిని భారత్కు తీసుకువచ్చేటప్పుడు ఉండే నిబంధనలు చాలా కఠినంగా ఉంటాయి.
దుబాయ్లో ధర ఎందుకు తక్కువ?
భారత్లో బంగారంపై దిగుమతి సుంకం, జీఎస్టీ కలిపి పన్ను భారం ఎక్కువగా ఉంటుంది. దుబాయ్లో దిగుమతి సుంకాలు తక్కువగా ఉండటం, తయారీ ఖర్చులు తక్కువగా ఉండటంతో అక్కడ గ్రాముపై భారత్ కంటే రూ.300 నుండి రూ.500 వరకు వ్యత్యాసం ఉండే అవకాశం ఉంది.
ఎంత బంగారం తీసుకురావచ్చు?
విదేశాల నుండి వచ్చే భారతీయులకు కస్టమ్స్ శాఖ నిర్దిష్ట పరిమితులను విధించింది. ఈ రాయితీలు మీరు కనీసం ఒక సంవత్సరం విదేశాల్లో నివసిస్తేనే వర్తిస్తాయి. మహిళలు గరిష్టంగా 40 గ్రాముల వరకు (విలువ రూ.1 లక్ష లోపు) పన్ను లేకుండా తీసుకురావచ్చు. అలాగే పురుషులు గరిష్టంగా 20 గ్రాముల వరకు (విలువ రూ.50 వేల లోపు) పన్ను లేకుండా బంగారాన్ని స్వదేశానికి తెచ్చుకోవచ్చు. ఏడాది కంటే తక్కువ వయసున్న చిన్నారులకు ఎక్కువ కాలం విదేశాల్లో ఉంటే ఈ రాయితీ వర్తిస్తుంది.
ఆభరణాలు vs బిస్కెట్లు: తేడా ఏంటి?
చాలా మంది చేసే తప్పు ఇక్కడే ఉంది. పైన చెప్పిన పన్ను మినహాయింపులు కేవలం బంగారు ఆభరణాలకు మాత్రమే వర్తిస్తాయి. మీరు కాయిన్స్ లేదా బిస్కెట్లు తీసుకువస్తే, మొదటి గ్రాము నుండే పన్ను చెల్లించాల్సి ఉంటుంది. పరిమితికి మించి తెచ్చే బంగారంపై సుమారు 12.5% నుండి 15% వరకు కస్టమ్స్ డ్యూటీ చెల్లించాల్సి రావచ్చు. అప్పుడు దుబాయ్ బంగారం ధర, భారత్ ధరతో సమానమవుతుంది.
మీ వద్ద పరిమితికి మించి బంగారం ఉంటే ఎయిర్పోర్టులోని 'రెడ్ ఛానల్' వద్ద అధికారులకు స్వచ్ఛందంగా తెలియజేయాలి. కొనుగోలు చేసిన దుకాణం నుండి ఒరిజినల్ బిల్లులను తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలి. ఒకవేళ అధికారులకు చెప్పకుండా దాచి తీసుకువస్తూ పట్టుబడితే, భారీ జరిమానాతో పాటు సెక్షన్ 135 కింద జైలు శిక్ష పడే ప్రమాదం ఉంది.
అక్కడ కొనడం లాభమేనా?
మీరు పరిమితికి లోబడి (మహిళలైతే 40గ్రా, పురుషులైతే 20గ్రా) కొనుగోలు చేస్తే దుబాయ్ బంగారం కచ్చితంగా లాభదాయకమే. కానీ, భారీ మొత్తంలో కొని పన్నులు చెల్లిస్తే.. ప్రయాణ ఖర్చులు, పన్నులు కలిపి భారత్లో కొన్న ధరకే సమానమవుతుంది. కాబట్టి, లెక్కలు చూసుకుని కొనుగోలు చేయడం ఉత్తమం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook