లోటస్ పాఠశాలలో ఘనంగా శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Atal Pension Yojana: అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కోట్లాది మంది కార్మికులకు కేంద్ర ప్రభుత్వం మరోసారి శుభవార్త చెప్పింది. నెలవారీ పెన్షన్ అందించే ఉద్దేశంతో అమల్లో ఉన్న అటల్ పెన్షన్ యోజన (APY)ను మరికొన్ని సంవత్సరాలు కొనసాగించాలని నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రస్తుతం నెలకు గరిష్ఠంగా రూ.5,000 వరకు పెన్షన్ అందించే ఈ పథకాన్ని మరో ఐదు సంవత్సరాల పాటు, అంటే 2030–31 ఆర్థిక సంవత్సరం వరకు పొడిగించేందుకు బుధవారం జరిగిన కేబినెట్ సమావేశంలో పచ్చజెండా ఊపారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అటల్ పెన్షన్ యోజనకు మరింత విస్తృత ప్రచారం కల్పించాలనే అంశంపై కూడా చర్చించారు. గ్రామీణ ప్రాంతాలు, పట్టణాల అంచుల్లో పనిచేస్తున్న అసంఘటిత కార్మికుల వరకు ఈ పథకం చేరేలా చర్యలు తీసుకోవాలని, అవసరమైన నిధులు కేటాయించాలని కేంద్రం నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం 2026 జనవరి 19 నాటికి ఈ పథకంలో మొత్తం 8.66 కోట్ల మంది సభ్యులుగా ఉన్నారు. ఇంకా ఎక్కువ మందిని ఈ సామాజిక భద్రతా పథకంలోకి తీసుకురావాలనే లక్ష్యంతోనే గడువును పొడిగించినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.
సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ అనంతరం పెన్షన్ పొందుతూ ఆర్థిక భద్రతతో జీవితం కొనసాగిస్తారు. అయితే అసంఘటిత రంగ కార్మికులకు అలాంటి భరోసా ఉండదు. ఈ లోటును తీర్చాలనే ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం 2015లో అటల్ పెన్షన్ యోజనను ప్రారంభించింది. ఈ పథకం ద్వారా 60 ఏళ్లు దాటిన తర్వాత సభ్యులకు నెలకు కనీసం రూ.1,000 నుంచి గరిష్ఠంగా రూ.5,000 వరకు పెన్షన్ అందుతుంది.
18 నుంచి 40 సంవత్సరాల వయసు మధ్య ఉన్నవారు ఈ పథకంలో చేరేందుకు అర్హులు. వారు తమకు కావాల్సిన పెన్షన్ మొత్తాన్ని ముందుగానే ఎంచుకోవచ్చు. దానికి అనుగుణంగా ప్రతి నెలా ఒక నిర్దిష్ట మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. ఈ పథకాన్ని పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (PFRDA) పర్యవేక్షిస్తుంది. అటల్ పెన్షన్ యోజనలో చేరాలంటే పోస్టాఫీస్ లేదా ఏదైనా ప్రభుత్వ బ్యాంకులో పొదుపు ఖాతా తప్పనిసరిగా ఉండాలి.
అయితే నేషనల్ పెన్షన్ స్కీమ్ (NPS) పరిధిలోకి వచ్చే వారు, అలాగే ఆదాయపు పన్ను చెల్లించే వ్యక్తులు ఈ పథకంలో చేరేందుకు అర్హులు కారు. 18 ఏళ్ల వయసులోనే ఈ స్కీమ్లో చేరిన వారు నెలకు సుమారు రూ.42 నుంచి గరిష్ఠంగా రూ.210 వరకు చెల్లించాలి. అదే 40 ఏళ్ల వయసులో చేరితే, వచ్చే 20 ఏళ్ల పాటు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. అప్పుడు నెలవారీ చెల్లింపు రూ.291 నుంచి రూ.1,454 వరకు ఉండొచ్చు.
ఈ పథకంలో సభ్యులైన వారు తమ బ్యాంక్ ఖాతాను అటల్ పెన్షన్ యోజనకు లింక్ చేసి, ప్రతి నెలా ఆటో డెబిట్ అయ్యేలా బ్యాంకుకు అనుమతి ఇవ్వాలి. అందువల్ల ఖాతాలో సరిపడా బ్యాలెన్స్ ఉండేలా జాగ్రత్త పడాలి. ఖాతాలో డబ్బు లేకపోతే పెనాల్టీ విధించే అవకాశం కూడా ఉంటుంది. మొత్తంగా చూస్తే, అసంఘటిత రంగ కార్మికులకు వృద్ధాప్యంలో ఆర్థిక భద్రత కల్పించే దిశగా అటల్ పెన్షన్ యోజన కీలక పాత్ర పోషిస్తోందని చెప్పవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
KTR Counter Reaction on Kavitha: గత కొన్నేళ్లుగా ఉప్పు నిప్పుగా ఉన్నారు కవిత, కేటీఆర్. అంతేకాదు కవిత కూడా తన అన్న పై రెచ్చిపోయినా.. కేటీఆర్ మాత్రం ఇంత వరకు స్పందించలేదు. కానీ తన చెల్లి మాటలపై కల్వకుంట్ల తారక రామారావు తాజాగా స్పందించారు. గతంలో ఎవర్నీ కలవని కేటీఆర్.. ప్రస్తుతం సర్పంచ్ లను కూడా కలుస్తున్నారంటూ కవిత విమర్శలు గుప్పించారు. దీనికి కేటీఆర్ ఘాటుగా స్పందించారు.
సర్పంచులను కలవడం కొత్తేమీ కాదనీ.... తెలంగాణ భవన్ కు వచ్చిన అందరినీ గతంలో కలిశాం, ఇప్పుడూ కలుస్తానని కేటీఆర్ తేల్చి చెప్పారు. బీఆర్ఎస్ నుంచి బయటకొచ్చిన కవిత సొంత పార్టీపై విమర్శలు చేస్తున్న నేపథ్యంలో అంతే ఘాటుగా కౌంటర్ ఇవ్వాలని గులాబీ పార్టీ హైకమాండ్ భావిస్తున్నట్లు చర్చ జరుగుతోంది.
Read more: సమంత కంటే ముందు రెండో పెళ్లి చేసుకున్న హీరోయిన్స్ వీళ్లే..! పూర్తి లిస్ట్ ఇదే..!
Read more: సమంత బాటలో దర్శకులను పెళ్లి చేసుకున్న హీరోయిన్స్ వీళ్లే..
కవిత గత కొన్నిరోజులుగా బీఆర్ఎస్ పార్టీపై కాంగ్రెస్ పార్టీ కూడా చేయని తీవ్రాతి తీవ్ర ఆరోపణలు చేశారు. అంతేకాదు కేసీఆర్ వంటి దేవుడు చుట్టూ కేటీఆర్, హరీష్ రావు వంటి దెయ్యాలు చేరాయని చెప్పుకొచ్చారు. అంతేకాదు పార్టీని వాళ్లిద్దరే నియంత్రణలోకి తీసుకొని మిగతా వాళ్లను తొక్కేస్తున్నారంటూ తీవ్రాతి తీవ్రమైన విమర్శలు చేశారు. అంతేకాదు ఆ పార్టీకి చెందిన లీడర్లను కూడా ఏదో కుంభకోణంతో లింకులు ఉన్నాయంటూ పలు ప్రెస్ మీట్స్ నిర్వహించిన సంగతి తెలిసిందే కదా. ఇక లిక్కర్ కుంభకోణంలో అప్పట్లో కవిత అరెస్ట్ సమయంలో పార్టీ తనకు అండగా నిలబడలేదనే కారణంగా కవిత.. ఈ ఆరోపణలు చేస్తున్నారంటూ ఆ పార్టీకి చెందిన నేతలు ఆరోపణలు చేస్తున్నారు. ఏది వీళ్లిద్దరు ఎవరు చెప్పేది నిజం అనేది ప్రజలే తేలుస్తారనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి.
Also Read: వెయ్యి కోట్ల దర్శకులు.. ‘దురంధర్’తో ఈ క్లబ్బులో ఎంట్రీ ఇచ్చిన ఆదిత్యధర్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.
Nandyal Bus Fire Accident: తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లోని ప్రజలు బస్సుల్లో ప్రయాణించాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రభుత్వ, ప్రైవేటు అనే తేడా లేకుండా అన్ని బస్సుల్లో ఇదే తరహా ఘటనలు గత కొన్ని రోజులుగా ఓ సిరీస్ లా తెలుగు రాష్ట్రాల ప్రజలను నిద్ర లేకుండా చేస్తున్నాయి. బస్సుల్లో ప్రయాణించాలంటే వణికిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. రీసెంట్ గా కర్నూలు, చేవేళ్ల విజయవాడ ఇలా చెప్పుకుంటూ కొండవీటి చాంతాడు అంత లిస్ట్ అవుతుంది. తాజాగా ప్రణాణికులతో వెళుతున్న ఓ ప్రైవేటు ట్రావెల్ బస్సు టైరు పేలడంతో ఒక్కసారిగా అదుపు తప్పింది. అపుడు బస్సు దాదాపు 100 కిలోమీటర్ల స్పీడుతో ఉంది. దీంతో బస్సు కంట్రోల్ కోల్పోయి సమీపంలోని డివైడర్ మీదుగా దూసుకెళ్లి అవతలి రోడ్డు పై వస్తోన్న లారీని ఢీ కొట్టింది. దీంతో బస్సు ఒక్కసారి మంటలు చెలరేగాయి. ఈ యాక్సిడెంట్ లో ముగ్గురు అక్కడికక్కడే మృత్యుఒడిలోకి వెళ్లిపోయారు. పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.
పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. నెల్లూరు నుంచి 36 మంది ప్యాసింజర్స్ తో హైదరాబాద్ వెళుతున్న ఓ ARBCVR ప్రైవేట్ ట్రావెల్ బస్సు బుధవారం అర్ధరాత్రి 2 గంటలు దాటాకా నంద్యాల జిల్లాలోని శిరివెళ్ల మండలం శిరివెళ్ల మెట్ట వద్ద బస్సు టైరు పేలడంతో అదుపుతప్పి డివైడర్ దాటి అవతలి రోడ్డు పైకి బస్సు దూసుకెళ్లింది. అదే సమయంలో అటువైపుగా వేగంగా వస్తోన్న లారీని ఢీ కొట్టడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో లారీ డ్రైవర్, క్లీనర్ తో పాటు లారీ డ్రైవర్ ముగ్గురు ఆన్ ది స్పాట్ చనిపోయారు.
ప్రమాదం జరిగిన వెంటనే బస్సుకు మంటలు వ్యాపించాయి. అదే సమయంలో ఆ రూట్లో వెళుతున్న ఓ డీసీఎం డ్రైవర్ వాహనాన్ని ఆపి బస్సు అద్దాలను పగలగొట్టడంతో ప్రయాణికులు బతుకు జీవుడా అన్నట్టుగా సురక్షితంగా బయటపడ్డారు. కిటికీల్లోంచి కిందకు దూకడంతో కొంత మందికి స్పల్ప గాయాలయ్యాయి. మంటలు వ్యాపించడంతో బస్సును ఢీ కొట్టిన కంటెనర్ లారీ కూడా పూర్తిగా అగ్నికి ఆహూతి అయిపోయింది.
Read more: సమంత కంటే ముందు రెండో పెళ్లి చేసుకున్న హీరోయిన్స్ వీళ్లే..! పూర్తి లిస్ట్ ఇదే..!
Read more: సమంత బాటలో దర్శకులను పెళ్లి చేసుకున్న హీరోయిన్స్ వీళ్లే..
మంటలు పూర్తిగా వ్యాపించడంతో బస్సు డ్రైవర్ తో పాటు.. ఎదురుగా వస్తోన్న లారీ డ్రైవర్.. బస్సు క్లీనర్ మృత దేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి. ఈ ఘటనలో ప్రయాణికుల లగేజి మొత్తంగా కాలి బూడిదైంది. మరోవైపు ప్రయాణికులందరు సురక్షితంగా బయటపడ్డారు. మొత్తంగా ఈ ఘటన తర్వాత పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రిలో చేర్పించారు. మరొకొందరిని వేరే వాహానాల్లో హైదరాబాద్ తరలించారు.
Also Read: వెయ్యి కోట్ల దర్శకులు.. ‘దురంధర్’తో ఈ క్లబ్బులో ఎంట్రీ ఇచ్చిన ఆదిత్యధర్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.
RMZ Group Investment: పెట్టుబడులే లక్ష్యంగా దావోస్కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ బృందం ప్రపంచ పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు శ్రమిస్తోంది. ఇప్పటికే పలు సంస్థలు, పారిశ్రామికవేత్తలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు సానుకూలత వ్యక్తం చేయగా.. ఈ క్రమంలోనే ప్రముఖ కంపెనీ ఆర్ఎంజెడ్ గ్రూపు ఏపీలో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. ఏపీలో పది బిలియన్ డార్ల పెట్టుబడి పెడతామని ప్రకటించింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఆర్ఎంజెడ్ గ్రూపు కీలక ఒప్పందం చేసుకుంది.
Also Read: YS Jagan: ఇక వైసీపీ కార్యకర్తలతో ఉంటా.. ఆంధ్రప్రదేశ్ ప్రజలతో కలిసిపోతా: వైఎస్ జగన్
వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సమావేశం 2026 సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆర్ఎంజెడ్ గ్రూప్ ఒప్పందం చేసుకున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా భారీ స్థాయి మిక్స్డ్-యూజ్, డిజిటల్, పారిశ్రామిక మౌలిక వసతుల అభివృద్ధిపై ఏపీ ప్రభుత్వం దృష్టి సారించడంతో ఏపీలో వ్యూహాత్మక పెట్టుబడి భాగస్వామ్యాన్ని ఆర్ఎంజెడ్ గ్రూపు ప్రకటించింది. నారా లోకేశ్, ఆర్ఎంజెడ్ గ్రూప్ చైర్మన్ సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది. విశాఖపట్టణాన్ని నెక్స్ట్-జనరేషన్ మిక్స్డ్-యూజ్, డిజిటల్ మౌలిక వసతుల కేంద్రంగా అభివృద్ధి చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది. సమతుల్య ప్రాంతీయ అభివృద్ధి, ఉపాధి కల్పన లక్ష్యంతో రాయలసీమ ప్రాంతంలో పరిశ్రమలు, లాజిస్టిక్స్ ఆధారిత అభివృద్ధిని ప్రభుత్వం ముందుకు తీసుకువెళ్తుంది. ఈ అంశాలను ఆర్ఎంజెడ్ గ్రూప్ ప్రతినిధులకు ప్రభుత్వ బృందం వివరించడంతో పెట్టుబడులు పెట్టేందుకు సంస్థ అంగీకారం తెలిపింది.
Also Read: YS Jagan: మాజీ సీఎం వైఎస్ జగన్ సంచలన ప్రకటన.. 2027 తర్వాత పాదయాత్ర
విశాఖపట్నంలోని కాపులుప్పాడ ఫేజ్-1 ఐటీ పార్క్లో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ (జీసీసీ) పార్క్ను అభివృద్ధి చేయాలని ప్రతిపాదిస్తోంది. సుమారు 50 ఎకరాల్లో గరిష్టంగా 10 మిలియన్ చదరపు అడుగుల నిర్మిత విస్తీర్ణంతో ఈ ప్రాజెక్ట్ను అభివృద్ధి చేసి, గ్లోబల్ సంస్థలను ఆకర్షించడంతో విశాఖలోని జీసీసీ ఎకోసిస్టమ్ను మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా ఉంది. విశాఖపట్నం ప్రాంతంలో దశలవారీగా గరిష్టంగా 1 గిగావాట్ సామర్థ్యంతో హైపర్స్కేల్ డేటా సెంటర్ క్లస్టర్ను అభివృద్ధి చేయాలని ఆర్ఎంజెడ్ గ్రూప్ ప్రణాళికలు రూపొందించింది. దీనికోసం విశాఖపట్నం ప్రాంతంలో సుమారు 500 నుంచి 700 ఎకరాల భూమి అవసరం ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ నెక్స్ట్-జనరేషన్ డిజిటల్, ఏఐ వర్క్లోడ్స్కు మద్దతు లభిస్తుంది.
Also Read: Medaram Jathara: మేడారం భక్తులకు తెలంగాణ ఆర్టీసీ భారీ శుభవార్త.. ఏం ప్రకటించిందో తెలుసా?
రాయలసీమ ప్రాంతంలోని టెకులోడు వద్ద సుమారు 1,000 ఎకరాల్లో ఇండస్ట్రియల్, లాజిస్టిక్స్ పార్క్ను అభివృద్ధి చేయాలని ఆర్ఎంజెడ్ గ్రూప్ ప్రతిపాదిస్తోంది. ఇది పరిశ్రమల తయారీ, గిడ్డంగుల నిర్వహణ, లాజిస్టిక్స్ కార్యకలాపాలకు కేంద్రంగా నిలువనుంది. ఈ అన్ని ప్రాజెక్టులు కలిపి రాబోయే ఐదు నుంచి ఆరు సంవత్సరాల్లో సుమారు 10 బిలియన్ అమెరికన్ డాలర్ల పెట్టుబడిని ఆర్ఎంజెడ్ సంస్థ సూచిస్తోంది. ఈ పెట్టుబడులతో ఐటీ, డేటా సెంటర్లు, పరిశ్రమలు, లాజిస్టిక్స్ రంగాల్లో సుమారు లక్ష మందికి ఉపాధి అవకాశాలు కల్పించే అవకాశం ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
YS Jagan Padayatra: కూటమి ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయని మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఏ ఒక్క వర్గానికి కూడా చంద్రబాబు ప్రభుత్వం ఎలాంటి మేలు చేయలేదని ప్రకటించారు. ఈ పరిస్థితుల్లో ప్రజలకు ఏ వర్గానికి కష్టం వచ్చినా నిలబడుతామని తెలిపారు. జెండా పట్టుకుని బాధితుల తరపున పోరాడుతున్నామని చెప్పారు. ఇదే స్ఫూర్తి ఇక ముందు కూడా కొనసాగించాలని పార్టీ శ్రేణులకు వైఎస్ జగన్ సూచించారు.
Also Read: Medaram Jathara: మేడారం భక్తులకు తెలంగాణ ఆర్టీసీ భారీ శుభవార్త.. ఏం ప్రకటించిందో తెలుసా?
తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో వైఎస్ జగన్ కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ సీఎం వైఎస్ జగన్ కీలక ప్రసంగం చేశారు. 'కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. ప్రతి ఇంట్లో ఇప్పుడు అదే చర్చ జరుగుతోంది. జగన్ ఉంటే ఎలా మేలు జరిగేదన్నది ఆలోచిస్తున్నారు. ప్రభుత్వానికి మిగిలింది ఇంకా మూడేళ్లు మాత్రమే. ఏడాదిన్నర తర్వాత పాదయాత్ర మొదలుపెడతా' అని మాజీ సీఎం వైఎస్ జగన్ సంచలన ప్రకటన చేశారు.
Also Read: Phone Tapping: బొగ్గు కుంభకోణంపై డైవర్షన్ కోసమే రేవంత్ రెడ్డి సరికొత్త డ్రామా: కేటీఆర్
ఏడాదిన్నరపాటు ప్రజల్లోనే ఉంటానని.. ఇక ప్రతి వారం ఒక్కో నియోజకవర్గ కార్యకర్తలతో భేటీ అవుతానని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రకటించారు. ఏలూరు నియోజకవర్గంతో ఆ కార్యక్రమాన్ని తిరిగి మొదలుపెడుతున్నామని.. ఇక ముందు వారానికి ఒక నియోజకవర్గాన్ని ఎంచుకుని ఇలా సమావేశమవుతామని తెలిపారు. 'వచ్చే నెల చివరలో లేదా మార్చి మొదట్లో రాష్ట్ర ప్రభుత్వం మూడో బడ్జెట్ ప్రవేశపెడతారు. ఈ ప్రభుత్వానికి ఇంకా మిగిలింది మరో రెండు బడ్జెట్లు మాత్రమే. పరిపాలన చాలా అన్యాయంగా జరగుతోంది' అని మాజీ సీఎం వైఎస్ జగన్ విమర్శించారు.
Also Read: Kavitha: తెలంగాణ రాజకీయాల్లోకి మళ్లీ ప్రశాంత్ కిశోర్.. కవిత పార్టీకి సేవలు
రెడ్బుక్ రాజ్యాంగంతో ఎక్కడైనా, ఎవరినైనా, ఏమైనా చేయొచ్చు అన్న కండకావరంతో వ్యవహరిస్తున్నారని మాజీ సీఎం వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు పాలనంతా అబద్దాలు మోసాలు.. ప్రశ్నిస్తే కేసులు పెట్టి వేధిస్తున్నారని వివరించారు. పోలీస్ వ్యవస్థను కూడా దారుణంగా దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. అందుకే కూటమి ప్రభుత్వంపై చాలా వ్యతిరేకత వచ్చిందని వైఎస్ జగన్ తెలిపారు. చంద్రబాబు బిర్యానీ పెడతానని నమ్మించి, చివరకు పలావ్ కూడా లేకుండా చేశారని అంతా బాధపడుతున్నారని వివరించారు.
Also Read: Viral Pic: ఈ 'స్టార్ యువకులకు వధువు కావలెను'.. పెళ్లి కాని యువకుల బ్యానర్ ఫొటో వైరల్
'వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రెండేళ్లు కోవిడ్ వచ్చింది. అన్ని కష్టాలున్నా ప్రజలను ఇబ్బంది పెట్టలేదు. ఏ ఒక్క పథకం ఆపలేదు. ప్రజలకు చెప్పింది ప్రతిదీ చేసి చూపాం. చంద్రబాబు పాలన మళ్లీ తిరిగి చూసిన తర్వాత, ప్రజలంతా అన్ని వాస్తవాలు గుర్తించారు' అని మాజీ సీఎం వైఎస్ జగన్ తెలిపారు. చంద్రబాబు మాదిరిగా అబద్ధాలు చెప్పడం, మోసాలు చేసే వారు ఉండరని అంతా గుర్తించారని చెప్పారు.
'సూపర్సిక్స్ లేదు. సూపర్ సెవెన్ లేదు. అన్నీ మోసాలే. వ్యవస్థలన్నీ నిర్వీర్యం చేశారు. గవర్నమెంటు స్కూళ్లు పూర్తిగా కళ తప్పాయి. పిల్లలకు టోఫెల్ క్లాస్లు లేవు. గోరుముద్ద కూడా క్వాలిటీ లేకుండా పోయింది. పిల్లల ప్రాణాలు పోతున్నాయి' అని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. నాడు గవర్నమెంట్ స్కూళ్లలో అడ్మిషన్ల కోసం ఎమ్మెల్యేల నుంచి కూడా రికమెండేషన్లు ఉండేవని.. ఆ స్థాయిలో గవర్నమెంటు స్కూళ్లకు డిమాండ్ ఉండేదని గుర్తుచేశారు. అదే ఇప్పుడు దాదాపు 9 లక్షల మంది పిల్లలు గవర్నమెంటు స్కూళ్ల నుంచి చదువు మానేశారని వివరించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Samsung Galaxy A57: 5000mAh బ్యాటరీతో Samsung Galaxy A57 ఫోన్ త్వరలో లాంచ్.. ఫీచర్స్ వివరాలు ఇవే!
Samsung Galaxy A57 Specifications: సాంసంగ్ కంపెనీ మార్కెట్లోకి Samsung Galaxy A57 మొబైల్ విడుదల చేయబోతోంది. విడుదలకు ముందే ఈ స్మార్ట్ఫోన్కి సంబంధించిన ఫీచర్స్ సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. ఇప్పటికే ఈ మొబైల్కి సంబంధించిన వివరాలు MIIT సర్టిఫికేషన్లో కూడా పేర్కొన్నారు. ఇది 120Hz రిఫ్రెష్ రేట్తో OLED డిస్ప్లేను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇది చాలా స్లిమ్గా కూడా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఇది 120Hz రిఫ్రెష్ రేట్తో OLED డిస్ప్లేతో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే, ఈ స్మార్ట్ఫోన్కి సంబంధించిన లీక్ అయిన ఇతర వివరాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఈ Samsung Galaxy A57 స్మార్ట్ఫోన్కు సంబంధించిన ఫీచర్స్ లాంచింగ్కి ముందే సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. సర్టిఫికేషన్ జాబితాలో అందించిన స్పెషిఫికేషన్స్ వివరాల్లోకి వెళితే.. 6.6-అంగుళాల FullHD+ డిస్ప్లేను కూడా కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇది 120Hz రిఫ్రెష్ రేట్తో OLED ప్యానెల్ను కూడా కలిగి ఉంటుంది. అలాగే ఈ మొబైల్ ఎంతో శక్తివంతమైన ఆక్టా-కోర్ Exynos 1680 చిప్సెట్ ప్రాసెసర్తో విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక కంపెనీ ఈ మొబైల్ను కేవలం ఒక స్టోరేజ్ వేరియంట్లో మాత్రమే విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇది 256GB స్టోరేజ్ వేరియంట్లో అందుబాటులోకి రాబోతోంది.
Samsung Galaxy A57 స్మార్ట్ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్తో లాంచ్ కాబోతోంది. ఇది Samsung One UI 8 స్కిన్ అందుబాటులోకి రానుంది. ఇక ఈ మొబైల్ వెనక భాగంలో 50-మెగాపిక్సెల్ ప్రధాన లెన్స్ను కలిగి ఉంటుంది. దీంతో పాటు అదనంగా 12-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరాతో లభిస్తోంది. అంతేకాకుండా అదనంగా 5-మెగాపిక్సెల్ మాక్రో షూటర్ కెమెరాతో అందుబాటులోకి రాబోతోంది. అలాగే ఫ్రంట్ భాగంలో సెల్ఫీ కోసం ప్రత్యేకమైన 12-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా కూడా లభిస్తోంది. దీంతో పాటు సెక్యూరుటీ కోసం ఇందులో ప్రత్యేకంగా ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ను కూడా అందిస్తోంది.
అలాగే ఈ స్మార్ట్ఫోన్లో కంపెనీ ఎంతో శక్తివంతమైన 5000mAh బ్యాటరీతో 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ను అందించబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఇందులో ప్రత్యేకంగా USB టైప్-Cతో పాటు స్టీరియో స్పీకర్లను కూడా కలిగి ఉండబోతున్నట్లు లీక్ అయిన వివరాలు చెబుతున్నాయి. దీనిని కంపెనీ IP67 రేటింగ్ కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్ఫోన్ కంపెనీ 161.5 x 76.8 x 6.9mm కొలతలతో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే, ఈ మొబైల్కి సంబంధించిన అధికారక ప్రకటనను కంపెనీ త్వరలోనే వెల్లడించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Motorola Edge 60 Fusion 5G Price Cut: మిడ్-రేంజ్ విభాగంలో మంచి స్మార్ట్ఫోన్ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఇదే అద్భుతమైన అవకాశంగా భావించవచ్చు. ఎందుకంటే మోటరోలా విడుదల చేసిన స్మార్ట్ఫోన్స్ భారీ డిస్కౌంట్తో లభిస్తోంది. ముఖ్యంగా ఇటీవలే విడుదలైన స్మార్ట్ఫోన్స్ అత్యంత చీప్ ధరల్లోనే అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా Motorola Edge 60 Fusion 5G స్మార్ట్ఫోన్ కొనుగోలు చేసేవారికి ఫ్లిప్కార్ట్ అద్భుతమైన ఆఫర్స్ అందిస్తోంది. రిపబ్లిక్ డే సేల్స్లో భాగంగా కొనుగోలు చేస్తే ఎన్నో రకాల అద్భుతమైన ఆఫర్స్ లభిస్తున్నాయి. అయితే, ఈ స్మార్ట్ఫోన్పై అందుబాటులో ఉన్న ఆఫర్స్ ఏంటో? ఇది ఎన్ని రకాల ఫీచర్స్తో లభిస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఈ Motorola Edge 60 Fusion 5G స్మార్ట్ఫోన్కు సంబంధించిన ఫీచర్స్ వివరాల్లోకి వెళితే, ఇది 6.67 అంగుళాల pOLED క్వాడ్-కర్వ్డ్ డిస్ప్లేను కలిగి ఉంటుంది. అంతేకాకుండా 1.5K (1220 x 2712 పిక్సెల్స్) రిజల్యూషన్తో వచ్చింది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్, 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ సపోర్ట్తో లభిస్తోంది. దీంతో పాటు ఇందులో డిస్ల్పే ప్రోటక్షన్ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7iను కూడా అందిస్తోంది. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 7400 (MediaTek Dimensity 7400 - 4nm) ప్రాసెసర్ను కలిగి ఉంటుంది. అలాగే ఇది రెండు స్టోరేజ్ వేరియంట్స్లో అందుబాటులో ఉంది.
ప్రస్తుతం మార్కెట్లో రెండు వేరియంట్స్లో లభిస్తోంది. మొదటిది 256GB స్టోరేజ్తో పాటు రెండవది 512GB స్టోరేజ్తో అందుబాటులో ఉంది. ఇక ఇది ఆండ్రాయిడ్ 15 (హలో UI) ఆపరేటింగ్ సిస్టమ్తో లభిస్తోంది. ఇది 3 ఏళ్ల OS అప్డేట్స్, 4 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ను కూడా అందిస్తోంది. ఇది డ్యూయల్ కెమెరా సెటప్ను కూడా కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో ప్రధాన కెమెరా 50MP సోనీ LYT-700C సెన్సార్తో లభిస్తోంది. అంతేకాకుండా అదనంగా 13MP అల్ట్రా వైడ్ కెమెరా కూడా లభిస్తోంది. ఇది మాక్రో, డెప్త్ కెమెరాగా కూడా పనిచేస్తుందని కంపెనీ క్లైమ్ చేస్తోంది. అలాగే ఫ్రంట్ భాగంలో 32MP సెల్ఫీ కెమెరా (4K వీడియో రికార్డింగ్ సపోర్ట్) కూడా అందుబాటులో ఉంది. ఇది ఎంతో శక్తివంతమైన 5500mAh బ్యాటరీతో లభిస్తోంది. ఇందులో ప్రత్యేకంగా 68W టర్బో పవర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ను కూడా అందిస్తోంది.
Also Read: Samsung Galaxy F07: ఫ్లిప్కార్ట్లో సంక్రాంతి బంపర్ డిస్కౌంట్.. రూ.1,499కే Samsung Galaxy F07 మొబైల్.!
ప్రస్తుతం మార్కెట్లో వేరియంట్స్ను బట్టి ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే, 8GB + 256GB స్టోరేజ్ కలిగిన వేరియంట్ ధర మార్కెట్లో సుమారు రూ.21,999 నుంచి రూ.22,999 వరకు ధరతో లభిస్తోంది. అలాగే రెండవ వేరియంట్ 12GB + 256GB స్టోరేజ్తో సుమారు రూ.23,999 నుంచి రూ.24,999 ధరల్లో లభిస్తోంది. అయితే, దీనిని ఫ్లిప్కార్ట్లో కొనుగోలు చేసేవారికి భారీ తగ్గింపుతో లభిస్తోంది. ప్రస్తుతం మొదిటి వేరియంట్పై స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. దీని ధర రూ.27,999 కాగా.. ఫ్లిప్కార్ట్లో ఆఫర్స్తో కేవలం రూ. 23,999కే అందుబాటులో ఉంది. ఇక రిపబ్లిక్ డే సేల్స్లో యాక్సిస్ బ్యాంక్, SBI బ్యాంక్ క్రెడిట్ కార్డ్లను వినియోగించి పేమెంట్ చేస్తే రూ.3,048 వరకు తగ్గింపు లభిస్తుంది. అలాగే ఎక్చేంజ్ బోనస్ను వినియోగించి కొనుగోలు చేస్తే రూ.20 వేల బోనస్తో కేవలం రూ.3,999కే పొందవచ్చు.
Also Read: Samsung Galaxy F07: ఫ్లిప్కార్ట్లో సంక్రాంతి బంపర్ డిస్కౌంట్.. రూ.1,499కే Samsung Galaxy F07 మొబైల్.!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Allu Arjun Mana Shankara Vara Prasad Movie Review: మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ కలిసి నటించిన 'మన శంకర వరప్రసాద్ గారు' చిత్రం ఇప్పటికే రూ.300 కోట్ల క్లబ్ లో చేరి సంచలనం సృష్టిస్తోంది. తాజాగా ఈ సినిమాను వీక్షించిన అల్లు అర్జున్, చిత్ర బృందానికి సోషల్ మీడియా వేదికగా అదిరిపోయే అభినందనలు తెలిపారు.
జపాన్ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తాజాగా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తున్న సంక్రాంతి బ్లాక్ బస్టర్ 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ చిత్రంపై బన్నీ ఇచ్చిన రివ్యూ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
బన్నీ రివ్యూ హైలైట్స్..
"బాస్ ఈస్ బ్యాక్! చిరంజీవి గారు మరోసారి స్క్రీన్ పై వెలిగిపోయారు. ఆయన ఎనర్జీ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది" అని మెగాస్టార్ మ్యాజిక్ ను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కొనియాడారు.
CONGRATULATIONS TO THE ENTIRE TEAM OF #ManaShankaraVaraPrasadGaru
The BOSS IS BACK ❤️🔥 L - I - T 🔥
Happy to see our megastar @KChiruTweets garu light up the screens again 🔥Full #VintageVibes
⁰@VenkyMama garu rocked the show . #VenkyGowda ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿ ಮಾಡಿದಿರಾ (Thumba… pic.twitter.com/SI8CF7r9VO— Allu Arjun (@alluarjun) January 20, 2026
వెంకటేష్ & నయనతార: "వెంకటేష్ గారు తన నటనతో అదరగొట్టారు. నయనతార చాలా అందంగా కనిపించారు" అంటూ ప్రధాన తారాగణాన్ని ప్రశంసించారు.
అనిల్ రావిపూడిపై ప్రశంసలు: దర్శకుడు అనిల్ రావిపూడిని 'సక్సెస్ మిషన్' గా అభివర్ణించారు. "సంక్రాంతికి వస్తారు.. హిట్ కొడతారు.. రిపీట్! అనిల్ గారు మీ సక్సెస్ కు అభినందనలు" అంటూ ట్వీట్ చేశారు.
సంగీతం: భీమ్స్ సిసిరోలియో అందించిన మ్యూజిక్ సూపర్ గా ఉందని బన్నీ కితాబిచ్చారు.
జపాన్లో పుష్ప-2 హవా.. అట్లీతో కొత్త ప్రాజెక్ట్!
మరోవైపు అల్లు అర్జున్ తన ఫ్యామిలీతో కలిసి జపాన్ లోని చారిత్రాత్మక ప్రాంతాలను సందర్శించి వచ్చారు. అక్కడ విడుదలైన 'పుష్ప 2' ప్రమోషన్లలోనూ ఆయన చురుగ్గా పాల్గొన్నారు. ఇక సినిమాల విషయానికొస్తే.. అల్లు అర్జున్, దర్శకుడు అట్లీతో సినిమాలో నటిస్తున్నారు. భారీ బడ్జెట్ తో రాబోతున్న సినిమాపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. మరోవైపు 'మాస్టర్' డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తో కూడా బన్నీ ఒక సినిమాను అనౌన్స్ చేయడంతో ఫ్యాన్స్ ఖుషీగా ఉన్నారు.
వరుస హిట్లు అందుకుంటున్న అనిల్ రావిపూడికి, మెగాస్టార్కు అల్లు అర్జున్ అభినందనలు తెలపడం మెగా అభిమానుల్లో కొత్త జోష్ నింపింది. ఈ సినిమా వసూళ్ల పరంగా మరిన్ని రికార్డులు తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది.
Also Read: 500 Note Ban: రూ.500 నోట్లు రద్దు కానున్నాయా? ఏటీఎంల నుంచి మాయమవుతాయా? కేంద్రం ఏం చెప్పిందంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
500 Note Ban News: గత కొద్ది రోజులుగా ఇంటర్నెట్లో రూ.500 నోట్ల భవిష్యత్తుపై పెద్ద ఎత్తున పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సామాన్యుల్లో నెలకొన్న ఆందోళనను తొలగిస్తూ ప్రభుత్వం అధికారికంగా స్పందించింది. సోషల్ మీడియాలో రూ.500 నోట్ల రద్దు గురించి జరుగుతున్న ప్రచారంలో ఎంత నిజం ఉందో వివరిస్తూ ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) కీలక స్పష్టతనిచ్చింది.
వైరల్ అవుతున్న వార్త ఏమిటి?
మార్చి 2026 తర్వాత ఏటీఎంలలో రూ.500 నోట్లు అందుబాటులో ఉండవనే ప్రచారం జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం మరోసారి డీమోనిటైజేషన్ (Demonetization 2.0) కి సిద్ధమవుతున్న క్రమంలో.. ఇకపై దేశంలో రూ.100 నోటే అతిపెద్ద కరెన్సీగా ఉండబోతోదనే వార్తలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ వార్తలు నెట్టింట విపరీతంగా షేర్ కావడంతో, పదేళ్ల క్రితం జరిగిన నోట్ల రద్దు కష్టాలను గుర్తుచేసుకుంటూ ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
పీఐబీ (PIB) ఫ్యాక్ట్ చెక్ నివేదిక..
ఈ పుకార్లను ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఫ్యాక్ట్ చెక్ విభాగం తీవ్రంగా ఖండించింది. 500 రూపాయల నోట్లను నిషేధించే ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి లేదని PIB స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని, అటువంటి తప్పుడు సమాచారాన్ని ఎవరూ నమ్మవద్దని కోరింది. కరెన్సీ మార్పుల గురించి ఆర్బీఐ (RBI) గానీ, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ గానీ ఎలాంటి ప్రకటన చేయలేదని తేల్చి చెప్పింది.
తప్పుడు సమాచారాన్ని బహిర్గతం చేస్తూ, ఒక స్క్రీన్ షాట్ను కూడా PIB షేర్ చేసింది. ప్రభుత్వ విధానాలు లేదా ఆర్థిక నిర్ణయాలకు సంబంధించిన సమాచారం కోసం కేవలం అధికారిక వెబ్సైట్లు, ధ్రువీకరించబడిన ప్రభుత్వ సోషల్ మీడియా ఖాతాలను మాత్రమే అనుసరించాలని సూచించింది.
కాబట్టి, మీ దగ్గర ఉన్న రూ.500 నోట్లు పూర్తి సురక్షితం. వాటి రద్దు గురించి వస్తున్న వార్తలు కేవలం సృష్టించిన పుకార్లు మాత్రమే. ఇటువంటి మెసేజ్లను ఫార్వార్డ్ చేయకుండా ఉండటం బాధ్యతాయుతమైన పని.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
India Vs Pakistan: టోర్నీ ఏదైనా సరే భారత్, పాకిస్తాన్ జట్లు తలపడుతున్నాయంటే వచ్చే కిక్కే వేరు. ఇరు దేశాల అభిమానులే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ ఫ్యాన్స్ సైతం భారత్ వర్సెస్ పాక్ మ్యాచ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు అన్న సంగతిని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక ఇప్పుడు అందరి దృష్టి ఫిబ్రవరి 15 పైనే ఉంది. ఎందుకంటే ఆ రోజు టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా భారత్, పాకిస్తాన్ జట్లు తలపడనున్నాయి.
అయితే.. అదే రోజు మరో భారత్ వర్సెస్ పాక్ మ్యాచ్ కూడా జరగనుంది. తొలి మ్యాచ్ లో పురుషుల జట్లు తలపడనుండగా రెండో మ్యాచ్ మహిళల ఆసియా కప్ రైజింగ్ స్టార్స్లో భాగంగా జరగనుంది. మహిళల ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ షెడ్యూల్ను ఆసియా క్రికెట్ కౌన్సిల్ విడుదల చేసింది. థాయ్లాండ్లోని బ్యాంకాక్ వేదికగా ఫిబ్రవరి 13 నుంచి 22 వరకు మ్యాచ్లు జరగనున్నాయి. భారత మహిళల-ఏ జట్టుతో పాటు మరో ఏడు జట్లు ఈ టోర్నీలో పాల్గొంటున్నాయి. తొలి మ్యాచ్ ఫిబ్రవరి 13న జరగనుంది. యూఏఈ, నేపాల్ జట్లు తలపడనున్నాయి.
8 జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. భారత్, పాకిస్తాన్లతో పాటు యూఏఈ, నేపాల్ జట్లు గ్రూప్-ఏలో ఉండగా, బంగ్లాదేశ్, శ్రీలంక, మలేషియా, థాయిలాండ్ జట్లు గ్రూప్-బిలో ఉన్నాయి. ఇక భారత-ఏ జట్టు తమ తొలి మ్యాచ్ ను ఫిబ్రవరి 13న యూఏఈతో ఆడనుంది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో ఫిబ్రవరి 15న తలపడనుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభం కానుంది.
మహిళల ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ షెడ్యూల్ ఇదే..
* ఫిబ్రవరి 13న – పాకిస్తాన్ vs నేపాల్ (ఉదయం 9:30)
* ఫిబ్రవరి 13న – భారత్ vs యుఎఇ (మధ్యాహ్నం 2 గంటలకు)
* ఫిబ్రవరి 14న – మలేషియా vs థాయిలాండ్ (ఉదయం 9:30)
* ఫిబ్రవరి 14న – బంగ్లాదేశ్ vs శ్రీలంక (మధ్యాహ్నం 2 గంటలకు)
* ఫిబ్రవరి 15న – యుఏఈ vs నేపాల్ (ఉదయం 9:30)
* ఫిబ్రవరి 15న – భారత్ vs పాకిస్తాన్ (మధ్యాహ్నం 2 గంటలకు)
* ఫిబ్రవరి 16న – శ్రీలంక vs మలేషియా (ఉదయం 9:30)
* ఫిబ్రవరి 16న – బంగ్లాదేశ్ vs థాయిలాండ్ (మధ్యాహ్నం 2 గంటలకు)
* ఫిబ్రవరి 17న – భారత్ vs నేపాల్ (ఉదయం 9:30)
* ఫిబ్రవరి 17న – పాకిస్తాన్ vs యుఎఇ (మధ్యాహ్నం 2 గంటలకు)
* ఫిబ్రవరి 18న – బంగ్లాదేశ్ vs మలేషియా (ఉదయం 9:30 గంటలకు)
* ఫిబ్రవరి 18న – శ్రీలంక vs థాయిలాండ్ (మధ్యాహ్నం 2 గంటలకు)
* ఫిబ్రవరి 20న – సెమీ-ఫైనల్ 1 (A1 vs B2) (ఉదయం 9:30 గంటలకు)
* ఫిబ్రవరి 20న – సెమీ-ఫైనల్ 2 (B1 vs A2) (మధ్యాహ్నం 2 గంటలకు)
* ఫిబ్రవరి 22న – ఫైనల్ (మధ్యాహ్నం 2 గంటలకు)
Also Read: WPL 2026: డబ్ల్యూపీఎల్లో స్మృతి మంధాన సేన దూకుడు.. ప్లేఆఫ్స్లో అడుగుపెట్టిన ఆర్సీబీ..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
8th Pay Commission DA Hike 2026: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కొత్త సంవత్సరం 2026 కానుకగా డియర్నెస్ అలవెన్స్ (DA) పెరగనుంది. ప్రస్తుత ద్రవ్యోల్బణ పరిస్థితులు, AICPI-IW గణాంకాలను బట్టి చూస్తే, ఈసారి డీఏ పెంపు ఎంత ఉండబోతోంది? దీనివల్ల జీతాలు ఏ మేరకు పెరుగుతాయి? అనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ద్రవ్యోల్బణ ప్రభావం నుంచి ఉద్యోగులకు ఉపశమనం కలిగించేందుకు కేంద్రం ఏడాదికి రెండుసార్లు (జనవరి, జూలై) కరువు భత్యాన్ని (DA) సవరిస్తుంది. ప్రస్తుతం ఉద్యోగులు 58% డీఏ పొందుతున్నారు.
డీఏ పెంపు అంచనాలు (AICPI-IW డేటా ఆధారంగా)
కార్మిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నవంబర్ 2025 వరకు ఉన్న ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ (AICPI-IW) గణాంకాల ప్రకారం..
నవంబర్ ఇండెక్స్: 148.2 పాయింట్లు.
పెరుగుదల: 59.93% డీఏకి సమానమైన పాయింట్లు నమోదయ్యాయి.
అంచనా: డిసెంబర్ గణాంకాలు కూడా కలిపితే, డీఏ 2% నుండి 3% వరకు పెరిగే అవకాశం ఉంది. అంటే మొత్తం డీఏ 60% లేదా 61% కి చేరుకోవచ్చు.
ఎప్పుడు ప్రకటిస్తారు?
సాధారణంగా జనవరి నెలకు సంబంధించిన డీఏ పెంపును మార్చి లేదా ఏప్రిల్ నెలల్లో (హోలీ పండుగ తర్వాత) కేంద్ర మంత్రివర్గం ఆమోదిస్తుంది. ప్రకటన ఎప్పుడు వచ్చినా, పెంపు మాత్రం జనవరి 1, 2026 నుండి వర్తిస్తుంది. కాబట్టి గడిచిన నెలల వ్యత్యాసాన్ని బకాయిల రూపంలో చెల్లిస్తారు.
8వ వేతన సంఘం ప్రభావం:
నిజానికి 7వ వేతన సంఘం కాలపరిమితి డిసెంబర్ 31, 2025తో ముగిసింది. 8వ వేతన సంఘం జనవరి 2026 నుండి అమల్లోకి రావాల్సి ఉన్నా, ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. అందువల్ల, ప్రస్తుతం ఈ పెంపు 7వ వేతన సంఘం సిఫార్సుల ప్రకారమే కొనసాగుతోంది.
జనవరి 30 లేదా 31న విడుదలయ్యే డిసెంబర్ నెల AICPI-IW డేటాతో డీఏ పెంపుపై పూర్తి స్పష్టత వస్తుంది. 3% పెంపు లభిస్తే ఉద్యోగుల జీతాల్లో గణనీయమైన మార్పు కనిపిస్తుంది.
(గమనిక: పైన పేర్కొన్న సమాచారం కేవలం కొన్ని నివేదికల ఆధారంగా రూపొందించింది. దీన్ని పాటించే ముందు సంబంధిత నిపుణుడ్ని సంప్రదించడం మేలు. దీన్ని జీ తెలుగు న్యూస్ ధ్రువీకరించడం లేదు.)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Medaram Jathara 2026: తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధి చెందిన మేడారం జాతర 28 నుంచి 1వ తేదీ వరకు జరగనుండగా ఈ జాతరకు భారీ స్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే భక్తులు లక్షలాది సంఖ్య అమ్మవార్లను దర్శించుకునేందుకు తరలివస్తుండగా.. భక్త జనుల సౌకర్యార్థం తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. జారత ముందు నుంచే ప్రత్యేకంగా బస్సులు నడుపుతామని ప్రకటించింది. ఈనెల 25 నుంచి 1వ తేదీ వరకు పెద్ద ఎత్తున ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు ఆర్టీసీ తెలిపింది.
Also Read: Tomorrow Holiday: రేపు అన్నీ స్కూళ్లకు సెలవు.. బ్యాంకులకు కూడా! ఎందుకో తెలుసా?
2024 జాతరలో ఆర్టీసీ 3,491 బస్సులు నడిపి 16.82 లక్షల మంది ప్రయాణికులను తరలించగా.. ఉచిత బస్సు పథకం అమలుతో ప్రయాణికుల సంఖ్య పెరిగింది. ఈ జాతరకు 20 లక్షల సంఖ్యలో ప్రయాణికులు వెళ్తారని ఆర్టీసీ అంచనా వేసింది. తదనుగుణంగా ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం మేడారం జాతరలో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అమలు చేస్తూనే.. ప్రత్యేక బస్సులు నడపనుంది. ఆర్టీసీ మేడారం జాతరకు మొత్తం 4,000 బస్సులను నడపనుంది. ఈ బస్సులు అన్ని జిల్లాలతోపాటు హైదరాబాద్ నుంచి రాకపోకలు సాగించనున్నాయి. వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం, హైదరాబాద్ సిటీ నుంచి మొత్తం 51 ట్రాఫిక్ జనరేటింగ్ పాయింట్లతో ప్రత్యేక బస్సులు నడవనున్నాయి.
Also Read: Viral Pic: ఈ 'స్టార్ యువకులకు వధువు కావలెను'.. పెళ్లి కాని యువకుల బ్యానర్ ఫొటో వైరల్
మేడారం నుండి భక్తులను రవాణా చేయడానికి మేడారంలో 50 ఎకరాల భూమిలో తాత్కాలిక బస్ స్టేషన్ ఏర్పాటు చేశారు. భక్తులు తమ గమ్యస్థానాల ప్రకారం సులభంగా బస్సుల్లో ఎక్కేందుకు మొత్తం 9 కిలో మీటర్ల పొడవు కలిగిన 50 క్యూలైన్లు ఏర్పాటు చేశారు. ఈ క్యూలైన్లలో ఒకేసారి సుమారు 20,000 మంది ప్రయాణికులను నిలుపుకునే ఏర్పాట్లు చేసినట్లు ఆర్టీసీ సంస్థ తెలిపింది. తాత్కాలిక బస్ స్టేషన్లో ప్రయాణికులు వేచి ఉండే ప్రాంతం, సిబ్బంది విశ్రాంతి గదులు, నిర్వహణ కార్యకలాపాలు మొదలైన వాటి కోసం 1.10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో తాత్కాలిక షెడ్లు ఏర్పాటు చేశారు. మేడారం, కామారం ప్రాంతాలలో సుమారు వెయ్యి బస్సుల పార్కింగ్కు వీలుగా 25.76 ఎకరాల విస్తీర్ణంలో మొత్తం పార్కింగ్ ప్రాంతం అభివృద్ధి చేశారు. బస్సుల చిన్నపాటి నిర్వహణ సమస్యలు, మార్గమధ్యలో బస్సులు నిలిచిపోతే అత్యవసర సేవల కోసం 11 గూడ్స్ ట్రాన్స్పోర్ట్ వాహనాలు, 2 క్రేన్లు, 1 ట్రాక్టర్ను ఏర్పాటు చేశారు.
Also Read: Kavitha: తెలంగాణ రాజకీయాల్లోకి మళ్లీ ప్రశాంత్ కిశోర్.. కవిత పార్టీకి సేవలు
జోన్లవారీగా..
ప్రత్యేక బస్సులను నడిపే కేంద్రాల నుంచి మేడారం జాతర ప్రాంతం వరకు ఉన్న ప్రయాణ మార్గాలను 11 జోన్లుగా విభజించి 15 జీపులు, 8 మోటర్ సైకిల్లను ప్రత్యేకమైన పెట్రోలింగ్ వ్యవస్థను ఆఫీసర్ల పర్యవేక్షణలో బస్సులు మార్గమధ్యలో ఆగకుండా చర్యలు తీసుకున్నారు. మార్గమధ్యలో ఉన్న 7 ప్రైవేట్ పెట్రోల్ బంకుల వద్ద బస్సులకు డీజిల్ టాప్-అప్ చేయడానికి అవసరమైన ఏర్పాట్లు చేశారు. మేడారం తాత్కాలిక బస్ స్టేషన్లో, 51 ట్రాఫిక్ జనరేటింగ్ పాయింట్ల వద్ద ట్రాఫిక్ను సమీపంగా పర్యవేక్షించేందుకు, మొత్తం 10,000 మంది వారం రోజులు పనిచేయనున్నారు.
హనుమకొండ నుంచి తాడ్వాయి వరకు మార్గంలో ఉన్న కల్వర్టులు, ట్యాంక్బండ్లు, గుండ్ల వాగు, జలగలాంచ వాగు వంటి కీలక ప్రాంతాల్లో బస్సులకు మార్గనిర్దేశం చేయడానికి గార్డులను ఏర్పాటు చేశారు. మేడారం తాత్కాలిక బస్ స్టేషన్లో ట్రాఫిక్ ప్రవాహాన్ని నిరంతరం పర్యవేక్షించేందుకు ఒక కమెండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేశారు. తాత్కాలిక బస్ స్టేషన్లో 76 క్లోజ్డ్ సర్క్యూట్ కెమెరాలు ఏర్పాటుచేసినట్లు ఆర్టీసీ తెలిపింది.
సౌకర్యాలు
తాత్కాలిక బస్ స్టేషన్లో తాగునీటి సౌకర్యం, టాయిలెట్లు ఏర్పాటు. పూర్తిగా సన్నద్ధమైన అంబులెన్సులు, వైద్యులు, మందులతో కూడిన వైద్య శిబిరం కూడా ఏర్పాటుచేశారు. సిబ్బందికి స్టాఫ్ క్యాంటీన్ ఏర్పరిచి భోజన సదుపాయం కల్పించారు.
హనుమకొండ నుంచి మేడారం వరకు బస్సుల సజావుగా రాకపోకలు జరగడానికి ములుగు, వరంగల్ హనుమకొండ జిల్లాల పోలీసులు, జిల్లా పరిపాలనలతో సమన్వయ సమావేశాలు నిర్వహించారు. క్లర్కులు, డ్రైవర్లు, కండక్టర్లు, విధులు నిర్వర్తించేందుకు గుర్తించిన అన్ని సిబ్బందికి అవసరమైన శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ప్రైవేటు వాహనాలలో ప్రయాణించడంతో దూరంగా పార్కింగ్ చేయడం, అసౌకర్యం కలుగుతుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి