Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Mancherial504251

విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ నుండి మంటలు, భయందోళనలో భక్తులు

Aug 31, 2024 17:35:45
Bellampalle, Kannal Rural, Telangana
మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలం వీరాపూర్ గ్రామ అభయ ఆంజనేయ స్వామి ఆలయంలోని విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ నుండి శనివారం ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఆలయానికి వచ్చిన భక్తులు భయాందోళనకు గురయ్యారు. గ్రామస్తులు మాట్లాడుతూ ఇటీవల కురుస్తున్న వర్షాలకు ఆలయంలోని ట్రాన్స్ఫార్మర్ నుండి నిత్యం మంటలు వస్తున్నాయని, అనేక సార్లు విద్యుత్ అధికారుల ద్రుష్టికి తీసుకెళ్లిన పట్టించికోవడం లేదన్నారు. అధికారులు స్పందించి ఆలయం లోపలి నుండి ట్రాన్స్ఫార్మర్ తొలగించాలని డిమాండ్ చేశారు.
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
RGRenuka Godugu
Mar 18, 2026 15:55:11
Hyderabad, Telangana:

Brother Killed Sister In Abdullapurmet: ఇటీవల కాలంలో తల్లి పిల్లల్ని చంపడం.. భార్య భర్తలు ఒకరిని ఒకరు చంపుకోవటం దుర్ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. రోజురోజుకు మానవ సంబంధాలు ప్రశ్నార్ధకంగానే మారుతున్నాయి. ఈరోజు హైదరాబాద్ అబ్దుల్లాపూర్మెట్ బాటసింగారంలో కూడా ఇలాంటి దారుణ ఘటనే మరొకటి వెలుగులోకి వచ్చింది. అక్క చెడు తిరుగుళ్ళు తిరుగుతుంది అని ఒక తమ్ముడు అత్యంత దారుణంగా చంపి చెరువులో పడేశాడు.  ఇది ఇలా ఉండగా కొన్నాళ్ల క్రితమే బావ కూడా చనిపోయాడు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

నగర శివారులో ఈ దారుణ ఘటన చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా బాటసింగారం ఉలిక్కిపడినట్టు అయింది. తోడబుట్టిన అక్కని అత్యంత కిరాతకంగా హత్య చేసి చెరువులో పడేశాడు. ఇది స్థానికంగా కూడా కలకలం రేపుతుంది. పోలీసుల ప్రకారం బాటసింగారానికి చెందిన పప్పురామ్‌ అక్క ప్రవర్తన పై విసుకు చెందాడు. బావ కూడా కొన్ని రోజుల క్రితమే చనిపోయాడు. ఆ తర్వాత అక్క ప్రవర్తన తీరులో మార్పువచ్చింది. దీంతో ఆమెకు సర్దిచెప్పడానికి పలుమార్లు ప్రయత్నించాడు. గత నెల 28వ తేదీన కూడా ఈ విషయమై ఇద్దరి మధ్య గొడవ పెరిగింది. ఒక్కసారిగా ఇద్దరి మధ్య వివాదం పెద్దగా అవ్వడంతో ఆగ్రహంతో ఊగిపోయిన తమ్ముడు అక్కను హత్య చేశాడు. ఈరోజు ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అయితే చంపిన తర్వాత ఆమెను ముక్కలుగా చేసి ఎవరికీ అనుమానం రాకుండా స్థానికంగా ఉండే చెరువులో పడేశాడు. ఆ తర్వాత ఏమీ తెలియనట్టుగా అక్క పై మిస్సింగ్ కేసు కూడా నమోదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీలు ఇతర సాక్షా దారాలు తర్వాత తమ్ముడే అక్కను హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు. దీంతో నిందితుడు పప్పు రామ్‌ను వెంటనే అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తమదనే స్టైల్ లో విచారించగా అసలు సంగతి విషయం బయటకు వచ్చింది.

Also Read:  ఘోర ప్రమాదం.. దేవతపల్లి గేట్‌ వద్ద ఆటోను వేగంగా ఢీకొట్టిన లారీ, నలుగురు స్పాట్‌ డెడ్‌..!!

Also Read:  ఘోర ప్రమాదం.. ప్రైవేటు బస్సు బోల్తా నలుగురి దుర్మరణం..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

1038
comment0
Report
HDHarish Darla
Mar 18, 2026 15:07:19
Hyderabad, Telangana:

Nora Fatehi Controversy Song: కన్నడ హీరో ధ్రువ సర్జా, దర్శకుడు ప్రేమ్ తెరకెక్కించిన 'కేడీ' సినిమా ఇప్పుడు వివాదాల్లో నిలిచింది. ఇటీవలే విడుదలైన ఆ సినిమా ఐటెం సాంగ్ అందుకు ప్రధానకారణం. ఆ పాట ఇప్పుడు అసభ్యంగా ఉందని నెటిజన్లు విమర్శించారు. అంతేకాకుండా ఈ సాంగ్ గురించి నేడు లోక్‌సభలోనూ చర్చ జరిగింది. అయితే ఈ ఐటెంసాంగ్‌ దుమారంపై అందులో నటించిన బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహి స్పందించింది. 
  
బూతుపాటగా వివాదస్పదంగా మారిన ఈ పాటలో ప్రధాన పాత్ర పోషించిన తర్వాత నోరా ఫతేహి సోషల్ మీడియాలో ఒక వీడియోను షేర్ చేస్తూ తన అసంతృప్తిని వ్యక్తం చేసింది. "ఈ పాటను సుమారు మూడేళ్ల క్రితం కన్నడలో చిత్రీకరించిన టైమ్‌లో నేను నటించాను. సంజయ్ దత్ వంటి పెద్ద నటులు ఉండడం వల్ల నేను నటించేందుకు అంగీకరించాను" అని నోరా ఫతేహి చెప్పుకొచ్చింది. 

అయితే ఆ సాంగ్ చిత్రీకరించిన సమయంలో కన్నడ పాట ప్లే చేసిన కారణంగా ఆ పదాలు తనకు అర్థం కాలేదని నటి నోరా ఫతేహి చెప్పింది. పాటలోని సాహిత్యం అర్థాన్ని తెలుసుకునేందుకు తాను చిత్రబృందం చెప్పిన మాట విన్నానని స్పష్టం చేసింది. వాళ్లు తనకు వివరించే క్రమంలో తనకు ఎలాంటి బూతులాగా అనిపించలేదని నోరా చెప్పింది. నాకు హిందీ వచ్చు. తాజాగా విడుదలైన తర్వాత హిందీ వెర్షన్ విన్నాక ఈ సాంగ్ వివాదం తెస్తుందని ముందే నాకు తెలిసిపోయిందని నోరా ఫతేహి స్పష్టం చేసింది.

అంతేకాకుండా తన అనుమతి లేకుండా చిత్రబృందం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీని ఉపయోగించి తనతో పాటు సంజయ్ దత్ ఫోటోలను ప్రచారానికి వాడినందుకు నోరా ఫతేహి ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. తన గౌరవాన్ని భంగం కలిగించే ఏ విషయాన్నైనా తాను సమర్థించనని నోరా అంటోంది. పాట విడుదల కార్యక్రమంలోనే తాను దర్శకుడు ప్రేమ్‌ను వివాదం అవుతుందని హెచ్చరించినట్లు క్లారిటీ ఇచ్చింది. అయితే ఇలాంటి వివాదం నడుమ తాను ఎలాంటి ప్రమోషన్స్‌లో పాల్గొనని నోరా ఫతేహి చెప్పుకొచ్చింది.

ఈ పాటకు సంబంధించిన వివాదంపై నేడు లోక్‌సభలోనూ చర్చ జరిగింది. దీనిపై స్పందించిన మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పందిస్తూ.. 'కేడీ' అనే కన్నడ సినిమాలోని వివాదస్పద లిరికల్ సాంగ్‌ను ఇప్పటికే బ్లాక్ చేసినట్లు మంత్రి ప్రకటించారు. కన్నడ, హిందీతో పాటు తెలుగు, తమిళ, మలయాళ చిత్ర

Also Read: Job Notification: పదో తరగతి పాసయ్యారా? నెలకు రూ.63,000 జీతంతో ప్రభుత్వ ఉద్యోగం..జాబ్ ఏంటో తెలుసా?

Also Read; EPS-95 Pension Hike: ఉద్యోగులకు షాకింగ్ న్యూస్! పెన్షన్ రూ.7,500 పెంపుపై మోదీ సర్కార్ కీలక ప్రకటన.. లోక్‌సభ సాక్షిగా..!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

1055
comment0
Report
RKRavi Kumar Sargam
Mar 18, 2026 12:29:08
Balapur, Telangana:

Sudden Heavy Rains: వేసవికాలం దంచికొడుతున్న ఎండలతో తీవ్ర ఉక్కపోత ఎదుర్కొన్న ప్రజలు ఇప్పుడు వర్షాలతో హాయిగా ఉన్నారు. వేసవికాలంలో అకాల వర్షాలు జోరందుకున్నాయి. వరుసగా మూడు రోజులుగా తెలంగాణలో వర్షం వాతావరణం నెలకొనగా.. ఏపీలో కూడా అదే పరిస్థితి ఉంది. బుధవారం ఏపీలోని పలు జిల్లాలతోపాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షం పడింది. హైదరాబాద్‌, మెదక్‌, రంగారెడ్డి జిల్లాలతోపాటు ఏపీలోని కృష్ణా జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. అంతేకాకుండా వడగళ్ల వాన పడింది. ఈ వానతో రైతులతోపాటు సాధారణ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

Also Read: Pre Wedding Shoot: వీళ్లకేం పోయేకాలం రా అయ్య.. మురికి కుంటలో ప్రీ వెడ్డింగ్‌ షూట్‌ వైరల్‌

ఏపీలోని పలు జిల్లాల్లో..
కృష్ణాజిల్లా పెనమలూరు నియోజకవర్గం ఉయ్యూరు పరిధిలో భారీ వాన కురిసింది. పమిడిముక్కల మండల పరిధిలో వడగండ్ల వాన పడడంతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇక నూజివీడులో వర్షం బీభత్సం సృష్టించింది. నూజీవీడు పట్టణంలోని పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద లెక్చరర్ దొడ్డ కమల కుమారి ఇంటి పైభాగం ధ్వంసమైంది. పట్టణంలో అకస్మాత్తుగా బుధవారం ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఈ వర్షం సమయంలో ఒక్కసారిగా పిడుగు పడింది. కంగారు పడిన ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. కొద్దిసేపటికి పరిశీలించగా పిడుగు పడడంతో ఇంటిపై భాగం ధ్వంసమైందని కుటుంబసభ్యులు గుర్తించారు. అయితే ఎవరికీ ఎలాంటి ప్రాణాపాయం సంభవించకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

Also Read: KTR Chit Chat: మూసీ ప్రాజెక్ట్ పేరుతో కాంగ్రెస్‌ భారీ అవినీతి, ప్రజల భూముల దోపిడీ: కేటీఆర్‌

తెలంగాణలో మూడు రోజులు వర్షాలు
వేసవికాలంలో వాతావరణం భిన్నంగా మారింది. తెలంగాణలో రాగల మూడు రోజులు కూడా వర్షం పడుతుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసింది. ఉత్తర అంతర్గత కర్ణాటక నుంచి దక్షిణ అంతర్గత కర్ణాటక మీదుగా గల్ఫ్ ఆఫ్ మన్నార్ ప్రాంతం కొనసాగిన ద్రోణి బుధవారం మధ్యప్రదేశ్ మధ్య ప్రాంతంలో ఏర్పడిన ఉపరితల చక్రవాత ఆవర్తనం నుంచి మరాఠ్వాడ, విదర్భ ఉత్తర అంతర్గత కర్ణాటక వరకు సగటు సముద్ర మట్టం నుంచి 0.9 కి మీ ఎత్తులో కొనసాగుతోంది. మరో ద్రోణి గల్ఫ్ ఆఫ్ మన్నార్ ప్రాంతం నుంచి దక్షిణ అంతర్గత కర్ణాటక వరకు తమిళనాడు మీదుగా సగటు సముద్రమట్టం నుంచ 0.9 కి మీ ఎత్తులో ఏర్పడింది. దీని ఫలితంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

Also Read: EPS 95 Pension: ఉద్యోగులకు ఉగాది గిఫ్ట్‌.. కనీస పింఛన్‌ రూ.7,500 పెంచేందుకు ఆమోదం?

బుధవారం తెలంగాణ రాష్ట్రంలోని చాలా జిల్లాలలో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. 40 నుండి 50 కి.మీ వేగంతో కూడిన ఈదురుగాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశాలు ఉన్నాయి. రేపు, ఎల్లుండి రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది. 30 నుండి 40 కి.మీ వేగం కలిగిన ఈదురుగాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న రెండు రోజులలో గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమేపి రెండు నుంచి  మూడు డిగ్రీలు తగ్గే అవకాశం ఉందని చెప్పడంతో ఈ వార్త తెలంగాణ ప్రజలకు భారీ ఉపశమనం లభించనుంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

1100
comment0
Report
RKRavi Kumar Sargam
Mar 18, 2026 11:01:11
Wadgaon, Maharashtra:

Viral Pre Wedding Shoot: ప్రస్తుతం మాంచి ముహూర్తాలు ఉండడంతో శుభకార్యాలు పెద్ద సంఖ్యలో జరుగుతున్నాయి. కొన్ని నెలల విరామం తర్వాత వివాహాలకు ముహూర్తాలు ఉండడంతో యువతీ యువకులు వివాహానికి సిద్ధమయ్యారు. అయితే ఇప్పటికే పెళ్లి నిశ్చయమైన వాళ్లు తమ ప్రి వెడ్డింగ్‌ షూట్‌లు చిత్ర విచిత్రంగా తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఓ జంట తీసుకున్న ప్రీ వెడ్డింగ్‌ షూట్‌ తీవ్ర వివాదానికి దారి తీసింది. మురికి కుంటలో పడిపోయినట్టుగా ఆ జంటకు సంబంధించిన షూట్‌లు తీయడం వైరల్‌గా మారింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

Also Read: KTR Chit Chat: మూసీ ప్రాజెక్ట్ పేరుతో కాంగ్రెస్‌ భారీ అవినీతి, ప్రజల భూముల దోపిడీ: కేటీఆర్‌

ఫొటోల పిచ్చి పీక్స్‌కు చేరినట్టు ప్రీ వెడ్డింగ్‌ షూట్‌ పేరిట జంటలతోపాటు ఫొటోగ్రాఫర్లు చేస్తున్న చేష్టలు దారుణంగా ఉంటున్నాయి. ఎక్కడో తెలియదు కానీ ఒక చోట కాబోయే కొత్త జంట తమ ప్రీ వెడ్డింగ్‌ ఫొటో షూట్‌ నిర్వహించుకున్నారు. కాబోయే దంపతులను మరపురాని విధంగా ఫొటోలు, వీడియోలు తీయాలని ఫొటోగ్రాఫర్లు భిన్నంగా ఆలోచించారు. నీటిలో తేలియాడుతున్నట్టు కనిపించేలా ఫొటోలు, వీడియో తీయాలని నిర్ణయించుకున్నారు.

Also Read: EPS 95 Pension: ఉద్యోగులకు ఉగాది గిఫ్ట్‌.. కనీస పింఛన్‌ రూ.7,500 పెంచేందుకు ఆమోదం?

కొత్త జంటకు తెల్లటి దుస్తులు ధరించారు. అనంతరం ఓ క్వారీ ప్రాంతంలో నిలిచిపోయిన నీళ్లలో వారిని పడుకోబెట్టారు. వధువు ఒకవైపు.. వరుడు మరోవైపు తల పెట్టి నిద్రిస్తుండగా వారిద్దని వీడియోగ్రాఫర్లు, ఫొటోగ్రాఫర్లు వీడియోలు, ఫొటోలు తీశారు. ఆ దృశ్యాలు చూస్తుంటే క్వారీలో పడి ఇద్దరు చనిపోయినట్లు కనిపిస్తున్నాయి. ఆ వీడియోను ఒకరు తీసి సోషల్‌ మీడియాలో పెట్టగా వైరల్‌గా మారింది. ఇప్పటివరకు ఒక మిలియన్‌ మంది చూడగా.. అందరూ కామెంట్‌ చేస్తూ తమ స్పందన తెలియపరుస్తున్నారు.

Also Rea: One Crore Robbery: 24 గంటల్లో రూ.కోటి దోపిడీ కేసు ఛేదన.. శభాష్‌ తెలంగాణ పోలీస్‌!

ఇంతకీ వారి థీమ్‌ ఏమిటంటే నీటిలో చిక్కుపోయినట్టు.. తమ ప్రేమ బంధంలో కూడా నిండా మునిపోయినట్లు ఫొటోగ్రాఫర్లు సరికొత్త థీమ్‌ను రూపొందించారని నెటిజన్లు చెబుతున్నారు. భిన్నంగా.. వినూత్నంగా ప్రీ వెడ్డింగ్‌ షూట్‌ చేసినట్లు భావిస్తున్నారు. వాస్తవంగా ఆ వీడియో చూస్తే మాత్రం ఇద్దరు నీటిలో పడి చనిపోయినట్లు కనిపిస్తోంది. ఇలా దారుణంగా ఎలా తీస్తారని ప్రీ వెడ్డింగ్‌ షూట్‌ తీసే వారిపై ప్రజలు, నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీ పిచ్చి పీక్స్‌కు చేరిందని మండిపడుతున్నారు. ఏమిటిది? ఎందుకు ఇలా తీయించుకోవడం? అని నిలదీస్తున్నారు. కాగా ఆ కొత్త జంట పెళ్లికి ముందే వైరల్‌గా మారారు. అయితే వారు ఎవరు? ఈ ప్రీ వెడ్డింగ్‌ షూట్‌ ఎక్కడ జరిగిందనే వివరాలు మాత్రం తెలియదు. ఆ వీడియో చూస్తుంటే తమిళనాడులో జరిగినట్టు కనిపిస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియోను మీరు చూసి.. మీ స్పందనను కామెంట్‌ రూపంలో తెలపండి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

1057
comment0
Report
RGRenuka Godugu
Mar 18, 2026 10:41:25
Hyderabad, Telangana:

Jyeshtabhishekam at Tirumala 2026: తిరుమల శ్రీవారి దర్శనానికి నిత్యం కొన్ని వేలాది మంది భక్తులు తిరుమలకు చేరుకుంటారు. అందుకే అక్కడ ప్రతిరోజూ శ్రీవారి భక్తలతో, గోవిందనామస్మరణాలతో మర్మోగుతుంది. ఇక రేపు ఉగాది సందర్భంగా తిరుమలలో ఆస్థానం నిర్వహించనున్నారు. ఆ తరువాత శ్రీరామ నవమి, శ్రీరామ పట్టాభిషేకం కూడా ఆస్థానాలు మొత్తంగా మార్చి నెలలో మూడు జరుగుతాయి. ఆస్థానం అంటే 'దర్బారు' అని అర్థం. అయితే తిరుమలలో శ్రీవారికి జ్యేష్టమాసంలో జ్యేష్టాభిషేకాలు కూడా నిర్వహించడం కూడా ఆనవాయితీగా వస్తోంది.. ఇది స్వామివారి నిజరూప దర్శన ఉత్సవం. భక్తులు కూడా ఈ వేడుకను కనులారా తిలకించవచ్చు. ఏడాదికి ఒకసారి కలిగే అరుదైన దర్శన భాగ్యాన్ని మీరు తిలకించాలనుకుంటున్నారా? 

ఈ జ్యేష్టాభిషేకం మూడు రోజులపాటు వైభవంగా నిర్వహిస్తారు. 2026 జూన్ 26వ తేదీ నుంచి జూన్ 28వ తేదీ వరకు నిర్వహిస్తున్నారు . ఈ నేపథ్యంలో 2026 మార్చి 21వ తేదీ నుంచి ఈ ఉత్సవాలకు సంబంధించి ఉదయం 10 గంటల నుంచి జ్యేష్టాభిషేకం టికెట్లు కూడా అందుబాటులో ఉంటాయి. అధికారిక వెబ్సైట్లో https://ttdevasthanams.ap.gov.in/ లో తిరుమల శ్రీవారి భక్తులు బుక్ చేసుకోవచ్చు. 

ప్రతిఏటా శ్రీమలయప్పస్వామికి ఈ జ్యేష్టాభిషేకాలు నిర్వహిస్తారు. ప్రధానంగా స్వామివారి ఉత్సవ మూర్తులు అరిగిపోకుండా.. కళాకాంతులు తరిగిపోకుండా ఈ అభిషేకం నిర్వహించడం ఉత్తమం. అందుకే ఈ ఉత్సవం నిర్వహిస్తారు. ఈ క్రతువు సంపంగి ప్రాకారం కళ్యాణమండపంలో మూడో రోజులపాటు నిర్వహిస్తారు.

 మొదటి రోజు స్వామివారికి ఉన్న సువర్ణకవచాన్ని తొలగించి.. వజ్ర కవచాలు తొడుగుతారు. శ్రీవారి ఉత్సవ మూర్తులను తిరువీధుల్లో ఊరేగిస్తారు. ఇక రెండో రోజు ముత్యాల కవచాన్ని అలంకరించి తిరువీధి ఉత్సవం నిర్వహించి, మూడో రోజు తిరుమంజనం తర్వాత బంగారు కవచాలని మళ్లీ అలంకరిస్తారు. దీన్నే జష్టాభిషేకమని పిలుస్తారు. ప్రతి ఏడాది జేష్ట మాసంలో జేష్ఠ నక్షత్రానికి ముగిసేలా మూడు రోజులపాటు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. మూడు రోజులు పాలు, పెరుగు, తేనె పవిత్ర జలాలతో స్వామివారిని అభిషేకిస్తారు. 

Read more: Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త.. జూన్‌నెల దర్శన, గదుల కోటా విడుదల..!

Read more: Annamayya: 10వ తరగతి పాసైతే ప్రభుత్వ ఉద్యోగాలు.. ఎంపికైతే రూ.34000 జీతం, ఎలా అప్లై చేయాలంటే?

 ఈ నేపథ్యంలో తిరుమల శ్రీవారి ఆలయంలో జూన్ 20వ తేదీన తిరుప్పావడ, వసంతోత్సవం సేవలు జూన్ 21వ తేదీన నిజపాద దర్శనం, 22న కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం ఊంజల్‌సేవలు కూడా టీటీడీ రద్దు చేస్తుంది. ఇక ఈ ఉత్సవానికి సంబంధించిన టిక్కెట్‌ రూ.400 వరకు ఉంటుంది. 

 శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు..
  శ్రీ పరాభవనామ సంవత్సరం ఉగాది సందర్భంగా టీటీడీ చైర్మన్ బీఆర్‌ నాయుడు, ఈవో ముద్దాడ రవిచంద్ర, సిహెచ్ వెంకయ్య చౌదరి తదితరులు ప్రజలకు తెలుగు సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కొత్త సంవత్సరం శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో సుఖ సంతోషాలతో ప్రజలు ఉండాలని వారు ఆకాంక్షించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

1070
comment0
Report
RKRavi Kumar Sargam
Mar 18, 2026 09:31:54
Hyderabad, Telangana:

Telangana Assembly Budget Session: 'ఇది సర్కార్ కాదు.. సర్కస్. అధికార యంత్రాంగం నియంత్రణ తప్పింది. కుక్క తోకను ఆడించటం కాదు, తోక కుక్కను ఆడించినట్టు వ్యవహారం జరుగుతోంది' అంటూ కాంగ్రెస్‌ ప్రభుత్వంపై మాజీ మంత్రి కేటీఆర్‌ చురకలు అంటించారు. 'భూ సేకరణను ఫార్మా సిటీ పేరిట చేసి, ఇప్పుడు రియల్ ఎస్టేట్ కంపెనీలు, ఇతరులకు ఇవ్వాలనే ప్రయత్నం జరుగుతోంది. కాలుష్యం వెదజల్లే ప్రాజెక్టుల మధ్య ప్రజలను ఎలా నివసింపజేస్తారు' అని ప్రశ్నించారు. మూసీ ప్రక్షాళనకు, ఫార్మా సిటీకి శ్రీకారం చుట్టింది కేసీఆర్‌ ప్రభుత్వమేనని, ఎస్‌టీపీలు, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు నిర్మించిన ఘనత కేసీఆర్‌దని మాజీ మంత్రి కేటీఆర్‌ గుర్తుచేశారు. వడ్డీలేని రుణాలు రూ.57 వేల కోట్లు అసెంబ్లీలో చెప్పిన భట్టి, సీతక్క ఎవరూ రాజీనామా చేస్తారో ప్రజలకు చెప్పాలని కోరారు.

Also Read: EPS 95 Pension: ఉద్యోగులకు ఉగాది గిఫ్ట్‌.. కనీస పింఛన్‌ రూ.7,500 పెంచేందుకు ఆమోదం?

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాతో చిట్‌చాట్‌ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మూసీ ప్రాజెక్ట్, వడ్డీలేని రుణాలు, గవర్నర్ ప్రసంగం, పరిపాలనా వైఫల్యాలపై విమర్శలు చేశారు. ఆరు గ్యారంటీల అమలుకు డబ్బులు లేవని చెబుతున్న ప్రభుత్వం, మూసీ ప్రాజెక్ట్‌కు లక్షన్నర కోట్లు ఎలా సమీకరిస్తుందో చెప్పాలని మాజీ మంత్రి కేటీఆర్‌ డిమాండ్ చేశారు. ఆ డబ్బులను ప్రజలకు ఇచ్చే గ్యారంటీలకు వినియోగిస్తే మేలని సూచించారు.

Also Read: One Crore Robbery: 24 గంటల్లో రూ.కోటి దోపిడీ కేసు ఛేదన.. శభాష్‌ తెలంగాణ పోలీస్‌!

'ఏడీబీ రుణంపై మంత్రి శ్రీధర్ బాబు అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. డీపీఆర్‌ ఇచ్చామని చెబుతున్నప్పటికీ వాస్తవానికి డీపీఆర్‌ సమర్పించకపోవడంతోనే ఏడీబీ రుణం మంజూరు కాలేదు. పైసా ఇచ్చినోడు లేడు.. డీపీఆర్‌ లేదు' అని మాజీ మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. 'మూసీ ప్రాజెక్ట్ విషయంలో అధికారులు అతిగా ప్రవర్తిస్తున్నారు. ఆరు నూరైనా పూర్తి చేస్తాం అనే వ్యాఖ్యలు చేయడం వారి అధికార పరిధికి మించినది. ప్రభుత్వ అక్రమాలకు తలొగ్గే అధికారులకు భవిష్యత్తులో తీవ్రమైన పరిణామాలు ఉంటాయి' అని కేటీఆర్‌ హెచ్చరించారు. సభను తప్పుదోవ పట్టించినందుకు మంత్రిపై సభ హక్కుల ఉల్లంఘన నోటీసు ఇస్తామని ప్రకటించారు.

Also Read: School Holiday: విద్యార్థులకు 'పండుగే'.. వరుసగా నాలుగు రోజులు స్కూల్స్‌కు హలీడే

'మూసీ ప్రాజెక్ట్‌కు మేం వ్యతిరేకం కాదు. కానీ దాని పేరిట జరుగుతున్న లూటీకి మాత్రమే వ్యతిరేకం' అని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రజలకు కూడా నోటీసులు ఇస్తూ.. వేలాది కుటుంబాలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని విమర్శించారు. '3,297 ఎకరాలకు నోటిఫికేషన్ ఇచ్చి 10 వేల ఇళ్లను లక్ష్యంగా పెట్టుకుని, ఇప్పుడు 1,400 ఇళ్లు మాత్రమే అంటున్నారు. ఇది పూర్తిగా ప్రజలను మోసం చేసే ప్రక్రియ' అని మండిపడ్డారు. మధు పార్క్ కోసం ప్రత్యేకంగా ఇళ్లు ఇస్తామని ఎందుకు చెబుతున్నారు? మిగతా వారికి ఎందుకు ఇవ్వరు? అని ప్రశ్నించారు.

'గవర్నర్ ప్రసంగంలో కూడా అసత్యాలు ఉన్నాయి. రూ.57 వేల కోట్ల రుణాల అంశంపై ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోంది. నిజంగా ఆ రుణాలు ఇచ్చినట్టు ఆధారాలు చూపిస్తే తాను కచ్చితంగా రాజీనామా చేస్తా' అని మాజీ మంత్రి కేటీఆర్‌ పునరుద్ఘాటించారు. పొంగులేటి, వివేక్, గుత్తా సుఖేందర్ రెడ్డి వంటి నాయకుల ఇళ్లు కూడా అదే జోన్‌లో ఉన్నాయని, రేవంత్ రెడ్డి సోదరుడి ఇల్లు ఎఫ్‌టీఎల్‌లో ఉందని కేటీఆర్‌ గుర్తుచేశారు. మూసీ ప్రాజెక్ట్ మొత్తం రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మారిందని.. గాంధీ సరోవర్, రాహుల్ గాంధీ సరోవర్ పేర్లతో కొత్త నాటకాలు ఆడుతున్నారా? అని కేటీఆర్‌ ప్రశ్నించారు.

అమీన్‌పూర్‌లో కూల్చివేసిన ఇళ్లకు హైకోర్టు స్టే ఇచ్చిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. ప్రభుత్వం చట్టవ్యతిరేక చర్యలు చేపడుతోందని మాజీ మంత్రి కేటీఆర్‌ విమర్శించారు. అసెంబ్లీలో డ్రగ్స్ టెస్ట్ చేయమని తాము సవాల్ విసిరినా ప్రభుత్వం స్పందించలేదని తెలిపారు. తమ పార్టీకి చెందిన వారిపై ఆరోపణలు వచ్చినా విచారణకు సిద్ధమని.. కానీ కాంగ్రెస్‌ పార్టీ మాత్రం తప్పించుకుంటోందని పేర్కొన్నారు. 'బీఆర్‌ఎస్‌ పార్టీ బీ ఫాం మీద గెలిచిన వారికి క్లీన్ చిట్ ఇచ్చారు. మమ్మల్ని తిడితే కూడా ఖండించలేదు. అలాంటప్పుడు కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు వస్తారు? మాకే ప్రభుత్వం తట్టుకోవడం లేదు. కేసీఆర్‌ను ఎలా తట్టుకుంటారు?' అని కేటీఆర్‌ తెలిపారు.

'పొంగులేటి కుమారుడు కబ్జాలు చేసిన ఘటనలో సంబంధిత అధికారిని బదిలీ చేయడం ప్రభుత్వం వైఖరిని చూపుతుంది. కాంగ్రెస్ పాలనలో అవినీతి రోజురోజుకు బయటపడుతోంది. ఇంకా ఎన్నో విషయాలు వెలుగులోకి రావాల్సి ఉంది' అని మాజీ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. మూసీ ప్రాజెక్ట్ పేరుతో భారీ అవినీతి, ప్రజల భూముల దోపిడీ జరుగుతోందని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే పారదర్శకంగా వ్యవహరించాలని కేటీఆర్‌ డిమాండ్ చేశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

1031
comment0
Report
DDDharmaraju Dhurishetty
Mar 18, 2026 07:43:47
Hyderabad, Telangana:

 Python Snake Video Watch: సోషల్ మీడియాలో గత కొద్ది రోజులుగా పాములకు సంబంధించిన వీడియోలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. చాలామంది ఇలాంటి వీడియోలు ఆసక్తిగా చూస్తున్నారు. ముఖ్యంగా కొంతమంది అయితే, ఇలాంటి వీడియోలు విపరీతంగా ఇతరులకు షేర్ చేస్తున్నారు. ముఖ్యంగా పెంపుడు పాములకు సంబంధించిన వీడియోలైతే కొంతమంది రోజు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వస్తున్నారు. పిల్లలు వాటితో ఆడుకుంటున్న క్రమంలో వీడియోలు తీసి కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు ఇంటర్నెట్ను షేక్ చేస్తున్నాయి.. తాజాగా ఇదే ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో వైరల్ అవుతూ వస్తోంది. 

తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూసి నెటిజన్లు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఓ చిన్నారి మెడలో అత్యంత ప్రమాదకరమైన పైథాన్ స్నేక్ పిల్ల ఉండడం మీరు చూడొచ్చు. అయితే, ఈ స్నేక్ ఎంత ప్రమాదకరమో మనందరికీ తెలిసిందే. కానీ ఆ చిన్నారి ఏ మాత్రం భయపడకుండా తన మెడలో ఏకంగా ప్రమాదకరమైన పామును వేసుకొని ఆడుతూ ఉండడం మీరు గమనించవచ్చు. అంతేకాకుండా ఆ చిన్నారి తన రెండు చేతులతో పాములను పట్టుకుని ఉండడం మీరు చూడొచ్చు..

ఈ వీడియోలో ఆ చిన్నారి మొదటగా ఒక చేతును వదిలిపెట్టడంతో పాము తలభాగం అటు ఇటు అనడం మీరు గమనించవచ్చు. అయితే, ఈ సమయంలో ఆ చిన్నారి కాస్త భయపడినప్పటికీ మళ్లీ తిరిగి రెండో చేతిలో కూడా ఆ పాముని పట్టుకొని ఉండడం మీరు చూడొచ్చు. ఏదేమైనా ఇలాంటి ప్రమాదకరమైన పాములను పిల్లల చేతికి ఇవ్వడం డేంజర్ అని వన్యప్రాణి సంరక్షకులు చెబుతున్నారు. ఇవి పెంపుడు పాముల అయినప్పటికీ కొన్ని సందర్భాల్లో.. దాడి చేసే అవకాశాలు కూడా ఉన్నాయని వారు తెలుపుతున్నారు. 

 
 
 
 
 

Read more: Video Viral: వామ్మో.. రన్నింగ్ ట్రైన్ లో యువతి అరాచకం... ఇద్దరు మహిళలు, యువకుడిని కింద పడేసి మరీ.. వీడియో వైరల్..

తాజాగా వైరల్ అవుతున్న వీడియో ఓ ఇంస్టాగ్రామ్ ఖాతా నుంచి షేర్ చేశారు. అయితే, ఈ వీడియోలో ఉన్న పాము పెంపుడుది కావడంతో ఆ చిన్నారిని ఏమీ అనలేకపోయింది. అంతేకాకుండా ఆ చిన్నారి దగ్గరే తల్లిదండ్రుల నుండి వీడియోలు చిత్రీకరించారు. వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇప్పుడు ఇది విపరీతంగా వైరల్ అవుతూ వస్తున్నాయి. ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోను కొన్ని వేల మందికి పైగా సోషల్ మీడియా వినియోగదారులు వీక్షించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా చాలామంది ఈ వీడియోను చూసి కామెంట్లు కూడా చేసినట్లు సమాచారం.

Read more: Video Viral: వామ్మో.. రన్నింగ్ ట్రైన్ లో యువతి అరాచకం... ఇద్దరు మహిళలు, యువకుడిని కింద పడేసి మరీ.. వీడియో వైరల్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

  

1008
comment0
Report
DDDharmaraju Dhurishetty
Mar 18, 2026 07:30:52
Hyderabad, Telangana:

Vivo T5x 5G Price Cut: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వివో భారత్ మార్కెట్లోకి మరో శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. దీనిని కంపెనీ T సిరీస్‌లో భాగంగా అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇది Vivo T5x 5G స్మార్ట్‌ఫోన్ పేరుతో బుధవారం కంపెనీ వినియోగదారుల ముందుకు తీసుకువచ్చింది. మిడిల్ క్లాస్ వినియోగదారులను దృష్టిలో పెట్టుకొని ఈ మొబైల్‌ను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. ఇది అత్యాధునిక ఫీచర్లతో పాటు అద్భుతమైన బ్యాటరీ సామర్థ్యంతో అందుబాటులోకి వచ్చింది. అయితే, ఈ మొబైల్‌కు సంబంధించిన ధర, ఫీచర్స్ వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..

Vivo T5x 5G మొబైల్ ఎంతో శక్తివంతమైన 7200mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఇటీవల వివో కంపెనీ కేవలం 5000mAh బ్యాటరీ మొబైల్స్‌ను మాత్రమే అందుబాటులోకి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే.. అయితే, ఇంత పెద్ద బ్యాటరీ మొబైల్ తీసుకురావడం ఇప్పుడు మార్కెట్లో చర్చనీయాంశంగా మారింది. దీనిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే రెండు రోజులపాటు నిరంతరాయంగా పనిచేస్తుంది. అంతేకాకుండా దీనికి ప్రత్యేకమైన ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఫీచర్ కూడా అందుబాటులో ఉంది. ఇది చాలా ప్రత్యేకమైన 44W ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయంతో అందుబాటులోకి  వచ్చినట్లు కంపెనీ క్లైమ్ చేస్తోంది..

ఈ వివో T5x 5G మొబైల్ వెనుక భాగంలో అద్భుతమైన కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. ఇది చాలా ప్రత్యేకమైన 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో కూడిన డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఫ్రంట్ భాగంలో సెల్ఫీ కోసం 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఇక ఈ మొబైల్‌కు సంబంధించిన డిస్ప్లే విషయానికొస్తే.. ఇందులో 6.72 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ (FHD+) LED డిస్ప్లేను అందిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. అంతేకాకుండా ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంటుంది.. దీనివల్ల గేమింగ్‌తో పాటు వీడియోలు చూసేవారికి అద్భుతమైన స్ట్రీమింగ్ అనుభవం లభిస్తుంది.

ఈ వివో T5x 5G స్మార్ట్‌ఫోన్‌ ఎంతో శక్తివంతమైన క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 1 (Snapdragon 6 Gen 1) ప్రాసెసర్‌పై పనిచేస్తుంది.. అంతేకాకుండా ఇది అద్భుతమైన స్పీడ్ 5g కనెక్టివిటీ సపోర్టుతో లభిస్తుంది. దీనివల్ల ఇంటర్నెట్ వేగం చాలా వరకు పెరుగుతుంది. ఇక ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ (Funtouch OS) ఆపరేటింగ్ సిస్టంపై రన్ అవుతుంది. సెక్యూరిటీ కోసం ఇందులో కంపెనీ  సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కూడా అందించినట్లు తెలుస్తోంది. దీంతోపాటు ఎన్నో రకాల ప్రత్యేకమైన ఫీచర్లు అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read: Redmi 14C 5G Offer: రెడ్‌మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్‌ఫోన్..అదిరిపోయే ఆఫర్!

వివో T5x 5G వేరియంట్ల వారీగా ధరల వివరాల్లోకి వెళ్తే.. మొదటి స్టోరేజ్ వేరియంట్  4GB RAM + 128GB స్టోరేజ్‌తో సుమారు రూ. 12,999 ధరతో అందుబాటులో ఉంది. ఇక రెండవ వేరియంట్ 6GB RAM + 128GB స్టోరేజ్‌తో ధర సుమారు రూ.14,999తో లభిస్తోంది. ఇక చివరి  వేరియంట్ 8GB RAM + 128GB స్టోరేజ్‌తో ధర సుమారు రూ. 15,999తో అందుబాటులో ఉంది. అయితే, ఆఫర్స్‌లో భాగంగా దీనిని ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేసే వారికి ప్రత్యేకమైన బ్యాంక్ ఆఫర్స్ లభిస్తున్నాయి. అంతేకాకుండా Vivo ఇండియా ఈ స్టోర్‌లో కొనుగోలు చేసే వ్యక్తులకు కూడా అద్భుతమైన రూ.1000 వరకు బ్యాంక్ ఆఫర్ లభిస్తోంది. కాబట్టి అత్యంత తక్కువ ధరలోనే మంచి మొబైల్ కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది అద్భుతమైన అవకాశం.

Also Read: Redmi 14C 5G Offer: రెడ్‌మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్‌ఫోన్..అదిరిపోయే ఆఫర్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

959
comment0
Report
DDDharmaraju Dhurishetty
Mar 18, 2026 07:13:51
Hyderabad, Telangana:

Samsung Galaxy M17e 5g Price Cut: ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం సాంసంగ్ భారత్ మార్కెట్లోకి కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ విడుదల చేసింది. దీనిని గెలాక్సీ సిరీస్‌లో అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇది గెలాక్సీ m17e పేరుతో గ్రాండ్‌గా లాంచ్ అయింది. మధ్యతరగతి వినియోగదారులను దృష్టిలో పెట్టుకొని ఈ మొబైల్ ను రూపొందించినట్లు కంపెనీ వెల్లడించింది. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్ అద్భుతమైన ఫీచర్లతో పాటు అత్యాధునిక కెమెరా సెటప్‌తో కేవలం రూ. 12,999 ధరతో అందుబాటులోకి వచ్చింది. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన పూర్తి వివరాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

ఇక ఈ సాంసంగ్ గెలాక్సీ M17e 5G స్మార్ట్‌ఫోన్స్‌కు సంబంధించిన ఫీచర్స్ వివరాల్లోకి వెళ్తే.. ఇది 6.7 అంగుళాల HD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. అంతేకాకుండా 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. అలాగే స్క్రోలింగ్ చేసే వారికి స్మూతీంగ్ అనుభవాన్ని అందిస్తుంది. అంతేకాకుండా ఈ మొబైల్ ఎంతో శక్తివంతమైన 6,000mAh భారీ బ్యాటరీతో విడుదలైంది. ఒక్కసారి చార్జ్ చేస్తే ఏకంగా 26 గంటల పాటు నిరంతరం వీడియో ప్లే బ్యాక్ అందిస్తుంది. అంతేకాకుండా ఫాస్ట్ ఛార్జింగ్ కోసం 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో విడుదలైనట్లు తెలుస్తోంది. 

ఈ స్మార్ట్‌ఫోన్ ఎంతో శక్తివంతమైన మీడియాటెక్ డైమెన్సిటీ 6300 (Dimensity 6300) 5G చిప్‌సెట్‌ ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది. కాబట్టి మల్టీ టాస్కింగ్ చేసేందుకు ఎంతగానో సహాయపడుతుంది. దీంతోపాటు ఈ మొబైల్ వెనక భాగం అద్భుతమైన కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. ఇది 50MP ప్రధాన కెమెరాతో పాటు 2MP డెప్త్ సెన్సార్‌తో అందుబాటులోకి వచ్చింది. ఇక ఫ్రంట్ భాగంలో ఎంతో ప్రత్యేకమైన 8MP సెల్ఫీ కెమెరా కూడా లభిస్తుంది. దీంతోపాటు ఆండ్రాయిడ్ 16 ఆధారిత One UI 8.0 ఆపరేటింగ్ సిస్టంపై పని చేస్తుంది. ఇందులో సాంసంగ్ కంపెనీ ఆరు ఏళ్లపాటు ఆపరేటింగ్ సిస్టం అప్డేట్‌ని అందిస్తోంది. దీంతోపాటు సెక్యూరిటీ ప్రత్యేకమైన అప్డేట్లను కూడా అందిస్తున్నట్లు హామీ ఇస్తోంది.

Also Read: Redmi 14C 5G Offer: రెడ్‌మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్‌ఫోన్..అదిరిపోయే ఆఫర్!

గెలాక్సీ M17e 5G స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన ధర వివరాల్లోకి వెళ్తే.. దీనిని కంపెనీ రెండు స్టోరేజ్ ఆప్షన్స్‌లో అందుబాటులోకి తీసుకువచ్చింది. ముఖ్యంగా మొదటి స్టోరేజ్ వేరియెంట్  4GB RAM + 128GB స్టోరేజ్‌తో ధర రూ. 12,999తో అందుబాటులో ఉంది. ఇక రెండవ స్టోరీ వేరియంట్  6GB RAM + 128GB స్టోరేజ్‌తో ధర రూ. 14,499తో అందుబాటులోకి వచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్ మొత్తం రెండు కలర్ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంది. ప్రస్తుతం లాంచింగ్ ఆఫర్స్‌లో భాగంగా కొనుగోలు చేసే వారికి బ్యాంకు క్రెడిట్ కార్డ్ ఆఫర్ కింద రూ.1,250 వరకు తక్షణమైన డిస్కౌంట్ లభిస్తుంది. దీంతోపాటు అమెజాన్‌తో పాటు ఇతర ఈ కామర్స్ వెబ్సైట్‌లో కొనుగోలు చేసే వారికి మరెన్నో అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్స్ లభిస్తున్నాయి. కాబట్టి ఈ స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలనుకునే వారికి ఇదే అద్భుతమైన అవకాశంగా భావించవచ్చు..

Also Read: Redmi 14C 5G Offer: రెడ్‌మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్‌ఫోన్..అదిరిపోయే ఆఫర్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

1094
comment0
Report
HDHarish Darla
Mar 18, 2026 07:06:18
Hyderabad, Telangana:

RRB Loco Pilot Recruitment 2026: భారతీయ రైల్వే రంగం దేశంలోనే ప్రభుత్వ రంగ సంస్థలలో ఒకటి. ఇది కేంద్ర ప్రభుత్వ నియంత్రణలో పనిచేయడమే కాకుండా అందులో పనిచేసే ఉద్యోగులకు  మంచి జీతాలు, ప్రయోజనాలు, శాశ్వత ఉద్యోగం వంటి అనేక సౌకర్యాలు లభిస్తాయి. ఇదే కారణంగా రైల్వే ఉద్యోగాలకు యువత పోటీ పడుతుంటారు. కేవలం రైల్వే జాబుల కోసం ఉద్యోగార్థులు తమని తాము సిద్ధం చేసుకుంటున్నారు. ఇదే క్రమంలో రైల్వే శాఖ భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏఏ పోస్టుల భర్తీకి రంగం సిద్ధం చేసింది? జీతం ఎంత మేర లభిస్తుందనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. 

భారతీయ రైల్వే శాఖ తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. దేశవ్యాప్తంగా 11,127 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టులను ఈసారి భర్తీ చేయనున్నారు. వీటిలో మొత్తం 674 ఖాళీలను దక్షిణ మధ్య రైల్వేలో భర్తీ చేస్తున్నారు. ఈ పోస్టులు కేవలం తెలుగు రాష్ట్రాల్లో భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగానికి అర్హత, ఆసక్తి ఉన్నవారు మే 15వ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు. 

విద్యార్హత
భారతీయ రైల్వేలో అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు కనీసం పదో తరగతి (ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యాసంస్థ నుంచి) పూర్తిచేసి ఉండాలి. ఫిట్టర్, మెకానిక్, ఎలక్ట్రీషియన్, డీజిల్ ఇంజన్ మొదలైన సంబంధిత రంగాలలో ఐటీఐ పూర్తి చేసి ఉండటం తప్పనిసరి చేశారు. ఇంజనీరింగ్ డిప్లొమా లేదా డిగ్రీ ఉన్న అభ్యర్థులు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులుగా నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. 

నెల జీతం ఎంతంటే?
రైల్వేలో అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగానికి వయోపరిమితి 18 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం సామాజిక వర్గాల ఆధారంగా వయో సడలింపు ఉంది. దీని ప్రకారం ఎస్సీ, ఎస్టీ వర్గాలకు 5 ఏళ్లు, ఓబీసీ వర్గాలకు 3 ఏళ్లు, మాజీ సైనికులకు 3 ఏళ్లు, ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు 10 ఏళ్లు వయో సడలింపు ఇస్తున్నారు. నెలసరి జీతం విషయానికొస్తే.. భారతీయ రైల్వేలో అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుకు ఎంపికైన వారికి రూ.19,900 నుంచి రూ.63,200 వరకు జీతం చెల్లించనున్నట్లు సమాచారం. 

ఎంపిక ప్రక్రియ ఎలా?
భారతీయ రైల్వేలో అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుకు ఎంపిక ప్రక్రియ నాలుగు దశల్లో జరుగుతుంది. అభ్యర్థులు మొదట CBT-1 పరీక్షకు హాజరు కావాలి. ఆ తర్వాత సాంకేతిక, సాధారణ సబ్జెక్టులను కవర్ చేస్తూ CBT-2 కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఉంటుంది. మూడవదిగా కంప్యూటర్ ఆధారిత ఆప్టిట్యూడ్ టెస్ట్ లేదా సైకలాజికల్ టెస్ట్ నిర్వహిస్తారు. చివరగా, డాక్యుమెంట్ వెరిఫికేషన్, వైద్య పరీక్ష నిర్వహించి, అర్హులైన అభ్యర్థులను ఉద్యోగానికి ఎంపిక చేస్తారు. 

దరఖాస్తు తేదీ
లోకో పైలట్ ఉద్యోగానికి అర్హత, ఆసక్తి ఉన్నవారు భారతీయ రైల్వేలో అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుకు మే 15 నుండి జూన్ 14 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని నోటిఫికేషన్‌లో తెలియజేశారు. ఈ ఉద్యోగం కోసం మీరు rrbapply.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. లోకో పైలట్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునేందుకు (ఓసీ అభ్యర్థులైన పురుషులు) రూ.500 రుసుము చెల్లించాల్సి ఉంటుంది. పరీక్ష రాసిన తర్వాత రూ.400 మీ బ్యాంక్ ఖాతాకు తిరిగి చెల్లిస్తారు. అదే విధంగా మహిళలు, ఎస్సీ, ఎస్టీ వర్గాల వారు రూ.250 దరఖాస్తు రుసుము చెల్లిస్తే సరిపోతుంది. 

దరఖాస్తు ఎలా చేయాలి?
1.
ముందుగా
https://rrbsecunderabad.gov.in/ వెబ్‌సైట్‌కు వెళ్లాలి. హోమ్ పేజీలో "అసిస్టెంట్ లోకల్ పైలట్ పే లెవల్-2 కోసం దరఖాస్తు చేసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి" అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి.

2. ఆ తర్వాత ఒక కొత్త పేజీ కనిపిస్తుంది. అందులో యాప్ బటన్‌పై క్లిక్ చేసి, రిజిస్ట్రేషన్‌ను చేసుకోవాలి.

3. అందులో మీరు మీ పేరు, ఈ-మెయిల్, మొబైల్ నంబర్‌ను నమోదు చేసి, పాస్‌వర్డ్‌ను క్రియేట్ చేయాలి. 

4. అభ్యర్థులు తాము దరఖాస్తు చేయాలనుకుంటున్న రైల్వే బోర్డులో పోస్టులను, జోన్‌ను ఎంచుకోవాలి.

5. ఆ తర్వాత దరఖాస్తు ఫారం కనిపిస్తుంది. అందులో అడిగిన విద్యార్హత, అనుభవం మొదలైన వివరాలతో మీరు దానిని సరిగ్గా నింపాలి. 

6. దరఖాస్తు ఫారంలో పేర్కొన్న నియమాల ప్రకారం మీరు ఫోటోగ్రాఫ్, సంతకం మొదలైనవాటిని తప్పనిసరిగా అప్‌లోడ్ చేయాలి.

7. అన్ని వివరాలను నింపిన తర్వాత, సరిచూసుకోవడానికి ప్రివ్యూ ఆప్షన్‌పై క్లిక్ చేసి, తనిఖీ చేసిన తర్వాత అంతా సవ్యంగా ఉంటే దరఖాస్తును సబ్మిట్ చేయాలి.

8. ఆ వెంటనే అభ్యర్థులు దరఖాస్తు రుసుమును చెల్లించాలి. ఈ రుసుమును నెట్ బ్యాంకింగ్, డెబిట్, క్రెడిట్, యూపీఐ ద్వారా చెల్లించవచ్చు. 

9. దీని తర్వాత, భవిష్యత్‌లో అవసరాల కోసం మీ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అందువల్ల, దరఖాస్తు చేసుకోవడానికి అర్హులైన వారు మే 15వ తేదీ నుండి అప్లై చేయోచ్చని తెలియజేస్తున్నాము.

Also Read: EPS-95 Pension Hike: ఉద్యోగులకు షాకింగ్ న్యూస్! పెన్షన్ రూ.7,500 పెంపుపై మోదీ సర్కార్ కీలక ప్రకటన.. లోక్‌సభ సాక్షిగా..!

Also Read: Redmi A5 Sale: కేవలం రూ.7,599 ధరకే కొత్త మొబైల్ కొనేయండి! 5200mAh బ్యాటరీతో మార్కెట్లోకి బ్రాండ్‌ న్యూ స్మార్ట్‌ఫోన్!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

1099
comment0
Report
HDHarish Darla
Mar 18, 2026 05:55:17
Hyderabad, Telangana:

EPS-95 Pension Hike 2026: ఉద్యోగులకు ముఖ్య గమనిక! దేశంలోని ప్రైవేట్ ఉద్యోగులకు ఇచ్చే కనీస పెన్షన్ రూ.1,000 నుంచి రూ.7,500లకు పెంచాలని డిమాండ్స్ వెల్లువెత్తుతున్న క్రమంలో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. అందుకు సంబంధించిన నిర్ణయాన్ని కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ లోక్‌సభ వేదికగా వెల్లడించారు.

ఉద్యోగులకు చెందిన ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) నుంచి ఓ కీలక అప్‌డేట్ రానుంది. 1995 నాటి ఉద్యోగుల పెన్షన్ కోసం ప్రవేశపెట్టిన ఈ పథకం కింద కనీస నెలసరి పెన్షన్‌ను రూ.7,500కు పెంచాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నారు. తాజాగా మార్చి 16న లోక్‌సభలో కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా ఓ కీలక ప్రకటన చేశారు. ప్రభుత్వానికి ఈపీఎస్-95 పెన్షన్ పెంచే యోచన లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ పథకం కింద పెన్షనర్లకు ప్రస్తుతం రూ.1,000 ఇస్తున్నారు. 

అదే విధంగా కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ నివేదించిన గ్రాంట్ల డిమాండ్లు (2026-27)పై 15వ నివేదికలో కూడా ఉద్యోగుల పెన్షన్ పథకం కింద నెలకు రూ.1,000 కనీస పెన్షన్‌గా పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది EPS-95 పెన్షనర్లు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని కనీస పెన్షన్‌ను పెంచాలని కోరుతూ పెన్షనర్లు పలు పిటిషన్లు దాఖలు చేశారు. 

రూ.15,000 కంటే తక్కువ మూల వేతనం (బేసిక్ పే) ఉన్నవారు మాత్రమే పింఛను పథకం పరిధిలోకి వస్తారు. 1995 నాటి ఉద్యోగుల పింఛను పథకానికి భారత సర్కార్ ఇప్పటికే ఆర్థిక సహాయం అందిస్తోందని కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇది ప్రభుత్వ వార్షిక వేతన వాటా అయిన 1.16 శాతానికి సమానం, దీనికి బడ్జెట్ మద్దతు కూడా ఉంది. ఈ క్రమంలో ఈపీఎస్ పెన్షన్‌ను పెంచే ఉద్దేశం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. 

నిజానికి, ఈపీఎస్-95 ఉద్యోగుల పెన్షన్ పథకం కింద ప్రస్తుతం రూ.1,000 నెలసరి ఇస్తున్న పింఛను సరిపోడం లేదనే వాదనలు వస్తున్నాయి. ఈ క్రమంలో కనీస పెన్షన్‌ను రూ.7,500లకు పెంచాలని పెన్షనర్లు, ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. అయితే పెన్షనర్ల డిమాండ్‌పై ప్రభుత్వం నుంచి ఎలాంటి సుముఖత లేకపోవడం వల్ల ఇటీవలే పెన్షనర్లు ఉద్యోగ సంఘాలు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మూడు రోజుల నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.

Also Read: Redmi A5 Sale: కేవలం రూ.7,599 ధరకే కొత్త మొబైల్ కొనేయండి! 5200mAh బ్యాటరీతో మార్కెట్లోకి బ్రాండ్‌ న్యూ స్మార్ట్‌ఫోన్!

Also Read: Vijay Trisha Relationship: హీరో విజయ్, త్రిష పెళ్లికి గ్రీన్‌ సిగ్నల్! హింట్ ఇచ్చిన హీరోయిన్..పెళ్లి డేట్ ప్రకటించేంది ఆ రోజే!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

1060
comment0
Report
DDDharmaraju Dhurishetty
Mar 18, 2026 05:25:24
Hyderabad, Telangana:

Mahalakshmi Rajayoga Effect On Zodiac Telugu: గ్రహాల గమనాలు మానవ జీవితాలపై ఎంత ప్రభావం చూపుతాయో మనందరికీ తెలిసిందే. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ప్రస్తుతం విగ్రహ స్థితిగతుల్లో వస్తున్న మార్పులు కొన్ని రాశుల వారికి అద్భుతమైన యోగాలను తెచ్చిపెట్టబోతున్నాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా మార్చి 16వ తేదీ సోమవారం సాయంత్రం కుంభరాశిలోకి సేనాధిపతిగా భావించే.. కుజుడు సంచారం చేశాడు. అలాగే అదే సమయంలో చంద్రుడితో కలయిక జరపడం విశేషం. అయితే, చంద్రుడు, కుజుడు కలయిక కారణంగానే ఎంతో శక్తివంతమైన మహాలక్ష్మి రాజయోగం కూడా ఏర్పడింది. ఈ యోగం చాలా శక్తివంతమైనదిగా చెప్పుకుంటారు.

సోమవారం సాయంత్రం 6 గంటల సమయంలో చంద్రుడు కుంభరాశిలోకి ప్రవేశించడంతో ఈ రాజయోగ ప్రభావం ప్రారంభమైంది. మార్చి 18వ తేదీ రాత్రి 11 గంటల వరకు అంటే, దాదాపు రెండున్నర రోజులపాటు దీని ప్రభావం బలంగా ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. అంతేకాకుండా ఆ తర్వాత రోజుల్లో కూడా దీని ప్రభావం కాస్త ఉండే అవకాశాలు ఉన్నాయని వారు చెబుతున్నారు. అయితే, తక్కువ సమయంలోనే ఈ రెండు గ్రహాల కలయిక జరగడం వల్ల కొన్ని రాశుల వారికి ఊహించని ధన లాభాలతో పాటు వృత్తిపరమైన జీవితంలో ఎదుగుదల కనిపించబోతోంది. అంతేకాకుండా ఆర్థికంగా చాలా వరకు కలిసి రాబోతోంది.

మేషరాశి 
మేషరాశి వారికి ప్రస్తుతం శని ప్రభావం కొంత ఇబ్బందులు కలిగిస్తున్నప్పటికీ.. ఈ మహాలక్ష్మి రాజయోగం కాస్త ఉపశమనం అందిస్తుంది. ముఖ్యంగా ఈ సమయంలో పెండింగ్‌లో ఉన్న ప్రతి పని వేగంగా పూర్తవుతుంది. అలాగే అకస్మాత్తుగా కూడా భారీ మొత్తంలో ధన లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడటమే కాకుండా మానసిక ప్రశాంతత కూడా లభించబోతోంది. దీర్ఘకాలిక సమస్యలు కూడా ఎంతో సులభంగా తొలగిపోతాయి..

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

కర్కాటక రాశి 
కర్కాటక రాశిలో జన్మించిన వ్యక్తులకు కూడా చంద్రుడి ప్రభావం అద్భుతమైన ప్రయోజనాలను అందించబోతోంది. వీరికి అదృష్టం రెట్టింపు కాబోతోంది. దీంతోపాటు భూమి లేదా ఆస్తి తగాదాలు కూడా తొలగిపోతాయి. కోర్టు సంబంధిత కేసుల్లో ఉన్న వ్యక్తులకు ఈ సమయంలో అనుకూలమైన తీర్పులు వస్తాయి. దీంతోపాటు గతంలో నిలిచిపోయిన డబ్బులు కూడా తిరిగి పొందగలుగుతారు. వ్యాపారస్తులకు నూతన పెట్టుబడులు చాలా లాభదాయకంగా ఉంటాయి. అంతేకాకుండా వ్యాపారాలను విస్తరించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.

వృశ్చిక రాశి 
వృశ్చిక రాశిలో జన్మించిన వ్యక్తులకు అధిపతి కుజుడుగా ఉంటాడు. కాబట్టి వృశ్చిక రాశి వారికి కూడా కుజుడు, చంద్రుడి కలయిక అద్భుతమైన ప్రయోజనాలను అందించబోతోంది. వీరికి ఈ సమయంలో గౌరవ మర్యాదలు కూడా విపరీతంగా పెరుగుతాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ లేదా జీతాలు కూడా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా గతంలో చేసిన కష్టాలకు తగిన ప్రతిఫలం కూడా లభించబోతోంది. అలాగే అనుకూలమైన ధన లాభాలు సొంతం చేసుకోవడం వల్ల అన్నింట్లో విజయాలు సాధించగలుగుతారు.

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

1042
comment0
Report
Advertisement
Back to top