విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ నుండి మంటలు, భయందోళనలో భక్తులు
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Gruhalakshmi Yojana Status Check: రాష్ట్రంలోని కోట్లాది మంది మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం సంక్రాంతి పండుగ వేళ తీపి కబురు అందించింది. సాంకేతిక కారణాల వల్ల గత రెండు నెలలుగా నిలిచిపోయిన గృహలక్ష్మి పథకం నిధులను విడుదల చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెండింగ్లో ఉన్న రెండు విడతల సొమ్మును (రూ.4,000) నేటి నుండే (జనవరి 14) దశలవారీగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు.
24, 25వ విడతల నిధులు విడుదల
గృహలక్ష్మి పథకం కింద అర్హులైన మహిళలకు నెలకు రూ.2,000 చొప్పున ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు 24వ, 25వ విడతలకు సంబంధించిన నిధుల విడుదలకు ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
తొలి దశ: బెంగళూరుతో సహా 26 జిల్లాల్లో 25వ విడత డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (DBT) ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది.
పెండింగ్ బకాయిలు: గతంలో నిలిచిపోయిన విడతల ఫైళ్లు కూడా చివరి దశలో ఉన్నాయని, త్వరలోనే ఆ రూ.4,000 కూడా ఖాతాల్లో పడతాయని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి లక్ష్మీ హెబ్బాళ్కర్ స్పష్టం చేశారు.
ముఖ్యమైన వివరాలు..
లబ్ధిదారుల సంఖ్య: రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1.2 కోట్లకు పైగా మహిళలు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందుతున్నారు.
నిధుల జమ: పండుగ కానుకగా నేటి నుండే దశలవారీగా నగదు బదిలీ ప్రక్రియ మొదలైంది. ఒకేసారి కాకుండా జిల్లా వారీగా అకౌంట్లలో డబ్బులు జమ అవుతాయి.
రేషన్ కార్డు రద్దు అయితే పరిస్థితి ఏంటి?
ఇటీవల ప్రభుత్వం అనర్హులైన వారి BPL (బిపిఎల్) కార్డులను రద్దు చేస్తున్న నేపథ్యంలో కొన్ని సందేహాలు తలెత్తాయి.
అర్హత ఉంటేనే: ఒకవేళ పొరపాటున అర్హత కలిగిన లబ్ధిదారుల కార్డు రద్దు అయితే, వారు తగిన ఆధారాలతో అధికారులకు వివరణ ఇచ్చి మళ్ళీ పథకాన్ని పునరుద్ధరించుకోవచ్చు.
నిబంధన: లబ్ధిదారురాలు ఆదాయపు పన్ను (Income Tax) చెల్లింపుదారు అయి ఉండకూడదు.
అక్రమాలపై వేటు: అక్రమంగా కార్డులు పొందిన వారిపై చర్యలు తీసుకుంటూనే, నిజమైన పేదలకు అన్యాయం జరగకుండా చూస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది.
పండుగ పూట తమ ఖాతాల్లోకి డబ్బులు చేరుతుండటంతో మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మీ ఖాతాలోకి నగదు జమ అయిందో లేదో మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్కు వచ్చే మెసేజ్ ద్వారా లేదా సంబంధిత వెబ్సైట్లో స్టేటస్ చెక్ చేసుకోవచ్చు.
Also Read: ICC T20 World Cup: అమెరికాకు భారత్ షాక్..పాకిస్థాన్ పౌరులు భారత గడ్డపై అడుగుపెట్టడానికి వీలులేదు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Cervical Cancer Cure: భారతదేశంలో మహిళలు ఎదుర్కొంటున్న ప్రధాన ఆరోగ్య సమస్యలలో గర్భాశయ క్యాన్సర్ (Cervical Cancer) రెండవ స్థానంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఇది నాలుగవ అత్యంత సాధారణ క్యాన్సర్. సరైన అవగాహన ఉంటే దీనిని 100% నివారించే అవకాశం ఉన్నప్పటికీ, అవగాహన లేకపోవడం, పరీక్షలకు దూరంగా ఉండటం వల్ల చాలా మంది ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. అయితే గర్భాశయ క్యాన్సర్ ముప్పు ఎలా వస్తుంది? దాని నుంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం..తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? అనే వివరాలను ప్రసిద్ధ ఫెర్నాండేజ్ హాస్పిటల్ గైనకాలజిస్టు వైద్య నిపుణురాలు డాక్టర్ విద్యావతి మాటల్లోనే తెలుసుకుందాం.
సెర్విక్స్ అంటే ఏమిటి? అది చేసే పనులేంటి?
సెర్విక్స్ లేదా గర్భాశయ ముఖద్వారం అనేది గర్భాశయానికి, యోనికి మధ్య ఉండే ఒక కండరాల ద్వారం. ఇది పునరుత్పత్తి వ్యవస్థలో మల్టీ టాస్కర్ లాగా పనిచేస్తుంది. బాహ్య ఇన్ఫెక్షన్లు గర్భాశయంలోకి వెళ్లకుండా అడ్డుకుంటుంది. పీరియడ్స్ సమయంలో రక్తం బయటకు వెళ్లేలా, ఫలదీకరణం సమయంలో శుక్రకణాలు లోపలికి వెళ్లేలా చేస్తుంది. శిశువు జనన సమయంలో ఇది వ్యాకోచించి ప్రసవం సులభతరం చేస్తుంది.
గర్భాశయ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పులు
గర్భాశయానికి వచ్చే సమస్యలు సాధారణ వాపు (Inflammation) నుండి క్యాన్సర్ వరకు రకరకాలుగా ఉండవచ్చు.
గర్భాశయ డిస్ప్లాసియా: ఇది క్యాన్సర్ రావడానికి ముందు కణాలలో జరిగే మార్పు. ఇది కంటికి కనిపించదు.
HPV వైరస్: గర్భాశయ క్యాన్సర్కు ప్రధాన కారణం హ్యూమన్ పాపిల్లోమా వైరస్ (HPV). ఇది చాలా కాలం పాటు శరీరంలో ఉంటే క్యాన్సర్గా మారే ప్రమాదం ఉంది.
పాలిప్స్: గర్భాశయంలో పెరిగే చిన్న గడ్డలు. ఇవి అన్నీ క్యాన్సర్ కానప్పటికీ, వైద్యుని సంప్రదించడం ముఖ్యం.
ఆరోగ్యాన్ని కాపాడుకునే 5 సూత్రాలు
పరిశుభ్రత: పీరియడ్స్ సమయంలో నాణ్యమైన శానిటరీ ప్యాడ్లు వాడాలి. అదే విధంగా వాటిని నిర్ణీత సమయానికి మారుస్తూ ఉండాలి. వ్యక్తిగత పరిశుభ్రత పట్ల అపోహలను విడనాడాలి.
స్క్రీనింగ్ పరీక్షలు: 25 ఏళ్లు దాటిన మహిళలు క్రమం తప్పకుండా పాప్ స్మెర్ (Pap Smear). HPV స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలి. దీనివల్ల క్యాన్సర్ను రాకముందే గుర్తించవచ్చు.
టీకా (Vaccination): HPV వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా గర్భాశయ క్యాన్సర్ను సమర్థవంతంగా నివారించవచ్చు. 11-12 ఏళ్ల నుండి 26 ఏళ్ల వయస్సు లోపు ఈ టీకా తీసుకోవడం శ్రేయస్కరం.
జీవనశైలి మార్పులు: ధూమపానం మానుకోవాలి. ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తగ్గించి, పోషకాహారం తీసుకోవాలి.
లక్షణాలను గుర్తించడం ఎలా: పొత్తికడుపు నొప్పిని లేదా అసాధారణ రక్తస్రావాన్ని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు.
అప్రమత్తం చేయాల్సిన హెచ్చరిక సంకేతాలు
మీ శరీరంలో ఈ క్రింది మార్పులు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించండి.
1) యోని నుండి విపరీతమైన స్రావం (Discharge).
2) స్రావం రంగు లేదా వాసనలో మార్పు రావడం.
3) పీరియడ్స్ మధ్యలో లేదా శృంగారం తర్వాత రక్తస్రావం కావడం.
4) శృంగార సమయంలో విపరీతమైన నొప్పి.
5) పొత్తికడుపు లేదా నడుము భాగంలో మొండి నొప్పి.
చివరిగా.. గర్భాశయ క్యాన్సర్ అకస్మాత్తుగా రాదు. ఇది శరీరంలో కణాల మార్పు ద్వారా నెమ్మదిగా మొదలవుతుంది. కాబట్టి, క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం వల్ల కోలుకునే అవకాశాలు 100% పెరుగుతాయి. మీ శరీరం ఇచ్చే చిన్న సంకేతాన్ని కూడా విస్మరించకండి.
Also Read: ICC T20 World Cup: అమెరికాకు భారత్ షాక్..పాకిస్థాన్ పౌరులు భారత గడ్డపై అడుగుపెట్టడానికి వీలులేదు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
EPF Withdrawal Rules Reform: సాధారణంగా పీఎఫ్ (PF) డబ్బును రిటైర్మెంట్ తర్వాత అవసరాల కోసం దాచుకుంటాం. అయితే అత్యవసర సమయాల్లో ఆ డబ్బును విత్డ్రా చేసుకోవడానికి గతంలో కఠినమైన నిబంధనలు ఉండేవి. ఇప్పుడు EPFO తన నిబంధనలను సరళీకరించి, బ్యాంక్ నుండి నగదు తీసుకున్నంత సులభంగా పీఎఫ్ విత్డ్రాలను మార్చింది.
ముఖ్యమైన మార్పు
గతంలో పీఎఫ్ డబ్బు తీసుకోవాలంటే కనీసం రెండు నుండి ఐదు సంవత్సరాల సర్వీస్ ఉండాలనే నిబంధన ఉండేది. కానీ ఇప్పుడు కేవలం 12 నెలల (ఒక సంవత్సరం) ఉద్యోగ కాలం పూర్తయితే చాలు, అత్యవసర పరిస్థితుల్లో మీ నిధుల నుండి నగదు విత్డ్రా చేసుకోవచ్చు.
ఏఏ కారణాల కోసం విత్డ్రా చేసుకోవచ్చు..
కొత్త నిబంధనల ప్రకారం వివిధ అవసరాల కోసం నగదు తీసుకునే పరిమితులు ఇలా ఉన్నాయి.
| అవసరం (Purpose) | ఎన్నిసార్లు తీసుకోవచ్చు (Frequency) | గరిష్ట పరిమితి |
| అనారోగ్యం (Medical) | ఏడాదికి 3 సార్లు | 6 నెలల ప్రాథమిక వేతనం లేదా ఉద్యోగి వాటా మొత్తం |
| విద్య (Education) | మొత్తం సర్వీసులో 10 సార్లు | ఉద్యోగి వాటాలో 50% వరకు |
| వివాహం (Marriage) | మొత్తం సర్వీసులో 5 సార్లు | ఉద్యోగి వాటాలో 50% వరకు |
| ఇల్లు / స్థలం (Housing) | మొత్తం సర్వీసులో 5 సార్లు | నిబంధనల ప్రకారం (సుమారు 90% వరకు) |
| కారణం లేకుండా (Non-Para) | ఏడాదికి 2 సార్లు | ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే |
75%, 100% విత్డ్రా ఎప్పుడు చేయవచ్చు?
ఉద్యోగం కోల్పోతే: మీరు ఉద్యోగం కోల్పోయిన నెల రోజుల్లోనే మీ పీఎఫ్ బ్యాలెన్స్లో 75 శాతం మొత్తాన్ని తీసుకోవచ్చు. మిగిలిన 25 శాతాన్ని రిటైర్మెంట్ నిధి కోసం ఖాతాలో ఉంచడం మంచిది.
పూర్తి విత్డ్రా (100%): వరుసగా రెండు నెలల పాటు నిరుద్యోగిగా ఉంటే లేదా రిటైర్మెంట్ సమయంలో పూర్తి నగదును విత్డ్రా చేసుకోవచ్చు.
చక్రవడ్డీ నష్టం
అయితే పీఎఫ్ సంస్థ గణాంకాల ప్రకారం.. 75% ఖాతాల్లో రూ.50,000 కంటే తక్కువ బ్యాలెన్స్ ఉంటోంది. దీనివల్ల ఉద్యోగులు 8.25% చక్రవడ్డీ (Compounding) ప్రయోజనాన్ని కోల్పోతున్నారు. పీఎఫ్ డబ్బును చిన్న చిన్న అవసరాలకు తీయడం వల్ల వృద్ధాప్య పింఛను, దీర్ఘకాలిక పొదుపుపై ప్రతికూల ప్రభావం పడుతుంది.
విత్డ్రా చేయడం ఎలా?
మీరు ఇప్పుడు పీఎఫ్ కార్యాలయం చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. UAN పోర్టల్ లేదా UMANG యాప్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. మీ ఆధార్, బ్యాంక్ ఖాతా, పాన్ కార్డ్ UAN కు లింక్ అయి ఉండాలి.
Also Read: ICC T20 World Cup: అమెరికాకు భారత్ షాక్..పాకిస్థాన్ పౌరులు భారత గడ్డపై అడుగుపెట్టడానికి వీలులేదు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Pensioners: మధ్యప్రదేశ్లోని పెన్షనర్లు ప్రస్తుతం తీవ్రమైన ఆందోళనలో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం కారణంగా దాదాపు ఐదు లక్షల మంది పెన్షనర్లు అనేక సమస్యలను ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడింది. ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా పెన్షన్ కార్యాలయాలను మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో ఈ పరిస్థితి తలెత్తింది. దీని ఫలితంగా ఇకపై పెన్షన్కు సంబంధించిన ఏ చిన్న పని అయినా సరే, పెన్షనర్లు నేరుగా రాష్ట్ర రాజధాని భోపాల్కు వెళ్లాల్సి ఉంటుంది.
ఈ నిర్ణయం ముఖ్యంగా వృద్ధ పెన్షనర్లకు తీవ్ర ఇబ్బందులను కలిగిస్తుందని పెన్షనర్ల సమస్యల పరిష్కార సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. ఇప్పటికే వయస్సు పైబడిన వారు, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు, చిన్నచిన్న పత్రాల సవరణలు లేదా పెన్షన్కు సంబంధించిన సాధారణ సమస్యల కోసం కూడా వందల కిలోమీటర్లు ప్రయాణించాల్సి రావడం ఆర్థికంగా, శారీరకంగా, మానసికంగా భారంగా మారుతుందని సంఘం పేర్కొంది. రవాణా ఖర్చులు, ప్రయాణ కష్టం, భాషా సమస్యలు వంటి అంశాలు పెన్షనర్లను మరింత ఇబ్బందులకు గురిచేస్తాయని వారు చెబుతున్నారు.
ప్రభుత్వం నిర్ణయం ప్రకారం, జిల్లా స్థాయి కార్యాలయాల స్థానంలో భోపాల్లో ఒకే ఒక కేంద్రీకృత పెన్షన్ కార్యాలయం పనిచేయనుంది. పెన్షనర్లకు ఆన్లైన్ సేవలు అందుబాటులో ఉంచి, వారి సమస్యలను డిజిటల్ విధానంలో పరిష్కరిస్తామని అధికారులు చెబుతున్నారు. అయితే, సాంకేతిక పరిజ్ఞానం లేని వృద్ధులకు ఆన్లైన్ సేవలు పూర్తిగా ఉపయోగపడతాయా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
జిల్లా కార్యాలయాల్లో ఏకరీతి విధానాలు లేకపోవడమే సమస్యకు మూలమైతే, వాటిని పూర్తిగా మూసివేయడం కంటే జిల్లా అధికారులకు సరైన శిక్షణ ఇచ్చి వ్యవస్థను మెరుగుపరచాల్సిందని పెన్షనర్ల సంఘం అభిప్రాయపడుతోంది. ఇది పెన్షనర్లకు సులభమైన, మానవీయమైన పరిష్కారంగా ఉండేదని వారు అంటున్నారు. ప్రభుత్వం తమ నిర్ణయాన్ని పునఃపరిశీలించి, పెన్షనర్ల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని మార్పులు చేయాలని సంఘం డిమాండ్ చేస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Shukra Aditya Yoga Effect On Zodiac: గ్రహాలకు రాజుగా భావించే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించాడు. సూర్యుడిని గౌరవం విశ్వాసం బలం దృఢత్వం నాయకత్వానికి కారకంగా పరిగణిస్తారు అందుకే సూర్యుడిని గ్రహాలకు రాజుగా చెప్పుకుంటారు. అలాగే సూర్యుడు మకర రాశిలోకి సంచారం చేయడాన్ని మకర సంక్రాంతిగా పిలుస్తారు.. అలాగే దీనిని చాలా ప్రాముఖ్యత కలిగిన సంచారంగా భావిస్తారు. ఈరోజు నుంచి సూర్యుడు ఉత్తరం వైపుకు కదలడం ప్రారంభిస్తాడు. హిందూ క్యాలెండర్ ప్రకారం జనవరి 14వ తేదీన 3 గంటల సమయంలో సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించాడు. మకర రాశిలో ఇప్పటికే ఉన్న శుక్రుడితో సంయోగం కూడా జరిగింది. దీని కారణంగానే శుక్రదిత్య రాజయోగం ఏర్పడింది. ఈ రాజయోగం కొన్ని రాశుల వారికి మకర సంక్రాంతి వేల అద్భుతమైన ఫలితాలను అందించబోతోంది. ముఖ్యంగా ఆర్థికంగా ఎన్నో రకాల ప్రయోజనాలను అందించబోతోందని జ్యోతిష్యులు చెబుతున్నారు.
ఈ రాశుల వారికి బిగ్ జాక్పాట్
మేష రాశి
శుక్రదిత్య రాజయోగం కారణంగా సూర్యుడి ప్రభావంతో మేషరాశి వారికి చాలా శుభప్రదంగా ఉండబోతుంది. ముఖ్యంగా సూర్యుడి ఆశీస్సులతో విద్యార్థులకు ఊహించని ధన లాభాలు కలుగుతాయి. అలాగే ఆర్థికంగా కూడా కలిసి వస్తుంది. విద్యార్థులు తమ చదువుపై దృష్టి పెట్టడం చాలా మంచిదని జ్యోతిష్యులు చెబుతున్నారు. పిల్లల విషయంలో కూడా ఎన్నో రకాల శుభవార్తలు వింటారు. అలాగే ఆరోగ్యం కూడా చాలా వరకు మెరుగుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్థిక సమస్యలు కూడా క్రమంగా తొలగిపోతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు.
వృషభ రాశి
సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడం వల్ల ఏర్పడిన శుక్రదిత్య రాజయోగంతో వృషభరాశి వారికి కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ముఖ్యంగా వీరికి ఆరోగ్యం మెరుగుపడడమే.. కాకుండా అన్ని రకాల పనులు ఎంతో సులభంగా చేయగలుగుతారు. ఇక పనుల కోసం ప్రయాణాలు చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. అంతేకాకుండా ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకుంటూ ఉండడం ఎంతో మంచిది. వ్యాపారాల్లో చిక్కుకున్న డబ్బులు కూడా ఈ సమయంలో పొందగలుగుతారు. అలాగే అనుకున్న పనుల్లో అద్భుతమైన విజయాలు సాధించడంలో వీరు ముందుంటారు.
కర్కాటక రాశి
మకర రాశిలో సూర్యుడి సంచారం వల్ల కర్కాటక రాశి వారికి కూడా చాలావరకు మేలు జరుగుతుంది. వ్యాపారాల పరంగా వస్తున్న అనేక ఇబ్బందుల నుంచి ఈ సమయంలో విముక్తు లభించబోతోంది. ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. ముఖ్యంగా ఈ సమయంలో వీరు ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించాల్సి ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఇక ఉద్యోగాలు చేస్తున్న వ్యక్తులకు మీతో పని చేస్తున్న ఉద్యోగుల నుంచి మంచి సపోర్టు కూడా లభిస్తుంది. దీనివల్ల మానసిక ప్రశాంతత కూడా చాలావరకు మెరుగుపడే సూచనలు కనిపిస్తున్నాయి.
మీన రాశి
మీన రాశిలో జన్మించిన వ్యక్తులకు కూడా సూర్యుడి సంచార ప్రభావంతో ఎన్నో రకాల ప్రయోజనాలు కలగబోతున్నాయి. ముఖ్యంగా శుక్రదిత్య రాజయోగ ప్రభావంతో పనుల్లో తలెత్తుతున్న ఇబ్బందులు పూర్తిగా తొలగిపోతాయి. అంతేకాకుండా వ్యాపారాల్లో ఆర్థిక లాభాలు పొందే అవకాశంలున్నాయి. ముఖ్యంగా ఉద్యోగాలు చేస్తున్న వారికి మీ అధికారుల నుంచి మంచి ప్రశంసలు కూడా లభిస్తాయి. కుటుంబ సభ్యులతో బయటికి వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. అనుకోకుండా ఎలాంటి పనులు చేసిన సులభంగా విజయాలు సాధించగలుగుతారు.
Also Read: Sankranthi Muggulu 2026: సంక్రాంతి పండగ రోజు తప్పకుండా వేసుకోవలసిన 5 ముగ్గులు ఇవే..

Also Read: Sankranthi Muggulu 2026: సంక్రాంతి పండగ రోజు తప్పకుండా వేసుకోవలసిన 5 ముగ్గులు ఇవే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
ICC T20 World Cup Americas Qualifier: వచ్చే నెలలో ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్ 2026 ఆతిథ్య దేశమైన భారత్, అమెరికా (USA) క్రికెట్ జట్టుకు గట్టి షాక్ ఇచ్చింది. ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు భారత్, శ్రీలంక వేదికలుగా ఈ మెగా టోర్నీ జరగనుంది. అయితే, టోర్నీ ప్రారంభానికి ముందే అమెరికా జట్టులోని నలుగురు కీలక ఆటగాళ్లకు వీసా చిక్కులు ఎదురవ్వడం ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
పాకిస్థాన్ మూలాలే శాపమా?
అమెరికా జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ, ఆ జట్టులోని నలుగురు కీలక ఆటగాళ్లు అలీ ఖాన్, షాయన్ జహంగీర్, మహ్మద్ మోసిన్, ఎహ్సాన్ ఆదిల్ పాకిస్థాన్లో జన్మించారు. వీరు ప్రస్తుతం అమెరికా పౌరసత్వం కలిగి ఉన్నప్పటికీ, భారత వీసా నిబంధనల ప్రకారం పాకిస్థాన్ మూలాలున్న వారు అదనపు భద్రతా తనిఖీలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. భద్రతా కారణాల దృష్ట్యా భారత ప్రభుత్వం ఈ విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరిస్తోంది.
"పాకిస్థాన్ మూలాలున్న కారణంగా మా నలుగురికి భారత వీసా దొరకలేదు. దీనివల్ల మేము వరల్డ్ కప్కు దూరం అయ్యే పరిస్థితి కనిపిస్తోంది" అని స్టార్ పేసర్ అలీ ఖాన్ ఒక వీడియో సందేశంలో ఆవేదన వ్యక్తం చేశారు.
గతంలోనూ ఇవే ఇబ్బందులు
క్రికెటర్లకు భారత్ వచ్చే సమయంలో వీసా సమస్యలు ఎదురవ్వడం ఇదే మొదటిసారి కాదు. గతంలో పలువురు ఆటగాళ్లు ఇలాంటి ఇబ్బందులే పడ్డారు. ఆస్ట్రేలియా ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా, ఇంగ్లాండ్ స్పిన్నర్లు షోయబ్ బషీర్, రెహాన్ అహ్మద్ వంటి వారు 2023 వన్డే వరల్డ్ కప్ సమయంలోనూ కొందరు ఆటగాళ్లకు ఇదే రకమైన జాప్యం జరిగింది.
టెన్షన్లో ఇతర జట్లు.. రంగంలోకి ఐసీసీ!
కేవలం అమెరికా మాత్రమే కాకుండా జింబాబ్వే, కెనడా, నెదర్లాండ్స్ వంటి జట్లలో కూడా పాకిస్థాన్ మూలాలున్న ఆటగాళ్లు ఉన్నారు. దీంతో ఆ జట్లు కూడా తమ ఆటగాళ్లకు వీసాలు వస్తాయో లేదో అని ఆందోళన చెందుతున్నాయి. ఈ క్రమంలో ఐసీసీ (ICC) జోక్యం చేసుకుని భారత ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతోంది. మరి భారత ప్రభుత్వం వీరికి మినహాయింపు ఇస్తుందో లేదో వేచి చూడాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Chaturgrahi Yoga Effect On Zodiac: ఈ సంవత్సరం మకర సంక్రాంతి జనవరి 15వ తేదీన వచ్చింది. దేశవ్యాప్తంగా ఈ సంక్రాంతిని రెండు రోజులపాటు జరుపుకుంటున్నారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ పండగను దాదాపు వారం రోజుల పాటు జరుపుకుంటారు. పండగ మూడు రోజులైనప్పటికీ.. ఏడు రోజుల ముందే వివిధ కార్యక్రమాలు మొదలవుతాయి. అలాంటిది ఈ ఏడాది మకర సంక్రాంతికి ముందు రోజే ఎంతో శక్తివంతమైన చతుర్గ్రహి రాజయోగం ఏర్పడుతుంది. ఈ రాజయోగానికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. సాధారణంగా మకర రాశిలో సూర్యుడు ప్రవేశించిన తర్వాతే మకర సంక్రాంతి జరుపుకుంటారు. అయితే మకర రాశిలో ఇప్పటికే కొన్ని గ్రహాలు సంచార దశలో ఉన్నాయి. సూర్యుడు వెళ్లిన వెంటనే ఈ గ్రహాల సంయోగం ఏర్పడుతుంది. దీని కారణంగానే చతుర్గ్రహి రాజయోగం ఏర్పడబోతోంది. ముఖ్యంగా సూర్యుడితోపాటు శుక్రుడు, బుధుడు, బుజుడీ కలయిక జరగబోతోంది. దీంతో ఈ యోగం ఏర్పడి అన్ని రాశుల వారిపై ప్రభావం చూపుతుంది.
ఈ రాశులవారికి బంపర్ లాభాలు:
మేషరాశి
చతుర్గ్రహి రాజయోగం వల్ల మేషరాశి వారికి కెరీర్ పరంగా అద్భుతమైన విజయాలు కలుగుతాయి. ఉద్యోగాలు చేస్తున్న వారికి ఈ సమయంలో పదోన్నతులు కూడా లభిస్తాయి. అలాగే కొత్త కొత్త బాధ్యతలు లభించడమే కాకుండా ఉద్యోగాలు చేస్తున్న వ్యక్తులకు కొత్త లొకేషన్ లో పోస్టింగ్ కూడా కలుగుతుంది. వ్యాపారాలు చేస్తున్న వ్యక్తులకు పెద్ద పెద్ద ఆర్డర్లు కూడా లభించబోతున్నాయి. సమాజంలో గౌరవం పెరగడమే కాకుండా.. తల్లిదండ్రులు లేదా సీనియర్ల నుంచి కూడా మంచి సపోర్టు లభించి.. ఎన్నో రకాల ప్రయోజనాలు పొందుతారని జ్యోతిష్యులు చెబుతున్నారు.
కన్యా రాశి
కన్యా రాశిలో జన్మించిన వ్యక్తులకు కూడా చతుర్గ్రహి రాజయోగం వల్ల అదృష్టం ఊహించని స్థాయిలో పెరుగుతుంది. ముఖ్యంగా పోటీ పరీక్షలు రాసే విద్యార్థులకు ఈ సమయం విశేషమైన ప్రయోజనాలను అందిస్తుంది. అలాగే కోర్టు సంబంధిత కేసుల నుంచి కూడా కాస్త ఉపశమనం కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా పెండింగ్లో ఉన్న పనులన్నీ ఎంతో సింపుల్గా పూర్తవుతాయి. మతపరమైన కార్యక్రమాలపై ఆసక్తి కూడా పెరిగి.. దేవాలయాలు సందర్శించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దూర ప్రయాణాలు చేసే వ్యక్తులకు ఈ సమయం ఎన్నో అద్భుతమైన అవకాశాలను అందిస్తుంది. కుటుంబంలో ఆనందాన్ని కూడా పెంచే వార్తలు వినగలుగుతారు.
ధనస్సు రాశి
ధనస్సు రాశిలో జన్మించిన వ్యక్తులకు కూడా ఈ సమయం అద్భుతమైన ఫలితాలనందిస్తుంది. ముఖ్యంగా వీరికి ఈ సమయం చాలా శుభప్రదంగా ఉండబోతోంది. ఉద్యోగాలు చేస్తున్న వ్యక్తులకు విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. వ్యాపారాలు విస్తరించే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. అంతేకాకుండా రోజు వారి జీవితంలో సమతుల్యత పెరుగుతుంది. పెట్టుబడులు పెట్టే వారికి అద్భుతమైన అవకాశాలు కూడా లభించబోతున్నాయని జ్యోతిష్యులు చెబుతున్నారు.
మకర రాశి
చతుర్గ్రహి రాజయోగం కారణంగా మకర రాశి వారికి ఈ సంక్రాంతి సమయం నుంచి ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఈ రాశి కలిగిన వ్యక్తులు అనేక రంగాల్లో అద్భుతమైన విజయాలు సాధించగలుగుతారు. అలాగే వీరికి ఈ సమయంలో ఆత్మవిశ్వాసం కూడా అంచెలంచెలుగా పెరుగుతుంది. కెరీర్ పరంగా కొత్త శిఖరాలను చేరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎప్పటినుంచో అనేక సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకు ఎంతో సులభంగా పరిష్కారం కూడా లభిస్తుంది. దీర్ఘకాలిక సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి.
Also Read: Sankranthi Muggulu 2026: సంక్రాంతి పండగ రోజు తప్పకుండా వేసుకోవలసిన 5 ముగ్గులు ఇవే..

Also Read: Sankranthi Muggulu 2026: సంక్రాంతి పండగ రోజు తప్పకుండా వేసుకోవలసిన 5 ముగ్గులు ఇవే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Surya Dev Favorite Zodiac Signs Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. సూర్యుడిని స్థానం ప్రతిష్ట తీసుకునే నిర్ణయాలకు చిహ్నంగా భావిస్తారు. అందుకే ఈ గ్రహానికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. అలాగే భూమిపై ఉండే సమస్త జీవులకు సూర్యుడు గొప్ప శక్తిని అందిస్తాడు. అలాగే ఈ గ్రహాన్ని అన్ని గ్రహాలకు రారాజుగా కూడా పిలుస్తారు.. జాతకంలో ఈ గ్రహం శుభస్థానంలో ఉన్న రాశుల వారికి అద్భుతమైన ప్రశంసలతో పాటు ఆనందం ఊహించని స్థాయిలో పెరుగుతుంది. సమాజంలో గౌరవం, విశ్వాసం లభిస్తుంది. అలాగే కీర్తి, ప్రతిష్టలు కూడా ఊహించని స్థాయిలో పెరిగే అవకాశాలుంటాయి. కాబట్టి ఈ గ్రహం సంచారం చేసిన ప్రతిసారి అన్ని రాశుల వారి జీవితాల్లో ఎన్నో మార్పులు సంభవిస్తూ ఉంటాయి.
గ్రహాలకు రాజుగా భావించే సూర్యుడు ప్రతినెల ఒక రాసి నుంచి మరొక రాశికి తప్పకుండా సంచారం చేస్తూ ఉంటాడు. మొత్తం రాశులన్నీ చుట్టేయడానికి దాదాపు 12 నెలల పాటు సమయం పడుతుంది. అలాగే అప్పుడప్పుడు ఈ గ్రహం నక్షత్ర సంచారం కూడా చేస్తుంది. కాబట్టి ఈ సమయంలో ఏర్పడిన ప్రభావం కూడా మొత్తం అన్ని రాశుల వారిపై పడుతుంది. అలాగే ఈ గ్రహానికి కొన్ని దేవతలకు రాశులకు ప్రత్యేకమైన సంబంధాలు ఉంటాయి. అందుకే సూర్యుడు ఎల్లప్పుడూ కొన్ని రాశులు అంటే ఎంతో ఇష్టపడుతూ ఉంటాడు. అంతేకాకుండా ఆయారాశుల వారి జీవితాల్లో అద్భుతమైన మార్పులు కూడా తీసుకువస్తాడు. ఇంతకీ సూర్యుడు అత్యంత ఇష్టపడే రాశులేవో ఇప్పుడు తెలుసుకోండి.
ఈ రాశులవారికి ఊహించని డబ్బు:
మేషరాశి
సూర్యుడు అత్యంత ఇష్టపడే రాశుల్లో మేషరాశి ఒకటి. ఈ రాశుల వారికి ఎల్లప్పుడూ సూర్యుడి అనుగ్రహం లభిస్తుంది. కాబట్టి వీరు ఎంతో ఆత్మవిశ్వాసంతో నిండి ఉండి.. పనులు చేయడం వల్ల సులభంగా విజయాలు సాధిస్తారు.. అలాగే కష్టపడి పనులు చేసేందుకు ఇష్టపడతారు. వీరు ఎలాంటి కష్టతరమైన పనులైన ఎంతో సులభంగా చేసి అద్భుతమైన విజయాలు సాధించగలిగే అదృష్టాన్ని పొందగలుగుతారు. ముఖ్యంగా ఉద్యోగాలు చేస్తున్న వారు ఎల్లప్పుడూ ప్రమోషన్స్ పొందడమే.. కాకుండా సమాజంలో గౌరవాన్ని సంపాదించుకోగలుగుతారు. అలాగే కొన్ని సందర్భాల్లో వీరు కొత్త అవకాశాలు పొందుతారు. దీంతో పాటు ఆకస్మాత్తుగా పనుల్లో విజయాలు సాధించే అదృష్టాన్ని సూర్యుడు అందిస్తాడు.
సింహరాశి
అలాగే సింహరాశిలో జన్మించిన వ్యక్తులకు కూడా ఎల్లప్పుడూ సూర్యుడి అనుగ్రహం లభిస్తుంది. కాబట్టి వీరు ఎంతో ఆకర్షణీయంగా కనిపించగలుగుతారు. అంతేకాకుండా వీరు చాలా ధైర్యంతో ముందుకు సాగుతూ ఉంటారు ఆత్మవిశ్వాసం నిండి ఎలాంటి పనులైన చేసేందుకు సిద్ధమవుతారు వీరికి ధైర్యం కూడా ఊహించని స్థాయిలో ఉంటుంది.. కాబట్టి కెరీర్ పరంగా ఎలాంటి పురోగతినైనా సాధించే అవకాశాలుంటాయి. ముఖ్యంగా వీరికి ఆర్థిక శ్రేయస్సు కూడా లభిస్తుంది.. వీరు సమాజంలో నాయకత్వ లక్షణాలతో ముందుకు వెళ్తారు. రాజకీయ నాయకులైతే భాద్యతలను కూడా స్వీకరిస్తారు. ఇక జీవితంలో ఎలాంటి అడ్డంకులు వచ్చిన దగ్గరుండి పోరాడి.. వాటి నుంచి పరిష్కారం పొందుతారు. పనుల్లో ఎంతో ఓర్పుగా ఉండి వాటిని పూర్తిచేస్తారు. జీవితం ఎల్లప్పుడు విజయం దిశగా కొనసాగుతూనే ఉంటుంది.
Also Read: Happy Bhogi: భోగి పండగ విషెస్ HD ఫొటోస్, గ్రీటింగ్స్..
ధనస్సు రాశి
ధనస్సు రాశిలో జన్మించిన వ్యక్తులకు కూడా ఎల్లప్పుడూ అదృష్టం ఊహించని స్థాయిలో పెరుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా వీరికి సూర్యుడి అనుగ్రహం లభించడం వల్ల జ్ఞానంతో పాటు సంపాదన రెట్టింపు అవుతుంది. అలాగే ఎలాంటి ఉద్యోగాలు చేసిన త్వరగా అభివృద్ధి చెంద గలుగుతారు.. వ్యాపారాల్లో అధిపతులుగా నిలుస్తారు. దీంతోపాటు సమాజంలో గౌరవాన్ని కూడా పొందే అదృష్టాన్ని కలిగి ఉంటారు. ఇక సూర్యుడి అనుగ్రహం వల్ల ఎలాంటి సమస్యలు వచ్చిన తొందరగానే పరిష్కరించుకోగలుగుతారు. అంతేకాకుండా కష్ట సమయాల్లో కూడా అద్భుతమైన నిర్ణయాలు తీసుకోవడంలో వీరు దిట్ట అని చెప్పొచ్చు. సూర్యుడి ప్రభావంతో జీవితంలో వచ్చే ఎలాంటి ఇబ్బందులనైనా అధికమించగలుగుతారు.
Also Read: Happy Bhogi: భోగి పండగ విషెస్ HD ఫొటోస్, గ్రీటింగ్స్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Realme P3 Lite 5G Price Drop: అద్భుతమైన ఫీచర్లతో కూడిన మంచి మొబైల్ సంక్రాంతి సందర్భంగా కొనుగోలు చేయాలనుకుంటున్నారా? మీకోసం ఫ్లిప్కార్ట్ అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్స్ అందిస్తున్నాయి. ముఖ్యంగా కొన్ని చైనీ మొబైల్ తయారీ కంపెనీలకు సంబంధించిన స్మార్ట్ఫోన్స్ అత్యంత తక్కువ ధరకే అందుబాటులో ఉన్నాయి. అలాగే వాటిపై ఎన్నో రకాల బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. అయితే, ఈ మొబైల్పై అందుబాటులో ఉన్న ఆఫర్స్ ఏంటో? దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
సంక్రాంతి సందర్భంగా రియల్ మీ P3 Lite 5G మొబైల్ చాలా తగ్గింపు ధరకే అందుబాటులో ఉంది ముఖ్యంగా రియల్ మీ మొబైల్ కొనుగోలు చేయాలనుకునే వారికి ఇదే అవకాశంగా భావించవచ్చు. అలాగే ఈ మొబైల్ ఎన్నో రకాల అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉంది. ముఖ్యంగా ఇది 6.67-అంగుళాల HD+ IPS LCD డిస్ప్లేతో అందుబాటులోకి వచ్చింది.
ఇక ఈ మొబైల్ స్క్రీన్ చాలా ప్రత్యేకమైన 120Hz రిఫ్రెష్ రేట్, 625 నిట్స్ బ్రైట్నెస్తో అందుబాటులోకి వస్తుంది. ఇది చాలా శక్తివంతమైన MediaTek Dimensity 6300 5G చిప్సెట్ ప్రాసెసర్ తో లభిస్తోంది. అలాగే ఇది 6000mAh భారీ బ్యాటరీ, 45W SUPERVOOC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ను కూడా కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ఫోన్ వెనక భాగంలో అద్భుతమైన కెమెరా మాడ్యూయల్ని కలిగి ఉంటుంది. ముఖ్యంగా ఇది 32MP మెయిన్ కెమెరాతో అందుబాటులోకి వచ్చింది. ఫ్రంట్ భాగంలో వీడియో కాలింగ్ కోసం 8MP ఫ్రంట్ కెమెరా ఉంది.. ఇక ఇది IP64 రేటింగ్తో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత రియల్ మీ UI 6.0పై నడుస్తుంది.
సంక్రాంతి ఆఫర్స్తో పాటు రిపబ్లిక్ డే సందర్భంగా కొనుగోలు చేసే వారికి ఆఫర్ల మీద ఆఫర్లు ఈ మొబైల్ పై అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం మార్కెట్లో ఈ మొబైల్ రెండు స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులో ఉంది ఇందులోని మొదటి స్టోరేజ్ వేరియంట్ 4 జిబి ర్యామ్ని కలిగి ఉంటుంది. అలాగే రెండవ స్టోరేజ్ వేరియంట్ 6GB ర్యామ్తో అందుబాటులోకి వచ్చింది. ఇక మొదటి స్టోరేజ్ వేరియంట్ పై ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులో ఉంది మార్కెట్లో దీని ధర MRP రూ.12,999 కాగా ఇప్పుడే కొనుగోలు చేసే వారికి.. రూ.10,499 కే పొందవచ్చు.
ఇక బ్యాంక్ ఆఫర్స్తో ఈ స్మార్ట్ఫోన్ను కొనుగోలు చేయాలనుకుంటే అద్భుతమైన తగ్గింపు లభిస్తుంది. ఈ ఆఫర్స్లో భాగంగా ఫ్లిప్కార్ట్ అనుసంధానం యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, ఎస్బిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డులను వినియోగించి పేమెంట్ చేస్తే రూ.500 వరకు ప్రత్యేకమైన డిస్కౌంట్ లభిస్తుంది. అంతేకాకుండా ఎక్స్చేంజ్ ఆఫర్ వినియోగించి ఈ మొబైల్ కొనుగోలు చేస్తే, ఏకంగా రూ.9,600 వరకు బోనస్ పొందవచ్చు. ఇక అన్ని ఆఫర్స్ పోను ఈ మొబైల్ను కేవలం రూ.499కే సొంతం చేసుకోవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
EPFO Pension Calculation: ప్రైవేట్ రంగంలో పనిచేసే ఉద్యోగులకు రిటైర్మెంట్ తర్వాత ఆదాయ భద్రత కల్పించేందుకు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఆధ్వర్యంలో పెన్షన్ సౌకర్యం ఉంటుంది. ఈ పెన్షన్ పొందాలంటే ఉద్యోగి తప్పనిసరిగా ప్రావిడెంట్ ఫండ్ కు క్రమం తప్పకుండా చందా చెల్లించాలి. PFలో జమ అయ్యే మొత్తం రెండు భాగాలుగా ఉంటుంది. ఒక భాగం ఉద్యోగి జీతం నుంచి కట్ చేస్తే.. మరో భాగాన్ని యజమాని చెల్లిస్తారు. యజమాని చెల్లించే మొత్తంలో ఒక భాగం ఉద్యోగుల పెన్షన్ పథకం ఈపీఎస్ కు వెళ్తుంది. ఈ EPSలో జమ అయ్యే మొత్తమే భవిష్యత్తులో ఉద్యోగికి వచ్చే పెన్షన్ను నిర్ణయిస్తుంది.
అయితే ప్రస్తుతం EPFO వేతన పరిమితి రూ. 15,000గా ఉంది. అంటే ఉద్యోగి జీతం ఎంత ఉన్నా పీఎఫ్, ఈపీఎస్ లెక్కింపు గరిష్టంగా రూ. 15,000 ప్రాథమిక జీతం ఆధారంగానే జరుగుతుంది. ఇందులో ఉద్యోగి జీతం నుంచి 12 శాతం పీఎఫ్ గా కట్ అవుతుంది. వేతన పరిమితి తక్కువగా ఉండటం వల్ల EPSలో చేరే చందా కూడా పరిమితమవుతోంది. దీని కారణంగా రిటైర్మెంట్ తర్వాత వచ్చే పెన్షన్ మొత్తం తక్కువగా ఉంటోంది. ఈ పరిమితిని పెంచాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వం, EPFOకు ఆదేశాలు ఇవ్వడంతో వేతన పరిమితిని రూ. 30,000కి పెంచే అవకాశంపై చర్చ జరుగుతోంది.
ప్రస్తుతం EPS కింద ప్రైవేట్ ఉద్యోగులకు కనీస పెన్షన్ రూ. 1,000గా ఉండగా, గరిష్టంగా నెలకు రూ. 7,500 వరకు అందుతోంది. అయితే వేతన పరిమితిని రూ. 30,000కు పెంచితే పెన్షన్ మొత్తం పెరిగే అవకాశం ఉంది. పెన్షన్ లెక్కింపు కోసం EPFO ఒక నిర్దిష్ట సూత్రాన్ని ఉపయోగిస్తుంది.
పెన్షన్ లెక్కింపు సూత్రం:
పెన్షన్ పొందదగిన జీతం × పెన్షన్ పొందదగిన సేవా కాలం / 70
ఇక్కడ పెన్షన్ పొందదగిన జీతం అనేది ఉద్యోగి చివరి 60 నెలల ప్రాథమిక జీతం, డీఏ సగటు. ప్రస్తుతం ఇది రూ. 15,000కే పరిమితం అవుతుంది. పెన్షన్ పొందదగిన సర్వీసు కాలం అంటే ఉద్యోగి ఎంత సంవత్సరాలు EPSకు చందా చెల్లించాడన్నది. గరిష్టంగా 35 సంవత్సరాల వరకు పరిగణిస్తారు.
అయితే వేతన పరిమితి రూ. 30,000కు పెరిగితే, ఈ సూత్రం ప్రకారం పెన్షన్ మొత్తం గణనీయంగా పెరుగుతుంది. అంచనాల ప్రకారం, అప్పుడు గరిష్ట పెన్షన్ రూ. 15,000 వరకు చేరే అవకాశం ఉండగా, కనీస పెన్షన్ కూడా సుమారు రూ. 4,285 వరకు ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఇది ప్రైవేట్ ఉద్యోగుల రిటైర్మెంట్ భద్రతను మరింత బలోపేతం చేయనుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
France Groom Weds Khammam Bride: ప్రేమ కేవలం రెండు అక్షరాలు కాదు.. రెండు మనస్సులు. స్వచ్ఛమైన ప్రేమయితే ఎల్లలు ఏమిటి? ఖండాంతరాలు కూడా దాటుతుందని ఈ రెండు మనస్సులు నిరూపించాయి. మనస్సులు కలిసిన అక్కడ అబ్బాయి ఇక్కడమ్మాయి లే కాకుండా రెండు కుటుంబాల పెద్దలను కూడా ఖండాంతరాలు దాటేలా చేసి అంగీకరించి పెళ్లిగా ఒక్కటై తమ స్వచ్ఛమైన ప్రేమను చాటారు. ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.
Also Read: Traffic Challan: ట్రాఫిక్ చలాన్లపై భారీ షాక్.. బ్యాంక్ అకౌంట్ నుంచి ఆటోమేటిక్ పేమెంట్
ఖమ్మం నగరంలోని గట్టయ్య సెంటర్లోని ఓ కల్యాణ మండపంలో ప్రాన్స్ దేశానికి చెందిన అబ్బాయికి భారతదేశానికి చెందిన అమ్మాయికి భారత క్రైస్తవ సాంప్రదాయ పద్ధతిలో ఘనంగా వివాహం జరిగింది. ఫ్రాన్స్ నుంచి వచ్చిన ఇంగ్లీష్ పెళ్లికుమారుడి కుటుంబసభ్యులతో తెలుగు పెళ్లి మండపం నిండిపోయింది. తెలంగాణ జానపద డీజే పాటలకు మన వాళ్లతో కలిసి ఫ్రాన్స్ చుట్టాలు స్టెప్పులేశారు. పెళ్లి ఆద్యంతం ఆసక్తిని కలిగించింది. ఈ వేడుక చూడముచ్చటగా కొనసాగింది.
Also Read: AP Sankranti Gift: ఏపీ ప్రభుత్వం సంక్రాంతి శుభవార్త.. రూ.5 కోట్ల బకాయిల విడుదల
ఖమ్మం జిల్లాలోని తిరుమలాయపాలెం మండలం మహమ్మదాపురం గ్రామానికి చెందిన జినక వెంకన్న, ఎల్లమ్మ కుమార్తె ప్రశాంతి ఉన్నత చదువుల కోసం ప్రాన్స్ దేశానికి వెళ్లింది. చదువు పూర్తయిన తరువాత అక్కడే ఉద్యోగం చేస్తోంది. ఈ క్రమంలో అదే కంపెనీలో ఉద్యోగం చేస్తున్న ప్రాన్స్ దేశానికి కాపిటల్ సిటీ అయిన పారిస్ పట్టణానికి దగ్గరలో గల నాథన్ అనే ప్రాంతానికి చెందిన నాథన్ క్రిస్టోఫ్ జూబర్ అనే ప్రాన్స్ అబ్బాయితో స్నేహం కుదిరింది. కాలక్రమేణ స్నేహం కాస్త ప్రేమగా మారింది. రెండు దేశాల సంప్రదాయాలు, అభిరుచులు వేరైనప్పటికీ వారిద్దరినీ ప్రేమ పెళ్లితో ఒక్కటి చేసింది. ఇక్కడమ్మాయి, అక్కడబ్బాయి పెద్దలను ఒప్పించి ఖండాంతరాలు దాటించి పెళ్లి చేసుకున్న తీరు ఇరు కుటుంబాలతోపాటు పెళ్లికి వచ్చిన వారందరినీ సంతోష పరిచింది. ఇక్కడి సంస్కృతి సంప్రదాయాలు చూసి ఫ్రాన్స్ కుటుంబాలు అవాక్కయ్యారు. ఈ వార్త వైరల్గా మారింది. ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి