icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Pinewz
504251
KASARLA RAMESHKASARLA RAMESHFollow6 Sept 2024, 09:43 am

సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వైద్యశిబిరాలు ఏర్పాటు

Bellampalle, Kannal Rural, Telangana:మంచిర్యాల జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలలో భాగంగా బెల్లంపల్లి పట్టణంలోని అన్ని వార్డ్ లలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని డిప్యూటీ డీఎంహెచ్ఓ సుధాకర్ నాయక్ అన్నారు. బెల్లంపల్లిలో అయన మాట్లాడుతూ వాతావరణంలో మార్పుల వల్ల సీజనల్ వ్యాధులు సోకకుండా వైద్య శిబిరంలో ప్రజలకు అవసరమైన పరీక్షలు చేసి అక్కడిక్కడే మందులు అందజేస్తున్నామని, అవసరమైతే పీహెచ్సీకి రిఫర్ చేస్తున్నామన్నారు. ప్రజలు వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని అయన కోరారు.
0
0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

Mudragada Political Journey: మాజీ మంత్రి, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం కన్నుమూత..ఆయన రాజకీయ నేపథ్యం ఇదే!

Hyderabad, Telangana:

Mudragada Padmanabham Political Journey: ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత, ప్రస్తుత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత ముద్రగడ పద్మనాభం (78) కన్నుమూశారు. గత నెల రోజులుగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన, హైదరాబాద్‌లోని సింధు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కొద్దిసేపటి క్రితం మరణించారు. కుటుంబసభ్యులతో పాటు ఆయన సన్నిహితులు శోకసంద్రంలో మునిగిపోయారు. బుధవారం నాటికి ఆయన భౌతికకాయాన్ని స్వగ్రామమైన కాకినాడ జిల్లా కిర్లంపూడికి తీసుకువచ్చే అవకాశం ఉంది. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.

జననం, కుటుంబ నేపథ్యం
ముద్రగడ పద్మనాభం 1948 మార్చి 7న తూర్పు గోదావరి జిల్లా (ప్రస్తుత కాకినాడ జిల్లా) కిర్లంపూడిలోని ఒక వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. చిన్న వయసు నుంచే ప్రజా జీవితం వైపు ఆకర్షితులైన ఆయన, ప్రజా సేవలోనే తన ప్రస్థానాన్ని ప్రారంభించారు.

రాజకీయ ప్రస్థానం, నిర్వహించిన పదవులు
కాంగ్రెస్ పార్టీతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన ముద్రగడ, అతి తక్కువ కాలంలోనే కీలక నేతగా ఎదిగారు. 1978లో ఆయన మొదటిసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లోలో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. పలుమార్లు అసెంబ్లీకి ఎన్నికై ప్రజా సమస్యలపై గళం విప్పారు. ఎమ్మెల్యేగా పనిచేస్తూనే రాష్ట్ర రవాణా శాఖ మంత్రిగా, హోంశాఖ సహాయ మంత్రిగా (రాష్ట్ర స్థాయి బాధ్యతలు) కీలక పదవులను నిర్వహించారు.

ఆయన రాజకీయ ప్రయాణం ఎన్నో మలుపులు తిరిగింది. కాంగ్రెస్ నుంచి ఎన్టీఆర్ హయాంలో తెలుగుదేశం పార్టీలోకి, ఆ తర్వాత తిరిగి కాంగ్రెస్‌లోకి మారారు. అనంతరం ప్రధాన రాజకీయ పార్టీలకు దూరంగా ఉంటూ కాపు ఉద్యమమే శ్వాసగా బతికారు.

కాపు రిజర్వేషన్ ఉద్యమం, తుని ఘటన..
ముద్రగడ పద్మనాభం పేరు వినబడగానే కాపులను బీసీ జాబితాలో చేర్చాలనే పోరాటమే గుర్తుకొస్తుంది. కాపు సామాజిక వర్గ సమస్యలపై ఆయన ఒక బలమైన గొంతుకగా నిలిచారు. అయితే 2016లో తునిలో ఏర్పాటు చేసిన కాపు రిజర్వేషన్ల కోసం బహిరంగ సభ తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌కు నిప్పు పెట్టడం, పోలీస్ స్టేషన్‌పై దాడి వంటి ఘటనలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఈ ఘటన అనంతరం ముద్రగడ చేపట్టిన ఆమరణ దీక్ష, ఆయన అరెస్టు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.

2024 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీలో చేరిక
2024 అసెంబ్లీ ఎన్నికల ముందు ముద్రగడ రాజకీయాల్లో మళ్లీ క్రియాశీలక పాత్ర పోషించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP)లో చేరిన ఆయన, తన పేరును ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకుంటున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై పోటీ చేసి రాజకీయంగా తీవ్ర ఆసక్తిని రేకెత్తించారు.

వారసత్వం, గుర్తింపు
ముద్రగడ రాజకీయ ప్రస్థానం కాంగ్రెస్‌లో ప్రారంభమయ్యి.. ఆ తర్వాత ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీలో చేరి, మళ్లీ కాంగ్రెస్ చేరి మళ్లీ ఏ పార్టీకి సంబంధం లేకుండా స్వతంత్ర ఉద్యమానికి నాయకుడిగా ఉన్నారు. చివరిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో నేతగా చేరారు. ఏ పార్టీకి పూర్తిగా అనుకూలంగా ఉండకుండా, తన డిమాండ్ల ఆధారంగానే రాజకీయ వైఖరిని మార్చుకునే నాయకుడిగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది.

ఆయన కుమారుడు ముద్రగడ గిరి కూడా ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్నారు. కాపు ఉద్యమ సమయంలో కుటుంబ సభ్యులంతా ఆయనకు వెన్నుదన్నుగా నిలిచారు. కాపు ఉద్యమానికి ప్రతీకగా, తూర్పు గోదావరి రాజకీయాల్లో అత్యంత ప్రభావశీల నేతగా, సామాజిక న్యాయం కోసం పోరాడిన నాయకుడిగా ముద్రగడ పద్మనాభం చరిత్రలో నిలిచిపోతారు.

Also Read: బిగ్ బ్రేకింగ్.. రాజకీయాల్లోకి ఎన్టీఆర్..తారక్ కార్యాలయం నుంచి కీలక ప్రకటన!

Also Read: "పోలవరం ప్రాజెక్టుకు చంద్రబాబే 'కిల్లర్'.." ఏపీసీసీ చీఫ్ షర్మిల సంచలన వ్యాఖ్యలు!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

కొండగట్టు ఆలయంలో నిండు అమావాస్య రోజు నాగుపాము మృతి.. దేనికి సంకేతం?

Siddipet, Telangana:

Kondagattu Temple: నిండు అమావాస్య.. దీనికితోడు తెలంగాణలోనే అతిపెద్ద పుణ్యక్షేత్రం. అమావాస్య రోజు ప్రముఖ ఆలయంలో నాగుపాము హల్‌చల్‌ చేసింది. కొద్దిసేపు హల్‌చల్‌ చేసిన నాగుపాము అకస్మాత్తుగానే చనిపోయింది. ఎలాంటి గాయం.. అనారోగ్యం లేకుండానే పాము ఆలయ ఆవరణలో మృతిచెందడం వైరల్‌గా మారింది. ఈ సంఘటన తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో చోటుచేసుకుంది. అమావాస్య రోజు నాగుపాము మృతి చెందడం కలకలం రేపింది. 

జగిత్యాల జిల్లా చొప్పదండి నియోజకవర్గం మల్యాల మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయ ప్రాంగణంలో మంగళవారం అమావాస్య రోజున నాగుపాము ప్రత్యక్షమైంది. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ ఆలయ ప్రాంగణంలోకి వచ్చిన నాగుపామును భక్తులు ఆసక్తిగా తిలకించారు. అక్కడ ప్రత్యక్షమైన నాగుపాముకు భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. అమావాస్య రోజున స్వామివారి సన్నిధిలో నాగుపాము దర్శనం ఇవ్వడాన్ని భక్తులు విశేషంగా భావించారు.

భక్తులు ఆసక్తిగా గమనిస్తున్న సమయంలోనే హఠాత్తుగా నాగుపాము చనిపోయింది. కొద్దిసేపటికే ఎలాంటి గాయాలు లేకుండా, ఎవరూ హాని చేయకపోయినా నాగుపాము అక్కడికక్కడే ప్రాణాలు విడిచిపోయింది. ఇది భక్తులను ఆశ్చర్యానికి గురిచేసింది. పాము ఆరోగ్యంగా కనిపించినప్పటికీ అకస్మాత్తుగా మృతి చెందడంతో ఆలయ పరిసరాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన యాదృచ్చికంగా జరిగిందా, లేక ఏదైనా సంకేతమా అనే కోణంలో భక్తులు చర్చించుకుంటున్నారు. అమావాస్య రోజున జరిగిన ఈ సంఘటన స్థానికంగా ఆసక్తిని రేకెత్తిస్తోంది.

వాస్తవంగా అమావాస్యను ప్రతికూలంగా భావిస్తుంటారు. ఆ రోజు చెడు జరుగుతుందని భక్తులు విశ్వసిస్తుంటారు. నిండు అమావాస్య రోజు ఇలా నాగుపాము ప్రముఖ పుణ్యక్షేత్రంలో చనిపోవడం వెనుకాల ఏమై ఉంటుందా? అని భక్తులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. అయితే అలాంటిది ఏమీ లేదని.. చెడు సంకేతం అలాంటిది ఏమీ లేదని కొందరు కొట్టిపారేస్తున్నారు. ఎక్కడి నుంచో వచ్చిన నాగుపాము భక్తుల మధ్యకు రావడంతో ఎవరైనా దాడి చేయడంతో పాము మరణించి ఉంటుందని చెబుతున్నారు. దీనికి పెద్దగా చర్చించాల్సిన అవసరం లేదని కొట్టిపారేస్తున్నారు.

0
0
Report

అనారోగ్యంతో కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం కన్నుమూత

Kirlampudi, Andhra Pradesh:

Mudragada Padmanabham: కాపు సామాజికవర్గ ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం (73) తుదిశ్వాస విడిచారు. కొన్నాళ్లుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ మృతి చెందారు. కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతూ పద్మనాభం కన్నుమూశారు. ఆయన మృతితో కాపు సామాజికవర్గం పెద్ద దిక్కును కోల్పోయింది. పద్మనాభం మృతికి సీఎం చంద్రబాబుతోపాటు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌, ఇతర ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

హైదరాబాద్‌లోని సింధు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ముద్రగడ పద్మనాభం మంగళవారం సాయంత్రం తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు మృతిచెందారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. నెల రోజులుగా హైదరాబాద్‌లో కిడ్నీలకు సంబంధించి చికిత్స పొందారు. క్యాన్సర్ బారిన కూడా పడినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. హైదరాబాద్‌ నుంచి బుధవారం మృతదేహాన్ని స్వగ్రామం కిర్లంపూడికి తీసుకొచ్చే అవకాశం ఉంది.

ముద్రగడ పద్మనాభ రెడ్ది ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మంత్రిగా పనిచేసిన కాపు సంఘం నాయకుడు. గతంలో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలలో పనిచేశారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా.. ఒకసారి ఎంపీగా, రెండుసార్లు రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. 2014 నుంచి 2024 వరకు రాజకీయాలకు దూరంగా ఉన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికలు సమయంలో అకస్మాత్తుగా 2024 మార్చి 16వ తేదీన వైఎస్సార్‌సీపీలో చేరాడు.

ప్రముఖుల సంతాపం
ముద్రగడ పద్మనాభవం మృతితో ఏపీలోని ప్రధాన సామాజికవర్గమైన కాపు వర్గం పెద్ద దిక్కును కోల్పోయింది. కాపులకు ప్రతీకగా నిలిచిన ముద్రగడ పద్మనాభం ఎన్నో ఉద్యమాలు, పోరాటాలు నడిపించాడు. కాపులకు సంబంధించిన డిమాండ్లు, సమస్యలపై తీవ్ర పోరాటం చేశారు.

పద్మనాభం తండ్రి వీరరాఘవరావు ప్రత్తిపాడు శాసనసభ్యుడిగా 1962, 67 ఎన్నికల్లో విజయం సాధించారు. 1977లో తండ్రి హఠాన్మరణం పొందడంతో 1978లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ముద్రగడ పద్మనాభం రెడ్డి జనతా పార్టీ అభ్యర్థిగా ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. మొత్తం మూడుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు.

కాపు ఉద్యమం
కాపుల సామాజికవర్గానికి ముద్రగడ పద్మనాభం కేంద్రంగా నిలుస్తున్నారు. 1994లో కాపుల కోసం నిరాహార దీక్ష చేశారు. 2016 జనవరి 31 నాడు తూర్పు గోదావరి జిల్లా తునిలో ప్రారంభమైన కాపు ఐక్య గర్జన సభతో కాపులకు సంబంధించిన ప్రధాన డిమాండ్ల సాధనకు పోరాటం చేశారు. రైలు రోకో హింసాత్మకంగా మారింది. 

పిఠాపురంలో హోరాహోరీ
కాపులకు ప్రతినిధిగా ఉన్న ముద్రగడ పద్మనాభం 2024 ఎన్నికల్లో హల్‌చల్‌ చేశారు. ఆ ఎన్నికల ప్రచార సమయంలో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌ను పిఠాపురంలో ఓడిస్తానని సవాల్‌ చేశారు. ఓడించకపోతే తన పేరును ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని శపథం చేశారు. ఆ ఎన్నికల్లో పవన్ గెలవడంతో చేసిన మాట ప్రకారం కట్టుబడి ముద్రగడ పద్మనాభం రెడ్డిగా పేరు మార్చుకున్నారు.

0
0
Report
Advertisement

Nepal Elephant Attack: పగబట్టిన ఏనుగు.. 14 ఏళ్ల తర్వాత వెతుక్కుంటూ వచ్చి మరీ దాడి.. మ్యాటర్ ఏమిటంటే..?

Hyderabad, Telangana:

Dhurbe Elephant attack on same nepali family: సాధారణంగా మనం తరచుగా పాములు పగబడుతాయని వింటు ఉంటాం. దానికి ఎవరైన హనీ తలపెట్టిన లేదా, తోక తోక్కిన కూడా కోపంతో ఆ పనిచేసి వారిపై కాటు వేస్తాయి. కొన్నిసార్లు ఎన్ని రోజులైన కూడా పాములు పగ బడతాయని కొంత మంది నమ్ముతుంటారు. అయితే కొన్నిసార్లు ఇతర జంతువులు సైతం తమ పిల్లలకు అపకారం తలపెడితే దాడులు చేస్తాయి. మరీ నేపాల్ లో జరిగిన ఒక ఘటన స్థానికంగా అందరిని ఆశ్చర్యంకు గురిచేస్తుంది. 

నేపాల్‌లోని చిత్వాన్ నేషనల్ పార్క్ సమీపంలో 'ధ్రుబే' అనే ఏనుగు సంచరిస్తుంది.  ఈ ఏనుగు అక్కడ నివసించే వారి మీద దాడి చేసి వారిని పొట్టన పెట్టుకుంది. ఈ క్రమంలో  2012 డిసెంబర్‌లో మాడి అనే పట్టణంలో ధ్రుబే ఏనుగు దాడి చేయడంతో శనిచర తల్లిదండ్రులు ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత నుంచి శనిచర ఈ ఏనుగు ప్రమాదం నుంచి బైటపడేందుకు.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని, రాప్తి నది దాటి దాదాపు 9 మైళ్ల దూరంలోని జగత్‌పూర్‌కు చేరుకున్నారు.

ఇంత దూరం వస్తే ఆ 'ధ్రుబే' ఏనుగు తమను ఏమిచేయదని భావించారు . కానీ వారు అనుకున్నదానికి రివర్స్ లో జరిగింది. 'ధ్రుబే' ఏనుగు దాదాపు.. 14 సంవత్సరాల తర్వాత, అదే ధ్రుబే ఏనుగు వాసన పసిగట్టి ... జగత్‌పూర్‌లోని శనిచర ఇంటిపై దాడి చేసింది. అతని 25 ఏళ్ల కోడలు ఆషికా బోటేను, 4 ఏళ్ల మనవడు భరత్ బోటేను అతి కిరాతకంగా కాళ్లతొ తొక్కి చంపింది. నార్మల్ గా ఈ ఏనుగు వారిపై ఎందుకంత పగను పెంచుకుందో మాత్రం విషయం బైటపడలేదు.  

'ధ్రుబే' అత్యంత ప్రమాద కర ఏనుగు అని  2010 నుంచి ఇప్పటివరకు ఈ ఒక్క ఏనుగే 25 మందిని చంపినట్లు చిత్వాన్ నేషనల్ పార్క్ అధికారులు వెల్లడించారు.  ఈ ఘటనతో అసలు ఆ ఏనుగు అక్కడి వారిని ఎందుకంత టార్గెట్ చేసుకుందని అధికారులు తలలు పట్టుకుంటున్నారు.

Read more: Agra Ice shivling in Fridge: వావ్ అద్భుతం.. ఫ్రిజ్‌లో అమర్ నాథ్‌ లింగంలా ఏర్పడిన మంచు ప్రతిరూపం.. వీడియో వైరల్..

మరోవైపు  శనిచర అక్కడి నుంచి మరో ప్రాంతంకు వెళ్లాలని స్థానికులు సూచించారు.  ఇక ఫారెస్ట్ అధికారులు..  ధ్రుబే కదలికలను పర్యవేక్షించడానికి 2016 నుంచి  దానికి ట్రాకింగ్ కాలర్ కూడా అమర్చారు. 2020, 2023లో ఆ కాలర్‌ను మార్చినప్పటికీ, దానిని పూర్తిగా నియంత్రించలేకపోయారు. ఈ క్రమంలో ఏనుగు కూడా పగబడుతుందా అని జనాలు తలలు పట్టుకుంటున్నారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

0
0
Report

ధర్మపురిలో వెలిసిన నరసింహ స్వామి.. నదిలో విగ్రహాన్ని చూసేందుకు పోటెత్తిన భక్తులు..

Hyderabad, Telangana:

Dharmapuri Latest News: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన జగిత్యాల జిల్లా ధర్మపురి క్షేత్రంలో ఒక అద్భుత ఘట్టం చోటుచేసుకుంది. దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన ధర్మపురి గోదావరి నది తీరంలో పురాతన శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి విగ్రహం లభ్యమైంది. నదిలో లభించిన ఈ దివ్య మంగళ విగ్రహాన్ని చూసేందుకు భక్తులతో పాటు స్థానికులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. అస్సలు ఈ విగ్రహం ఎక్కడిది? ఎక్కడి నుంచి కొట్టుకు వచ్చింది.? మొదట ఎవరు చూశారు? దీనికి సంబంధించని పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ఇసుక తిన్నెల్లో లక్ష్మీనరసింహస్వామి..
గోదావరి నది దిగువ ప్రాంతంలో నిత్యం చేపల వేట సాగించే.. స్థానిక జాలర్లకు ఈ విగ్రహం తొలుత కనిపించింది. నదిలో నీటి మట్టం గణనీయంగా తగ్గడంతో.. ఇసుక కింద ఏదో విగ్రహం ఉన్నట్లు వారు గమనించారు. దగ్గరికి వెళ్లి ఇసుకను తొలగించి చూడగా.. సుమారు మూడు అడుగుల ఎత్తు ఉన్న పురాతన శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి విగ్రహం బయటపడింది. జాలర్లు ఎంతో భక్తిశ్రద్ధలతో ఆ విగ్రహాన్ని నది నుంచి సురక్షితంగా బయటకు తీసి.. నదీ తీరానికి చేర్చారు.

వరద ఉధృతికి కొట్టుకొచ్చిందా? 
ఈ పురాతన విగ్రహం ఇక్కడికి ఎలా వచ్చిందనే అంశంపై స్థానికంగా ఆసక్తికరమైన చర్చ నడుస్తోందని సమాచారం. ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు.. గోదావరి నది ఉధృతంగా ప్రవహించిన సమయంలో ఏదైనా ఆలయం నుంచి ఈ విగ్రహం కొట్టుకువచ్చి ఉండవచ్చని స్థానికులు భావిస్తున్నారు. నదిలో వరద నీరు తగ్గి.. ఇసుక మేటలు వేయడంతో ఈ విగ్రహం బయటపడిందని అంచనా తెలుస్తోంది. అయితే, శతాబ్దాల చరిత్ర కలిగిన ధర్మపురి క్షేత్రంలోనే ఈ విగ్రహం లభించడం వెనుక ఏదో దైవ సంకల్పం ఉందంటూ భక్తులు బలంగా నమ్ముతున్నారు.

Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!

తులసి మాలలతో ప్రత్యేక పూజలు.. 
విగ్రహం బయటపడిన వార్త వ్యాపించడంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో గోదావరి తీరానికి చేరుకున్నారు. స్వామివారి విగ్రహానికి పవిత్ర గోదావరి జలాలతో సంప్రోక్షణ చేసి.. తులసి మాలలతో అలంకరించారు. ధూపదీప నైవేద్యాలు సమర్పించి.. ప్రత్యేక పూజలు నిర్వహించారు. నరసింహ నామస్మరణతో గోదావరి తీరం మార్మోగిపోయిందని చెప్పొచ్చు. ప్రస్తుతం ఈ విగ్రహాన్ని పురావస్తు శాఖ అధికారులకు అప్పగించిన్నట్లు తెలుస్తోంది. దీని వెనక ఉన్న చారిత్రక నేపథ్యాన్ని అంచనా వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

0
0
Report

KCR సోయి లేని నిర్ణయాల వల్లే సింగరేణికి ఈ దుస్థితి: ఈటల

Hyderabad, Telangana:

Eatala Rajender Latest News: ఒకప్పుడు దేశంలోనే అత్యంత సంపన్నమైన సంస్థగా ఉన్న సింగరేణి.. నేడు బ్యాంకుల నుంచి అప్పులు తెస్తే.. తప్ప కార్మికులకు జీతాలు ఇవ్వలేని దుస్థితికి దిగజారిపోయిందని BJP MP ఈటల రాజేందర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.. సింగరేణి భరోసా యాత్రలో భాగంగా రామగుండంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గత BRS ప్రభుత్వంపై, మాజీ CM కేసీఆర్‌పై ఈటల విమర్శల వర్షం కురిపించారు. సింగరేణి సంస్థ నష్టాల్లో కూరుకుపోవడానికి పూర్తి బాధ్యత గత ప్రభుత్వానిదేనని ఆయన స్పష్టం చేశారు.

సభను ఉద్దేశించి ఈటల రాజేందర్ మాట్లాడుతు.. తాను సింగరేణి కార్మికులతో చాలా దగ్గరగా బతికారని.. వారి కష్టసుఖాలు తనకు పూర్తిగా తెలుసని అన్నారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో సింగరేణి కార్మికులు చేసిన సకల జనుల సమ్మె చరిత్రలో నిలిచిపోందని.. మీరు సమ్మె చేస్తే రాష్ట్రానికి కరెంటు ఎలా వస్తుందని అప్పట్లో చాలామంది విమర్శించారు.. బెదిరించారు. కానీ, కార్మికులు వేటికీ లొంగకుండా.. తెగించి పోరాడారని.. తెలంగాణ వస్తే సింగరేణికి పూర్వవైభవం వస్తుందని నమ్మి పోరాటం చేశారని.. కానీ, స్వరాష్ట్రంలో పూర్వవైభవం దేవుడెరుగు.. ఉన్న పరిస్థితి మరింత దిగజారిపోయిందని ఈటల ఆవేదన వ్యక్తం చేశారు.

కేసీఆర్ సోయి లేని నిర్ణయాల వల్లే..
గతంలో అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రంతో సానుకూలంగా ఉంటూ.. సింగరేణి ప్రయోజనాలను కాపాడాయని.. కానీ కేసీఆర్ మాత్రం కక్షసాధింపు ధోరణితో.. కనీస సోయి లేకుండా ప్రవర్తించారని ఈటల విమర్శించారు. కేంద్రంతో సఖ్యతగా ఉండకపోవడం వల్లే సింగరేణికి తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు.

అయితే, ప్రస్తుత కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఒకప్పుడు బొగ్గు గని కార్మికుల హక్కుల కోసం క్షేత్రస్థాయిలో కొట్లాడిన నాయకుడని గుర్తు చేశారు. నేడు ఆయనే కేంద్రమంత్రిగా ఉండటం వల్ల సింగరేణిని నిర్వీర్యం కాకుండా కాపాడుతున్నారని కొనియాడారు.. సంస్థ పునరుజ్జీవనం కోసం కేంద్ర ప్రభుత్వం తాడిచర్ల - 2 బొగ్గు గనిని సింగరేణికి కేటాయించిందని.. తద్వారా సంస్థను మళ్లీ గాడిన పెట్టేందుకు మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వెల్లడించారు. కార్మికుల సమస్యలన్నింటినీ కిషన్ రెడ్డి సానుకూలంగా పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు.

Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!

రామగుండం ఎరువుల కర్మాగారం (RFCL) ఇతర రాజకీయ పార్టీలకు కేవలం ఒక నినాదంగా మాత్రమే మిగిలిపోతే... ప్రధాని నరేంద్ర మోడీ రూ. 6,300 కోట్లు కేటాయించి.. దానిని పునరుద్ధరించి తెలంగాణ రైతులకు అంకితం చేశారని ఈటల గుర్తు చేశారు. రాష్ట్రంలో నేషనల్ హైవేలు, రైల్వే లైన్లు, అత్యాధునిక రైల్వేస్టేషన్లతో పాటు కొత్త రైళ్ల కోసం కేంద్ర ప్రభుత్వం వేల కోట్లు ఖర్చు చేస్తోందని అన్నారు. రాష్ట్రాల అభివృద్ధిలోనే దేశ అభివృద్ధి దాగి ఉందని నమ్మే ఏకైక నాయకుడు నరేంద్ర మోడీ అని అన్నారు.. తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని ప్రధాని మోడీ తీవ్రంగా కాంక్షిస్తున్నారని ఈటల పేర్కొన్నారు.

Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

0
0
Report
Advertisement

గోడదూకి వచ్చి అఘాయిత్యం.. కళ్లముందే కన్నకూతురిని ఎత్తుకెళ్లిన POCSO కేసు నిందితుడు..

Hyderabad, Telangana:

Addagudur Pocso Case: రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై ప్రజల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.. షాబాద్ నరహంతకుడి అరాచక మారణకాండ సృష్టించిన భీభత్సం ఇంకా మరవక ముందే.. తాజాగా అడ్డగూడూరులో మరో దారుణ ఘటన వెలుగుచూసింది.. ఓ వైపు మహిళల రక్షణ కోసం కఠిన చట్టాలు తెస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో కామాంధుల ఆగడాలకు అడ్డుకట్ట పడటం లేదు.. ఓ బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టిన పోక్సో కేసు నిందితుడు.. ఏకంగా అదే బాలికను కిడ్నాప్ చేయడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఇంతకీ ఇది ఎక్కడ జరిగింది.? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

గోడదూకి వచ్చి..
బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. కొన్ని రోజుల క్రితం నిందితుడు అర్ధరాత్రి వేళ బాధితురాలి ఇంటి గోడదూకి లోపలికి ప్రవేశించాడు.. ఇంట్లో నిద్రిస్తున్న మైనర్ బాలికపై అఘాయిత్యానికి యత్నించాడు.. బాలిక అప్రమత్తమై కేకలు వేయడంతో కుటుంబ సభ్యులు మేల్కొన్నారు. దీంతో నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు.. ఈ ఘోరంపై బాలిక కుటుంబ సభ్యులు ధైర్యంగా ముందుకు వచ్చి.. స్థానిక పోలీస్ స్టేషన్‌లో నిందితుడిపై ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితుడిపై పోక్సో (POCSO) చట్టం కింద కేసు నమోదు చేశారు.

పోలీసుల నిర్లక్ష్యమే శాపమైందా?
కేసు నమోదైనప్పటికీ.. స్థానిక సబ్ ఇన్‌స్పెక్టర్ (SI) వ్యవహరించిన తీరుపై ఇప్పుడు తీవ్ర విమర్శలు వ్యక్తమవుతూ వస్తున్నాయి.. పోక్సో చట్టం కింద అత్యంత కఠినమైన సెక్షన్లు నమోదైనప్పటికీ.. నిందితుడిని వెంటనే అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించడంలో పోలీసులు నిర్లక్ష్యం చేశారని.. బాధితురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. SI నిందితుడిని రిమాండ్‌కు పంపకుండా.. స్టేషన్ నుంచే వదిలేశారని.. ఆ అండతోనే నిందితుడు మరింత బరితెగించాడని వారు కన్నీరుమున్నీరవుతున్నారు.

కళ్లముందే బాలికను ఎత్తుకెళ్లిన నిందితుడు..
పోలీసుల చల్లని చూపుతో స్వేచ్ఛగా తిరిగిన నిందితుడు.. తనపై ఫిర్యాదు చేశారన్న కక్షతో పగ పెంచుకున్నాడు.. ఈ క్రమంలోనే పక్కా ప్రణాళికతో బాలికను ఎత్తుకెళ్లాడు. చట్టం తనను ఏమీ చేయలేదనే.. ధీమాతోనే నిందితుడు ఈ దారుణానికి ఒడిగట్టాడని బాధితురాలి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ఆ రోజే నిందితుడిని జైలుకు పంపి ఉంటే.. ఈ రోజు మా బిడ్డ మా కళ్లముందే ఉండేది.. ఎస్ఐ నిర్లక్ష్యం వల్లే మా అమ్మాయికి ఈ గతి పట్టింది.. అంటూ బాధితురాలి కుటుంబం సభ్యులు ఆందోళనకు దిగిన్నట్లు తెలుస్తోంది.

ఉలిక్కిపడ్డ స్థానికులు.. 
ఈ ఘటనతో అడ్డగూడూరు పరిసర ప్రాంతాల ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు.. షాబాద్ ఘటన మరవక ముందే మరో బాలికకు ఇలాంటి అన్యాయం జరగడంపై మహిళా సంఘాలు, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిందితుడిని తక్షణమే పట్టుకుని బాధితురాలిని సురక్షితంగా తలిదండ్రుల చెంతకు చేర్చాలని.. నిర్లక్ష్యంగా వ్యవహరించిన SIపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు ప్రత్యేక బృందాలతో నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

0
0
Report

అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్లు KTR, హరీష్ రావు: ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం..

Hyderabad, Telangana:

KTR, Harish Rao are Brand Ambassadors for Lies: BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులపై చొప్పదండి కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.. తెలంగాణ సస్యశ్యామలంగా ఉండటం ఇష్టం లేని వీరిద్దరూ.. స్పైడర్ సినిమా విలన్లలా ఆలోచిస్తున్నారని మండిపడ్డారు. మంగళవారం సీఎల్‌పీ మీడియా సెంటర్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేటీఆర్ లోయర్ మానేరు డ్యాం (LMD) సందర్శనను ఒక విహారయాత్రగా అభివర్ణించిన సత్యం.. రైతులపై ఆయన చూపిస్తున్నదంతా కపట ప్రేమేనని విమర్శించారు.

కరవు రావాలని కోరుకుంటున్నారు..
సాధారణంగా లోయర్, మిడ్ మానేరు డ్యాంలు జూలై ఆఖరు లేదా ఆగస్టు మాసాల్లో నిండుతాయని.. ఈ ఏడాది కూడా వర్షదేవుడి కటాక్షంతో ప్రాజెక్టులు సమృద్ధిగా నిండుతాయనే నమ్మకం తమకుందని ఎమ్మెల్యే తెలిపారు. అయితే, రాష్ట్రంలో కరవు రావాలి, పంటలు పండకూడదు.. ప్రజలు విలవిలలాడాలి.. తద్వారా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి చెడ్డపేరు తేవాలనేదే కేటీఆర్, హరీష్ రావుల కుట్రపూరిత ఆలోచన అని ధ్వజమెత్తారు.. ఉద్దేశపూర్వకంగానే ప్రజలను, రైతులను రెచ్చగొట్టే రాజకీయం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఒకవేళ వర్షాలు పడకపోతే రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం దగ్గర పక్కా ప్రత్యామ్నాయ ప్రణాళికలు ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు.

హిట్లర్ పాలన పోయింది.. 
గత పదేళ్ల BRS పాలన హిట్లర్, ఫాసిస్ట్ పద్ధతుల్లో సాగిందని.. అందుకే ప్రజలు విసిగిపోయి.. ఆ పార్టీని బండకేసి కొట్టారని మేడిపల్లి సత్యం ఎద్దేవా చేశారు. మీది ఫాసిస్ట్ పాలన అయితే.. మా సీఎం రేవంత్ రెడ్డిది హ్యుమనిస్ట్ పాలన అని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఏ స్కీమ్ పెట్టినా అందులో స్కామ్ తప్ప తెలంగాణకు ఒరిగింది ఏమీ లేదని.. రాష్ట్రాన్ని పూర్తిగా దోచుకున్నారని ఆరోపించారు. CM రేవంత్ రెడ్డి దూరదృష్టి ఉన్న నాయకుడని.. ప్రజా సంక్షేమం విషయంలో ఎక్కడా రాజీ పడకుండా రాష్ట్రాన్ని కాపాడుకుంటారని భరోసా ఇచ్చారు.

అబద్ధాల పోటీలో నెంబర్ వన్ స్థానం..
అప్పట్లో హిట్లర్ పక్కన అబద్ధాలు ప్రచారం చేయడానికి గోబెల్స్ ఉన్నట్లు.. ఇప్పుడు కేసీఆర్ పక్కన KTR, హరీష్ రావు చేరారు. వీరిద్దరూ గోబెల్స్‌ను మించిపోయి అబద్ధాల పోటీల్లో నెంబర్ వన్ స్థానం కోసం పోటీ పడుతున్నారని.. భవిష్యత్తులో వీరు నిజాలు చెప్పినా ప్రజలు నమ్మలేని స్థాయికి దిగజారిపోయారని.. పిల్లి శాపనార్థాలు, కుట్ర రాజకీయాలు ఇప్పటికైనా ఆపాలని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు.

Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!

కాళేశ్వరం ప్రాజెక్టుపై BRS నేతలు మాట్లాడుతుంటే .. హంతకుడే సంతాప సభ.. పెట్టినట్లు ఉందని సత్యం ఎద్దేవా చేశారు. కేవలం ధనదాహంతో.. కమీషన్ల కోసమే కాళేశ్వరాన్ని నిర్మించారని.. వారి హయాంలోనే.. వారి అవినీతి వల్లే ఆ ప్రాజెక్టు కూలిపోయిందని గుర్తుచేశారు.. తెలంగాణ ప్రజలు చాలా వివేకవంతులని.. కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరును గమనిస్తున్నారని.. BRs నేతల డ్రామాలను ఎవరూ నమ్మే పరిస్థితి లేదని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం స్పష్టం చేశారు.

Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

0
0
Report

Metro Lovers Kissing: మెట్రో రైలులో లవర్స్ ముద్దులాట..బూతులు తిడుతున్న ప్రయాణికులు!

Bengaluru, Karnataka:

Namma Metro Lovers Kissing: ఇంతకాలం ఢిల్లీ మెట్రోలో యువతీ యువకుల ప్రేమాయణాలు, రీల్స్ హంగామా, వెర్రి చేష్టలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తరచూ వైరల్ అవ్వడం అడపాదడపా చూసే ఉంటారు. అయితే, ఇప్పుడు ఐటీ హబ్ బెంగళూరులోని 'నమ్మ మెట్రో' లోనూ అలాంటి ఘటనే వెలుగుచూసింది. మెట్రో రైలులో ఒక యువ జంట బహిరంగంగా ముద్దు పెట్టుకుంటూ అసభ్యంగా ప్రవర్తించిన వీడియో ప్రస్తుతం నెటిజన్లలో తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తిస్తోంది.

సిలికాన్ సిటీ బెంగళూరులోని కేఆర్ పురం మెట్రో స్టేషన్‌కు వస్తున్న రైలులో ఈ ఘటన చోటుచేసుకుంది. రైలు ప్రయాణికులతో ఉండగానే, ఒక యువకుడు, యువతి చుట్టుపక్కల వారిని పట్టించుకోకుండా ఒకరినొకరు ముద్దు పెట్టుకుంటూ కనిపించారు. అదే కంపార్ట్‌మెంట్‌లో ప్రయాణిస్తున్న మరో ప్రయాణికుడు వీరి ప్రవర్తనను తన మొబైల్ ఫోన్‌లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

నిబంధనలు బేఖాతర్..
మెట్రోలో ప్రయాణికుల భద్రత, క్రమశిక్షణ కోసం బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (BMRCL) అనేక కఠినమైన నిబంధనలను అమలు చేస్తోంది. అయినప్పటికీ, కొందరు యువతీ యువకులు వాటిని బేఖాతర్ చేస్తూ బహిరంగ ప్రదేశాలను పార్కులుగా భావిస్తున్నారని నెటిజన్లు మండిపడుతున్నారు. ప్రజా రవాణా వ్యవస్థలో ఇలాంటి నీచమైన పనులకు పాల్పడటంపై ప్రయాణికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

కొంతకాలం క్రితం కూడా బెంగళూరు మెట్రోలో ఒక జంట కౌగిలించుకుని, ముద్దు పెట్టుకున్న వీడియో హల్‌చల్ చేసింది. ఇప్పుడు మళ్లీ అలాంటి ఘటనే పునరావృతం కావడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. బహిరంగ రవాణా వ్యవస్థల్లో ఇలాంటి అసభ్య ప్రవర్తనలపై కఠిన చర్యలు తీసుకోవాలని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై జరిమానాలు విధించాలని సోషల్ మీడియా వేదికగా డిమాండ్లు వస్తున్నాయి.

Also Read: బిగ్ బ్రేకింగ్.. రాజకీయాల్లోకి ఎన్టీఆర్..తారక్ కార్యాలయం నుంచి కీలక ప్రకటన!

Also Read: పల్నాడులో కొత్త ప్రభుత్వ మెడికల్ కళాశాల..100 సీట్ల భర్తీకి NMC గ్రీన్ సిగ్నల్..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement

స్టూడెంట్స్ కోసం iQOO సరికొత్త సంచలనం.. iQOO Z11 Lite లాంచ్!

Hyderabad, Telangana:

Iqoo Z11 Lite Launching On July 24: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఐకూ (iQOO) భారత స్మార్ట్‌ఫోన్‌ కస్టమర్స్‌ను, ముఖ్యంగా విద్యార్థులను టార్గెట్ చేస్తూ సరికొత్త మొబైల్‌ను మార్కెట్లోకి విడుదల చేసేందుకు సిద్ధమైంది. దీనిని కంపెనీ iQOO Z11 Lite పేరుతో జూలై 24న భారతదేశంలో గ్రాండ్‌గా విడుదల చేసేందుకు సిద్ధమైంది.. కాలేజ్ స్టూడెంట్స్ రోజువారీ అవసరాలతో పాటు ఆన్‌లైన్ క్లాసులు, ప్రాజెక్ట్ అసైన్‌మెంట్‌లను దృష్టిలో ఉంచుకుని నాన్-స్టాప్.. నో లిమిట్ (Non-Stop. No Limit.) అనే కాన్సెప్ట్‌తో ఈ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ ప్రత్యేకంగా డిజైన్ చేసిన్నట్లు వెల్లడించింది.

స్టూడెంట్స్ కోసం పవర్‌ఫుల్ AI ఫీచర్స్..
ఈ స్మార్ట్‌ఫోన్‌లో కంపెనీ సాధారణ ఫీచర్స్‌ కంటే.. ఎన్నో రకాల కొత్త కొత్త ఫీచర్స్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చింది. ముఖ్యంగా ఇందులో కంపెనీ విద్యార్థుల చదువుకు ఎంతో సహాయపడే పవర్‌ఫుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఫీచర్లతో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో AI క్రియేషన్ ఫీచర్‌ సహాయంతో విద్యార్థులు పెద్ద పెద్ద డాక్యుమెంట్‌లను సులభంగా సమ్మరైజ్ చేస్తుంది. అంతేకాకుండా అసైన్‌మెంట్‌లను ఎడిట్‌ చేయడమే కాకుండా.. కొత్త కంటెంట్ క్రియేట్ చేయడం, లాంగ్వేజ్ ట్రాన్స్‌లేషన్‌తో పాటు రైటింగ్ ఐడియాలను అందించేందుకు ఎంతగానో సహాయపడుతుంది. ఇవే కాకుండా AI క్యాప్షన్ ఫీచర్ కూడా లభిస్తోంది. ఇందులో  రియల్ టైమ్ ట్రాన్స్‌క్రిప్షన్, ఇన్‌స్టంట్ ట్రాన్స్‌లేషన్‌తో పాటు వన్-టాప్ సమ్మరీ వంటి ఫీచర్లు కూడా లభిస్తున్నాయి.  దీనివల్ల ఆన్‌లైన్ లెక్చర్స్, వర్క్‌షాప్స్ జరిగే సమయంలో నోట్స్ రాసేందుకు క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. 

6500mAh భారీ బ్యాటరీ.. 
ఈ iQOO Z11 Lite స్మార్ట్‌ఫోన్‌లో కంపెనీ అద్భుతమైన బ్యాటరీని కూడా అందిస్తోంది. ఇందులో కంపునీ మోస్ట్ పవర్‌ఫుల్ 6500mAh బ్యాటరీని అందిస్తున్నట్లు తెలుస్తోంది.. ఇది 44W ఫ్లాష్ ఛార్జ్ (FlashCharge) సపోర్ట్‌తో అందుబాటులోకి వచ్చింది. అంతేకాకుండా, ఈ బ్యాటరీ 5 సంవత్సరాల సుదీర్ఘ హెల్త్ లైఫ్‌తో అందుబాటులోకి రావడం విశేషం.. 

మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ..
విద్యార్థుల చేతుల్లో ఫోన్లు తరచూ కింద పడుతుంటాయి.. అంతేకాకుండా అప్పుడప్పుడు ప్రయాణాలు చేసే క్రమంలో కిందపడి పగిలిపోతూ ఉంటాయి. దీనిని అడ్డుకోవడానికి ఈ ఫోన్‌కు మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీని అందిస్తోంది.. అంతేకాకుండా SGS 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్ సర్టిఫికేషన్ కూడా దీనికి లభించడం విశేషం.. అంటే ఫోన్ అనుకోకుండా కింద పడినా ఎలాంటి డ్యామేజ్ కాకుండా సురక్షితంగా ఉంటుందని కంపెనీ క్లైమ్‌ చేస్తోంది..

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

స్టైలిష్ డిజైన్, కలర్స్..
లుక్ పరంగా కూడా ఈ ఫోన్ చాలా మోడ్రన్‌గా, స్లీక్‌గా ఉంటుంది.. ఇందులో మినిమలిస్ట్, కాంపాక్ట్ కెమెరా మాడ్యూల్‌ను కూడా కంపెనీ అందించింది.. అలాగే కాల్స్, నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు మెరిసే డైనమిక్ లైట్ ఫీచర్ దీనికి మరింత స్టైలిష్ లుక్‌ను అందిస్తుందని తెలుస్తోంది.. ఈ ఫోన్ లేటెస్ట్ OriginOS 6 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది. దీంతో పాటు 4 సంవత్సరాల పాటు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను కూడా అందిస్తోంది.

ధర పూర్తి వివరాలు..
iQOO Z11 Lite ఫోన్ సోలార్ ఫ్లేమ్ (Solar Flame)తో పాటు మిడ్‌నైట్ బ్లూ (Midnight Blue) అనే రెండు అద్భుతమైన కలర్ ఆప్షన్లలో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. జూలై 24న లాంచ్ అయిన తర్వాత ఈ ఫోన్ ఐకూ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon)లో అందుబాటులోకి రాబోతున్నాయి. స్టూడెంట్స్ బడ్జెట్‌కు తగినట్లే.. దీని ధర ఉండే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report

భారీ 9000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Redmi Note 17 సిరీస్ లాంచ్.. ఫీచర్లు అరాచకం!

Hyderabad, Telangana:

Redmi Note 17 Series: టెక్ ప్రపంచంలో తమదైనశైలిలో దూసుకుపోతున్న ప్రముఖ చైనీస్ హ్యాండ్‌సెట్ తయారీ సంస్థ రెడ్‌మి (Redmi) మరో అద్భుతమైన స్మార్ట్‌ఫోన్ సిరీస్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసేందుకు సిద్ధమైంది.. ఎంతో కాలంగా వినియోగదారులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న రెడ్‌మి నోట్ 17 (Redmi Note 17) సిరీస్ చైనా మార్కెట్లో జూలై 14న అధికారికంగా విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది.. అయితే, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఈ సిరీస్‌కు సంబంధించిన కొన్ని స్పెషల్ స్పెసిఫికేషన్లతో పాటు ఫీచర్లు లీక్ అయ్యాయి. ముఖ్యంగా ఈ సిరీస్‌లోని ప్రో మోడల్‌లో ఏకంగా 9,000 mAh భారీ బ్యాటరీని అందించబోతున్నట్లు లీక్‌ అయిన వివరాలు చెబుతున్నాయి.

లీక్ అయిన సమాచారం ప్రకారం.. ఈ సరికొత్త సిరీస్‌లో భాగంగా రెండు మోడళ్లను కంపెనీ విడుదల చేసేందుకు సిద్ధమైన్నట్లు తెలుస్తోంది.. ఇందులో బేస్ మోడల్ రెడ్‌మి నోట్ 17 కాగా.. రెండవది హై-ఎండ్ వేరియంట్ రెడ్‌మి నోట్ 17 ప్రో.. ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు అద్భుతమైన డిజైన్‌తో పాటు శక్తివంతమైన ప్రాసెసర్‌లతో అందుబాటులోకి రాబోతున్నాయి.

రెడ్‌మి నోట్ 17 ఫీచర్లు..
ఈ ఫోన్‌లో భారీ 7-అంగుళాల Full HD+ Samsung E4 Pro డిస్‌ప్లేను అందించబోతున్నట్లు తెలుస్తోంది. ఇది 1,800 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంటుందని కంపెనీ తెలిపింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ అద్భుతమైన స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 4 (Snapdragon 4 Gen 4) చిప్‌సెట్‌ సపోర్ట్‌తో లాంచ్‌ కాబోతోంది.. సాధారణ మోడల్ స్మార్ట్‌ఫోన్‌ అయినప్పటికీ ఇందులో ఏకంగా 8,000 mAh సామర్థ్యం గల భారీ బ్యాటరీని అందుబాటులోకి తీసుకు వచ్చిన్నట్లు తెలుస్తోంది. ఇది 45W వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్‌ సపోర్ట్‌తో పాటు 22.5W రివర్స్ చార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుందని కంపెనీ తెలిపింది.. ఇక ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన కెమెరా వివరాల్లోకి వెళితే.. దీని వెనుక భాగంలో 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాను కూడా కలిగి ఉంటుంది.. భద్రత కోసం ఇన్-డిస్‌ప్లే ఆప్టికల్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ కూడా అందుబాటులో ఉంది..

రెడ్‌మి నోట్ 17 ప్రో స్పెసిఫికేషన్లు..
ప్రో మోడల్‌లో ఫీచర్లు మరింత అద్భుతంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో కంపెనీ 6.83-అంగుళాల 1.5K ఫ్లాట్ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఇది ఏకంగా 3,500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ లెవెల్‌ సపోర్ట్‌తో అందుబాటులోకి రాబోతోంది. స్క్రీన్ ప్రొటక్షన్‌ కోసం ఇందులో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 (Corning Gorilla Glass Victus 2) ప్రొటెక్షన్‌ను అందించారు. అంతేకాకుండా ఇందులో కంపెనీ స్నాప్‌డ్రాగన్ 6s జెన్ 4 (Snapdragon 6s Gen 4) ప్రాసెసర్‌ను కూడా అందిస్తోంది.

ఇందులో కంపెనీ మోస్ట్ పవర్‌ఫుల్ 9,000 mAh మెగా బ్యాటరీని కూడా అందించారు. దీనికి తోడు 67W వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో పాటు 22.5W వైర్డ్ రివర్స్ చార్జింగ్ సపోర్ట్ ఉండటం విశేషం.. దీనివల్ల ఫోన్ చాలా వేగంగా చార్జ్ అవ్వడమే కాకుండా.. పవర్‌బ్యాంక్‌లా కూడా ఉపయోగపడుతుందని కంపెనీ తెలిపింది.. ప్రముఖ టిప్‌స్టర్ అభిషేక్ యాదవ్ ఎక్స్ ద్వారా వెల్లడించిన సమాచారం ప్రకారం.. ఈ ఫోన్ భారత మార్కెట్లో త్వరలోనే విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని.. భారత్‌లో బేస్ మోడల్ 6 GB రామ్ (RAM)తో పాటు 128 GB స్టోరేజ్ వేరియంట్‌తో అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలిపారు.. ఇక కలర్ ఆప్షన్స్ విషయానికొస్తే.. ఇది బ్లూ (Blue)తో పాటు డార్క్ నైట్ (Dark Night) అనే రెండు ఆకర్షణీయమైన కలర్స్‌లో విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోందని వెల్లడించారు. 

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report

విశాఖ బోటు మత్య్సకారులను ఆదుకోవడంలో సీఎం చంద్రబాబు ఫ్లాప్‌: వైఎస్‌ జగన్‌

Visakhapatnam, Andhra Pradesh:

Visakhapatnam: విశాఖపట్టణం బోటు ప్రమాదంలో మృతిచెందిన ఏడుగురి కుటుంబాలకు రూ.కోటి ఆర్థిక సహాయం అందించాలని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ డిమాండ్‌ చేశారు. కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే మత్య్సకారుల కుటుంబాలను ఆదుకోవాలని చంద్రబాబుకు కోరారు. విశాఖ బోటు గల్లంతుపై ప్రభుత్వం కఠినంగా చర్యలు తీసుకోవాలని.. అప్పుడే ఇలాంటి ఘటనలు జరగకుండా ఉంటాయని తెలిపారు. 

జూలై 4వ తేదీన జరిగిన బోటు బోల్తా ప్రమాదంలో గల్లంతైన బాధిత కుటుంబాలను విశాఖపట్టణంలో వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి పరామర్శించారు. కుటుంబాలకు ధైర్యం కల్పించిన అనంతరం మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 'ప్రభుత్వం స్పందన లేకుంటే మన ప్రభుత్వం వచ్చిన నెలలోపు రూ.కోటి ఆర్థిక సహాయం కల్పిస్తాం. జూలై 5వ తేదీ తెల్లవారుజామున 5 గంటలకు  కనీసం నావికాదళం రక్షణ కల్పించలేదు' అని ఆరోపించారు. '114 మంది బాధితులకు  మత్స్యకారులు మద్దతు ఇవ్వలేదు. ఇప్పటికీ ప్రభుత్వం నుంచి కనీస మద్దతు ప్రకటన చేయకపోవడం, ఆర్థిక సహాయం చేయడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలం' అని మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ విమర్శించారు. కర్రి చిన్న మత్స్యకారుడు 16 గంటల పాటు సముద్రంలో యుద్ధం చేసి  ప్రాణాలు కాపాడుకున్నాడని.. ప్రభుత్వం జరిగిన ఘటనను శ్రద్ధగా పని చేసి ఉంటే వారి ఆచూకీ తెలిసేది అని పేర్కొన్నారు.

'జూలై 4వ తేదీ 2.30 నిమిషాలకు సమాచారం అందించిన కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. ఘటన ముందు ఇంటికి వస్తామని సమాచారం చిన్న మేనల్లుడుకు చెప్పాడు. తీవ్రమైన అలలు మధ్యలో బోటు బోల్తా పడింది. బోటు మునిగిపోతున్నది. అదే సమయంలో బోటు కింద ఒక వ్యక్తి అప్పటికే మరణించిన సమాచారం తెలిసింది. సముద్రంలో అలా ఉంటే ఇక్కడ వారి కుటుంబసభ్యులు ఆవేదనతో స్థానిక అధికారులకు సమాచారం ఇచ్చారు' అని మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ వివరించారు.

'విశాఖపట్టణం జిల్లాలో అధికారులు, ప్రభుత్వ నాయకులు పట్టించుకోలేదు. తప్పు జరిగింది అని ప్రభుత్వం అంగీకరించే ఎక్కడ అవహేళన వస్తుంది అని 3 మ్యాన్ కమిటీ వేశారు. వారు రిపోర్టర్‌లో అసత్యంగా రిపోర్టర్ ఇచ్చారు. సమాచారం ఆలస్యంగా వచ్చింది అని 3 మ్యాన్ కమిటీలో తప్పుడు నివేదిక ఇచ్చారు' అని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ వెల్లడించారు. 'ప్రభుత్వంలో పెద్దలు కానీ నాయకులు వారి ఇంటికి వచ్చి పట్టించుకోలేదు. హోంమంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి  మత్స్యకారుల ఇంటికి వచ్చి పరామర్శ చేయలేదు' అని గుర్తుచేశారు. వీడియో కాల్‌లో పరామర్శలు చేయడం విడ్డూరంగా ఉందని.. బాధిత కుటుంబానికి కూటమి ప్రభుత్వం భరోసా కల్పించలేదని తెలిపారు. రాత్రికి రాత్రి ప్రభుత్వం స్పందన ఉంటే కనీసం ఐదుగురు బతికేవారు అని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ వివరించారు.

బాధిత కుటుంబాలకు రూ.10 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకున్నారని చంద్రబాబు ప్రభుత్వంపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. 'తప్పు జరిగింది కాబట్టే త్రీమెన్‌ కమిటీ వేశారు. త్రీమెన్‌ కమిటీ నివేదిక అంతా తప్పులతడక. ప్రభుత్వానికి మానవత్వం ఉందా?' అని ప్రశ్నించారు. 'ఘటన జరిగిన వెంటనే ఒక్క అధికారి కూడా రాలేదు. ఉత్తరాంధ్ర మంత్రులు ఒక్కరు కూడా రాలేదు. బాధితులను ఫిషరీస్‌ మంత్రి కూడా పరామర్శించలేదు. బాధితుల వద్దకు మంత్రులను పంపాలని చంద్రబాబుకు తెలియదా?' అని నిలదీశారు. 'చంద్రబాబు పట్టించుకోలేదు.. హోం మంత్రి పరామర్శించలేదు. రాత్రికి రాత్రే స్పందిస్తే మత్స్యకారులు బతికేవారు. నష్ట పరిహారం కింద అరకొర సాయం చేశారు. బాధితులకు రూ.కోటి చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి. ఈ ప్రభుత్వం ఇవ్వకపోయినా.. మన ప్రభుత్వం వచ్చాక నెలలోపే ఆదుకుంటాం' అని మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ తెలిపారు.

0
0
Report
Advertisement

FIFA World Cup 2026: ఫ్రాన్స్ vs స్పెయిన్ సెమీఫైనల్.. ఫైనల్ బెర్త్ కోసం 'యూరోపియన్' యుద్ధం!

Arlington, Texas:

FIFA World Cup 2026 Semifinal: ఫిఫా ప్రపంచ కప్ 2026 క్లైమాక్స్ దశకు చేరుకుంది. డల్లాస్‌లోని ప్రతిష్టాత్మక ఏటీ & టీ (AT&T) స్టేడియం మంగళవారం రాత్రి ఒక అద్భుతమైన సమరానికి వేదిక కాబోతోంది. మొదటి సెమీఫైనల్‌లో రెండు విభిన్న శైలులు కలిగిన యూరోపియన్ దిగ్గజాలు, రెండుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ఫ్రాన్స్, 2010 విజేత స్పెయిన్ ఫైనల్ బెర్త్ కోసం తలపడనున్నాయి.

కైలియన్ ఎంబాపే సారథ్యంలోని ఫ్రాన్స్ వరుసగా మూడోసారి ప్రపంచ కప్ ఫైనల్లో అడుగుపెట్టాలని లక్ష్యంగా పెట్టుకోగా.. లూయిస్ డి లా ఫ్యూంటె నేతృత్వంలోని స్పానిష్ జట్టు 16 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత మళ్లీ ఫైనల్ చేరాలని పట్టుదలతో ఉంది.

డిఫెన్సివ్ కింగ్ స్పెయిన్..
ఈ మ్యాచ్ రెండు భిన్నమైన వ్యూహాల మధ్య జరగబోయే ఆసక్తికర యుద్ధం సాగనుంది. 2010 తర్వాత మొదటిసారి సెమీస్ చేరిన స్పెయిన్ ఈ టోర్నమెంట్‌లో అసాధారణ రక్షణ తీరును కనబరిచింది. క్వార్టర్ ఫైనల్లో బెల్జియం మాత్రమే వారిపై ఒక గోల్ చేయగలిగింది. ఈ ప్రపంచ కప్‌లో ఆరు మ్యాచ్‌ల తర్వాత స్పెయిన్ కేవలం 7 షాట్స్ ఆన్ టార్గెట్‌ను మాత్రమే ఎదుర్కొంది. 1966 తర్వాత ఒక ప్రపంచ కప్‌లో ఒక జట్టు ఒక మ్యాచ్‌కు ఎదుర్కొన్న అత్యల్ప షాట్స్ ఆన్ టార్గెట్ సగటు (1.17) ఇదే కావడం విశేషం.

కౌంటర్ ఎటాక్స్‌తో ఫ్రాన్స్ విధ్వంసం.. 
ఫ్రాన్స్ కోచ్ డిడియర్ డెషామ్స్ ఈ మ్యాచ్ ప్రాధాన్యతను వివరిస్తూ.. "స్పెయిన్ బంతిపై అద్భుతమైన పట్టు సాధించి ఒత్తిడి తెస్తుంది. కానీ, మాకూ బంతిని నియంత్రించే సత్తా ఉంది. వారిని అడ్డుకుంటూనే కౌంటర్ ఎటాక్స్‌లో వేగంగా విరుచుకుపడే నైపుణ్యం మా ఆటగాళ్లకు ఉంది" అని ధీమా వ్యక్తం చేశారు.

ఎంబాపే జోరు.. చౌమేని అందుబాటుపై ఉత్కంఠ
క్వార్టర్ ఫైనల్స్‌లో మొరాకోపై తన 8వ గోల్ సాధించిన కైలియన్ ఎంబాపే ప్రస్తుతం 'గోల్డెన్ బాల్' రేసులో దూసుకుపోతున్నాడు. అలాగే హ్యామ్‌స్ట్రింగ్ గాయంతో బాధపడుతున్న కీలక మిడ్‌ఫీల్డర్ చౌమేని ఈ మ్యాచ్‌కు అందుబాటులో ఉండటంపై సందిగ్ధత నెలకొంది. అయితే, అతను 100 శాతం కోలుకోకపోయినా జట్టుకు అందుబాటులో ఉంటాడని కోచ్ డెషామ్స్ స్పష్టం చేశారు.

రికార్డులపై కన్నేసిన ఫ్రాన్స్
వరుసగా ఆరు విజయాలతో సెమీస్ చేరిన ఫ్రాన్స్ (లె బ్లూస్), ఈ మ్యాచ్ గెలిస్తే 1934-38లో ఇటలీ తర్వాత ప్రపంచ కప్‌లో వరుసగా ఏడు విజయాలు సాధించిన రెండో యూరోపియన్ జట్టుగా చరిత్ర సృష్టిస్తుంది. మరోవైపు ప్రపంచ కప్‌లో ఈ రెండు జట్లు తలపడటం ఇది రెండోసారి మాత్రమే. గతంలో 2006 రౌండ్ ఆఫ్ 16లో తలపడినప్పుడు ఫ్రాన్స్ 3-1తో విజయం సాధించింది.

అయితే, అన్ని రకాల పోటీలలో గత 10 మ్యాచ్‌లను పరిశీలిస్తే స్పెయిన్‌దే పైచేయిగా ఉంది. ఈ 10 మ్యాచ్‌లలో స్పెయిన్ 7 విజయాలు సాధించగా, ఫ్రాన్స్ కేవలం రెండు సార్లు మాత్రమే గెలిచింది (ఒక మ్యాచ్ డ్రా అయింది). గత రెండు మ్యాచ్‌లలోనూ స్పెయిన్ దే విజయం సాధించడం గమనార్హం. ఫ్రెంచ్ మెరుపు దాడులను స్పెయిన్ డిఫెన్స్ అడ్డుకుంటుందా? లేక ఎంబాపే సేన స్పానిష్ కోటను బద్దలు కొట్టి వరుసగా మూడోసారి ఫైనల్లో అడుగుపెడుతుందా? అనేది మరికొద్ది గంటల్లో తేలనుంది.

Also Read: FIFA World Cup 2026: ఫిఫా ప్రపంచకప్‌ సెమీఫైనల్స్‌కు రంగం సిద్ధం..ఏ టీమ్‌కి ట్రోఫీ గెలిచే సత్తా ఉంది?

Also Read: ఫిఫా ప్రపంచకప్‌ సెమీఫైనల్స్‌లో హోరాహోరీ టీమ్స్..ట్రోఫీ గెలిచే సత్తా ఎవరికి ఉందంటే?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Jr NTR Political Entry: బిగ్ బ్రేకింగ్.. రాజకీయాల్లోకి ఎన్టీఆర్..తారక్ కార్యాలయం నుంచి కీలక ప్రకటన!

Hyderabad, Telangana:

Jr NTR Political Entry News: గత కొన్ని రోజులుగా జూనియర్ ఎన్టీఆర్ (NTR) రాజకీయ అరంగేట్రం, సేవా కార్యక్రమాల చుట్టూ తిరుగుతున్న వివాదాలపై ఎన్టీఆర్ అధికారిక కార్యాలయం అత్యంత కీలకమైన వివరణ ఇచ్చింది. సోషల్ మీడియాలో, అభిమాన సంఘాల పేరుతో జరుగుతున్న ప్రచారాలకు అడ్డుకట్ట వేస్తూ ఎన్టీఆర్ ఆఫీస్ ఒక అధికారిక ప్రకటనను విడుదల చేసింది.

'RAW NTR'తో మాకు ఎలాంటి సంబంధం లేదు!
ఈ ప్రకటనలో ఎన్టీఆర్ కార్యాలయం ప్రధానంగా 'RAW NTR' అనే సంస్థపై కీలక స్పష్టతనిచ్చింది. ఎన్టీఆర్ పేరును ఉపయోగించి ఎలాంటి ప్రకటనలు చేయడానికి గానీ, కార్యక్రమాలు నిర్వహించడానికి గానీ 'RAW NTR' సంస్థకు ఎటువంటి హక్కులు లేదా అధికారాలు లేవు.

తాజాగా ఎన్టీఆర్ రాజకీయాల ఎంట్రీపై వస్తున్న వార్తలపై 'RAW NTR' అనే సంస్థ స్పందించింది. జూలై 18న నిర్వహించబోతున్న కార్యక్రమం 'ఊరు-వాడ' అనే సేవా కార్యక్రమం మాత్రమే అని తెలిపింది. దానికి రాజకీయాలకు ఎలాంటి సంబంధంలేదని స్పష్టం చేసింది. అయితే ఈ సంస్థతో ఎన్టీఆర్‌కు లేదా ఆయన కార్యాలయానికి ఎలాంటి అనుబంధం లేదని ఎన్టీఆర్ కార్యాలయం నుంచి మరో ప్రకటన వచ్చింది. సదరు RAW NTR అనే సంస్థకు కథానాయకుడు ఎన్టీఆర్‌కు ఎలాంటి సంబంధం లేదని వెల్లడించింది. ఈ అంశంపై తమ వైపు నుంచి ఇదే చివరి మరియు తుది వివరణ అని ఎన్టీఆర్ కార్యాలయం తేల్చి చెప్పింది.

జులై 18 రాజకీయ ప్రకటన ప్రచారానికి తెర!
ఈ నెల 18న ఎన్టీఆర్ రాజకీయ రంగప్రవేశం చేయబోతున్నారంటూ పెద్ద ఎత్తున ఊహాగానాలు, ప్రచారాలు సాగుతున్న నేపథ్యంలో ఈ తాజా ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఎన్టీఆర్‌కు సంబంధించిన సేవా, ప్రజా సంక్షేమ కార్యక్రమాల వివరాలు కేవలం ఆయన ద్వారా లేదా ఆయనకు సంబంధించిన అధికారిక బృందం ద్వారా మాత్రమే అధికారికంగా వెల్లడవుతాయని ఆఫీస్ వర్గాలు స్పష్టం చేశాయి.

అభిమానులకు, మీడియాకు విజ్ఞప్తి..
"ఎలాంటి ధృవీకరణ లేని సమాచారాన్ని సోషల్ మీడియాలో లేదా ఇతర వేదికలపై ప్రచారం చేయవద్దు. కేవలం ఎన్టీఆర్ అధికారిక వర్గాల ద్వారా వచ్చే సమాచారాన్ని మాత్రమే నమ్మాలి" అని జూనియర్ ఎన్టీఆర్ కార్యాలయం నుంచి విడుదలైన ప్రకటనలో ఈ విధంగా వివరించారు.

Also REad: ఎన్టీఆర్ రాజకీయ రంగప్రవేశం? జూలై 18న మీటింగ్ అందుకే అంటున్న తారక్ ఫ్యాన్స్!

Also Read: శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ల మధ్య గొడవ..రంగంలోకి మెగాస్టార్ చిరంజీవి..చివరికి!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Samsung, వన్‌ప్లస్‌లకు చుక్కలే.. 10,000mAh భారీ బ్యాటరీతో Redmi Turbo 6 సిరీస్!

Hyderabad, Telangana:

Redmi Turbo 6 Series Leaked: స్మార్ట్‌ఫోన్ ప్రియులకు Xiaomi సబ్‌బ్రాండ్  రెడ్‌మి (Redmi) త్వరలోనే మార్కెట్‌లోకి అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసేందుకు సిద్ధమైంది.. మార్కెట్లోకి పవర్‌హౌస్‌గా నిలిచేందుకు రెడ్‌మి టర్బో 6 (Redmi Turbo 6) సిరీస్‌ను రంగంలోకి దించేందుకు కంపెనీ సిద్ధమైన్నట్లు తెలుస్తోంది.. ఈ సిరీస్‌లో భాగంగా రెండు అద్భుతమైన మోడల్స్ విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో రెడ్‌మి టర్బో 6 (Redmi Turbo 6)తో పాటు రెడ్‌మి టర్బో 6 మాక్స్ (Redmi Turbo 6 Max) మోడల్స్‌ మార్కెట్లోకి రాబోతున్నట్లు ప్రముఖ టిప్‌స్టర్ స్మార్ట్ పికాచు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ వెయిబో (Weibo)లో లీక్ చేశారు. అయితే, దీనికి సంబంధించిన ఫీచర్స్, ధర వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఈ స్మార్ట్‌ఫోన్ సిరీస్‌లో అత్యంత ఆకర్షణీయమైన ఫీచర్స్‌తో పాటు భారీ బ్యాటరీని కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. లీక్ అయిన వివరాల ప్రకారం.. ఈ ఫోన్లలో ఏకంగా 10,000mAh సామర్థ్యం గల అత్యంత శక్తివంతమైన బ్యాటరీని కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా పవర్‌బ్యాంక్‌లలో మాత్రమే కనిపించే ఈ స్థాయి బ్యాటరీ సామర్థ్యం.. స్మార్ట్‌ఫోన్‌లో అందుబాటులోకి రావడం టెక్ రంగంలో పెద్ద సంచలనంగా మారబోతోందని సమాచారం. దీనివల్ల ఒక్కసారి ఛార్జ్ చేస్తే రోజులకు రోజులు బ్యాటరీ బ్యాకప్ లభిస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రీమియం డిస్‌ప్లే..
స్క్రీన్ విషయానికి వస్తే.. రెడ్‌మి టర్బో 6 సిరీస్‌లో పెద్ద సైజ్ 7 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సిరీస్‌లోని ప్రీమియం మోడల్ అయిన రెడ్‌మి టర్బో 6 మాక్స్ వేరియంట్‌లో అత్యంత స్పష్టమైన విజువల్స్ అందించేలా 2K డిస్‌ప్లేను కూడా అందబా. దీనికి తోడు ప్రీమియం లుక్ అండ్ డ్యూరబిలిటీ కోసం మెటల్ ఫ్రేమ్‌ను కూడా వినియోగించిన్నట్లు తెలుస్తోంది.. సెక్యూరిటీ కోసం ఈ మాక్స్ మోడల్‌లో ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను కూడా అందుబాటులో తీసుకు రాబోతోంది.

పవర్‌ఫుల్ ప్రాసెసర్లు..
ఈ సిరీస్‌లోని రెండు ఫోన్లలో వేర్వేరు పవర్‌ఫుల్ మీడియాటెక్ ప్రాసెసర్లను కంపెనీ అందుబాటులోకి తీసుకు వచ్చింది.. రెడ్‌మి టర్బో 6 స్మార్ట్‌ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 8600 (MediaTek Dimensity 8600) చిప్‌సెట్‌ను వినియోగించిన్నట్లు తెలుస్తోంది. ఈ రెడ్‌మి టర్బో 6 మాక్స్ స్మార్ట్‌ఫోన్‌ ఈ టాప్-ఎండ్ మోడల్‌లో మరింత శక్తివంతమైన మీడియాటెక్ డైమెన్సిటీ 9600s (MediaTek Dimensity 9600s) ప్రాసెసర్‌ను అందించిన్నట్లు సమాచారం. దీనివల్ల గేమింగ్‌తో పాటు మల్టీటాస్కింగ్ అత్యంత వేగంగా, ఎలాంటి లాగ్స్ లేకుండా సాగుతుందని సమాచారం.

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

గత మోడల్ ట్రాక్ రికార్డ్..
ఇటీవలే మార్కెట్లో విడుదలైన రెడ్‌మి టర్బో 5 ఫీచర్లను గమనిస్తే.. ఈ స్మార్ట్‌ఫోన్‌ 6.59 అంగుళాల 1.5K ఫ్లూయిడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇందులో 120Hz రీఫ్రెష్ రేట్‌తో పాటు 3500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, మీడియాటెక్ డైమెన్సిటీ 8500 అల్ట్రా ప్రాసెసర్‌ను కూడా కలిగి ఉంటుంది. అలాగే 50MP (OIS) సపోర్ట్‌తో 8MP డ్యూయల్ రీర్ కెమెరాతో అందుబాటులో ఉంది.. ఇందులో ఎంతో శక్తివంతమైన 7,540mAh బ్యాటరీతో పాటు 100W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా అందిస్తోంది. ఇప్పుడు రాబోయే టర్బో 6 అంతకంటే రెట్టింపు పవర్‌తో 10,000mAh బ్యాటరీతో వస్తుండటంతో మార్కెట్లో భారీ అంచనాలు నెలకొన్నట్లు తెలుస్తోంది.

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report
Advertisement
Advertisement
Back to top