Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Mancherial504251

సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వైద్యశిబిరాలు ఏర్పాటు

Sept 06, 2024 09:43:35
Bellampalle, Kannal Rural, Telangana
మంచిర్యాల జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలలో భాగంగా బెల్లంపల్లి పట్టణంలోని అన్ని వార్డ్ లలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని డిప్యూటీ డీఎంహెచ్ఓ సుధాకర్ నాయక్ అన్నారు. బెల్లంపల్లిలో అయన మాట్లాడుతూ వాతావరణంలో మార్పుల వల్ల సీజనల్ వ్యాధులు సోకకుండా వైద్య శిబిరంలో ప్రజలకు అవసరమైన పరీక్షలు చేసి అక్కడిక్కడే మందులు అందజేస్తున్నామని, అవసరమైతే పీహెచ్సీకి రిఫర్ చేస్తున్నామన్నారు. ప్రజలు వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని అయన కోరారు.
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
DDDharmaraju Dhurishetty
Mar 08, 2026 09:04:39
Hyderabad, Telangana:

Telangana Latest News: అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళ శక్తికి అండగా నిలిచే ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకుంది. గ్రామాల్లోని మహిళా సంఘాల కార్యకలాపాలకు ఇకపై సొంత చిరునామా లభించబోతుందని ప్రభుత్వం వెల్లడించింది. రాష్ట్రంలోని ప్రతి గ్రామపంచాయతీలో మహిళ సమాఖ్యలకు సొంత భవనాలను నిర్మించాలని ప్రభుత్వం ప్రత్యేకమైన ఉత్తర్వులను అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేళ జారీ చేయడం విశేషం.. అంతేకాకుండా అతి త్వరలోనే దీనికి కావాల్సిన ఆర్థిక సహాయం కూడా అందిస్తామని ప్రభుత్వం ఇప్పటికే తెలిపింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

మహిళా సంఘాలకు భవన నిర్మాణ ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని యంత్రాంగాన్ని ప్రభుత్వం ఆదేశించింది. ఇందుకు సంబంధించిన అధికారులు తక్షణమే చర్యలు మొదలుపెట్టాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.. ప్రతి గ్రామంలోనూ మహిళ భవనం కోసం 200 గజాల స్థలాన్ని గుర్తించాలని జిల్లా కలెక్టర్లకు సూచించింది. అంతేకాకుండా మార్చి చివరి వారం వరకు అన్ని ప్రాంతాల్లోని ఈ భవనాలకు శంకుస్థాపనలు పూర్తి కావాలని చివరి డెడ్ లైన్ కూడా విధించింది.

భవన నిర్మాణానికి ఉపాధి హామీ పథకం కింద వచ్చే ప్రత్యేకమైన నిధులను అందించబోతున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఒక్కొక్క భవనానికి రూ.20 లక్షల వరకు నిధులు కేటాయిస్తూ ప్రభుత్వం ఈ కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఆధునిక సౌకర్యాలతో కూడిన ఈ భవనాలు మహిళల అభివృద్ధికి వేదికలుగా మారతాయని ప్రభుత్వం తెలిపింది. కేవలం సమావేశానికే పరిమితం కాకుండా ఈ భవనాలను బహుళ ప్రయోజన కేంద్రాలుగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. గ్రామ సంఘాల సభ్యులు నెలవారి సమీక్షలు నిర్వహించుకోవడానికి అనుకూలమైన ప్రత్యేకమైన హాలును కూడా నిర్మించాలని తెలిపింది.

Also Read: CM Revanth reddy: మహిళ దినోత్సవం వేళ రేవంత్ బంపర్ శుభవార్త.. కాలేజీ విద్యార్థినులకు ఫ్రీగా ఈవీ స్కూటీలు.. ఎప్పటి నుంచంటే..?

అలాగే మహిళలకు కుట్టు మిషన్లతో పాటు అగరబత్తుల తయారీ, చేతి వృత్తుల వంటి అంశాల్లో శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేకమైన గదులను కూడా నిర్వహించాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించడం విశేషం. డ్వాక్రా సంఘాల రికార్డుల నిర్వహణతో పాటు బ్యాంకు లావాదేవీల చర్చలకు వేదికగా ఉండాలని తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా డ్వాక్రా సంఘాల్లో దాదాపు 63 లక్షల మంది సభ్యులు ఉన్నారు. ఇప్పటివరకు వీరి సమావేశాలు నిర్వహించుకోవడానికి పాఠశాల గదులలో లేదా చెట్ల నీడలను ఆశ్రయించాల్సి వచ్చేది. సొంత భవనాల నిర్మాణంతో మహిళల ఆత్మగౌరవం పెరగడమే కాకుండా.. వారి ఆర్థిక కార్యకలాపాలు మరింత వేగవంతం అవుతాయని ప్రభుత్వ ఉద్దేశం. మహిళా సాధికారత దిశగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పై రాష్ట్రవ్యాప్తంగా మహిళా సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.

Also Read: CM Revanth reddy: మహిళ దినోత్సవం వేళ రేవంత్ బంపర్ శుభవార్త.. కాలేజీ విద్యార్థినులకు ఫ్రీగా ఈవీ స్కూటీలు.. ఎప్పటి నుంచంటే..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..Twitter, Facebook

0
comment0
Report
HDHarish Darla
Mar 08, 2026 09:03:54
Hyderabad, Telangana:

Yoga Benefits Women's Health: అంతర్జాతీయ మహిళా దినోత్సవం 2026 సందర్భంగా కేవలం వేడుకలకే పరిమితం కాకుండా, మహిళల ఆరోగ్యం కోసం కొన్ని సలహాలు సూచనలు తెలుసుకుందాం. నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఇంటి బాధ్యతలు, ఉద్యోగ ఒత్తిళ్లతో మహిళలు తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. శారీరక దృఢత్వంతో పాటు మానసిక ప్రశాంతతను అందించే యోగాను ఈరోజు నుంచే ప్రారంభిద్దాం.

మహిళల్లో హార్మోన్ల సమతుల్యతను కాపాడటంలోనూ, ఒత్తిడిని తగ్గించడంలోనూ యోగా అద్భుతంగా పనిచేస్తుంది. మహిళల కోసం ప్రత్యేకంగా సూచించబడిన కొన్ని ముఖ్యమైన ఆసనాలు, వాటి ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

బద్ధకోనాసనం (సీతాకోకచిలుక భంగిమ)
ఇది తుంటి కండరాలను సడలిస్తుంది. ముఖ్యంగా రుతుక్రమ సమస్యలు, పునరుత్పత్తి అవయవాల ఆరోగ్యానికి ఇది ఎంతో మేలు చేస్తుంది.

మార్జరాసనం (పిల్లి-ఆవు భంగిమ)
వెన్నెముక వశ్యతను పెంచుతుంది. వెన్నునొప్పి నుండి ఉపశమనం కలిగించడమే కాకుండా, మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది.

వృక్షాసనం (చెట్టు భంగిమ)
శరీర సమతుల్యతను మెరుగుపరుస్తుంది. ఇది ఏకాగ్రతను పెంచి, మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది.

అధోముఖ శ్వానాసనం 
ఇది మొత్తం శరీరానికి శక్తినిస్తుంది. శరీరంలో రక్త ప్రసరణను పెంచి, రోజంతా ఉండే అలసటను తగ్గిస్తుంది.

బాలాసనం (పిల్లల భంగిమ)
శారీరక, మానసిక విశ్రాంతికి ఇది ఉత్తమమైన ఆసనం. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మెడ, వీపు భాగాల్లో ఉండే ఒత్తిడిని తగ్గిస్తుంది.

విపరీత కరణి (కాళ్లు గోడకు వేసే భంగిమ)
ప్రయోజనం: మోకాళ్ల నొప్పులు, కాళ్ల వాపులను తగ్గించడంలో సహాయపడుతుంది. నిద్రలేమి సమస్యతో బాధపడేవారు రాత్రి పడుకునే ముందు ఈ ఆసనం వేస్తే మంచి నిద్ర పడుతుంది.

సూర్య నమస్కారాలు
ఇందులో ఉండే 12 దశలు మొత్తం శరీరానికి సంపూర్ణ వ్యాయామాన్ని అందిస్తాయి. హార్మోన్ల సమతుల్యతకు, బరువు తగ్గడానికి ఇది రామబాణంలా పనిచేస్తుంది.

ఆరోగ్యకరమైన అలవాట్లు ఒక్కరోజుతో వచ్చేవి కావు. ఈ మహిళా దినోత్సవం నుంచి ప్రతిరోజూ కనీసం 15-20 నిమిషాల పాటు యోగాను మీ జీవనశైలిలో భాగం చేసుకోండి. సంపూర్ణ ఆరోగ్యంతో కూడిన 'స్వర్ణాంధ్ర'ను నిర్మించడంలో మహిళల పాత్ర కీలకం.

Also Read: EV Or Hybrid: హైబ్రిడ్ vs ఎలక్ట్రిక్ కార్లు..ఏది మంచిది? కొత్త కారు కొనే ముందు ఇవి తప్పక తెలుసుకోండి!

Also Read: Santner On Indian Fans: టీమ్ఇండియా అభిమానులకు న్యూజిలాండ్ కెప్టెన్ వార్నింగ్! "భారత్ ఫ్యాన్స్‌ను సైలెంట్ చేస్తాం!"

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Mar 08, 2026 08:53:41
Hyderabad, Telangana:

Nepals New PM Bengaluru Student: హిమాలయాల దేశంగా చెప్పుకునే నేపాల్ రాజకీయాల్లో సరికొత్త పాలన ప్రారంభమైంది ఆ దేశ Gen Z యువత ఆశా కిరణం, రాష్ట్రీయ స్వాతంత్ర పార్టీ కీలక నేత బాలెన్ షా నేపాల్ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు ఇప్పటికే సిద్ధమైంది. తాజాగా జరిగిన స్వాతంత్ర ఎన్నికల్లో ఆయన నేతృత్వంలోని ఆర్ఎస్పీ పార్టీ సృష్టించిన ప్రభంజనానికి పాతతరం రాజకీయ పార్టీలన్నీ కొట్టుకుపోయాయి.. అయితే  బాలెన్ షకు బెంగళూరుకు మంచి సంబంధం ఉంది. అదేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

నేపాల్ పార్లమెంటులోని మొత్తం 165 స్థానాలకు.. బాలెన్ షా కు సంబంధించిన ఆర్ఎస్పీ పార్టీ ఏకంగా 104 స్థానాలు ఊహించని విజయం సాధించింది.. నేపాల్ బ్యాలెట్ పేపర్ విధానం అమల్లో ఉండడంతో ఓట్ల లెక్కింపు నెమ్మదిగా సాగినప్పటికీ.. బాలెన్ షా ప్రధాని పీఠం అధిష్టించడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. అవినీతి నిర్మూలనతో పాటు డిజిటల్ గవర్నెన్స్ నినాదాలతో ఆయన యువతను విపరీతంగా ఆకర్షించిన సంగతి తెలిసిందే.

బాలెన్ షా  విజయంతో మన దేశంలోని కర్ణాటక రాష్ట్రంలో ఆయనకు సంబంధించిన ఎన్నో వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా ఆయన ఉన్నత విద్య అంతా భారతదేశం లోనే సాగడం విశేషం.. బెంగుళూరు లోని ప్రసిద్ధ విశ్వేశ్వరయ్య టెక్నలాజికల్ యూనివర్సిటీ (VTU) లో ఆయన ఉన్నత విద్యను అభ్యసించారట.. అంతేకాకుండా 2016 నుంచి 18 మధ్యకాలంలో స్ట్రక్చరల్ ఇంజినీరింగ్‌లో ఎంటెక్ (M.Tech)  పూర్తి చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా నాడు బెంగుళూరు వీధుల్లో సామాన్య విద్యార్థిగా తిరిగిన బాలెన్.. ఇప్పుడు ఒక దేశానికి ప్రధాని కాబోతుండడం పట్ల ఆయన సహచర విద్యార్థులతో పాటు ప్రొఫెసర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఒక ఇంజనీర్ గా పక్కా ప్రణాళికలతో ఆయన చేపట్టిన ఎన్నికల వ్యూహాలు ఇతర రాజకీయ పార్టీలను చిత్తు చేశాయి..

నేపాల్ వ్యవస్థ గత మార్పు కోరుకుంటూ వచ్చిన Gen Z ఉద్యమానికి బాలెన్ షా క్రియాశీలక పాత్ర పోషించి వెన్నుముకగా నిలిచారు. అలాగే ర్యాపర్ గా, సామాజిక కార్యకర్తగా, ఖట్మండు మేయర్‌గా ఆయన చేసిన పనులు ప్రజల్లో అద్భుతమైన నమ్మకాన్ని నింపాయి. సాంప్రదాయ రాజకీయాలకు స్వస్తి పలికి.. టెక్నాలజీ తో కూడిన అద్భుతమైన పాలనను అందిస్తానని ఆయన ఇచ్చిన హామీయే ఈ భారీ విజయానికి కారణమని తెలుస్తోంది. అంతేకాకుండా ఆయన భారీ విజయం చూసి అక్కడున్న రాజకీయ విశ్లేషకులు సైతం ఆశ్చర్యానికి గురయ్యారట.

Also Read: Old Woman Video: పాపం.. 70 ఏళ్ల వృద్ధురాలు తిప్పలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..Twitter, Facebook

0
comment0
Report
BBhoomi
Mar 08, 2026 07:47:45
Secunderabad, Telangana:

Crude Oil Crisis: పశ్చిమాసియాలో పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ప్రపంచ ఇంధన మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలతో మధ్యప్రాచ్య ప్రాంతంలో భద్రతా పరిస్థితులు మరింత సంక్లిష్టంగా మారాయి. ఈ పరిణామాలు అంతర్జాతీయ చమురు సరఫరా వ్యవస్థను కుదిపేస్తున్నాయి. ముఖ్యంగా ప్రపంచ చమురు రవాణాలో కీలక పాత్ర పోషించే హోర్ముజ్ జలసంధి లో నౌకా రవాణాకు పెరుగుతున్న ముప్పు ఇంధన మార్కెట్‌కు పెద్ద సవాలుగా మారింది.

ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు 20 శాతం ఈ జలసంధి ద్వారానే రవాణా అవుతుంది. కానీ ఇటీవలి కాలంలో ఇరాన్ నుంచి వచ్చిన హెచ్చరికలు, దాడుల భయం కారణంగా చమురు ట్యాంకర్ల కదలికలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. దీంతో గల్ఫ్ ప్రాంతంలోని చమురు ఉత్పత్తి దేశాలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో కువైట్ తాజాగా ముడి చమురు ఉత్పత్తిని తగ్గించాలని నిర్ణయం తీసుకున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ప్రాంతంలో పెరుగుతున్న భద్రతా ప్రమాదాల నేపథ్యంలో సరఫరా గొలుసును రక్షించేందుకు ఈ చర్య తీసుకున్నట్లు అక్కడి అధికారులు పేర్కొంటున్నారు. అయితే ఉత్పత్తి ఎంత మేరకు తగ్గించనున్నారన్న విషయాన్ని మాత్రం అధికారికంగా వెల్లడించలేదు.

ఇక ముందుగా ఖతర్ కూడా తన ద్రవీకృత సహజ వాయువు (LNG) ఎగుమతుల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకోవడం గ్లోబల్ మార్కెట్‌లో ఆందోళనలను పెంచింది. ఒకవేళ ప్రాంతంలో ఉద్రిక్తతలు కొనసాగితే ఇతర చమురు ఉత్పత్తి దేశాలు కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశముందని నిపుణులు భావిస్తున్నారు. ఇప్పటికే ఇరాక్ గతంలో ఉత్పత్తి తగ్గించిన అనుభవం ఉంది. ఇదే పరిస్థితి కొనసాగితే యునైటెడ్ స్టేట్స్ అరబ్, సౌదీ అరేబియా వంటి దేశాలు కూడా ఉత్పత్తి పరిమితి విధించే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.

Also Read: America-Israel-Iran war: యుద్ధ భయంతో విమాన టికెట్లకు రెక్కలు.. రూ. 16 వేలు నుంచి రూ. 1 లక్షకు జంప్..!!  

ఈ సంక్షోభం అత్యధికంగా ప్రభావం చూపే దేశాల్లో పాకిస్తాన్ ఒకటిగా భావిస్తున్నారు. ఆ దేశం తన ఇంధన అవసరాల్లో పెద్ద భాగాన్ని దిగుమతులపై ఆధారపడుతోంది. ఖతార్ నుంచి ఎల్ఎన్జీ సరఫరాలపై ఇప్పటికే అనిశ్చితి నెలకొనగా, కువైట్ కూడా ఉత్పత్తి తగ్గిస్తే పాకిస్తాన్ మరింత ఖరీదైన చమురును కొనుగోలు చేయాల్సిన పరిస్థితి రావచ్చు. దీంతో అక్కడ ఇంధన సంక్షోభం మరింత తీవ్రతరం కావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు పెరుగుతున్నాయి. ప్రపంచ ప్రమాణంగా భావించే బ్రెంట్ క్రూడ్ ధర యుద్ధ పరిస్థితులు ప్రారంభమైనప్పటి నుంచి బ్యారెల్‌కు 92 డాలర్లను దాటింది. మొత్తం మీద ధరలు సుమారు 30 నుంచి 35 శాతం వరకు పెరిగినట్లు మార్కెట్ గణాంకాలు సూచిస్తున్నాయి. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇక ఇండియా విషయానికి వస్తే ప్రస్తుతం పరిస్థితి నియంత్రణలో ఉందని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. దేశీయ అవసరాలను తీర్చడానికి కనీసం ఎనిమిది వారాలకు సరిపడే పెట్రోల్, డీజిల్ నిల్వలు ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. అయితే మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు దీర్ఘకాలం కొనసాగితే ప్రపంచ చమురు ధరలపై ప్రభావం పడే అవకాశముందని, దాని ప్రభావం భారత్ సహా అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలపై కనిపించవచ్చని ఇంధన రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Also Read: International Women's Day 2026: చరిత్రను మార్చిన ఐదుగురు భారతీయ మహిళలు ఎవరు? ఈ కథ వింటే గూస్‌బంప్స్ గ్యారెంటీ!  

Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. దయచేసి దీన్ని పెట్టుబడి, ఆర్థిక లేదా వ్యాపార సలహాగా భావించవద్దు. గుర్తుంచుకోండి స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టోకరెన్సీలు, రియల్ ఎస్టేట్, విలువైన లోహాలు వంటి అన్ని రకాల పెట్టుబడులు మార్కెట్ ఆటు పోటులు రిస్కులకు లోబడి ఉంటాయి. దీని అర్థం, మీరు లాభపడవచ్చు లేదా నష్టపోవచ్చు. మీరు తీసుకునే ఎలాంటి పెట్టుబడి నిర్ణయాలు లేదా వ్యాపార కార్యకలాపాల వల్ల కలిగే నష్టాలు లేదా లాభాలకు మా సంస్థ జీ తెలుగు వెబ్ పోర్టల్ ఎట్టి పరిస్థితుల్లోనూ బాధ్యత వహించదు. ఏదైనా ఆర్థిక నిర్ణయం తీసుకునే ముందు, తప్పకుండా ఒక రిజిస్టర్డ్ లేదా సర్టిఫైడ్ ఆర్థిక నిపుణుడిని సంప్రదించి, వారి సలహా తీసుకోమని పాఠకులకు సిఫార్సు చేస్తున్నాము.

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.

0
comment0
Report
HDHarish Darla
Mar 08, 2026 07:30:35
Hyderabad, Telangana:

Hybrid Vs EV Which Is Better: భారతదేశంలో వేగంగా మారుతున్న ఆటోమొబైల్ మార్కెట్లో హైబ్రిడ్, ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్ భారీగా పెరిగిపోతుంది. పెట్రోల్, డీజిల్ కార్లను మించి వాటి మార్కెట్‌ వాల్యూ భారీగా పెరిగిపోతుంది. ఇదిలా ఉండగా మరోవైపు పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు, పర్యావరణం గురించి పెరుగుతున్న ఆందోళనతో ప్రజలు కొత్త టెక్నాలజీ కలిగిన కార్ల వైపు మొగ్గు చూపుతున్నారు.

యుద్ధం వేళ ఇంధన ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో ఎలక్ట్రిక్ కార్లు (EV), హైబ్రిడ్ కార్లు ముఖ్యంగా హాట్ టాపిక్‌ గా మారాయి. కాలుష్యాన్ని తగ్గించడం సహా ఇంధనంపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం ఈ టెక్నాలజీలను ప్రోత్సహిస్తోంది. కానీ ప్రశ్న ఏమిటంటే..ప్రజల్లో చాలా మంది హైబ్రిడ్ కారు కొనాలా లేదా ఎలక్ట్రిక్ కారు కొనాలా? అని చాలా మంది ఆలోచిస్తుంటారు. అలాంటి వారి కోసం కొన్ని వివరాలను తెలుసుకుందాం.

EV వాహనాలు
ఎలక్ట్రిక్ కార్లు (EV కార్లు) పూర్తిగా బ్యాటరీలతో నడుస్తాయి. ఆ వాహనాలకు వాటికి పెట్రోల్ లేదా డీజిల్ అవసరమే లేదు. విద్యుత్‌తో ఈ కార్లను ఛార్జ్ చేయడానికి ఉపయోగిస్తారు. భారతదేశంలో అనేక రకాల కార్ల తయారీ కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేశాయి.

ఎలక్ట్రిక్ వాహనాల ప్రయోజనాలు చాలా ఉన్నాయి. EV వెహికల్స్ వల్ల ఇంధన ఖర్చు దాదాపుగా సున్నగా మారుతుంది. అదే విధంగా కాలుష్యం చాలా తక్కువ. దీంతో పాటు డీజిల్, పెట్రోల్, డీజిల్ కార్లతో పోలిస్తే మెయిన్‌టెనెన్స్ ఖర్చులు చాలా తక్కువ. 

హైబ్రిడ్ కారు  
హైబ్రిడ్ కారు పెట్రోల్ ఇంజిన్‌ను ఎలక్ట్రిక్ మోటారుతో కలుపుతుంది. అంటే కారు పెట్రోల్, విద్యుత్ లేదా సీఎన్‌జీ (CNG) రెండింటితో నడుస్తుంది. ఇది మైలేజీని పెంచడమే కాకుండా ఇంధన వినియోగాన్ని భారీగా తగ్గిస్తుంది. ఈ విభాగంలో భారత మార్కెట్‌ నుంచి టయోటా ఇన్నోవా హైక్రాస్, టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ వంటి కార్లు పాపులర్ అయ్యాయి.

హైబ్రిడ్ కార్ల వల్ల కూడా అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి. పెట్రోల్ కార్ల కంటే హైబ్రిడ్ కార్లు ఎక్కువ మైలేజ్ ఇస్తాయి. ఛార్జింగ్ ఇబ్బందే ఉండదు. దూర ప్రయాణాల్లో ఛార్జింగ్ స్టేషన్లను వెతుక్కునే పనే ఉండదు. 

సాధారణ వినియోగానికి ఏది మంచిది?
మీరు ఎక్కువగా సిటీలో డ్రైవ్ చేసే వాళ్లైతే సమీపంలో ఛార్జింగ్ స్టేషన్లు ఉంటే ఎలక్ట్రిక్ వెహికల్ (EV) మంచి ఎంపికగా ఉంటుంది. ఇది మీకు ఇంధన ఖర్చులను భారీగా ఆదా చేస్తుంది. కానీ, అలాంటి కార్లలో మీరు దూర ప్రయాణాలు చేసేందుకు పరిమిత ఛార్జింగ్ స్టేషన్లు ఉండే ప్రాంతాల్లో ఛార్జింగ్ ఇబ్బంది లేకుండా హైబ్రిడ్ కార్లను ఎంచుకోవచ్చు. అయితే ఆ రెండింటికి వాటివాటి లాభనష్టాలు చాలానే ఉన్నాయి.

అయితే వీటిలో ఏది ఎంచుకోవాలనే ఆలోచన మాత్రం మీరు నివసించే ప్రాంతాన్ని బట్టి ఉంటుంది. దగ్గరి ప్రయాణాలకు ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగిస్తే మీ డబ్బు, ఇంధనం చాలా ఆదా అవుతుంది. అదే విధంగా సుదూర ప్రాంతాలకు పెట్రోల్, డీజిల్ వాహనాలను ఉపయోగించడం ప్రయాణానానికి అనుకూలంగా ఉంటుంది.

Also Read: Santner On Indian Fans: టీమ్ఇండియా అభిమానులకు న్యూజిలాండ్ కెప్టెన్ వార్నింగ్! "భారత్ ఫ్యాన్స్‌ను సైలెంట్ చేస్తాం!"

Also Read: Naga Chaitanya Gaddar Awards: 'గద్దర్ అవార్డ్స్‌'లో మెరిసిన యువసామ్రాట్ నాగ చైతన్య..'తండేల్' నటనకు పట్టం!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

 

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Mar 08, 2026 07:26:20
Hyderabad, Telangana:

Poco C85x 5G Launch Date: ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ కంపెనీ పోకో వచ్చేవారం భారత్ మార్కెట్‌లోకి కొత్త మొబైల్‌ను విడుదల చేయబోతోంది. దీనిని కంపెనీ పోకో C85x 5G పేరుతో అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఎంతో అద్భుతమైన డ్యూయల్-టోన్ బ్యాక్ ప్యానెల్‌తో విడుదల కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా ఈ మొబైల్ మోస్ట్ పవర్ఫుల్ బ్యాటరీ సెటప్‌ను కలిగి ఉంటుంది. డిసెంబర్‌లో అందుబాటులోకి తీసుకువచ్చిన పోకో C85 5G స్థానంలో ఈ మొబైల్ రాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ మొబైల్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు, ఇటీవల సోషల్ మీడియాలో లీకైన ఫీచర్స్ మనం ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ స్మార్ట్‌ఫోన్‌ను పోకో కంపెనీ మార్చి 10వ తేదీన భారత్ మార్కెట్లోకి విడుదల చేయబోతున్నట్లు వెల్లడించింది. ఇప్పటికే ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌లో Poco C85x 5G  స్మార్ట్ ఫోన్ పై ప్రత్యేకమైన మైక్రో సైట్ కూడా రన్ అవుతుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఎడమ భాగంలో ప్రత్యేకమైన పోకో బ్రాండింగ్‌తో కూడిన డ్యూయల్ టోన్ రియల్ ప్యానెల్ ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా వెనక భాగంలో ప్రత్యేకమైన పిల్-ఆకారపు కెమెరా కూడా లభిస్తుంది. అలాగే ఇది డ్యూయల్ రియల్ కెమెరా సెటప్ తో విడుదల కాబోతోంది. అలాగే ప్రత్యేకమైన LED ఫ్లాష్‌ కూడా లభించడం విశేషం. దీంతోపాటు స్పెషల్ పవర్ బటన్, వాల్యూమ్ కంట్రోల్స్ బటన్స్ కుడిభాగంలో అందుబాటులో ఉంటాయి.

పోకో కంపెనీ ఇప్పటికీ విడుదల చేసిన స్మార్ట్‌ఫోన్స్‌లో అత్యంత పెద్ద బ్యాటరీ మొబైల్‌గా నిల్వబోతోంది. Poco C85x 5G స్మార్ట్‌ఫోన్ కూడా కొన్ని ప్రత్యేకమైన కలర్ ఆప్షన్స్ లో అందుబాటులోకి రాబోతోంది. అలాగే ఈ స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ మొత్తం రెండు స్టోరేజ్ ఆప్షన్స్‌లో అందుబాటులోకి తీసుకురాబోతోంది. మొదటి స్టోరేజ్ వేరియంట్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌ను కలిగి ఉంటుంది. ఇక రెండవది 8gb + 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌ను కలిగి ఉంటుంది. ఇక ఈ మొబైల్ డిస్ప్లే 6.9-అంగుళాల ఉంటుంది. దీంతోపాటు 120Hz రిఫ్రెష్ రేట్, 810 nits గరిష్ట బ్రైట్‌నెస్‌తో విడుదల కాబోతోంది. 

Also Read: Redmi 14C 5G Offer: రెడ్‌మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్‌ఫోన్..అదిరిపోయే ఆఫర్!

ఇక ఈ మొబైల్ ఎంతో శక్తివంతమైన Mediatek Dimensity 6300 చిప్‌సెట్ ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇది Android 15 ఆధారంగా HyperOS 2.2 ఆపరేటింగ్ సిస్టంపై పని చేస్తుంది. ఇక ఈ స్మార్ట్‌ఫోన్‌ కెమెరా యూనిట్ వివరాల్లోకి వెళ్తే.. ఇది ఎంతో శక్తివంతమైన 50-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాను కలిగి ఉంటుంది. అంతేకాకుండా అదనంగా 8-మెగాపిక్సెల్ కెమెరాతో లభిస్తోంది. ఇక ఇవే కాకుండా 5G, వైఫై, బ్లూటూత్, GPS మరియు USB టైప్-C పోర్ట్ కనెక్టివిటీ ఫీచర్లు కూడా లభిస్తున్నాయి. దీంతోపాటు ఇది ఎంతో శక్తివంతమైన 6,000 mAh బ్యాటరీ 33 W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టును కలిగి ఉంటుంది. అయితే, అతి తక్కువ ధరలోనే ఈ మొబైల్ అందుబాటులోకి రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాల కోసం మార్చి 10వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.

Also Read: Redmi 14C 5G Offer: రెడ్‌మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్‌ఫోన్..అదిరిపోయే ఆఫర్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Mar 08, 2026 07:14:13
Hyderabad, Telangana:

Infinix Note 60 Ultra Price: చైనీస్ మొబైల్ తయారీ కంపెనీ ఇన్ఫినిక్స్ గురువారం మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌లో తమ కొత్త ఇన్ఫినిక్స్ నోట్ 60 అల్ట్రా స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ఇది అద్భుతమైన డిజైన్‌తో పాటు ప్రీమియం కెమెరా సెటప్, అద్భుతమైన ఎన్నో రకాల ఫీచర్లతో ఈ మొబైల్ అందుబాటులోకి వచ్చింది. ఈ మొబైల్ ను ఇటాలియన్ సంస్థ పినిన్‌ఫరినా సహకారంతో రూపొందించినట్లు సంస్థ పేర్కొంది. ముఖ్యంగా ఈ స్మార్ట్‌ఫోన్‌ ఎంతో అద్భుతమైన ట్రిపుల్ కెమెరా సెటప్‌తో అందుబాటులోకి వచ్చింది. అలాగే వెనక భాగంలో ఆకర్షణీయమైన డిజైన్‌ను కలిగి ఉంటుంది. అయితే, ఈ మొబైల్‌కు సంబంధించిన అన్ని రకాల ఫీచర్స్ ఏంటో? అలాగే ఇది ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

ఇన్ఫినిక్స్ నోట్ 60 అల్ట్రా (Infinix Note 60 Ultra) స్మార్ట్‌ఫోన్ అద్భుతమైన కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది. ముఖ్యంగా ఇది మోస్ట్ పవర్ఫుల్ 200-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో లాంచ్ అయ్యింది. అలాగే గేమ్స్ ఆడుకునేందుకు వీలుగా, మల్టీ టాస్కింగ్ చేసుకోవడానికి ఎంతో శక్తివంతమైన మీడియాటెక్ డైమెన్సిటీ 8400 అల్టిమేట్ చిప్‌సెట్ ప్రాసెసర్‌తో అందుబాటులోకి వచ్చింది. ఇది మొత్తం నాలుగు కలర్ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంది. అంతేకాకుండా ఇది వివిధ స్టోరేజ్ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంది. ఇందులోని హై ఎండ్ వేరియంట్ 256 GB ఇంటర్నల్ స్టోరేజ్ తో విడుదలైంది. ముఖ్యంగా మలేషియాలో ఈ మొబైల్ రూ.69,600 ధరతో లభించబోతోంది. అలాగే ఈ స్మార్ట్‌ఫోన్ మొత్తం నాలుగు కలర్ ఆప్షన్స్‌లో అందుబాటులోకి రాబోతోంది.

ఇన్ఫినిక్స్ నోట్ 60 అల్ట్రా  స్మార్ట్‌ఫోన్ అద్భుతమైన 1.5K అల్ట్రా HDR AMOLED డిస్‌ప్లేను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. దీంతోపాటు చాలా ప్రత్యేకమైన రిఫ్రెష్ రేట్ 144 Hz సపోర్టుతో అందుబాటులోకి రాబోతోంది. అలాగే ఇది అద్భుతమైన 4,500 nits గరిష్ట బ్రైట్నెస్ సపోర్టుతో కూడిన డిస్ప్లేను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఈ డిస్ప్లేను ప్రొటెక్ట్ చేసేందుకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ కూడా వస్తోంది. అలాగే ఇది ఎంతో ప్రత్యేకమైన ఆండ్రాయిడ్ 16 ఆధారంగా XOS 16 ఆపరేటింగ్ సిస్టంపై రన్ అవుతుంది. దీంతోపాటు ఇందులో కంపెనీ చాలా ప్రత్యేకమైన సాటిలైట్ కాలింగ్ సపోర్టుతో పాటు మెసేజ్ ఫంక్షన్‌ను సపోర్ట్ చేస్తుంది. అలాగే JBL ట్యూన్డ్ స్పీకర్ యూనిట్‌ను కూడా అందిస్తోంది.

Also Read: Redmi 14C 5G Offer: రెడ్‌మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్‌ఫోన్..అదిరిపోయే ఆఫర్!

ఇన్ఫినిక్స్ నోట్ 60 అల్ట్రా  (Infinix Note 60 Ultra) స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన వెనుక భాగం వివరాల్లోకి వెళితే.. ఇందులో కంపెనీ చాలా ప్రత్యేకమైన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను అందిస్తోంది. ముఖ్యంగా ఈ మొబైల్ 200-మెగాపిక్సెల్ సాంసంగ్‌ ఐసోసెల్ HPE  ప్రధాన కెమెరాను కలిగి ఉంటుంది. అంతేకాకుండా అదనంగా 50-మెగాపిక్సెల్  సాంసంగ్ ఐసోసెల్ JN5 పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా, 112-డిగ్రీల ఫీల్డ్ ఆఫ్ వ్యూతో అల్ట్రా-వైడ్ కెమెరాతో అందుబాటులోకి వచ్చినట్లు తెలుస్తోంది.. ఇన్ఫినిక్స్ నోట్ 60 అల్ట్రా  స్మార్ట్‌ఫోన్ ఎంతో శక్తివంతమైన 7,000mAh బ్యాటరీ 100W వైర్డు, 50W వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు  సపోర్టుతో విడుదలైంది. దీనివల్ల 48 నిమిషాల్లోనే ఫుల్ ఛార్జ్ కూడా అవుతుందని కంపెనీ క్లైమ్ చేస్తోంది. అయితే, ఈ మొబైల్‌ను భారత్ మార్కెట్‌లో కూడా త్వరలో విడుదల చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అతి త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెల్లడించే అవకాశాలున్నాయి.

Also Read: Redmi 14C 5G Offer: రెడ్‌మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్‌ఫోన్..అదిరిపోయే ఆఫర్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
BBhoomi
Mar 08, 2026 06:50:59
Secunderabad, Telangana:

Hyderabad Real Estate: హైదరాబాద్‌ పశ్చిమ భాగంలో రియల్‌ ఎస్టేట్‌ రంగాన్ని వేగంగా మార్చేస్తున్న ప్రాంతాల్లో కోకాపేట్ ప్రస్తుతం అగ్రస్థానంలో ఉంది. కొన్ని సంవత్సరాల క్రితం వరకు పెద్దగా గుర్తింపు లేని ఈ ప్రాంతం, ఇప్పుడు నగరంలోని అత్యంత ఖరీదైన రియల్‌ ఎస్టేట్‌ హబ్‌లలో ఒకటిగా మారింది. ముఖ్యంగా నియోపోలిస్ లేఅవుట్, కోకాపేట అభివృద్ధి ఈ ప్రాంతం రూపురేఖలను పూర్తిగా మార్చేసింది. ఐటీ కంపెనీలు, బహుళజాతి సంస్థలు భవిష్యత్తులో ఇక్కడ కార్యాలయాలు స్థాపించే అవకాశాలు ఉన్నాయని అంచనాలు ఉండటంతో పెట్టుబడిదారులు భారీగా ఈ ప్రాంతంపై దృష్టి సారిస్తున్నారు.

ఈ అభివృద్ధి ప్రభావంతో కోకాపేట పరిసర ప్రాంతాల్లో రియల్‌ ఎస్టేట్‌ ధరలు వేగంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ ప్రాంతంలో అపార్ట్‌మెంట్ల ధరలు చదరపు అడుగుకు సుమారు ₹9,000 నుంచి ₹15,000 వరకు పెరిగాయి. ఈ పెరుగుదల వల్ల చాలా మందికి కోకాపేటలో ఇల్లు కొనడం కాస్త కష్టంగా మారింది. అందుకే చాలా మంది కొనుగోలుదారులు ఇప్పుడు కోకాపేటకు సమీపంలో ఉన్న ఇతర ప్రాంతాల వైపు దృష్టి మళ్లిస్తున్నారు.

ప్రస్తుతం కొనుగోలుదారులు ఎక్కువగా పరిశీలిస్తున్న ప్రాంతాల్లో మోకిలా, శంకర్‌పల్లి, కొల్లూరుముందంజలో ఉన్నాయి. ఈ ప్రాంతాలు కోకాపేట నియోపోలిస్‌కు సుమారు 15 నుంచి 20 నిమిషాల ప్రయాణ దూరంలో ఉండటం పెద్ద ప్రయోజనంగా మారింది. అంతేకాకుండా ఔటర్ రింగ్ రోడ్, హైదరాబాద్ సర్వీస్‌ రోడ్ల అనుసంధానం కూడా ఈ ప్రాంతాల ప్రాముఖ్యతను పెంచుతోంది. నగరానికి దగ్గరగా ఉండటంతో పాటు ఇక్కడ ఇంకా భూమి ధరలు కొంతవరకు అందుబాటులో ఉండటం కొనుగోలుదారులను ఆకర్షిస్తోంది.

ఇటీవల కాలంలో కొల్లూర్, తెల్లాపూర్  ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. భారీ హైరైజ్‌ అపార్ట్‌మెంట్లు, ఆధునిక గేటెడ్‌ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్టులు ఇక్కడ నిర్మాణంలో ఉన్నాయి. ఈ కారణంగా కొంతమంది రియల్‌ ఎస్టేట్‌ నిపుణులు ఈ ప్రాంతాలను  కొత్త కోకాపేట గా కూడా అభివర్ణిస్తున్నారు.

Also Read: America-Israel-Iran war: యుద్ధ భయంతో విమాన టికెట్లకు రెక్కలు.. రూ. 16 వేలు నుంచి రూ. 1 లక్షకు జంప్..!!  

ఇక ఓపెన్‌ ప్లాట్లు లేదా విల్లా ప్లాట్లపై ఆసక్తి ఉన్నవారికి మోకిలా శంకర్ పల్లి రోడ్డు ప్రాంతం మంచి అవకాశంగా మారింది. భవిష్యత్తులో ప్రతిపాదిత రీజినల్ రింగ్ రోడ్డు, హైదరాబాద్ ప్రాజెక్ట్‌ ఈ ప్రాంతాల అభివృద్ధికి మరింత దోహదం చేస్తుందని భావిస్తున్నారు. గత రెండేళ్లలో ఈ మార్గంలో ఉన్న భూముల ధరలు దాదాపు 40 శాతం వరకు పెరిగినట్లు మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా రిటైర్మెంట్‌ హోమ్స్‌ లేదా వీకెండ్‌ విల్లాల కోసం చూస్తున్నవారు ఈ ప్రాంతాలపై ఆసక్తి చూపుతున్నారు.

ఇక మరోవైపు  బానూర్ పటాన్ చెరు పరిసర ప్రాంతాలు కూడా ఇప్పుడు పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. పారిశ్రామికాభివృద్ధి పెరుగుతున్న నేపథ్యంలో ఈ ప్రాంతాల్లో నివాస అవసరాలు కూడా పెరుగుతున్నాయి. కోకాపేటలో పెట్టుబడి పెట్టలేకపోయిన చిన్న మరియు మధ్య తరహా పెట్టుబడిదారులు ఇప్పుడు ఈ శివారు ప్రాంతాల్లో ప్లాట్లు కొనుగోలు చేయడం ప్రారంభించారు. దీంతో హైదరాబాద్‌ పశ్చిమ ప్రాంతాల్లో రియల్‌ ఎస్టేట్‌ విస్తరణ మరింత వేగంగా జరుగుతోంది.

Also Read: International Women's Day 2026: చరిత్రను మార్చిన ఐదుగురు భారతీయ మహిళలు ఎవరు? ఈ కథ వింటే గూస్‌బంప్స్ గ్యారెంటీ!  

Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. దయచేసి దీన్ని పెట్టుబడి, ఆర్థిక లేదా వ్యాపార సలహాగా భావించవద్దు. గుర్తుంచుకోండి స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టోకరెన్సీలు, రియల్ ఎస్టేట్, విలువైన లోహాలు వంటి అన్ని రకాల పెట్టుబడులు మార్కెట్ ఆటు పోటులు రిస్కులకు లోబడి ఉంటాయి. దీని అర్థం, మీరు లాభపడవచ్చు లేదా నష్టపోవచ్చు. మీరు తీసుకునే ఎలాంటి పెట్టుబడి నిర్ణయాలు లేదా వ్యాపార కార్యకలాపాల వల్ల కలిగే నష్టాలు లేదా లాభాలకు మా సంస్థ జీ తెలుగు వెబ్ పోర్టల్ ఎట్టి పరిస్థితుల్లోనూ బాధ్యత వహించదు. ఏదైనా ఆర్థిక నిర్ణయం తీసుకునే ముందు, తప్పకుండా ఒక రిజిస్టర్డ్ లేదా సర్టిఫైడ్ ఆర్థిక నిపుణుడిని సంప్రదించి, వారి సలహా తీసుకోమని పాఠకులకు సిఫార్సు చేస్తున్నాము.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Mar 08, 2026 05:18:46
Hyderabad, Telangana:

Kubera Favorite Zodiac Signs 2026 Effect On Zodiac Telugu: జ్యోతిష్య శాస్త్రంలో కుబేరుడికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఈ గ్రహాన్ని సంపదతో పాటు శ్రేయస్సు ఐశ్వర్యానికి సూచికగా చెప్పుకుంటారు.. కుబేరుడి ఆశీస్సులు ఉంటే ఇంట్లో ఊహించని స్థాయిలో కనక వర్షం కురుస్తుందని ఒక నమ్మకం. అంతేకాకుండా ఆయన అనుగ్రహం ఉంటే సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయని, అనుకున్న పనుల్లో అద్భుతమైన సంపాదన కూడా పొందగలుగుతారని ఒక విశ్వాసం. అయితే, కొన్ని ప్రత్యేకమైన గ్రహాలు శుభస్థానంలో ఉన్న  రాశుల వారికి ఎల్లప్పుడూ కుబేరుడి అనుగ్రహం లభిస్తుంటుంది. అంతేకాకుండా కొన్ని రాశులకు గురువు లాంటి గ్రహాలు అధిపతిగా ఉన్నప్పుడు కూడా ఆయన ఆశీస్సులు తప్పకుండా లభిస్తూ ఉంటాయని జ్యోతిష్య శాస్త్రంలో పేర్కొన్నారు. అయితే, కుబేరుడికి కొన్ని రాశులు అంటే చాలా ఇష్టం. ఆయా రాశుల వారికి ఎల్లప్పుడూ సంపదని ఇస్తూనే ఉంటాడు. అయితే, కుబేరుడికి అత్యంత ఇష్టమైన నాలుగు రాశులేవో వారికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఈ రాశులవారికి బంపర్‌ జాక్‌పాట్:
వృషభ రాశి 
కుబేరుడికి అత్యంత ఇష్టమైన రాశుల్లో వృషభ రాశి ఒకటి. వృషభ రాశి వారికి మానసిక ప్రశాంతత విపరీతంగా పెరుగుతుంది. అలాగే స్థిరాస్తులు కూడా పొందగలుగుతారు. ఈ రాశిని శుక్రుడు పాలిస్తాడు. కాబట్టి వీరికి సంపదతో పాటు ఆనందం, భౌతిక సంతోషం విపరీతంగా లభించే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకు తెలివితేటలు కూడా విపరీతంగా పెరుగుతాయి. అలాగే డబ్బు విషయంలో కూడా మోసపోయే వ్యక్తులు ఈ సమయంలో గ్రహించగలుగుతారు. అంతేకాకుండా పొదుపు చేయడానికి ఎలాంటి పనులు చేయాలో అనే అంశాలపై ప్రత్యేక చొరవ చూపుతారు. ఈ రాశుల్లో జన్మించిన వ్యక్తులు ఎప్పుడు డబ్బు సంపాదిస్తూనే ఉంటారు. దీనివల్ల ఏదో ఒకటి కొనుగోలు చేస్తూనే ఉంటారు. అలాగే వీరు విలాసవంతమైన జీవితాన్ని గడపడమే కాకుండా.. జీవితాన్ని ఆరోగ్యంగా ఉంచుకోగలుగుతారు..

కర్కాటక రాశి 
కర్కాటక రాశిలో జన్మించిన వ్యక్తులకు కూడా ఎల్లప్పుడూ కుబేరుడి అనుగ్రహం పొందే అవకాశాలున్నాయి. కుటుంబాన్ని ప్రేమించడమే కాకుండా వీలు ఎల్లప్పుడూ సంతోషపెడతారు. అంతేకాకుండా వారికి ఎప్పుడు ఎలాంటి డబ్బు కోరుతూ.. ఉండదని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. కుటుంబ ఖర్చులకోసం ఏదైనా పనులు చేసే అవకాశాలుంటాయి. దీనికి సమాజంలో మంచి హోదా కూడా లభిస్తుంది. అంతేకాకుండా సమాజ సేవ చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే వీరికి ఆత్మగౌరవం కూడా ఊహించని స్థాయిలో పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితులు గతంలో కంటే ఇప్పుడు మరింత బలపడతాయి. దీని కారణంగా వీరికి గొప్ప పురోగతి కూడా లభించే అవకాశాలు కనిపిస్తున్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. 

తులారాశి 
తులా రాశిలో జన్మించిన వ్యక్తులకు కూడా కుబేరుడి అనుగ్రహం ఎల్లప్పుడూ లభించబోతోంది. ముఖ్యంగా వీరికి కష్టానికి తగిన ప్రతిఫలం లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. వ్యక్తిగత జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. అంతేకాకుండా సంపాదనను ఎంతో సులభంగా పొందగలుగుతారు. వీరు ప్రయత్నిస్తే ఎలాంటి విజయాలైన సాధించగలుగుతారు. చట్టపరమైన సమస్యలు ఎదుర్కొంటున్న వ్యక్తులకు ఎల్లప్పుడూ పరిష్కారం లభిస్తూనే ఉంటుంది. కుబేరుడి ఆశీస్సులతో ఆదాయ వనరులు విపరీతంగా పెరుగుతూ వస్తాయి. అంతేకాకుండా వీరు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూ ఉంటారు. దీంతో సౌకర్యం వం జీవితాన్ని గడుపుతూ కష్టాన్ని చేస్తూ డబ్బులు సంపాదిస్తారు.

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

ధనస్సు రాశి 
ధనస్సు రాశిలో జన్మించిన వ్యక్తులకు కూడా ధైర్యం ఎల్లప్పుడూ ఉంటుంది. ఎందుకంటే కుబేరుడికి ఇష్టమైన రాశుల్లో ఈ రాశి కూడా ఒకటి. వీరు ఎల్లప్పుడూ దైవభక్తిని కలిగి ఉంటారు. అంతేకాకుండా గొప్ప ఆత్మవిశ్వాసం కూడా లభిస్తుంది. అంతేకాకుండా కష్టానికి తగిన ప్రతిఫలం కూడా లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. జీవితంలో ఎలాంటి డబ్బు కోరత కూడా ఉండదు. కష్టపడి పని చేసే వ్యక్తులు అద్భుతంగా రాణించగలుగుతారు. అలాగే సంపాదన కూడా వారసత్వంగా పొందుతారు. కుబేరుడి అనుగ్రహం ఉన్న సమయంలో ఆశవంతమైన జీవితాన్ని గడుపుతూ.. జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు.

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Mar 07, 2026 13:20:32
Hyderabad, Telangana:

Happy Womens Day 2026 Telugu Wishes: 1900 సంవత్సరం ప్రారంభంలో మెరుగైన జీతాలతో పాటు ఓటు హక్కు, తక్కువ పనిగంటల కోసం మహిళలు చేసిన కార్మిక ఉద్యమం నుంచి అంతర్జాతీయ మహిళా దినోత్సవం పుట్టింది. ఇది మహిళలు తమ హక్కుల కోసం గల మెత్తిన ధైర్యానికి గుర్తుగా ప్రపంచం భావిస్తుంది. అలాగే మహిళలపై జరుగుతున్న హింసతో పాటు వేధింపుల పట్ల అవగాహన కల్పించడానికి ఈరోజును వేదికగా భావిస్తారు. చట్టాల పట్ల అవగాహన పెంచడంతోపాటు వారికి రక్షణ కల్పించే వ్యవస్థలను బలోపితం చేయడమే అంతర్జాతీయ మహిళా దినోత్సవం ముఖ్య లక్ష్యం.. అందుకే ప్రతి ఏడాది మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఇంతటి ప్రత్యేకత కలిగిన రోజున ప్రతి ఒక్క మహిళకు ఇలా సోషల్ మీడియా ద్వారా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు పంపండి.

మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఇలా తెలపండి..
✿ అక్షరానికి రూపం నువ్వు.. సృష్టికి ప్రాణం నువ్వు.. ఓర్పులో భూదేవి నువ్వు.. నేటి తరానికి స్ఫూర్తివి నువ్వు.. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు..

✿ కంటి పాపవై వెలుగునిస్తావు.. కన్నతల్లివై ప్రాణమిస్తావు.. అడుగడుగునా ఆదర్శంగా నిలిచే మాతృమూర్తి నీకు వందనం.. ఉమెన్స్ డే శుభాకాంక్షలు..

✿ ఇంటిని నందనవనం చేసే సిరిమల్లె పువ్వువి.. కష్టాల కడలిలో ధైర్యాన్నిచ్చే వెలుగు దివ్యవు.. ఎల్లప్పుడూ నీకు మా వందనాలమ్మ.. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు..

✿ ఆకాశమే హద్దుగా దూసుకుపోతూ.. ఆశయాల బాటలో అలుపెరుగక సాగుతున్న ఓ అద్భుతమైన శక్తికి మహా వందనం.. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు..

✿ అనురాగానికి నిలువుటి అద్దం నువ్వు.. ఆత్మీయతకు అసలైన అర్థం నువ్వు.. లోకాన్ని నడిపించే మాతృమూర్తికి ఇవే మా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు..

Also Read: Redmi 14C 5G Offer: రెడ్‌మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్‌ఫోన్..అదిరిపోయే ఆఫర్!

✿ మెడలో నగలు కావు.. సాధించిన విజయాలే నీకు అలంకారాలు.. కన్నీళ్లు కావు.. నీలోని చిరునవ్వులే లోకానికి ఆధారం.. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు..

✿ ఓటమిని గెలుపుగా మార్చగలవు.. మౌనాన్ని మాటగా మార్చగలవు.. సహనానికి అసలైన చిరునామా నువ్వు ఓ మహిళా మూర్తి.. మీ అందరికీ ఉమెన్స్ డే శుభాకాంక్షలు..

✿ బాధ్యత బరువులోను నవ్వును వీడని మనసు మీది.. అడ్డంకులను అధిగమించి శిఖరాలను తాకే ధైర్యం మీ అందరిది.. మీ అందరికీ పేరుపేరునా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. 

✿ కూతురుగా.. సోదరిగా.. అమ్మలా.. అర్ధాంగిగా.. ప్రతిరూపంలోనూ ఆత్మీయతను పెంచే అపురూప శిల్పం నువ్వు.. మీ అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు..

✿ మగువ అంటే కేవలం ఒక పేరు మాత్రమే కాదు.. అది ఈ జగత్తుని నడిపించే ఒక అద్భుతమైన మహాశక్తి.. మీ అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు..

Also Read: Redmi 14C 5G Offer: రెడ్‌మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్‌ఫోన్..అదిరిపోయే ఆఫర్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Mar 07, 2026 12:26:37
Hyderabad, Telangana:

Sundar Pichai Latest Salary News: భారత సంతతికి చెందిన గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ మరోసారి వార్తల్లో నిలిచిపోయారు.. ఈసారి ఆయన తన అందుకుంటున్న భారీ వేతన ప్యాకేజీ తో ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేసేలా చేశారు. ఆయనకు సంబంధించిన ప్యాకేజీ వివరాలు ఇప్పుడు సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో వైరల్ అవుతున్నాయి. గూగుల్ మాతృ సంస్థగా చెప్పుకునే ఆల్ఫాబెట్ సుందర్ పిచాయ్ వేతన ప్యాకేజీని భారీగా పెంచినట్లు తెలుస్తోంది. రాబోయే మూడేళ్ల కాలానికి ఆయనకు సుమారు 692 మిలియన్లు జీతం అందించబోతున్నట్లు ఫైనాన్షియల్ టైమ్స్ వెల్లడించింది. అంటే భారత కరెన్సీలు దాదాపు 6,361 కోట్ల అన్నమాట.. 

అయితే, గూగుల్ కంపెనీ అందించే ఈ భారీ ప్యాకేజీ కేవలం నగదు రూపంలోనే ఉండదు. ఇందులో వివిధ భాగాలు ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా వార్షిక జీతం తో పాటు రిస్ట్రిక్టెడ్ స్టాక్ వెస్టింగ్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఆల్ఫాబెట్‌లోని ఇతర అనుబంధ సంస్థల్లో ఉన్న షేర్ల వాటాలు కూడా ఇందులో ఇంక్లూడ్ అయి ఉంటాయని సమాచారం. దీంతోపాటు గూగుల్ కంపెనీకి సంబంధించిన అనుసంధాన కంపెనీల షేర్ల వాటాలు కూడా ఈ లెక్కలోకి వస్తున్నట్లు ఫైనాన్షియల్ టైమ్స్‌లో వెల్లడించారు..

దీంతో ప్రపంచవ్యాప్తంగా అత్యంత జీతం తీసుకుంటున్న సీఈఓల జాబితాలో సుందర్ పిచాయ్ అగ్రస్థానంలోకి చేరుకున్నారని తెలుస్తోంది. సంస్థ వృద్ధిలో ఆయన పాత్ర క్రియాశీలకం కాబట్టి భారీగా ప్యాకేజీని పెంచినట్లు మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. అంతేకాకుండా కంపెనీ కష్ట కాలాల్లో ఆయన ఎన్నో సేవలు చేశారని.. దీనిని దృష్టిలో పెట్టుకొని ఇంత స్థాయిలో ప్యాకేజీ అందిస్తున్నట్లు వారు చెబుతున్నారు. 

తమిళనాడుకు చెందిన సుందర్ పిచాయ్ ప్రస్థానం ఎంతో ప్రత్యేకమని మనందరికీ తెలిసిందే.. ఐఐటి ఖరగ్‌పూర్‌లో విద్యనభ్యసించిన ఆయన.. 2004లో ఒక సాధారణ ఉద్యోగిగా గూగుల్లో చేరి.. క్రోమ్ తో పాటు ఆండ్రాయిడ్ వంటి కీలక ఉత్పత్తుల విజయంలో ఆయన క్రియాశీలక పాత్ర పోషించారట.. అంతేకాకుండా ఆయన పనితీరుకు గూగుల్ వ్యవస్థాపకులైన లెర్రీ పేజ్, సెర్గీ బ్రిన్ కూడా కొన్ని సందర్భాల్లో ఆశ్చర్యపోయేవారట.. అయితే 2025 సంవత్సరంలో గూగుల్ సీఈఓ గా బాధ్యతలను ఆయనకు అప్పగించారు.. ఆ తర్వాత 2019లో ఆల్ఫాబెట్ సీఈఓ గా కూడా బాధ్యతలు చేపట్టిన సంగతి అందరికీ తెలిసిందే. 

ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్సీ రంగాల్లో గూగుల్ గట్టి పోటీని ఎదుర్కొంటున్న సమయంలో సుందర్ నాయకత్వంపై సమస్త గట్టి నమ్మకాన్ని ఉంచినట్లు తెలుస్తోంది.. ఆయన పర్యవేక్షణలోని గూగుల్ క్లౌడ్ తో పాటు యూట్యూబ్ ప్రకటనల ఆదాయం ఊహించని స్థాయిలో పెరగడం విశేషం.

Also Read: Old Woman Video: పాపం.. 70 ఏళ్ల వృద్ధురాలు తిప్పలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..Twitter, Facebook

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Mar 07, 2026 12:16:25
Hyderabad, Telangana:

 Elderly Women Bike Riding Viral Video Watch: వయస్సు అనేది కేవలం అంకి మాత్రమేనని నిరూపించారు ఈ వృద్ధులు.. సాధారణంగా ఈ వయసులో చాలామంది ఇంట్లో పడుకోవడం, ఆధ్యాత్మికంగా ఉండేందుకు పూజలు చేయడం, ఇంట్లో కుటుంబ సభ్యులతో ఎంతో ఆనందంగా ఉండడం చూస్తూ ఉంటాం. కానీ రాజస్థాన్‌కు చెందిన ముగ్గురు వృద్ధురాలు మాత్రం ఇందుకు భిన్నంగా ఉండడం ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. రాజస్థానీ సాంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోతూ.. ఒకరు బైక్ నడుపుతుంటే.. మరో ఇద్దరు వెనక కూర్చుని.. దర్జాగా బైక్‌పై వెళ్తున్న దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు ఊహించని స్థాయిలో ట్రెండ్ అవుతున్నాయి. అయితే, ఈ వీడియోకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..

రాజస్థాన్లోని అజ్మీర్ నగరంలోని చోటు చేసుకున్న ఈ అరుదైన ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఒక వృద్ధురాలు బైక్ డ్రైవింగ్ సీట్లో ఉండగా.. ఆమె వెనక మరో ఇద్దరు వృద్ధురాలు వచ్చి కూర్చోవడం ఈ వీడియోలో మీరు చూడొచ్చు.. అయితే వారందరూ సాంప్రదాయ లెహంగాను ధరించి ఉండటం మీరు గమనించవచ్చు. బైక్ నడుపుతున్న ఆ వృద్ధురాలు ముగ్గురు కూర్చున్నప్పటికీ ఏమాత్రం భయపడకుండా.. చాలా సాదాసీదాగా బైకును తోలడం మీరు క్లియర్గా ఈ వీడియోలో చూడవచ్చు. దీనికి సంబంధించిన దృశ్యాలు అక్కడే ఉన్న కొంతమంది మొబైల్‌లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 

సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ వీడియోలు విపరీతంగా వైరల్ అవుతూ వస్తున్నాయి. ఈ దృశ్యాలను చూసి సోషల్ మీడియా వినియోగదారులు వివిధ రకాలుగా స్పందిస్తూ వస్తున్నారు. ఈ సమయంలో కూడా ఈ వృద్ధుల జోష్ చూస్తుంటే ముచ్చటేస్తోందని.. కొంతమంది కామెంట్ పెడుతుంటే.  మరికొందరు అసలైన విమెన్ ఎంపవర్మెంట్ అంటే ఇదే అని కామెంట్లలో మెచ్చుకుంటున్నారు. అంతేకాకుండా కొంతమంది ఈ వీడియోకు నెగిటివ్ కామెంట్స్ కూడా చేస్తున్నారు..

 
 
 
 
 

Also Read: Old Woman Video: పాపం.. 70 ఏళ్ల వృద్ధురాలు తిప్పలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో..

కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు వీరి ముగ్గురికి ఎలాంటి హెల్మెట్ లేదు అని.. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు గాయాలపాలయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని వారు కామెంట్లు పెడుతూ వస్తున్నారు. అలాగే త్రిబుల్ రైడింగ్ చేయడం కూడా ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధమని మరి కొంతమంది కామెంట్లలో చెబుతున్నారు. ఏది ఏమైనా ఈ సమయంలో ఇలా బైక్ పై వెళ్లడం చాలా గ్రేట్.. అయితే ఈ వీడియోలు షేర్ చేసిన కొంత వ్యవధిలోని ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. కోట్ల మంది వీక్షించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఉమెన్స్ డే సమయంలో ఈ వీడియో వైరల్ అవ్వడం ఇప్పుడు విశేషం..

Also Read: Old Woman Video: పాపం.. 70 ఏళ్ల వృద్ధురాలు తిప్పలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..

  

0
comment0
Report
HDHarish Darla
Mar 07, 2026 12:11:37
Ahmedabad, Gujarat:

Mitchell Santner on Indian Fans: టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్ పోరుకు సమయం ఆసన్నమైన వేళ, మైదానం వెలుపల మాటల యుద్ధం మొదలైంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య జరగనున్న తుది పోరుపై కివీస్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో సెగలు రేపుతున్నాయి.

గతంలో 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ అన్న మాటలనే ఇప్పుడు సాంట్నర్ పునరుద్ఘాటించారు. భారత అభిమానుల కేరింతలను మ్యూట్ చేస్తామంటూ గట్టిగా చెప్పారు. "ఫైనల్ మ్యాచ్‌ కోసం మేము ఎంతో ఉత్సాహంగా ఉన్నాము. గ్యాలరీ నిండా ఉండే భారత అభిమానుల అరుపులు, కేకలను మేము పూర్తిగా నిశ్శబ్దం చేస్తాము. 2023లో ఆస్ట్రేలియా ఎలాగైతే భారత్‌ను వారి సొంత గడ్డపై కట్టడి చేసిందో, మేము కూడా అదే పునరావృతం చేస్తాము" అని సాంట్నర్ ధీమా వ్యక్తం చేశారు.

సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని టీమ్ ఇండియాపైనే ఒత్తిడి ఎక్కువగా ఉందని సాంట్నర్ విశ్లేషించారు. గత టీ20 ప్రపంచకప్ ఛాంపియన్స్‌గా నిలిచిన భారత్.. ఈసారి సొంత గడ్డపై ఆడుతుండటంతో కప్ నిలబెట్టుకోవాలనే ఒత్తిడి వారిపైనే ఉంటుంది. ఈ ఒత్తిడిని ఆసరాగా చేసుకుని భారత్‌ను ఓడించడం మాకు సాధ్యమవుతుందని ఆయన పేర్కొన్నారు.

భారత పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా ప్రదర్శనను సాంట్నర్ ప్రశంసించారు. "బుమ్రా సెమీఫైనల్లో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. కానీ ఇది ఫైనల్. ఇక్కడ ఒక ఆటగాడి కంటే జట్టుగా మేము ఎలా రాణిస్తామన్నదే ముఖ్యం. బుమ్రాను ఎదుర్కోవడానికి, అలాగే భారత బ్యాటింగ్ లైనప్‌ను కట్టడి చేయడానికి మా దగ్గర పక్కా ప్లాన్ ఉంది" అని తెలిపారు.

గతంలో న్యూజిలాండ్ పలుమార్లు ఐసీసీ టోర్నీల ఫైనల్స్‌కు చేరుకున్నా, ట్రోఫీని ముద్దాడలేకపోయింది. "గతంలో మేము ఫైనల్స్‌లో ఓడిపోయి ఉండవచ్చు, కానీ ఈసారి మా జట్టు భిన్నంగా ఉంది. బ్యాటింగ్, బౌలింగ్‌లో ప్రతి ఆటగాడికి ఒక స్పష్టమైన లక్ష్యం ఉంది. ఈసారి కచ్చితంగా ట్రోఫీతోనే తిరిగి వెళ్తాం" అని సాంట్నర్ స్పష్టం చేశారు.

అహ్మదాబాద్‌లోని బ్యాటింగ్ పిచ్‌పై భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది. మరి సాంట్నర్ అన్నట్లుగా కివీస్ జట్టు భారత్‌ను నిశ్శబ్దం చేస్తుందా? లేక టీమ్ ఇండియా వరుసగా రెండోసారి ప్రపంచ విజేతగా నిలుస్తుందో చూడాలి!

Also Read; India Vs New Zealand Playing 11: న్యూజి‌లాండ్‌తో ఫైనల్ మ్యాచ్..టీమ్ఇండియా జట్టు ఇదే..హైదరాబాదీ రాక ఖరారు!

Also Read: Naga Chaitanya Gaddar Awards: 'గద్దర్ అవార్డ్స్‌'లో మెరిసిన యువసామ్రాట్ నాగ చైతన్య..'తండేల్' నటనకు పట్టం!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
Advertisement
Back to top