Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Mancherial504251

సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వైద్యశిబిరాలు ఏర్పాటు

Sept 06, 2024 09:43:35
Bellampalle, Kannal Rural, Telangana
మంచిర్యాల జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలలో భాగంగా బెల్లంపల్లి పట్టణంలోని అన్ని వార్డ్ లలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని డిప్యూటీ డీఎంహెచ్ఓ సుధాకర్ నాయక్ అన్నారు. బెల్లంపల్లిలో అయన మాట్లాడుతూ వాతావరణంలో మార్పుల వల్ల సీజనల్ వ్యాధులు సోకకుండా వైద్య శిబిరంలో ప్రజలకు అవసరమైన పరీక్షలు చేసి అక్కడిక్కడే మందులు అందజేస్తున్నామని, అవసరమైతే పీహెచ్సీకి రిఫర్ చేస్తున్నామన్నారు. ప్రజలు వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని అయన కోరారు.
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
RKRavi Kumar Sargam
Mar 01, 2026 09:51:59
Tadepalli, Andhra Pradesh:

BR Naidu Resignation: 'టీటీడీ చైర్మన్  బీఆర్ నాయుడు మహా ఘోరాతిఘోరం చేశారు. 94 సంవత్సరాల పాలకమండళ్ల చరిత్రలో ఎప్పుడూ లేనంతగా అనైతిక చర్యలకు బీఆర్ నాయుడు పాల్పడ్డారు. అలాంటి వ్యక్తిని టీటీడీకి చైర్మన్‌గా నియమించారు. ఆయన కామక్రీడలు సోషల్ మీడియాలో ప్రపంచమంతా తెలిసిపోయింది. ఆ వీడియోలు చూసి హిందూ భక్తులు మండి పడుతున్నారు' అని టీటీడీ మాజీ చైర్మన్‌ భూమన కరుణాకరరెడ్డి తెలిపారు. 'వెంకటేశ్వర స్వామి పూజలు చేశాకే దినచర్య ప్రారంభిస్తానన్న చంద్రబాబు నియమించిన వ్యక్తి అనైతిక వీడియోలు వచ్చాయి. ప్రపంచమంతటా ఉన్న హిందూ భక్తుల మనోభావాలు దెబ్బ తిన్నాయి' అని చెప్పారు.

Also Read: B Naidu Videos: అశ్లీల వీడియోలు నావి కావు.. అవి ఫేక్‌ డీప్‌ వీడియోలు: టీటీడీ చైర్మన్‌ నాయుడు

టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడు అశ్లీల వీడియోలు బయటకు రావడంతో తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం భూమన కరుణాకర్‌ రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో బీఆర్‌ నాయుడుపై తీవ్ర వ్యాఖ్యలు, ఆరోపణలు చేశారు. 'వాత్సాయనుడికి వారసుడుగా బీఆర్ నాయుడు తయారయ్యారు. ఆయన బీఆర్ నాయుడు కాదు కామనాయుడుగా మారాడు. ఆ వీడియోలు ఏఐ అని బీఆర్ నాయుడు చెప్తున్నమాట అబద్దం. నేను కొందరు ఏఐ నిపుణులతో మాట్లాడా. ఆ వీడియోలు కరెక్టేనని చెప్పారు. బీఆర్ నాయుడుకి సిగ్గు ఉంటే మౌనంగా రాజీనామా చేసి పక్కకు వెళ్లాలి' అని వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి సవల్‌ చేశారు. అలా చేయకపోగా తన వర్గపు మీడియా ద్వారా ఎదురుదాడి చేయటం సిగ్గుచేటు అని మండిపడ్డారు.

Also Read: Gold Fruad: మేడమ్‌ పేరిట బంగారు కడ్డీలతో మోసం.. కిలో బంగారంతో ఉడాయింపు

'తివారి ఫొటోలు బయటకు వస్తే రాజీనామా చేసి వెళ్లారు. ఎస్వీబీసీ చైర్మన్ పృథ్వీ గురించి ఆడియో బయటకు రాగానే జగన్ అతడితో రాజీనామా చేయించారు. ఇప్పుడు చంద్రబాబు కూడా బీఆర్ నాయుడితో రాజీనామా చేయించాలి' అని భూమన కరుణాకరరెడ్డి కోరారు. 'సిర్రిఅప్పన్ అనే అర్చకుడు అనైతిక కార్యకలాపాలు చేస్తే వధించారు. ఆ శాశనం తిరుమలలో ఉంది. అలాంటి ఆలయానికి ఛైర్మన్ గా ఉన్న బీఆర్ నాయుడి వీడియోలు బయటకు వస్తే ఎందుకు చర్యలు తీసుకోలేదు?' అని కూటమి ప్రభుత్వాన్ని మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ప్రశ్నించారు.

'వైఎస్‌ జగన్ కుటుంబసభ్యులను దూషించినందుకు ఆ స్వామే బీఆర్ నాయుడుకి శిక్ష విధించింది. ఆ వ్యక్తిని పదవి నుంచి తొలగించకపోగా వైఎస్సార్ సీపీ మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు. అరెస్టులకు పురిగొల్పటం సిగ్గుచేటు. ఇవేకాదు ఇంకా చాలా వీడియోలు బయటకు వస్తాయి' అని భూమన కరుణాకరరెడ్డి తెలిపారు. 'డీప్ ఫేక్ వీడియోలు అంటూ తప్పించుకోవాలనుకుంటే కుదరదు. పోలీసులకు కూడా అనైతిక బురదను అంటించే ప్రయత్నం చేస్తున్నారు' అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 'టీటీడీ ఛైర్మన్ ఆఫీసులో కూడా ఇలాంటి కామ క్రీడలు చేస్తున్నారా? అనే అనుమానం కలుగుతోంది' అని టీటీడీ మాజీ చైర్మన్‌ భూమన కరుణాకరరెడ్డి సంచలన ఆరోపణ చేశారు.

ఇప్పటికైనా బీఆర్ నాయుడు వెంటనే రాజీనామా చేయాలని భూమన కరుణాకరరెడ్డి డిమాండ్‌ చేశారు. లడ్డూ కల్తీ అయ్యాయని గుడిమెట్లు కడిగిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏం మాట్లాడతారు? అని ప్రశ్నించారు. బీఆర్ నాయుడు అనైతిక చర్యలను సమర్ధిస్తారా? అని నిలదీశారు. లడ్డూ ప్రసాదంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పాపం ఊరికే పోదని పేర్కొన్నారు. 'బీఆర్ నాయుడు హిందూధర్మం అనే ఛానల్ కూడా నడుపుతున్నారు. వీఐపీలకు దేవుడి దర్శనం చేయించి వారితో తమ ఖాతాలో డబ్బులు వేయించుకుంటున్నారనే అనుమానం కలుగుతోంది' అని టీటీడీ మాజీ చైర్మన్‌, వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నాయకులు భూమన కరుణాకరరెడ్డి ఆరోపించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
RKRavi Kumar Sargam
Mar 01, 2026 09:21:26
Tirupati, Andhra Pradesh:

TTD Chairman Videos With Women: 'నకిలీ డీప్ ఫేక్ వీడియోలతో కొందరు సోషల్ మీడియాలో నాపై దుష్ప్రచారం చేస్తున్నారు. వ్యక్తిగతంగా నన్ను అప్రతిష్ట పాలు చేసేందుకు, తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టను దిగజార్చేందుకు కుట్రలు చేస్తున్నారు. ఏఐ సాంకేతికతను వాడుకుని నా రూపం అనుకరించేలా వీడియోలు తయారు చేసి ప్రచారం చేస్తున్నారు. ఈ కంటెంట్ మొత్తం అసత్యమైనది, వక్రీకరించినది. ఇది టీటీడీ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు పన్నిన పథకం' అని టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడు తెలిపారు. దీని వెనుక రాజకీయ దురుద్దేశం ఉందని.. వైసీపీకి చెందిన కొందరు ఈ తప్పుడు ప్రచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని ఆరోపించారు. దీనిపై నేను చట్ట ప్రకారం ముందుకెళ్తానని ప్రకటించారు.

Also Read: Free Bus Scheme: ఫ్రీ బస్సుపై ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన.. ఉత్తర్వులు జారీ!

అనూహ్యంగా తెరపైకి వచ్చిన అతడి రాసలీలల వీడియోలపై టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడు స్పందించారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. 'నాపై సోషల్ మీడియాలో సాగుతున్న దుష్ప్రచారం వెనుక ఉన్న కుట్రను తేల్చాలని సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశా. నా వ్యక్తిత్వాన్ని  హననం చేస్తూ టీటీడీ ప్రతిష్టను దెబ్బతీస్తున్న వ్యక్తులను, దుష్ట శక్తులను వదిలేది లేదు' అని హెచ్చరించారు. 'పని పాట లేకుండా పరంబోకుల వ్యవహరించారు. హిందూ ధర్మం చానల్‌కి డబ్బులు మళ్లించానని నా మీద ఆరోపణలు. అన్ని రికార్డులు పెడతాం. మొత్తం మార్ఫింగ్ కాదు కొన్ని దగ్గర మార్ఫింగ్ చేశారు' అని బీఆర్‌ నాయుడు తెలిపారు.

'వ్యక్తిగతమైన ఆరోపణలు చేస్తూ ఘోరాతి ఘోరంగా నా మీద దాడి చేస్తున్నారు. మొదటి రోజు నుంచే నన్ను రాజీనామా చేయి అని కరుణాకర్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఎందుకంటే టీటీడీ చైర్మన్‌గా ఉన్నన్ని రోజులు కుంభకోణాలు చేశాడు. అవి ఎక్కడ బయట పెడతానో అని ఇలా మార్ఫింగ్ చేసి బెదిరిస్తున్నాడు' అని టీటీడీ చైర్మన్‌ బిఆర్‌ నాయుడు ఆరోపించారు. కరుణాకర్ చేసిన అవినీతిని తాను బయట పెడతానిని భయపడుతూ నన్ను రాజీనామా చేయాలని ఆరోపణలు చేస్తున్నారని వివరించారు. 'ఐదు సంవత్సరాలుగా వేల టికెట్స్ అమ్ముకున్నారు ప్రూఫ్ ఉంది. నేను భయపడేవాడిని కాదు గుర్తుపెట్టుకో' అని భూమన కరుణాకర్‌ రెడ్డికి టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు హెచ్చరించారు.

'టీటీడీ హిందూ ధర్మం కించపరచడం ఇష్టం లేక చంద్రబాబు చెప్పడంతో నిశ్శబ్దంగా ఉన్నా. కొన్ని వందల కుంభకోణాలు ఉన్నాయి. అన్ని రికార్డ్స్ ఉన్నాయి' అని బీఆర్‌ నాయుడు తెలిపారు. ఫేక్ డీప్ వీడియోలు ఎలా పెడతారు? అని మండిపడ్డారు. 'రాజకీయంగా ఇరు కుటుంబాలు 30 సంవత్సరాలుగా ఉన్నాం. మరి ఎలా చేస్తారు? అని నిలదీశారు. వైఎస్‌ జరరిఐలతైతౌఐతైఐతైటగన్‌ను ప్రశ్నించా. సతీసమేతంగా తిరుమలకు రారని ప్రశ్నించాను. వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి కూడా ఇలానే చేశారు. అందుకే నామీద ఎలాంటి నీచపు పని చేస్తున్నారు' అని బీఆర్‌ నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.

'ఈ విషయంపై మా కుటుంబ సభ్యుల ఫిర్యాదు ఇవ్వాలి. వీళ్లకి ఏమి మా మీద పడి ఏడుస్తున్నారు. వీళ్లకి ఏమి పని లేదా? కరుణాకర్ రెడ్డి మద్రాస్‌లో ఏం చేశావో అన్నీ నాకు తెలుసు. నిన్ను, వైవీ సుబ్బారెడ్డిని వదలను' అని బీఆర్‌ నాయుడు హెచ్చరించారు. టీటీడీలో అన్ని అక్రమాలు చేశారు బయట పెడతా. వారికి మంచిది కాదని హితవు పలికారు.

'రేపు వన్ మ్యాన్ కమిటీ వస్తుండడంతో డైవర్ట్ పొలిటికల్ ట్రిక్స్ ఇవన్నీ. మార్ఫింగ్ వీడియోలు చేసి నన్ను భయపెట్టడం అనేది నా దగ్గర పని చేయవు' అని బీఆర్‌ నాయుడు తెలిపారు. కొత్తగా కరుణాకర్ రెడ్డి, వైఎస్‌ జగన్ మీద ఆరోపణలు చేయాల్సిన పనిలేదు. అందరికి తెలుసు రూ.లక్షల కోట్లు అవినీతి చేశారు. నాకు ఎన్నో అవకాశాలు ఉన్న టీటీడీలో సేవలు అందించాలని వచ్చా' అని బీఆర్‌ నాయుడు తెలిపారు. భగవద్గీత ప్రింట్‌లలో 50 కోట్లు అవినీతి చేసి వాటిని ఎవరికి ఇవ్వకుండా లక్ష యాభై వేలు కాపీలు గోడౌన్‌లో పెట్టేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి' అని బీఆర్ నాయుడు వెల్లడించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
HDHarish Darla
Mar 01, 2026 09:10:49
Karachi, Sindh:

Karachi Protest America Consulate: ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణం, ఆ దేశంపై అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన దాడుల ప్రభావం పొరుగు దేశమైన పాకిస్థాన్‌పై తీవ్రంగా పడింది. ప్రస్తుతం పాక్ వ్యాప్తంగా నిరసన జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. ప్రధాన నగరాలన్నీ యుద్ధ భూమిని తలపిస్తున్నాయి. 

ఇరాన్ పాలకుడు ఖమేనీ హత్యకు గురయ్యారనే వార్త పాకిస్థాన్‌లోని షియా సామాజిక వర్గంతో పాటు సాధారణ ప్రజల్లోనూ ఆగ్రహాన్ని నింపింది. రాజధాని ఇస్లామాబాద్‌తో పాటు కరాచీ, లాహోర్, రావల్పిండి వంటి నగరాల్లో నిరసనకారులు భారీ ఎత్తున రోడ్లపైకి వచ్చి విధ్వంసానికి దిగారు. ఈ ఘటనలో 20 మందికి పైగా మరణించినట్లు అధికారులు ధ్రువీకరిస్తున్నారు. అందులో పాకిస్తానీలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

కరాచీలో ఉద్రిక్తత, కాన్సులేట్ ధ్వంసం
అందరికంటే ఎక్కువగా కరాచీలో నిరసనల తీవ్రత పెచ్చుమీరింది. ఆగ్రహంతో ఉన్న నిరసనకారులు కరాచీలోని అమెరికన్ కాన్సులేట్ కార్యాలయంపై దాడి చేశారు. భద్రతా వలయాన్ని ఛేదించుకుని లోపలికి ప్రవేశించిన ఆందోళనకారులు కార్యాలయం అద్దాలను పగలగొట్టి, ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. కార్యాలయంలోని కొన్ని భాగాలకు నిప్పు పెట్టడంతో దట్టమైన పొగ అలుముకుంది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో కలకలం రేపుతున్నాయి.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ఈ హత్యకు ప్రధాన కారకుడిగా భావిస్తూ, ఆయన దిష్టిబొమ్మలను నిరసనకారులు తగులబెట్టారు. కేవలం పాకిస్థాన్‌లోనే కాకుండా ఇతర ప్రాంతాల్లోనూ ఈ వేడి కనిపిస్తోంది. ఇరాక్ బాగ్దాద్‌లోని అమెరికా రాయబార కార్యాలయం వెలుపల వేలాది మంది ప్రజలు చేరి అమెరికాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మధ్యప్రాచ్యంలో అస్థిరతకు అమెరికానే కారణమని వారు ఆరోపించారు.

మరోవైపు భారతదేశంలోని కాశ్మీర్‌లో రాంబన్ ప్రాంతంలో షియా ముస్లింలు భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. ఖమేనీ మరణం తమ వర్గానికి తీరని లోటని, అమెరికా-ఇజ్రాయెల్ కుట్రపూరితంగా ఈ హత్యకు పాల్పడ్డాయని షియా నాయకుడు సయ్యద్ సమర్ కాజ్మీ మండిపడ్డారు.

పాకిస్థాన్‌లోని పలు నగరాల్లో స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు. విదేశీ రాయబార కార్యాలయాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇరాన్-అమెరికా మధ్య జరుగుతున్న ఈ సైనిక ఘర్షణలు సాధారణ ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయి.

ఖమేనీ మరణానంతరం చెలరేగిన ఈ హింస ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. పాకిస్థాన్ ప్రభుత్వం ఈ ఆందోళనలను అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ, ప్రజల్లో ఉన్న ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది.

Also Read: Burj Khalifa Drone Attack: దుబాయ్ బుర్జ్ ఖలీఫాపై డ్రోన్ దాడి? సోషల్ మీడియాలో వైరల్ వీడియో..వాస్తవం ఏంటి?

ALso Read: PAK Vs SL Match Fixing: పాకిస్థాన్‌తో శ్రీలంక మ్యాచ్‌ ఫిక్సింగ్? టీ20 ప్రపంచకప్‌లో ఫిక్సింగ్ ఆరోపణలు..సోషల్ మీడియాలో ట్రెండ్!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
HDHarish Darla
Mar 01, 2026 07:44:11
دبي, دبي:

Burj Khalifa Drone Attack News: పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు ఎగిసిపడుతున్న వేళ, సోషల్ మీడియాలో ఒక భయానక వీడియో ప్రపంచాన్ని వణికిస్తోంది. దుబాయ్‌లోని ప్రపంచ ప్రఖ్యాత కట్టడం బుర్జ్ ఖలీఫా లక్ష్యంగా ఇరాన్ డ్రోన్లు దాడికి దిగాయంటూ సాగుతున్న ఈ ప్రచారం జరుగుతోంది.

ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన మెరుపు దాడుల అనంతరం, ఇరాన్ తన ప్రతీకారాన్ని పది దేశాలపై క్షిపణుల రూపంలో ప్రదర్శించింది. ఈ క్రమంలోనే దుబాయ్‌లోని ఐకానిక్ టవర్ బుర్జ్ ఖలీఫా సమీపంలో డ్రోన్లు సంచరించినట్లు వార్తలు వస్తున్నాయి.

వైరల్ వీడియోలో ఏముంది?
సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియోలో.. బుర్జ్ ఖలీఫా భవనానికి అత్యంత సమీపంలో ఒక డ్రోన్ వెళ్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. భవనం పరిసరాల్లో నల్లటి పొగ దట్టంగా అలుముకున్నట్లు వీడియోలో చిత్రీకరించారు. డ్రోన్ బుర్జ్ ఖలీఫాను ఢీకొట్టిందని, తద్వారా భారీ నష్టం సంభవించిందని నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ వీడియో వైరల్ అయినప్పటికీ, దుబాయ్ ప్రభుత్వం లేదా ఐక్య అరబ్ ఎమిరేట్స్ (UAE) భద్రతా దళాలు బుర్జ్ ఖలీఫాపై దాడి జరిగినట్లు ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించలేదు. ఇరాన్ ప్రయోగించిన కొన్ని డ్రోన్లు దుబాయ్ గగనతలంలోకి ప్రవేశించిన మాట వాస్తవమే అయినప్పటికీ, అవి బుర్జ్ ఖలీఫాను ఢీకొట్టాయనే వార్తలకు ఇంకా సరైన ఆధారాలు లేవు. భద్రతా కారణాల దృష్ట్యా ఇప్పటికే దుబాయ్‌లోని పలు కీలక ప్రాంతాలను అధికారులు ఖాళీ చేయించారు.

ఒకవేళ దాడి జరిగితే?
ఒకవేళ ఇలాంటి దాడులు జరిగితే సంభవించే ఆర్థిక నష్టం ఊహాతీతం. 828 మీటర్ల ఎత్తుతో దుబాయ్ గర్వకారణంగా ఉన్న ఈ భవనం విలువ సుమారు 1.5 బిలియన్ డాలర్లు (సుమారు రూ.12,500 కోట్లు). ఈ భవనాన్ని డెవలపర్ 'ఎమ్మార్ ప్రాపర్టీస్' దాదాపు 1.5 బిలియన్ డాలర్లకు బీమా చేయించింది. ఏదైనా విపత్తు సంభవించినా లేదా దాడి జరిగినా ఈ ఇన్సూరెన్స్ రక్షణ కవచంలా నిలుస్తుంది.

దుబాయ్ అప్రమత్తం
ప్రస్తుత ఉద్రిక్తతల దృష్ట్యా యూఏఈ వైమానిక దళం హై అలర్ట్‌లో ఉంది. పౌరులెవరూ భయాందోళనలకు గురికావద్దని, కేవలం అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మాలని ప్రభుత్వం కోరుతోంది. యుద్ధ మేఘాలు కమ్ముకున్న ఈ సమయంలో ఇలాంటి సున్నితమైన కట్టడాల రక్షణ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

Also Read: Khamenei Death: "ఇరాన్ సుప్రీం లీడర్ ఖమైనీ చనిపోయారు!" అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన!

Also Read: Iran Israel Defense Comparison: రణరంగంగా మారిన పశ్చిమాసియా..అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ సైనిక బలాబలాలు ఎంతంటే?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
HDHarish Darla
Mar 01, 2026 06:14:28
Hyderabad, Telangana:

Ayatollah Ali Khamenei Net Worth: ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ మరణం మధ్యప్రాచ్య రాజకీయాల్లోనే కాకుండా, అంతర్జాతీయ ఆర్థిక వర్గాల్లోనూ పెద్ద చర్చకు దారితీసింది. సాధారణ ఆధ్యాత్మికవేత్తగా కనిపించే ఖమేనీ వెనుక ఉన్న అపారమైన ఆర్థిక సామ్రాజ్యం గురించి ఇప్పుడు సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

ఇరాన్‌ను మూడు దశాబ్దాలకు పైగా నిరంకుశంగా పాలించిన ఖమేనీ మరణవార్తను అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మీడియా ధృవీకరించాయి. ఈ క్రమంలో ఆయన నియంత్రణలో ఉన్న భారీ సంపదపై ప్రపంచ దేశాల దృష్టి పడింది.

ఖమేనీ నికర విలువ
ఖమేనీ వ్యక్తిగతంగా నిరాడంబర జీవితం గడుపుతున్నట్లు ప్రచారం ఉన్నప్పటికీ, ఆయన గుప్పిట్లో ఉన్న సంస్థల విలువ కళ్లు చెదిరేలా ఉంది. 'ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఇమామ్ ఖొమేనీస్ ఆర్డర్' అనే శక్తివంతమైన ఆర్థిక సంస్థ ద్వారా ఆయన ఇరాన్ ఆర్థిక వ్యవస్థను శాసించారు. జప్తు చేసిన ఆస్తులు, భారీ రియల్ ఎస్టేట్, ప్రభుత్వ రంగ సంస్థలపై ఈ సంస్థకు గుత్తాధిపత్యం ఉంది.

వివిధ అంతర్జాతీయ నివేదికల ప్రకారం ఖమేనీ నియంత్రణలో ఉన్న సంపద విలువ సుమారు 95 బిలియన్ డాలర్ల నుండి 200 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.16 లక్షల కోట్లు) వరకు ఉంటుందని అంచనా. 1989 నుంచి సుప్రీం లీడర్‌గా ఉన్న ఆయన అణు కార్యక్రమాలకు, ప్రాంతీయ యుద్ధాలకు అవసరమైన నిధులను తన స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థల నుండే మళ్లించేవారని సమాచారం.

ప్రపంచంలోని అత్యంత సంపన్న రాజకీయ నేతలతో పోల్చి చూస్తే ఖమేనీ సంపద ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంది. ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా ఖమేనీ ఆస్తుల విలువ సుమారు 95 - 200 బిలియన్ డాలర్ల (రూ.18.22 లక్షల కోట్లు) ఉంటుందని అంచనా. అయితే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆస్తి మాత్రం రూ.66 వేల కోట్లు ఉండగా.. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సంపద సుమారు రూ.118 కోట్ల విలువ ఉంటుందని సమాచారం.

ఈ గణాంకాలను గమనిస్తే, అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఆస్తులను కలిపినా ఖమేనీ సంపదలో కనీసం 10 శాతం కూడా ఉండవని విశ్లేషకులు చెబుతున్నారు.

యుద్ధం, అంక్షలు, అంతర్గత కల్లోలాల మధ్య కూడా దేశ ఆర్థిక వనరులను తన కనుసన్నల్లో ఉంచుకున్న ఖమేనీ మరణం, ఇరాన్ భవిష్యత్తును అనిశ్చితిలోకి నెట్టింది. ఆయన తర్వాత ఈ భారీ ఆర్థిక సామ్రాజ్యాన్ని ఎవరు నిర్వహిస్తారు? అది ప్రజల సంక్షేమానికి అందుతుందా లేదా మరో యుద్ధానికి ఇంధనంగా మారుతుందా? అన్నది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న.

గమనిక: ఖమేనీ సంపద వివరాలు అంతర్జాతీయ పరిశోధనా సంస్థలు, మీడియా నివేదికల అంచనాలపై ఆధారపడి ఉన్నాయి. ఇరాన్ అధికారికంగా వీటిని ఎప్పుడూ ధృవీకరించలేదు.

Also Read: Iran Israel Defense Comparison: రణరంగంగా మారిన పశ్చిమాసియా..అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ సైనిక బలాబలాలు ఎంతంటే?

Also Read: PAK Vs SL Match Fixing: పాకిస్థాన్‌తో శ్రీలంక మ్యాచ్‌ ఫిక్సింగ్? టీ20 ప్రపంచకప్‌లో ఫిక్సింగ్ ఆరోపణలు..సోషల్ మీడియాలో ట్రెండ్!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
HDHarish Darla
Mar 01, 2026 05:44:22
Hyderabad, Telangana:

Pakistan Vs Sri Lanka Match Fixing: 2026 టీ20 ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్థాన్, శ్రీలంక జట్ల మధ్య జరిగిన సూపర్ స్టేజ్ మ్యాచ్ ఇప్పుడు పెను వివాదానికి దారితీసింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొన్ని దృశ్యాలు, మ్యాచ్‌లో జరిగిన నాటకీయ పరిణామాలు చూస్తుంటే ఇది ఖచ్చితంగా 'మ్యాచ్ ఫిక్సింగ్' అని నెటిజన్లు మండిపడుతున్నారు. 

పాకిస్థాన్ సెమీఫైనల్ చేరాలంటే ఈ మ్యాచ్‌లో కనీసం 65 పరుగుల భారీ తేడాతో గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో శ్రీలంక ఆటగాళ్లు ప్రదర్శించిన తీరు అనేక అనుమానాలకు తావిస్తోంది.

వివాదానికి కారణమైన ప్రధాన అంశాలు..
11వ ఓవర్‌లో మహేష్ తీక్షణ వేసిన బంతి పాక్ ఓపెనర్ ఫఖర్ జమాన్ బ్యాట్‌కు తగిలి కీపర్ చేతుల్లోకి వెళ్లింది. స్నికోమీటర్‌లో స్పష్టమైన 'స్పైక్' కనిపించినప్పటికీ, శ్రీలంక కెప్టెన్ దాసున్ షనక రివ్యూ తీసుకోకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

పాక్ ఓపెనర్లు ఫఖర్ జమాన్, సాహిబ్జాదా ఫర్హాన్ ఇచ్చిన అత్యంత సులభమైన క్యాచ్‌లను దునిత్ వెల్లలాగే, చరిత్ అసలంక వంటి మేటి ఫీల్డర్లు వదిలేశారు. ఇది కావాలని చేసిన తప్పిదంలా ఉందని అభిమానులు ఆరోపిస్తున్నారు. శ్రీలంక బౌలర్లు ధారాళంగా పరుగులు ఇవ్వడంతో పాక్ ఓపెనర్లు మొదటి వికెట్‌కు 170 పరుగులు జోడించారు. ఇది టీ20 ప్రపంచకప్ చరిత్రలోనే పాకిస్థాన్ తరపున అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం కావడం గమనార్హం.

ఒక దశలో పాకిస్థాన్ 250 పైచిలుకు పరుగులు చేస్తుందని భావించినప్పటికీ, చివరి 5 ఓవర్లలో శ్రీలంక బౌలర్లు అనూహ్యంగా పుంజుకున్నారు. కేవలం 34 పరుగులకే 8 వికెట్లు పడగొట్టడంతో పాక్ 20 ఓవర్లలో 212/8 పరుగులకే పరిమితమైంది. సాహిబ్జాదా ఫర్హాన్ సెంచరీ బాదడమే కాకుండా, ఒకే ప్రపంచకప్ ఎడిషన్‌లో రెండు సెంచరీలు చేసిన మొదటి ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.

నెటిజన్ల డిమాండ్..
శ్రీలంక ఆటగాళ్లు పాకిస్థాన్‌ను గెలిపించేందుకే ఆడుతున్నట్లుగా ఉందని, ఐసీసీ (ICC) వెంటనే దీనిపై సమగ్ర దర్యాప్తు జరపాలని సోషల్ మీడియాలో డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. ఆదాయం, హోస్టింగ్ హక్కుల కోసమే శ్రీలంక ఇలా చేసిందని కొందరు ఆరోపిస్తుండగా, మరికొందరు దీనిని క్రికెట్ చరిత్రలో ఒక చీకటి రోజుగా అభివర్ణిస్తున్నారు.

ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ గెలిచినప్పటికీ, సెమీఫైనల్ రేసు నుండి నిష్క్రమించింది. అయితే, శ్రీలంక ఆటగాళ్ల వైఖరి మాత్రం ఈ టోర్నీలో పెద్ద మచ్చగా మిగిలిపోయింది. ఈ ఆరోపణలపై శ్రీలంక క్రికెట్ బోర్డు లేదా ఐసీసీ ఇంకా స్పందించాల్సి ఉంది.

Also Read: Iran Israel Defense Comparison: రణరంగంగా మారిన పశ్చిమాసియా..అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ సైనిక బలాబలాలు ఎంతంటే?

Also Read: Baba Vanga World War 3: బాబా వంగా చెప్పినట్టే జరుగుతోందా? 2026 'మూడో ప్రపంచ యుద్ధం' మొదలైనట్టేనా!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

 

0
comment0
Report
BBhoomi
Mar 01, 2026 05:10:15
Lakshmapur, Telangana:

US Iran Tensions Indias Economy Trouble: ఇరాన్‌లోని కీలక లక్ష్యాలపై అమెరికా–ఇజ్రాయెల్ సంయుక్త దాడులు పశ్చిమాసియాలో భద్రతా ఆందోళనలను తీవ్రతరం చేశాయి. ఈ పరిణామాలు ప్రాంతీయంగా మాత్రమే కాకుండా ప్రపంచ ఇంధన మార్కెట్లను కుదిపేస్తున్నాయి. ఇంధన దిగుమతులపై భారీగా ఆధారపడే భారత్‌కు ఇది ఆర్థికంగా కీలకమైన దశగా మారింది.

హార్ముజ్ జలసంధి.. ప్రపంచ చమురు గుండెపోటు:
ప్రపంచ చమురు రవాణాలో సుమారు 20 శాతం వాటా కలిగిన Strait of Hormuz జలసంధి ప్రస్తుత ఉద్రిక్తతల కేంద్రబిందువుగా మారింది. ఇరాన్‌ను ఒమన్, యూఏఈల నుంచి వేరు చేసే ఈ మార్గం ద్వారా భారత్ తన ముడి చమురు దిగుమతుల్లో సగానికి పైగా తెచ్చుకుంటోంది. ప్రస్తుతం రోజుకు సుమారు 26 లక్షల బ్యారెళ్ల ముడి చమురును ఇరాక్, సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్ నుంచి ఈ మార్గంలోనే దిగుమతి చేస్తోంది. అంతేకాదు, రోజుకు దాదాపు 74 వేల బ్యారెళ్ల శుద్ధి చేసిన ఉత్పత్తులను కూడా ఇదే మార్గం ద్వారా ఎగుమతి చేస్తోంది. ఇక్కడ ఏ చిన్న ఆటంకం వచ్చినా రవాణా ఖర్చులు పెరిగి, దేశ ఆర్థిక వ్యవస్థపై అదనపు భారం పడే ప్రమాదం ఉంది.

చమురు ధరల ఎగిసే ప్రమాదం:
అమెరికా బలగాల మోహరింపుతోనే అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఇప్పటికే పెరుగుదల దిశగా కదులుతున్నాయి. విశ్లేషణల ప్రకారం, ఇరాన్ ఉత్పత్తిలో అంతరాయం కలిగితే బ్యారెల్ ధర గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. హార్ముజ్ జలసంధిలో రవాణా అంతరాయం మరింత తీవ్రమైతే, ధరలు మరింత ఎగసే ముప్పు ఉంది. ఇది భారత్ వంటి దిగుమతి ఆధారిత దేశాలకు ప్రతికూల పరిణామమే అని చెబుతున్నారు.

భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం:
భారత్ వినియోగించే చమురులో సుమారు 85 శాతం దిగుమతులే. అంతర్జాతీయ ధరలు పెరిగితే దిగుమతి బిల్లు పెరుగుతుంది. దీంతో కరెంట్ అకౌంట్ లోటు మరింత విస్తరించే ప్రమాదం ఉంది. చమురు కొనుగోళ్లకు డాలర్లలో చెల్లింపులు చేయాల్సి ఉండటంతో డాలర్ డిమాండ్ పెరిగి, రూపాయి విలువపై ఒత్తిడి పడుతుంది. రూపాయి బలహీనత మరోవైపు దిగుమతులను మరింత ఖరీదుగా మారుస్తుంది.

పెట్రోల్, డీజిల్ ధరలు: 
దేశీయంగా పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగితే రవాణా వ్యయాలు అధికమవుతాయి. ఎర్ర సముద్రం వంటి మార్గాల్లో భద్రతా సమస్యలు తలెత్తితే నౌకలు ఆఫ్రికా చుట్టూ తిరగాల్సి రావచ్చు. దీంతో సరుకు రవాణా సమయం 15–20 రోజులు, ఖర్చులు 40–50 శాతం పెరిగే అవకాశముంది. ఈ ప్రభావం చివరకు వినియోగదారుడి జేబుపై పడుతుంది. గగనతలాల పరిమితులతో విమానయాన సంస్థలు మార్గమార్పులు చేపడితే టికెట్ ధరలు కూడా పెరగవచ్చు.

Also Read: Gold Price: భారీగా పెరగనున్న బంగారం ధర.. ఇరాన్‌ సంక్షోభంతో పెట్రోల్‌ మంట కూడా తప్పదా?  

ఎగుమతులు, స్టాక్ మార్కెట్, బులియన్ మార్కెట్:
ఇరాన్‌కు భారత్ నుంచి వెళ్లే బాస్మతి బియ్యం, ఔషధాలు, టీ, సుగంధ ద్రవ్యాల ఎగుమతులపై కూడా ప్రభావం ఉండొచ్చు. ఇదే సమయంలో స్టాక్ మార్కెట్లు అనిశ్చితి ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశం ఉంది. ఉద్రిక్తతలు ఎంతకాలం కొనసాగితే అంతకాలం మార్కెట్ల అస్థిరత పెరిగే ప్రమాదం ఉంది.

బంగారం, వెండి ధరలు: 
సురక్షిత పెట్టుబడుల వైపు మదుపర్లు మొగ్గు చూపడంతో బంగారం, వెండి ధరలు పెరుగుతున్నాయి. ఎస్ఎంసీ గ్లోబల్ సెక్యూరిటీస్ అంచనా ప్రకారం, ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల బంగారం రూ.1.70 లక్షల వరకు, కిలో వెండి రూ.3 లక్షల వరకు చేరే అవకాశముంది. మొత్తంగా పశ్చిమాసియా ఉద్రిక్తతలు భారత్‌కు ఇంధన భద్రత, ఆర్థిక స్థిరత్వం, మార్కెట్ విశ్వాసం ఇవన్నీకూడా మూడు రంగాల్లో సవాళ్లను సృష్టించే పరిస్థితి ఏర్పడింది. యుద్ధ మేఘాలు త్వరగా వీడితేనే మార్కెట్లకు ఊరట లభించే అవకాశం ఉంది.

Also Read:  EPFO CBT Meeting: హోలీకి ముందు గుడ్‌న్యూస్.. 31కోట్ల మందికి ప్రయోజనం.. EPFO కీలక నిర్ణయం..!!  

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..

0
comment0
Report
BBhoomi
Mar 01, 2026 03:37:52
Lakshmapur, Telangana:

UP Free Cylinder: హోలీ పండుగకు ముందుగా ఉత్తరప్రదేశ్ ప్రజలకు యోగి ప్రభుత్వం  శుభవార్త అందించింది. ముఖ్యమంత్రి  ఆదిత్యనాథ్ , ప్రధాన మంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారులైన ప్రతి కుటుంబానికి ఉచిత గ్యాస్ సిలిండర్ అందిస్తామని ప్రకటించారు. ఈ సౌకర్యాన్ని హోలీతో పాటు దీపావళి పండుగల సందర్భాల్లో కూడా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

లక్నోలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ.. ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం తొమ్మిది సిలిండర్లకు సబ్సిడీ అందించే విధానాన్ని అమలు చేస్తోందని తెలిపారు. సిలిండర్ రీఫిల్ చేసినప్పుడు సుమారు రూ. 335.40 మొత్తాన్ని నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయడం ద్వారా పారదర్శకతను పెంచుతున్నామని చెప్పారు. ఈ విధానం దుర్వినియోగాన్ని అరికట్టడమే కాకుండా.. పేద కుటుంబాల ఆర్థిక భారం తగ్గించడంలో సహాయపడుతుందని ఆయన పేర్కొన్నారు.

ఇది కేవలం పండుగ కానుక మాత్రమే కాదని, గౌరవప్రదమైన జీవన విధానానికి ప్రభుత్వ నిబద్ధత అని సీఎం స్పష్టం చేశారు. హోలీ, దీపావళి వంటి సందర్భాల్లో ఇంధన అవసరాలు పెరుగుతాయని, ఆ సమయంలో కుటుంబాలు ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. మహిళల భద్రత, ఆరోగ్యం అంశాలపై కూడా సీఎం ప్రత్యేకంగా దృష్టి సారించారు. రాష్ట్రంలో మహిళల స్వావలంబన, గౌరవం, రక్షణ కోసం అనేక కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు. ఉప ముఖ్యమంత్రి బజ్రేష్ పతాక్ ఆధ్వర్యంలో 14 ఏళ్ల బాలికలకు గర్భాశయ క్యాన్సర్ నిరోధక టీకా కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు వెల్లడించారు. సాధారణంగా రూ. 2100 విలువ చేసే ఈ టీకాను కేవలం రూ. 300కే అందుబాటులో ఉంచడమే కాకుండా, అవసరమైతే ఉచితంగా అందించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు.  మా కుమార్తె సురక్షితంగా ఉంటేనే కుటుంబం సురక్షితంగా ఉంటుంది  అని ఆయన వ్యాఖ్యానించారు.

Also Read: Gold Rate Today: అమెరికా–ఇరాన్ ఉద్రిక్తతలు.. భారీగా పెరిగిన పసిడి ధర.. మార్చి 1వ తేదీ ఆదివారం ధరలు ఇవే..!!  

ఈ సందర్భంగా గత ప్రభుత్వాలపై కూడా సీఎం యోగి ఆదిత్య నాథ్  విమర్శలు గుప్పించారు. గతంలో పాలన కుటుంబ కేంద్రంగా మారిందని, అభివృద్ధి కొద్దిమందికే పరిమితమైందని అన్నారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం రాష్ట్రంలోని 25 కోట్ల ప్రజలను ఒక కుటుంబంగా భావిస్తోందని, వారి భద్రత, గౌరవం, సంక్షేమం కోసం కట్టుబడి పనిచేస్తోందని స్పష్టం చేశారు.

Also Read:  China Currency Explainer: ప్రపంచ కరెన్సీ మార్కెట్లో ప్రకంపనలు.. చైనా చేసిన పనితో కంగుతిన్న అగ్రరాజ్యం..!!   

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..

0
comment0
Report
HDHarish Darla
Mar 01, 2026 02:44:20
:

Israel Vs Iran Military Power Comparison: పశ్చిమాసియాలో ప్రస్తుతం నెలకొన్న యుద్ధ వాతావరణం ప్రపంచ దేశాలను ఆందోళనకు గురిచేస్తోంది. ఇరాన్ ఒకవైపు, అమెరికా-ఇజ్రాయెల్ కూటమి మరోవైపు నిలిచి తమ సైనిక శక్తిని ప్రదర్శిస్తున్నాయి. ఈ మూడు దేశాల మధ్య ఉన్న సైనిక సామర్థ్యాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఆయుధ సంపత్తి కలిగిన అమెరికా, సంఖ్యాపరంగా బలమైన ఇరాన్, సాంకేతికతలో మేటి అయిన ఇజ్రాయెల్ మధ్య పోరు ఆసక్తికరంగా మారింది.

అమెరికా
అమెరికా తన ప్రయోజనాల కోసం పశ్చిమాసియాలో సుమారు 40,000 మంది సైనికులను, అత్యాధునిక యుద్ధనౌకలను మోహరించింది. యూఎస్‌ఎస్‌ జెరాల్డ్‌ ఆర్‌ ఫోర్డ్, యూఎస్‌ఎస్‌ అబ్రహాం లింకన్ వంటి భారీ విమానవాహక నౌకలు ఈ ప్రాంతంలో ఉన్నాయి. వీటిలో ఎఫ్-35 స్టెల్త్ యుద్ధ విమానాలు సిద్ధంగా ఉన్నాయి.

ముఖ్య స్థావరాలు..
బహ్రెయిన్‌లో అమెరికా నేవీ 5వ ఫ్లీట్ ప్రధాన కార్యాలయం ఇక్కడే ఉంది. ఖతార్ (అల్ ఉదైద్)లో సెంట్రల్ కమాండ్ హెడ్ క్వార్టర్స్, 10 వేల మంది సైనికులు ఉండగా.. యూఏఈ & కువైట్‌లో డ్రోన్లు, నిఘా విమానాలకు కీలకంగా ఉన్నాయి. దీంతో పాటు థాడ్, పేట్రియాట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ శత్రు క్షిపణులను అడ్డుకోవడానికి మోహరించారు.

ఇరాన్
దీర్ఘకాలిక ఆంక్షలు ఉన్నప్పటికీ, ఇరాన్ స్వదేశీ సాంకేతికతతో భారీ క్షిపణి వ్యవస్థను నిర్మించుకుంది. 6.1 లక్షల మంది క్రియాశీల సైనికులు, 2 లక్షల మంది సుశిక్షిత ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్ దళం దీని ప్రధాన బలంగా మారింది. ఇరాన్‌లో 2,000 కిలోమీటర్ల పరిధితో 3,000కు పైగా బాలిస్టిక్ క్షిపణులు ఉన్నాయి. ఇరాన్ వద్ద వేల సంఖ్యలో ఆత్మాహుతి డ్రోన్లు ఉన్నాయి. దాదాపు 6,000 నౌకాదళ మందుపాతరలతో హోర్ముజ్ జలసంధిని మూసివేసే సత్తా ఇరాన్‌కు ఉంది.

ఇజ్రాయెల్
ఇజ్రాయెల్ సంఖ్యాబలం కంటే నాణ్యత, వేగంపై ఆధారపడుతుంది. ఎఫ్-35, ఎఫ్-16 వంటి 600కు పైగా అధునాతన యుద్ధ విమానాలు ఉన్నాయి. కచ్చితమైన లక్ష్యాలను ఛేదించడంలో ఇవి ప్రపంచంలోనే మేటి. క్షిపణి రక్షణ, ఐరన్ డోమ్ స్వల్ప శ్రేణి రాకెట్లను అడ్డుకుంటుంది. డేవిడ్ స్లింగ్, యారోలు మధ్యంతర, సుదూర క్షిపణులను గగనతలంలోనే ధ్వంసం చేస్తాయి. అణ్వాస్త్రాలు గురించి అధికారికంగా ప్రకటించకపోయినా, ఇజ్రాయెల్ వద్ద 90కి పైగా అణ్వాస్త్రాలు, 6,500 కి.మీ పరిధి గల జెరికో-3 క్షిపణులు ఉన్నాయి.

అమెరికా-ఇజ్రాయెల్ కూటమికి సాంకేతికత, వైమానిక శక్తి కలిసొచ్చే అంశం అయితే, ఇరాన్‌కు దాని క్షిపణి సంపత్తి, భౌగోళిక వ్యూహం (హోర్ముజ్ జలసంధి) ప్రధాన ఆయుధాలుగా ఉన్నాయి. ఈ ఘర్షణ పెరిగితే అది ప్రపంచ ఇంధన సరఫరాపై తీవ్ర ప్రభావం చూపుతుంది.

Also Read: Khamenei Death: "ఇరాన్ సుప్రీం లీడర్ ఖమైనీ చనిపోయారు!" అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన!

Also Read: Baba Vanga World War 3: బాబా వంగా చెప్పినట్టే జరుగుతోందా? 2026 'మూడో ప్రపంచ యుద్ధం' మొదలైనట్టేనా!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
HDHarish Darla
Mar 01, 2026 02:25:39
Hyderabad, Telangana:

Baba Vanga Predictions 2026: ప్రస్తుత యుద్ధ పరిణామాలు ప్రపంచాన్ని వణికిస్తుండగా, బల్గేరియన్ ప్రవక్త బాబా వంగా ఏళ్ల క్రితం చెప్పిన జోస్యాలు ఇప్పుడు నిజమవుతున్నాయా? అనే చర్చ నెట్టింట జోరుగా సాగుతోంది. 2026 నాటి పరిస్థితులపై ఆమె చేసిన విస్తుపోయే అంచనాలు ఇప్పుడు నిజంగానే భయం కలిగిస్తున్నాయి. ప్రపంచ గమనాన్ని ముందుగానే ఊహించే 'నోస్ట్రడామస్ ఆఫ్ ది బాల్కన్స్'గా పేరుగాంచిన బాబా వంగా, భవిష్యత్తుపై చేసిన కొన్ని కీలక ప్రకటనలు ప్రస్తుత ఇరాన్-అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధ పరిస్థితులతో సరిపోలుతున్నాయి.

బాబా వంగా ప్రధాన జోస్యాలు..
2026లో భారీ యుద్ధం: తూర్పు దేశాల నుండి ఉద్భవించే ఉద్రిక్తతలు 2026 నాటికి ప్రపంచ యుద్ధానికి దారితీస్తాయని ఆమె గతంలోనే అంచనా వేశారు. ప్రస్తుత ఇరాన్ సంక్షోభం ఆ యుద్ధానికి నాంది అని ఆమె అనుచరులు భావిస్తున్నారు.

బంజరుగా మారనున్న యూరప్: ఈ మహా యుద్ధం తర్వాత యూరప్ దేశాలు తీవ్రంగా దెబ్బతింటాయని, ఆ భూభాగం జనవాసం లేని బంజరు ప్రాంతంగా మారుతుందని ఆమె హెచ్చరించారు. అంటే యూరప్ తన ప్రాభావాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని అర్థం.

రష్యా అగ్రరాజ్యం: యుద్ధం తర్వాత ప్రపంచ రాజకీయాల్లో పెను మార్పులు వస్తాయని, అగ్రరాజ్యంగా రష్యా వెలుస్తుందని ఆమె ప్రవచించారు. రష్యా ప్రభావం ప్రపంచ దేశాలపై అపరిమితంగా పెరుగుతుందని ఆమె పేర్కొన్నారు.

ప్రస్తుత భయానక వాస్తవాలు..
బాబా వంగా ప్రవచనాలను బలపరిచేలా పశ్చిమాసియాలో తాజా పరిణామాలు ఉన్నాయి.

1) ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన హర్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడంతో గ్లోబల్ ఎకానమీ, భారత్ వంటి దేశాలపై తీవ్ర ప్రభావం పడనుంది.

2) ఇరాన్ తన గగనతలాన్ని పూర్తిగా మూసివేయడం, అమెరికా బేసుల పై దాడులు చేయడం యుద్ధ వాతావరణాన్ని పతాక స్థాయికి చేర్చాయి.

3) టెహ్రాన్‌లోని సుప్రీం లీడర్ కార్యాలయాలే లక్ష్యంగా దాడులు జరగడం పరిస్థితి చేయి దాటిపోయిందని సూచిస్తోంది.

బాబా వంగా చెప్పిన విషయాల్లో గతంలో కొన్ని నిజమయ్యాయి (ఉదాహరణకు 9/11 దాడులు, సునామీ). అయితే, ఆధ్యాత్మిక ప్రవచనాలు, రాజకీయ విశ్లేషణల మధ్య చాలా సార్లు యాదృచ్ఛికతలు కూడా ఉండవచ్చు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ప్రపంచం మూడవ ప్రపంచ యుద్ధం అంచున ఉందనేది మాత్రం నిష్ఠుర సత్యం.

(గమనిక: ఈ సమాచారం బాబా వంగా ప్రవచనాలు, సామాజిక మాధ్యమాల్లో అందుబాటులో ఉన్న కథనాల ఆధారంగా రూపొందించబడింది. దీనిని కేవలం ఒక ప్రత్యేక దృక్కోణంగా మాత్రమే చూడాలి. దీన్ని జీ తెలుగు న్యూస్ ధ్రువీకరించడం లేదు.)

Also Read: Khamenei Death: "ఇరాన్ సుప్రీం లీడర్ ఖమైనీ చనిపోయారు!" అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన!

Also Read: Ind Vs WI Match Preview: టీమ్ ఇండియాకు చావో-రేవో..వెస్టిండీస్‌తో నేడు 'క్వార్టర్ ఫైనల్' సమరం!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
HDHarish Darla
Mar 01, 2026 01:21:46
Kolkata, West Bengal:

India Vs West Indies Match Preview: టీ20 ప్రపంచకప్‌లో నేడు జరగబోయే అత్యంత కీలకమైన సమరానికి కోల్‌కతాలోని చారిత్రక ఈడెన్ గార్డెన్స్ వేదిక కానుంది. సూపర్‌-8లో భాగంగా భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య జరగనున్న ఈ మ్యాచ్ క్వార్టర్ ఫైనల్‌ను తలపిస్తోంది. ఈ పోరులో గెలిచిన జట్టు సెమీఫైనల్‌కు చేరుకుంటుంది, ఓడిన జట్టు టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది.

జింబాబ్వేపై విజయంతో భారత్, దక్షిణాఫ్రికా చేతిలో విండీస్ ఓటమి పాలవ్వడంతో ఈ మ్యాచ్ ఇరు జట్లకు నిర్ణయాత్మకంగా మారింది. నేడు గెలిచిన జట్టు మార్చి 5న ముంబైలో ఇంగ్లాండ్‌తో జరిగే సెమీఫైనల్‌లో తలపడుతుంది.

టీమ్ ఇండియా బలాబలాలు..
గత మ్యాచ్‌లో భారత బ్యాటర్లు ఫామ్‌లోకి రావడం జట్టుకు పెద్ద ఊరట. టాప్-6 బ్యాటర్లు అందరూ సమష్టిగా రాణించారు. ఓపెనర్‌గా సంజు శాంసన్ ఆత్మవిశ్వాసం, అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీ, తిలక్ వర్మ, సూర్యకుమార్, హార్దిక్ పాండ్యా ఇన్నింగ్స్‌లు బ్యాటింగ్ విభాగాన్ని పటిష్టం చేశాయి.

అయితే బౌలింగ్ విభాగం ఇంకా స్థిరంగా లేదు. ముఖ్యంగా స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఫామ్ లేమి జట్టును వేధిస్తోంది. అలాగే సీమ్ ఆల్ రౌండర్ దూబే భారీగా పరుగులు సమర్పించుకోవడం మేనేజ్‌మెంట్‌ను కలవరపెడుతోంది. బుమ్రా కట్టుదిట్టంగా వేస్తున్నా, వికెట్ల వేటలో వెనుకబడ్డాడు.

వెస్టిండీస్ బలాబలాలు..
కరీబియన్ జట్టు ఏ క్షణమైనా మ్యాచ్ స్వరూపాన్ని మార్చేయగల హిట్టర్లతో నిండి ఉంది. 9వ స్థానంలో వచ్చే షెపర్డ్ కూడా అర్ధ సెంచరీ బాదగలగడం వారి బ్యాటింగ్ లోతును తెలియజేస్తోంది. ఇన్నింగ్స్ మధ్య వరకు వికెట్లు కాపాడుకుంటూ, ఆఖరి ఓవర్లలో విధ్వంసం సృష్టించడం విండీస్ శైలి.

ఈడెన్ గార్డెన్స్ భారత్‌కు అచ్చొచ్చిన మైదానంగా వస్తోంది. గణాంకాల ప్రకారం చూస్తే ఈ మైదానంలో భారత్ పైచేయి సాధించింది. 1983 నుంచి ఇక్కడ వెస్టిండీస్ జట్టు ఏ అంతర్జాతీయ మ్యాచ్‌లోనూ భారత్‌ను ఓడించలేదు. ఇక్కడ జరిగిన గత నాలుగు టీ20ల్లోనూ టీమ్ ఇండియానే విజయం సాధించింది.

పిచ్ రిపోర్ట్, వాతావరణం
ఈడెన్ గార్డెన్స్ పిచ్ బ్యాటింగ్‌కు స్వర్గధామం. ఇక్కడ భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది. క్యురేటర్ ప్రకారం బౌలర్లకు కూడా కొంత సహకారం అందుతుంది. సాయంత్రం వేళ మంచు (డ్యూ) ప్రభావం చూపే అవకాశం ఉంది. వర్షం ముప్పు లేకపోవడం క్రికెట్ ప్రేమికులకు మంచి వార్త.

టీమ్ఇండియా తుదిజట్టు (అంచనా)
అభిషేక్ శర్మ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి.

వెస్టిండీస్ తుదిజట్టు (అంచనా)
బ్రెండన్ కింగ్, షై హోప్(కెప్టెన్, వికెట్ కీపర్), హెట్మయర్, రోమన్ పావెల్, రోస్టన్ చేజ్, రూథర్‌ఫర్డ్,  రోమారియో షెపర్డ్, జాసన్ హోల్డర్, మాథ్యూ ఫోర్డ్, గుడకేశ్ మోటీ, షామర్ జోసెఫ్.

 

Also Read: Khamenei Death: "ఇరాన్ సుప్రీం లీడర్ ఖమైనీ చనిపోయారు!" అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన!

Also Read: Samarlakota Blast: ఏపీలో భారీ పేలుడు..18 మంది దుర్మరణం, చెల్లాచెదురుగా పడిన శరీర భాగాలు!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
HDHarish Darla
Mar 01, 2026 00:54:00
:

Iran Supreme Leader Khamenei Death: మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలతో ఇరాన్‌పై 'మేజర్ కాంబాట్ ఆపరేషన్స్' ప్రారంభమయ్యాయి. అమెరికా, ఇజ్రాయెల్ కూటమి ఇరాన్‌పై జరిపిన మెరుపు దాడులు ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. 

ఈ దాడుల నేపథ్యంలో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమైనీ మరణించారంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో సంచలనంగా మారింది. టెహ్రాన్‌తో సహా తొమ్మిది ప్రధాన నగరాల్లోని అణు కేంద్రాలు, బాలిస్టిక్ మిసైల్ సైట్లు, సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని భారీ ఎయిర్ స్ట్రైక్స్ జరిగాయి.

ఖమైనీ చనిపోయారు?!
"చరిత్రలో అత్యంత దుష్ట వ్యక్తులలో ఒకరైన ఖమైనీ కథ ముగిసింది. ఇరాన్ ప్రజలు తమ దేశాన్ని తిరిగి గెలుచుకోవాల్సిన సమయం వచ్చింది" అని ట్రంప్ తన 'ట్రూత్ సోషల్' వేదికగా ప్రకటించారు. ఖమైనీ సురక్షిత భవనంపై జరిగిన దాడిలో ఆయనతో పాటు IRGC కమాండర్లు, రక్షణ మంత్రి కూడా మరణించినట్లు ఇజ్రాయెల్ అధికారులు ధృవీకరించారు.

ఈ వార్తలను ఇరాన్ అధికారిక మీడియా తీవ్రంగా ఖండించింది. సుప్రీం లీడర్ సురక్షితంగా ఉన్నారని, దేశాన్ని సమర్థవంతంగా నడుపుతున్నారని స్పష్టం చేసింది. అయితే, దీనిపై ఇంకా స్వతంత్ర వెరిఫికేషన్ రావాల్సి ఉంది.

గల్ఫ్ దేశాలపై ఇరాన్ ప్రతీకార దాడులు..
అమెరికా దాడులకు నిరసనగా ఇరాన్ తక్షణమే స్పందించింది. కేవలం ఇజ్రాయెల్‌పైనే కాకుండా, అమెరికా సైనిక బేసులు ఉన్న గల్ఫ్ దేశాలపై కూడా బాలిస్టిక్ మిసైల్స్ ప్రయోగించింది. యూఏఈ (దుబాయ్, అల్ ధఫ్రా బేస్), ఖతార్, బహ్రెయిన్, కువైట్, జోర్డాన్ దేశాల్లోని అమెరికా బేస్‌లపై ఇరాన్ దాడులు చేస్తోంది. యూఏఈలో ఒక పౌరుడు మరణించినట్లు సమాచారం. చాలా మిసైల్స్‌ను రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నప్పటికీ, కొన్ని చోట్ల ఆస్తి నష్టం సంభవించింది.

గల్ఫ్ దేశాల ఆగ్రహం..
తమ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘిస్తూ ఇరాన్ జరిపిన దాడులను సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్ తీవ్రంగా ఖండించాయి. ఇది అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘన అని, తమను తాము రక్షించుకునే హక్కు తమకు ఉందని ప్రకటించాయి. గల్ఫ్ ప్రాంతంలో విమాన సర్వీసులు రద్దు కావడంతో పాటు ఎయిర్ స్పేస్ తాత్కాలికంగా మూసివేశారు.

మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఈ ఉద్రిక్తతలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై, ముఖ్యంగా ముడి చమురు (క్రూడ్ ఆయిల్) ధరలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఒమాన్ వంటి దేశాలు దౌత్యపరమైన చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని కోరుతున్నాయి.

ఈ దాడులు వారం రోజులు లేదా అవసరమైనంత కాలం కొనసాగుతాయని ట్రంప్ హెచ్చరించడంతో, ఇది మూడవ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా అనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఇరాన్‌లో అత్యవసర పరిస్థితి నెలకొంది. ఖమైనీ మరణవార్త నిజమైతే, అది ఇరాన్ రాజకీయ భవిష్యత్తును, మధ్యప్రాచ్య సమీకరణాలను పూర్తిగా మార్చివేస్తుంది.

Also Read: Samarlakota Blast: సామర్లకోట భారీ పేలుడు..ప్రధాని మోదీ దిగ్భ్రాంతి..మృతులకు రూ.2 లక్షలు ఎక్స్‌గ్రేషియా!

Also Read: Samarlakota Blast: ఏపీలో భారీ పేలుడు..18 మంది దుర్మరణం, చెల్లాచెదురుగా పడిన శరీర భాగాలు!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
RKRavi Kumar Sargam
Feb 28, 2026 18:30:56
Amaravathi, Andhra Pradesh:

AP Free Bus Scheme: ఆంధ్రప్రదేశ్‌లో స్త్రీ శక్తి పథకంలో భాగంగా మహిళలకు అమలవుతున్న ఉచిత బస్సుపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఉచిత బస్సును మహిళలతోపాటు దివ్యాంగులకు కూడా అమలు చేస్తామని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. తాజాగా దివ్యాంగులకు సంబంధించి ఉచిత బస్సు అమలు చేయాలనే నిర్ణయానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దివ్యాంగులకు ఉచిత బస్సు అమలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Also Read: KTR: రెండేళ్లలో రాజధాని హైదరాబాద్‌ను రేవంత్ రెడ్డి కుప్పకూల్చాడు: కేటీఆర్

దివ్యాంగుల సంక్షేమం, అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని.. దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దివ్యాంగులకు ఉచిత బస్సు అమలు చేస్తున్న సీఎం చంద్రబాబు నాయుడుకి మంత్రి డీఎస్ బీవీ స్వామి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలోని దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం  ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల దివ్యాంగుల సంక్షేమం కోసం ఇంద్ర ధనస్సులో భాగంగా ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు.

Also Read: Gold Fruad: మేడమ్‌ పేరిట బంగారు కడ్డీలతో మోసం.. కిలో బంగారంతో ఉడాయింపు

ఈ నేపథ్యంలో స్త్రీ శక్తి పథకంతో దివ్యాంగులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. స్త్రీ శక్తి పథకం వర్తించే అన్ని బస్సుల్లోనూ దివ్యాంగులకు ఉచిత బస్సు సౌకర్యం వర్తిస్తుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ సందర్భంగా దివ్యాంగులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి దివ్యాంగుల తరఫున దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ రాష్ట్ర మంత్రి డోలా  బాల వీరాంజనేయస్వామి కృతజ్ఞతలు తెలిపారు. 

ఈ సందర్భంగా మంత్రి డోలా  బాల వీరాంజనేయస్వామి మాట్లాడుతూ.. దివ్యాంగుల అభివృద్ధి, సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించామని తెలిపారు. దివ్యాంగులకు దేశంలో ఎక్కడా లేనివిధంగా రూ.6 వేలు పింఛన్ ఇస్తున్నట్లు గుర్తుచేశారు. దివ్యాంగుల బ్యాక్‌లాగ్ పోస్టులు మార్చిలోపు భర్తీ చేస్తామని  మంత్రి వీరాంజనేయ స్వామి చెప్పారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
RKRavi Kumar Sargam
Feb 28, 2026 17:15:20
Kakinada, Andhra Pradesh:

Vetlapalem Blast Victims: బాణాసంచా కేంద్రంలో భారీ పేలుడు సంభవించడంతో ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర విషాదం రేపింది. పెద్ద ఎత్తున శబ్దాలతో పేలుడు సంభవించడంతో కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో ఘోర ప్రమాదం సంభవించింది. మొత్తం 23 మంది మృతి చెందగా.. పదుల సంఖ్యలో క్షతగాత్రులకు గురయ్యారు. ఈ ప్రమాదంపై వెంటనే స్పందించిన సీఎం చంద్రబాబు ఘటనా స్థలాన్ని సందర్శించారు. అనంతరం మృతదేహాలను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. మృతుల కుటుంబాలకు భారీ పరిహారం ప్రకటించారు.

వేట్లపాలెం దుర్ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. మృతుల కుటుంబాలకు పరిహారం ఇచ్చారు. క్షతగాత్రుల్లో 9 మంది పరిస్థితి విషమంగా ఉన్నారని.. ఈ ఘటనకు బాధ్యులైన అధికారులను సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. విచారణ పూర్తయ్యాక బాధ్యులపై చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.20 లక్షల చొప్పున పరిహారం ఇస్తూ సీఎం చంద్రబాబు ప్రకటన చేశారు.

వేట్లపాలెం దుర్ఘటనలో గాయపడిన క్షతగాత్రులకు మెరుగైన వైద్య చికిత్స అందిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. బాధిత కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈ దుర్ఘటనలో పేలుడు పదార్థాల వద్ద జాగ్రత్తలు తీసుకోవడంలో నిర్వాహకులు విఫలమయ్యారని తెలిపారు. ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ ఘటనకు బాధ్యులైన యాజమాన్యానికి సంబంధించిన ఆస్తులు కూడా జప్తు చేస్తామని.. బాధిత కుటుంబాలకు సాయం చేస్తామని వివరించారు. అనుమతి లేకుండా బాణసంచా తయారు చేస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం చంద్రబాబు హెచ్చరించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
sidebar-img
Advertisement
Back to top