Back
Mancherial504251blurImage

జనహిత ఆధ్వర్యంలో మట్టి గణపతి ప్రతిమల పంపిణీ

KASARLA RAMESH
Sep 07, 2024 04:23:59
Bellampalle, Kannal Rural, Telangana
పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మట్టి గణపతులను పూజించాలని మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఆర్డీవో హరికృష్ణ, వన్ టౌన్ సీఐ దేవయ్యలు అన్నారు. శుక్రవారం పట్టణంలోని కాంట చౌరస్తా వద్ద జనహిత సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన మట్టి గణపతి ప్రతిమల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరై ప్రజలకు ప్రతిమలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రతి ఏడాది పర్యావరణ పరిరక్షణకై మట్టి ప్రతిమలు పంపిణీ చేస్తున్న జనహిత సేవా సమితి సభ్యులను అభినందించారు. కార్యక్రమంలో సేవా సమితి అధ్యక్షులు సతీష్, సభ్యులు పాల్గొన్నారు.
1
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com