icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Pinewz
504251
KASARLA RAMESHKASARLA RAMESHFollow7 Sept 2024, 04:23 am
0
0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

Govt Employees: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు సంచలన నిర్ణయం.. ఇక రేవంత్ రెడ్డి సర్కార్‌ భారీ తిరుగుబాటు

Baddipadaga, Telangana:

Telangana Govt Employees: ఎన్నికల సమయంలో అడ్డగోలు హామీఇచ్చిన కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక ఒక్కటీ కూడా నెరవేర్చకపోవడంతోపాటు కాలయాపన చేస్తూ తమను విస్మరిస్తుండడంపై ప్రభుత్వ ఉద్యోగులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. తమకు దక్కాల్సిన ప్రయోజనాలు, న్యాయపరంగా రావాల్సినవి ఇవ్వడంలో రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం మీనమేషాలు వేస్తుండడంపై ప్రభుత్వ ఉద్యోగ వర్గాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశంలోనే ఎక్కడ లేని విధంగా అత్యధికంగా డీఏలు పెండింగ్‌, వేల కోట్ల పెండింగ్‌ బిల్లులు, వందల మంది రిటైర్డ్‌ ఉద్యోగులు బెనిఫిట్స్‌ రాలేదు. దీనిపై చర్చలు, కమిటీలతో కాంగ్రెస్‌ ప్రభుత్వం కాలం వెళ్లదీస్తుండడంతో ఇక తట్టుకోలేక ప్రభుత్వ ఉద్యోగ వర్గాలు భారీ ఆందోళనకు సిద్ధమయ్యారు. ఈ మేరకు ఉద్యమ కార్యాచరణను ప్రకటించారు.

కాంగ్రెస్‌ సర్కార్‌పై తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు జంగ్ సైరన్ మోగించారు. పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించారు. కార్యాచరణలో భాగంగా జిల్లా కేంద్రాల్లో నల్లబ్యాడ్జిలతో నిరసన తెలపనున్నారు. అనంతరం సెప్టెంబర్ 10వ తేదీన ఛలో హైదరాబాద్‌కు ఉద్యోగ సంఘాలు పిలుపునిచ్చాయి. అన్నీ జిల్లాల నుంచి ఛలో హైదరాబాద్‌ కార్యక్రమానికి తరలివచ్చి రేవంత్‌ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ ఆందోళన చేపట్టాలని ఉద్యోగ సంఘాలు నిర్ణయించాయి. ఇప్పటికే చాలాసార్లు ప్రభుత్వం మాట విన్నామని.. ఇకపై రేవంత్‌ రెడ్డి ప్రభుత్వానికి తమ తడాఖా ఏంటో చూపిస్తామని ఉద్యోగ సంఘాల జేఏసీ హెచ్చరించింది. కొత్త వేతన సవరణ సంఘం (పీఆర్సీ)ని వెంటనే ప్రకటించాలని.. పెండింగ్‌లో ఉన్న ఆరు డీఏలను ఇవ్వాలని ఉద్యోగ జేఏసీ నాయకులు డిమాండ్‌ చేస్తున్న ప్రధాన విషయాలు. అవి చేయకుండా హెల్త్ కార్డులు ఇచ్చినా ఉపయోగం లేకుండా పోయాయని ఉద్యోగులు కాంగ్రెస్‌ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల జేఏసీ అధ్యక్షుడు మారం జగదీశ్వర్ కీలక వ్యాఖ్యలు చేశారు. 'జూన్ 2వ తేదీన అన్ని డిమాండ్స్ పరిష్కరిస్తామని రేవంత్‌ రెడ్డి చెప్పారు. హెల్త్ కార్డు విధి విధానాలు, ఏ ఆసుపత్రులు అనేది ఇప్పటివరకు స్పష్టత లేదు. ఏ ఆసుపత్రిలో ఏ చికిత్స చేస్తారని ఇప్పటికీ సమాచారం లేదు. మూడు నెలల నుంచి డబ్బులు కడుతున్నాం' అని వివరించారు. ఇక వేతన సవరణ సంఘం (పీఆర్‌సీ)పైన ఇంకా ఎలాంటి సమాచారం లేదని మారం జగదీశ్వర్ తెలిపారు. జూన్ 2వ తేదీన పీఆర్‌సీ అమలు చేస్తామని, జీపీఎస్‌ని మ్యానిఫెస్టోలో పెట్టి అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇప్పుడు మాట్లాడటం లేదని విమర్శించారు.

'రేవంత్‌ రెడ్డి పిలిచి మాట్లాడినప్పుడు దాని అమలు చేయాల్సిన బాధ్యత అధికారులది. కానీ ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇక ఆగే ఓపిక మాకు లేదు' అని ఉద్యోగ సంఘాల జేఏసీ అధ్యక్షుడు మారం జగదీశ్వర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంపై నిరసన తెలియజేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. 27వ తేదీ అన్ని ప్రభుత్వ కార్యాలయాల వద్ద  ధర్నా కార్యక్రమం చేపట్టబోతున్నట్లు వెల్లడించారు. సెప్టెంబర్ 10వ తేదీన ఛలో హైదరాబాద్ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. 'రేవంత్‌ రెడ్డి అధికారంలోకి వచ్చి మూడేళ్లు దాటినా ఇంకా పీఆర్‌సీ అమలు చేయలేదు. మీరు ఇస్తా అన్నదే మేము అడుగుతున్నాం. రిటైర్డ్ ఉద్యోగులు పెండింగ్ బిల్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది' అని ఉద్యోగ సంఘాల జేఏసీ అధ్యక్షుడు మారం జగదీశ్వర్ గుర్తుచేశారు.

0
0
Report

Hyderabad: రెండోసారి మాదే అధికారం.. 117 సీట్లు గెలవబోతున్నాం: రేవంత్‌ రెడ్డి

Hyderabad, Telangana:

Revanth Reddy: 'రెండోసారి 117 సీట్లు గెలుస్తున్నాం. కేసీఆర్‌ది కుటుంబ న్యాయం, నాది సామాజిక న్యాయం. కేసీఆర్‌ది దొరల న్యాయం, మాది సామాజిక న్యాయం. చెట్టుకు, పుట్టకు, రాయి, రప్పకు మొక్కుతున్నారు కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని. వందల ఎకరాల్లో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత ఫామ్‌హౌస్‌లు కట్టుకున్నారు' అని రేవంత్‌ రెడ్డి విమర్శలు చేశారు. తాము గ్రామగ్రామాన ఏడు లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తున్నట్లు చెప్పారు. దిశ సరిగా లేకపోతే దశ సరిగా ఉండదని.. ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటుచేసిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ సభలో ముఖ్యమంత్రి కీలక ప్రసంగం చేశారు. 'ప్రభుత్వ పాఠశాలల్లో సన్న బియ్యంతో భోజనం పెడుతున్నాం. నాణ్యమైన అల్పాహారం అందిస్తున్నాం. పాలు, రాగిజావ పిల్లలకు ఇస్తున్నాం. మన పిల్లలు రాజ్యాలు ఏలాలంటే చదువు ఒక్కటే పరిష్కారం. కష్టమైనా, నష్టమైనా పిల్లలను బడికి పంపించాలి. వాళ్లను చదివించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది' అని రేవంత్‌ రెడ్డి తెలిపారు. ప్రమాదవశాత్తు గౌడ సోదరులు చనిపోతే రూ.5 లక్షల పరిహారం చెల్లిస్తున్నట్లు వెల్లడించారు.

'అందెశ్రీ పాటకు విముక్తి కల్పించాం. గద్దర్ పేరును శాశ్వతంగా నిలిపాం. బీసీ కులగణన చేశాం. ఎస్సీ వర్గీకరణ చేశాం. నిరంతరం ప్రజల కోసం పనిచేస్తున్నాం. 36 వేల కోట్ల రూపాయల రైతు భరోసా ఇచ్చాం. 95 వేల కోట్ల రూపాయలతో ధాన్యం కొనుగోలు చేశాం. 60 వేల కోట్ల బ్యాంకు అనుసంధాన రుణాలను మహిళా సంఘాలకు ఇచ్చాం' అని ముఖ్యమంత్రి వెల్లడించారు. 'యంగ్ ఇండియా సమగ్ర పాఠశాలలను ప్రతి నియోజకవర్గంలో 200 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేస్తున్నాం. యంగ్ ఇండియా క్రీడా విశ్వవిద్యాలయం, క్రీడా అకాడమీని ప్రారంభించుకున్నాం' అని గుర్తుచేశారు.

'మేం చేసినవన్నీ చెబితే వాళ్లు ఇంట్లో నుంచి బయటకు రారు. చెబుతున్న అబద్ధాలను నమ్మడం లేదని కర్ణాటక, తమిళనాడుకు వెళ్లి అఘోరా రావు చేతబడి పూజలు చేయించి వచ్చాడు. కరువు రావాలని, రైతులు నష్టపోవాలని చేతబడి పూజలు చేస్తున్నారు. అధికారం కోసం ఇంతకు దిగజారుతారా?' అని అసహనం వ్యక్తం చేశారు. ఏది ఉన్నా మాట్లాడుకుని ముందుకు వెళ్దామని ప్రకటించారు.

'ఇది బహుజనుల తెలంగాణ. సామాజిక న్యాయం, జీవించడానికి స్వేచ్ఛ ఇందిరమ్మ పాలనలో ఉందని నిరూపించాం' అని తెలంగాణ సీఎం తెలిపారు. 'బహుజనుల నుంచి పుట్టుకొచ్చిన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్. ఆయన తన కులం, కుటుంబం కోసం మాత్రమే పనిచేయలేదు. బహుజనులతో కలిసి దండయాత్ర చేసి గోల్కొండ కోటపై జెండాను ఎగురవేశారు. ఆయన స్ఫూర్తి ఎప్పటికీ తెలంగాణ ప్రజలకు ఉండాలి' అని రేవంత్ రెడ్డి తెలిపారు. శివాజీ మాదిరి తెలంగాణలో బహుజనులు కూడా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి అంతే ప్రాధాన్యం ఇస్తారు. బహుజనుల కోసం పాపన్న గౌడ్‌ తన జీవితాన్ని అంకితం చేయడంతోనే ఆయనకు ఆ కీర్తి, గౌరవం దక్కింది' అని వివరించారు.

'పండుగ సాయన్న పోరాటం, పౌరుషం పాలమూరు జిల్లాలో అందరికీ తెలుసు. అక్టోబర్ 22న పండుగ సాయన్న జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుంది. ఈ ప్రభుత్వం సామాజిక న్యాయం, సంక్షేమం కోసం పనిచేస్తున్న ప్రభుత్వం. ఈ ప్రభుత్వం అందరిది' అని తెలంగాణ సీఎం ప్రకటించారు. 'మహేష్ గౌడ్ గాంధీభవన్‌లో కార్యనిర్వాహక అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నప్పుడు నేను, భట్టి విక్రమార్క రాష్ట్రం అంతా పాదయాత్ర చేశాం. పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, ముఖ్యమంత్రిగా నేను మళ్లీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకువస్తాం. మళ్లీ అధికారాన్ని తీసుకువస్తాం. గౌడన్నలు నూటికి నూరు శాతం సహకరించాలి' అని రేవంత్‌ రెడ్డి విజ్ఞప్తి చేశారు. 'గీత కార్మికుల వృత్తిని కాపాడే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది. అర్హులైన నేత, గీత కార్మికులు ఎంతమంది ఉన్నా అందరికీ పింఛన్లు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చా' అని తెలిపారు.

'ప్రభుత్వ పొలాల్లో ఈత, తాటి చెట్లు నాటేలా చూస్తాం. కాలువ గట్లపైన కూడా ఈత, తాటి చెట్లు నాటాలి. పిల్లల తలరాతలను మనం మార్చవచ్చు. ఈనాడు చైతన్యం వచ్చింది. కులవృత్తిని కొనసాగించండి, గౌరవించండి. కానీ పిల్లలను మాత్రం చదివించండి' అని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. విద్యార్థుల కోసం ఎన్ని కోట్లైనా కేటాయిస్తామని.. నాణ్యమైన విద్యతో పాటు భోజనం కూడా ఇస్తామని ప్రకటించారు.

0
0
Report

Poco M8x 5g: ఆగస్టు 21న Poco M8x 5G ఫోన్ లాంచ్‌.. 7900mAh బ్యాటరీ, ఇతర ఫీచర్లు ఇవే!

Hyderabad, Telangana:

Poco M8x 5g Price: ఎప్పటినుంచో మంచి కొత్త స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అది కూడా..ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే కొన్ని రోజుల తరబడి బ్యాకప్ బ్యాటరీని ఇచ్చే ఫోన్ కొనాలనుకుంటున్నారా? ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ పోకో మార్కెట్‌లోకి అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఇది మోస్ట్ పవర్‌ఫుల్ ఫీచర్స్‌తో పాటు హెవీ బ్యాటరీ సెటప్‌తో అందుబాటులోకి రాబోతోంది. ముఖ్యంగా దీనిని కంపెనీ Poco M8x 5G స్మార్ట్‌ఫోన్‌ పేరుతో లాంచ్‌ చేసేందుకు సిద్ధమైన్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్‌ ఇప్పుడు మార్కెట్‌లో చర్చనీయాంశంగా మారాయి. దీనికి సంబంధించిన ఫీచర్స్‌ ఏంటో? పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

7900mAh భారీ బ్యాటరీ..
ఈ ఫోన్‌లో అత్యంత ప్రధానమైన ఫీచర్ దీని బ్యాటరీగా భావించవచ్చు.. మార్కెట్‌లోకి విడుదల కాబోయే ఈ Poco M8x 5G మోడల్ ఏకంగా 7900mAh భారీ బ్యాటరీతో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా గంటల తరబడి గేమింగ్ ఆడినా, సినిమాలు చూసినా, ఇంటర్నెట్ బ్రౌజ్ చేసినా ఛార్జింగ్ త్వరగా అయిపోతుందనే భయం ఉండదని త్వరలోనే కంపెనీ క్లైమ్‌ చేసే అవకాశాలు కూడా ఉన్నట్లు లీక్‌ అయిన వివరాలు చెబుతున్నాయి. అలాగే ఇందులో ఫాస్ట్ ఛార్జింగ్‌ కోసం 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కూడా కలిగి ఉంటుంది.

అద్భుతమైన డిస్‌ప్లే, పవర్‌ఫుల్ ప్రాసెసర్..
ఈ Poco M8x 5G మొబైల్‌లో లేటెస్ట్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 5 (Snapdragon 4 Gen 5 - 4nm) ప్రాసెసర్‌ను కూడా కలిగి ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.. భారీ గేమింగ్ సమయంలో మొబైల్ వేడెక్కకుండా ఉండేందుకు అద్భుతమైన ట్రిపుల్ కూలింగ్ సొల్యూషన్ (Thermal Management) కూడా కంపెనీ అందించిన్నట్లు లీక్‌ అయిన వివరాలు చెబుతున్నాయి.. ఇక డిస్‌ప్లే విషయానికి వస్తే.. ఇందులో కంపెనీ 6.9-అంగుళాల భారీ ఐపీఎస్ ఎల్‌సీడీ (IPS LCD) డిస్‌ప్లేను కూడా కలిగి ఉంటుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో అందుబాటులోకి రానుంది. 

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

కెమెరా, ఓఎస్ ఫీచర్లు..
కెమెరా ప్రియుల కోసం.. ఈ ఫోన్ వెనుకభాగంలో 50 మెగాపిక్సెల్ ప్రధాన సెన్సార్‌తో కూడిన కెమెరా సెటప్‌ను కూడా కలిగి ఉంటుంది.. అలాగే అద్భుతమైన సెల్ఫీలు, మంచి వీడియో కాల్స్ కోసం.. ఇందులోని ఫ్రంట్‌ భాగంలో 8 మెగాపిక్సెల్ కెమెరాను కూడా అందుబాటులోకి తీసుకు వచ్చింది.. ఆండ్రాయిడ్ 16 (Android 16) ఆధారిత పోకో హైపర్ ఓఎస్ (Poco HyperOS) తో ఈ స్మార్ట్‌ఫోన్‌ చాలా అద్భుతంగా పనిచేసే అవకాశాలు కూడా ఉన్నాయి. 

ఇటీవలే అందుబాటులోకి వచ్చిన సమచారం ప్రకారం.. ఈ Poco M8x 5G స్మార్ట్‌ఫోన్‌ను ఆగస్టు 21న భారత మార్కెట్లో అధికారికంగా లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.. అన్ని ప్రీమియం ఫీచర్లు ఉన్నప్పటికీ.. బడ్జెట్ యూజర్లను దృష్టిలో ఉంచుకుని దీని ధర కేవలం రూ.19,999కే లాంచ్‌ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది..  

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report
Advertisement

Vivo నుంచి మరో పవర్‌ఫుల్ 5G ఫోన్.. 1.5K అమోలెడ్ డిస్‌ప్లే, అదిరిపోయే లుక్స్!

Hyderabad, Telangana:

Vivo V80 Lite 5g Launching Soon: భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో అద్భుతమైన ముద్ర వేసుకున్న ప్రముఖ దిగ్గజం వివో మరో సంచలనానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. మోస్ట్ పవర్‌ఫుల్‌ ఫీచర్స్‌తో అద్బుతమైన స్మార్ట్‌ఫోన్‌ విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది.. ముఖ్యంగా ఇందులో అతి పెద్ద బ్యాటరీని కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అయితే, వీవో కంపెనీ మోస్ట్ అవేటెడ్ Vivo V80 Lite 5G స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఇది గత మోడల్స్‌ కంటే చాలా అద్భుతమైన డిజైన్‌ను కూడా కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. 

ప్రస్తుతం లీక్‌ అయిన వివరాల ప్రకారం.. మొదట కంపెనీ Vivo V80 Lite 5G స్మార్ట్‌ఫోన్‌ను అధికారికంగా భారత మార్కెట్‌లో లాంచ్‌ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా గూగుల్ ప్లే కన్సోల్ (Google Play Console) లిస్టింగ్‌లో ఈ మోడల్ అందుబాటులోకి రావడం విశేషం. ఇందులో భాగంగా అనేక రకాల ఫీచర్స్‌ కూడా లీక్‌ అయ్యి అందుబాటులోకి వచ్చాయి..

అద్భుతమైన డిజైన్.. 
ప్రముఖ టిప్‌స్టర్ అందించిన సమాచారం ప్రకారం.. ఈ Vivo V80 Lite 5G ఫోన్ ప్రీమియం మెటల్ ఫ్రేమ్‌తో పాటు చాలా అద్భుతమైన కర్వ్‌డ్ డిస్‌ప్లే డిజైన్‌తో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది.. ఇందులో సెల్ఫీ కెమెరా కోసం ప్రత్యేకంగా హోల్-పంచ్ కటౌట్‌ను కూడా తీసుకు రాబోతోంది.. ముఖ్యంగా ఇందులో నీలం (Blue)తో పాటు తెలుపు (White) వంటి ప్రీమియం కలర్‌ ఆప్షన్స్‌లో యూజర్లను ఆకట్టుకునేలా ఇది రూపొందించిన్నట్లు తెలుస్తోంది.. 

ఇందులో కంపెనీ 6.83-అంగుళాల 1.5K అమోలెడ్ (AMOLED) డిస్ల్పేను అందిస్తున్నట్లు తెలుస్తోంది.. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో పాటు 3,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ గేమ్స్ ఆడేటప్పుడు, వీడియోలు చూసేటప్పుడు వినియోగదారుడికి మైండ్‌బ్లోయింగ్ విజువల్ ఎక్స్‌పీరియన్స్‌ను పక్కాగా అందిస్తాయని లీక్‌ అయిన వివరాలు చెబుతున్నాయి..

కెమెరా క్వాలిటీకి పెట్టింది పేరైన Vivo.. ఈ ఫోన్‌లోనూ అద్భుతమైన కెమెరా సెటప్‌ను అందించబోతున్నట్లు తెలుస్తోంది.. ఫోన్ వెనుక భాగంలో 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో పాటు ఫ్రంట్‌ భాగంలో భాగంలో వీడియో కాలింగ్స్, సూపర్ సెల్ఫీల కోసం 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉండబోతున్నట్లు లీక్‌ అయిన వివరాలు చెబుతూ ఉన్నాయి..

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

ఈ ఫోన్‌కు సంబంధించిన అతిపెద్ద హైలైట్ బ్యాటరీ భావించవచ్చు. ఇందులో ఏకంగా 7,050mAh భారీ బ్యాటరీని అందించబోతున్నట్లు తెలుస్తోంది.. దీనితో పాటు అత్యంత ఫాస్ట్‌గా ఛార్జ్ అయ్యేందుకు 44W ఫ్లాష్‌ఛార్జ్ (FlashCharge) సపోర్ట్‌ను కూడా అందుబాటులోకి తీసుకు రావడం విశేషం.. దీనివల్ల ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే రోజులకు తరబడి బ్యాటరీ లైఫ్ అందిస్తున్నట్లు తెలుస్తోంది.. ఇందులో అద్బుతమైన MediaTek Dimensity 7360 Turbo ప్రాసెసర్‌ను అందించనున్నట్లు తెలుస్తోంది. 

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report

Ganesh Mandap: బండి సంజయ్‌ శుభవార్త.. గణేష్ మండపాలన్నింటికీ ఉచిత కరెంట్

Karimnagar, Telangana:

Free Electricity: వినాయక చవితి సందర్భంగా గణేశ్‌ మండపాలకు ఉచితంగా విద్యుత్‌ ఇస్తామని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ కుమార్‌ ప్రకటించారు. కరెంట్ ఛార్జీలన్నీ కరీంనగర్ కార్పొరేషన్ చెల్లించాలని నిర్ణయం తీసుకుందని తెలిపారు. దాదాపు 2 వేల గణేష్ మండపాలకు ఉచిత కరెంట్ సరఫరా చేయాలని చెప్పారు. ట్రాఫిక్‌కు, ప్రజలకు ఇబ్బంది లేకుండా గణేశ్ మండపాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఉత్సాహంగా భక్తియుత వాతావరణంలో గణేశ్ ఉత్సవాలు నిర్వహించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
 
కరీంనగర్‌లోని 21వ డివిజన్‌లో సీసీ రోడ్డు, డ్రెయిన్ నిర్మాణ పనులకు కేంద్ర మంత్రి బండి సంజయ్‌ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బండి సంజయ్ మాట్లాడుతూ.. తనను గెలిపించిన కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం అభివృద్ధి కోసం అహర్నిశలు పనిచేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటివరకు రూ.22 వేల కోట్ల నిధులతో అనేక అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. వాటిలో రూ.5 వేల కోట్లతో జాతీయ రహదారులను నిర్మించినట్లు వెల్లడించారు. ప్రతి గ్రామానికి రూ.5 లక్షల చొప్పు నిధులు ఇచ్చానని, రాబోయే రోజుల్లో పెద్ద మొత్తంలో నిధులిచ్చి గ్రామాలను అభివృద్ధి చేస్తానని బండి సంజయ్‌ తెలిపారు.

తనను నమ్మి కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌ను బీజేపీకి అప్పగించిన ప్రజల రుణం తీర్చుకునేందుకు వంద రోజుల్లోనే రూ.840 కోట్ల యూసీఎఫ్ నిధులను తీసుకొచ్చినట్లు బండి సంజయ్‌ వివరించారు. ఇప్పటికే స్మార్ట్‌సిటీ పేరుతో రూ.940 కోట్ల నిధులు తెచ్చి కరీంనగర్‌ను అభివృద్ధి చేసినట్లు వెల్లడించారు. వరంగల్‌కు స్మార్ట్ సిటీ నిధులొచ్చినప్పటికీ అక్కడ అభివృద్ధికి నోచుకోలేదని చెప్పారు. తనపై నమ్మకం ఉంచిన కరీంనగర్‌ను అభివృద్ధి, ఉత్సవాల నిర్వహణలో తెలుగు రాష్ట్రాల్లోనే అగ్రభాగాన ఉంచేందుకు తాను తన శక్తిమేర కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. ఎన్నికల వరకే రాజకీయాలు అని.. ప్రస్తుతం అభివృద్ధి లక్ష్యంగా రాజకీయాలకు అతీతంగా కార్పొరేటర్లంతా కలిసికట్లుగా ఉంటూ కరీంనగర్‌ను అభివృద్ధి చేసుకోవాలని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ కోరారు.

అంతకుముందు కరీంనగర్‌లోని 16వ డివిజన్ లక్ష్మీపూర్, మల్కాపూర్ కాలనీలో 15వ ఆర్ధిక సంఘం నిధులకు సంబంధించి రూ.15 లక్షల వ్యయంతో చేపట్టిన వాటర్ పైపులైన్ నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. కార్యక్రమంలో కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, కమిషనర్ ప్రపుల్ దేశాయ్, స్థానిక కార్పొరేటర్టులు తదితరులు ఉన్నారు.

0
0
Report

Viral Video: జామకాయలు కడగకుండా తింటున్నారా? ఈ వీడియో చూస్తే ఇక ముట్టుకోరు..

Hyderabad, Telangana:

 Instagram Guava Viral Video: మన ఆరోగ్యానికి పండ్లు ఎంత మంచివో.. మనందరికీ తెలుసు.. అందులో ఎక్కువగా చాలా మంది జామకాయలను ఇష్టపడి తింటూ ఉంటారు. అంతేకాకుండా చాలా మంది దీనిని పోషకాల గనిగా కూడా పిలుస్తూ ఉంటారు. అయితే, చాలా మంది ఇవి శరీరానికి చాలా మంచివని శుభ్రం చేయకుండా మరీ తింటూ ఉంటారు. ఇలా అనుకుని తింటే పప్పులో కాలేసినట్లేనని ఈ వీడియో నిరూపిస్తోంది.. సాధారణంగా మార్కెట్‌లో నుంచి కొనుకున్ని వచ్చిన పండ్లును తినేందుకు శుభ్రం చేసే క్రమలో ఊహించని ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..

సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి ఎప్పుడూ ఏదో ఒక వెరైటీ వీడియో ట్రెండ్ అవుతూనే ఉంటుంది.. తాజాగా ఇన్ స్టాగ్రామ్‌లో పూజా మహేశ్వరి (@the_denimgirl) అనే యువతి షేర్ చేసిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది... పూజకు జామకాయలను ఇంటికి తీసుకువచ్చిన్న ఆ యువతి.. జామకాలను కడిగేందుకు నీటిలో వేసింది. అంతే అక్కడ ఏం జరిగిందో చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే..

నీటిలో వేస్తే ఏం జరిగింది..?
రెండు గంటల తర్వాత జామకాయలను అలాగే ఉంచి చూడడగా.. ఓ ఊహించని ఘటన చోటు చేసుకుంది.. నీటిలో నానబెట్టిన జామకాయ పై పొర నుంచి నెమ్మదిగా చిన్న చిన్న పురుగులు బయటికి రావడం మీరు గమనించవచ్చు. అంతేకాకుండా ఆ పురుగులు చూడడానికి చాలా చిన్నవిగా, తెలుపు రంగులో ఉండడం మీరు క్లియర్‌గా చూడొచ్చు.. అయితే, ఈ పురుగులు చాలా చిన్నవిగా ఉండడం వల్ల కనిపించడం చాలా కష్టమైంది..

 
 
 
 
 

Also Read: పోలీస్ వ్యాన్‌ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!

అయితే, ఏమి తెలియని వారు.. కేవలం నీటిలో అలా కడిగేసి తినేస్తే.. అంతే సంగతి.. తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే, ఇప్పుడు వైరల్ అవుతున్న ఈ నీటి ట్రిక్ (Water Trick) చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.. ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో.. దీనిపై సోషల్ మీడియా వినియోగదారులు రకరకాలుగా స్పందిస్తున్నారు. అయ్యో.. ఇన్నాళ్లు ఇలాగే కడగకుండా ఎన్ని పురుగులను తినేశామో.. అంటూ కొందరు ఆందోళన పడుతూ కామెంట్లు పెడుతున్నారు.. మరికొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు.. ముఖ్యంగా వర్షాకాలంలో జామకాయలకు దూరంగా ఉండటమే మంచిది.. అని సలహా ఇస్తున్నారు. వర్షాకాలంలో పండ్లు తినే క్రమంలో తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. 

Also Read: పోలీస్ వ్యాన్‌ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

  

0
0
Report
Advertisement

12 Feet Long Girinagu: రెండు రోజుల్లో రెండు ఘటనలు.. అనకాపల్లి జిల్లాలో భారీ గిరినాగుల కలకలం

Sabbavaram, Andhra Pradesh:

Girinagu Snake: అటవీ ప్రాంతమైన అనకాపల్లి జిల్లాల్లో వరుసగా భారీ గిరినాగులు కలకలం సృష్టిస్తున్నాయి. అత్యంత పొడవైన.. తీవ్ర విషపూరితమైన భారీ గిరినాగులు వరుసగా రెండు రోజుల్లో రెండుసార్లు కనిపించాయి. చాలా ప్రమాదకరమైన గిరినాగులు జనావాసాల్లో కనిపించడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. వరుస సంఘటనలతో స్థానికులు భయపడుతుండగా.. అటవీ శాఖ అధికారులు వెంటనే స్పందించి భారీ పాములను బంధిస్తున్నారు.

అనకాపల్లి జిల్లా దేవరాపల్లి మండలం గరిసింగి గ్రామంలో భారీ గిరినాగు ప్రజలను హడలెత్తించింది. గ్రామంలోని అద్దిపల్లి విశ్వేశ్వరావు, కరణం సత్యవతి ఇళ్ల గోడ సందులో సుమారు 13 అడుగుల భారీ గిరినాగు ప్రత్యక్షమైంది. ఉదయం ఇటుకలు తీయడానికి నివాసితులు ప్రయత్నాలు చేయగా అక్కడ బుసలు కొడుతూ భారీ గిరినాగు కంటపడడంతో స్థానికులు భయాందోళనతో పరుగులు తీశారు. ఇది గమనించిన కుటుంబసభ్యులు వెంటనే చోడవరం అటవీ అధికారులకు సమాచారం అందించారు. తూర్పు కనుమల వన్యప్రాణుల సంరక్షణ సమితి సభ్యులతోపాటు అటవీ శాఖ అధికారులు వెంటనే అక్కడకు చేరుకుని సమాచారం అందించారు.

వెంటనే తూర్పు కనుమల వన్యప్రాణుల సంరక్షణ సమితి సభ్యులైన ప్రసాద్‌, కృష్ణ, ఇషాక్ అక్కడకు చేరుకుని భారీ గిరినాగును బంధించేందుకు తీవ్రంగా శ్రమించారు. పామును బయటకు తీయగా 12 అడుగుల పొడవు ఉండి బుసలు బుసలు కొడుతూ కనిపించడంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళన వ్యక్తం చేశారు. దాదాపు గంట సేపు శ్రమించి ఎట్టకేలకు భారీ గిరినాగును బంధించారు. అనంతరం అక్కడి నుంచి తీసుకుని చీడికాడ సమీపంలోని దట్టమైన అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు.

మొన్న పశువుల పాక వద్ద
ఇదే జిల్లాలో ఈనెల 16వ తేదీన భారీ గిరినాగు కలకలం సృష్టించింది. అనకాపల్లి జిల్లా చీడికాడ మండలం ఖండివరం గ్రామంలో ఓ పశువుల పాక వద్ద 13 అడుగుల భారీ గిరినాగు ప్రత్యక్షమైంది. ఆ పామును చూసిన స్థానిక ప్రజలు భయాందోళన వ్యక్తం చేశారు. వెంటనే గ్రామస్తులు మాడుగులకు చెందిన స్నాక్‌ క్యాచర్‌ వెంకటేశ్‌కు సమాచారం ఇచ్చారు. అతడు గ్రామానికి చేరుకుని దాదాపు గంటన్నర పాటు శ్రమించి గిరినాగును బంధించాడు. ఆ పాము 13 అడుగుల పొడవు.. ఆరున్నర కిలోల బరువు ఉందని అతడు చెప్పాడు. అనంతరం ఆ పామును సురక్షితంగా సమీపంలోని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు.

0
0
Report

Kavitha: రేవంత్ రెడ్డి రాక్షస రాజ్యం నడుస్తోంది.. ఏడుగురు అన్నదమ్ముల భూదోపిడీ: కవిత

Hyderabad, Telangana:

Revanth Reddy Seven Brothers: 'కాంగ్రెస్ పార్టీలో ఒక్కొక్కరికి  ఒకలా సామాజిక న్యాయం ఉంటుంది. ఎక్కడ చూసినా రేవంత్ రెడ్డి ఏడుగురు అన్నదమ్ములపైనే చర్చ జరుగుతుంది. వాళ్లు అందరూ భూములను దొంగతనం చేస్తున్నారు. ఎక్కడ చూసినా కబ్జాలే' అని తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలు కవిత తీవ్ర ఆరోపణలు చేశారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి రాక్షస రాజ్యం నడుస్తోందని విమర్శించారు. సామాజిక న్యాయం అనేది ఎక్కడ ఉందని మాజీ ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు.

హైదరాబాద్‌లోని తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో మంగళవారం మీడియాతో మాట్లాడుతూ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. మీనాక్షి నటరాజన్‌ను ఓడగొట్టింది రేవంత్‌ రెడ్డి కదా? అని తెలిపారు. సామాజిక న్యాయం కూడా అనని రేవంత్‌ రెడ్డి సామాజిక న్యాయంపై మాట్లాడుతున్నారని.. ఆయనను ప్రజలు ఎవరూ నమ్మొద్దు అని విజ్ఞప్తి చేశారు. మంత్రివర్గంలో సామాజిక న్యాయం ఎక్కడ? ఇద్దరు బీసీలకు మంత్రి పదవులు ఇస్తే 33 శాతం అమలు జరిగినట్టా? అని నిలదీశారు. శివధర్ రెడ్డికి జీతం, వీహెచ్‌కు ఇచ్చిన ర్యాంక్ జీతం  ఎంత? ఎందుకు వ్యత్యాసం? అని ప్రశ్నించారు. ఆర్‌టీఐలో అగ్రవర్ణాలు వాళ్లు ఉన్నారు. రేవంత రెడ్డి చెప్పేది సామాజిక న్యాయం.. పాటించేది ఆటవిక న్యాయం అని విమర్శించారు. 

'రేవంత్ రెడ్డి రాక్షస రాజ్యం నడుస్తుంది. 30 వేల ఎకరాల అసైన్డ్ ల్యాండ్ లాక్కున్నారు. భూమి లేని పేద బిడ్డ కి భూమి దక్కాలి. తెలంగాణ సమాజంలో గుణాత్మక మార్పు రావాలంటే పేదలకు భూపంపిణీ జరగాల్సిందే. సామాజిక న్యాయం కోసం మే ప్రతిపాదిస్తున్న విప్లవాత్మక పథకం ‘భూలక్ష్మి’. భూమి లేని ప్రతి పేదింటి కుటుంబానికి ఎకరం భూమి అందించి, వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టడమే తెలంగాణ రక్షణ సేన లక్ష్యం' అని కవిత ప్రకటించారు.

రెండేళ్లలో 5 లక్షల 96 వేల కోట్ల బడ్జెట్ పెడితే 56 శాతం ఉన్న బీసీల కోసం ఖర్చు చేసింది 0.999 శాతం మాత్రమేనని మాజీ ఎమ్మెల్సీ కవిత వివరించారు. ఇదేనా రేవంత్‌ రెడ్డి చెప్పిన సామాజిక న్యాయం? అని ప్రశ్నించారు.

0
0
Report
Advertisement

Tirumala: తిరుమల శ్రీవారి సేవలో క్రికెటర్‌ తిలక్‌ వర్మ.. పలువురు ప్రముఖులు

Tirupati Urban, Andhra Pradesh:

Tirumala VIPs Darshan: ఆపద మొక్కులవాడు కొలువుదీరిన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించేందుకు భారీ ఎత్తున భక్తులు వస్తున్నారు. వారాంతం ముగిసినా కూడా తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. తిరుమల ఆలయాన్ని సందర్శించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. మంగళవారం పలువురు ప్రముఖులు స్వామిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఎవరెవరు శ్రీవారిని దర్శించుకున్నారో తెలుసుకుందాం.

తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు సుప్రభాత సేవలో దర్శించుకున్నారు. మంగళవారం తెల్లవారుజామున శ్రీవారి ఆలయంలో నిర్వహించిన సుప్రభాత సేవలో భారత క్రికెట్‌ జట్టు ఆటగాడు తిలక్ వర్మ, ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ నారాయణ్ సింగ్ పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. సుప్రభాత సేవ అనంతరం ప్రముఖులకు రంగనాయక మండపంలో ఆలయ అర్చకులు, టీటీడీ అధికారులు ఆశీర్వచనం అందించారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలు అందజేశారు. దర్శనం అనంతరం ప్రముఖులు తిరుమల ఆలయ విశేషాలను తెలుసుకున్నారు. ప్రముఖుల పర్యటన నేపథ్యంలో తిరుమల ఆలయ పరిసరాల్లో అధికారులు ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.

కొనసాగుతున్న భక్తుల రద్దీ
ఇక తిరుమలలో దర్శనానికి సంబంధించిన సమాచారాన్ని టీటీడీ అధికారులు వెల్లడించారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆగస్టు 17వ తేదీన శ్రీవారిని మొత్తం 79,445 భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారికి 36,834 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.4.80 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు వెల్లడించారు. లడ్డూ విక్రయాలు 3.95 లక్షలు జరగ్గా.. అన్నప్రసాదాలు 3.39 లక్షల మంది భక్తులు స్వీకరించారు. భక్తుల రద్దీ కొనసాగుతుండడంతో సుమారు సర్వదర్శనం కోసం అంటే ఎస్‌ఎస్‌డీ టోకెన్‌లు లేని భక్తులకు దర్శనానికి 20 నుంచి 24 గంటల సమయం పడుతుంది. దీంతో కంపార్ట్‌మెంట్లు అన్ని నిండి శిలాతోరణం వరకు భక్తుల క్యూ లైన్ కొనసాగుతోంది.

వేడుకగా గరుడ పంచమి
తిరుమలలో సోమవారం భక్తిశ్రద్ధలతో గరుడ పంచమి నిర్వహించారు. సోమవారం రాత్రి 7 గంటలకు శ్రీమలయప్పస్వామి తన ఇష్టవాహనమైన గరుడుడిపై తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. ప్రతి ఏటా శుక్లపక్షం ఐదో రోజున గరుడ పంచమి వేడుకలను తిరుమలలో నిర్వహించడం ఆనవాయితీ. వైవాహిక జీవితం సుఖసంతోషాలతో సాగాలని కొత్త దంపతులు, తమకు పుట్టే సంతానం గరుడుడిలా బలశాలిగా ఉండాలని మహిళలు ఈ సందర్భంగా గరుడ పంచమి పూజలు నిర్వహించారు.

0
0
Report
Advertisement

TIMS Hospital: ప్రతి ఆరు నెలలకు ఒక ఆస్పత్రిని ప్రారంభిస్తాం: రేవంత్ రెడ్డి

Hyderabad, Telangana:

Hyderabad: 'మేం అధికారంలోకి వచ్చిన తరవాత విద్య, వైద్యాన్ని ప్రాధాన్యంగా తీసుకున్నాం. పేదల ఆరోగ్యాన్ని బాధ్యతగా భావిస్తున్నాం. పేదలు కార్పొరేట్ ఆసుపత్రిలో ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తోంది. ఆఖరికి కిడ్నీలు కూడా అమ్ముకుంటున్నారు' అని తెలంగాణ సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. '32 నెలలు పరిపాలనలో రూ.2,222 కోట్లు ఆరోగ్య శాఖకు ఖర్చు పెట్టాం. రూ.5,626 కోట్లు కేవలం వైద్యం కోసమే ఖర్చు చేశాం. రూ.21,800 కోట్లు ఈ శాఖలు ఖర్చు చేశాం. జాగ్రత్తగా రూపాయి రూపాయి కూడబెట్టి వైద్యానికి ఖర్చు పెడుతున్నాం' అని రేవంత్‌ రెడ్డి వివరించారు. ఉస్మానియా ప్రభుత్వ ఆస్పత్రి కూలిపోవడానికి సిద్ధంగా ఉంటే పదేళ్లు అధికారంలో ఉన్నవాళ్లకి వేరే దగ్గర ఆసుపత్రి నిర్మించాలనే ఆలోచన రాలేదు అని విమర్శించారు.

హైదరాబాద్ సనత్‌నగర్‌లో నిర్మించిన అత్యాధునిక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌ (టిమ్స్‌)ను ప్రారంభించిన తర్వాత ముఖ్యమంత్రి కీలక ప్రసంగం చేశారు. 'ఎల్బీనగర్‌, అల్వాల్‌ టిమ్స్‌కి టెంకాయ కొట్టి నిధులు కేటాయించలేదు. ప్రతి ఆరు నెలలకోసారి ఆసుపత్రిని ప్రారంభిస్తాం. కార్పొరేట్ దీటుగా పరిశుభ్రంగా ఆసుపత్రిని నిర్వహణ చేస్తాం' అని తెలంగాణ సీఎం తెలిపారు. వైద్యులను అదనపు సమయం చేయమని చెప్పాలని.. వారికి ప్రోత్సాహకాలు ఇద్దామని అధికారులకు చెప్పారు. తమకు కష్టం ఉంటే తెలంగాణ ప్రభుత్వం ఉందని. ఆదుకోవడానికి తామున్నామనే నమ్మకం కలిగించాలని అధికార యంత్రాంగానికి ముఖ్యమంత్రి ఆదేశించారు.

'సనత్‌నగర్ ఎమ్మెల్యే (తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌) కేటీఆర్‌ని తీసుకొచ్చి ఈ ఆసుపత్రిని మేమే కట్టాం అని చూపించారు. ఇక కేటీఆర్ టిమ్స్ నేనే కట్టిన అన్నారు. ఇక హైదరాబాద్ కట్టినది నేనే అన్నది. మీ నాయన ఫామ్‌హౌస్‌లు, మీ చెల్లులు, మీ బావ ఫామ్‌హౌస్‌లు కట్టుకున్నారు. మరి మా పేదలకు ఒక్క ఆసుపత్రి కట్టలేకపోయారు' అని విమర్శించారు. కరువు రావాలని అఘోర్ పూజలు చేయడం మానేసి నల్లమల పోయి పూజా చేస్తే మీ దోచుకున్న రూ.లక్ష కోట్లలో నియోజకవర్గానికో రూ.పది కోట్ల ఖర్చు పెడితే కొంత పాపం తగ్గుతుంది' అని ప్రతిపక్షాలపై మండిపడ్డారు. 

అంతకుముందు ఆసుపత్రిలోని వివిధ విభాగాలను పరిశీలించారు. కార్డియో, రీనల్, ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంట్ సైన్సెస్ విభాగాల్లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేసిన ఆపరేషన్ థియేటర్లు, పోస్ట్‌ఆపరేటివ్ వార్డు, ట్రామా విభాగం, ఐసీయూ వంటి విభాగాలను మంత్రులతో కలిసి క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు.

చికిత్స కోసం వచ్చే వారి నమోదు, రిసెప్షన్‌లో టోకెన్ డిస్పెన్సర్ యంత్రం పని తీరు, ఓపీ కౌంటర్ పనితీరును ముఖ్యమంత్రి పరిశీలించారు. ఆయా విభాగాల వైద్యులు, నర్సింగ్ సిబ్బందితో మాట్లాడి.. అత్యాధునిక వైద్య పరికరాలను పరిశీలించి వాటి పనితీరు అడిగి తెలుసుకున్నారు. నిర్వహణలో ఎలాంటి లోపాలు లేకుండా మంచి వైద్య సేవలు అందించాలని వైద్య సిబ్బందికి సీఎం సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్‌ తదితరులు ఉన్నారు.
 

0
0
Report

Tirumala Reels: సోషల్ మీడియా రీల్స్‌కు అడ్డాగా మారిన తిరుమల.. మరోసారి రీల్స్ కలకలం

Tirupati Urban, Andhra Pradesh:

Tirumala Temple: పరమ పవిత్ర క్షేత్రం తిరుమల ఆలయం సోషల్‌ మీడియా పిచ్చి ఉన్న వారికి అడ్డాగా మారింది. రీల్స్‌కు కేరాఫ్‌గా తిరుమల ఆలయ పరిసరాలు మారాయి. తిరుమల కొండపై రీల్స్‌ చేస్తూ కొందరు హల్‌చల్‌ చేస్తున్నారు. పవిత్రంగా.. భక్తిప్రపత్తులతో తిరుమల కొండపై ఉండాల్సి ఉండగా తమ వ్యూస్‌ కోసం రీల్స్‌ చేస్తున్నారు. గతంలో ఇలాంటివి చాలా జరగ్గా తాజాగా తిరుమలలో మరోసారి రీల్స్‌ చేశారు. ఓ కుటుంబం తిరుమల కేంద్రంగా రీల్స్‌ చేయడం వివాదానికి దారి తీసింది.

శ్రీవారి దర్శనానికి వెళ్తూ దేవుడి పేరుతో ఓ జంట రీల్స్ చేసింది. సర్వదర్శనం క్యూలైన్‌లో రీల్స్ చేసినట్లు ఆ వీడియో చూస్తే అర్థమవుతోంది. అంతేకాకుండా రాంబగీచా వద్ద కూడా ఆ కుటుంబం రీల్స్ చేసింది. దర్శనానికి వచ్చే భక్తుల మధ్యే వీడియోల చిత్రీకరణ చేశారు. తిరుమలలో రీల్స్‌పై మరోసారి సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. రీల్స్ చేసిన వారిని కామెంట్ల రూపంలో నెటిజన్లు  ప్రశ్నిస్తున్నారు. శ్రీవారి దర్శనానికి వస్తున్నారా..? పబ్లిసిటీ కోసం వస్తున్నారా..? అంటూ నిలదీస్తున్నారు.

భక్తి పేరుతో సోషల్ మీడియాలో ప్రచారం కోసం రీల్స్ చేస్తున్నారంటూ విమర్శలు వస్తున్నాయి. లైక్స్, వ్యూస్ కోసం తిరుమలలోనే రీల్స్ చేస్తున్నారంటూ నెటిజన్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది కావాలనే రీల్స్ చేసి వార్తల్లోకి వస్తున్నారంటూ నెటిజన్లు కామెంట్లు వేస్తున్నారు. తిరుమల పవిత్రతకు భంగం కలిగించవద్దంటూ భక్తులు వేడుకుంటున్నారు. దర్శన క్యూలైన్లలో ఇతర భక్తులకు ఇబ్బంది కలిగించేలా రీల్స్‌ చేస్తుండడంతో తీవ్ర దుమారం రేపుతోంది. తిరుమలలో రీల్స్ సంస్కృతి‌పై టీటీడీ మరింత కఠినంగా వ్యవహరించాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. పవిత్ర పుణ్యక్షేత్రంలో భక్తి వాతావరణం పెంపొందించేలా టీటీటీ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. 

బ్రహ్మోత్సవాలకు భారీ ఏర్పాట్లు
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి. సెప్టెంబర్ 15 నుంచి 23వ తేదీ వరకు జరగనున్న బ్రహ్మోత్సవాల నేపథ్యంలో శ్రీవారి పుష్కరిణి వద్ద చేపడుతున్న మరమ్మతు పనులను టీటీడీ అదనపు ఈవో సీహెచ్‌ వెంకయ్య చౌదరి పరిశీలించారు. బ్రహ్మోత్సవాలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉండడంతో పుష్కరిణి వద్ద భక్తుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులకు సూచించారు.

శ్రీవారి పుష్కరిణిలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన ప్రాంతాల్లో గ్రిల్స్ ఏర్పాటు చేయాలని అదనపు ఈవో అధికారులను ఆదేశించారు. పుష్కరిణి లోతు భక్తులకు స్పష్టంగా తెలిసేలా సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలని చెప్పారు. బ్రహ్మోత్సవాల సమయంలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పుష్కరిణి వద్ద భద్రతా ఏర్పాట్లు పటిష్టంగా ఉండాలని సూచించారు. మరమ్మతు పనులను త్వరితగతిన పూర్తి చేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని అధికారులకు ఆదేశించారు.

0
0
Report
Advertisement
Advertisement
Back to top