జనహిత ఆధ్వర్యంలో మట్టి గణపతి ప్రతిమల పంపిణీ
Bellampalle, Kannal Rural, Telangana:పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మట్టి గణపతులను పూజించాలని మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఆర్డీవో హరికృష్ణ, వన్ టౌన్ సీఐ దేవయ్యలు అన్నారు. శుక్రవారం పట్టణంలోని కాంట చౌరస్తా వద్ద జనహిత సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన మట్టి గణపతి ప్రతిమల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరై ప్రజలకు ప్రతిమలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రతి ఏడాది పర్యావరణ పరిరక్షణకై మట్టి ప్రతిమలు పంపిణీ చేస్తున్న జనహిత సేవా సమితి సభ్యులను అభినందించారు. కార్యక్రమంలో సేవా సమితి అధ్యక్షులు సతీష్, సభ్యులు పాల్గొన్నారు.हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
Ajinkya Rahane Retires: టీమ్ఇండియా మాజీ కెప్టెన్ అజింక్య రహానే రిటైర్మెంట్..ఎమోషనల్ వీడియో వైరల్!
Hyderabad, Telangana:Ajinkya Rahane Retirement: భారత క్రికెట్లో అత్యంత నమ్మకమైన బ్యాట్స్మెన్లలో ఒకరిగా నిలిచిన అజింక్య రహానే.. తాజాగా రిటైర్మెంట్ ప్రకటించాడు. అంతర్జాతీయ క్రికెట్లో అన్నీ ఫార్మాట్ల నుంచి వీడ్కోలు పలుకుతున్నట్లు తెలిపాడు. జూలై 30 నుంచి తన రిటైర్మెంట్ అమలులో ఉంటుందని ఇన్స్టాగ్రామ్ వేదికగా ఎమోషనల్ వీడియో పోస్ట్ చేశాడు.
అజింక్య రహానే గత ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సీజన్లో కోల్కతా నైట్ రైడర్స్ (కేకేఆర్)కు కెప్టెన్గా వ్యవహరించారు. అయితే ఇకపై ఇండియన్ ప్రీమియర్ లీగ్లో ఆడడం లేదు. ఈ క్రమంలో తాను అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుండి రిటైర్ అవుతున్నట్లు రహానే స్పష్టంగా పేర్కొన్నారు.
38 ఏళ్ల రహానే, "క్యాప్ నంబర్ 278, ఇక సెలవు. ఇన్నేళ్లుగా మీ ప్రేమకు, మద్దతుకు ధన్యవాదాలు" అని రాశారు. "నేను ఎల్లప్పుడూ కృతజ్ఞతతో ఉంటాను." ఈ సందేశంతో అతను తన అభిమానులకు, సహచర ఆటగాళ్లకు, కోచ్లకు, భారత క్రికెట్తో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరికీ తన కృతజ్ఞతను తెలియజేశాడు.
క్రికెట్లోని మూడు ఫార్మాట్లలోనూ టీమ్ ఇండియాకు కెప్టెన్గా వ్యవహరించిన కొద్దిమంది భారత ఆటగాళ్లలో అజింక్య రహానే ఒకరు. అతని కెప్టెన్సీ రికార్డు కూడా ఆకట్టుకునేలా ఉంది. టెస్ట్ క్రికెట్లో, అతను భారత్కు ఆరు మ్యాచ్లలో నాయకత్వం వహించగా, వాటిలో నాలుగు గెలిచి, రెండు డ్రా చేసుకున్నాడు. ముఖ్యంగా అతని కెప్టెన్సీలో భారత్ ఒక్క టెస్ట్ మ్యాచ్ కూడా ఓడిపోలేదు. వన్డే క్రికెట్లో రహానే మూడు మ్యాచ్లకు కెప్టెన్గా వ్యవహరించగా, ఆ మూడూ విజయాలతో ముగిశాయి. టీ20 అంతర్జాతీయ క్రికెట్లో, అతను జట్టుకు రెండు మ్యాచ్లలో నాయకత్వం వహించగా, ఒకటి గెలిచి, ఒకటి ఓడిపోయాడు.
అజింక్య రహానే భారత్ తరఫున 85 టెస్టులు, 90 వన్డేలు, 20 టీ20 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడాడు. అతను మూడు ఫార్మాట్లలో కలిపి 35.95 సగటుతో 8414 పరుగులు సాధించాడు. ఇందులో 15 సెంచరీలు, 51 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. రహానే కోల్కతా నైట్ రైడర్స్, చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. ఐపీఎల్లో రాయల్స్, రైజింగ్ పూణే సూపర్జైంట్, ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ జట్ల తరఫున ఆడాడు. రహానే 212 ఐపీఎల్ మ్యాచ్లలో 30.15 సగటుతో 5367 పరుగులు సాధించాడు. ఇందులో రెండు సెంచరీలు, 35 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
ఆస్ట్రేలియాలో చారిత్రాత్మక విజయం
అజింక్య రహానే కెరీర్లో అత్యంత ఆశాజనకమైన అధ్యాయం 2020-21 ఆస్ట్రేలియా పర్యటనలో కనిపించింది. అడిలైడ్ టెస్టులో భారత్ ఘోర పరాజయం పాలైన తర్వాత విరాట్ కోహ్లీ లేని సమయంలో, అతను జట్టుకు కెప్టెన్గా వ్యవహరించాడు. మెల్బోర్న్ టెస్టులో అద్భుతమైన సెంచరీతో అతను భారత్ను తిరిగి సిరీస్లోకి తీసుకువచ్చాడు.
దీని తర్వాత, యువ జట్టు బ్రిస్బేన్లోని గబ్బాలో స్వదేశంలో జరిగిన టెస్ట్ సిరీస్లో ఆస్ట్రేలియాను 2-1 తేడాతో ఓడించి చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. ఈ విజయం భారత క్రికెట్ చరిత్రలో అత్యంత చిరస్మరణీయమైన విజయాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. రహానే కెప్టెన్సీ ఎప్పటికీ గుర్తుండిపోతుంది.
టెస్ట్ కెరీర్
> 85 మ్యాచ్లు, 5077 పరుగులు, 38.46 సగటు
> 12 సెంచరీలు, 26 హాఫ్ సెంచరీలు, 49.50 స్ట్రైక్ రేట్
> 578 ఫోర్లు, 35 సిక్సర్లు
వన్డే కెరీర్
> 90 మ్యాచ్లు, 2962 పరుగులు, 35.26 సగటు
> 3 సెంచరీలు, 24 హాఫ్ సెంచరీలు, 78.63 స్ట్రైక్ రేట్
> 293 ఫోర్లు, 33 సిక్సర్లు
టీ20 కెరీర్
> 20 మ్యాచ్లు, 375 పరుగులు, 20.83 సగటు
> 1 హాఫ్ సెంచరీ, 113.29 స్ట్రైక్ రేట్
> 32 ఫోర్లు, 6 సిక్సర్లు.
Also REad: వన్డేల్లో రారాజుగా శుభ్మన్ గిల్..టీ20ల్లో 230 స్థానాలు ఎగబాకిన వైభవ్ సూర్యవంశీ!
Also Read: హార్దిక్ పాండ్యాను వదులుకోనున్న ముంబై ఇండియన్స్..కొత్త ఆటగాళ్ల లిస్టు ఇదే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
ఇన్ఫ్లుయెన్సర్గా బాగా చేస్తున్నారు.. ప్రధాని కుర్చీ ఖాళీ చేయండి.. మోదీపై అభిజీత్ దీప్కే సెటైర్లు..!!
Secunderabad, Telangana:Abhijit Dipke: సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే.. ప్రధాని మోదీపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. నీట్ పేపర్ లీక్ కాంట్రవర్సీపై దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్న వేళ.. విద్యార్థులను ఉద్దేశించి ప్రధాని మోదీ సోషల్ మీడియాలో వీడియోలు పోస్టు చేయడాన్ని ఎద్దేవా చేస్తూ.. ప్రధాని పదవి నుంచి తప్పుకుని సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్ గా మారితే బాగుంటుందని సెటైర్లు వేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత మహారాష్ట్రలోని తన స్వస్థలానికి చేరుకున్న దీప్కే మీడియాతో మాట్లాడారు.
ప్రధాని మోదీ ఇప్పుడు ఇన్ ఫ్లుయెన్సర్ గా మారాలని భావిస్తున్నాను. ఆయన ఆ పనిని చాలా బాగా చేస్తున్నారు. ప్రధాని కుర్చీని ఖాళీ చేస్తే.. దేశాన్ని నడిపే బాధ్యతను మరో నాయకుడు చూసుకుంటారని ఆయన అన్నారు. ఆందోళన విరమించిన తర్వాత కూడా నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులను పలు రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించి వేధిస్తున్నాయని అభిజీత్ దీప్కే ఆరోపించారు. సీజేపీ నిరసన విరమించిన తర్వాత ప్రభుత్వాలు విద్యార్థులను వేధిస్తున్నాయి. ఆ వేధింపులు ఆపనట్లయితే.. రానున్న ఎన్నికల్లో ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. కేవలం కేంద్ర మంత్రి రాజీనామాతో యువతలో ఆగ్రహం చల్లారలేదని..వారి కోపమంతా ప్రభుత్వం పైనే ఉందని స్పష్టం చేశారు.
విద్యార్థులపై వేధింపులు అలాగే కొనసాగినట్లయితే.. ఆందోళనను మళ్లీ ప్రారంభిస్తామని దీప్కే హెచ్చరించారు. నిరసన ముగిసిందని భావించకూడదు.. ఈ విద్యార్థులు టెర్రరిస్టులు కాదు.. ఈ దేశ భవిష్యత్తును ఇలా ఇబ్బంది పెడితే..రేపు మేమే ప్రభుత్వాన్ని మారుస్తామంటూ వ్యాఖ్యానించారు. అవసరం అయితే తదుపరి ఆందోళన చాలా పెద్దెత్తున ఉంటుందన్నారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై పెల్లెట్ గన్ ఉపయోగించడంపై బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని దీప్కే డిమాండ్ చేశారు. పెల్లెట్ గన్ కాల్పులకు ఆదేశాలు ఇచ్చిన అమిత్ షా అయినా.. మరెవరైనా సరే వారిపై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
పేపర్ లీక్ కేసుల కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామని మోదీ హామీ ఇచ్చినా.. తొలి విచారణే సీబిఐ న్యాయవాది హాజరవ్వకపోవడంతో వాయిదా పడిందని విమర్శించారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తర్వాత ఆయన్ను పార్లమెంటులో సన్నానించడంపై బీజేపీని ప్రశ్నించారు. విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటే.. ప్రధాన్ ను సన్మానించడానికి బీజేపీకి సిగ్గు అనిపించలేదా అని నిలదీశారు. కాక్రోచ్ పార్టీ నిరసనలపై బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ చేసిన విమర్శలపై స్పందించారు. ఆమెను పార్ట్ టైమ్ రాజకీయ నాయకురాలిగా అభివర్ణించారు దీప్కే. సీరియస్ నాయకుల కామెంట్స్ కే తాను స్పందిస్తాను అన్నారు.
Also Read: తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఒకేసారి 2 శుభవార్తలు..నెరవేరబోతున్న చిరకాల కోరిక..!!
Also Read: హెల్త్ కార్డులు, పీఆర్సీ కోసం రోడ్డెక్కిన పెన్షనర్లు..!!
Also Read: బ్రిక్స్ వేదికపై మెరిసిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Kaleshwaram: కాళేశ్వరం ప్రాజెక్టుకు రైతుల పూజలు
Tallagadda, Telangana:Tirumala: తిరుమలలో నేత్రపర్వంగా గురు పౌర్ణమి గరుడ సేవ
Dharmavaram, Andhra Pradesh:TTD Done Garuda Seva In Tirumala Temple For Guru Pournami Watch VideoBonalu: బోనాల వేడుకల్లో జోగిని శ్యామల డ్యాన్స్
Secunderabad, Telangana:Jogini Shymala Theenmaar Dance In Secunderabad Bonalu WatchTirumala: తిరుమల భక్తులకు టీటీడీ బిగ్ అలర్ట్.. ఫేక్ సైట్లు, సైబర్ నేరాలపై కీలక ప్రకటన
Tirupati Urban, Andhra Pradesh:Tirumala Fake News: తిరుమల భక్తులను లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు నకిలీ టీటీడీ వెబ్సైట్లు, యాప్లతో మోసాలకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో తిరుపతి జిల్లా పోలీసులు అప్రమత్తం చేశారు. ఇప్పటికే 32 నకిలీ వెబ్సైట్లను గుర్తించి తొలగించినట్లు వెల్లడించారు. టీటీడీ అధికారిక వెబ్సైట్ను పోలి ఉండే నకిలీ వెబ్సైట్ల ద్వారా దర్శనం, వసతి, సేవా టికెట్లు ఇప్పిస్తామంటూ భక్తులను మోసం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని పోలీసులు తెలిపారు.
ఇటీవల ttddevasthanam.online పేరుతో నకిలీ వెబ్సైట్ ద్వారా తప్పుడు ప్రచారం జరిగినట్లు గుర్తించారు. టీటీడీ విజిలెన్స్తో కలిసి తిరుపతి జిల్లా పోలీసులు నిరంతరం నిఘా కొనసాగిస్తూ ఇప్పటివరకు 32 నకిలీ వెబ్సైట్లను తొలగించారు. అయితే కొత్త పేర్లతో మళ్లీ నకిలీ వెబ్సైట్లు వచ్చే అవకాశం ఉండడంతో భక్తులు అధికారిక టీటీడీ వెబ్సైట్, అధికారిక మొబైల్ యాప్ ద్వారా మాత్రమే బుకింగ్లు చేసుకోవాలని సూచించారు. భక్తులు అధికార సైట్లను మాత్రమే సందర్శించాలని.. ఏ ఇతర వ్యక్తులు, సంస్థలను సంప్రదించవద్దని టీటీడీ విజెలెన్స్ అధికారులు సూచనలు చేశారు.
సైబర్ మోసాలపై ప్రతి భక్తుడు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు సూచించారు. సోషల్ మీడియాలో వచ్చే అనుమానాస్పద లింకులను నమ్మవద్దని, ఎలాంటి అనుమానం వచ్చినా వెంటనే పోలీసులకు లేదా టీటీడీ విజిలెన్స్కు సమాచారం ఇవ్వాలని అధికారులు కోరుతున్నారు. భక్తుల అప్రమత్తతే సైబర్ మోసాలకు అడ్డుకట్ట అని పోలీసులు స్పష్టం చేశారు.
పెరిగిన భక్తులు
తిరుమల ఆలయంలో భక్తుల రద్దీ పెరుగుతోంది. నిన్న బుధవారం 74,471 మంది భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వారిలో 31,319 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం ఒక్కరోజుకు రూ.4.68 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు. లడ్డూ విక్రయాలు 4.09 లక్షలు జరగ్గా.. అన్నప్రసాదాలు 2.59 లక్షల మంది భక్తులు స్వీకరించారు. కంపార్ట్మెంట్లు నిండి శిలాతోరణం వరకు భక్తులు వేచి ఉండడంతో సర్వదర్శనానికి (ఎస్ఎస్డీ టోకెన్లు లేకుండా) 12 గంటలు సమయం పడుతుంది.
Kaleshwaram: కాంగ్రెస్ సన్నాసులు ఇదిగో కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు: బీఆర్ఎస్ పార్టీ
Kistampalli, Telangana:Gayatri Pumphouse: కాళేశ్వరం కూళేశ్వరం అని చెప్పిన సన్నాసులకు ఇదిగో నీళ్లు అని బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే సుంకె రవి శంకర్ చూపించారు. గాయత్రి పంప్ హౌస్లో మీటర్లు ఆన్ చేసి నీటిని ఎత్తిపోస్తుండడంతో ఆ నీటిని కాంగ్రెస్ నాయకులు చూడాలని సూచించారు. కాళేశ్వరం నీళ్లతోనే రైతులకు ఊరట అని, కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను తప్పుదోవ పట్టిస్తోందని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాదని, నీళ్లు రావని ప్రచారం చేసిన వారికే ఇప్పుడు అదే కాళేశ్వరం నీళ్లు సమాధానం చెబుతున్నాయని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ పోరాటానికి కాంగ్రెస్ ప్రభుత్వం దిగివచ్చిందని.. దాని ఫలితమే మోటార్లు ఆన్ చేయడం అని వివరించారు.
కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలోని గాయత్రి పంపుహౌస్ మోటార్లు ఆన్ చేయడంతో అక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి మాజీ ఎమ్మెల్యే సుంకె రవి శంకర్ సందర్శించారు. ఈ సందర్భంగా కుంకుమ, పూలు చల్లి నీటికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సుంకె రవి శంకర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతులు వరి వేయొద్దని, నీటి పరిస్థితి అనుకూలంగా లేదని చెప్పారని గుర్తుచేశారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రం ఎన్డీఎస్ఏ నివేదిక వచ్చిన తర్వాతే నీటి విడుదలపై నిర్ణయం తీసుకుంటామని చెప్పడం ప్రభుత్వంలోని అయోమయాన్ని బయటపెడుతోందని విమర్శించారు.
కళ్లు బాగా పెద్దవి చేసి చూడండి…. ఇగో ఇదే కాళేశ్వరం గాయత్రి పంప్ హౌజ్ కూడా కాళేశ్వరం లోని భాగమే…. కులేశ్వరం అన్న సన్నాసులకు ఇంతకు మించిన సమాధానం చూపెట్టలేము….
Thankyou @KCRBRSPresident గారు ,@KTRBRS గారు ,@BRSHarish గారు ❤️ కాళేశ్వరం తెలంగాణ ప్రజలకు తెలంగాణ రైతాంగానికి గొప్ప… pic.twitter.com/WuaLykJ2BA
— Sunke Ravishankar (@Ravishankar_BRS) July 29, 2026
రేవంత్ రెడ్డి ఒక మాట, మంత్రులు మరో మాట మాట్లాడుతుంటే రైతులు ఎవరిని నమ్మాలని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ప్రశ్నించారు. ఎన్డీఎస్ఏ నివేదికలో బ్యారేజీల భద్రత మాత్రమే తమ పరిధి అని, నీటి నిర్వహణ, సాగునీటి పంపిణీ రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతేనని స్పష్టంగా పేర్కొన్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ నివేదిక పేరుతో రైతులను తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపించారు. 'కన్నెపల్లి పంపులను ముందుగానే ప్రారంభించి ఉంటే గాయత్రి పంప్హౌస్ ద్వారా నీటిని ఎత్తిపోసి మిడ్మానేరు, రంగనాయకసాగర్, అన్నపూర్ణ, మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ వరకు నీటిని చేరవేసి చెరువులు నింపే అవకాశం ఉండేది' అని వెల్లడించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా రైతుల నారుమడులు ఎండిపోయాయని, ఇప్పటికే జూలై చివరి దశకు చేరుకున్నా నాట్లు వేసే పరిస్థితి లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆవేదన వ్యక్తం చేశారు. గాయత్రి పంప్హౌస్ ద్వారా నీటి విడుదలను పూర్తి స్థాయిలో కొనసాగించి ప్రతి చెరువు, ప్రతి రిజర్వాయర్ను నింపాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ను గోదావరి జలాలను తెలంగాణ రైతాంగానికి అందించేందుకు కాళేశ్వరం వంటి మహత్తర ప్రాజెక్టును నిర్మించారని గుర్తుచేశారు. కేసీఆర్ దూరదృష్టితోనే నేడు రైతులకు నీరు అందుతోందని తెలిపారు. కేసీఆర్పై గతంలో చేసిన విమర్శలు ఇప్పుడు అసత్యమని తేలిపోయాయని.. తెలంగాణ రైతుల తరఫున కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ చెప్పారు.
Tirumala: తిరుమలలో వైభవంగా గురు పౌర్ణమి గరుడ సేవ.. స్వామిసేవలో తరించిన భక్తులు
Tirupati Urban, Andhra Pradesh:Tirumala Garuda Seva: ఆషాఢ మాసంలో వచ్చిన పౌర్ణమి.. గురు పౌర్ణమి కావడంతో తిరుమలలో ప్రత్యేక కైంకర్యాలు జరిగాయి. ప్రతి పౌర్ణమికి గరుడ సేవ జరగనుండగా ఈసారి బుధవారం నేత్రానందంగా గరుడ సేవ టీటీడీ అధికారులు నిర్వహించారు. కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరస్వామి ఆలయంలో పౌర్ణమి గరుడసేవ అత్యంత వైభవంగా జరిగింది. సర్వాలంకార భూషితుడైన మలయప్పస్వామి గరుడవాహనంపై ఆలయ మాడవీధుల్లో విహరించి భక్తులకు దివ్య దర్శనం ఇచ్చారు. వేలాది మంది భక్తులు ఈ పవిత్ర గరుడసేవను భక్తిశ్రద్ధలతో వీక్షించారు.
తిరుమలలో ప్రతి పౌర్ణమి సందర్భంగా నిర్వహించే గరుడసేవ బుధవారం రాత్రి ఘనంగా జరిగింది. రాత్రి 7 గంటలకు సర్వాలంకార భూషితుడైన మలయప్పస్వామి గరుడవాహనంపై ఆలయ నాలుగు మాడవీధుల్లో విహరిస్తూ భక్తులను అనుగ్రహించారు. వేదఘోషలు, మంగళ వాయిద్యాలు, గోవింద నామస్మరణల మధ్య సాగిన ఈ వాహనసేవలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
గరుడవాహనంపై స్వామివారి దివ్యమంగళ స్వరూపం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. పురాణాల ప్రకారం 108 వైష్ణవ దివ్యదేశాలలో గరుడసేవకు అత్యంత విశిష్ట స్థానం ఉంది. గరుడవాహనంపై స్వామివారి దర్శనం సర్వపాప ప్రాయశ్చిత్తాన్ని కలిగిస్తుందని, జ్ఞాన–వైరాగ్యాలను ప్రసాదిస్తుందని వైష్ణవ సంప్రదాయం చెబుతోంది. గరుడుడు భక్తి, శరణాగతి, జ్ఞానానికి ప్రతీకగా భావించబడతాడు. ఈ పౌర్ణమి గరుడసేవలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి, టీటీడీ బోర్డు సభ్యులు పనబాక లక్ష్మి, భాను ప్రకాష్ రెడ్డి, డిప్యూటీ ఈవో లోకనాథం, ఇతర ఆలయ అధికారులు పాల్గొన్నారు.
విమాన ఛార్జీలకు రెక్కలు
శ్రీవాణి టికెట్లపై ఒక్కసారిగా డిమాండ్ రావడంతో హైదరాబాద్–తిరుపతి విమాన ఛార్జీలకు రెక్కలు వచ్చాయి. ఒక్కో విమాన టికెట్ ధర రూ.24 వేల వరకు పెరిగినట్లు భక్తులు వాపోయారు. చివరి నిమిషంలో బుకింగ్లతో విమాన ఛార్జీలు భారీగా పెరుగుతున్నాయి. శ్రీవాణి టికెట్ల కోసం విమానాలకు డిమాండ్ రోజురోజుకు పెరుగుతోంది. ఎయిర్పోర్టులో టికెట్ల జారీని టీటీడీ నిలిపివేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుండడంతో ఇలా డిమాండ్ ఏర్పడిందని సమాచారం. భక్తుల ఫిర్యాదులతో టీటీడీ రంగంలోకి దిగింది. విమాన ఛార్జీలపై వరుస ఫిర్యాదులు రావడంతో టీటీడీ అధికారులు స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. అధిక ఛార్జీలపై కేంద్ర విమానయాన శాఖ జోక్యం చేసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.
AP Job Calender: ఏపీలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 'జాబ్ క్యాలెండర్-2026'పై మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన
Vijayawada, Andhra Pradesh:AP Job Calender 2026: ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు కూటమి ప్రభుత్వం మరో శుభవార్త తెలిపింది. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను మరింత వేగవంతం చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా 'జాబ్ కేలండర్-2026' రూపకల్పన, అమలుపై రాష్ట్ర విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ మంత్రులు, అధికారులతో ఒక ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.
నాలుగు దశల్లో 10,060 ఉద్యోగాల భర్తీ
జాబ్ క్యాలెండర్-2026లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ విభాగాల్లో ఖాళీగా ఉన్న మొత్తం 10,060 పోస్టులను నాలుగు విడతలుగా భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎలాంటి వివాదాలకు తావు లేకుండా, అత్యంత పారదర్శకంగా నియామక ప్రక్రియ చేపట్టాలని మంత్రి లోకేష్ అధికారులను ఆదేశించారు.
1) మొదటి దశలో భాగంగా మొత్తం 1,523 అధ్యాపక (ఫ్యాకల్టీ) పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ను ఇప్పటికే విడుదల చేశారు.
2) రెండో దశలో 3,168 ఉద్యోగాల భర్తీకి సెప్టెంబర్ 15న నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. రాష్ట్రపతి ఉత్తర్వుల అమలు, కొన్ని సాంకేతిక కారణాలు, ఉద్యోగ సంఘాల విజ్ఞప్తి మేరకు ఈ నోటిఫికేషన్ తేదీలో మార్పు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
3) అదే విధంగా మూడో దశలో 2,388 పోస్టులు, నాలుగో దశలో 2,981 పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్లను అక్టోబర్ 15న విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.
హోంశాఖలోనూ పోస్టుల భర్తీ
రాష్ట్రంలోని హోంశాఖలో ఖాళీగా ఉన్న 2,225 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. పోలీస్, భద్రతా విభాగాలలో సిబ్బంది నియామకంపై ప్రత్యేక దృష్టి సారించారు.
గ్రూప్-1 పెంపు పరిశీలన
నిరుద్యోగ అభ్యర్థులకు మరిన్ని మెరుగైన అవకాశాలు కల్పించే ఉద్దేశంతో ఏపీపీఎస్సీ గ్రూప్-1 పోస్టుల సంఖ్యను పెంచే అంశంపై మంత్రుల బృందం అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.
మంత్రి నారా లోకేష్ ఆదేశాలు
ఉద్యోగాల భర్తీలో ఎలాంటి జాప్యం జరగకుండా ముందస్తు ప్రణాళికతో వ్యవహరించాలని అధికారులను మంత్రి లోకేష్ హెచ్చరించారు. ప్రతి ఏటా క్రమం తప్పకుండా జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని స్పష్టం చేశారు. అలాగే, జాబ్ క్యాలెండర్-2026కు సంబంధించిన పూర్తి స్థాయి ఖాళీల వివరాలను రాబోయే కేబినెట్ సమావేశంలో సమర్పించాలని ఆదేశించారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని, నియామకాలు పూర్తిగా పారదర్శకంగా జరిగేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆయన పునరుద్ఘాటించారు.
Also Read: ఉద్యోగులకు సూపర్ గుడ్న్యూస్..ఇకపై ప్రతినెలా 1వ తేదీన జీతాలు అకౌంట్లో జమ!
Also Read: పంతం నెగ్గించుకున్న రఘురామ కృష్ణరాజు..ఆకివీడు రామాలయానికి సుప్రీంకోర్టు ఓకే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
DMart Shopping Offers: డీమార్ట్లో షాపింగ్ ఏ రోజు చేస్తే బెటర్..ఈ టైమ్లో షాపింగ్ చేస్తే డబ్బు, సమయం రెండూ ఆదా!
Hyderabad, Telangana:DMart Shopping Discount Offers: దేశవ్యాప్తంగా ఎంతో ఆదరణ పొందిన డీమార్ట్ (DMart), కిరాణా సామాగ్రి నుంచి గృహోపకరణాలు, దుస్తులు, వంటగది వస్తువులు, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తుల వరకు అన్నీ ఒకే చోట సరసమైన ధరలకు అందించే ప్రముఖ షాపింగ్ కేంద్రం. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలు భారీ తగ్గింపులతో షాపింగ్ చేయడానికి డీమార్ట్ను ఎంతగానో ఇష్టపడతాయి. అయితే, చాలా మందికి తక్కువ రద్దీ ఉండే సమయాలు, ఉత్తమమైన ఆఫర్లు లభించే రోజులు ఏవో తెలియక ఇబ్బంది పడుతుంటారు.
డీమార్ట్లో ప్రతి వస్తువు ధర రోజువారీగా ఒకేలా ఉంటుందని చాలామంది భావిస్తారు. కానీ వాస్తవానికి వివిధ ఉత్పత్తులపై ఇచ్చే డిస్కౌంట్లు, ప్రత్యేక ఆఫర్లు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కొన్ని రోజుల్లో కిరాణా సరుకులపై భారీ తగ్గింపు ఉంటే, మరికొన్ని రోజుల్లో గృహోపకరణాలు లేదా బట్టలపై ప్రత్యేక డీల్స్ లభిస్తాయి. ఇక్కడ చాలా వస్తువులు గరిష్ట చిల్లర ధర (MRP) కంటే తక్కువకే లభించడంతో పాటు "ఒకటి కొంటే ఒకటి ఉచితం", కాంబో ఆఫర్లు, పండుగ డిస్కౌంట్లు వినియోగదారులను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి.
రద్దీ ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది?
వారాంతాలు (వీకెండ్స్): శుక్రవారం నుండి ఆదివారం వరకు డీమార్ట్లో రద్దీ తారాస్థాయిలో ఉంటుంది. సెలవు దినం కావడంతో కుటుంబాలన్నీ షాపింగ్కు క్యూ కట్టడంతో బిల్లింగ్ కౌంటర్ల వద్ద గంటల తరబడి సమయం వృధా అవుతుంది. అయితే ఈ సమయంలోనే కొన్ని ప్రత్యేక కాంబో ఆఫర్లు లభించే అవకాశం ఉంది.
అతి తక్కువ రద్దీ ఉండే రోజులు, సమయాలు
మీ షాపింగ్ ప్రశాంతంగా, వేగంగా పూర్తి కావాలంటే క్రింది సమయాలను ఎంచుకోవడం ఉత్తమం. సోమవారం నుండి గురువారం మధ్య షాపింగ్ చేయడం చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. ముఖ్యంగా నెలలో 10వ తేదీ నుండి 25వ తేదీ మధ్య స్టోర్ను సందర్శిస్తే రద్దీ చాలా వరకు తక్కువగా ఉంటుంది. జీతాలు వచ్చే నెల ప్రారంభం, చివరి రోజుల్లో స్టోర్కు జనం తాకిడి ఎక్కువగా ఉంటుంది.
ఉత్తమ సమయాలు..
స్టోర్ తెరిచిన వెంటనే ఉదయం వేళల్లో మధ్యాహ్నం 12 నుండి 3 గంటల మధ్య సమయంలో బిల్లింగ్ కౌంటర్ల వద్ద పెద్దగా రద్దీ ఉండదు. వారాంతం తర్వాత మిగిలిపోయిన సరుకును త్వరగా క్లియర్ చేయడానికి కొన్ని డీమార్ట్ బ్రాంచ్లు సోమవారాల్లో ప్రత్యేక తగ్గింపులను అందిస్తుంటాయి. దీనినే అనధికారికంగా "క్లీన్-అప్ సేల్" అంటారు. ఈ సమయంలో కొన్ని ఎంపిక చేసిన ఉత్పత్తులపై అదనపు డిస్కౌంట్లు లభించే అవకాశం ఉంది (అయితే ఇది అన్ని బ్రాంచ్లలో ఉండకపోవచ్చు).
డీమార్ట్ రెడీ యాప్తో అదనపు ఆదా
ఆన్లైన్ షాపింగ్ ప్రియుల కోసం డీమార్ట్ రెడీ యాప్ చక్కటి ప్రత్యామ్నాయంగా మారింది. ఇందులో ప్రత్యేక కూపన్లు, డిజిటల్ ఆఫర్లు, ఆన్లైన్కు మాత్రమే పరిమితమైన ప్రత్యేక డిస్కౌంట్లు అందుబాటులో ఉంటాయి. ఈ యాప్ను క్రమం తప్పకుండా పరిశీలించడం ద్వారా మీరు మరింత డబ్బు ఆదా చేసుకోవచ్చు.
మెరుగైన షాపింగ్ కోసం ముఖ్యమైన చిట్కాలు
1) వారాంతాలకు బదులుగా వారపు రోజులను (సోమవారం - గురువారం) ఎంచుకోండి.
2) స్టోర్కు వెళ్లే ముందే ఖచ్చితమైన షాపింగ్ జాబితా తయారు చేసుకోండి.
3) ప్రత్యేక ఆఫర్లను పరిశీలించిన తర్వాతే వస్తువులను ఎంపిక చేసుకోండి.
4) అవసరానికి మించి అనవసరమైన వస్తువులను కొనుగోలు చేయడం మానుకోండి.
5) డిజిటల్ కూపన్లు, మెంబర్షిప్ ఆఫర్లను సద్వినియోగం చేసుకోండి.
సరిైన రోజు, సరైన సమయాన్ని ఎంచుకోవడం ద్వారా డీమార్ట్లో షాపింగ్ చేయడం వల్ల మీ డబ్బుతో పాటు విలువైన సమయం కూడా ఆదా అవుతుంది. ప్రశాంత వాతావరణంలో ఇబ్బంది లేకుండా షాపింగ్ పూర్తి చేసుకోవడానికి పై చిట్కాలు ఎంతగానో సహాయపడతాయి!
(గమనిక: ఇక్కడ పేర్కొన్న సమాచారం కేవలం పాఠకుల అవగాహన కోసం మాత్రమే పొందుపరిచినది. దీన్ని వ్యాపార ప్రకటనగా పరిగణించవద్దు. దీన్ని జీ తెలుగు న్యూస్ ధ్రువీకరించడం లేదు.)
Also Read: విజయ్ Vs ధనుష్..2031 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే, అన్నాడీఎంకే కనుమరుగు?
Also Read: సర్జరీ తర్వాత తొలిసారి కనిపించిన రామ్చరణ్..భార్యతో పాటు అయ్యప్ప దర్శనం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
School Holidays: విద్యార్థులు ఎగిరి గంతేసే వార్త..జూలై 31, ఆగస్టు 1న ఈ జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవు!
Gudepuvalasa, Andhra Pradesh:AP School Holidays: ఆంధ్రప్రదేశ్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పర్యటన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఆగస్టు 1న విజయనగరం జిల్లా భోగాపురంలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. ఈ చారిత్రక కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అధికార యంత్రాంగం ముమ్మర చర్యలు చేపట్టింది.
పర్యటన విశేషాలు.. ప్రముఖుల హాజరు
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్తో పాటు కేంద్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, పలువురు రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున పాల్గొననున్నారు.
విద్యాసంస్థలకు సెలవులు
భోగాపురం ఎయిర్పోర్టు వద్ద నిర్వహించే భారీ బహిరంగ సభకు వివిధ జిల్లాల నుంచి జనాలను సమీకరిస్తున్నారు. ఇందులో భాగంగా డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజలను తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ జన సమీకరణ ప్రక్రియ కోసం జిల్లాలోని ఆర్టీసీ బస్సులు, ప్రభుత్వ బస్సులతో పాటు వివిధ పాఠశాలలు, కళాశాలలకు చెందిన ప్రైవేట్ విద్యాసంస్థల బస్సులను ఉపయోగిస్తున్నారు.
బస్సులను రవాణా కోసం కేటాయించడంతో, కోనసీమ జిల్లాలో ఈ నెల 31, ఆగస్టు 1 తేదీలలో రెండు రోజుల పాటు అన్ని పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.
ఉత్తర్వులు జారీ..
జిల్లాలోని అన్ని విద్యాసంస్థలు తమ బస్సులను అందించి సహకరించాలని జిల్లా కలెక్టర్ స్పష్టమైన సర్కులర్ జారీ చేశారు. దీంతో రవాణా అధికారులు బస్సుల ఏర్పాటులో నిమగ్నమయ్యారు.
ఇదిలా ఉండగా, ప్రధాని పర్యటన నేపథ్యంలో విశాఖపట్నం, విజయనగరం జిల్లాలలో కూడా విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
Also Read: ఉద్యోగులకు సూపర్ గుడ్న్యూస్..ఇకపై ప్రతినెలా 1వ తేదీన జీతాలు అకౌంట్లో జమ!
Also Read: పంతం నెగ్గించుకున్న రఘురామ కృష్ణరాజు..ఆకివీడు రామాలయానికి సుప్రీంకోర్టు ఓకే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
ICC Rankings: వన్డేల్లో రారాజుగా శుభ్మన్ గిల్..టీ20ల్లో 230 స్థానాలు ఎగబాకిన వైభవ్ సూర్యవంశీ!
Hyderabad, Telangana:ICC Team India Rankings: జింబాబ్వేతో జరిగిన సిరీస్లో అద్భుత ప్రదర్శన కనబరిచిన యువ కెరటం వైభవ్ సూర్యవంశీ.. తాజాగా రిలీజ్ చేసిన ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో సత్తా చాటాడు. బుధవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్లో వైభవ్ 230 స్థానాలు ఎగబాకి సరికొత్త రికార్డును సాధించాడు. మరోవైపు, టీమ్ ఇండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ వన్డేల రారాజుగా అవతరించాడు. న్యూజిలాండ్ స్టార్ బ్యాట్స్మెన్ డారిల్ మిచెల్ నుంచి నంబర్-1 స్థానాన్ని గిల్ కైవసం చేసుకున్నాడు. 801 పాయింట్లతో శుభ్మన్ గిల్ వన్డేలలో నంబర్-1 బ్యాట్స్మెన్గా నిలిచాడు. మిచెల్ ఒక స్థానం కోల్పోయి 794 పాయింట్లతో నంబర్-2 స్థానానికి పడిపోయాడు. విరాట్ కోహ్లీ నంబర్-3 స్థానంలో, రోహిత్ శర్మ నంబర్-4 స్థానంలో కొనసాగుతున్నారు.
ఇటీవలే జింబాబ్వేతో జరిగిన టీ20 సిరీస్లో 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ మూడు మ్యాచ్లలో 196.10 స్ట్రైక్ రేట్తో 151 పరుగులు చేసి, అత్యధిక రన్స్ చేసిన ఆటగాడిగా వైభవ్ సూర్య వంశీ నిలిచాడు. అదేవిధంగా జింబాబ్వే పర్యటనలో వైభవ్ రెండు హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. ఈ ప్రదర్శనకు ప్రతిఫలంగా, అతను ఇప్పుడు టీ20ఐ ర్యాంకింగ్స్లో 230 స్థానాలు ఎగబాకాడు.
వైభవ్ సూర్యవంశీ T20I ర్యాంక్ ఎంత?
తాజా ఐసీసీ టీ20 అంతర్జాతీయ ర్యాంకింగ్స్లో వైభవ్ సూర్యవంశీ 48వ స్థానానికి చేరుకున్నాడు. అతను ర్యాంకింగ్స్లో చాలా వెనుకబడి ఉన్నాడని మీరు వాదించవచ్చు, కానీ జింబాబ్వేతో సిరీస్కు ముందు అతను 278వ ర్యాంకులో ఉన్నాడనే విషయం గమనించాలి. ఇది వైభవ్ సూర్యవంశీకి ఒక ముఖ్యమైన ఘనత.
శుభ్మన్ గిల్ వన్డేలకు రాజు!
గత కొన్ని నెలలుగా అద్భుతమైన ఫామ్లో ఉన్న శుభ్మన్ గిల్, ఇప్పుడు వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో అగ్రస్థానానికి చేరుకున్నాడు. భారత కెప్టెన్ కొనసాగుతున్న శుభ్మన్ గిల్.. న్యూజిలాండ్ స్టార్ బ్యాట్స్మెన్ డారిల్ మిచెల్ నుండి ఈ టైటిల్ను కైవసం చేసుకున్నాడు. టెస్ట్ ర్యాంకింగ్స్లో కూడా శుభ్మన్ 7వ స్థానంలో ఉన్నాడు. భారత స్టార్ వికెట్ కీపర్-బ్యాట్స్మెన్ ఇషాన్ కిషన్ టీ20 ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
మూడు ఫార్మాట్లలోనూ నంబర్ 1 ఎవరు?
వన్డే - శుభ్మన్ గిల్ (801 పాయింట్లు)
టెస్ట్ - ట్రావిస్ హెడ్ (853 పాయింట్లు)
టీ20 - ఇషాన్ కిషన్ (910 పాయింట్లు)
వన్డే ర్యాంకింగ్స్లో కోహ్లీ, రోహిత్ల స్థానం ఎంత?
టీమ్ ఇండియాకు చెందిన ఇద్దరు స్టార్ ఆటగాళ్లైన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ.. కేవలం వన్డేల్లో కొనసాగుతున్నారు. టెస్టు, టీ20 ఫార్మాట్కు ఇప్పటికే ఇద్దరూ రిటైర్మెంట్ ప్రకటించారు. ఇటీవల ఇంగ్లాండ్తో జరిగిన సిరీస్లో వీరిద్దరూ ఆడారు. లార్డ్స్లో రోహిత్ శర్మ సెంచరీ సాధించగా, విరాట్ కోహ్లీ మూడు మ్యాచ్లలో 144 పరుగులు చేశాడు. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో కోహ్లీ 767 పాయింట్లతో మూడో స్థానంలో ఉండగా, రోహిత్ శర్మ 758 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉన్నాడు.
Also REad: హార్దిక్ పాండ్యాను వదులుకోనున్న ముంబై ఇండియన్స్..కొత్త ఆటగాళ్ల లిస్టు ఇదే!
Also Read: హీరోయిన్తో క్రికెటర్ అర్ష్దీప్ సింగ్ పెళ్లి..లగ్గం ఫిక్స్..ఆమె సంపాదన ఎంతో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Uday Krishna Reddy Case: పోలీసుల అదుపులో ఉదయ్ కృష్ణారెడ్డి..ఆ రోజు వరకు రిమాండ్కు తరలింపు!
Hyderabad, Telangana:Trainee ips uday krishna reddy case: హైదరాబాద్ లోని నేషనల్ పోలీస్ అకాడమిలో జరిగిన ట్రైనీ ఐపీఎస్ ల కేసు దర్యాప్తులో పోలీసులు స్పీడ్ ను పెంచారు. ఈ క్రమంలో నిన్న ఉదయ్ ను టాస్క్ ఫోర్స్ పోలీసులు మిర్యాలగూడలో అదుపులోకి తీసుకున్నారు. రాత్రంత అత్తాపూర్ లో పీఎస్ లో ఉంచి స్టేట్ మెంట్ను రికార్డు చేశారు. అంతే కాకుండా మహిళ ఐపీఎస్ నుంచి కూడా స్టేట్ మెంట్ రికార్డు చేశారు. ఆమె మెడను పట్టుకున్నట్లు, శరీరంపై గాయాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.AP Employees Salary: ఉద్యోగులకు సూపర్ గుడ్న్యూస్..ఇకపై ప్రతినెలా 1వ తేదీన జీతాలు అకౌంట్లో జమ!
Vijayawada, Andhra Pradesh:AP Employees Salary On 1st: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్థికశాఖ శుభవార్త అందజేసింది. ఇకపై ప్రతి నెలా 1వ తేదీనే ఉద్యోగులందరికీ జీతాలు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ లక్ష్యాన్ని కచ్చితంగా అమలు చేయాలని కోరుతూ ఆర్థికశాఖ అన్ని ప్రభుత్వ శాఖలకు స్పష్టమైన మెమో జారీ చేసింది.
ఆర్థికశాఖ ముఖ్య ఆదేశాలు, మార్గదర్శకాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు జీతాల బిల్లులను వెంటనే IFMS (Integrated Financial Management System) పోర్టల్లో అప్డేట్ చేయాలని ఆర్థిఖ శాఖ అధికారులు ఆదేశించారు.
జీతాల బిల్లులను సమయానికి అప్డేట్ చేయని పక్షంలో సంబంధిత డ్రాయింగ్ & డిస్బర్స్ మెంట్ ఆఫీసర్ (DDO)పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బిల్లులు పెండింగ్లో ఉంటే ముందుగానే ఆర్థికశాఖకు తెలియజేయాలని సూచించారు.
జూలై 30 లోపు ఏ ఉద్యోగి జీతాల బిల్లు పంపకపోయినా, దానికి పూర్తి బాధ్యత సంబంధిత DDO దేనని ఆర్థికశాఖ తేల్చిచెప్పింది. దీంతో సాంకేతిక సమస్యలను పరిష్కరించుకునేందుకు పలువురు DDOలు సచివాలయానికి పరుగులు పెడుతున్నారు. అలాగే పొరుగుసేవలు (అవుట్సోర్సింగ్), కాంట్రాక్టు ఉద్యోగుల సేవా కాలాన్ని ఈ నెలకు కూడా పొడిగిస్తూ ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
కేంద్ర నిధుల బాధ్యత
కేంద్ర ప్రాయోజిత పథకాల కింద పనిచేస్తున్న సుమారు లక్ష మంది ఉద్యోగుల జీతాలకు అవసరమైన నిధులను కేంద్రం నుంచి రాబట్టుకునే బాధ్యత పూర్తిగా సంబంధిత శాఖాధిపతులదేనని స్పష్టం చేసింది. ఈ ప్రక్రియ కోసం ప్రణాళికశాఖ ముఖ్యకార్యదర్శి గౌరవ్ ఉప్పల్ను రాష్ట్ర నోడల్ అధికారిగా నియమించారు. అయితే, కేంద్ర నిధులు ఆలస్యమైనప్పుడు రాష్ట్ర ఆర్థికశాఖ తాత్కాలికంగా నిధులను సర్దుబాటు చేస్తుందా లేదా అనేదానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
ఆధార్ అప్డేట్ సమస్యలు, పరిష్కార మార్గాలు
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా సుమారు 3,900 మంది ఉద్యోగుల ఆధార్ వివరాలు IFMS పోర్టల్లో అప్డేట్ కాలేదు. వీరిలో సుమారు 1,900 మంది అవుట్సోర్సింగ్ మరియు కాంట్రాక్టు ఉద్యోగులు ఉన్నారు. గతంలో డిప్యుటేషన్లో పనిచేసి బదిలీపై కొత్త చోట చేరిన ఉద్యోగులకు కూడా ఆధార్ అప్డేట్కు సంబంధించి సాంకేతిక సమస్యలు ఎదురువుతున్నాయి. ఈ సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగులు నేరుగా సచివాలయానికి వచ్చి ఆర్థికశాఖ అధికారులను సంప్రదిస్తున్నారు.
రాష్ట్రంలో నెలవారీ ఆర్థిక అంచనా
ఆంధ్రప్రదేశ్లో ప్రతి నెలా చెల్లించాల్సిన వేతనాలు, పింఛన్ల అంచనా వివరాలు ఇలా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు నెలకు సుమారు రూ.4,500 కోట్లు చెల్లించాల్సి ఉండగా.. మాజీ ఉద్యోగులకు పింఛన్ల రూపంలో సుమారు రూ.2,500 కోట్లు చెల్లింపులు చేయాల్సి ఉంది.
ప్రభుత్వ తాజా ఆదేశాల నేపథ్యంలో, సాంకేతిక ఇబ్బందిలను అధిగమించి ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి ప్రతినెలా మొదటి తేదీనే జీతం అందేలా అధికారులు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతున్నారు. ఈ శుభవార్త తెలుసుకున్న ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: పంతం నెగ్గించుకున్న రఘురామ కృష్ణరాజు..ఆకివీడు రామాలయానికి సుప్రీంకోర్టు ఓకే!
Also Read: ఏపీ విద్యార్థులకు పండుగే పండుగ.. స్కూళ్లకు ఏకంగా 10 రోజులు సెలవులు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Nara Bhuvaneshwari: అసెంబ్లీలో నా శీలం గురించి మాట్లాడారు.. వైఎస్సార్సీపీ నేతలపై నారా భువనేశ్వరీ సెన్సెషనల్ కామెంట్స్..
Hyderabad, Telangana:Nara bhuvaneshwari emotional in kuppam meeting: ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు ప్రస్తుతం కాక రేపుతున్నాయి. ఒకవైపు వైఎస్సార్సీపీ నేతలు ఎన్నికల్లో అబద్దపు హమీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేసి కూటమి గద్దెనెక్కిందని విమర్శలు చేస్తున్నారు. రెడ్ బుక్ రాజ్యంగంను అమలు చేస్తున్నారని, శాంతిభద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని విమర్శలు గుప్పిస్తున్నారు. మరోవైపు కూటమి ప్రభుత్వం సైతం వైసీపీ నేతల వ్యాఖ్యలకు కౌంటర్ లు ఇస్తుంది. ఇక తాజాగా.. ఏపీ సీఎం చంద్రబాబు సతీమణి కుప్పంలో పర్యటించారు. ఈ క్రమంలో స్థానికంగా ఉన్న ద్రౌపది అమ్మవారి ఆలయంను సందర్శించారు.
తనపై, తన కుటుంబంపై వైసీపీ నేతలు చేసిన అభ్యంతరకర వ్యాఖ్యల గురించి నారా భువనేశ్వరి తొలిసారిగా ప్రజల మధ్య స్పందించారు.
"ఈ విషయం గురించి నేను ఇప్పటివరకు ఎక్కడా మాట్లాడలేదు. కానీ ఈ రోజు ద్రౌపది అమ్మవారిని దర్శించుకున్న తర్వాత... స్త్రీ అంటే ఏమిటి, స్త్రీని పురుషులు ఎంత గౌరవించాలో… pic.twitter.com/8EY4DYX1so
— TeluguBulletin.com (@TeluguBulletin) July 29, 2026
ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ తీవ్ర భావొద్వేగంకు గురయ్యారు. ద్రౌపది అమ్మవారిని చూసిన తర్వాత తనకు గత ప్రభుత్వ హయంలో అసెంబ్లీలో ఎదురైన ఘటనపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పూర్వకాలంలో పాండవుల్ని ఎదుర్కొలేక కౌరవులు ద్రౌపదమ్మను నిండు సభలోకి లాక్కొచ్చి చీరను లాగి అవమానించిన ఘటనలను గుర్తు చేశారు. ఒక ఆడదిని అడ్డం పెట్టుకుని నీచంగా ప్రవర్తించాని అన్నారు.
అప్పుడు ద్రౌపదిని శ్రీకృష్ణ పరమాత్మ కాపాడాడని చెప్పారు. అదే విధంగా చంద్రబాబును సభలో ఎదుర్కొలేక గత పాలకులు సభలో ఆయనను హింసించాలని తన పేరును లాగి నాశీలం గురించి మాట్లాడారని చెబుతు భావొద్వేగంకు గురయ్యారు. మగాడు మగాడిలా మాట్లాడాలని అన్నారు. ఆ దేవుడే తమకు అండగా నిలిచాడని అందుకే ప్రజల రూపంలో తమను ఎన్నికల్లో గెలిచేలా చేసి మా కుటుంబంకు అండగా నిలిచాడని చెబుతూ నారా భువనేశ్వరీ తీవ్రంగా స్పందించారు.
ఈ విషయం గురించి నేను ఇప్పటివరకు ఎక్కడా మాట్లాడలేదని.. . కానీ ఈ రోజు ద్రౌపది అమ్మవారిని దర్శించుకున్న తర్వాత... స్త్రీ అంటే ఏమిటి, స్త్రీని పురుషులు ఎంత గౌరవించాలో గుర్తు చేయాలనిపించిందని చెప్పుకొచ్చారు. మా కుటుంబాన్ని ఎంతగా అవమానించినా... ప్రతిసారీ ప్రజల రూపంలో దేవుడే వచ్చి మాకు అండగా నిలిచారని నారా భువనేశ్వరీ స్పష్టం చేశారు. తిరుమలలో బాంబులు పెట్టిన ఘటనల్లో కూడా ఆ దేవుడు తమకు అండగా ఉంటున్నాడని అన్నారు.
రాజమండ్రిలో నిర్భందించిన కూడా ఆ దేవుడు ప్రజల రూపంలో తమకు అండగా నిలిచారన్నారు. ప్రతి ఒక్క స్త్రీని అందరు గౌరవించుకొవాలని నారా భుశనేశ్వరీ స్పష్టం చేశారు. ప్రస్తుతం నారా భువనేశ్వరీ చేసిన కామెంట్స్ ఏపీ రాజకీయాల్లో కొత్త చర్చకు తెరతీశాయి. దీనిపై వైసీపీ ఏవిధంగా స్పందిస్తుందో తెలియాల్సి ఉంది.
