జనహిత ఆధ్వర్యంలో మట్టి గణపతి ప్రతిమల పంపిణీ
Bellampalle, Kannal Rural, Telangana:పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మట్టి గణపతులను పూజించాలని మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఆర్డీవో హరికృష్ణ, వన్ టౌన్ సీఐ దేవయ్యలు అన్నారు. శుక్రవారం పట్టణంలోని కాంట చౌరస్తా వద్ద జనహిత సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన మట్టి గణపతి ప్రతిమల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరై ప్రజలకు ప్రతిమలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రతి ఏడాది పర్యావరణ పరిరక్షణకై మట్టి ప్రతిమలు పంపిణీ చేస్తున్న జనహిత సేవా సమితి సభ్యులను అభినందించారు. కార్యక్రమంలో సేవా సమితి అధ్యక్షులు సతీష్, సభ్యులు పాల్గొన్నారు.हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
Iran Warns America: అమెరికా-ఇజ్రాయెల్కు ఇరాన్ వార్నింగ్.."చిన్న పొరపాటు చేసినా పేల్చిపడేస్తాం"..యుద్ధం మళ్లీ షూరూ అయ్యేనా?
Haftador, Yazd Province:Iran Warns America-Israel: పశ్చిమాసియాలో పరిస్థితులు మరోసారి ఉధృతంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాల్పుల విరమణ సమయంలో అమెరికా, ఇజ్రాయెల్ ఏ చిన్న పొరపాటు చేసినా ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ హెచ్చరించింది. ఇదే విషయాన్ని ఇరాన్ దేశ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఘేర్ గాలిబాఫ్ అమెరికాను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశాడు. గతంతో పోలిస్తే తమ సైనికుల సంపత్తి.. ప్లానింగ్ కెపాసిటీ భారీగా పెరిగనట్లు ఆయన చెప్పుకొచ్చారు. శత్రువల ఎత్తుగడలను చిత్తు చేసేందుకు రంగం సిద్ధం చేశామని ఆయన బదులిచ్చారు.
ఇరాన్ గగనతల రక్షణ వ్యవస్థ తీవ్రంగా బలోపేతం చేసినట్లు చెప్పిన స్పీకర్ గాలిబాఫ్.. గత కొన్ని నెలలుగా సుమారు 180 శత్రువుల డ్రోన్లను పేల్చేసినట్లు ఆయన వెల్లడించారు. అమెరికాకు చెందిన అడ్వాన్స్డ్ ఎఫ్-35 యుద్ధ విమానంపై జరిగిన దాడి ఇరాన్ సాంకేతిక డిజైన్ కెపాసిటీకి నిదర్శనమని ఆయన ప్రకటించారు. ఇప్పటికే తమ శత్రువులకు తమ స్థాయి ఏంటో తెలిసిందని ఆయన పునరుద్ఘాటించారు.
ప్రస్తుత అమలులో ఉన్న కాల్పుల విరమణ ఒప్పందంపై మాట్లాడుతూ.. తమ డిమాండ్స్ నెరవేరడం వల్లనే కాల్పుల విరమణకు అంగీకరించినట్లు స్పీకర్ గాలిబాఫ్ చెప్పారు. క్షేత్రస్థాయిలో ఈ యుద్ధంలో తామే విజయం సాధించినట్లు ధీమా వ్యక్తం చేశారు. ఇస్లామాబాద్ వేదికగా అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్తో చేసిన చర్చలు దౌత్యపరమైన పోరాటంలో భాగమని అయన వెల్లడించారు. ఓ పక్క శాంతి చర్చలు జరుగుతున్న వేళ హార్ముజ్ జలసంధి నియంత్రణలో ఇరాన్ "తగ్గేదేలే" అన్నట్లు ప్రవర్తిస్తుంది.
ఇజ్రాయిల్కు అమెరికా తమ పూర్తి మద్దతు ఇస్తుందని తెలిపిన గాలిబాఫ్.. మరో కొద్దిరోజుల్లో కాల్పుల విరమణ గడువు ముగిసే క్రమంలో ప్రతీకారం తీర్చుకుంటామనే వ్యాఖ్యలు ఇప్పుడు చర్చానీయాంశంగా మారాయి. అణు కార్యకలాపాలు, చమురు రవాణాకు కీలకమైన హార్ముజ్ జలసంధి అంశాలపై రెండు దేశాల మధ్య ఇంకా ఏకాభిప్రాయం రాకపోవడం వల్ల హార్ముజ్ జలసంధిపై ఇరాన్ ఆంక్షలను విధిస్తోంది.
Also Read: Hormuz Gunfire: యుద్ధంలో బిగ్ ట్విస్ట్..భారత నౌకలపై ఇరాన్ IRGC కాల్పులు..అస్సలు ఏం జరుగుతోంది?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
PM Modi On Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ప్రధాని మోదీ ఫోన్..ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసిన పీఎం!
Nunna, Vijayawada, Andhra Pradesh:PM Modi On Pawan Kalyan Health: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు జరిగిన సర్జరీపై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరా తీశారు. తాజాగా పవన్ కళ్యాణ్తో మాట్లాడిన ప్రధాని మోదీ.. ఆయన ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతం త్వరగా కోలుకోవాలని ఆయన ట్వీట్ చేశారు.Kcr Public Meeting: జగిత్యాల జైత్రయాత్ర.. కేసీఆర్ సభకు సర్వం సిద్ధం..
Jagtial, Telangana:KCR Jagitial Public Meeting Latest News: తెలంగాణ రాజకీయాల్లో కీలక ఘట్టానికి జగిత్యాల వేదిక కాబోతోంది.. రేపు పట్టణంలో నిర్వహిస్తున్న బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభకు భారీ ఏర్పాట్లు పూర్తయ్యాయి. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు కాబోతున్న ఈ బాహిరంగ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పార్టీ శ్రేణులు తమ బలాన్ని చాటుకునేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే పట్టణమంతా గులాబీ తోరణాలతో పాటు ఫ్లెక్సీలతో నిండిపోయింది. ఈ సభకు నేరుగా మాజీ ముఖ్యమంత్రి రావడం వల్ల అధికారులు ప్రత్యేకమైన భద్రతను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది..
ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని సభకు వచ్చే సామాన్య ప్రజలకు, కార్యకర్తలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నాయకులు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా తాగునీరు ఇబ్బంది రాకుండా భారీ స్థాయిలో ఏర్పాట్లు చేశారట.. మూడు లక్షల వాటర్ బాటిల్లు సభా ప్రాంగణం వద్ద అందుబాటులో ఉంచారట. దీంతోపాటు ఎండ వేడి నుంచి ఉపశమనం కలిగేందుకు రెండు లక్షల మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ కూడా చేయబోతున్నట్లు తెలుస్తోంది. సభా ప్రాంగణంలో భారీ కూలర్లతో పాటు ఫ్యాన్లను కూడా ఏర్పాటు చేశారు..
ఉమ్మడి కరీంనగర్ జిల్లా నలుమూలల నుంచి వేలాది వాహనాల్లో జనం తరలివచ్చే అవకాశాలు ఉండడంతో పోలీసులతో పాటు పార్టీ వాలెంటీర్లు సమన్వయంతో పనిచేస్తున్నారు.. వివిధ రూట్ల నుంచి వచ్చే బస్సులతోపాటు కార్లు, ద్విచక్ర వాహనాల కోసం ప్రత్యేకమైన పార్కింగ్ స్థలాలను కేటాయించారు. పట్టణంలో ట్రాఫిక్ జామ్ కాకుండా ప్రత్యామ్నాయ మార్గాలను సూచిస్తూ సైన్ బోర్డులను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం..
ఉమ్మడి జిల్లా BRS ఎమ్మెల్యేలే కాకుండా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన పార్టీ కీలక నేతలు కూడా సభ స్థలాన్ని నిరంతరం సందర్శిస్తూ.. పనులను పర్యవేక్షిస్తున్నారట.. స్టేజ్ నిర్మాణంతోపాటు సౌండ్ సిస్టం, విలేకరుల గ్యాలరీ తో పాటు వీఐపీలు కూర్చునే ఏర్పాట్లపై నేతలు దగ్గరుండి ఏర్పాట్లను చేస్తున్నారట.. జగిత్యాల గడ్డ ఎప్పుడు కేసీఆర్ గారికి అండగా ఉంటుందని.. ఈ సభ ద్వారా ప్రతిపక్షాలకు గట్టి సమాధానం చెబుతామని అక్కడి నేతలు ఇప్పటికే ధీమా వ్యక్తం చేస్తున్నారు..
భారీ బహిరంగ సభ నేపథ్యంలో పోలీసులు ఇప్పటికే ప్రత్యేకమైన భద్రత ఏర్పాట్లను చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సీసీ కెమెరాల నిఘాతో పాటు మఫ్టీల్లో ఉన్న పోలీసులు కూడా నిరంతరం పహార కాస్తున్నారట. ఎక్కడ చిన్నపాటి అవాంఛనీయ ఘటన జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ఈ సభ కేవలం రాబోయే ఎన్నికలకు ప్రచారం మాత్రమే కాదని.. జగిత్యాల ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపమని పార్టీ వర్గాలు అభివర్ణిస్తున్నాయి. రేపు మధ్యాహ్నం జరగబోతున్న ఈ మహాసభ కోసం ఇప్పుడు అందరి కళ్ళు జగిత్యాల వైపే ఉన్నాయి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
MPTC ZPTC Polls: కరీంనగర్ జిల్లా నుంచి ఎన్నికల కసరత్తు ప్రారంభం.. రంగంలోకి యంత్రాంగం..
Karimnagar, Telangana:Mptc Zptc Polls Telangana News: రాష్ట్రంలో సర్పంచ్తో పాటు మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ముగియడంతో ప్రభుత్వం ఇప్పుడు ద్వితీయతో పాటు తృతీయ శ్రేణి స్థానిక సంస్థలపై దృష్టి సాధించింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఎంపీటీసీతో పాటు జడ్పిటిసి ఎన్నికల నిర్వహణకు సంబంధించిన కసరత్తు వేగవంతం చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇప్పటికే అక్కడ ఎన్నికల హడావిడి ప్రారంభమైనట్లు తెలుస్తోంది.
ఎన్నికల నిర్వహణలో అత్యంత కీలకమైన ఓటర్ల జాబితా తయారీపై అధికారులు నిమగ్నమయ్యారు. 2026 ఫిబ్రవరి 5 నాటి గణాంకాల ప్రాతిపదికగా తీసుకుని.. మండలాల వారీగా ఓటర్ల జాబితాను రూపొందించాలని ఎలక్షన్ కమిషన్ ఆదేశించింది. ఈ జాబితాను పంచాయితీ వార్డు రూల్స్ తో మ్యాపింగ్ చేసే ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. ఒకవేళ ఓటర్ల జాబితాలో ఏమైనా వ్యత్యాసాలు లేదా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 23వ తేదీ లోపు నివేదికను సమర్పించాలని కలెక్టర్లను ఎన్నికల సంఘం సూచించింది..
ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో ఎన్నికలు జరగనున్న స్థానాల వివరాలు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. ఇక్కడ మొత్తం 60 జెడ్పిటిసి స్థానాలకు, 646 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.. ఇప్పటికే ఈ స్థానాల్లో ఓటర్ల జాబితాలకు సంబంధించిన వివరాలను కూడా కోరినట్లు సమాచారం. రాష్ట్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసే లోపే క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా యంత్రాంగం భావిస్తుందని.. అందులో భాగంగానే ఈ పనులన్నీ పూర్తి చేస్తున్నట్లు తెలుస్తోంది..
పోలింగ్ కేంద్రాల గుర్తింపుతో పాటు బ్యాలెట్ బాక్స్ లభ్యత, సిబ్బంది కేటాయింపు వంటి అంశాలపై ఇప్పటికే ప్రాథమిక సమీక్షలు ముగిసాయట.. ఓటర్ల జాబితా మ్యాపింగ్ ప్రక్రియలో ఎలాంటి తప్పులు దొర్లకుండా గ్రామపంచాయతీ కార్యదర్శులతో పాటు MRO సమన్వయంతో పని చేయాలని ఉన్నతాధికారులు పలుసార్లు ఆదేశించినట్లు సమాచారం. వార్డుల విభజనతో పాటు ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు ఉన్నవారు నిర్నిత గడువులోగా సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కోరింది..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Huawei: ఏప్రిల్ 20న ఎంట్రీ.. కిరిన్ 9030 ప్రాసెసర్తో Huawei Pura 90 Pro Max.. బాహుబలి ఫీచర్లు!
Hyderabad, Telangana:Huawei Pura 90 Pro Max Leaks Telugu News: స్మార్ట్ఫోన్ ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉన్న హువావే అతి త్వరలోనే మరో కొత్త మొబైల్ను విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.. దీనిని కంపెనీ పురా 90 సిరీస్తో విడుదల చేసి సంచలనం సృష్టించేందుకు సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి.. చైనాకు చెందిన ప్రముఖ టిప్స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ ఈ వివరాలను స్వయంగా తన సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేశారు.. ఈ స్మార్ట్ఫోన్ అద్భుతమైన బ్యాటరీ లైఫ్తో పాటు ఎన్నో రకాల కెమెరా ఫీచర్లతో విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది.. ముఖ్యంగా ఇది చూడడానికి ఎంతో ప్రత్యేకమైన డిజైన్లు కలిగి ఉండే అవకాశాలు ఉన్నట్లు లీకైన ఫోటోలు చెబుతున్నాయి. అయితే, ఈ మొబైల్కు సంబంధించిన అన్ని రకాల వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.
లీకైన వివరాల ప్రకారం.. ఈ స్మార్ట్ఫోన్ సిరీస్లో ఎంతో శక్తివంతమైన 6500mAh భారీ బ్యాటరీని కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా బేస్ మోడల్స్లో 6000mAh భారీ బ్యాటరీ ఉండే అవకాశాలున్నాయి. ప్రో మోడల్స్లో మాత్రం అద్భుతమైన ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో పాటు చాలా రకాల కొత్త కొత్త ఫీచర్లు అందుబాటులోకి రాబోతున్నట్లు సమాచారం ముఖ్యంగా వైర్లెస్ చార్జింగ్ టెక్నాలజీని మరింత మెరుగుపరుస్తూ ఈ స్మార్ట్ఫోన్స్ను తయారు చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
ఈ స్మార్ట్ఫోన్లో ఎంతో శక్తివంతమైన 200 మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ కెమెరా ఉండబోతోంది. అంతేకాకుండా అదనంగా 40MP అల్ట్రా వైడ్ కెమెరాతో పాటు 50MP ప్రధాన కెమెరాను కూడా కలిగి ఉంటుంది. ఇందులోని అల్ట్రా వైడ్ లైన్స్ 4k వీడియో సపోర్టింగ్ను కూడా కలిగి ఉంటుంది తక్కువ కాంతిలో ఎక్కువ క్వాలిటీ ఫోటోలను అందించేందుకు ఎంతగానో సహాయపడుతుంది ముఖ్యంగా ఇందులో వివిధ రకాల కెమెరా మోడ్లు కూడా ఉన్నట్లు సమాచారం. దీనివల్ల కావలసినప్పుడల్లా మోడ్స్ మార్చుకొని.. ఫోటోలను దిగొచ్చు.
Read more: Cheap Luxury Cars: కేవలం రూ. 15 లక్షలకే BMW.. ఆడి కారు రూ. 7.50 లక్షలే.. ఎక్కడో తెలుసా?
పురా 90 ప్రో మాక్స్ స్మార్ట్ఫోన్ చాలా ప్రత్యేకమైన 6.87-అంగుళాల 1.5K రిజల్యూషన్ కలిగిన OLED డిస్ప్లేతో విడుదల కాబోతోంది.. ఇది 120Hz రిఫ్రెష్ రేట్ను సపోర్ట్ చేస్తుందని కంపెనీ లీక్ అయిన వివరాలు చెబుతున్నాయి.. హువావే సొంతంగా అభివృద్ధి చేసిన కిరిన్ 9030 (Kirin 9030) ప్రాసెసర్తో ఈ ఫోన్ పనిచేస్తుందని వార్తలు వస్తున్నాయి. ఈ మొబైల్ను కంపెనీ 16gb ర్యామ్తో విడుదల చేయబోతోంది. ఇది వివిధ స్టోరేజ్ ఆప్షన్స్లో అందుబాటులో ఉంటుంది. అలాగే స్టోరేజ్ వేరియంటును బట్టి ధర కూడా నిర్ణయిస్తారని టెక్ నిపుణులు భావిస్తున్నారు..
ఈ స్మార్ట్ఫోన్ను హువావే కంపెనీ ఏప్రిల్ 20వ తేదీన చైనాలో అధికారికంగా విడుదల చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అక్కడ విడుదల చేసిన తర్వాతే అంతర్జాతీయ మార్కెట్లో అందుబాటులోకి తీసుకురావాలని కంపెనీ యోచిస్తుందట. అంతేకాకుండా ఈ మొబైల్ విడుదలయితే వివిధ ప్రీమియం బ్రాండ్లతో కూడిన స్మార్ట్ఫోన్స్తో ఈ మొబైల్ సిరీస్ పోటీ పడే అవకాశాలున్నాయి. అయితే, అతి త్వరలోనే కంపెనీ ఈ స్మార్ట్ఫోన్స్కి సంబంధించిన ఫీచర్స్ను అధికారికంగా వెల్లడించబోతోంది.
Read more: Cheap Luxury Cars: కేవలం రూ. 15 లక్షలకే BMW.. ఆడి కారు రూ. 7.50 లక్షలే.. ఎక్కడో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
YS Jagan On Pawan Kalyan: స్వరం మార్చిన వైసీపీ అధినేత..జగన్ నోట డిప్యూటీ సీఎం మాట..వైఎస్ జగన్ ఎమోషనల్ ట్వీట్!
Vijayawada, Andhra Pradesh:YS Jagan On Pawan Kalyan Health: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి తాజాగా సర్జరీ అయిన సంగతి తెలిసిందే. ఇటీవలే పవన్ కళ్యాణ్ అస్వస్థతకు గురైన నేపథ్యంలో ఆయన్ని హుటాహుటిన హైదరాబాద్లో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత సర్జరీ అవసరమని వైద్యులు సూచించడంతో వెంటనే సర్జరీ చేశారు. అయితే ఇదే విషయమై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత జగన్ సోషల్ మీడియాలో స్పందించారు. పవన్ కళ్యాణ్ ఆరోగ్యం పూర్తిగా మెరుగవ్వాలని వారు ఆశించారు.
అయితే వైసీపీ అధినేత జగన్ స్పందించిన తీరు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేరుగానీ, ఆయన పార్టీ గురించి ప్రస్తావించేందుకు ఇష్టపడలేదు. పవన్ కళ్యాణ్ని గతంలో జగన్ దత్తపుత్రుడు అంటూ పరోక్షంగా సంభోధించేవారు. అధికారంలో ఉన్న అన్ని రోజులు పవన్ కళ్యాణ్ గురించి ప్రస్తావించేందుకు ఇష్టపడని జగన్.. ఇప్పుడు స్పెషల్గా పవన్ కళ్యాణ్ను ఆయన పేరుతో జగన్ ట్వీట్లో ప్రస్తావించడంతో ఇప్పుడు ఇరు పార్టీల నేతలు ఆశ్చర్యానికి గురవుతున్నారు.
Wishing @PawanKalyan Garu a speedy and complete recovery following his surgery. Get well soon!
— YS Jagan Mohan Reddy (@ysjagan) April 19, 2026
2024 ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్కు అభినందనలు తెలిపేందుకు వైఎస్ జగన్ ఇష్టపడలేదు. కానీ, ఇప్పుడు ఈ ఘటన మరింత చర్చ మారింది. కూటమిలో ఉన్న పార్టీలు బలంగా ఉండడంతో రానురాను అధికారానికి దూరమైపోతామేమో అని అటు వైసీపీ నేతలు కూడా అంతర్గతంగా చర్చించుకుంటున్నారు.
అయితే ఇలాంటి పరిస్థితుల్లో కూటమిని విడగొట్టాలని వైసీపీ గతంలో ఎన్నో ప్రయత్నాలు చేసిన సంగతి తెలిసిందే. ఇలాంటి రాజకీయ ప్రణాళికల్లో భాగంగా జనసేనకు దగ్గరైతే బాగుంటుందని ఎప్పటి నుంచో వైసీపీ సీనియర్ నేతలు చెబుతున్న సత్యమిది. తాజాగా జరిగిన పరిణామాలతో జనసేతతో కయ్యం కంటే వియ్యం బెటర్ అని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ ను వ్యక్తిగతంగా ఎన్నో విమర్శలు చేసిన వైసీపీ పార్టీ.. ఇప్పుడు డిప్యూటీ సీఎం పేరు ఎత్తేందుకు కొంత ఆలోచిస్తున్న మాట వాస్తవమే. ఇప్పుడు అధికారం కోల్పయిన తర్వాత పవన్ కళ్యాణ్ను వ్యక్తిగతంగా విమర్శించడం మానేసి.. సానుకూలంగా ఉంటే కనీసం వైసీపీ పార్టీపై నెగెటివిటీ తగ్గుతుందని వైసీపీ నేతలు భావిస్తున్నట్లు సమాచారం. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ ఆరోగ్యం బాగుపడాలని వైసీపీ అధినేత చేసిన ట్వీట్పై ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో తెగ చర్చ జరుగుతోంది.
Spoke to Andhra Pradesh Deputy Chief Minister Shri Pawan Kalyan Garu and enquired about his well-being. He is remarkably courageous and I am sure he will recover very soon. Praying for his good health.@PawanKalyan
— Narendra Modi (@narendramodi) April 19, 2026
డిప్యూటీ సీఎంకు ప్రధాని మోదీ సందేశం..
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు జరిగిన సర్జరీపై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. ఇదే విషయమై మోదీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు ఫోన్లో మాట్లాడినట్లు మోదీ ట్వీట్లో స్పష్టం చేశారు. పవన్ యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నట్లు మోదీ తెలిపారు. పవన్ లాంటి ధైర్యవంతులు, త్వరగా కోలుకుంటారనే నమ్మకం తనకు ఉన్నట్లు మోదీ చెప్పుకొచ్చారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరోగ్యం మెరుగుపడాలని కోరుకుంటున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Vivo X300 FE: 90W ఫాస్ట్ ఛార్జింగ్, 6500mAh బ్యాటరీ.. Vivo నుంచి పవర్ ప్యాక్డ్ స్మార్ట్ఫోన్!
Hyderabad, Telangana:Vivo X300 FE Price Cut: ప్రముఖ స్మార్ట్ఫోన్ దిగ్గజం వివో మరో పవర్ఫుల్ ఫ్లాగ్ షిప్ స్మార్ట్ఫోన్ భారత్ మార్కెట్లోకి విడుదల చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. దీనిని కంపెనీ వివో x300 Fe పేరుతో లాంచ్ చెయ్యబోతోంది. ఈ స్మార్ట్ఫోన్ అద్భుతమైన కెమెరా సామర్థ్యంతో పాటు భారీ బ్యాటరీ ప్యాకప్తో Tech ప్రియులను ఆకర్షించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా ఈ మొబైల్ ప్రధాన ఆకర్షణగా కెమెరా ఉండబోతోంది. ఎందుకంటే ఇది మోస్ట్ పవర్ఫుల్ కెమెరా సెటప్తో విడుదల కాబోతున్నట్లు లీకైన వివరాలు చెబుతున్నాయి. అయితే, ఈ స్మార్ట్ఫోన్ ఎలాంటి ఫీచర్లతో అందుబాటులోకి వస్తుందో? ప్రస్తుతం ఈ మొబైల్కు సంబంధించిన లీక్ అయిన వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
వివో x300 Fe స్మార్ట్ఫోన్ ప్రధాన ఆకర్షణ దీని బ్యాటరీ కొన్ని లీకైన వివరాలు చెబుతున్నాయి. దీనిని కంపెనీ ఎంతో శక్తివంతమైన 6500mAh బ్యాటరీతో లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. ఇది అద్భుతమైన బ్యాటరీని చార్జ్ చేసేందుకు ప్రత్యేకమైన 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు కూడా లభిస్తుంది. అయితే, ఈ సదుపాయం ఉండడం వల్ల తక్కువ సమయంలోనే ఫోన్ పూర్తిగా చార్జ్ అవుతుంది. ఈ బ్యాటరీ దాదాపు రెండు రోజుల వరకు ప్లే బ్యాక్ను అందిస్తుందని కంపెనీ క్లైమ్ చేయబోతున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి..
ఇక ఈ మొబైల్ ప్రత్యేకత ఏంటంటే.. దీని బ్యాక్ కెమెరా.. ఈ వివో x300 Fe స్మార్ట్ఫోన్ వెనుక భాగంలో త్రిపుల్ కెమెరా సెటప్ని కలిగి ఉంటుంది. చూడడానికి చాలా ఆకర్షణీయంగా కెమెరా మాడ్యూయల్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఇది ఎంతో ప్రత్యేకమైన 50MP ప్రధాన కెమెరాను కలిగి ఉండబోతోంది. అలాగే దీనికి తోడు అదనంగా 50MP టెలిఫోటో లెన్స్, 50MP కెమెరాలు ఉండడం విశేషం.. ఫ్రంట్ భాగంలో కూడా చాలా అద్భుతమైన కెమెరా సెటప్ ను కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. వీడియో కాలింగ్ కోసం ఈ కెమెరా ఎంతగానో సహాయపడుతుందట...
Read more: Cheap Luxury Cars: కేవలం రూ. 15 లక్షలకే BMW.. ఆడి కారు రూ. 7.50 లక్షలే.. ఎక్కడో తెలుసా?
ఇక ఈ Vivo X300 FE మొబైల్ చాలా అద్భుతమైన 6.31 అంగుళాల 1.5K OLED డిస్ప్లేను కలిగి ఉంటుంది. దీనితోపాటు 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్టుతో లభిస్తుంది. దీనివల్ల గేమింగ్తో పాటు వీడియోలు చూసేందుకు చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇక ఈ స్మార్ట్ఫోన్ ఎంతో శక్తివంతమైన Qualcomm Snapdragon 8 Gen 5 ప్రాసెసర్ను కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. ఇది మల్టీ టాస్కింగ్ తో పాటు పెద్ద పెద్ద గేమ్స్ ఆడేందుకు ఎంతగానో సహాయపడుతుంది. అయితే, ఈ మొబైల్ భారత మార్కెట్లోకి విడుదలయితే ధర రూ.65,000 నుంచి ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి..
Read more: Cheap Luxury Cars: కేవలం రూ. 15 లక్షలకే BMW.. ఆడి కారు రూ. 7.50 లక్షలే.. ఎక్కడో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
JEE Main Results 2026: రేపే JEE Main సెషన్-2 రిజల్ట్స్! స్కోర్ కార్డ్, డైరెక్ట్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..!
Hyderabad, Telangana:JEE Main Session 2 Results 2026 Out: జేఈఈ మెయిన్స్ పరీక్షలు 11 లక్షల మంది విద్యార్థులు ఈ ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. ఇక సెషన్ 2 బీఈ/ బీటెక్ పేపర్ 1 ఫలితాలు ఆలిండియా ర్యాంక్ తో పాటు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ రేపు విడుదల చేసే అవకాశం ఉంది. ఫలితాలు వెల్లడించిన తర్వాత స్కోర్ కార్డును అధికారిక వెబ్సైటు Jeemain.nta.nic.in లో అప్లికేషన్ నెంబర్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సెషన్ 1 లో 13 లక్షల మంది విద్యార్థులు పరీక్షకు హాజరు అయ్యారు. ఇందులో 12 మంది విద్యార్థులకు 100 శాతం లభించింది
జేఈఈ మెయిన్ సెషన్ 2 స్కోర్ కార్డును డౌన్లోడ్ చేసుకునే విధానం..
అధికారిక వెబ్సైట్ Jeemain.nta.nic.in ఓపెన్ చేసి అందులో జేఈఈ మెయిన్ సెషన్ 2 బీఈ/బీటెక్ పేపర్ 1 ఫలితాలు 2026 ఎంపిక చేసుకోవాలి. అక్కడ మీ అప్లికేషన్ నెంబర్ పాస్వర్డ్ నమోదు చేసి స్కోర్ కార్డును మీ స్క్రీన్ పైన కనిపిస్తుంది. వెంటనే డౌన్లోడ్ చేసుకొని సేవ్ చేసి పెట్టుకోవాలి.
జేఈఈ మెయిన్ పరీక్షలో అర్హత పొందిన అభ్యర్థులు జేఈఈ అడ్వాన్స్ పరీక్షలకు అర్హత సాధిస్తారు. ఇది ఐఐటీ లాంటి ఇన్స్టిట్యూట్లో సీటు పొందడానికి మార్గమని చెప్పొచ్చు. జేఈఈ అడ్వాన్సుడ్ లో మంచి ప్రతిభ చూపించిన అభ్యర్థులకు ఐఐటి, ఎన్ఐటి, IIT ఇనిస్టిట్యూట్లో కౌన్సిలింగ్ ప్రక్రియ మొదలవుతుంది. జేఈఈ అడ్వాన్స్డ్ 2026 ఎగ్జామినేషన్ మే 17, 2026 నిర్వహించే అవకాశం ఉంది. సెషన్ 2 పరీక్ష ఏప్రిల్ 2, 8వ తేదీన కంప్యూటర్ ఆధారితంగా దేశవ్యాప్తంగా 304 సిటీల్లో నిర్వహించారు.
జేఈఈ మెయిన్స్ 2026 స్కోర్ కార్డులో విద్యార్థికి సంబంధించిన పేరు, క్రమ సంఖ్య, తల్లిదండ్రుల వివరాలు, రాష్ట్రం, అర్హత, సబ్జెక్టువారీగా పర్సంటేజ్, మొత్తం మార్కులు, ఆల్ ఇండియా ర్యాంకు క్యాటగిరి ర్యాంకు, క్వాలిఫైయింగ్ స్టేటస్ జేఈఈ అడ్వాన్స్డ్ వివరాలు పొందుపరిచి ఉంటాయి.
Also Read: CISCE Results 2026: త్వరలోనే ICSE, ISC ఫలితాలు.. రిజల్ట్స్ లింక్, స్కోర్కార్డ్ వివరాలు ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
Lord Hanuman: ఆంజనేయుడి పేరెత్తని ఊరు.. స్వామిపై ఆ గ్రామస్తులకు ఎందుకు అంత కోపం?
Hyderabad, Telangana:Lord Hanuman Latest Telugu News: భారతదేశంలో రామాయణం.. రామనామం వినబడని గ్రామం ఉండటం అరుదు.. హనుమంతుడిని ఆరాధించని హిందూ గ్రామం అసలు ఉండదేమో.. కానీ దేవ భూమిగా పిలిచే ఉత్తరాఖండ్లోని చమేలీ జిల్లాలు ఉన్న ద్రోణగిరి అనే గ్రామం ఎందుకు పూర్తిగా భిన్నంగా ఉంటుంది.. అక్కడ హనుమంతుడికి గుడి ఉండదు.. కనీసం ఆయన పేరు మీద జెండాలు కూడా కనిపించవటే నమ్ముతారా? నమ్మాల్సిందే. ఇదంతా దేవుడిపై ద్వేషంతో కాదు.. ఒకనాటి చారిత్రక అవమానం కారణంగా వారు పాటిస్తున్న నిరసన.. అవును మీరు చదివింది నిజమే.. ఆనాడు జరిగిన ఓ సంఘటనకు అవమానానికి సూచికగా ఇదంతా జరుగుతోంది.
పురాణాల ప్రకారం.. రామ రావణ యుద్ధ సమయంలో మేఘనాథుడి అస్రానికి లక్ష్మణుడు మూర్చ పడిపోతాడు. ఆ సమయంలో లక్ష్మణుడి ప్రాణాలను కాపాడటానికి సంజీవని మూలిక అవసరమవుతుంది. ఆ మూలికను తెచ్చే బాధ్యత హనుమంతుడు స్వీకరించడం మనందరికీ తెలిసిందే.. హిమాలయాల్లోని ద్రోణగిరి పర్వతంపై ఆ మూలిక ఉందని తెలుసుకున్న హనుమ.. అక్కడికి చేరుకుంటాడు. అయితే చీకటి పడటంతో ఏది సంజీవని మొక్కో గుర్తుపట్టలేక.. ఏకంగా ఆ పర్వతాన్ని పెకలించుకొని లంకకు తీసుకొని వెళ్ళిపోతాడు.
ద్రోణగిరి గ్రామస్తులు ఆ పర్వతాన్ని తమ గ్రామ దేవతగా.. ఆరాధ్య దైవంగా పూజిస్తారు. హనుమంతుడు ఆ పర్వతాన్ని తీసుకెళ్లే సమయంలో తమ గ్రామ దేవత అనుమతి తీసుకోలేదు.. ఇది తమ దేవతను అవమానించడమేనని స్థానికులు నమ్ముతారు. తమ ఆరాధ్య దైవమైన కొండలు కొంత భాగాన్ని హనుమంతుడు అపహరించుకుపోయాడనేది వారి ప్రధాన ఆవేదన. తమ పూర్వికుల నుంచి వస్తున్న నమ్మకం ప్రకారం.. హనుమంతుడు వారి కొండను ముక్కలు చేసి తీసుకెళ్లడం వల్ల గ్రామదేవత అపవిత్రమైందని.. అందుకే వారు ఆయనను పూజించారని స్థానిక గ్రామస్తులు చెబుతున్నారు..
ఈ గ్రామంలో నేటికీ శ్రీరాముని పూజిస్తారు కానీ.. హనుమంతుడి ప్రస్తావన అస్సలు రాదట.. రామ లీల ఉత్సవాలు నిర్వహించిన హనుమంతుడి పాత్ర ప్రదర్శించారట.. విషయం ఏమిటంటే వేట నిర్వహించే గ్రామ ఉత్సవాల్లో హనుమంతుడికి పూజలు చేసిన మహిళలను కూడా కుల బహిష్కరణ చేస్తామని వారి పెద్దలు హెచ్చరిస్తారట.. ప్రస్తుతం అంతకఠిన నిబంధనలు లేకపోయినా.. ఇప్పటికీ గ్రామంలో ఎవ్వరు హనుమంతుని విగ్రహాన్ని ప్రతిష్టించారు. భక్తితో కూడిన ఒక వింత నిరసనగా ఈ సాంప్రదాయం చరిత్రలో నిలిచిపోయింది..
Also Read: చాట్ జీపీటీ వాడకంలో ఆ నగరమే ఫస్ట్.. హైదరాబాద్ ప్లేస్ ఎక్కడ? ఆసక్తికరంగా OpenAI లేటెస్ట్ రిపోర్ట్!
Hyderabad Police: హైదరాబాద్లో ‘ఆపరేషన్ సేఫ్ స్కూల్'.. 558 షాపులపై పోలీస్ రైడ్
Hyderabad, Telangana:Police Special Raid: తరగతి గదిలో విద్యా బుద్ధులు నేర్చుకునే విద్యార్థులు.. విద్యాలయం బయటకు వచ్చాక ఆరు బయట కూడా బుద్ధిగా ఉండేలా హైదరాబాద్ పోలీసులు ప్రత్యేక ఆపరేషన్ చేశారు. విద్యాలయాలు సురక్షిత ప్రాంతాలుగా తీర్చిదిద్దేందుకు పోలీసులు దాడులు చేశారు. దేశానికి వెన్నెముకగా ఉన్న భావితరం చెడుదారి పట్టకుండా.. అడ్డదారులు తొక్కకుండా హైదరాబాద్ పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేశారు. పలు ప్రాంతాల్లో 558 దుకాణాల్లో తనిఖీలు చేపట్టారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
భావితరాల ఉజ్వల భవిష్యత్తును చిదిమేస్తున్న డ్రగ్స్ మహమ్మారిని అంతమొందించడమే లక్ష్యంగా హైదరాబాద్ సిటీ పోలీస్ విభాగం ఆపరేషన్ సేఫ్ స్కూల్ పేరుతో శనివారం భారీ స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. స్కూళ్లు, కళాశాలల పరిసరాలను వ్యసనరహితంగా తీర్చిదిద్ది.. చిన్నారులు పెడదోవ పట్టకుండా చూడాలనే సంకల్పంతో హైదరాబాద్ పోలీస్ ప్రత్యేక సోదాలు చేపట్టింది. విద్యాసంస్థల సమీపంలో లభించే పొగాకు ఉత్పత్తులతో విద్యార్థులు క్రమంగా ఆల్కహాల్, డ్రగ్స్ వంటి వ్యసనాలకు బానిసలయ్యే ప్రమాదం ఉందని పోలీస్ శాఖ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ అలవాట్లు చివరకు వారిని చిన్నపాటి నేరాల నుంచి తీవ్రమైన నేరాల వైపు పురికొల్పి.. వారి బంగారు భవిష్యత్తును అంధకారం చేస్తున్నాయని పోలీస్ శాఖ గుర్తించింది. ఈ విషవలయాన్ని ప్రాథమిక దశలోనే తుంచివేసేందుకు పోలీసులు ఆపరేషన్ సేఫ్ స్కూల్ తనిఖీలు చేపట్టారు.
సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తుల చట్టం 2003 సెక్షన్ 6 (బీ) ప్రకారం విద్యాసంస్థలకు 100 గజాల లోపు పొగాకు విక్రయాలు పూర్తిగా నిషిద్ధమని దుకాణా నిర్వాహకులకు తెలిపారు. మైనర్లకు పొగాకు ఉత్పత్తులను విక్రయించడం జువైనల్ జస్టిస్ యాక్ట్ సెక్షన్ 77 ప్రకారం శిక్షార్హమైన నేరం. ఈ చట్టాల అమలును పక్కాగా పర్యవేక్షిస్తూ, నిబంధనలు ఉల్లంఘించినట్లు పలు దుకాణాలను పోలీసులు గుర్తించారు. దీంతో ఏకకాలంలో దాడులు నిర్వహించి కేసులు నమోదు చేశారు.
పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ శనివారం సుమారు 5 వేల మంది సిబ్బంది విద్యా సంస్థల సమీపంలో పొగాకు ఉత్పత్తులను విక్రయిస్తున్న 558 దుకాణాల్లో ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్లోని చిరాగ్ అలీ లేన్, రెడ్ హిల్స్, మెహదీపట్నం, మల్లెపల్లి ప్రియా టాకీస్ జంక్షన్, గోశామహాల్ వంటి రద్దీ ప్రాంతాల్లోని విద్యాసంస్థల సమీపంలో ఉన్న దుకాణాలను పోలీసులు స్వయంగా తనిఖీ చేశారు. ఈ డ్రైవ్ లో టాస్క్ ఫోర్స్, స్పెషల్ టీమ్స్, హెచ్-న్యూ, రిజర్వ్, లా అండ్ ఆర్డర్ పోలీసులు పాల్గొని తనిఖీలు చేపట్టారు. నిబంధనలు అతిక్రమించి విద్యాసంస్థల సమీపంలో సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తులు విక్రయిస్తున్న నిర్వాహకులపై చట్టప్రకారం కేసులు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు.
'మైనర్లకు పొగాకు ఉత్పత్తులు విక్రయిస్తూ వారి భవిష్యత్తుతో ఆడుకునే వారిపై ఉక్కుపాదం మోపుతాం. పాఠశాలలు, కళాశాలల సమీపంలో ఇలాంటి విక్రయాలకు పాల్పడే వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు' అని కమిషనర్ సజ్జనార్ స్పష్టం చేశారు. ఇలాంటివి పునరావృతం కాకుండా క్షేత్రస్థాయిలో నిరంతర నిఘా ఉంచేందుకు వీలుగా ‘హెచ్-న్యూ’ విభాగంలో ఒక ప్రత్యేక అధికారిని నియమిస్తున్నట్లు వెల్లడించారు.
SRH vs CSK: సన్రైజర్స్ హైదరాబాద్ అద్భుతం.. ఉప్పల్ స్టేడియంలో చెన్నై చిత్తు
Hyderabad, Telangana:Uppal Stadium: ఓటముల నుంచి కోలుకున్న చెన్నై సూపర్ కింగ్స్ అనంతరం వరుసగా రెండు విజయాలతో జోష్ మీదుండగా.. సన్రైజర్స్ హైదరాబాద్ బ్రేక్ ఇచ్చింది. ఉత్కంఠగా జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ ఆల్రౌండ్ ప్రదర్శన కనబర్చి మ్యాచ్ను సొంతం చేసుకుంది. విజయానికి అవకాశం మెండుగా ఉన్నా కూడా బౌలర్లు కొంత తడబడడంతో ఆఖరి ఓవర్లో విజయం వరించింది. 10 పరుగుల తేడాతో సన్రైజర్స్ మ్యాచ్ గెలిచింది. ఈ ఓటమితో చెన్నై హ్యాట్రిక్ విజయావకాశాలను కోల్పోయింది.
PM Modi Apology: 'భారత మహిళల్లారా నన్ను క్షమించండి': ప్రధాని నరేంద్ర మోదీ
New Delhi, Delhi:PM Narendra Modi Apology: మహిళా రిజర్వేషన్లను అడ్డుకున్న విపక్షాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రంగా తప్పుబట్టారు. మహిళా బిల్లు వీగిపోవడంతో మహిళా లోకానికి ప్రధాని మోదీ బహిరంగ క్షమాపణ చెప్పారు. మహిళా రిజర్వేషన్లను అడ్డుకునేందుకు విపక్షాలు ఎలా ప్రవర్తించాయో దేశం మొత్తం చూసింది. బిల్లును వ్యతిరేకించి విపక్షాలు తప్పు చేశాయి. ఈ సందర్భంగా మహిళలకు క్షమాపణ చెబుతున్నా' అని ప్రధాని తెలిపారు. మహిళా రిజర్వేషన్ల కోసం తాము చిత్తశుద్ధితో కట్టుబడి ఉన్నామని.. భారత నారీమణుల కలలను నాశనం చేశారు’ అని మండిపడ్డారు.
Also Read: PM Address To Nation Live: మహిళా రిజర్వేషన్ వీగిపోవడంపై క్షమాపణలు చెప్పిన ప్రధానమంత్రి
'దేశం మొత్తం మహిళా రిజర్వేషన్ బిల్లును ఎలా అడ్డగించారో చూస్తోంది. బిల్లు వీగిపోవడంపై మహిళామణులందరికీ క్షమాపణ చెబుతున్నా' అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. 'మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకునేందుకు విపక్షాలు ఎలా ప్రయత్నించారో దేశం మొత్తం చూసింది. బిల్లు వ్యతిరేకించి విపక్షాలు తప్పు చేశాయి. మహిళా రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నాం' అని మోదీ తెలిపారు. 'మహిళల స్వప్నాన్ని చిదిమేశారు. మాకు జాతీయ ప్రయోజనాలే ముఖ్యం. కాంగ్రెస్, డీఎంకే, తృణమూల్, ఎస్పీ స్వార్థ రాజకీయాలకు మహిళా లోకం బలైంది. తమకు జరిగిన అన్యాయాన్ని మహిళలు ఎప్పటికీ మరవరు. ఇది భ్రూణహత్యలతో సమానం. మహిళా బిల్లును అడ్డుకుని సంబరాలు చేసుకున్నాయి. బిల్లును అడ్డుకోవడంతో మహిళల ఆత్మాభిమానంపై దాడి చేశారు' అని మోదీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Also Read: Harish Rao: జగిత్యాల సభతో రేవంత్ రెడ్డి పోవాలి.. కేసీఆర్ రావాలి నినాదం మార్మోగుతుంది: హరీశ్ రావు
'బిల్లు వీగిపోవడంతో నేను ఎంతో ఆవేదన చెందా. విపక్షాలు సంబరాలు చేసుకోవడం విడ్డూరంగా ఉంది. దేశంలోని మహిళలను విపక్షాలు అవమానించాయి. మహిళా రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నాం. మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకుని విపక్షాలు పాపం చేశాయి. దానికి తగ్గ ప్రాయశ్చితం అనుభవిస్తాయి' అని ప్రధాని మోదీ ప్రకటించారు. మహిళా బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసిన కాంగ్రెస్, టీఎంసీ, ఎస్పీ, డీఎంకే పార్టీల తీరును ప్రధాని మోదీ తప్పుబట్టారు. ఆ పార్టీలన్నీ మహిళలకు వ్యతిరేకం అని ప్రకటించారు. నారీశక్తి ఎదగకుండా అడ్డుకున్నాయని మండిపడ్డారు. '40 ఏళ్లుగా మహిళలు తమ హక్కుల కోసం పోరాడుతున్నారు. మహిళా రిజర్వేషన్ను అడ్డుకున్న పాపం విపక్షాలను వదిలిపెట్టదు. కొందరికి దేశం కంటే రాజకీయమే ముఖ్యం. విపక్షాలు సంబరాలు చేసుకోవడం విడ్డూరంగా ఉంది. పాపం చేసిన విపక్షాలకు శిక్ష తప్పదు. మహిళలకు రిజర్వేషన్ ఇవ్వడం విపక్షాలకు ఇష్టం లేదు. మహిళా బిల్లును అడ్డుకుని బ్రూణహత్యకు పాల్పడ్డాయి' అని మోదీ చెప్పారు.
'కాంగ్రెస్, డీఎంకే, తృణమూల్, ఎస్పీలు మహిళలను ఎదగనీయరు. రిజర్వేషన్ల కోసం మహిళలు 40 ఏళ్లుగా ఎదరుచూస్తున్నారు. ఎంతో నిజాయితీగా తెచ్చుకున్న బిల్లును అడ్డుకున్నారు. నారీ శక్తిని ఎదగకుండా అడ్డుకున్నారు. అన్ని రాష్ట్రాల సమాన హక్కులకు బిల్లు తీసుకువచ్చాం. ప్రతిసారి కాంగ్రెస్ మహిళా బిల్లును అ్డుకుంది. కాంగ్రెస్ నిజస్వరూపం బయటపడింది. కుటుంబ పార్టీలు భయపడ్డాయి. ప్రాంతీయ పార్టీల భవిష్యత్ను కాంగ్రెస్ పణంగా పెట్టింది. డిలీమిటేషన్ను బూచీగా చూపించి మహిళా రిజర్వేషన్ బిల్లును కాంగ్రెస్ అడ్డుకుంది' అని మోదీ నిప్పులు చెరిగారు.
'మహిళా బిల్లు క్రెడిట్ తీసుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నం చేసింది. దేశ ప్రజలను విభజించి లబ్ధి పొందాలని కాంగ్రెస్ ఆలోచన. బిల్లు ఆమోదం పొందితే మరిన్ని రాష్ట్రాల్లో స్థానాలు పెరిగేవి. డీలిమిటేషన్తో ఏ రాష్ట్రాలకు అన్యాయం జరగదు. సీట్లు పెరిగితే కాంగ్రెస్, తృణమూల్, డీఎంకే, ఎస్పీకి స్థానాలు పెరిగేవి. ఇదే విషయాన్ని పదే పదే చెప్పాం. అయినా విపక్షాలు వినిపించుకోలేదు. కాంగ్రెస్ ఎప్పుడూ సంస్కరణలకు వ్యతిరేకం. ఆధార్, త్రిబుల్ తలాక్, జన్ధన్, తదితర వాటన్నింటినీ కాంగ్రెస్ వ్యతిరేకించింది' అని ప్రధాని మోదీ విమర్శించారు.
పార్లమెంటులో నారీ శక్తి వందన్ను వ్యతిరేకించిన విపక్షాలకు నేను స్పష్టంగా చెబుతున్నా. వీళ్లు మహిళల శక్తిని చాలా తేలికగా తీసుకుంటున్నారు. 21వ శతాబ్దపు మహిళలు దేశంలో జరుగుతున్న ప్రతి పరిణామాన్ని నిశితంగా గమనిస్తున్నారు. మహిళల రిజర్వేషన్ను వ్యతిరేకించిన పాపానికి విపక్షాలు కచ్చితంగా శిక్ష అనుభవిస్తాయి' నరేంద్ర మోదీ
జాతిని ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మొత్తం 28 గంటల 34 నిమిషాలు మాట్లాడారు. పలుమార్లు మహిళల పట్ల భావోద్వేగానికి లోనయ్యారు. ప్రసంగం మొత్తం కాంగ్రెస్, డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్, ఎస్పీలను నిందించారు. వారిని మహిళా లోకం క్షమించదు అని ప్రకటించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Strait Of Hormuz: హార్ముజ్ను మరోసారి క్లోజ్..ప్రపంచదేశాలకు మరోసారి ఇరాన్ వార్నింగ్!
Strait Of Hormuz Closed: హార్ముజ్ జలసంధిని తెరుస్తున్నామని ఇరాన్ చేసిన ప్రకటన 24 గంటలకు ముగియకముందే మరోసారి దాన్ని మూసివేసింది. ఈ చర్యకు అమెరికా ప్రధాన కారణం అని ఇరాన్ అధికార వర్గాలు చెబుతున్నాయి.Telangana RTC Strike: పోరుబాటకు సిద్ధమైన తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు..ఈనెల 22 నుంచి సమ్మె!
Hyderabad, Telangana:Telangana RTC Strike 2026: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ) కార్మికులు మరోసారి సమ్మె బాట పట్టారు. ఈనెల 22 నుంచి సమ్మె చేపట్టనున్నట్లు నోటీసులు ద్వారా ప్రకటించారు.Hormuz Gunfire: యుద్ధంలో బిగ్ ట్విస్ట్..భారత నౌకలపై ఇరాన్ IRGC కాల్పులు..అస్సలు ఏం జరుగుతోంది?
Hormuz Gunfire On India Merchant Ships: హార్ముజ్ జలసంధిని తెరుస్తున్నామని ఇరాన్ చేసిన ప్రకటన 24 గంటలకు ముగియకముందే మరోసారి దాన్ని మూసివేసింది. తాజాగా ఆ జలసంధి నుంచి బయటకు వచ్చేందుకు తాజాగా రెండు భారత వాణిజ్య నౌకలు ప్రయత్నించగా.. దానిపై ఇరాన్కు సంబంధించిన బలగాలు కాల్పులు జరిపాయి. ఇదే విషయాన్ని ధ్రువీకరిస్తూ ఆ దేశ మీడియా స్పష్టం చేసింది. హార్ముజ్ జలసంధిని దాటేందుకు ప్రయత్నించిన రెండు భారత వాణిజ్య నౌకలపై ఇరాన్ IRGC బలగాలు కాల్పులు జరిపినట్లు ఆ దేశ మీడియా వెల్లడించింది.
కాల్పులకు గురైన భారత వాణిజ్య నౌకల్లో ఒక్కో దాంట్లో 20 లక్షల బ్యారెళ్ల ఇరాకీ క్రూడ్ ఆయిల్తో ప్రయాణిస్తున్నట్లు సమాచారం. దీంతో కాల్పుల నేపథ్యంలో రెండు నౌకలు వెనక్కి మళ్లినట్లు సమాచారం. ఈ ఘటనలో ఎలాంటి ప్రమాదం జరగలేదని.. సిబ్బంది అంతా క్షేమంగా ఉన్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.
హర్మూజ్ జలసంధి మార్గం ద్వారా ప్రయాణిస్తున్న ఈ రెండు నౌకలపై ఇరాన్కు చెందిన ఐఆర్జీసీ గన్ బోట్లు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. కాల్పుల నేపథ్యంలో నౌకల్లోని సిబ్బందికి ఎలాంటి ప్రాణాపాయం కలగలేదని.. అందరూ సురక్షితంగా ఉన్నారని మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్ సెంటర్ స్పష్టం చేసింది. అయితే కాల్పుల వల్ల నౌకలకు ఏమైనా నష్టం వాటిల్లిందా అనేది తెలియాల్సి ఉంది.
నిన్నటి రోజున అమెరికాతో కాల్పుల ఒప్పందం ఉన్న కారణంగా ఆ ఒప్పందం ముగిసే వరకు హార్ముజ్ నుంచి ఏ నౌకలైనా వెళ్లొచ్చని ఇరాన్ అనుమతినిచ్చింది. అయితే అది కేవలం కొన్ని గంటల వరకే పరిమితమైంది. అందుకు అమెరికానే పూర్తిగా కారణం అని ఇరాన్ నాయకత్వం చెబుతోంది. ఇరాన్కు చెందిన పోర్టులపై అమెరికా దిగ్బంధం చేయడం పట్ల హార్ముజ్ జలసంధిని తిరిగి మూతపెట్టినట్లు ఇరాన్ స్పష్టం చేసింది. ఈ క్రమంలో అటుగా వెళ్తున్న భారత నౌకలపై కాల్పులు జరిపినట్లు సమాచారం అందుతోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
