icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Pinewz
504251
KASARLA RAMESHKASARLA RAMESHFollow7 Sept 2024, 04:23 am
0
0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

రూ.20 వేల బడ్జెట్‌లో AI ఫీచర్లతో iQOO Z11 Lite స్మార్ట్‌ఫోన్ లాంచ్!

Hyderabad, Telangana:

Iqoo Z11 Lite Launching Soon: భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ప్రముఖ బ్రాండ్ iQOO మరో శక్తివంతమైన ఫోన్‌ను విడుదల చేసేందుకు రెడీ అయ్యింది.. ఇది iQOO Z11 Lite పేరుతో లాంచ్‌ కాబోతోంది. దీనిని కంపెనీ ఈ నెల 24వ తేదీన అధికారికంగా విడుదల చేయబోతోంఒఇ. ముఖ్యంగా కాలేజీ విద్యార్థులతో పాటు నేటి యువతను దృష్టిలో పెట్టుకుని.. రూ. 20,000 లోపు బడ్జెట్ ధరలో అందుబాటులోకి తీసుకు రాబోతోంది. అంతేకాకుండా ఇది అద్భుతమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఫీచర్లతో విడుదల కానుంది.

AI పవర్డ్ ప్రొడక్టివిటీ..
ఈ iQOO Z11 Lite స్మార్ట్‌ఫోన్‌లో ల్యాండింగ్, క్రియేషన్‌తో పాటు కమ్యూనికేషన్ ప్రక్రియలను సులభతరం చేసేందుకు పవర్‌ఫుల్ AI ఫీచర్ల సెట్‌ను అందించబోతున్నట్లు తెలుస్తోంది.. ఇందులో ఉండే  AI క్రియేషన్ ఫీచర్ విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందని సమాచారం. ఇది పెద్ద పెద్ద డాక్యుమెంట్‌లను క్షణాల్లో సులభంగా Summary చేస్తుందని.. అసైన్‌మెంట్‌లను రిఫైన్ చేస్తుందని కంపెనీ క్లైమ్‌ చేస్తుంది. ఇది కంటెంట్ జెనరేట్ చేయడంతో పాటు టెక్స్ట్‌ను వివిధ భాషల్లోకి ట్రాన్స్‌లెట్‌ చేసేందుకు క్రియాశీలక పాత్ర పోషిస్తుంది..

అంతేకాకుండా, ఇందులో ఉన్న AI క్యాప్షన్ ఫీచర్ ద్వారా రియల్-టైమ్ ట్రాన్స్‌క్రిప్షన్‌తో పాటు ఇన్‌స్టంట్ ట్రాన్స్‌లేషన్, వన్-టాప్ సమ్మరీ వంటి సపోర్ట్‌ను కూడా అందిస్తోంది.. ఆన్‌లైన్ లెక్చర్లు, వర్క్‌షాప్‌లు వినేటప్పుడు నోట్స్ రాసుకోవడానికి.. వాటిని షేర్ చేయడానికి ఇది అద్భుతంగా సహాయపడుతుంది.

ఏకంగా 6500mAh భారీ బ్యాటరీ..
ఈ ఫోన్ భారీ 6500mAh బ్యాటరీని కూడా కలిగి ఉంటుంది.. ఇది 44W ఫ్లాష్‌చార్జ్ (FlashCharge) సపోర్ట్‌తో అందుబాటులోకి రాబోతోంది.. ఎక్కువ సేపు చదువుకోవడానికి.. గేమింగ్, మల్టీటాస్కింగ్ కోసం ఈ బ్యాటరీ అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇస్తుందని కంపెనీ తెలుపుతోంది.. కంపెనీ క్లెయిమ్ ప్రకారం.. ఈ బ్యాటరీ 5 సంవత్సరాల పాటు బ్యాటరీ హెల్త్‌ను కలిగి ఉంటుందని సమాచారం..

పడిపోయినా పగిలిపోదు..
రోజువారీ క్యాంపస్ జీవితంలో ఫోన్లు చేతిలోంచి జారిపడటం, వర్షంలో తడవడం సర్వ సహజం.. అందుకే iQOO Z11 Lite ఫోన్‌ను మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీతో నిర్మించిన్నట్లు కంపెనీ తెలుపుతోంది. దీనికి  SGS 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్ సర్టిఫికేషన్ అందుబాటులోకి రాబోతోంది.. దీనివల్ల ప్రమాదవశాత్తు ఫోన్ కింద పడినా ఎటువంటి నష్టం జరగకుండా చాలా గట్టి ప్రొటక్షన్‌ లభిస్తుంది.

బ్రైట్ డిస్‌ప్లే..
ఈ స్మార్ట్‌ఫోన్ ఎండలో కూడా స్పష్టంగా కనిపించేలా 1200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ డిస్‌ప్లేను కూడా కలిగి ఉంటుంది.. దీని స్లీక్, మోడర్న్ డిజైన్ ఎంతో ప్రీమియంగా ఉంటుందని సమాచారం. ఫోన్ వెనుక భాగంలో మినిమలిస్ట్, కాంపాక్ట్ కెమెరా మాడ్యూల్‌తో పాటు, కాల్స్, నోటిఫికేషన్ల కోసం ఒక డైనమిక్ లైట్ ఫీచర్‌ను కూడా అందుబాటులోకి తీసుకు రాబోతోంది. 

iQOO Z11 Lite స్మార్ట్‌ఫోన్ భారత్‌లో జూలై 24న లాంచ్ కాబోతున్నట్లు అధికారక సమాచారం. ఈ ఫోన్ ప్రముఖ ఈ-కామర్స్ సైట్ అమెజాన్ (Amazon), iQOO అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులోకి రాబోతోంది.. ఇది సోలార్ ఫ్లేమ్ (Solar Flame)తో పాటు మిడ్‌నైట్ బ్లూ (Midnight Blue) అనే రెండు ప్రీమియం కలర్ వేరియంట్లలో లభించబోతున్నట్లు తెలుస్తోంది. ఇది రూ.20,000 బడ్జెట్‌లో AI ఫీచర్లు, భారీ బ్యాటరీ కోరుకునే వారికి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ కాబోతున్నట్లు మార్కెట్‌లో టెక్‌ నిపుణులు భావిస్తున్నారు.

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report

ఆగస్టు 12న Google Pixel 11 సిరీస్ గ్రాండ్‌గా లాంచ్‌.. ప్రత్యేకతలేంటో తెలుసా?

Hyderabad, Telangana:

Google Pixel 11 Series Launch: స్మార్ట్‌ఫోన్ ప్రియులకు Google సంస్థ అదిరిపోయే శుభవార్త చెప్పింది.. ప్రతి సంవత్సరం అక్టోబర్‌లో కొత్త ఫోన్లను పరిచయం చేస్తుంది. ఈసారి మరింత ముందుగానే అంటే ఆగస్టు 12న తమ కొత్త గూగుల్ పిక్సెల్ 11 (Google Pixel 11) సిరీస్‌ను గ్లోబల్ మార్కెట్లో లాంచ్ చేసేందుకు ముహూర్తం ఖరారు చేసింది. ఈ మేరకు కంపెనీ తన అఫీషియల్ స్టోర్ పేజీలో ఒక టీజర్ వీడియోను విడుదల చేస్తూ అధికారికంగా ప్రకటించింది..

కొత్తగా పిక్సెల్ గ్లో (Pixel Glow)..
గూగుల్ పిక్సెల్ 11 సిరీస్‌లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న హైలైట్ పిక్సెల్ గ్లోగా భావించవచ్చు.. ఫోన్ వెనుక భాగంలో ఉండే కెమెరా బార్‌లో ఒక అద్భుతమైన మల్టీ-కలర్ RGB ఎల్‌ఈడీ (LED) లైటింగ్‌ను గూగుల్‌ను అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది.. ఇది కేవలం సాధారణ ప్లాష్‌లైట్ లాగా కాకుండా.. గూగుల్ సిగ్నేచర్ రంగులతో పాటు అద్భుతంగా వెలుగుతుందని సమాచారం..

స్మార్ట్ నోటిఫికేషన్లు..
ఫోన్‌కు వచ్చే కాల్స్.. వాట్సాప్ లేదా ఫేస్‌బుక్ మెసేజ్‌లకు వేర్వేరు రంగుల్లో ప్రత్యేకమైన లైట్ బ్లింక్ అవుతుందని సమాచారం. ఉదాహరణకు వాట్సాప్ మెసేజ్ వస్తే గ్రీన్ కలర్.. ఫేస్‌బుక్ నోటిఫికేషన్‌కు బ్లూ కలర్ లైట్ వెలిగేలా యూజర్లు సెట్ చేసుకోవచ్చని తెలుస్తోంది..

జెమిని AI ఇంటరాక్షన్..
గూగుల్ జెమిని AI వాయిస్ అసిస్టెంట్‌తో మనం మాట్లాడేటప్పుడు.. ఆ వాయిస్ రెస్పాన్స్‌కు అనుగుణంగా ఈ లైట్ రంగులు మారుస్తూ.. విజువల్ ఫీడ్‌బ్యాక్ కూడా అందిస్తుంది.. ఇది నథింగ్ (Nothing) ఫోన్లలోని గ్లిఫ్ ఇంటర్‌ఫేస్ తరహాలో మరింత స్టైలిష్‌గా.. ప్రీమియమ్‌గా ఉండబోతోందని సమాచారం..

నాలుగు మోడల్స్.. 
ఆగస్టు 12న జరిగే మేడ్ బై గూగుల్ (Made by Google) ఈవెంట్‌లో కంపెనీ మొత్తం నాలుగు మోడళ్లను లాంచ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులోని గూగుల్ పిక్సెల్ 11 స్మార్ట్‌ఫోన్‌ 6.3 ఇంచుల డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. అంతేకాకుండా పిక్సెల్ 11 ప్రో మొబైల్‌ 6.3 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుందని సమాచారం.. ఇక పిక్సెల్ 11 ప్రో XL స్మార్ట్‌ఫోన్‌ 6.8 అంగుళాల డిస్‌ప్లేతో లభించబోతోంది. ఇక పిక్సెల్ 11 ప్రో ఫోల్డ్ స్మార్ట్‌ఫోన్‌ 6.4, 8.0 అంగుళాల డిస్‌ప్లేను కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్లు స్టెర్లింగ్, డ్యూన్, లైట్ ఫాగ్, పైన్ వంటి అద్బుతమైన కలర్ ఆప్షన్లతో పాటు కొత్తగా గోల్డ్ ఫినిషింగ్ వేరియంట్‌లో కూడా అందుబాటులోకి రానుంది..

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

పవర్‌ఫుల్ ప్రాసెసర్..
ఈ పిక్సెల్ 11 సిరీస్ కేవలం లుక్స్ పరంగానే కాకుండా పర్ఫార్మెన్స్ పరంగానూ నెక్స్ట్ లెవెల్‌లో ఉండబోతున్నట్లు తెలుస్తోంది.. ఈ ఫోన్లలో అత్యంత శక్తివంతమైన గూగుల్ టెన్సర్ G6 (Tensor G6) చిప్‌సెట్‌ను వినియోగించిన్నట్లు సమాచారం. TSMCకి సంబంధించిన అడ్వాన్స్‌డ్ 2nm ప్రొడక్షన్ ప్రాసెస్ ఆధారంగా తయారైన ఈ ప్రాసెసర్ వల్ల ఫోన్ బ్యాటరీ లైఫ్ పెరగడమే.. కాకుండా అద్భుతమైన స్పీడ్ లభిస్తుందని సమాచారం. అంతేకాకుండా ఈ సిరీస్ సరికొత్త ఆండ్రాయిడ్ 17 (Android 17) ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ కాబోతున్నట్లు తెలుస్తోంది.. ఈ సిరీస్‌ ఆగస్టు 12న అధికారికంగా లాంచ్ అయిన రోజు నుంచే గూగుల్ స్టోర్‌లో ఈ ఫోన్ల ప్రీ-ఆర్డర్లు (Pre-orders) ప్రారంభం కాబోతున్నాయి. 

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report

Tecno నుంచి సూపర్ ఫోన్.. 3D కర్వ్డ్ డిస్‌ప్లేతో Tecno Camon 50 Ultra 5G ఫోన్‌!

Hyderabad, Telangana:

Tecno Camon 50 Ultra 5g Telugu: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ టెక్నో (Tecno) భారత మార్కెట్లోకి సరికొత్త ఫ్లాగ్‌షిప్ ఫీచర్ల మంచి ఫోన్‌ను విడుదల చేసింది. మొబైల్ ఫొటోగ్రఫీ, అద్భుతమైన బ్యాటరీ లైఫ్‌ను కోరుకునే వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని Tecno Camon 50 Ultra 5G ఫోన్‌ను మార్కెట్లోకి లాంచ్‌ చేసింది.. అధునాతన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఫీచర్లతో పాటు అత్యంత ప్రత్యేకమైన బిల్ట్‌ క్వాలిటితో వచ్చిన ఈ స్మార్ట్‌ఫోన్ ధర, పూర్తి స్పెసిఫికేషన్ల వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..

డిజైన్, డిస్‌ప్లే..
ఈ Tecno Camon 50 Ultra 5G ఫోన్‌లో 6.78-అంగుళాల 1.5K 3D కర్వ్డ్ AMOLED డిస్ల్పేను కలిగి ఉంటుంది. ఇది 144Hz రిఫ్రెష్ రేట్, 4500 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌తో అందుబాటులోకి వచ్చింది. దీనివల్ల ఎండలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపిస్తుందని కంపెనీ క్లైమ్‌ చేస్తోంది. అలాగే డిస్‌ప్లే ప్రొటక్షన్‌ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7iని వినియోగించిన్నట్లు సమాచారం. కంపెనీ దీనిని సిల్క్-ఫ్లో డిజైన్‌తో అందుబాటులోకి తీసుకు వచ్చింది..

కెమెరా వివరాలు..
ఈ స్మార్ట్‌ఫోన్‌ 50MP ట్రిపుల్ కెమెరా సెటప్‌తో అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఇందులో కంపెనీ చాలా ప్రత్యేకమైన 50 మెగాపిక్సెల్ సోనీ LYT-700C సెన్సార్ ప్రధాన కెమెరా కెమెరాను కూడా కలిగి ఉంటుంది..  అంతేకాకుండా 3x ఆప్టికల్ జూమ్ సామర్థ్యంతో 50 మెగాపిక్సెల్ సెన్సార్ టెలిఫొటో కెమెరాతో అందుబాటులోకి వచ్చింది..  అలాగే 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్ అల్ట్రా-వైడ్ కెమెరా కూడా లభిస్తోంది.. ఇక సెల్ఫీల కోసం ముందు భాగంలో 50 మెగాపిక్సెల్ పవర్‌ఫుల్ ఫ్రంట్ కెమెరాను కూడా తీసుకు వచ్చింది. 

ప్రాసెసర్, పర్ఫార్మెన్స్..
మల్టీటాస్కింగ్‌తో పాటు గేమింగ్ కోసం ఈ ఫోన్‌లో శక్తివంతమైన మీడియాటెక్ డైమెన్సిటీ 7400 అల్టిమేట్ (4nm) ప్రాసెసర్‌ను వినియోగించిన్నట్లు తెలుస్తోంది.. ఇది ఆండ్రాయిడ్ 16 ఆధారిత హైఓఎస్ (HiOS 16) పై ఆపరేటింగ్‌ సిస్టమ్‌పై రన్‌ అవుతుంది. ఇది 8GB LPDDR5X ర్యామ్‌తో పాటు 256GB స్టోరేజ్ వేరియంట్లో అందుబాటులోకి వచ్చింది..

బ్యాటరీ, ఛార్జింగ్..
ఈ స్మార్ట్‌ఫోన్ ప్రధాన ఆకర్షణ దీనిలోని 6500mAh భారీ బ్యాటరీగా భావించవచ్చు. ఇది ఒకసారి ఛార్జ్ చేస్తే.. రెండు రోజుల పాటు నిరంతరాయంగా పనిచేస్తుందని కంపెనీ తెలిపింది.. దీనికి తోడు 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా అందుబాటులో ఉంది. దీనివల్ల ఫోన్ చాలా వేగంగా ఛార్జ్ అవుతుందని కంపెనీ క్లైమ్‌ చేస్తుంది..  

ధర వివరాలు..
భారత మార్కెట్‌లో టెక్నో కేమన్‌ 50 ఆల్ట్రా 5G (8GB + 256GB వేరియంట్‌) ధరను రూ.39,999తో లభించబోతోంది. అయితే, లాంచ్ ఆఫర్ కింద కొనుగోలు చేసేవారికి అదనంగా రూ.3,000 వరకు డిస్కౌంట్ కూపన్ లభిస్తుంది.. దీనితో ఈ ఫోన్‌ను కేవలం రూ.36,999కే సొంతం చేసుకోవచ్చు.. జులై 21 మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ ఫోన్ ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్ (Amazon.in)లో అందుబాటులోకి వచ్చింది. 

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report
Advertisement

రేపు 'రా ఎన్టీఆర్' రూ.100 కోట్ల సహాయ కార్యక్రమాలపై ప్రెస్ మీట్.. తిరుపతిలో ఉత్కంఠ

Tirupati, Andhra Pradesh:

RAW NTR Press Meet: తిరుపతిలో ప్రెస్‌మీట్‌ నిర్వహించి తీరుతామని.. తగ్గేదేలే అని రా ఎన్టీఆర్‌ టీం ప్రకటించింది. అనుకున్న సమయానికి రేపు తిరుపతిలో మీటింగ్ జరుపుతామని రా ఎన్టీఆర్‌ వ్యవస్థాపకుడు సాయి రూప్‌ ప్రకటించాడు. అయితే రా ఎన్టీఆర్ టీంపై తిరుపతి ఎస్పీకి ఎన్టీఆర్ ప్యాన్స్ అసోసియేషన్ ఫిర్యాదు చేసింది. దీంతో తిరుపతిలో రేపు ఏం జరుగుతుందనేది ఉత్కంఠ నెలకొంది. ఈ కార్యక్రమంతో జూనియర్‌ ఎన్టీఆర్‌ అభిమానుల సంఘాల మధ్య తీవ్ర విబేధాలు ఏర్పడ్డాయి.

రా ఎన్టీఆర్ ప్రెసిడెంట్ సాయి రూప్ ఏ మాత్రం తగ్గేదే లేదు  అంటున్నాడు . అనుకున్న సమయానికి 18వ తేదీన తిరుపతిలో ఉదయం‌‌ మీడియా సమావేశం నిర్వహిస్తామని చెబుతున్నాడు. రూ.100 కోట్లతో 'రా ఎన్టీఆర్' పేరుతో తాము చేయబోయే సేవా కార్యక్రమాల గురించి తెలియజేస్తామని సాయిరూప్‌ తెలిపాడు. తాము అనుకున్న.. ముందుగా ప్రకటించిన హోటల్‌లోనే మీడియా సమావేశం నిర్వహిస్తామని ప్రకటించాడు. ఎన్టీఆర్ అభిమానులు అందరూ రావాలని.. తాము చేయబోయే ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చాడు.

అయితే రా ఎన్టీఆర్‌ బృందం కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు ఎన్టీఆర్‌ అభిమానుల సంఘం ప్రయత్నిస్తోంది. రా ఎన్టీఆర్‌ ప్రెస్‌మీట్‌పై ఇప్పటికే తిరుపతి ఎస్పీని కలిసి ఫిర్యాదు చేసింది. ఎన్టీఆర్ పేరుతో భారీ దోపిడీ చేయబోతున్నారని.. ఇది తమ అభిమాన నటుడికి చెడ్డపేరు వచ్చే అవకాశం ఉందని ఎన్టీఆర్‌ అభిమానుల సంఘం తిరుపతి అధ్యక్షుడు ప్రకటించాడు. రా ఎన్టీఆర్ టీంపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.‌

'రా ఎన్టీఆర్‌ ప్రెస్‌మీట్‌‌ను కచ్చితంగా నిర్వహిస్తాం. ఒకవేళ తాజ్ హోటల్‌లో అనుమతి రాకపోతే బయట వేరే వేదికలో నిర్వహిస్తాం. మమ్మల్ని ఖండిస్తూ ఎన్టీఆర ఆఫీస్ పేరిట విడుదలైన లేఖలో ఎన్టీఆర్‌ ప్రమేయం ఎంతవరకు ఉందో మాకు తెలియదు. అది ఆయన అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో కూడా పోస్ట్ కాలేదు. కాబట్టి ఎన్టీఆర్‌ పేరిట వచ్చిన లేఖను పట్టించుకోం' అని సాయిరూప్‌ తెలిపాడు. ఒకవేళ స్వయంగా ఎన్టీఆర్‌ వద్దన్నా కూడా తాము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ప్రకటించడం గమనార్హం. 'ఎందుకంటే మేము ఏ తప్పూ చేయడం లేదు. మా వెనుక ఏ రాజకీయ పార్టీ లేదు. ప్రెస్ మీట్‌లో మీడియా ప్రశ్నలు, జవాబులు ఉంటాయి. రూ.100 కోట్లతో సేవా కార్యక్రమాలు ఏమిటో పూర్తి వివరంగా వివరిస్తాం' అని సాయిరూప్‌ వెల్లడించాడు.

0
0
Report

ప్రపంచంలోనే మొదటి AI ఫోన్ వచ్చేసింది.. Nubia NaviX Ultra ప్రత్యేకతలివే!

Hyderabad, Telangana:

Nubia NaviX Ultra Launched: ప్రముఖ చైనీస్ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం ZTE సబ్-బ్రాండ్ నుబియా (Nubia) స్మార్ట్‌ఫోన్ ప్రియుల కోసం ఒక అద్భుతమైన శుభవార్తను అందించింది.. పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సామర్థ్యాలతో పనిచేసే అద్బుతమైన కొత్త స్మార్ట్‌ఫోన్ నావిక్స్ ఆల్ట్రా (NaviX Ultra)ను మార్కెట్లోకి విడుదల చేసింది. చైనాలోని షాంఘైలో జూలై 17న ఇది లాంచ్‌ అయ్యింది. వరల్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాన్ఫరెన్స్ (WAIC) వేదికగా ఈ  ఫోన్‌ను అధికారికంగా విడుదల చేసింది.. ఈ కంపెనీ ఇప్పటికే మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ వీబో (Weibo)లో ఒక అధికారిక పోస్ట్‌ను షేర్ చేసింది. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..

4 అద్భుతమైన ఆప్షన్లు..
నుబియా నావిక్స్ ఆల్ట్రా డిజైన్, కలర్ వేరియంట్లకు సంబంధించిన టీజర్‌ను కంపెనీ ఇప్పటికే విడుదల చేసి చైనా మార్కెట్లో అంచనాలను పెంచిన్నట్లు తెలుస్తోంది.. ఈ స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు నాలుగు విభిన్నమైన, ఆకర్షణీయమైన రంగుల్లో లభించబోతోంది.. ఇది వైట్ (White), పర్పుల్ (Purple)తో పాటు పింక్ (Pink), బ్లాక్ (Black) కలర్‌ ఆప్షన్స్‌లో అందుబాటులోకి రాబోతోంది. ఈ అద్భుతమైన స్టైలిష్ రంగులు యువతనుచ ప్రొఫెషనల్స్ ఇద్దరినీ విశేషంగా ఆకట్టుకుంటాయని టెక్ విశ్లేషకులు భావిస్తున్నారు.

దౌబావో AI అసిస్టెంట్..
ఈ స్మార్ట్‌ఫోన్ అతిపెద్ద హైలైట్ దీనిలో అందుబాటులోకి వస్తున్న అడ్వాన్స్‌డ్ AI సిస్టమ్‌గా భావించవచ్చు. బైట్‌డాన్స్ (ByteDance)కు సంబంధించిన దౌబావో (Doubao) మొబైల్ AI అసిస్టెంట్‌తో వస్తున్న మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్‌ ఇదే కావడం విశేషం. నుబియా కంపెనీ పౌండర్‌ ని ఫీ (Ni Fei) తెలిపిన వివరాల ప్రకారం.. కంపెనీ లార్జ్-స్కేల్ AI ఏజెంట్ మోడల్ కోసం ఫైలింగ్ పూర్తి చేసిన్నట్లు తెలుస్తోంది.. ఈ నావిక్స్ ఆల్ట్రా ఫోన్ అడ్వాన్స్‌డ్ AI సిస్టమ్‌ను పూర్తిగా ఇంటెగ్రేట్ చేసుకున్న మొదటి డివైజ్‌గా నిలుస్తుందని అతను తెలిపారు..

దీనిలోని AI కేవలం ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం లేదా టెక్స్ట్ రాయడానికే పరిమితం కాకుండా.. మొబైల్‌లోని వివిధ యాప్స్‌లో మల్టీ-స్టెప్ టాస్క్‌లను యూజర్ల ప్రమేయం లేకుండా స్వయంగా పూర్తి చేస్తుందని కంపెనీ తెలిపింది.. ఇది వినియోగదారులకు  ఏజెంటిక్ ఎక్స్‌పీరియన్స్‌ను అందిస్తుందని కంపెనీ వెల్లడించింది..

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

ఆకట్టుకునే డిజైన్..
టీజర్ ద్వారా అందుబాటులోకి వచ్చిన వివరాల ప్రకారం.. ఈ ఫోన్ వెనుక భాగంలో పిల్-షేప్ (Pill-shaped) కెమెరా ఐలాండ్‌ను కలిగి ఉంటుంది. దానికి సరిగ్గా క్రింద LED ఫ్లాష్‌ను కూడా అందిస్తోంది.. అలాగే, ఫోన్ ముందు భాగంలో సెల్ఫీ కెమెరా కోసం అద్భుతమైన హోల్-పంచ్ (Hole-punch) కటౌట్ డిజైన్‌ను వినియోగించారు. అన్నింటికంటే ముఖ్యంగా.. ఈ ఫోన్ పక్క భాగంలో (Side frame) ఒక అద్భుతమైన ఆరెంజ్ కలర్ బటన్‌ను కూడా అందిస్తోంది.. ఈ ప్రత్యేక బటన్ కేవలం AI ఫీచర్లను క్షణాల్లో యాక్సెస్ చేయడానికి (Quick Access) సహాయపడుతుందని సమాచారం..

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report

బరువు తగ్గడానికి దాల్చిన చెక్క నీరు నిజంగా సహాయపడుతుందా? మీరు తెలుసుకోవాల్సిన నిజాలు!

New York, New York:

Cinnamon Water For Weight Loss: దాల్చిన చెక్క సాధారణంగా బిర్యానీ, పులావ్‌ కొన్ని ఫ్లేవర్ రైస్‌, కూరల్లో వేస్తారు. ఇందులో ఔషధ గుణాలు కూడా బోలెడు ఉంటాయి. ఇది వంటకు మంచి రుచి కూడా ఇస్తుంది. దాల్చిన చెక్క నీటిని ఉదయం పరగడపున తీసుకుంటే మీ కడుపు ఆరోగ్యం బాగుంటుంది. అంతేకాదు ఉదయం నుంచి ఆ రోజంతా మీ షుగర్‌ స్థాయిలు కూడా అదుపులో ఉంటాయి.  ఇందులో శరీరానికి వెచ్చదనాన్ని అందించే గుణం కూడా కలిగి ఉంటుంది. ప్రధానంగా దాల్చిన చెక్కలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ సమ్మేళనాలు కలిగి ఉంటాయి.  దాల్చిన చెక్క చాయ్‌, కూర, లేదా డెజర్ట్స్, బిర్చానీలో వేసుకుంటే మంచి అరోమాతోపాటు మీ ఇమ్యూనిటీ కూడా బూస్ట్ అవుతుంది. మన శరీర ఆరోగ్యానికి ఇది మంచిది.

అయితే, బరువు నిర్వహణలో ఉండటానికి దాల్చిన చెక్క నీటిని తాగుతున్నారు. ఇలా పరగడపున దాల్చిన చెక్క నీటిని తీసుకుంటే జీర్ణ ఆరోగ్యం మెరుగవ్వడంతోపాటు ఆరోగ్యకరమైన బరువుకు కూడా ఇది తోడ్పడుతుంది. దాల్చిన చెక్క కడుపు ఆరోగ్యానికి కూడా సహాయపడుతుంది. ఖనిజాలు కూడా సులభంగా గ్రహిస్తాయి.

రెగ్యులర్‌గా దాల్చిన చెక్క నీరు తీసుకుంటే ఇది ఆరోగ్యకరమైన బరువుతోపాటు జీర్ణం కూడా మృదువుగా అయ్యేలా చేస్తుంది. ఇది కడుపులో గ్యాస్‌, అజీర్తిని కూడా తగ్గిస్తుంది.

చక్కెర స్థాయిలు..
దాల్చిన చెక్క నీటిని నిత్యం తీసుకుంటే ఇది చక్కెర స్థాయిలు కూడా అదుపులో ఉండేలా చేస్తాయి. ఇది సహజమైన ఇన్సూలిన్‌ అని కూడా పిలుస్తారు. అనారోగ్యకరమైన స్నాక్స్‌ తినేకంటే ఇలా దాల్చిన చెక్కతో తయారు చేసిన టీ తీసుకుంటే షుగర్‌ స్థాయిలు అదుపులో ఉంటాయి.

ఆరోగ్యకరమైన జీవక్రియ..
దాల్చిన చెక్క నీరు మీ డైలీ రొటీన్‌లో చేర్చుకుంటే కూడా మీ శరీర జీవక్రియ సహజంగా సహాయపడుతుంది. ఆరోగ్యంకరమైన జీవక్రియ శరీరాన్ని శక్తి ఉపయోగించడానికి అనుమతిస్తుంది. శరీరా ఆరోగ్యానికి కూడా సహాయపడుతుంది.

Also Read: ఏసీ గదిలో గంటల తరబడి కూర్చుంటున్నారా? మీ చర్మం పాడవుతుందని చెప్పే 5 సంకేతాలు ఇవే!

Also Read: ఉదయాన్నే షుగర్ లెవెల్స్ అకస్మాత్తుగా పెరుగుతున్నాయా? ఈ 5 చిట్కాలతో ఈజీగా కంట్రోల్

యాంటీ ఆక్సిడెంట్లు బోలెడు..
దాల్చిన చెక్కలో సహజంగా యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది శరీర సెల్‌ ఆక్సిడేటివ్‌ స్ట్రెస్‌ బారిన పడకుండా కాపాడతాయి. బరువు నిర్వహణలో ఉన్నవారికి ఇది ఒక ఆరోగ్యకరమైన ఫుడ్‌.

తీపి తినాలనే కోరిక..
ఈ దాల్చిన చెక్కను నరు తీసుకుంటే కూడా మీ టేస్ట్‌ బడ్‌కు తీపి తినాలనే కోరిక తగ్గిస్తుంది.ఇది తీసుకుంటే షుగర్‌ వేసుకోవాల్సిన అవసరం లేదు. 

దాల్చిన చెక్క నీటిని తయారు చేసే విధానం..
ఒక చిన్న దాల్చిన చెక్క లేదా అరచెంచా దాల్చిని పొడి తీసుకోవాలి. మీకు కావాల్సిన నీరు తీసుకోండి. ఇప్పుడు ఒక సాస్‌ ప్యాన్‌ తీసుకుని నీరు పోయండి. అందులో  ఈ దాల్చిన చెక్క వేసి ఓ 7 నిమిషాు మరిగించండి. దాల్చిన చెక్క సారం పూర్తిగా నీటిలోకి ఇంకిపోయే వరకు ఉడికించాలి. ఇప్పుడు కాస్త చల్లారనివ్వాలి. ఆ తర్వాత స్టెయినర్‌ సహాయంతో వడగట్టండి.ఉదయం పరగడపున ఈ నీటిని తాగడం అలవాటు చేసుకోండి. దాల్చిన చెక్క నీటిని మీ రోజువారీ రొటీన్‌లో చేర్చుకుంటే ఆరోగ్యకరం. ఇది ఒక సమతుల ఆహరం. దీంతోపాటు రోజూ ఫిజికల్‌ యాక్టివిటీ కూడా తప్పనిసరి. మీరు డైట్‌ కూడా ఆరోగ్యకరంగా ఉండేటా చూడండి.దీంతో మీరు సులభంగా బరువు తగ్గిపోతారు.(Disclaimer: పాఠకులారా ఈ వ్యాసం కేవలం సాధారణ సమాచారం, సలహాలను మాత్రమే అందిస్తుంది. ఇది ఎంతమాత్రం వృత్తిపరమైన సలహా కాదు. ఈ సమాచారానికి జీ తెలుగు న్యూస్ ఎటువంటి బాధ్యత వహించదు.)

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report
Advertisement

Hydrogen Train: "భవిష్యత్తు అంతా హైడ్రోజన్‌దే"..చారిత్రాత్మక రైలు ఆవిష్కరణ ఘట్టంలో ప్రధాని మోదీ!

Hyderabad, Telangana:

Hydrogen Train PM Modi Speech: భారత రైల్వే రంగంలో సరికొత్త విప్లవానికి తెరలేచింది. దేశంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ రైలు సర్వీసును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఘనంగా ప్రారంభించారు. ఈ చారిత్రాత్మక ఘట్టం అనంతరం ప్రధాని మోదీ దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ, రాబోయే కాలమంతా హైడ్రోజన్ ఇంధనానిదేనని స్పష్టం చేశారు.

రైల్వే వ్యవస్థలో పర్యావరణ పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ప్రధాని పేర్కొన్నారు. ఇందులో భాగంగానే పర్యావరణహిత చర్యలకు శ్రీకారం చుడుతూ ఈ హైడ్రోజన్ రైలును అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. భవిష్యత్తులో రైల్వే అవసరాల కోసం డీజిల్, సాంప్రదాయ విద్యుత్ వినియోగాన్ని దశలవారీగా తగ్గిస్తామని ఆయన వెల్లడించారు. భారతీయ రైల్వే రూపురేఖలను పూర్తిగా మార్చేయడంలో, గ్రీన్ ఎనర్జీ దిశగా అడుగులు వేయడంలో ఈ ప్రాజెక్ట్ ఒక కీలకమైన మైలురాయిగా నిలుస్తుందని ప్రధాని మోదీ ధీమా వ్యక్తం చేశారు.

దేశంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు. అయితే మన దేశంలో ఎక్కువ శాతం ఉన్న ఎలక్ట్రిక్ రైళ్లు, హైడ్రోజన్ రైళ్లు రెండూ పర్యావరణ అనుకూల రవాణా వ్యవస్థలే అయినప్పటికీ, వాటి పనితీరు, సాంకేతికత.. సామర్థ్యంలో ప్రధాన వ్యత్యాసాలు ఉన్నాయి.

ప్రపంచవ్యాప్తంగా జర్మనీ, జపాన్, చైనా, అమెరికా వంటి అగ్రదేశాల సరసన ఇప్పుడు భారత్ కూడా హైడ్రోజన్ రైలు సాంకేతికత కలిగిన దేశంగా నిలిచింది. ఈ నేపథ్యంలో, అటు పర్యావరణానికి మేలు చేసే హైడ్రోజన్ రైలుకు, ఇటు దశాబ్దాలుగా మనకు సేవలందిస్తున్న ఎలక్ట్రిక్ రైలుకు మధ్య తేడాలేంటి? ఏది ఉత్తమమైనది? అనే ఆసక్తికరమైన వివరాలు ఇక్కడ చూద్దాం.

భారతదేశపు తొలి హైడ్రోజన్ రైలు ప్రత్యేకతలు..
ఉత్తర రైల్వే పరిధిలో దాదాపు రూ.140 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టు పనులు జరిగాయి. ఈ రైలులో 8 ప్యాసింజర్ కోచ్‌లు, 2 పైలట్ కోచ్‌లు ఉన్నాయి. ఇది దేశంలోనే అత్యంత పొడవైన హైడ్రోజన్ రైలు కావడం విశేషం. ఇందులో 682 సీటింగ్ సామర్థ్యం ఉండగా, మొత్తం 2,600 మంది ప్రయాణికులు ప్రయాణించేందుకు వీలుంది.

Also Read: హైడ్రోజన్ రైలు Vs ఎలక్ట్రిక్ రైలు.. ఈ రెండు రైళ్లలో ఏది బెస్ట్? ఏది తక్కువ ఖర్చు?

Also Read: పంచాయితీ ఎన్నిక సీట్ల విషయంలో జనసేన తగ్గేదేలే.. మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్య!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Hydrogen Vs Electric Train: హైడ్రోజన్ రైలు Vs ఎలక్ట్రిక్ రైలు.. ఈ రెండు రైళ్లలో ఏది బెస్ట్? ఏది తక్కువ ఖర్చు అవుతుంది?

Sorkhi, Haryana:

Hydrogen Train Vs Electric Train: భారతీయ రైల్వే చరిత్రలో నేడు (జూలై 17) ఒక చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం అయ్యింది. హర్యానాలో దేశంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ రైలు సర్వీసును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించారు. చెన్నైలోని పెరంబూర్ ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF)లో రూపుదిద్దుకున్న ఈ పర్యావరణ అనుకూల రైలు.. హర్యానాలోని జింద్ - సోనిపట్ మార్గంలో పరుగులు పెడుతోంది.

ప్రపంచవ్యాప్తంగా జర్మనీ, జపాన్, చైనా, అమెరికా వంటి అగ్రదేశాల సరసన ఇప్పుడు భారత్ కూడా హైడ్రోజన్ రైలు సాంకేతికత కలిగిన దేశంగా నిలిచింది. ఈ నేపథ్యంలో, అటు పర్యావరణానికి మేలు చేసే హైడ్రోజన్ రైలుకు, ఇటు దశాబ్దాలుగా మనకు సేవలందిస్తున్న ఎలక్ట్రిక్ రైలుకు మధ్య తేడాలేంటి? ఏది ఉత్తమమైనది? అనే ఆసక్తికరమైన వివరాలు ఇక్కడ చూద్దాం.

భారతదేశపు తొలి హైడ్రోజన్ రైలు ప్రత్యేకతలు..
ఉత్తర రైల్వే పరిధిలో దాదాపు రూ.140 కోట్ల వ్యయంతో ఈ ప్రాజెక్టు పనులు జరిగాయి. ఈ రైలులో 8 ప్యాసింజర్ కోచ్‌లు, 2 పైలట్ కోచ్‌లు ఉన్నాయి. ఇది దేశంలోనే అత్యంత పొడవైన హైడ్రోజన్ రైలు కావడం విశేషం. ఇందులో 682 సీటింగ్ సామర్థ్యం ఉండగా, మొత్తం 2,600 మంది ప్రయాణికులు ప్రయాణించేందుకు వీలుంది.

పనితీరు, ఇంధన వినియోగం..
ఎలక్ట్రిక్ రైళ్లు నడవడానికి పట్టాల పైన ఉండే ఓవర్‌హెడ్ విద్యుత్ తీగలు తప్పనిసరి. రైలు పైకప్పుపై ఉండే 'పాంటోగ్రాఫ్' అనే పరికరం ద్వారా ఈ తీగల నుండి విద్యుత్‌ను గ్రహించి, కింద ఉండే మోటార్ల సహాయంతో ఇవి ప్రయాణిస్తాయి. దీనికి భిన్నంగా, హైడ్రోజన్ రైళ్లకు ఎలాంటి ఓవర్‌హెడ్ విద్యుత్ తీగలు అవసరం లేదు. ఈ రైళ్లలోనే అమర్చబడిన ఫ్యూయల్ సెల్స్ ద్వారా హైడ్రోజన్ వాయువును, బయటి వాతావరణంలోని ఆక్సిజన్‌తో రసాయనిక చర్య జరిపిస్తారు. ఈ ప్రక్రియ ద్వారా సొంతంగా విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకుంటూ ఇవి ముందుకు సాగుతాయి.

సామర్థ్యం, బరువు..
సామర్థ్యం విషయానికి వస్తే ఎలక్ట్రిక్ రైళ్లు అత్యంత ప్రతిభావంతంగా పనిచేస్తాయి. పవర్ గ్రిడ్ నుండి వచ్చే విద్యుత్‌లో దాదాపు 80-90% శక్తి నేరుగా రైలును నడపడానికి ఉపయోగపడుతుంది. అదే హైడ్రోజన్ రైళ్లలో, ఫ్యూయల్ సెల్ ద్వారా హైడ్రోజన్‌ను తిరిగి విద్యుత్‌గా మార్చే ప్రక్రియలో ఎక్కువ శక్తి వృథా అవుతుంది. దీనివల్ల వీటి సామర్థ్యం కేవలం 30-40% వరకే పరిమితమవుతుంది. ఇక బరువు విషయానికొస్తే, ఎలక్ట్రిక్ రైళ్లు ఇంధనాన్ని నిల్వ ఉంచుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి చాలా తేలికగా ఉంటాయి. కానీ, హైడ్రోజన్ రైళ్లు తమకు కావలసిన శక్తిని స్వయంగా తయారు చేసుకోవడం కోసం భారీ హైడ్రోజన్ ట్యాంకులు, ఇంధన నిల్వలు, పెద్ద బ్యాటరీలను మోయాల్సి రావడం వల్ల బరువు ఎక్కువగా ఉంటాయి.

ప్రయాణ ఖర్చులు, టికెట్ ధరలు..
ప్రయాణికులపై పడే ఆర్థిక భారం పరంగా చూస్తే, ఎలక్ట్రిక్ రైళ్లలో కిలోమీటర్ల దూరాన్ని బట్టి సాధారణ టికెట్ ధరలు రూ.5 నుండి రూ.30 వరకు ఉంటాయి. అదే ఏసీ కోచ్‌లలో ప్రయాణిస్తే ఈ ధర రూ. 35 నుండి రూ.120 (దాదాపు 60 కి.మీ. దూరానికి) వరకు మారుతుంది. మరోవైపు, కొత్తగా అందుబాటులోకి రానున్న హైడ్రోజన్ రైళ్లలో ప్రారంభ దశ కింద జింద్ - సోనిపట్ (సుమారు 85-90 కిలోమీటర్లు) మార్గానికి టికెట్ ధరలను రూ.5 నుండి రూ.25 మధ్యే ఉంచినట్లు సమాచారం. ప్రారంభంలో ప్రయాణికులను ఆకర్షించడానికి, పర్యావరణ అనుకూల ప్రయాణాన్ని ప్రోత్సహించడానికి హైడ్రోజన్ రైలు ధరలను చాలా సరసంగా నిర్ణయించారు.

భద్రత విషయంలో ఏది సేఫ్?
ఎలక్ట్రిక్ రైళ్లలో హై-వోల్టేజ్ విద్యుత్ వైర్లు ప్రధాన ముప్పు. వాటిని తాకడం వల్ల ప్రాణాంతక ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. అయితే, అగ్నిప్రమాదాలు చాలా అరుదుగా జరుగుతాయి.

హైడ్రోజన్ రైళ్లలో హైడ్రోజన్ అత్యంత వేగంగా మండే స్వభావం గల వాయువు. సొరంగాలు వంటి ఇరుకైన ప్రదేశాల్లో లీకేజీ జరిగితే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

రక్షణ చర్యలు: ప్రభుత్వం ఈ రైలులో అత్యున్నత భద్రతా ప్రమాణాలను ఏర్పాటు చేసింది. సెన్సార్లు, అత్యవసర ఆటోమేటిక్ షట్-ఆఫ్ సిస్టమ్ (మానవ ప్రమేయం లేకుండానే హైడ్రోజన్ సరఫరాను నిలిపివేసే వ్యవస్థ), డ్రైవర్ సురక్షిత క్యాబిన్, ప్రత్యేక మానిటరింగ్ స్క్రీన్లు వంటి ఆధునిక రక్షణ చర్యలను రైలు డిజైన్‌లోనే పొందుపరిచారు.

ఈ రెండింటిలో ఏది ఉత్తమమైనది?
రెండు రకాల రైళ్లకు వాటి స్వంత ప్రయోజనాలు, పరిమితులు ఉన్నాయి. ఎలక్ట్రిక్ రైళ్లు చాలా ఏళ్లుగా నమ్మకమైన, సురక్షితమైన రవాణాగా నిరూపితమయ్యాయి. హైడ్రోజన్ రైళ్లు పర్యావరణానికి అత్యంత మేలు చేసే సాంకేతికత (జీరో ఎమిషన్స్) అయినప్పటికీ, ఇవి మన దేశంలో ఇప్పుడే అడుగుపెడుతున్నాయి. ఇవి నిరంతరాయంగా సేవలందిస్తూ ప్రజల వాడకం పెరిగిన తర్వాతే వీటి పూర్తి సామర్థ్యం, విశ్వసనీయతపై స్పష్టత వస్తుంది.

ఈ జింద్-సోనిపట్ పైలట్ ప్రాజెక్ట్ విజయవంతం అయితే, ఈ అనుభవంతో చారిత్రాత్మక పర్యాటక మార్గమైన కల్కా-సిమ్లా వంటి సాంప్రదాయ రైల్వే మార్గాల్లో కూడా హైడ్రోజన్ రైళ్లను ప్రవేశపెట్టేందుకు భారతీయ రైల్వే రంగం సిద్ధమవుతోంది.

Also Read: రైలు కింద కుటుంబం మొత్తం ఆత్మహత్య..బావ హత్య కేసులో నిందితుడు దారుణం..అసలు నిజం ఇదే?

Also Read; Metro Lovers Kissing: మెట్రో రైలులో లవర్స్ ముద్దులాట..బూతులు తిడుతున్న ప్రయాణికులు!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

పల్లెలకు మహర్దశ.. మన ఊరి పైసలు.. మన ఊరికే..

Hyderabad, Telangana:

Telangana Panchayat Ordinance:  తెలంగాణ రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయానికి శ్రీకారం చుట్టబోతోంది. మన ఊరి పైసలు.. మన ఊరికే అనే నినాదాన్ని నిజం చేస్తూ.. గ్రామాల్లో వసూలయ్యే పన్నుల నిధులను స్థానికంగానే.. తక్షణమే వాడుకునేందుకు గ్రీన్ సిగ్నల్ లభించనుంది. జరగనున్న రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో ఇందుకు సంబంధించిన కీలక ఆర్డినెన్స్‌ను తీసుకువచ్చేందుకు ప్రభుత్వం ముమ్మరంగా కసరత్తు చేస్తోంది.

ఆర్డినెన్స్‌తో చెక్..
ఇప్పటివరకు గ్రామాల్లో వసూలయ్యే ఇంటి పన్నులతో పాటు నల్లా పన్నులు వంటి స్థానిక నిధులను తప్పనిసరిగా ప్రభుత్వ ట్రెజరీల్లో జమ చేయాల్సి ఉండేది.. అత్యవసరంగా గ్రామంలో ఏదైనా చిన్న పని చేయాలన్నా.. వీధి దీపాలు మార్చాలన్నా.. డ్రైనేజీ పూడికతీత తీయాలన్నా ఆర్థిక శాఖ అనుమతి కోసం నెలల తరబడి వేచి చూడాల్సి వచ్చేది. ఈ సుదీర్ఘ నిరీక్షణకు, బ్యూరోక్రసీకి చెక్ పెడుతూ ప్రభుత్వం సరికొత్త ఆర్డినెన్స్‌ను సిద్ధం చేసింది. దీని ద్వారా నిధుల డ్రాపై ఉన్న ఆంక్షలన్నీ తొలగిపోబోతున్నట్లు తెలుస్తోంది..

12,760 పంచాయతీలకు నేరుగా లబ్ధి..
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 12,760 గ్రామ పంచాయతీలకు ఈ నిర్ణయం ద్వారా భారీ ఊరట లభించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపై స్థానిక నిధులను వాడుకోవడానికి ఉన్నతాధికారుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు.. సర్పంచులు, పంచాయతీ పాలకవర్గాలు గ్రామ అవసరాలకు తగ్గట్టుగా.. నేరుగా ఆ నిధులను డ్రా చేసుకుని.. పనులను త్వరితగతిన పూర్తి చేసుకునే వెసులుబాటు కలుగుతుంది.

ఏయే పనులకు ఈ నిధులు వాడుకోవచ్చు?..
ఈ ఆర్డినెన్స్ అమల్లోకి వస్తే.. పంచాయతీలు కింది అత్యవసర పనులను తక్షణమే చేపట్టే సౌకర్యం లభిస్తుంది. ముఖ్యంగా నల్లా కనెక్షన్ల మరమ్మతులు, పైప్‌లైన్ల లీకేజీల రిపేర్‌ చేయడంతో పాటు గ్రామాల్లో బ్లీచింగ్ చల్లడం, డ్రైనేజీల క్లీనింగ్, దోమల నివారణ చర్యలకు ఈ డబ్బు ఖర్చు పెట్టొచ్చు. ఇవే కాకుండా... పాడైపోయిన ఎల్‌ఈడీ బల్బుల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేయడం, అంతర్గత సీసీ రోడ్ల ప్యాచ్ వర్క్స్, ప్రభుత్వ భవనాల చిన్నపాటి రిపేర్లు చేసుకునే సౌకర్యం కూడా లభించడం విశేషం..

Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!

ప్రభుత్వం తీసుకోబోయే.. ఈ నిర్ణయంపై గ్రామీణ ప్రాంతాల్లో, స్థానిక ప్రజాప్రతినిధుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. నిధులు ఉండి కూడా ట్రెజరీ ఆంక్షల వల్ల పనులు చేయలేక చేతులు కట్టేసుకున్న సర్పంచులకు ఇది నిజంగానే పెద్ద ఊరటగా భావిస్తున్నారు. నేటి క్యాబినెట్ సమావేశంలో ఈ ఆర్డినెన్స్‌కు ఆమోదం ముద్ర పడడమే ఆలస్యం.. గ్రామాల్లో సరికొత్త ప్రగతి ప్రారంభం కావడం ఖాయంగా కనిపిస్తోంది.

Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

0
0
Report
Advertisement

AP Local Body Elections: పంచాయితీ ఎన్నిక సీట్ల విషయంలో జనసేన తగ్గేదేలే.. మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు!

Vijayawada, Andhra Pradesh:

AP Local Body Elections 2026: ఆంధ్రప్రదేశ్‌లో మరికొన్ని రోజుల్లో పంచాయితీ (స్థానిక సంస్థల) ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ క్రమంలో జనసేన రాజకీయ వ్యవహారాల నేత, రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల ఫార్మూలా పనిచేయదని సీట్ల సర్దుబాటులో తగ్గి ఉండాల్సిన అవసరం లేదనే విషయాన్ని గుర్తుచేశారు. అలాగే రాబోయే పంచాయితీ ఎన్నికల్లో జనసేన క్యాడర్‌కు ఈ సందర్భంగా దిశానిర్దేశం చేశారు.

మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడిన ముఖ్యాంశాలు..
గత అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక ఓటు చీలనివ్వనని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజలకు, కూటమికి ఇచ్చిన మాటకు కట్టుబడి నిలబడ్డారని మనోహర్ గుర్తుచేశారు. ఆ నాడు ఆయన తీసుకున్న నిర్ణయం రాష్ట్ర భవిష్యత్తును మార్చివేసిందని మంత్రి మనోహర్ అన్నారు.

6 కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా భావించి జనసేన పార్టీ కొన్ని స్థానాల్లో వెనక్కి తగ్గిందని ఆయన పేర్కొన్నారు. అయితే, అదే సూత్రం స్థానిక సంస్థల ఎన్నికలకు వర్తిస్తుందని అనుకుంటే పొరపాటని మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.

జనసేన కొత్త ఫార్ములా..? 
సార్వత్రిక ఎన్నికల్లో అనుసరించిన సీట్ల సర్దుబాటు ఫార్ములాను స్థానిక సంస్థల ఎన్నికల్లో గుడ్డిగా అమలు చేయడం కుదరదని మంత్రి తేల్చిచెప్పారు. ఈ ఎన్నికల వ్యూహం, సమీకరణాలు పూర్తిగా భిన్నంగా ఉంటాయని నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.

గత కొన్నేళ్లుగా పార్టీ కోసం అహర్నిశలు శ్రమించిన, కష్టకాలంలో జెండా మోసిన జనసేన నాయకులకు, కార్యకర్తలకు ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు పూర్తి స్థాయిలో అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు.

కూటమి ప్రభుత్వంలో ఉన్నప్పటికీ, స్థానిక సంస్థల ఎన్నికల విషయానికి వచ్చేసరికి జనసేన తన బలాన్ని నిరూపించుకోవడానికి సిద్ధంగా ఉందనే సంకేతాలను నాదెండ్ల మనోహర్ ఈ వ్యాఖ్యల ద్వారా పంపించారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం అటు కూటమిలోనూ, ఇటు రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

Also Read: రైలు కింద కుటుంబం మొత్తం ఆత్మహత్య..బావ హత్య కేసులో నిందితుడు దారుణం..అసలు నిజం ఇదే?

Also REad: మాజీ మంత్రి, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం రాజకీయ నేపథ్యం ఇదే!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

రాహు కేతువుల మాయాజాలం.. జూలై 19 నుంచి ఈ 3 రాశుల వారికి సువర్ణ కాలం.. లక్ష్మీ దేవి కటాక్షం!

Hyderabad, Telangana:

Rahu Ketu Miracle Telugu: జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల కదలికలకు ఎంతో ప్రాధాన్యత ఉంటుందని మనందరికీ తెలుసు.. గ్రహాల మార్పుల వల్ల కొన్నిసార్లు అద్భుతమైన యోగాలతో పాటు మరికొన్నిసార్లు శక్తివంతమైన ప్రభావాలు ఏర్పడుతూ ఉంటాయి.. ప్రస్తుతం జూలై మూడవ.. నాల్గవ వారాల్లో గ్రహాల స్థితిగతులు అత్యంత కీలకమైన దశకు చేరుకోబోతున్నాయి. జ్యోతిష్య నిపుణుల ప్రకారం.. ప్రస్తుతం ప్రధాన గ్రహాలన్నీ రాహువు, కేతువుల మధ్య చిక్కుకుపోయి ఉన్నాయి. దీనివల్ల సూర్యుడు, కుజుడు, బుధుడు, శని వంటి గ్రహాల శుభ ప్రభావం తగ్గిపోయి.. అన్ని రాశులవారిపై ఊహించని ప్రభావాన్ని చూపుతాయి.. ఫలితంగా కొన్ని రాశుల వారు తీవ్రమైన అడ్డంకులతో పాటు అనేక సమస్యలు వస్తాయి.. అయితే, జూలై 19న ఈ మాయాజాలం కారణంగా ఈ కింది రాశులవారి జీవితాల్లో ఊహించని మార్పులు రాబోతున్నాయి. ఆ తర్వాత మూడు రాశుల వారికి సువర్ణ కాలం ప్రారంభం కాబోతోంది.

ఆ మూడు అదృష్ట రాశులు ఇవే..
కర్కాటక రాశి (Cancer)
ఈ రాశి వారికి జూలై 19 తర్వాత కాలం అత్యంత అద్భుతంగా ఉండబోతోందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. వీరు ఊహించని విజయాల శిఖరాలకు చేరుకుంటారు. గత కొంతకాలంగా వేధిస్తున్న మానసిక ఆందోళనలు తొలగిపోయి.. ప్రశాంతత లభిస్తుంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. వ్యాపారాలతో పాటు ఉద్యోగాలు సజావుగా సాగే ఛాన్స్‌ ఉంది.. ముఖ్యంగా చాలా కాలంగా వేధిస్తున్న ఆర్థిక ఇబ్బందులు, ధన కొరత పూర్తిగా తీరిపోతుంది. నిలిచిపోయిన పనులన్నీ వేగంగా పూర్తవుతాయి.

మిథున రాశి (Gemini)
రాహు-కేతువుల మాయాజాలం వీడగానే మిథున రాశి వారికి మంచి రోజులు మొదలు కాబోతున్నాయి.. ముఖ్యంగా ఉద్యోగస్తులు తమ కార్యక్షేత్రంలో సరైన నిర్ణయాలు తీసుకుని ప్రశంసలు పొందుతారని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. దీనివల్ల కెరీర్‌లో ఉన్నత స్థానాలకు చేరుకుంటారు. జీతాల పెంపు (Salary Hike) లేదా ప్రమోషన్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కుటుంబంలో సుఖసంతోషాలు లభించబోతున్నాయి. జీవిత భాగస్వామితో సంతోషంగా కాలం గడుపుతారు.

మీన రాశి (Pisces)
మీన రాశి వారు కూడా తమ జీవితంలో గోల్డెన్ టైమ్‌ను ఆస్వాదించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కార్యాలయంలో ఎలాంటి ఒత్తిడి లేకుండా పనులు సాగిపోతాయని అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ పనితీరుతో మీరు బాస్‌కు అత్యంత ప్రీతిపాత్రులుగా మారే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. ఏ పనినైనా ఎంతో ఓపికతో.. పట్టుదలతో పూర్తి చేస్తారు. దీనివల్ల అనుకున్న విజయాలు చాలా సులభంగా మీ సొంతమవుతాయి. మానసిక ప్రశాంతత చేకూరుతుంది.

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

గమనిక.. 

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..

0
0
Report
Advertisement

కేవలం రూ.7,000 లకే 8 దివ్యక్షేత్రాల దర్శనం.. TGSRTC కోరుట్ల డిపో స్పెషల్ ప్యాకేజీ వివరాలు..

Jagtial, Telangana:

TGSRTC Korutla Depot News: జగిత్యాల ఆధ్యాత్మిక యాత్రీకులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) కోరుట్ల డిపో ఒక అద్భుతమైన అవకాశాన్ని అందిస్తోంది. పవిత్ర శ్రావణ మాస వేళ.. భక్తుల కోరిక మేరకు తమిళనాడులోని ప్రముఖ శైవక్షేత్రం అరుణాచల గిరి ప్రదక్షిణతో పాటు.. దక్షిణ భారతదేశంలోని పలు ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలను సందర్శించేందుకు వీలుగా ఒక అద్భుతమైన ప్రత్యేక టూర్ బస్సు సర్వీసును ప్రకటించింది.. ఈ మేరకు జులై 27వ తేదీన కోరుట్ల డిపో నుంచి ఈ ప్రత్యేక బస్సు బయలుదేరనుందని డిపో మేనేజర్ (DM) ఒక ప్రకటనలో అధికారికంగా వెల్లడించారు.

ఒకే యాత్ర.. ఎనిమిది దివ్యక్షేత్రాల దర్శనం..
భక్తుల ఆధ్యాత్మిక కాంక్షను నెరవేర్చే విధంగా ఈ టూర్ ప్యాకేజీని అత్యంత ప్రతిష్టాత్మకంగా డిజైన్ చేశారని డిఎమ్‌ తెలిపారు.. ఈ సింగిల్ ట్రిప్‌లో భక్తులు దేశంలోనే అద్భుతమైన 8 ప్రముఖ పుణ్యక్షేత్రాలను దర్శించుకోవచ్చని అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ యాత్రలో సందర్శించే క్షేత్రాల వివరాల్లోకి వెళితే..

మహానందిలో ప్రకృతి ఒడిలో వెలిసిన స్వయంభూ శివలింగ దర్శనంతో పాటు కాణిపాకంలో స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దర్శనం, శ్రీపురంలో కనువిందు చేసే లక్ష్మీ నారాయణి బంగారు దేవాలయం, కంచిలో కామాక్షి అమ్మవారు, ఏకాంబరేశ్వరుడి దర్శనం, తిరుత్తణిలో కార్తికేయుడి ఐదవ పడైవీడు క్షేత్రం, అరుణాచలంలో పవిత్ర కార్తీక దీప క్షేత్రంలో అత్యంత అద్భతమైన గిరి ప్రదక్షిణ, స్వామివారి దర్శనం, తిరుపతిలో కలియుగ వైకుంఠ నాథుడు శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం, శ్రీకాళహస్తిలో రాహు-కేతు నివారణ క్షేత్రమైన వాయులింగేశ్వర స్వామి దర్శనాలు ఉంటాయని అధికారిక ప్రకటనలో తెలిపారు. అంతేకాకుండా అరుణాచల కొండ చుట్టూ భక్తులు గిరి ప్రదక్షిణ చేసేందుకు ఈ యాత్రలో ప్రత్యేక సమయాన్ని కేటాయించిన్నట్లు తెలుస్తోంది.

భోజన వసతి ఉచితం..
భక్తుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ ఈ ప్యాకేజీ ధరలను నిర్ణయించింది. ముఖ్యంగా పెద్దలకు (Adults) రూ. 7,000 కాగా.. పిల్లలకు (Children) రూ. 5,500 మాత్రమేనని అధికారికంగా తెలిపింది. ఈ టికెట్ ధరలోనే ప్రయాణ ఖర్చులతో పాటు భక్తులకు ప్రతిరోజూ మధ్యాహ్నం రుచికరమైన భోజనం (Lunch)తో పాటు రాత్రి వేళ మంచి అల్పాహారం ఆర్టీసీ సంస్థ తరఫునే ఉచితంగా ఉంటుందని తెలిపింది. దీనివల్ల భక్తులు ఆహారం కోసం దారిపొడవునా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు..

Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!

భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి..
సుదూర ప్రాంతాల్లోని పుణ్యక్షేత్రాలకు రైళ్లు, ప్రైవేట్ వాహనాల్లో వెళ్లాలంటే రిజర్వేషన్లు, వసతి, రూట్ తెలియక భక్తులు ఎన్నో ఇబ్బందులు పడుతుంటారని.. వాటన్నింటికీ చెక్ పెడుతూ ఆర్టీసీ ఈ సురక్షితమైన ఆధ్యాత్మిక యాత్రను అందిస్తోందని డిపో మేనేజర్ తెలిపారు. అనుభవజ్ఞులైన డ్రైవర్లతో పాటు సుఖవంతమైన ప్రయాణం ఈ టూర్ ప్రత్యేకత అని పేర్కొన్నారు. సీట్లు పరిమితంగానే ఉంటాయని.. ఆసక్తి గల భక్తులు వెంటనే కోరుట్ల ఆర్టీసీ డిపో సంప్రదించి.. అధికారిక వెబ్‌సైట్ ద్వారా తమ సీట్లను ముందస్తుగా రిజర్వ్ చేసుకోవాలని ఆయన కోరారు..

Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

0
0
Report

సూర్యుడి కర్కాటక రాశి సంచారం.. రాబోయే 30 రోజులు ఈ 3 రాశుల వారికి కష్టకాలం..

Hyderabad, Telangana:

Sun Transit In Cancer 2026 Effect On Zodiac: జ్యోతిష్యశాస్త్రంలో సూర్యభగవానుడిని గ్రహాల రాజుగా చెప్పకుంటారు. సూర్యుడు తన రాశిని లేదా నక్షత్రాన్ని మార్చినప్పుడల్లా కేవలం వాతావరణంలోనే కాకుండా.. మానవుల వృత్తి, ఆర్థిక స్థితి, ఆరోగ్యంతో పాటు సామాజిక గౌరవంపై నేరుగా ప్రభావం పడుతుందని జ్యోతిష్యుతు తెలుపుతున్నారు. ఈ ఇదిలా ఉంటే 2026 జూలై 16న సూర్య గ్రహం చంద్రుడి ఆధిపత్యం కలిగిన కర్కాటక రాశిలోకి సంచారం చేస్తాడు.. సూర్యుడి సంచారం రాబోయే ఒక నెల రోజుల పాటు మొత్తం 12 రాశుల వారిపై ప్రభావం చూపుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.

అయితే, జ్యోతిష్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఈ సూర్యడి సంచారం వల్ల మూడు నిర్దిష్ట రాశుల వారు ఉద్యోగం, డబ్బుతో పాటు ఆరోగ్యం విషయాలలో అత్యంత అప్రమత్తంగా ఉండాల్సి ఉంఉటంది. రాబోయే 30 రోజులు వీరికి కొంత ప్రతికూలంగా మారే అవకాశం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. అయితే, ఈ సమయంలో ఏయే రాశులవారికి సూర్యుడి నెగిటివ్‌ ప్రభావం పడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..

కుంభ రాశి (Aquarius) 
సూర్యుడి ప్రభావంతో కుంభరాశివారికి ఈ సమయంలో ప్రతికూల ప్రభావం పడుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. వీరు ఎంత కష్టపడినప్పటికీ.. ఆశించిన ఫలితాలు కలగపోవచ్చు. అంతేకాకుండా ఉద్యోగాలు చేసేవారికి ఈ సమయంలో అనేక రకాల ఆటంకాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఆర్థిక లావాదేవీల విషయంలో అదనపు జాగ్రత్తలు అవసరం. తొందరపాటుతో తీసుకునే ఏ నిర్ణయమైనా భవిష్యత్తులో పెద్ద సమస్యలకు దారితీయవచ్చని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. దీంతో పాటు కుటుంబ వాతావరణంలో కూడా శాంతిపరమైన సమస్యలు ఎదురవుతాయి. 

వృశ్చిక రాశి (Scorpio) 
శక్తివంతమైన సూర్యుడి ప్రభావంతో వృశ్చిక రాశివారికి కూడా ఈ సమయంలో ఎన్నో రకాల సవాళ్లు ఎదురవుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా మానసిక ఆందోళన వంటి సమస్యలు కూడా ఇబ్బందులు పెట్టే ఛాన్స్‌లు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వైవాహిక జీవితంలో హెచ్చుతగ్గులు వస్తాయి. కాబట్టి భాగస్వామితో మాట్లాడేటప్పుడు ఓపికతో ఉండడం ఎంతో మంచిది. తెలియని వ్యక్తులను లేదా కొత్త పరిచయాలను అంత త్వరగా నమ్మకపోవడం చాలా మంచిది. అదనపు ఖర్చులు కూడా విపరీతంగా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. కుటుంబ పరంగా చాలా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.

వృషభ రాశి (Taurus) 
సూర్యుడి రాశి సంచారంతో వృషభ రాశివారికి కూడా ఈ సమయంలో అనేక రకాల సమస్యలు వస్తాయి. అంతేకాకుండా ఆశించిన పనులలో సరైన ఫలితాలు రాకపోవడం వల్ల మానసిక ఒత్తిడితో పాటు ప్రతికూల ఆలోచనలు పెరిగే అవకాశాలు కూడా విపరీతంగా ఉన్నాయి. ఉద్యోగస్తులకు పని స్థలంలో ఒత్తిడి విపరీతంగా పెరుగుతుంది. అలాగే కెరీర్‌ పరంగా కూడా ఎన్నో రకాల సమస్యలు వస్తాయి. ముఖ్యంగా విజయాలు రావడంలో కూడా అనేక రకాల సమస్యలు వచ్చే ఛాన్స్‌లు కనిపిస్తున్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఎక్కడైనా పెట్టుబడి పెట్టే ముందు అన్ని కోణాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది.

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

గమనిక.. 

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..

0
0
Report

ఏపీలో పాలన గాలికెగిరిపోయింది.. చంద్రబాబు పాలనలో ఎక్కడ చూసినా స్కామ్‌లే: వైఎస్‌ జగన్‌

Tadepalli, Andhra Pradesh:

YSR Congress Party: ఆంధ్రప్రదేశ్‌లో పాలన గాలికి ఎగిరిపోయిందని.. చంద్రబాబు పాలనలో ఎక్కడ చూసినా కుంభకోణాలేనని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ తీవ్ర ఆరోపణలు చేశారు. 'డీఎస్సీ కుంభకోణం, టీచర్లకు టెట్, ప్రశ్నిస్తే వేధింపులు. అక్రమ కేసులు, అరెస్టులు, సంక్షోభంలో వ్యవసాయం. కష్టాల్లో ఆక్వా రైతులు, సమస్యల్లో ప్రభుత్వ ఉద్యోగులు. విపరీతంగా అప్పులు. రాష్ట్రం అప్పులకుప్ప' అని కూటమి పాలన వైఫల్యాలు మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ తెలిపారు. వీటన్నింటినీ పార్లమెంట్‌ సమావేశాల్లో గట్టిగా వినిపించాలని ఎంపీలకు సూచించారు.

తాడేపల్లిలోని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం గురువారం నిర్వహించారు. ఈనెల 20వ తేదీ నుంచి జరగనున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై సమావేశంలో ఎంపీలతో కలిసి పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ చర్చించారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలే ముఖ్యం అని.. వాటి కోసం గళం విప్పాలని ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు ఇదివరకే మద్దతు ఇచ్చామని.. దాన్ని మరోసారి పునరుద్ఘాటిస్తున్నట్లు తెలిపారు.

'ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో పాలన గాలికి ఎగిరి పోయింది. ఎక్కడ చూసినా స్కాములే. డీఎస్సీ 2025 పోస్టుల భర్తీలో పెద్ద కుంభకోణం చోటుచేసుకుంది. పోటీ పరీక్ష రాయకుండానే ఉద్యోగాలు ఇవ్వడం ఏమిటి? ఇంకా డీఎస్సీ పరీక్ష పేపర్ల లీక్‌పైనా అనేక అంశాలు వెలుగులోకి వచ్చాయి. స్పోర్ట్స్‌ కోటా ఉద్యోగాల భర్తీలో అనేక అవకతవకలు జరిగాయి' అని చంద్రబాబు పాలనలో తప్పిదాలను సమావేశంలో మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ వివరించారు.

ఏపీలో అంతులేని అవినీతి పర్వం సాగుతోందని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ విమర్శించారు. రాష్ట్రంలో ఇష్టాను సారంగా భూముల పందేరం జరుగుతోందని.. దాదాపు రూ.5 వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను లోకేష్‌ తోడల్లుడికి అప్పనంగా అప్పగించారని ఆరోపించారు. అమరావతి నిర్మాణంలో కూడా విపరీతమైన దోపిడీ జరుగుతోందని.. చదరపు అడుగుకు రూ.20 వేలకు పైగా ఖర్చు చేస్తున్నారని తెలిపారు. దేశంలో ఎక్కడా ఇలాంటి రేట్లు లేవని.. రోడ్ల నిర్మాణాల్లోనూ దోపిడీయే అని మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ ఆరోపణలు చేశారు.

'ప్రభుత్వ తప్పులను వెలికి తీస్తున్న.. ప్రశ్నిస్తున్న వారిపై వేధింపులకు దిగుతున్నారు. తప్పుడు కేసులు పెడుతున్నారు. సోషల్‌ మీడియా పేరిట చంద్రబాబు తీవ్ర అరాచకాలకు పాల్పడుతున్నారు. ఎవరి మీదనైనా సరే కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారు' అని కూటమి పాలనపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 'టెట్‌ రూపంలో టీచర్ల ఇబ్బందులను కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలి. టెట్‌ రాకముందు నుంచి టీచర్లుగా పని చేస్తున్న వారికి ఇప్పుడు టెట్‌ తప్పనిసరి చేయడం సరికాదు' అని పేర్కొన్నారు.

రాష్ట్రంలో ప్రజల ఆస్తులను పప్పుబెల్లాల్లా పంచి పెడుతున్నారని.. ప్రైవేటు పేరుతో ఎక్కడిక్కడ దోచిపెడుతున్నారని చంద్రబాబు పాలనపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ తీవ్ర ఆరోపణలు చేశారు. పోర్టులు, హార్బర్లు సహా పలు సంస్థల ప్రైవేటీకరణ దారుణం అని మండిపడ్డారు. 'దాదాపుగా పూర్తైన రామాయపట్నం పోర్టును ప్రైవేటుకు ఇవ్వడం అతి దారుణం. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో మొదలై దాదాపుగా నిర్మాణం పూర్తైన పోర్టును ప్రైవేటుకు ఇవ్వడం ఏమిటి? రూ.5 వేల కోట్ల విలువైన పోర్టును రూ.1,500 కోట్లకు ఇవ్వడం కుంభకోణం కాదా?' అని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ ప్రశ్నించారు.

'ఇష్టానుసారంగా భూముల కేటాయింపులు చేస్తున్నారు. ఇసుక, మద్యం, గనులు దేన్నీ వదలకుండా దోపిడీ చేస్తున్నారు. ప్రతిచోటా మాఫియా నడుస్తోంది' చంద్రబాబు ప్రభుత్వంపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ తీవ్ర ఆరోపణలు చేశారు. అడ్డగోలుగా చంద్రబాబు ప్రభుత్వం అప్పులు చేస్తోందని.. అప్పుల్లో ప్రభుత్వం రికార్డులు సృష్టిస్తోందని మండిపడ్డారు. ఈ రెండేళ్లలో ఏకంగా రూ.3.6 లక్షల కోట్ల మేర అప్పు చేశారని.. పరిమితి లేకుండా విపరీతంగా అప్పు చేస్తున్నారని వివరించారు.ఔ

ఎఫ్‌ఆర్‌బీఎం చట్టాన్ని ఉల్లంఘించి మరీ అప్పులు చేస్తున్నా.. ఇన్ని అప్పులు చేసినా ప్రజలకు చేసింది శూన్యం అని చంద్రబాబు పాలనను మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ తీసి పడేశారు. సిండికేట్‌ కారణంగా ఆక్వా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని.. ఏ పంటకూ గిట్టుబాటు ధర లేక రైతులు చాలా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వీటన్నింటినీ పార్లమెంటు ఉభయ సభల్లో లేవనెత్తాలని.. చంద్రబాబు ప్రభుత్వ అవినీతి వ్యవహారాలను ఎండగట్టాలని పార్టీ ఎంపీలకు వైఎస్‌ జగన్‌ దిశానిర్దేశం చేశారు.

సమావేశంలో వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు వైవీ సుబ్బారెడ్డి, ఎంపీలు మేడా రఘునాథ్‌రెడ్డి, గొల్ల బాబూరావు, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, గురుమూర్తి, వైఎస్ అవినాష్‌రెడ్డి, గుమ్మా తనూజారాణి పాల్గొనగా.. ప్రత్యేక ఆహ్వానితులుగా మాజీ ఎంపీలు పిల్లి సుభాష్‌ చంద్రబోస్, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి హాజరయ్యారు.

0
0
Report
Advertisement
Advertisement
Back to top