జనహిత ఆధ్వర్యంలో మట్టి గణపతి ప్రతిమల పంపిణీ
Bellampalle, Kannal Rural, Telangana:పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మట్టి గణపతులను పూజించాలని మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఆర్డీవో హరికృష్ణ, వన్ టౌన్ సీఐ దేవయ్యలు అన్నారు. శుక్రవారం పట్టణంలోని కాంట చౌరస్తా వద్ద జనహిత సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన మట్టి గణపతి ప్రతిమల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరై ప్రజలకు ప్రతిమలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రతి ఏడాది పర్యావరణ పరిరక్షణకై మట్టి ప్రతిమలు పంపిణీ చేస్తున్న జనహిత సేవా సమితి సభ్యులను అభినందించారు. కార్యక్రమంలో సేవా సమితి అధ్యక్షులు సతీష్, సభ్యులు పాల్గొన్నారు.हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
2026 FIFA World Cup: ఫిఫా ప్రపంచకప్లో 48 జట్లు ఏవి? వాటి కెప్టెన్లు ఎవరో తెలుసా?
Mezquitillo, Zacatecas:FIFA World Cup 2026 Captains: క్రీడా ప్రపంచాన్ని ఉర్రూతలూగించేందుకు ఫిఫా ప్రపంచ కప్ 2026 వచ్చేస్తోంది. కళ్లు చెదిరే షాట్లతో క్రీడా అభిమానులను అలరించే ఫుట్బాల్ ప్రపంచకప్ జూన్ 12వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. విశ్వఖ్యాతి పొందిన ఈ ప్రపంచకప్ కోసం కోట్లాది మంది ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ప్రపంచకప్ను భారతీయ ప్రేక్షకులు జీ మీడియాలో చూడవచ్చు. జీ5 యాప్తోపాటు యునైట్8 స్పోర్ట్స్ ఛానల్స్లో ఫిఫా ప్రపంచకప్ ప్రసారాలు జరగనున్నాయి. 48 దేశాలు పోటీపడుతున్న ఈ ప్రపంచకప్లో ఆయా జట్లకు ఎవరు సారథ్యం వహించనున్నారో తెలుసుకుందాం.
ఫిఫా ప్రపంచకప్లో జూన్ 12వ తేదీన గ్రూప్ దశ ప్రారంభం కానున్నాయి. ఈ ప్రపంచ కప్ చరిత్రలోని అనేక రికార్డులు, ఘనతలను తిరగరాయబోతున్నది. అమెరికా, మెక్సికో, కెనడా దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న ఈ టోర్నమెంట్ 32 సంవత్సరాల తర్వాత ఉత్తర అమెరికా గడ్డపైకి ఈ క్రీడ సంబరం తిరిగి వచ్చింది. సాధారణంగా 32 దేశాలకు బదులుగా 48 దేశాలు పోటీపడుతున్నాయి. దీంతో మొత్తం మ్యాచ్ల సంఖ్య 94 నుంచి 104కు పెరిగింది. ఈ ప్రపంచకప్లో లియోనెల్ మెస్సీ, ఫాబియో కన్నవారో, ఫ్రాంజ్ బెకెన్బాయర్ వంటి దిగ్గజాలు స్టేడియంలో ఆడుతుండడంతో ప్రేక్షకులకు మరింత వినోదం లభించనుంది.
ఫిఫా ప్రపంచ కప్ 2026 జట్టు కెప్టెన్లు
మెక్సికో: ఎడ్సన్ అల్వారెజ్
దక్షిణాఫ్రికా: రాన్వెన్ విలియమ్స్
దక్షిణ కొరియా: సన్ హ్యూంగ్-మిన్
చెక్ రిపబ్లిక్: లాడిస్లావ్ క్రెజి
కెనడా: అల్ఫోన్సో డేవిస్
బోస్నియా, హెర్జెగోవినా: ఎడిన్ డ్జెకో
ఖతార్: హసన్ అల్-హేడోస్
స్విట్జర్లాండ్: గ్రానిఫ్రాస్
బ్రెజిల్: మర్కోకన్
మొరకో: హకిమి
అమెరికా: టిమ్ రీమ్
పరాగ్వే: గుస్తావో గోమెజ్
ఆస్ట్రేలియా: మాథ్యూ ర్యాన్
టర్కీ: హకన్ కల్హనోగ్లు
జర్మనీ: జాషువా కిమ్మిచ్
కురాకో: లియాండ్రో బకునా
ఐవరీ కోస్ట్: ఫ్రాంక్ కెస్సియెన్
జపాన్: వాటరు ఎండో
స్వీడన్: లిండెలోఫ్
బెల్జియం: టైలెమాన్స్
ఈజిప్ట్: మొహమ్మద్ సలా
ఇరాన్: మెహదీ తరేమి
న్యూజిలాండ్: క్రిస్ వుడ్
స్పెయిన్: రోడ్రి
కేప్ వెర్డే: ర్యాన్ మెండిస్
సౌదీ అరేబియా: సేలం అల్-దవ్సారి
ఉరుగ్వే: జోస్ మరియా గిమెనెజ్
ఫ్రాన్స్: కైలియన్ ఎంబాప్పె
సెనెగల్: కాలిడౌ కౌలిబాలీ
ఇరాక్: జలాల్ హసన్
నార్వే: మార్టినెల్
అర్జెంటీనా: మెస్సీ
అల్గెరియా: రియాద్ మహ్రెజ్
ఆస్ట్రియా: డేవిడ్ అలబా
జోర్డాన్: ఇషాన్
ఉజ్బెకిస్తాన్: ఎల్డోర్ షోమురోడోవ్
కొలంబియా: జేమ్స్ రోడ్రిగ్జ్
ఇంగ్లాండ్: హ్యారీ కేన్
క్రొయేషియా: లుకా మోడ్రిక్
ఘనా: జోర్డాన్ అయేవ్
పనామా: అనిబల్ గోడోయ్
Cobra Video: శివాలయంలో భోళాశంకరుడి లీలా.. శివలింగంపై నాగుపాము.. వీడియో..
Hyderabad, Telangana:Cobra Video Watch Here: మన మన భారతదేశం ఆధ్యాత్మికతకు అద్భుతాలకు నిలయం.. తరచుగా భక్తులను ఆశ్చర్యం కలిగించే సంఘటనలు వెలుగులోకి వస్తూనే ఉంటాయి. తాజాగా సోషల్ మీడియా వేదికగా వెలుగులోకి వచ్చిన ఒక అరుదైన వీడియో సోషల్ మీడియా వినియోగదారులతో పాటు శివ భక్తులను విపరీతంగా ఆకర్షిస్తోంది. అత్యంత ప్రమాదకరమైన ఓ భారీ నాగుపాము.. ఓ దేవాలయంలోని శివలింగం చుట్టూ చుట్టుకుని దర్శనం ఇవ్వడం ఈ వీడియోలో మనం చూడొచ్చు. ప్రస్తుతం ఈ దృశ్యాలు ఇంటర్నెట్ను ఊపేస్తున్నాయి. అన్ని సోషల్ మీడియాలో ఈ వీడియో విపరీతంగా కనిపిస్తుంది. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..
శివలింగం పై నాగుపాము..
వైరల్ అవుతున్న వీడియోను పరిశీలించి చూస్తే.. ఒక పురాతన శివాలయంలోని గర్భగుడికి ముందుగా ఉన్న శివలింగానికి ఒక అత్యంత ప్రమాదకరమైన నాగుపాము చుట్టుకొని ఉండడం మీరు చూడొచ్చు. ఆ పాము శివలింగంపై అటు ఇటు కదులుతూ.. తన పడగలను పైకెత్తి స్వామివారికి ఒక గొడుగుల పట్టినట్లు కూర్చుండిపోయింది. సాధారణంగా పాములను చూస్తేనే జనాలు ఆమడ దూరం పరిగెడతారు. కానీ ఇక్కడ సాక్షాత్తు ఆ పరమశివుడి మెడలోని ఆభరణమైన సర్పరాజే ఇలా శివలింగాన్ని అలంకరించి దర్శనం ఇవ్వడంతో భక్తులు భక్తిశ్రద్ధలతో నమస్కరిస్తున్నారు. ఈ అద్భుత దృశ్యాన్ని అక్కడున్న వారి తమ స్మార్ట్ఫోన్లలో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు..
మహాశివరాత్రి వేళలో కూడా ఇలాంటి ఘటనలే..
ఇలాంటి వింతలు జరగడం ఇదే మొదటిసారి కాదు.. గతంలోనూ దేశంలోపాలు ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు వెలుగు చూసాయి.. ముఖ్యంగా ప్రతి ఏటా వచ్చే మహాశివరాత్రి పర్వదినం వేల లేదా శ్రావణమాసంలోని ప్రముఖ శివాలయాల్లో నాగుపాములు వచ్చి శివలింగంపై కూర్చోవడంతో పాటు భక్తులు ఇచ్చే పాలు తాగడం వంటి దృశ్యాలు ఎన్నో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం మనం అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం..
Also Read: Video Viral: సాయం ముసుగులో అరాచకం.. యువతి ప్రైవేటు పార్ట్ మీద చెయ్యి వేసి మరీ.!. వీడియోపై దుమారం..
భక్తులు దీనిని దైవ లీలగా భావిస్తున్నారు.. సాక్షాత్తు భోళాశంకరుడే ఈ నాగుపాము రూపంలో దర్శనం ఇచ్చారని కొంతమంది భక్తులు అభిప్రాయపడుతున్నారు. శివాలయాల్లో ఉండే ప్రశాంతతతో పాటు గర్భగుడిలోని చల్లదనం, అభిషేకాలు చేయడం వల్ల వచ్చే తేమ వైపు పాములు ఎక్కువగా ఆకర్షితమవుతాయని.. అందుకే అవి శివలింగాల పైకి చేరుకుంటాయని మరి కొంతమంది చెబుతూ వస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ.. భక్తి, సైన్స్ పక్కన పెడితే.. సోషల్ మీడియా వినియోగదారులను మాత్రం ఈ అరుదైన వీడియో ఎంతగానో ఆశ్చర్యానికి గురిచేస్తూ వస్తోంది.. అయితే, ఈ వీడియో చూసిన మరి కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు మాత్రం.. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ జనరేట్ చేసిన ఒక ఫేక్ వీడియో అని కామెంట్లు రాస్తూ వస్తున్నారు.
Also Read: Video Viral: సాయం ముసుగులో అరాచకం.. యువతి ప్రైవేటు పార్ట్ మీద చెయ్యి వేసి మరీ.!. వీడియోపై దుమారం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్.. - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..
Cobra Video: కింగ్ కోబ్రా ప్రాణాంతక దాడి.. కళ్లద్దాలు ఉండబట్టి బతికాడు.. వీడియో వైరల్!
Hyderabad, Telangana:King Cobra Venom Spit Video Watch: సోషల్ మీడియాలో ప్రతిరోజు అనేక రకాల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. వాటిల్లో కొన్ని వినోదాన్ని పంచితే.. మరికొన్ని మాత్రం గుండెల్లో భయం నింపేలా చేస్తూ ఉంటాయి.. తాజాగా ఇంటర్నెట్ను షేక్ చేస్తున్న ఒక వీడియో చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలగక తప్పదు.. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన.. అత్యధిక విషపూరితమైన విషం చిమ్మె కింగ్ కోబ్రా ఒక యువకుడి పై నేరుగా దాని విషాన్ని చిమ్మిన భయానక దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ వీడియో చూసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు. పాములు ఇలా కూడా చేస్తాయా అని కొంతమంది సాధారణ సోషల్ మీడియా వినియోగదారులు కామెంట్లను వ్యక్తం చేస్తున్నారు.
టేబుల్పై కూర్చోబెట్టి ఆటలు..
ఫైనల్ అవుతున్న వీడియో వివరాల్లోకి వెళ్తే.. ఒక యువకుడు అత్యంత ప్రమాదకరమైన విషం చిమ్మె కింగ్ కోబ్రాతో నిర్లక్ష్యంగా ఆడుకుంటూ కనిపించాడు.. ఆ పామును ఒక బల్లపై కూర్చోబెట్టి.. దానికి చాలా దగ్గరగా.. వెళ్లి వింత చేష్టాలు చేయడం మీరు వీడియోలో చూడొచ్చు. సాధారణంగా కింగ్ కోబ్రాలు తనను ఎవరైనా కదిలిస్తే అస్సలు సహించవు.. ఆ యువకుడు ప్రవర్తనతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆ పాము.. క్షణాల వ్యవధిలో ఊహించని రీతిలో దాడికి దిగింది. అయితే ఈసారి అది కలవడానికి ప్రయత్నించకుండా.. నేరుగా తన నోటి నుంచి ఆ యువకుడి ముఖంపై విషాన్ని చిమ్మింది.
కాపాడిన కళ్లద్దాలు..
పాము విషం చిమ్మిన వేగానికి ఆ యువకుడు ఒక్కసారిగా షాప్ కు గురై.. వెనక్కి తగ్గాడు.. అయితే ఈ ప్రమాదంలో అతడు తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. ఆ సమయంలో సదరు యువకుడు కళ్లద్దాలు ధరించి ఉండడమే అతడి పాలిట వరంగా మారింది.. కింగ్ కోబ్రా చిమ్మిన విషం నేరుగా అతడి కళ్లద్దాలపై పడింది. ఒకవేళ అతడు కళ్లద్దాలు పెట్టుకోకపోయి ఉంటే.. ఆ విషం నేరుగా కళ్ళలోకి పోయేది. అది కళ్ళలో పడితే కంటి చూపు శాశ్వతంగా పోవడమే కాకుండా క్షణాల్లో ప్రాణాలు పోయే ప్రమాదం కూడా ఉందని కొంతమంది వన్యప్రాణి సంరక్షకులు చెబుతూ ఉన్నారు..
Also Read: Video Viral: సాయం ముసుగులో అరాచకం.. యువతి ప్రైవేటు పార్ట్ మీద చెయ్యి వేసి మరీ.!. వీడియోపై దుమారం..
నెటిజన్ల ఆగ్రహం..
ఈ వీడియో చూసిన సోషల్ మీడియా వినియోగదారులు సదరు యువకుడి నిర్లక్ష్యపు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. సోషల్ మీడియాలో లైకులతో పాటు వ్యూస్ కోసం ఇలా ప్రాణాలతో చెలగాటమాడటం ఏంటని కామెంట్లలో ప్రశ్నిస్తూ వస్తున్నారు. ఈ మూగజీవులతో పాటు ముఖ్యంగా ఇలాంటి విశేషాలు పాలను కెమెరాల ముందు ప్రదర్శించి స్టంట్ లు చేయవద్దని.. ఇవి ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాయో ఊహించడం అసాధ్యమని హెచ్చరిస్తున్నారు. ఏది ఏమైనా ఆ యువకుడు తృటిలో ఆ పాము విషం నుంచి తప్పించుకొని బయటపడగలిగాడు. లేదంటే శాశ్వతంగా కంటి చూపు కోల్పోయేవాడు..
Also Read: Video Viral: సాయం ముసుగులో అరాచకం.. యువతి ప్రైవేటు పార్ట్ మీద చెయ్యి వేసి మరీ.!. వీడియోపై దుమారం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్.. - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..
Karimnagar: ముందస్తు వర్షాలకు మురిసిపోవద్దు.. విత్తనాలు విత్తితే ఆ తిప్పలు తప్పవు!
Karimnagar, Telangana:Pre Monsoon Rains Sowing Risk: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇటీవల కురిసిన ముందస్తు వర్షాలతో రైతాంగం ఒక్కసారిగా సాగు పనుల్లో వేగవంతం పెంచేసింది. తొలకరి తొలకరింపుతో మురిసిపోతూ చాలామంది రైతులు అప్పుడే పొలాలను సిద్ధం చేసుకుని.. విత్తనాలు నాటే పనుల్లో నిమగ్నమయ్యారు.. అయితే, ఈ ముందస్తు ఉత్సాహం మునుముందు పెద్ద కష్టానికి దారి తీసే ప్రమాదం ఉందని వ్యవసాయ శాఖ అధికారులతో పాటు శాస్త్రవేత్తలు గట్టిగా హెచ్చరిస్తూ వస్తున్నారు. కేవలం ఈ తృప్తికరమైన వర్షాలను చూసి తొందరపడి విత్తనాలు వెతితే పెట్టుబడులు నష్టపోవాల్సి వస్తుందని వారు స్పష్టం చేస్తూ ఉన్నారు. ఈ అంశంపై వ్యవసాయ శాఖ అధికారులు ఏమంటున్నారో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..
ఎల్నినో ముప్పు.. తక్కువ వర్షపాతం!
ఈ ఏడాది వానకాలం సీజన్ పై వాతావరణ శాఖ జారీ చేసిన హెచ్చరికలు ఆందోళన కలిగిస్తూ ఉన్నాయి. ఈ సారి పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన El Nino ప్రభావం బలంగా ఉండే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తూ వస్తున్నారు. దీనివల్ల సాధారణం కంటే చాలా తక్కువ వర్షపాతం నమోదయ్యే సూచనలు కనిపిస్తున్నాయట. జూన్ ప్రారంభంలో వర్షాలు పడినప్పటికీ.. ఆ తర్వాత ఋతుపవనాలు ఊహించనంతగా సహకరించకపోవచ్చు అని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు. ముందస్తుగా విత్తనాలు నాటిన తర్వాత సుదీర్ఘ కాలం పాటు వర్షాలు కురవకపోతే.. మొలకలు మాడిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయే అవకాశాలు ఉన్నాయని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తూ వస్తున్నారు.
ఆరుతడి పంటల వైపు మొగ్గు చూపడం మంచిది..
మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులు తమ సాంప్రదాయ సాగు పద్ధతులను మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని నిపుణులు సూచిస్తూ వస్తున్నాయి. ఈ ఏడాది నీటి లభ్యత తక్కువగా ఉండే అవకాశం ఉన్నందున.. ఎక్కువ నీరు అవసరమయ్యే వరి పంటల కంటే తక్కువ నీటితో.. తక్కువ కాలంలో పండే పంటల వైపు రైతులు మగ్గుచూపాలని ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యవసాయ అధికారులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఈ సమయాల్లో పప్పు ధాన్యాలతో పాటు నూనె గింజలు, మొక్కజొన్న, సజ్జలు వంటి పంటలు వేయడం మంచిదని వారు సూచిస్తున్నారు..
Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!
అధికారుల సూచనలు ఇవే..
కనీసం 50 నుంచి 60 మిల్లీలీటర్ల వర్షాపాతం నమోదై.. భూమి లోపల పొరల వరకు పచ్చి చేరిన తర్వాతే విత్తనాలు వేయాలని.. వాతావరణ శాఖ ఇచ్చే రోజువారి సమాచారాన్ని గమనిస్తూ సాగు పనులు ప్రారంభించాలని.. ముఖ్యంగా విత్తన శుద్ధి తప్పనిసరి చేసుకోవాలని వారు సూచిస్తున్నారు. అంతేకాకుండా రైతులు తొందరపాటు నిర్ణయాన్ని తీసుకోకుండా వ్యవసాయ అధికారుల సలహాలతో పాటు సూచనలు పాటించి ఈ వానాకాలం సీజన్లో నష్టాల బారిన పడకుండా జాగ్రత్తలు పడాలని విజ్ఞప్తి చేస్తూ వస్తున్నారు. ముఖ్యంగా ఎక్కువ మొత్తంలో పంటలు వేసేవారు తప్పకుండా అన్ని సూచనలు అనుసరిస్తూ ఉండడం చాలా మంచిదని వారు చెబుతున్నారు..
Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
Hyderabad: రెచ్చిపోతున్న నేపాలీ ముఠా.. గచ్చిబౌలి లగ్జరీ విల్లాలో కేజీ బంగారం, డైమండ్స్ లూటీ, పనిలో చేరిన కొద్దిరోజులకే స్కెచ్!
Hyderabad, Telangana:Nepali Gang Another Huge Theft In Gachibowli Villa: ఇప్పటికే ఇంట్లో పనివారు నేపాలీలు వద్దని హైదరాబాద్ పోలీసులు హెచ్చరించిన సంగతి తెలిసిందే. దీనికి ప్రధాన కారణం ఇటీవలె మాజీ డీజీపీ భార్యను హైదరాబాద్లో నేపాలీ గ్యాంగ్ హత్య చేశారు. ఇంట్లో పనివారిగా చేరుతున్న ఈ గ్యాంగ్ ఆ తర్వాత తమ బుద్ధి చూపిస్తున్నారు. ఇంకో ఘటనలో కూడా ముందుగా ఇంట్లో పనివారిగా జంటగా చేరి.. పుట్టిన రోజు అని చెప్పి కేక్ కట్ చేసి మత్తుమందు కూడా ఇచ్చి యజమానికి కుర్చీలకు కట్టేసి డబ్బు, బంగారం దోచుకెళ్లారు. ఆ ఘటన గురించి మరువక ముందే తాజాగా హైదరాబాద్లోని గచ్చిబౌలీ హిల్ బ్రిడ్జ్ విల్లాస్లో మరో భారీ చోరీకి తెరతీశారు. యజమాని కుటుంబం ముంబై వెళ్లి వచ్చేసరికి కేజీ బంగారం, వజ్రాలు కూడా ఒక నేపాలీ దంపతులు ఎత్తుకెళ్లారు. ఇందులో ట్వీస్ట్ ఏంటంటే వారు పనివారుగా చేరి కేవలం ఒక నెల మాత్రమే అయింది.
పోలీసుల ప్రకారం..
గచ్చిబౌలి హిల్ రిడ్జ్ విల్లాలో ఉంటున్నటువంటి వ్యాపారి ఇంట్లో కేజీ బంగారు నగలు వజ్రాలను నేపాల్ ముట్ట ఎత్తుకెళ్ళింది. ఇంట్లో పని చేసే నేపాల్ దంపతులు చోరీ చేసినట్టు పోలీసులు భావిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం యజమాని కుటుంబం ముంబైకి వెళ్లి ఆదివారం తిరిగి వచ్చేసరికి నేపాలీ దంపతులు మాయమయ్యారు. ఇంట్లో తాళాలు పగలగొట్టినట్టు ఎలాంటి గుర్తులు లేకపోవడంతో మొదట వారు చెప్పకుండా వెళ్ళిపోయారని భావించిన వ్యాపారవేత్త పూజా గదిలోని విగ్రహానికి ఉన్న బంగారు గొలుసుతోపాటు మరికొన్ని ఆభరణాలు మాయమైనట్టు పోలీసులు గుర్తించారు. రంగంలోకి దిగిన ప్రత్యేక దర్యాప్త బృందాలు నిందితుల కోసం గాలిస్తున్నాయి.
ముంబైకి వెళ్లి వచ్చే సరికి ఈ నేపాలీ దంపతులు ఇల్లంతా కూడా గుల్ల చేసిపోయారు. ఇంట్లో ఉన్న వస్తువులను కూడా చెల్లా చెదురుగా పడిపోయి ఉండటం, విలువైన వస్తువులన్నీ కూడా కనిపించకుండా పోవడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందజేశారు. ఈ వ్యాపారి ఇటీవలె తన కుటుంబంతోసహా ముంబై వెళ్లాక ఈ భారీ చోరీ చేశారు. ఇంట్లో నేపాల్కు చెందిన భార్యాభర్తలు పని మనుషులుగా ఉన్నారు. ఇద్దరికి కూడా ఇంటి బాధ్యతలు అప్పగించి తిరిగి వచ్చేసరికి ఎలాంటి ప్రాబ్లం అవ్వకుండా ఇంటిని చక్కగా చూసుకోండి అని యజమాని చెప్పి వెళ్లినట్లు సమాచారం.
Read Also: సిటీలో మళ్లీ రెచ్చిపోయిన నేపాలీ గ్యాంగ్.. డాక్టర్కే మత్తుమందిచ్చి సినీ ఫక్కీలో 60 తులాల బంగారం ఊడ్చేశారు!
Read Also: ఇంట్లో పనివారుగా నేపాలీలు వద్దు.. హైదరాబాద్ ప్రజలకు పోలీస్ కమిషనర్ కీలక సూచన
భారీ బంగారం చోరీ..
పూజ గదిలో ఉన్న విగ్రహము బంగారు గొలుసు, బెడ్రూమ్లో ఉండే విలువైన వస్తువులు బంగారు క్యాష్ కూడా కనిపించకపోవడంతో ఆ పని మనుషులపైనే అనుమానం వ్యక్తం చేస్తూ గచ్చిబౌలి పోలీసులకు యజమాని ఫిర్యాదు ఇచ్చినట్టుగా సమాచారం. నెల రోజుల క్రితమే ఈ ఇద్దరిని పనిలోకి పెట్టుకున్నట్టుగా కూడా యజమాని పోలీసులకు చెప్పారు. ఇప్పటికే నేపాలికి చెందినటువంటి వారిని ఇంట్లో నమ్మకంగా ఉంచుకోకండి.. వాళ్ళని పనిలో పెట్టుకోకండి వాళ్ళు క్రిమినల్ యాక్టివిటీస్ హైదరాబాద్లో పెరిగిపోతా ఉన్నాయి. ఒక క్రిమినల్ గ్యాంగ్ పని పేరుతో ఇంట్లోకి వచ్చి అన్ని వస్తువులు ఎక్కడెక్కడ ఉంటాయో ఇవన్నీ ముందస్తుగానే గుర్తించి ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చి దోపిడీ దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఈ నేపాలీ గ్యాంగ్లని నేపాలీ వ్యక్తులని అసలే నమ్మకండి అంటూ కూడా పోలీసులు దీనిపైన అవగాహన కల్పిస్తూనే ఉన్నారు. అయినా ఈ వ్యాపారవేత్త ఆ నేపాలీ వ్యక్తులనే నమ్మి భార్యా భర్తలని ఇద్దరిని కూడా పిలిపించి ఇంట్లో పని కోసం పెట్టి ఆ ఇంటిని వాళ్ళకు బాధ్యతలు చూసుకోమని అప్పగించి వెళ్ళడం ఈ యజమాని నిర్లక్ష్యం.. పోలీసులు యజమానికి విషయాన్ని కూడా తెలియజేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వారికోసం గాలింపు చర్యలు వేగవంతం చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Jagtial: ఆస్తి పిచ్చితో కన్న తండ్రి శవానికే అడ్డం పడ్డ కూతుళ్లు.. జగిత్యాలలో అమానుషం!
Hyderabad, Telangana:Property Dispute Halts Funeral In Jagtial: జన్మినిచ్చిన తండ్రి మరణిస్తే కన్నీరు మున్నీరు కావాల్సిన కన్న కూతుళ్లు.. ఆస్తిపై వ్యామోహంతో కఠినంగా వ్యవహరించిన అమానుష ఘటన జగిత్యాల పట్టణంలోని హనుమాన్ వాడలో చోటు చేసుకుంది. ఆస్తులు ఎక్కడ చేజారిపోతాయోననే భయంతో, కన్న తండ్రి శవానికి అంత్యక్రియలు నిర్వహించకుండా కూతుళ్లు, అల్లుళ్లు అడుకున్న తీరు స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే..
హనుమాన్ వాడుకకు చెందిన జంగిలి మల్లయ్య (80) అనే వృద్ధుడికి ఒక కుమారుడు (మల్లేశం), ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.. అయితే, కుమారుడు మల్లేశం గతంలో కరోనా సమయంలోనే మరణించాడు. మల్లేశానికి భార్య సుజాత, కుమారుడు మనోజ్, ఒక కూతురు ఉన్నారు. అయితే, కుమారుడు మరణించిన తర్వాత మల్లయ్యకు ఉన్న ఆస్తిని అతని ఇద్దరు కూతుళ్లు ఎలాగోలా వారి పేర్లపై రాయించుకున్నారు.
ఆస్తి పోతుందనే భయం..
ఈ సమయంలో వృద్ధుడైన మల్లయ్య సోమవారం అనారోగ్యంతో మరణించాడు. మృతి చెందిన వార్త తెలుసుకున్న కోడలు సుజాత, మనవడు మనోజ్ అంత్యక్రియలు నిర్వహించేందుకు అక్కడికి చేరుకున్నారు. హిందూ సంప్రదాయం ప్రకారం.. మనవడు మనోజ్ చేతుల మీదుగా తాతకు అంత్యక్రియలు జరిపించాలని వారు భావించారు.
అయితే.. అప్పటికే అక్కడ ఉన్న మల్లయ్య కూతుళ్లతో పాటు అల్లుళ్లు మనోజ్ కుటుంబంపై ఒక్కసారిగా దాడికి దిగారు. మనోజ్ చేత అంత్యక్రియలు జరిపిస్తే.. భవిష్యత్తులో చట్టపరమైన కారణాల వల్ల తామ పేరట రాయించుకున్న ఆస్తిని ఎక్కడ తిరిగి ఇవ్వాల్సి వస్తుందోనని వారు గొడవకు దిగారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మనోజ్ చేత అంత్యక్రియలు జరిపించనిచ్చేది లేదని తేల్చి చెప్పారు. అయితే, ఈ సమయంలో కుల పెద్దలతో పాటు స్థానికులు ఎంత నచ్చజెప్పినా వారు వినకపోగా.. ఘర్షణకు దిగారు.
Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!
పోలీసుల జోక్యం..
కూతుళ్ల ప్రవర్తనతో తీవ్ర మనస్థాపానికి గురైన సుజాతతో పాటు మనోజ్ తక్షణమే.. జగిత్యాల పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే, ఇదే సమయంలో రంగంలోకి దిగిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఈ సమయంలో ఇరువర్గాలతో గట్టిగా మాట్లాడి.. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ప్రత్యేకమైన కౌన్సిలింగ్ అందించిన్నట్లు తెలుస్తోంది. చివరికి పోలీస్ అధికారుల సమక్షంలో మనవడు మనోజ్ చేతుల మీదుగానే మల్లయ్య అంత్యక్రియలను విజయవంతంగా పూర్తి చేయించారు. ఆస్తి కోసం కన్న తండ్రి శవాన్ని అడ్డం పెట్టుకున్న కూతుళ్ల తీరుపై స్థానికులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
Nothing Phone 3: రూ.85 వేల Nothing Phone 3 కేవలం రూ.13,999కే.. అమెజాన్లో మైండ్ బ్లోయింగ్ ఆఫర్స్!
Hyderabad, Telangana:Nothing Phone 3 Huge Discount: చాలా మంది యువత ఎక్కువగా Nothing బ్రాండ్కి సంబంధించిన మొబైల్స్ కొనుగోలు చేస్తున్నారు. అయితే, ఇవి చాలా చౌక ధరలకు, అత్యంత శక్తివంతమైన ఫీచర్స్తో అందుబాటులోకి రావడం వల్ల వీటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఎప్పటి నుంచో మీరు కూడా ఇదే బ్రాండ్కి సంబంధించిన స్మార్ట్ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా?
Nothing బ్రాండ్కి సంబంధించిన స్మార్ట్ఫోన్స్పై ప్రాముఖ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్లో అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. ఇందులో భాగంగా కొనుగోలు చేసేవారికి ఎన్నో రకాల డిస్కౌంట్ ఆఫర్స్తో చాలా చీప్ ధరకే లభిస్తున్నాయి. ముఖ్యంగా ఈ సమయంలో Nothing Phone (3) స్మార్ట్ఫోన్ మొబైల్ వెరీ చీప్ ధరకే లభిస్తోంది. ఈ Nothing Phone (3) స్మార్ట్ఫోన్ ఎన్నో రకాల అద్బుతమైన ఫీచర్స్తో అందుబాటులోకి వచ్చింది. ఇది ఎన్నో రకాల అద్భుతమైన ఫీచర్స్ను కూడా కలిగి ఉంటుంది. ముఖ్యంగా ఈ స్మార్ట్ఫోన్ 6.67 ఇంచుల FHD+ Flexible AMOLED డిస్ప్లేను కలిగి ఉంటుంది.. అలాగే 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్తో పాటు 4500 nits పీక్ బ్రైట్నెస్తో అందుబాటులోకి వస్తోంది. ఈ స్మార్ట్ఫోన్ వెనక భాగంలో డాట్-మ్యాట్రిక్స్ స్టైల్ సర్క్యులర్ డిస్ప్లేను పరిచయం చేసింది.
ఈ డిస్ల్పే ప్రొటెక్షన్ కోసం Corning Gorilla Glassను అందిచారు. అలాగే ఇందులో ఇది IP68 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ రేటింగ్తో వస్తుంది. ఇది ఎంతో శక్తివంతమైన Qualcomm Snapdragon 8s Gen 4 చిప్సెట్ ప్రొసెసర్పై పని చేస్తుంది.. ఇది గేమింగ్తో పాటు మల్టీటాస్కింగ్కు అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 15 ఆధారిత Nothing OSతో రన్ అవుతుంది. నథింగ్ ఫోన్లలోనే మొదటిసారిగా ఇందులో ట్రిపుల్ 50MP కెమెరా సెటప్ను అందించారు. ఇందులో కంపెనీ OIS సపోర్ట్తో కూడిన 50 MP ప్రైమరీ కెమెరాను అందిస్తున్నారు. అలాగే అదనంగా టెలిఫోటో కెమెరా 50 MP పెరిస్కోప్ లెన్స్తో అందుబాటులోకి వచ్చింది. ఇందులో సెల్ఫీల కోసం ముందు భాగంలో 50 MP కెమెరా కూడా అందుబాటులో ఉంది. ఇది ఎంతో శక్తివంతమైన 5,500 mAh సామర్థ్యం గల భారీ బ్యాటరీని కలిగి ఉంది.
ఇందులో కంపెనీ 65W ఫాస్ట్ చార్జింగ్తో పాటు 15W వైర్లెస్ చార్జింగ్ (Wireless Charging) సపోర్ట్ను అందిస్తుంది.. అలాగే ఇతర డివైజ్లను చార్జ్ చేయడానికి రివర్స్ వైర్లెస్ చార్జింగ్ ఫీచర్ కూడా అందుబాటులో ఉంది.. ఇక ఈ స్మార్ట్ఫోన్కి సంబంధించిన ధర వివరాల్లోకి వెళితే.. మార్కెట్లో కంపెనీ దీనిని M.R.P ధర రూ.84,999తో అందిస్తోంది. అయితే, దీనిని ఇప్పుడే అమెజాన్లో కొనుగోలు చేస్తే భారీ తగ్గింపు కూడా లభిస్తుంది.
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
ఈ Nothing Phone (3) ఫోన్కి సంబంధించిన ఆఫర్స్ వివరాల్లోకి వెళితే.. అయితే, దీనిని ఇప్పుడే అమెజాన్లో కొనుగలు చేసేవారికి ఏకంగా 49 శాతం వరకు ఫ్లాట్ తగ్గింపు లభిస్తుంది. దీంతో ఇది కేవలం రూ.42,999కే పొందవచ్చు. ఇవే కాకుండా Amazon Pay ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ను వినియోగించి పేమెంట్ చేసేవారికి ఏకంగా 5 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా ఎక్చేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. దీనిని వినియోగించి కొనుగోలు చేస్తే చీప్ ధరకే సొంతం చేసుకోవచ్చు. అయితే, ఈ ఆఫర్ పొందాలనుకునేవారు తప్పకుండా పాత స్మార్ట్ఫోన్ ఎక్చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేస్తే దాని కండీషన్ను బట్టి గరిష్టంగా రూ.29,000 బోనస్ పొందవచ్చు. దీంతో ఈ స్మార్ట్ఫోన్ కేవలం రూ.13,999కే పొందవచ్చు. ఇవే కాకుండా అదనంగా బ్యాంక్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
GDS 4th Merit List 2026: పదో తరగతి అర్హత ఉద్యోగాలు..ఇండియా పోస్ట్ GDS 4వ లిస్ట్ రిలీజ్, మీ ఫోన్లోనే రిజల్ట్స్ చూసుకోండి!
Hyderabad, Telangana:India Post GDS 4th Merit List 2026 Out: ఇప్పటి వరకు మూడు మెరిట్ లిస్ట్లను విడుదల చేసిన ఇండియా పోస్ట్.. తాజాగా నాలుగో జాబితాను కూడా రిలీజ్ చేసింది. అభ్యర్థులు చాలా కాలంగా ఈ ఫలితాల కోసం నిరీక్షిస్తున్నారు, అవి ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. ఇండియా పోస్ట్ గ్రామీణ డాక్ సేవక్ పోస్టులకు అప్లై చేసిన వారు వెంటనే పోస్టల్ శాఖ వెబ్సైట్ https://indiapost.gov.in/ ద్వారా తమ ఫలితాలను చూసుకోవచ్చు. మీ మొబైల్లోనే ఈ మెరిట్ లిస్ట్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. దేశంలోని వివిధ సర్కిల్స్కు సంబంధించిన జాబితా ఇది. ఈ లిస్ట్లో పేరు ఉన్న అభ్యర్థులు తదుపరి ఎంపిక దశకు అర్హత సాధిస్తారు. దీని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రక్రియ జరుగుతుంది. ఇండియా పోస్ట్ జీడీఎస్ ద్వారా దేశవ్యాప్తంగా వివిధ సర్కిళ్లలో మొత్తం 28,636 పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో గ్రామీణ డాక్ సేవక్ (GDS), బ్రాంచ్ పోస్ట్మాస్టర్ (BPM), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్మాస్టర్ (ABPM) వంటి వివిధ పోస్టులు ఉన్నాయి.
ఇండియా పోస్ట్ జీడీఎస్ 4వ మెరిట్ లిస్ట్ 2026 డౌన్లోడ్ చేసుకునే పద్ధతి..
ఇండియా పోస్ట్ ఫలితాలను చూడటానికి ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ https://indiapost.gov.in/ ఓపెన్ చేయాలి.
తరువాత హోమ్పేజీలో ఉన్న 'రిక్రూట్మెంట్' సెక్షన్కు వెళ్లండి.
అక్కడ 'ఆన్లైన్ జీడీఎస్ రిక్రూట్మెంట్' పోర్టల్ను ఓపెన్ చేయండి.
'షార్ట్లిస్టెడ్ క్యాండిడేట్స్' అనే ఆప్షన్పై క్లిక్ చేయండి.
ఆ తర్వాత మీ పోస్టల్ సర్కిల్ లేదా రాష్ట్రాన్ని ఎంచుకోండి.
వెంటనే మీ మెరిట్ లిస్ట్ను PDF ఫార్మాట్లో డౌన్లోడ్ చేసుకోండి.
Ctrl+F ఉపయోగించి మీ రిజిస్ట్రేషన్ నంబర్ను వెతకండి.
Also Read: త్రివేండ్రం టాప్.. విజయవాడ కేక! 12వ తరగతి ఫలితాల్లో సత్తా చాటిన తెలుగు విద్యార్థులు!
తెలంగాణ లాసెట్, పీజీఎల్సెట్ రిజల్ట్స్ వచ్చేశాయి, స్కోర్కార్డ్ ఇలా డౌన్లోడ్ చేసుకోండి!
మెరిట్లిస్ట్లోని వివరాలు ఇలా ఉంటాయి..
మీరు డౌన్లోడ్ చేసిన జీడీఎస్ మెరిట్ లిస్ట్లో డివిజన్ ఆఫీస్, పోస్ట్ ఐడి, పోస్ట్ నేమ్, పోస్ట్ కేటగిరీ, రిజిస్ట్రేషన్ నంబర్, మార్కుల శాతం వంటి వివరాలు ఉంటాయి.
షార్ట్లిస్ట్లో ఉన్న అభ్యర్థులు తమ డాక్యుమెంట్లను సిద్ధంగా ఉంచుకోవాలి. ఎందుకంటే ఎంపిక ప్రక్రియలో డాక్యుమెంట్ వెరిఫికేషన్ చాలా ముఖ్యమైనది. తదుపరి అప్డేట్స్ కోసం ఇండియా పోస్ట్ అధికారిక వెబ్సైట్ను క్రమం తప్పకుండా చూస్తూ ఉండండి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Saturn Transit 2026: జూలై 2 నుంచి శని నక్షత్ర మార్పు.. ఆ 4 రాశుల వారికి ఆర్థిక నష్టాలు, తీవ్ర ఒత్తిడి!
Hyderabad, Telangana:Saturn Transit In Revati Nakshatra Effect: జ్యోతిష్య శాస్త్రంలో శని గ్రహానికి చాలా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఎందుకంటే ఈ గ్రహాన్ని చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. అంతేకాకుండా అత్యంత శక్తివంతమైన గ్రహాల్లో ఒకటిగా చెప్పుకుంటారు. అయితే, ఈ గ్రహం అన్ని గ్రహాల కంటే చాలా నెమ్మదిగా కదులుతుంది. కర్మ, క్రమశిక్షణతో పాటు న్యాయానికి సూచికగా భావించే ఈ గ్రహం జూలై 2న రేవతి నక్షత్రంలోకి రెండవ స్థానంలోకి ప్రవేశించబోతోంది. దీంతో ఈ నక్షత్ర మార్పు ప్రభావం అన్ని రాశులవారిపై ప్రభావం పడుతుంది. ముఖ్యంగా కొన్ని రాశుల విషయంలో, కార్యాలయం, ఆర్థిక అదృష్టం, కుటుంబ జీవితంతో పాటు మానసిక ఆరోగ్యం విషయంలో ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.. అయితే, ఈ సమయంలో ఏయే రాశులవారిపై ఎలాంటి ప్రభావం పడుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఈ రాశులవారికి కష్టాలు తప్పవా?
మేష రాశి:
శని సంచారంతో మేష రాశివారికి ఈ సమయంలో అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. అధిక ఒత్తిడి నుంచి విముక్తి కలగడమే కాకుండా మానసిక సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. అలాగే కార్యాలయంలో బాధ్యతలు కూడా విపరీతంగా పెరుగుతాయి. దీంతో పాటు పె అధికారులతో విభేదాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. కష్టపడి పనులు చేసినప్పటికీ.. ఆశించిన ఫలితాలు రాకపోయే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ఈ సమయంలో కొత్త పెట్టుబడులు పెట్టే ముందు లేదా పెద్ద ఆర్థిక నిర్ణయాలు తీసుకునే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించడం మంచిదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. వీరు ఈ సమయంలో భారీ మొత్తంలో ఆర్థికంగా కూడా నష్టపోతారు.
సింహరాశి:
సింహ రాశివారికి కుటుంబ, ఆర్థిక విషయాల్లో కొన్ని రకాల ఆటంకాలు కూడా ఎదురవుతాయి. అలాగే దీర్ఘకాలిక సమస్యల నుంచి విముక్తి కూడా కలుగుతుంది. అంతేకాకుండా చివరిగా నిలిచిపోయిన పనులు కూడా తిరిగి ప్రారంభమవుతాయి. అలాగే కొన్ని పనులు ఆగిపోవడం వల్ల ఈ సమయంలో మానసిక సమస్యలు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వైవాహిక జీవితంలో అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. ముఖ్యంగా కుటుంబ కలహాల కారణంగా మానసి ప్రశాంతతకు భంగం కలిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దీంతో పాటు వీరు పొట్ట సంబంధిత సమస్యల బారినపడే అవకాశాలు కూడా ఉన్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.
వృశ్చిక రాశి:
శని పవర్ఫుల్ ఎఫెక్ట్తో వృశ్చిక రాశివారికి జీవితంలో కొన్ని రకాల మార్పులు రావడం ప్రారంభమవుతాయి. అంతేకాకుండా కొత్త అదనపు ఒత్తిడి పొందుతారు.. అలాగే ఖర్చులు కూడా విపరీతంగా పెరుగుతాయి. దీని ఫలితంగా ఆదాయం కూడా బాగా తగ్గుతుంది. అలాగే బడ్జెట్పై ప్రభావం పడుతుంది. ఇక ప్రత్యర్థులతో ఈ సమయంలో తప్పకుండా సమస్యలను ఎదుర్కొంటారు. ఈ సమయంలో వీరు ఇతరులను గుడ్డిగా నమ్మకపోవడం చాల మంచిది. ముఖ్యంగా ప్రయాణాలు చేసే సమయంలో కూడా తప్పకుండా జాగ్రత్తలు వహించడం మంచిదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.
కుంభ రాశి:
కుంభ రాశివారికి శని అధిపతిగా వ్యవహరిస్తారు. అయితే, వీరికి శని చివరి దశ కొనసాగుతోంది. కాబట్టి ఈ సమయంలో అద్భుతమైన లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా విధులు నిర్వహణలో అడ్డంకులు కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఒత్తిడి నుంచి కూడా సులభంగా ఉపశమనం కలుగుతుంది. ముఖ్యంగా వ్యాపార భాగస్వాములతో విభేదాలు కూడా రావచ్చు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. అంతేకాకుండా ఈ సమయంలో పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోవడం మానుకుంటే మంచిదని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
గమనిక.. 
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Petrol Diesel Rates Today: వాహనదారులకు అదిరిపోయే గుడ్న్యూస్.. త్వరలోనే భారీగా తగ్గనున్న Petrol Diesel Rates.. కేంద్ర మంత్రి కీలక ప్రకటన..!!
Secunderabad, Telangana:Petrol Diesel Rates Today: మిడిల్ ఈస్ట్ లో కొనసాగుతున్న ఉద్రిక్తత పరిస్థితుల కారణంగా ఇంధన సరఫరా గొలుసుపై ఒత్తిడి నెలకొంది. ఈ నేపథ్యంలో దేశంలో తన ఇథనాల్ మిశ్రణ కార్యక్రమం దిశగా ఒక ముఖ్యమైన అడుగుగా ఈ85 ఇంధనాన్ని అధికారికంగా ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం. ఇదెలా ఉండగా.. దేశంలో పెట్రోల్, డీజీల్ ధరలు నేడు స్థిరంగానే కొనసాగుతన్నాయి.
అయితే పెట్రోల్ విషయానికి వస్తే, హైదరాబాద్లో లీటరుకు రూ. 115.72తో అత్యధిక ధర ఉండగా, ఆ తర్వాతి స్థానంలో తిరువనంతపురంలో లీటరుకు రూ. 115.49గా ఉంది. 4 మెట్రో నగరాలలో, న్యూఢిల్లీ, కోల్కతాలో పెట్రోల్ ధరలు వరుసగా లీటరుకు రూ. 102.12 రూ.113.47 వద్ద స్థిరంగా ఉన్నాయి. కాగా, ముంబై, చెన్నైలలో ధరలు లీటరుకు 3 పైసలు, 4 పైసలు స్వల్పంగా పెరిగి వరుసగా లీటరుకు రూ.111.21 రూ.107.88కి చేరాయి.
ఇదిలా ఉండగా.. పెరుగుతున్న ఇంధన ధరలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సామాన్య ప్రజలకు రాబోయే నెలల్లో కొంత ఉపశమనం లభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చమురు ధరలు ప్రస్తుత అధిక స్థాయిలలో ఎక్కువ కాలం కొనసాగే అవకాశం లేదని, రాబోయే నెలల్లో తగ్గుతాయని పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి అన్నారు. ఇరాన్కు సంబంధించిన ఉద్రిక్తతల కారణంగా ప్రపంచ ఇంధన మార్కెట్ ఒత్తిడిలో ఉన్న తరుణంలో ఆయన ఈ ప్రకటన చేశారు. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితుల వల్ల ముడి చమురు, గ్యాస్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడటంతో చమురు ధరలు బ్యారెల్ కు 100 డాలర్ల మార్కుకు చేరాయి.
రాయిటర్స్ నివేదిక ప్రకారం కేంద్ర మంత్రి మాట్లాడుతూ... ప్రస్తుత భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ, రాబోయే నెలల్లో చమురు.. గ్యాస్ ధరలు తగ్గే అవకాశం ఉందని అన్నారు. ప్రపంచంలోని అత్యంత కీలకమైన ఇంధన మార్గాలలో ఒకటైన హోర్ముజ్ జలసంధి గుండా జరిగే రవాణాపై సంఘర్షణ ప్రభావం చూపినప్పటి నుండి ప్రపంచ ముడి చమురు ధరలు తీవ్రంగా పెరిగాయి. సంఘర్షణ ప్రారంభం కావడానికి ముందు, ప్రపంచ చమురు, గ్యాస్ సరఫరాలలో సుమారు ఐదవ వంతు ఈ ఇరుకైన జలమార్గం గుండా వెళ్ళేది. అయితే, ప్రస్తుత ధరల స్థాయిలు ఎక్కువ కాలం కొనసాగే అవకాశం లేదని మంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు.
Also Read: ఉద్యోగులకు అలర్ట్.. మీ అకౌంట్లో PF Interest ఇంకా పడలేదా? అసలు కారణం ఇదే..!!
Also Read: LPG Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. మళ్లీ పెరిగిన వంటగ్యాస్
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. దయచేసి దీన్ని పెట్టుబడి, ఆర్థిక లేదా వ్యాపార సలహాగా భావించవద్దు. గుర్తుంచుకోండి స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టోకరెన్సీలు, రియల్ ఎస్టేట్, విలువైన లోహాలు వంటి అన్ని రకాల పెట్టుబడులు మార్కెట్ ఆటు పోటులు రిస్కులకు లోబడి ఉంటాయి. దీని అర్థం, మీరు లాభపడవచ్చు లేదా నష్టపోవచ్చు. మీరు తీసుకునే ఎలాంటి పెట్టుబడి నిర్ణయాలు లేదా వ్యాపార కార్యకలాపాల వల్ల కలిగే నష్టాలు లేదా లాభాలకు మా సంస్థ జీ తెలుగు వెబ్ పోర్టల్ ఎట్టి పరిస్థితుల్లోనూ బాధ్యత వహించదు. ఏదైనా ఆర్థిక నిర్ణయం తీసుకునే ముందు, తప్పకుండా ఒక రిజిస్టర్డ్ లేదా సర్టిఫైడ్ ఆర్థిక నిపుణుడిని సంప్రదించి, వారి సలహా తీసుకోమని పాఠకులకు సిఫార్సు చేస్తున్నాము.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Hyderabad Pickleball: ఐపీఎల్ ధోరణికి భిన్నంగా పికిల్ బాల్ టోర్నీ.. హైదరాబాద్లో సరికొత్త క్లబ్ సంస్కృతికి నాంది!
Hyderabad, Telangana:Hyderabad Pickleball League: భారతదేశంలో పికిల్బాల్ క్రీడ కేవలం కోర్టుల సంఖ్య, ప్రముఖుల పెట్టుబడులు, గ్లామరస్ లీగ్లకే పరిమితం కాకుండా.. క్షేత్రస్థాయిలో ఒక శక్తివంతమైన సామాజిక ఉద్యమంగా మారుతోంది. గత రెండేళ్లలో ఒక చిన్న వినోద క్రీడగా ప్రారంభమై, ప్రస్తుతం దేశవ్యాప్తంగా 500కు పైగా కోర్టులతో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోంది. అయితే, మెజారిటీ లీగ్లు ఐపీఎల్ తరహాలో సెలబ్రిటీల హంగులు, కేంద్రీకృత టోర్నమెంట్లపై దృష్టి పెడితే.. హైదరాబాద్ వేదికగా సెంటర్ కోర్ట్ పికిల్బాల్ క్లబ్ లీగ్ (CCPL) ఒక సరికొత్త వికేంద్రీకృత నమూనాకు శ్రీకారం చుట్టింది.
ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ లేదా 'లా లిగా' వంటి అంతర్జాతీయ ఫుట్బాల్ లీగ్ల మాదిరిగానే, సీసీపీఎల్ కూడా స్థానిక ప్రాంతీయ గుర్తింపు ఆధారంగా జట్లను వ్యూహాత్మకంగా తీర్చిదిద్దింది. నగరంలోని ఒకే ఒక ప్రధాన స్టేడియానికే పరిమితం కాకుండా.. అబిడ్స్, హబ్సిగూడ, జూబ్లీ హిల్స్, కొండాపూర్, కూకట్పల్లి, తెల్లాపూర్ వంటి 19 విభిన్న వేదికలలో మ్యాచ్లను నిర్వహించింది. గత 9 వారాలుగా 2 కాన్ఫరెన్స్లుగా విడిపోయిన 20 జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. క్లబ్లు తమ సొంత మైదానాల్లో (హోమ్ గ్రౌండ్స్) మ్యాచ్లు నిర్వహించడం వల్ల స్థానిక ప్రేక్షకులతో బలమైన బంధం ఏర్పడింది.
"ఇది ఒక వారాంతంలో వచ్చి వెళ్ళిపోయే సాధారణ టోర్నమెంట్ కాదు. నగరంలో దీర్ఘకాలిక క్లబ్ సంస్కృతిని, కమ్యూనిటీల చుట్టూ క్రీడా పర్యావరణ వ్యవస్థను నిర్మించడమే మా లక్ష్యం" అని సెంటర్ కోర్ట్ స్పోర్ట్స్ & ఎంటర్టైన్మెంట్ సహ వ్యవస్థాపకుడు యశ్వంత్ బియ్యాల వెల్లడించారు.
గణాంకాలలో సీసీపీఎల్ విజయం
ఈ సరికొత్త ప్రయోగం కేవలం భావోద్వేగ పరంగానే కాకుండా, గణాంకాల పరంగానూ అద్భుతమైన విజయాలను నమోదు చేసింది. ఈ లీగ్లో మొత్తం 350 మందికి పైగా ఆటగాళ్లు నమోదవ్వగా.. 220 మందికి పైగా క్రీడాకారులు పోటీపడ్డారు. ఈ గేమ్స్ను ప్రత్యక్ష ప్రసారం ద్వారా 20,000+ వ్యూస్.. ప్రత్యక్షంగా వీక్షించిన ప్రేక్షకులు 8,000+ మంది ఉన్నారు. అలాగే మహిళా భాగస్వామ్యం 92 మంది రిజిస్టర్ కాగా.. 40+ మంది మైదానంలోకి దిగారు. యువ క్రీడాకారులు (U-21) 20+ మంది పాల్గొన్న ఈ టోర్నీలో 100 మందికి పైగా స్పాన్సర్లు వాణిజ్య భాగస్వాములుగా ఉన్నారు.
మైదానం దాటిన భావోద్వేగం..
ఈ వికేంద్రీకృత నమూనా కేవలం ఆటగాళ్లకే కాక, స్థానిక వ్యాపారాలకు, స్పాన్సర్లకు ఒక అద్భుతమైన వేదికగా నిలిచింది. 100 మందికి పైగా స్పాన్సర్లు లీగ్తో చేతులు కలపడం ద్వారా పికిల్బాల్ ఒక క్రీడగానే కాకుండా ఒక జీవనశైలిగా మారుతోందని స్పష్టమవుతోంది. సెంటర్ కోర్ట్ స్పోర్ట్స్ సహ వ్యవస్థాపకుడు విక్రాంత్ రావు మాట్లాడుతూ.. "ఈ హోమ్-అండ్-అవే ఫార్మాట్ తీసుకొచ్చిన అతిపెద్ద మార్పు భావోద్వేగ బంధం. ఆటగాళ్లు తమ సొంత కోర్టులను కాపాడుకోవడానికి శ్రమిస్తుంటే, పరిసర ప్రాంతాల ప్రజలు తమ స్థానిక జట్లకు మద్దతుగా నిలుస్తున్నారు. ఇది ప్రేక్షకుల అనుభవాన్ని పూర్తిగా మార్చేసింది" అని పేర్కొన్నారు.
వైకింగ్స్ పీసీకి చెందిన యువ క్రీడాకారిణి అభయ వేమూరి తన అనుభవాన్ని పంచుకుంటూ.. "ఈ లీగ్ మాకు క్రమం తప్పకుండా ఆడే అవకాశాన్ని ఇవ్వడమే కాకుండా, మా నైపుణ్యాలను నిరూపించుకోవడానికి, గుర్తింపు సాధించడానికి ఒక గొప్ప ద్వారాలను తెరిచింది" అని ఆనందం వ్యక్తం చేశారు.
సుస్థిర భవిష్యత్తు వైపు అడుగులు
తొలి సీసీపీఎల్ క్లబ్ లీగ్ సీజన్ ముగింపు దశకు చేరుకుంటున్న వేళ.. ఇది కేవలం విజేతలను ప్రకటించడమే కాకుండా, భారతీయ నగరాల్లో కొత్త క్రీడలు ఎలా మనుగడ సాగించాలో ఒక దిశా నిర్దేశం చేసింది. కేవలం ట్రెండ్స్ వెనుక పరిగెత్తకుండా.. నిలకడైన పోటీ, ప్రతి వారం క్రీడతో కమ్యూనిటీలను అనుసంధానించడం ద్వారానే పికిల్బాల్ ఒక శాశ్వత క్రీడా సంస్కృతిగా అవతరిస్తుందని హైదరాబాద్ నిరూపించింది.
Also Read: విరాట్ కోహ్లీ ఇన్స్టాగ్రామ్లో పెట్టిన ఒక్క లైక్తో ఆమె జీవితమే మారిపోయింది!
Also Read: బిగ్బాస్ బ్యూటీతో క్రికెటర్ అభిషేక్ శర్మ డేటింగ్..దాని వల్ల ఇద్దరు దొరికిపోయారు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Revanth Reddy: అభివృద్ధి జరగకుండా కిషన్ రెడ్డి కాళ్లలో కట్టెలు పెడుతుండు: రేవంత్ రెడ్డి
Hyderabad, Telangana:Telangana Development: 'కేసీఆర్, కిషన్ రెడ్డి మీ అవినీతి, అహంకారంతో తెలంగాణ ప్రజలకు నష్టం చేయకండి. మీ చీకటి ఒప్పందాలను ప్రజలు గమనిస్తున్నారు. నేను ప్రధానిని కలిస్తే కిషన్ రెడ్డి ప్రధానిని కలుస్తాడు. నేను కేంద్ర మంత్రిని కలిస్తే ఆయన కేంద్ర మంత్రిని కలుస్తాడు. తెలంగాణకు నిధులు రాకుండా, అభివృద్ధి జరగకుండా కాళ్లలో కట్టెలు పెడుతుండు' అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 'ఇలాగే చేస్తే మీకు తెలంగాణలో పుట్టగతులు లేకుండా ప్రజలు తీర్పు ఇస్తారు. మళ్లీ మీరు ఢిల్లీకి పోకుండా చేస్తారు' అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
మియాపూర్లో జరిగిన బహిరంగసభలో తెలంగాణ ముఖ్యమంత్రి కీలక ప్రసంగం చేశారు. 'ఢిల్లీ, ముంబై, బెంగుళూరు, కలకత్తా, చెన్నై, హైదరాబాద్ ఈ ఆరు నగరాలే దేశ ఆర్ధిక వ్యవస్థను నడిపిస్తున్నాయి. హైదరాబాద్ మహా నగరం వేగంగా విస్తరిస్తోంది. ఒక పద్దతి ప్రకారం అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడానికే మహా నగరాన్ని మూడు కార్పొరేషన్లుగా విభజించాం. విస్తరిస్తున్న నగరం భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా మూడు కార్పొరేషన్లు చేశాం. పోలీస్, మున్సిపల్ శాఖల మధ్య సమన్వయం ఉండేలా సరిహద్దులు నిర్ణయించాం. జెండాలకు ఎజెండాలకు అతీతంగా మన నగరాన్ని అభివృద్ధి చేసుకుందాం' అని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.
ఎందుకు నిధులు అడగడం లేదు?
పేదల పిల్లలకు నాణ్యమైన విద్య అందించేందుకు యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్, తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నామని రేవంత్ రెడ్డి తెలిపారు. 'చేవెళ్ల, మెదక్, మల్కాజిగిరి ఎంపీలు బీజేపీ వాళ్లే ఉన్నారు. సికింద్రాబాద్ నుంచి ఎంపీగా గెలిచిన కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా కూడా ఉన్నారు. బీజేపీ ఎంపీలు ప్రధాని మోదీని ఎందుకు నిధులు అడగడం లేదు తెలంగాణ అభివృద్ధికి నిధులు రాకుండా అడ్డుకుంటున్నది కిషన్ రెడ్డి కాదా?' అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
చర్చకు సిద్ధం
'మోదీ గుజరాత్లో సబర్మతి నదిని అభివృద్ధి చేసుకుంటే ఆహా ఓహో అంటున్నారు. ఇక్కడ మూసీని అభివృద్ధి చేస్తామంటే అడ్డుకుంటున్నారు. బీజేపీ ఎంపీలకు రాష్ట్రానికి నిధులు తెచ్చే బాధ్యత లేదా?' అని రేవంత్ రెడ్డి నిలదీశారు. పదేళ్ల కెసీఆర్ పాలన , పన్నెండేళ్ల మోదీ పాలన, 30 నెలల మా పాలనపై చర్చకు సిద్ధమని ప్రకటించారు. ఎవరేం చేశారో, ఎన్ని నిధులు తెచ్చారో చర్చిద్దాం రండి అంటూ సవాల్ చేశారు. 'త్వరలో గాజులరామారంలో 100 ఎకరాల్లో అంతర్జాతీయ బస్ టెర్మినల్ నిర్మించబోతున్నాం. మూడు నెలల్లో ఇందుకు సంబంధించిన పనులను మొదలు పెట్టుకుందాం. విశ్వనగరం అని గొప్పలు చెప్పుకుంటే సరిపోదు.. దీనికి అనుగుణంగా అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలి. అందుకే మెట్రో రెండో దశ విస్తరణ చేపడుతున్నాం' అని రేవంత్ రెడ్డి వివరించారు. మహానగరంలో లక్ష ఎల్ఐజీ, ఎంఐజీ ఇళ్లను కట్టి పేదల కష్టాలు తీరుస్తామని.. ఎక్కడ ఉన్న వారికి అక్కడే ఇండ్లు కట్టించి ఇస్తామని హామీ ఇచ్చారు.
ఇండ్లు నిర్మాణానికి ప్రణాళికలు
'ప్రభుత్వ భూములను కబ్జాల నుంచి విడిపించి అక్కడ పేదలకు ఇండ్లు నిర్మించేందుకు ప్రణాళికలు వేస్తున్నాం. పాఠశాలల నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్ను అందిస్తున్నాం. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాం. మూడున్నర ఎకరాల్లో ఇందిరా మహిళా శక్తి ద్వారా 150 స్టాల్స్ను మహిళలకు అందించాం. మహిళలను పెట్రోల్ బంక్లకు యజమానులను చేశాం' అని రేవంత్ రెడ్డి వివరించారు.
Mrigasira Karthi: మృగశిర కార్తె వచ్చేసింది! ఈ రోజు చేపలు ఎందుకు తినాలి? ఆ రెండింటి సంబంధం ఏంటో తెలుసా?
Hyderabad, Telangana:Mrigasira Karthi Fish Relation: మృగశిర కార్తె రాకతో వర్షాకాలం అధికారికంగా ప్రారంభమవుతుంది. సూర్యుడు మృగశిర నక్షత్రంలోకి ప్రవేశించడాన్నే 'మృగశిర కార్తె' అంటారు. ఈ రోజున రైతులు విత్తనాలు చల్లి, పొలం పనులు మొదలుపెడతారు. అయితే మృగశిర కార్తె అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది చేపల వంటకాలు. పల్లె అయినా, పట్నమైనా ఈ రోజున ప్రతి ఇంట్లో చేపల కూర గుమగుమలాడాల్సిందే. మరి ఈ కార్తెకు, చేపలు తినే సంప్రదాయానికి ఉన్న ఆరోగ్య రహస్యం ఏంటో ఇప్పుడు చూద్దాం.
వాతావరణ మార్పు – రోగనిరోధక శక్తి
మృగశిర కార్తెకు ముందు వచ్చే రోహిణి కార్తెలో ఎండలు మండిపోతాయి. రోకళ్లు పగిలేంత ఎండల వల్ల ప్రజలు విపరీతమైన ఉక్కపోతకు గురై, శరీరంలో నీటి శాతం తగ్గిపోతుంది. ఆ వెంటనే మృగశిర రాకతో నైరుతి రుతుపవనాలు ప్రవేశించి, తొలకరి చినుకులు పడతాయి.
ఒక్కసారిగా వాతావరణం చల్లబడటాన్ని మానవ శరీరం తట్టుకోలేదు. ఈ తేమ వాతావరణం వల్ల బ్యాక్టీరియా, వైరస్లు వేగంగా వ్యాప్తి చెంది.. జలుబు, దగ్గు, గొంతు నొప్పి వస్తాయి. ఆస్తమా, ఉబ్బసం వంటి శ్వాసకోశ సమస్యలు పెరుగుతాయి. శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గుతుంది.
ఈ కాలంలో వచ్చే జబ్బుల నుంచి తట్టుకోవడానికి మన పెద్దలు చేపలు తినే ఆనవాయితీని తెచ్చారు. దీని వెనుక బలమైన ఆరోగ్య కారణాలు ఉన్నాయి. వాతావరణం చల్లబడినప్పుడు శరీర ఉష్ణోగ్రత పడిపోతుంది. చేపలు తినడం వల్ల శరీరం లోపలి నుంచి వెచ్చగా మారుతుంది. ఇది గుండె, ఊపిరితిత్తులకు అవసరమైన వేడిని అందిస్తుంది. వర్షాల వల్ల శరీరంలో కఫం, వాత దోషాలు పెరుగుతాయి. చేపలు ఈ కఫాన్ని నియంత్రించి శ్వాసకోశ ఇబ్బందులను తగ్గిస్తాయి.
అలాగే చేపల్లో విటమిన్లు, ఖనిజ లవణాలు, ముఖ్యంగా ఓమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి, రోగనిరోధక శక్తి పెంపుదలకు ఎంతో మేలు చేస్తాయి.
తొలి వానలు పడగానే రైతులు రాత్రింబవళ్లు పొలం పనుల్లో మునిగిపోతారు. ఆ సమయంలో వచ్చే ఒళ్లు నొప్పులు, అలసట నుంచి ఉపశమనం పొందడానికి కూడా చేపలు దోహదపడతాయి. అందుకే "మృగశిరన చేప తింటే ఏడాదంతా ఏ రోగం రాదు" అనే సామెత కూడా పుట్టింది.
అంతేకాకుండా.. దీర్ఘకాలిక ఆస్తమా, ఉబ్బస వ్యాధిగ్రస్తుల కోసం ఈ రోజున ప్రత్యేకంగా అందించే 'చేప ప్రసాదం' (చేప మందు) తీసుకోవడానికి కూడా దేశం నలుమూలల నుండి ప్రజలు తరలివస్తుంటారు. మృగశిర కార్తె నాడు చేపలు తినడం అనేది కేవలం ఒక అలవాటు మాత్రమే కాదు, మారుతున్న వాతావరణానికి అనుగుణంగా మన శరీరాన్ని సిద్ధం చేసే ఒక అద్భుతమైన ఆరోగ్య సూత్రంగా మారింది.
Also Read: Fingerprint Lock Technology: మనిషి చనిపోయిన తర్వాత ఫింగర్ ప్రింట్తో ఫోన్ అన్లాక్ చేయోచ్చా? అసలు నిజం ఇదే!
Also Read: Virat Kohli Liked Lizlaz: విరాట్ కోహ్లీ ఇన్స్టాగ్రామ్లో పెట్టిన ఒక్క లైక్తో ఆమె జీవితమే మారిపోయింది!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు భారీ జాక్పాట్.. ఒకేసారి రూ.14 లక్షల అరియర్స్? పూర్తి వివరాలు ఇవే..!!
Secunderabad, Telangana:8th Pay Commission: దేశవ్యాప్తంగా లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 8వ వేతన సంఘం అమలు కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ లోపు సంబంధిత వర్గాలు తమ సూచనలను సమర్పించేందుకు 8వ వేతన సంఘం మరోసారి గడువును పొడిగించింది. ఈసారి.. దీనిని జూన్ 15వ తేదీ వరకు పొడిగించారు. నిజానికి ఈ సమర్పణ ప్రక్రియ 2026 మార్చి 5న ప్రారంభమైంది. మొదట గడువును ఏప్రిల్ 30గా నిర్ణయించగా.. ఆ తర్వాత దానిని మే 31కి పొడిగించారు.. ఇప్పుడు దానిని మరోసారి పొడిగించారు.
సూచనలు సమర్పించేందుకు గడువును పొడిగించడం... 8వ వేతన సంఘం అమలు మరింత ఆలస్యం అవుతుందని స్పష్టంగా తెలుస్తోంది. అయితే, అమలు ఆలస్యమైనప్పటికీ, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బకాయిలు అందుతాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్ని నెలల బకాయిలు అందుతాయి? బకాయిల మొత్తాన్ని ఏది నిర్ణయిస్తుంది? ఉద్యోగులు అదనంగా ఎంత డబ్బును పొందే అవకాశం ఉంది? పూర్తి వివరాలు తెలుసుకుందాం.
సాధారణంగా.. ప్రతి 10 సంవత్సరాలకు ఒక కొత్త కేంద్ర వేతన సంఘం ఏర్పడుతుంది. ఈ నియమం ప్రకారం, 7వ వేతన సంఘం పదవీకాలం ముగిసిన తర్వాత, 8వ వేతన సంఘం జనవరి 1, 2026 నుండి అమలులోకి రానుంది. సవరించిన వేతన నిర్మాణం జనవరి 1, 2026 నుండి అమలులోకి వస్తుందని భావిస్తున్నప్పటికీ, ప్రభుత్వం దానిని ఆమోదించి, అమలు చేయడానికి ఏప్రిల్ 2027 వరకు సమయం పట్టవచ్చు. ఒకవేళ ఇలా జరిగితే, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు తమ మొత్తం 15 నెలల కాలానికి సంబంధించిన బకాయిలను ఒకే మొత్తంలో పొందవచ్చు.
అయితే, తుది వేతనం 8వ వేతన సంఘం సిఫార్సుల కింద ఆమోదించిన ఫిట్మెంట్ ఫ్యాక్టర్పై ఆధారపడి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలు 7వ వేతన సంఘం కింద ఉపయోగించిన 2.57 ఫ్యాక్టర్ కంటే గణనీయంగా ఎక్కువైన 3.68 ఫిట్మెంట్ ఫ్యాక్టర్ను డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వం ఈ ప్రతిపాదనకు ఒకే చెప్పినట్లయితే.. జీతాలు భారీగా పెరుగుతాయి. అమలులో జాప్యం వల్ల ఏర్పడే బకాయిలు ఈ క్రింది విధంగా ఉంటాయి:
Also Read: 96 డాలర్లు దాటిన Crude Oil Price.. పెట్రోల్ భారం తప్పదా?
బేసిక్ సాలరీ (స్థాయి 1 ఉద్యోగులు)
ప్రస్తుత బేసిక్ సాలరీ (7వ CPC): ₹18,000
3.68 ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ప్రకారం కొత్త బేసిక్ పే: రూ. 66,240
నెలసరి జీతంలో వ్యత్యాసం (పెరుగుదల): రూ. 48,240
10 నెలలకు అంచనా బకాయిలు (డిఏ మినహాయించి): రూ. 4,82,400
అత్యధిక ప్రాథమిక జీతం (క్యాబినెట్ సెక్రటరీ స్థాయి)
ప్రస్తుత గరిష్ట మూల వేతనం (7వ CPC): రూ. 2,50,000
3.68 ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ప్రకారం కొత్త బేసిక్ పే: రూ. 9,20,000
నెలసరి జీతంలో వ్యత్యాసం (పెరుగుదల): రూ. 6,70,000
2 నెలల బకాయిలు: రూ.13,40,000
ఈ లెక్కలు ఉద్యోగ సంఘాల 3.68 ఫిట్మెంట్ ఫ్యాక్టర్ డిమాండ్.. అమలుకు అంచనా వేసిన కాలపరిమితిపై ఆధారపడి ఉన్నాయి. అయితే, ఫైనల్ ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 2.28 నుండి 2.86 మధ్య ఉండవచ్చని నిపుణులు భావిస్తున్నారు.
Also Read: ఉద్యోగులకు అలర్ట్.. మీ అకౌంట్లో PF Interest ఇంకా పడలేదా? అసలు కారణం ఇదే..!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
TTD Darshan Tickets: భక్తుల కోసం టీటీడీ మరో కీలక నిర్ణయం..జూన్ 10 నుంచి ఆ టికెట్ల జారీకి ఆదేశం!
Tirupati Urban, Andhra Pradesh:TTD Srivani Trust Tickets: తిరుమలలో భక్తుల రద్దీ రికార్డు స్థాయిలో కొనసాగుతోంది. వేసవి సెలవులు ముగిసి, ఈ నెల రెండో వారం నుంచి విద్యాసంస్థలు ప్రారంభం కానుండటంతో శ్రీవారి దర్శనం కోసం భక్తులు పోటెత్తుతున్నారు. ఈ రద్దీని క్రమబద్ధీకరించడానికి, భక్తులకు మరింత సౌకర్యవంతంగా దర్శనం కల్పించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) శ్రీవాణి ట్రస్ట్ టికెట్ల జారీ విధానంలో కీలక మార్పులు చేసింది. ఈ కొత్త నిబంధనలు జూన్ 10 నుండి అమలులోకి రానున్నాయి.
శ్రీవాణి టికెట్ల కోటా విభజన
ప్రస్తుతం ప్రతిరోజూ జారీ చేసే 1,500 శ్రీవాణి టికెట్ల కోటాను భక్తుల సౌకర్యార్థం టీటీడీ క్రింది విధంగా వర్గీకరించింది. ఆన్లైన్ ముందస్తు బుకింగ్ లో భాగంగా 500 టికెట్లు అందుబాటులో ఉంచుతారు. భక్తులు తమ తిరుమల పర్యటనను ముందే ప్లాన్ చేసుకునేలా, 3 నెలల ముందే ఆన్లైన్లో బుక్ చేసుకునే సదుపాయం కల్పించారు.
అలాగే విమాన ప్రయాణికుల కోటా కింద 200 టికెట్లు అందుబాటులో ఉంటాయి. తిరుపతి ఎయిర్పోర్ట్లో కరెంట్ బుకింగ్ కింద రోజువారీగా ఈ టికెట్లను యథావిధిగా కేటాయిస్తారు. చివరిగా బ్యాక్లాగ్ దాతల కోటా కోసం 300 టికెట్లు కేటాయిస్తారు. ఇప్పటికే విరాళం ఇచ్చి దర్శనం కోసం వేచి చూస్తున్న దాదాపు 41 వేల మంది బ్యాక్లాగ్ దాతల కోసం ప్రత్యేకంగా రోజూ 300 టికెట్లను కేటాయిస్తారు.
దర్శన టైమింగ్స్, రూల్స్..
ప్రతిరోజూ ఉదయం 9 గంటలకు విడుదలయ్యే ఈ టికెట్లను మధ్యాహ్నం 1 గంటలోపు బుక్ చేసుకుంటే, అదే రోజు సాయంత్రం 4 గంటలకు స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు. ఒకవేళ ఈ ప్రత్యేక కోటా టికెట్లు మిగిలిపోతే, వాటిని సాధారణ కరెంట్ బుకింగ్కు బదిలీ చేస్తారు. ఈ కొత్త విధానం వచ్చే ఏడాది (2027) మార్చి 31 వరకు అమల్లో ఉంటుంది.
భవిష్యత్తులో ప్లానింగ్స్..
విమానాశ్రయాల్లో కౌంటర్లు ఏర్పాటులో భాగంగా భవిష్యత్తులో విజయవాడ, విశాఖపట్నం, రాజమండ్రి విమానాశ్రయాల్లోనూ శ్రీవాణి టికెట్ కౌంటర్లు ఏర్పాటు చేసే అంశాన్ని టీటీడీ పరిశీలిస్తోంది. అలాగే శ్రీవాణి టికెట్ల జారీ కోసం 'లక్కీడిప్' విధానాన్ని తెచ్చే ఆలోచనలో ఉంది. పెరుగుతున్న భక్తుల రద్దీని తట్టుకునేందుకు తిరుమలలో శాశ్వత క్యూ లైన్ల నిర్మాణానికి టీటీడీ సిద్ధమవుతోంది. దీనిపై తదుపరి బోర్డు సమావేశంలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఎన్నారై భక్తుల సౌకర్యార్థం వారి ప్రత్యేక కోటా దర్శన సమయాన్ని 90 రోజులకు పెంచుతూ టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది.
Also Read: మృగశిర కార్తె వచ్చేసింది! ఈ రోజు చేపలు ఎందుకు తినాలి? ఆ రెండింటి సంబంధం ఏంటో తెలుసా?
Also Read: 'తల్లికి వందనం' నిధుల విడుదల తేదీ మార్పు! అకౌంట్లోకి డబ్బులు పడేది ఆ రోజే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
