icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Pinewz
504251
KASARLA RAMESHKASARLA RAMESHFollow7 Sept 2024, 04:23 am
0
0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

Drug Overdose: పెళ్లికి ముందే కాబోయే భార్యతో 'కార్యం'.. ఆత్రుతలో వయగ్రా ఎక్కువ తీసుకుని మరణం

Gurugram, Haryana:

Viral Crime News: కాబోయే భార్య తన గదికి వస్తుందని ఆ యువకుడు ఉబలాటపడ్డాడు. ఉబ్బితబ్బిబైపోయి ఎగిరిగంతేశాడు. ఏం చేయాలో పాలుపోక ఆ రోజు ఆఫీస్‌కు డుమ్మా కొట్టాడు. ఎలాగో తనకు కాబోయే భార్య కావడంతో పెళ్లికి ముందే కలుసుకోవాలని భావించాడు. తన భార్యతో మరింత ఎక్కువ ఆనందం పొందడానికి డ్రగ్స్‌ (వయాగ్ర) తీసుకున్నాడు. అయితే ఓవర్‌డోస్‌ కావడంతో పరిస్థితి విషమించి అతడు మరణించాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన ఢిల్లీకి సమీపంలోని గురుగ్రామ్‌లో చోటుచేసుకుంది. వైరల్‌గా మారిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

Also Read: Telangana Governor: హమ్మయ్య.. అజారుద్దీన్‌, కోదండరాం ఎమ్మెల్సీలుగా ఆమోదం

మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌ ప్రాంతానికి చెందిన రోహిత్ లాల్‌ (29) గురుగ్రామ్‌లోని సెక్టార్‌ 53 ప్రాంతంలో నివసిస్తుండేవాడు. క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కార్యాలయంలో విధులు నిర్వహించే అతడికి ఇటీవల వివాహం నిశ్చయమైంది. దీంతో ఎంతో ఆనందపడిపోయాడు. తనకు కాబోయే భార్యతో ఫోన్‌లో మాట్లాడుకుంటున్న రోహిత్‌ లాల్‌.. ఆమెను తన గదికి రావాలని పిలిచాడు. దీంతో ఆమె వచ్చేందుకు అంగీకరించింది. ఆమె వస్తుండడంతో ఆనందంతో ఎగిరి గంతేశాడు.

Also Read: RCB vs GT: బెంగళూరు దూకుడుకు తేలిపోయిన సాయి సుదర్శన్‌ సెంచరీ.. గుజరాత్‌ టైటాన్స్‌ మరో ఓటమి

ఎలాగోలా తనకు కాబోయే భార్య కావడంతో కార్యం కూడా కావాలని రోహిత్‌ లాల్‌ భావించాడు. తన భార్యతో మరింత ఆనందం పొందడం కోసం అతడు వయగ్రా (లైంగిక సామ‌ర్థ్యాన్ని రెట్టింపు చేసే కొన్ని మందులు) వేసుకున్నాడు. అయితే రోజూ తనతో కలిసి వచ్చే రోహిత్‌ లాల్‌ ఉద్యోగానికి రాకపోవడంతో అతడికి అనుమానం వచ్చింది. ఫోన్‌ చేస్తే కూడా ఎత్తలేదు. గదికి వెళ్లి చూస్తే తీయడం లేదు. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు.

Also Read: Telangana RTC Strike: చర్చల అనంతరం ఆర్టీసీ సమ్మెపై భట్టి విక్రమార్క కీలక ప్రకటన

సమాచారం అందుకున్న పోలీసులు గదికి తలుపులు తెరిచి చూడగా రోహిత్‌ లాల్‌ అచేతనంగా బెడ్‌పై పడి ఉన్నాడు. లైంగిక సామ‌ర్థ్యాన్ని రెట్టింపు చేసే కొన్ని మందుల షీట్లు, హెల్త్ సప్లిమెంట్లు కనిపించాయి. విచారణలో త‌నకు కాబోయే భార్య‌ను రూమ్‌కు పిలిచాడని.. ఆమె వ‌చ్చేలోపే రోహిత్‌ లాల్‌ చ‌నిపోయినట్లు అక్కడి పోలీసు అధికారి తెలిపారు. వయగ్రా ఓవర్‌ డోస్‌ తీసుకోవడంతో అతడు మృతిచెంది ఉంటాడ‌ని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఓవ‌ర్‌ డోసు తీసుకోవడంతో గుండెపోటుకు గురయి రోహిత్‌ లాల్‌ మరణించి ఉంటాడని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.

అతడి గదిలో లభించిన లైంగిక సామ‌ర్థ్యాన్ని రెట్టింపు చేసే కొన్ని మందులు షీట్లు, సప్లిమెంట్లు టెస్టింగ్ కోసం పంపామ‌ని.. రిపోర్టు వ‌చ్చాకే అతడి మృతికి కార‌ణం తెలుస్తుంద‌ని పోలీసులు చెబుతున్నారు. కాబోయే భార్య వస్తున్న విషయం తెలిసింది.. కానీ ఆమె వచ్చిందా? లేదా అనేది ఇంకా తేలలేదు. అన్ని కోణాల్లో విచార‌ణ జ‌రుగుతోంద‌ని అక్కడి పోలీసు అధికారి స‌త్యేంద‌ర్ రావ‌ల్ తెలిపారు. త్వరలోనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని చెప్పారు. రోహిత్‌ లాల్‌ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report

Sahil Parakh Injury: ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్‌కు తీవ్ర గాయం..రక్త ధారలా కారడంతో వెంటనే ఆస్పత్రికి తరలింపు..

New Delhi, Delhi:

Sahil Parakh Injured: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో నేడు ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు ప్రాక్టీస్ సెషన్‌లో ఓ షాకింగ్ సంఘటన జరిగింది. అరుణ్ జెట్లీ స్టేడియంలో ఆతిథ్య జట్టు ఢిల్లీ క్యాపిటల్స్‌కు సంబంధించిన ఓ యువ ఆటగాడికి తీవ్ర గాయమైంది. ఆ గాయం దెబ్బకి రక్తం బయటపడింది. దీంతో హుటాహుటిని ఆటగాడ్ని ఆస్పత్రికి తరలించారు. 

అక్షర్ పటేల్ సారథ్యంలోని ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు శనివారం పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్ ఉన్న క్రమంలో ప్రాక్టీస్ సెషన్ లో ఈ సంఘటన జరిగింది. ప్రాక్టీస్ చేస్తుండగా, ఆ సమయంలో జట్టులోని యువ ఆటగాడు సాహిల్ పరాఖ్ ముఖానికి బంతి తగలడంతో తీవ్రంగా గాయపడ్డాడు. గాయం తీవ్రత ఎంత ఎక్కువగా ఉందంటే, వెంటనే మైదానానికి అంబులెన్స్‌ను పిలిపించి అతడిని ఆసుపత్రికి తరలించారు.

జీ తెలుగు న్యూస్ నివేదిక ప్రకారం.. బంతి అతని హెల్మెట్‌ను ఎంత బలంగా తాకిందంటే, అతని ముఖం నుండి రక్తం కారడం ప్రారంభమైంది. వెంటనే ప్రాక్టీస్ సెషన్‌ను నిలిపివేసి, వైద్య సిబ్బంది వెంటనే ప్రథమ చికిత్స అందించారు. అనంతరం ప్రత్యేక చికిత్స కోసం ఆటగాడిని అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. ఇప్పటికే ఈ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును వరుస గాయల బెడద వెంటాడుతోంది. ఇప్పుడు మరో ఆటగాడు తీవ్ర గాయానికి లోనవ్వడం జట్టులో ఆందోళనను కలగజేస్తుంది. అయితే గాయం తీవ్రత గురించి ఢిల్లీ క్యాపిటల్స్ మేనేజ్‌మెంట్ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. 

సాహిల్ పరాఖ్ ఎవరు?
సాహిల్ పరాఖ్ 18 ఏళ్ల భారత క్రికెటర్. ఇతను జూన్ 7, 2007న మహారాష్ట్రలోని నాసిక్‌లో జన్మించాడు. ఇతను లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్, అలాగే మంచి బౌలర్ కూడా. ఐపీఎల్ 2026 సీజన్ కోసం గతేడాది జరిగిన వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ అతడిని రూ.30 లక్షలకు కొనుగోలు చేసింది. ఇతను దేశీయంగా మహారాష్ట్రకు, మహారాష్ట్ర ప్రీమియర్ లీగ్‌లో ఈగల్ నాసిక్ టైటాన్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు.

పరాఖ్ మహారాష్ట్ర తరపున పాఠశాల స్థాయి నుంచి క్రికెట్‌తో తన ప్రస్థానాన్ని ప్రారంభించాడు. పాఠశాలల మధ్య జరిగే టోర్నమెంట్లలో నిలకడగా పరుగులు, వికెట్లు తీస్తూ రాణించాడు. ఆ తర్వాత మహారాష్ట్ర అండర్-19 జట్టుకు ఎంపికై, నమ్మకమైన టాప్-ఆర్డర్ బ్యాట్స్‌మన్‌గా, పార్ట్-టైమ్ బౌలర్‌గా స్థిరపడ్డాడు.

Also Read: IPL Slapgate Ad: చెంపదెబ్బ వీడియోతో రూ.కోటి సంపాదన..హర్బజన్‌పై శ్రీశాంత్ ఆరోపణ..

Also Read: Mumbai Indians Downfall: ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ పతనం మొదలు..5 సార్లు విజేత ప్రదర్శన ఇదా? అంబానీ ఫ్యామిలీ చేసిన తప్పు అదే!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Telangana Governor: హమ్మయ్య.. ఎమ్మెల్సీలుగా అజారుద్దీన్‌, కోదండరాం రెడ్డి

Hyderabad, Telangana:

Telangana Governor Quota MLC:  తెలంగాణ మంత్రి అజారుద్దీన్‌కు భారీ ఊరట లభించింది. కాంగ్రెస్‌ పార్టీ గట్టి ఊపిరి పీల్చుకుంది. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అజారుద్దీన్‌కు ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం దాదాపు ఖాయమైంది. ఇప్పటికే గవర్నర్‌ వద్ద ఉన్న ఆ ఫైల్‌కు ఆమోద ముద్ర లభించింది. ఆ ఫైల్‌పై గవర్నర్‌ సంతకం చేశారని తెలుస్తోంది. ఇదొక్కటే కాకుండా ఎమ్మెల్సీ పదవి దక్కి.. దక్కకుండా పోతుండడంతో తీవ్ర అసహనంలో ప్రొఫెసర్‌ కోదండ రాంరెడ్డికి ఊరట లభించింది. ఆయన అభ్యర్థిత్వానికి కూడా గవర్నర్‌ ఆమోదం తెలిపినట్లు సమాచారం.

Also Read: RCB vs GT: బెంగళూరు దూకుడుకు తేలిపోయిన సాయి సుదర్శన్‌ సెంచరీ.. గుజరాత్‌ టైటాన్స్‌ మరో ఓటమి

గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీలుగా అజారుద్దీన్‌, కోదం రామ్‌రెడ్డికి కాంగ్రెస్‌ పార్టీ అవకాశం ఇచ్చింది. అభ్యర్థిత్వం ఖరారు చేస్తూ ప్రభుత్వం పంపిన సిఫారసులను దాదాపు ఐదు నెలలకు పైగా గవర్నర్‌ ఆమోదం తెలపడం లేదు. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక సందర్భంగా మైనార్టీకి చెందిన అజారుద్దీన్‌కు కాంగ్రెస్‌ పార్టీ మంత్రి పదవి ఇచ్చింది. ఆయన మంత్రిగా బాధ్యతలు చేపట్టి దాదాపు ఆరు నెలలకు చేరువవుతోంది. ఈ నేపథ్యంలో ఆయన మంత్రి పదవి ఉంటాదా? ఊడుతదా? అని తీవ్ర ఉత్కంఠ నేపథ్యంలో ఎట్టకేలకు గవర్నర్‌ ఆమోదం తెలిపారు.

Also Read: Telangana RTC Strike: చర్చల అనంతరం ఆర్టీసీ సమ్మెపై భట్టి విక్రమార్క కీలక ప్రకటన

కోదండ రాంరెడ్డి, అజారుద్దీన్‌కు ఎమ్మెల్సీలుగా నియమించాలని ఆగస్టు 30వ తేదీన కాంగ్రెస్‌ ప్రభుత్వం తీర్మానం చేసి గవర్నర్‌కు పంపించింది. తాజాగా ఆ తీర్మానంపై గవర్నర్‌ సంతకం చేయడంతో వారిద్దరు ఎమ్మెల్సీల నియామకానికి మార్గం సుగమమైంది. నేడో రేపో వారిని ఎమ్మెల్సీలుగా నియమిస్తూ గవర్నర్‌ అధికారిక ప్రకటన చేయనున్నారు. కోదండా రాంరెడ్డికి గవర్నర్‌ పదవి అనేది ఇలా వచ్చి అలా పోతోంది. గతంలో ఆయనను ఎమ్మెల్సీగా గవర్నర్‌ నియమించగా.. బీఆర్‌ఎస్‌ పార్టీ గట్టి పోరాటం చేయడంతో అతడి ఎమ్మెల్సీ పదవి పోయింది. ఇప్పుడు మళ్లీ ప్రతిపాదనలు పంపగా.. ఈసారి గవర్నర్‌ ఆమోదం తెలుపుతున్నారు. ఈసారయినా కోదండ రామిరెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఉంటుందా? ఉండదా? అనేది ఆసక్తికరంగా మారింది.

Also Read: Kaleshwaram Project: మేరుపర్వతం లాంటి కేసీఆర్‌పై ఉమ్మేస్తే.. కాంగ్రెస్‌పైనే పడింది: బీఆర్‌ఎస్‌ పార్టీ

తనకు ఎమ్మెల్సీ పదవి దక్కబోతుండడంతో కోదండ రాంరెడ్డి స్పందించారు. ఎమ్మెల్సీ ప‌ద‌వి గురించి ఆలోచించడమే తాను మానేసినట్లు చెప్పారు. ఎందుకంటే అంతలా ఎమ్మెల్సీ పదవిపై విసిగి వేసారిపోయారు. ఎమ్మెల్సీ పదవి గురించి ఎవరూ అడిగినా సున్నితంగా వదిలేయమ‌ని.. చెప్పినట్లు తెలిపారు. తనకు పదవులు శాశ్వతం కాదని అర్థమైంది.. తనను విమర్శించే వాళ్లకి ఏం చెప్పలేనని పేర్కొన్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report
Advertisement

Viral Video: కాకి రాలేదని ఆందోళన.. చివరికి కాకిని కొని తెచ్చి మరీ పిండం తినిపించారు! వీడియో ఇదే..

Hyderabad, Telangana:

 Buying A Crow For Rituals Video Watch: నగరంలోని ఒక వింతైన, నమ్మశక్యం కాని ఘటన చోటుచేసుకుంది.. సాధారణంగా ఎవరైనా మరణించినప్పుడు వారి ఆత్మకు శాంతి కలగాలని.. పితృదేవతల ఆశీస్సులు ఉండాలని హిందూ సాంప్రదాయం ప్రకారం 11 రోజు లేదా పెద్దకర్మ రోజున పిండ ప్రదానం చేయడం ఆనవాయితీ.. ఆ పిండాన్ని కాకులు వచ్చి ముడితే.. మరణించిన వారి ఆత్మ శాంతించిందని.. వారి కోరికలు లేకుండా వెళ్లాలని కుటుంబ సభ్యులు భావిస్తారు. అయితే తాజాగా హైదరాబాద్ లోని ఓ కుటుంబంలో జరిగిన కార్యక్రమంలో కాకులు పిండాన్ని ముట్టుకోకపోవడంతో చోటు చేసుకున్న పరిణామాలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ వస్తున్నాయి. ఈ ఘటన చూసిన వారంతా ఒక్కసారిగా షాక్ అయిపోతున్నారు. అసలు ఏం జరుగుంటుంది? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.

వివరాల్లోకి వెళ్తే.. ఇటీవల ఒక కుటుంబంలో పెద్ద మరణించడంతో నగర శివారులోని ఒక ప్రాంతంలో దహన సంస్కారాలు అనంతరం కార్యక్రమాలను నిర్వహించారు. సాంప్రదాయం ప్రకారం పిండాన్ని ఆరు బయట ఉంచి.. కాకుల కోసం కుటుంబ సభ్యులందరూ భక్తితో వేసి చూసారు. గంటలు గడుస్తున్న ఒక్క కాకి కూడా ఆ దరిదాపుల్లోకి రాకపోవడంతో ఆ కుటుంబంలో ఆందోళన మొదలైనట్లు సమాచారం.. పిండం ముట్టకపోతే ఏదో కీడు జరుగుతుందని భావించిన వారు తీవ్ర ఆవేదనకు లోనయ్యారు..

కాకులు రాకపోవడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆ కుటుంబ సభ్యులు ఒక వింత నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎలాగైనా పిండాన్ని కాకితో తినిపించాలని నిశ్చయించుకున్న వారు.. నగరంలోని పక్షులను విక్రయించే వారిని సంప్రదించి ఏకంగా ఒక కాకిని కొనుగోలు చేసి అక్కడికి తీసుకువచ్చారట.. ఆ కాకిని పిండం వద్దకు తీసుకెళ్లి.. అది ఆహారాన్ని ముట్టేలా చేశారు. ఆ తర్వాతే వారు ఊపిరి పీల్చుకున్నారని సమాచారం. అంతేకాకుండా దీనికి సంబంధించిన దృశ్యాలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

 
 
 
 
 

ఈ మొత్తం వ్యవహారాన్ని అక్కడ ఉన్న ఎవరో మొబైల్‌లో చిత్రీకరించి.. సోషల్ మీడియాలో వదిలారు.. అంతే అది కాస్త వైరల్ అవ్వడం ప్రారంభించింది. ఇది చూసిన వినియోగదారులు వారి అభిప్రాయాలను కామెంట్లు చేస్తూ వస్తున్నారు. పూర్వీకుల పట్ల ఉన్న భక్తి, గౌరవం వల్లే వారు అలా చేశారని కొందరు కామెంట్లు రాస్తుంటే.. మరికొందరైతే దెయ్యం రాకపోతే దెయ్యాన్ని కొంటారా అని కామెంట్లు పెడుతున్నారు. ఇక మరి కొంతమంది కాకిని విక్రయించిన వారి కొత్త బిజినెస్ చాలా బాగుంది అని కామెంట్లు చేస్తూ వస్తున్నారు. ఏది ఏమైనా ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో మాత్రం విపరీతంగా వైరల్ అవుతుంది.

Also Read: Child Acid Drink: తోటి కోడళ్ల పంచాయితీ.. బాలుడితో యాసిడ్‌ తాగించిన తోటి కోడలు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

  

0
0
Report

Cobra Video: నిద్రపోతున్న వ్యక్తి టీషర్టులోకి దూరిన నాగుపాము.. వైరల్ వీడియో..

Hyderabad, Telangana:

 Cobra Inside T-Shirt Video Watch Now: ఊహించని ప్రమాదం ఎదురైనప్పుడు గుండె ధైర్యం ప్రదర్శిస్తేనే మృత్యు నోటి నుంచి బయటపడవచ్చు అని ఈ ఘటన నిరూపించింది. నిద్రలో ఉన్న వ్యక్తి టీ షర్టులోని ఏకంగా ఒక విషపూరితమైన నాగుపాము దూరిన ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ఆ వ్యక్తి ఎంతో చాకచక్యంగా ఉండి ఇతరులకు సమాచారం అందించాడు. దీంతో స్నేక్ క్యాచర్ బృందం అక్కడికి చేరుకొని.. రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. ఇప్పుడు ఈ దృశ్యాలు అందరినీ ఆశ్చర్యపోయేలా చేస్తున్నాయి..

వివరాల్లోకి వెళితే.. ఒక వ్యక్తి ఖాళీ ప్రదేశంలో నిద్రిస్తున్న సమయంలో ఎక్కడి నుంచో వచ్చిందో ఏమో కానీ ఒక అత్యంత ప్రమాదకరమైన నాగుపాము మెల్లగా అతని టీ షర్టులోకి దూరిపోయింది. అతను నిద్ర లేచిన తర్వాత తన టీ షర్టు లోపల ఏదో కదులుతున్నట్లు గమనించాడు. అది తీరా చూస్తే సామాన్యమైన పాము కాదని తేలింది.. అత్యంత ప్రమాదకరమైన నాగుపామని.. ఆ సమయంలో అతను ఏమాత్రం భయాందోళన చెందకుండా నెమ్మదిగా అలానే పడుకుండిపోయి ఇతరులకు సమాచారం అందించారు.

పరిస్థితి తీవ్రత అర్థం చేసుకున్న ఆ వ్యక్తి వదలకుండా అలాగే ఉండిపోయి శ్వాస తీసుకోవడం కూడా కష్టమైనప్పటికీ.. ప్రాణ భయంతో నిశ్చలంగా ఉంటూ చుట్టుపక్కల వారికి సైగలతో సమాచారం అందించాడు. వెంటనే స్థానికులు అప్రమత్తమై స్నేక్ క్యాచర్ కు ఫోన్ చేసి.. ఘటన స్థలాన్ని వివరించారు. దీంతో అతను అక్కడికి చేరుకున్నాడు. ఆ వ్యక్తి చేరుకునేంతవరకు టీ షర్టులో పాము దూరిన వ్యక్తి అలాగే కదలకుండా నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ ఉండిపోయాడు.

 
 
 
 
 

స్నేక్ క్యాచర్ ఎంతో చాకచక్యంగా వ్యవహరిస్తూ.. పాముకు కోపం రాకుండా చాలా జాగ్రత్తగా ఆ వ్యక్తి ధరించిన టీ షర్టును కత్తెరతో కట్ చేశాడు. నెమ్మదిగా టీ షర్టును విడదీయగా.. లోపల కుదురుగా కూర్చున్న నాగుపాము బయటకు వచ్చింది. స్నేక్ క్యాచర్ దానిని సురక్షితంగా పట్టుకొని ఒక ప్లాస్టిక్ డబ్బాలో బంధించాడు. బంధించి అక్కడి నుంచి తరలించి ఖాళీ ప్రదేశంలో వదిలిపెట్టినట్లు తెలుస్తోంది. అయితే అక్కడే ఉన్న కొంతమంది స్థానికులు ఈ ఘటనను చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతే ఇది కాస్త వైరల్‌గా మారుతూ వచ్చింది..

Also Read: Child Acid Drink: తోటి కోడళ్ల పంచాయితీ.. బాలుడితో యాసిడ్‌ తాగించిన తోటి కోడలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

  

0
0
Report

Kavitha TRS Party: కేసీఆర్‌కు కవిత మరో మాస్టర్ స్ట్రోక్? అదే జరిగితే బీఆర్ఎస్ పార్టీ కోలుకోవడం కష్టమే!

Hyderabad, Telangana:

Kavitha TRS Party Symbol: తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు మరో పార్టీ అవతరించింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన కొత్త రాజకీయ పార్టీని నేడు (ఏప్రిల్ 25)న ప్రకటించారు. 'తెలంగాణ రాష్ట్ర సేన' అనే పేరును పార్టీకి పెట్టడం..అది కాస్త కేసీఆర్ స్థాపించిన తెలంగాణ రాష్ట్ర సమితి పేరు కలిసేలా టీఆర్ఎస్ అని ఉచ్ఛరించేలా ఉండడం తెలంగాణ ప్రజల్లో సెంటిమెంట్ పండుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 

అయితే కవిత రాజకీయ పార్టీ కారణంగా పరోక్షంగా ప్రస్తుతం భారత రాష్ట్ర సమితి పార్టీకి పెద్ద తలనొప్పిగా మారుతుందని అభిప్రాయపడుతున్నారు. తెలంగాణ పేరును తీసేసిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ భారీ నష్టాన్ని చవిచూసిన సంగతి తెలిసిందే. అధికారం నుంచి కూడా దూరమైన పరిస్థితి ఏర్పడింది. అయితే ఇప్పుడు తెలంగాణ సెంటిమెంట్‌ను మరోసారి బయటకు తీసే విధంగా తెలంగాణ రాష్ట్ర సేన అంటూ కవిత తన కొత్త పార్టీ పెట్టిన తీరు.. తన తండ్రి రాజకీయ పార్టీని డ్యామేజ్ చేసేందుకు పన్నిన వ్యూహంగా కొందరు పోలుస్తున్నారు. 

టీఆర్ఎస్ అని కలిసొచ్చేలా పార్టీ పేరు పెట్టిన కవిత.. ఇప్పుడు మరోసారి కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు‌ గుండెల్లో టెన్షన్ మొదలయ్యేలా చేసింది. కొత్తగా అవతరించిన టీఆర్ఎస్ పార్టీకి ఏ ఎన్నికల గుర్తు కేటాయిస్తారనే దానిపై ఇప్పుడు తెలంగాణలో పెద్ద హాట్ టాపిక్‌గా మారింది. గతంలో కారును పోలిన ఎన్నికల గుర్తులతో ఎంతో మంది పోటీగా చేయగా.. అది బీఆర్ఎస్ పార్టీకి పెద్ద నష్టాన్ని తెచ్చిపెట్టాయి. ఇప్పుడు కవిత కొత్త పార్టీకి కూడా పేరుతో పాటు కారును పోలిన ఎన్నికల గుర్తును కేటాయిస్తే మొదటికే మోసం జరుగుతుందని అంతా అనుకుంటున్నారు. 

తెలంగాణ రాష్ట్ర ఉద్యమం నాటి నుంచి ప్రజల్లో టీఆర్ఎస్ అనే పేరు బాగా ప్రచారంలో ఉంది. ఇప్పుడు అదే పేరుతో కవిత తన కొత్త పార్టీని ప్రకటించడం పెద్ద హాట్ టాపిక్‌గా మారింది. టీఆర్ఎస్ పార్టీతో ముఖ్యమంత్రి అయిన కేసీఆర్.. ఆ తర్వాత జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు వీలుగా భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా మార్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఇప్పుడు అదే తెలంగాణ సెంటిమెంట్‌ను వినియోగించుకొని ప్రజల్లో ఉధృతంగా తమ పార్టీని ప్రచారం చేయాలని నిర్ణయంతో టీఆర్ఎస్ పేరు వచ్చేలా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఒకవేళ తెలంగాణ సెంటిమెంట్ మరోసారి పండితే టీఆర్ఎస్ పార్టీ కొద్ది నెలల్లోనే విపరీతమైన ప్రాచుర్యం పొందే అవకాశం ఉంది. బీఆర్ఎస్ ఓటు బ్యాంకుతో పాటు కీలక నాయకులను తన పార్టీలోకి లాక్కునేందుకు ఇదొక చర్యగా భావిస్తున్నారు. 

టీఆర్ఎస్ అనే పేరు గురించి ప్రస్తావిస్తూనే ఇప్పుడు ఆ పార్టీ ఎన్నికల గుర్తుపై తెగ చర్చ జరుగుతోంది. కేంద్ర ఎన్నికల కమీషన్‌కి టీఆర్ఎస్ పార్టీకి ఏ గుర్తు కేటాయిస్తుందో అని అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీకి చెందిన కారు గుర్తును పోలిన రోడ్డు రోలర్, చపాతీ రోలర్, కెమెరా, షిప్ వంటి ఎన్నికల గుర్తులు కేటాయిస్తే, బీఆర్ఎస్‌కు మరో ఎదురుదెబ్బ తగిలినట్టే. ఎన్నికల సమయంలో ఈవీఎం మెషీన్లపై పైన చెప్పిన గుర్తులన్నీ కారును పోలినట్లు కనిపిస్తున్నాయి. వయసు పైబడిన వారు వృద్ధులు ఆయా గుర్తులను గుర్తించడంలో పొరపాటు అవ్వొచ్చు. దీంతో పాటు బీఆర్ఎస్ నుంచి టీఆర్ఎస్‌కు ఓట్లు చీలే అవకాశం కచ్చితంగా కనిపిస్తుంది. ఎన్నికల్లో స్వల్ప ఓట్లతో ఓడిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అదే జరిగితే కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీకి పెద్ద దెబ్బగా మారనుంది. 

Also Read: Thai Funeral Dance: శవం ముందు పాపలతో అశ్లీల డ్యాన్స్‌లు..ఏడుపు ఆపి అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తున్న ఫ్యామిలీ..

Also Read: IPL Slapgate Ad: చెంపదెబ్బ వీడియోతో రూ.కోటి సంపాదన..హర్బజన్‌పై శ్రీశాంత్ ఆరోపణ..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement

Vemulawada: నాణ్యత లేని పనులు.. అదుపులేని అవినీతి.. వేములవాడ అభివృద్ధిపై చల్మెడ ధ్వజం..

Karimnagar, Telangana:

Chalmeda Lakshmi Narasimha Rao Latest News: రాజన్న క్షేత్రం వేములవాడలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై బిఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు నిప్పులు చెరిగారు. శనివారం స్థానిక విలేకరులతో నిర్వహించిన చిట్‌చాట్‌లో ఆయన పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గంలో సాగుతున్న పాలనతో పాటు ఆలయ అభివృద్ధి పేరుతో జరుగుతున్న జాప్యం, అధికారుల తీరుపై ఆయన సూటిగా విమర్శలు గుప్పించారు. 

వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి కేవలం కాగితాలకే పరిమితమైందని.. క్షేత్రస్థాయిలో భక్తులకు ఒరిగేదేమీ లేదని చల్మెడ మండిపడ్డారు. ముఖ్యంగా ఆలయానికి భక్తులు సమర్పించే కోడల రక్షణ విషయంలో ప్రభుత్వంతో పాటు యంత్రాంగం పూర్తిగా విఫలమయ్యాయని ధ్వజమెత్తరు.. కోడెలకు రక్షణ లేకుండా పోయిందని.. గడ్డి కొనుగోలులో పెద్ద ఎత్తున స్కామ్ జరుగుతోందని.. తరచుగా కోడెలకు ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ పట్టించుకునే నాధులే కరువయ్యారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

అభివృద్ధి పనులను తాను ఎన్నడూ అడ్డుకోనని.. అయితే అభివృద్ధి పేరుతో ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తే ఊరుకోబోమని చల్మెడ స్పష్టం చేశారు.. వారు ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే మాట్లాడుతున్నారని.. నిర్మాణాల్లో కనీస నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదని.. అభివృద్ధి జరగాలి కానీ అందులో అవినీతికి తావు ఉండకూడదని  ఆయన అన్నారు. జిల్లా కలెక్టర్ టిఆర్ఎస్ నేతలను భయభ్రాంతులకు గురి చేసేలా వ్యవహరించడం సరికాదని ఆయన హితవు పలికారు.

నాయకుల్లో నిజాయితీతో పాటు దమ్ముంటే అధికారులు తప్పులు చేసే ధైర్యం చేయలేరని వ్యాఖ్యానించారు. తన కార్యకర్తలకు నాయకులకు, ఎల్లప్పుడూ అండగా ఉంటానని బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.. వేములవాడలో జరుగుతున్న ప్రతి అక్రమానికి సంబంధించిన సాక్షాలు తన వద్ద ఉన్నాయని.. అతి త్వరలోనే వాటిని బహిర్గతం చేస్తామని చెల్మెడ హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో జర్నలిస్టుల పాత్ర కీలకమని, ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ వాస్తవాలను నిర్భయంగా రాయాలని కోరారు. అలాగే జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి.. వారి సంక్షేమానికి తాను ఎల్లప్పుడూ తోడ్పాటు అందిస్తానని ఆయన హామీ ఇచ్చారు.

Also Read: Child Acid Drink: తోటి కోడళ్ల పంచాయితీ.. బాలుడితో యాసిడ్‌ తాగించిన తోటి కోడలు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report

Renu Desai Health: "ఆ టైమ్‌లో నేను చావు అంచులదాకా వెళ్లాను" పవన్ మాజీ భార్య రేణూ దేశాయ్ సంచలన వ్యాఖ్యలు..

Hyderabad, Telangana:

Renu Desai Health Condition: టాలీవుడ్ నటి రేణు దేశాయ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తెలుగులో అతి తక్కువ చిత్రాల్లో నటించినా.. ఆమెను పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పెళ్లాడిన తర్వాత లక్షలాది మంది ఫాలోవర్స్‌ను దక్కించుకున్నారు. ఆ తర్వాత పవన్‌తో విడాకులైనా ఆమెకు అంతే గుర్తింపు ఇండస్ట్రీలో కొనసాగుతోంది. ఇటీవల చిత్ర పరిశ్రమలోకి తిరిగి ఎంట్రీ ఇచ్చిన రేణూ దేశాయ్.. ప్రస్తుతం తన నటనకు పూర్తి అవకాశం ఇచ్చే పాత్రలను ఎంచుకుంటున్నారు. సినిమాలతో పాటు సమాజంలో జరిగే కొన్ని అంశాలపై రేణూ దేశాయ్ తన గళాన్ని వినిపిస్తారు. 

సోషల్ మీడియా వేదికగా ఎన్నో సామాజిక సంఘటనలపై రేణూ దేశాయ్ స్పందిస్తూ.. అవసరమైనప్పుడు తన అసంతృప్తిగా గట్టిగా వినిపిస్తుంది. అంతేకాకుండా, తన గురించి లేదా తన కుటుంబం గురించి ప్రతికూల వ్యాఖ్యలు చేసే వారికి తనదైన ప్రత్యేక శైలిలో ఘాటైన సమాధానాలు ఇవ్వడంలో రేణు దేశాయ్ ముందుంటారు.ఇటీవల, రేణు దేశాయ్ ఒక ప్రైవేట్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.

తన వ్యక్తిగత గోప్యతను కాపాడుకోవడం రోజురోజుకీ మరింత కష్టంగా మారిందని నటి రేణూ దేశాయ్ ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అంతేకాకుండా నటి రేణు దేశాయ్ తన ఆరోగ్య సమస్యల గురించి కూడా నిష్కపటంగా మాట్లాడారు. ఇటీవల తాను బరువు పెరగడానికి గల కారణాలను వివరించి అందర్ని ఆశ్చర్యపరిచారు. గుండె సంబంధిత వ్యాధికి చికిత్స నిమిత్తం తాను బీటా-బ్లాకర్స్ అనే మందులు వాడాల్సి వచ్చిందని రేణు దేశాయ్ వెల్లడించారు. ఈ మందుల వల్ల బరువు పెరగడంతో పాటు శరీర జీవక్రియ కూడా మందగిస్తుందని నటి రేణు దేశాయ్ వివరించారు. ఒక వైద్య అత్యవసర పరిస్థితిలో ఈ మందులు తీసుకోవడం తప్ప తనకు మరో మార్గం లేదని, ఆ సమయంలో తనకు వేరే ప్రత్యామ్నాయం లేదని నటి రేణు దేశాయ్ స్పష్టం చేశారు.

బీటా-బ్లాకర్స్ వాడకం వల్ల కలిగే దుష్ప్రభావం కారణంగా తాను గణనీయంగా బరువు పెరిగానని నటి రేణూ దేశాయ్ చెప్పారు. ఆ సమయంలో ఆమె ఇచ్చిన అనేక ఇంటర్వ్యూలలో, నటి రేణు దేశాయ్ బరువు పెరగడం స్పష్టంగా కనిపించింది. తాను తొలుత సహజ వైద్య విధానాలను ఎంచుకున్నట్లు చెప్పగా.. కానీ ఆ తర్వాత శస్త్రచికిత్స చేయించుకున్నానని నటి రేణు దేశాయ్ వివరించారు. ఈ విధానాలు తన ఆరోగ్యంపై గణనీయమైన ప్రభావం చూపినప్పటికీ, తాను ఇప్పుడు కోలుకుంటున్నందున మందులను కొనసాగించాల్సి వచ్చిందని ఆమె అన్నారు. 

నటి రేణు దేశాయ్ అపెండెక్టమీ గురించి మాట్లాడుతూ.. తాను కూడా అపెండిక్స్ సమస్యతో బాధపడ్డానని ఈ ఇంటర్వ్యూలో తెలిపారు. అపెండిక్స్ తొలగించడానికి చేసిన అత్యవసర శస్త్రచికిత్స సమయంలో తాను పడిన బాధ గురించి కూడా నటి రేణుకా దేశాయ్ వెల్లడించారు. వైద్యులు కొన్ని గంటలు ఆలస్యం చేసి ఉంటే, నటి రేణు దేశాయ్ ప్రాణాలు కోల్పోయి ఉండేవారని ఆమె ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ సమయంలో తనకు తీవ్రమైన శారీరక నొప్పి మొదలైందని, అకస్మాత్తుగా కుప్పకూలిపోయానని నటి రేణు దేశాయ్ గుర్తుచేసుకున్నారు. 

నటి రేణు దేశాయ్ హీరో, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ఉప-ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాజీ భార్య కూడా. ఈమె సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉంటారు. నటి రేణు దేశాయ్ తరచుగా తన జీవితం గురించి అప్‌డేట్‌లను ఇస్తుంటారు. గతంలో వెండితెరపై మెరిసిన నటి రేణు దేశాయ్, ఇప్పుడు చాలా ఏళ్ల తర్వాత రవితేజ హీరోగా నటించిన 'టైగర్ నాగేశ్వరరావు' వెండితెరపై కనిపించారు.

Also Read: Thai Funeral Dance: శవం ముందు పాపలతో అశ్లీల డ్యాన్స్‌లు..ఏడుపు ఆపి అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తున్న ఫ్యామిలీ..

Also Read: IPL Slapgate Ad: చెంపదెబ్బ వీడియోతో రూ.కోటి సంపాదన..హర్బజన్‌పై శ్రీశాంత్ ఆరోపణ..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Thai Funeral Dance: శవం ముందు పాపలతో అశ్లీల డ్యాన్స్‌లు..ఏడుపు ఆపి అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తున్న ఫ్యామిలీ..

Nong Chaeng Sub-district, Phetchabun:

Thailand Funeral Dance: ఎక్కడైనా చావు ఇంట్లో విషాధ ఛాయలు, ఏడుపులు, పరామర్శలు ఉండడం సహజం. కానీ, ఇప్పుడు తాజాగా ఓ విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి మరణం తర్వాత తన మృతదేహం ముందే ఐటెం సాంగ్స్‌తో అశ్లీల నృత్యాలను ఏర్పాటు చేసింది అతని కుటుంబం. ముగ్గురు అమ్మాయిలు అశ్లీలంగా డ్యాన్స్ చేస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడం వల్ల ఇప్పుడా ఘటన గురించి బయటకొచ్చింది. 

అయితే ఈ సంఘటన జరిగింది భారతదేశంలో కాదు. థాయ్‌లాండ్‌లోని ఒక బౌద్ధ ఆలయంలో అంత్యక్రియల సందర్భంగా 'కోయోట్ డాన్సర్స్' నృత్యం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ కుటుంబం శోకసంద్రంలో ఉంటుందని ఊహించి అక్కడికి వెళ్లిన వారికి నిర్ఘాంతపోయే ఘటన ఎదురైంది. కుటుంబ సభ్యులు దుఃఖించకుండా ఎందుకు సంబరాలు చేసుకుందో తొలుత అర్థం కాలేదు. ఆ తర్వాత నిజం తెలుసుకోని ఆశ్చర్యానికి లోనవ్వడం వారి వంతు అయ్యింది.

మరణం అనే మాట వినగానే కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి, గుండెల్లో దుఃఖం నిండిపోతుంది. కానీ, వైరల్‌గా మారిన ఈ అశ్లీల డ్యాన్స్ వీడియో చూడగానే అందర్ని షాక్‌లోకి నెట్టివేస్తుంది. థాయ్‌లాండ్‌కు చెందిన ఒక కుటుంబం తమ కుటుంబ సభ్యుడు మరణం తర్వాత
ప్రియమైన వారికి కన్నీళ్లతో కాకుండా, 'కొయెట్ డాన్సర్స్' డ్యాన్స్‌లతో అతనికి అంత్యక్రియలు జరిపారు. ఒక ఆలయంలో శవపేటిక ముందు ప్రదర్శించిన ఈ నృత్యం, ఆన్‌లైన్‌లో చర్చనీయాంశంగా మారింది.

థాయ్‌లాండ్‌లోని నఖోన్ సి థమ్మరత్ ప్రావిన్స్‌లో ఒక దిగ్భ్రాంతికరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. రోన్ ఫిబున్ జిల్లాలో ఉన్న వాట్ తెప్పనోమ్ చుయట్ అనే బౌద్ధ ఆలయంలో మంగళవారం ఈ వింత జరిగింది. 59 ఏళ్ల వ్యక్తి అంత్యక్రియల సందర్భంగా, అతని కుటుంబం ముగ్గురు "కొయెట్ డాన్సర్లను" (పొట్టి దుస్తులు ధరించే నృత్యకారులు) నియమించుకుంది. ఈ నృత్యకారులు మృతుని శవపేటికకు సరిగ్గా ఎదురుగా ప్రదర్శన ఇచ్చారు.

అతని చివరి కోరిక ఏమిటంటే?
సోషల్ మీడియాలో ఆ వీడియోపై విమర్శలు వెల్లువెత్తడంతో, మృతుడి బంధువులు అసలు కారణాన్ని వెల్లడించారు. కుటుంబ సభ్యుల ప్రకారం.. మరణించిన వ్యక్తి చాలా ఉల్లాసంగా, సంతోషంగా ఉండేవాడు. తన మరణానికి ముందు, తన అంత్యక్రియలప్పుడు ఎవరూ ఏడవకూడదని అతను కోరుకున్నాడు. ప్రజలు దుఃఖించడం కంటే తన జీవితాన్ని వేడుకగా జరుపుకోవాలని అతను ఆకాంక్షించాడు. ఈ కోరికను నెరవేర్చడానికి, కుటుంబ సభ్యులు ఆ విషాద సమయంలో ఒక నృత్య కార్యక్రమాన్ని నిర్వహించారట.

బ్యాంకాక్ పోస్ట్‌లోని నివేదికల ప్రకారం.. బౌద్ధ సన్యాసులు తమ చివరి ప్రార్థనలు, మంత్రాలు పూర్తి చేసిన తర్వాత ఈ సంఘటన జరిగింది. సన్యాసులు వెళ్ళిపోయిన వెంటనే, ముగ్గురు మహిళా నృత్యకారులు శవపేటిక ముందు తాము ముందుగా సిద్ధం చేసుకున్న నృత్యాన్ని ప్రారంభించారు. అన్ని వయసుల వారు ఆ ప్రదేశంలో గుమిగూడి, జరుగుతున్న ఈ దృశ్యాన్ని వీక్షించారు. అంతేకాకుండా, ఈ మొత్తం కార్యక్రమాన్ని సోషల్ మీడియాలో ప్రత్యక్ష ప్రసారం చేశారు.

మరణించిన వ్యక్తి ఏప్రిల్ 15న కన్నుమూశారు. చివరి సందేశంలో తన మరణం జీవితంలో అనివార్యమైన భాగమని, దానిని హుందాగా స్వీకరించాలని ఆయన రాసుకొచ్చాడు. ఈ తత్వాన్ని అనుసరించి, ఆయన కుటుంబం దుఃఖాన్ని ఆనందంగా మార్చుకోవడానికి ప్రయత్నించింది. అయితే, దేవాలయం వంటి పవిత్ర స్థలంలో ఇలాంటి ప్రదర్శన థాయ్ సంస్కృతి, మత విశ్వాసాలలో చర్చనీయాంశంగా మారింది.

Also Read: IPL Slapgate Ad: చెంపదెబ్బ వీడియోతో రూ.కోటి సంపాదన..హర్బజన్‌పై శ్రీశాంత్ ఆరోపణ..

Also Read: MLC Anantha Babu Arrest: వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు అరెస్టు..డ్రైవర్ హత్య కేసులో అదుపులోకి తీసుకున్న పోలీసులు!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement

IPL Slapgate Ad: చెంపదెబ్బ వీడియోతో రూ.కోటి సంపాదన..హర్బజన్‌పై శ్రీశాంత్ ఆరోపణ..

Hyderabad, Telangana:

IPL Slapgate Harbhajan Singh Sreesanth: ఇప్పుడు ఎక్కడ చూసిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) హవా నడుస్తోంది. ఒకవైపు అదిరిపోయే థ్రిల్లింగ్ టీ20 మ్యాచ్‌లు జరుగుతుండగా.. ఇప్పుడు గత ఐపీఎల్ అనుభవాలను పోడ్‌కాస్ట్‌లలో పంచుకుంటూ మాజీ క్రికెటర్లు వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవలే ఐపీఎల్ వ్యవవస్థాపకుడు లలిత్ మోడీ కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకోగా.. ఆ క్రమంలో ఐపీఎల్ చరిత్రలో చెరిగిపోని సంఘటనగా హర్భజన్, శ్రీశాంత్ మధ్య జరిగిన ఘటన తాలూకా వీడియోను తాజాగా బయటపెట్టారు. ఇప్పుడు అదే విషయంపై మాజీ క్రికెటర్ శ్రీశాంత్ కూడా స్పందించాడు. ఐపీఎల్ స్లాప్‌గేట్ (చెంపదెబ్బ సంఘటన) ద్వారా హర్భజన్ సింగ్ దాదాపు రూ.1 కోటి సంపాదించారని శ్రీశాంత్ ఆరోపించారు. 

ఐపీఎల్ ఆరంభ సీజన్ 2008లో ఈ చెంపదెబ్బ ఘటన జరిగిన సంగతి తెలిసిందే. అప్పట్లో తెగ వైరల్ అయిన ఈ టాపిక్ మరోసారి ఇప్పుడు వార్తల్లో నిలిచింది. ఐపీఎల్‌లో ఓ మ్యాచ్ తర్వాత కరచాలనం చేసుకుంటున్న క్రమంలో అప్పట్లో ముంబై ఇండియన్స్ (MI) తరఫున ప్రాతినిధ్యం వహించిన హర్భజన్, శ్రీశాంత్‌ను (కింగ్స్ XI పంజాబ్, ఇప్పుడు పంజాబ్ కింగ్స్) చెంపదెబ్బ కొట్టాడు. దీంతో శ్రీశాంత్ మైదానంలోనే వెక్కివెక్కి ఏడవగా, హర్భజన్ ఆ తర్వాత బీసీసీఐ నుంచి క్రమశిక్షణ చర్యల్లో భాగంగా తీవ్ర పరిణామాలను ఎదుర్కొన్నాడు. 'టర్బనేటర్' అని పిలవబడే అతనిపై ఆ సీజన్‌లోని మిగిలిన మ్యాచ్‌లన్నింటికీ నిషేధం విధించారు. అతని పూర్తి మ్యాచ్ ఫీజును కూడా తగ్గించారు.

ఇప్పుడు మలయాళ వార్తా సంస్థ అయిన మాతృభూమికి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో శ్రీశాంత్ మరోసారి ఈ విషయంపై స్పందించారు. "నేను ఏ ఇంటర్వ్యూలోనూ భజ్జీ గురించి ఎప్పుడూ మాట్లాడలేదు. ఇదే మొదటిసారి" అని శ్రీశాంత్ అన్నారు.

"ఆ ఘటనపై ఇప్పటి వరకు ఎలాంటి సమస్యలు లేవు, కానీ ఇదే సంఘటనపై అతను మరోసారి ఒక యాడ్ చేశాడు. దాని ద్వారా అతను సుమారు రూ.80 లక్షల నుంచి రూ.1 కోటి వరకు సంపాదించాడు. ఆ తర్వాత అతను నాకు ఫోన్ చేసి, దీనిపై ఒక కథనం రాయమని అడిగాడు. నేను అతనితో.. "నేను క్షమిస్తాను కానీ ఎప్పటికీ మర్చిపోను" అని చెప్పాను. ఎవరైనా మీకు అన్యాయం చేస్తే, మీరు వారిని క్షమించాలి కానీ ఎప్పటికీ మర్చిపోకూడదు. మీరు మర్చిపోతే, వారు మళ్లీ అదే పని చేస్తారు. దానికి అతనే అతిపెద్ద ఉదాహరణ. దానిలో ఎలాంటి సందేహం లేదు" అని శ్రీశాంత్ చెప్పుకొచ్చాడు.

అయితే ఇప్పటికీ హర్భజన్ సింగ్‌తో ఇప్పటి వరకు ఎలాంటి సంబంధం లేదని..ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా తాను భజ్జీని బ్లాక్ చేసినట్లు శ్రీశాంత్ చెప్పుకొచ్చాడు. విచిత్రంగా వీరిద్దరూ కలిసి టీమ్ఇండియా తరఫున రెండుసార్లు ప్రపంచకప్ విజేతగా నిలిచిన జట్లలో (2007 టీ20 ప్రపంచ కప్, 2011 వన్డే ప్రపంచ కప్) సభ్యులుగా ఉండడం విశేషం.

క్షమించాలి కానీ మర్చిపోకూడదని తన తల్లిదండ్రులు నేర్పినట్లు మాజీ క్రికెటర్ శ్రీశాంత్ చెప్పుకొచ్చాడు. హర్భజన్‌పై తనకు ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదు లేదని.. అలాగే అతనితో తనకు ఎలాంటి అవసరం లేదని శ్రీశాంత్ చెప్పాడు. గతంలో ఓ ఇంటర్వ్యూలో హర్భజన్ తన కుమార్తె గురించి మంచిగా మాట్లాడాడు అని శ్రీశాంత్ అన్నాడు. అయితే కేవలం ఓ నటన మాత్రమే అని చెప్పాడు. అదంతా యాక్టింగ్‌లో భాగమని మాజీ క్రికెటర్ కుండ బద్ధలు కొట్టాడు. 

ఐపీఎల్ ఇంకా ప్రారంభ దశలో ఉన్నప్పుడు 'ఐపీఎల్ స్లాప్‌గేట్'గా ఈ చెంపదెబ్బ సంఘటనను అభివర్ణించారు. అయితే గతేడాది ఐపీఎల్ వ్యవస్థాపకుడు లలిత్ మోడీ, హర్భజన్ శ్రీశాంత్‌ను నేలపై చెంపదెబ్బ కొడుతున్న అన్‌సీన్ వీడియోను సోషల్ మీడియాలో పంచుకోవడంతో ఇది మరోసారి వార్తల్లో నిలిచింది. ఆ తర్వాత ఆ మాజీ క్రికెటర్లు ఇద్దరూ బహిరంగంగా ముందుకు వచ్చి లలిత్ మోడీపై విమర్శలు గుప్పించారు. కానీ తమ మధ్య అంతా సవ్యంగానే ఉందని స్పష్టం చేశారు.

Also Read: Paytm Payments Bank: పేటియం కస్టమర్లకు బ్యాడ్ న్యూస్..పేమెంట్స్ బ్యాంక్ లైసెన్స్ రద్దు చేసిన ఆర్బీఐ..

Also Read: Mumbai Indians Downfall: ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ పతనం మొదలు..5 సార్లు విజేత ప్రదర్శన ఇదా? అంబానీ ఫ్యామిలీ చేసిన తప్పు అదే!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Snake Video: నాగస్వరం ఊదుతుండగా మెరుపు వేగంతో దాడి చేసిన నాగుపాము!

Hyderabad, Telangana:

 Snake Catcher Bitten Viral Video Watch: సాధారణంగా పాములు పట్టే వారు ఎంతో అప్రమత్తంగా ఉంటూ ఉంటారు.. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్న ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుందని వారికి తెలుసే.. కానీ కొన్ని సందర్భాల్లో వాటి కాటు బారిన పడాల్సి వస్తుంది. తాజాగా అలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది. అత్యంత ప్రమాదకరమైన నాకు పాముకు సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. కేవలం కొద్ది సెకండ్ల వ్యవధిలోనే జరిగిన ఈ ఘటన ఇప్పుడు ఇంటర్నేషనల్ షేక్ చేస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..

వైరల్ అవుతున్న వీడియో వివరాల్లోకి వెళ్తే.. ఒక వ్యక్తి పామును పట్టుకోవడానికి.. దానిని తన వసంతం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు మీరు చూడొచ్చు. అతను ఒక చెట్టు సమీపంలో నిలబడి నాదస్వరం ఊదుతూ పాముని ఆకర్షించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అయితే ఆ చెట్టు కొమ్మల మధ్య ఉన్న భారీ నాగుపాము ఆ సౌండ్‌కి అటు ఇటు ఆడటం మీరు గమనించవచ్చు. అయితే ఈ సమయంలో అతను ట్యూన్ మార్చడంతో శబ్దానికి కోపం వచ్చి అతనిపై మెరుపు వేగంతో దాడి చేసింది..

ఆ వ్యక్తి చెట్టుకు చాలా దగ్గరగా ఉండటంతో.. పాము నేరుగా వచ్చి అతని చేతిపై కాటు వేసింది. ఈ ఊహించని దాడితో సదరు వ్యక్తి ఒక్కసారిగా షాక్కు గురైనట్లు తెలుస్తోంది. పాము కాటు వేయడంతోనే తీవ్రభయాందోళనకు గురై.. ఆ వ్యక్తి తన చేతిలో ఉన్న నాగస్వరాన్ని పక్కనే ఉంచి అక్కడి నుంచి పరుగులు పెట్టడం మీరు ఈ వీడియోలో స్పష్టంగా చూడొచ్చు. ఆ పాము ఎంత విషపూరితమైనదో చూస్తేనే అర్థమయిపోతుంది కదా..

 
 
 
 
 

ఈ వీడియోను చూసిన సోషల్ మీడియా వినియోగదారులు రకరకాలుగా స్పందిస్తూ వస్తున్నారు.. వన్యప్రాణులతో ఇలాంటి ప్రయోగాలు ప్రాణాల మీదికి తెస్తాయని కొంతమంది కామెంట్స్ చేస్తుంటే.. మరి కొంతమంది పాములు పట్టేటప్పుడు కనీస జాగ్రత్తలు పాటించాల్సిందని.. కామెంట్లు చేస్తూ వస్తున్నారు. ఈ ఘటన ఎక్కడ జరిగిందనే విషయంపై ఇంకా స్పష్టత కూడా రాలేదు. వీడియో మాత్రం అన్ని సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతూ వస్తోంది.

Also Read: Child Acid Drink: తోటి కోడళ్ల పంచాయితీ.. బాలుడితో యాసిడ్‌ తాగించిన తోటి కోడలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

  

0
0
Report

Shani Dev: శనివారం ఆవనూనె ఇలా చేస్తే.. మీ కష్టాలన్నీ పటాపంచలు!

Hyderabad, Telangana:

Shani Dev Saturday Remedies: నవగ్రహాల్లో శని గ్రహా నికి ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ముఖ్యంగా శని దేవుడిని న్యాయాధిపతిగా పిలుస్తారు. అంటే మనం చేసే పనులను బట్టి ఫలితాలను ఇచ్చే దేవుడిగా భావిస్తారు. సాధారణంగా శని ప్రభావం వల్ల కలిగే ఇబ్బందుల పట్ల ప్రజల్లో భయం ఉంటుంది. అయితే శని దేవుని ప్రసన్నం చేసుకోవడం అంత కష్టమేమీ కాదని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ముఖ్యంగా శనివారం రోజు కొన్ని ప్రత్యేకమైన నియమాలు పాటించడం వల్ల అష్టైశ్వర్యాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ఏలినాటి శని ప్రభావం కూడా చాలా వరకు తగ్గే ఛాన్సులు కూడా ఉన్నాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం సాయంత్రం ఒక పని చేయడం వల్ల శనిదేవుడి అనుగ్రహం లభిస్తుందట.. ఎలాంటి పని చేయడం వల్ల ఆయన అనుగ్రహం లభిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..

శని దేవుడికి అత్యంత ప్రీతికరమైనది ఆవనూనె.. శని సాయంత్రం వేళలో ఆవనూనెతో దీపం వెలిగించడం వల్ల జాతకంలోని శని దోషాలు తొలగిపోతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. శనివారం సూర్యాస్తమయం తర్వాత రావి చెట్టు కింద ఆవనూనెతో దీపం వెలిగించడం వల్ల అనేక రకాల ఆర్థిక ఇబ్బందుల నుంచి విముక్తి కలుగుతుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ముఖ్యంగా ఏలినాటి శని సమస్యతో బాధపడుతున్న ప్రతి ఒక్కరి తప్పకుండా ఈ పని చేయాలని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. సాధ్యమైతే నల్లటి వత్తులను ఉపయోగించడం మంచిదని.. దీనివల్ల త్వరగా శని అనుగ్రహం లభిస్తుందని సమాచారం..

ఒక గిన్నెలో ఆవనూనెను తీసుకొని.. అందులో మీ ప్రతిబింబాన్ని చూసుకున్న తర్వాత ఆవను నేను దానం చేయడం వల్ల అనారోగ్య సమస్యలు పూర్తిగా నయం అవుతాయట.. అయితే శనివారం సాయంత్రం వేళలో కేవలం దీపాలు వెలిగించడమే కాకుండా కొన్ని రకాల పనులు చేయడం వల్ల కూడా అదృష్టం పూర్తిగా మారిపోయే అవకాశాలున్నాయి.. ముఖ్యంగా సాయంత్రం వేళలో దీపం వెలిగించిన తర్వాత తప్పకుండా కొన్ని రకాల పనులు చేయడం మర్చిపోవద్దని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా శని దేవుడు పేదల పక్షపాతి . కాబట్టి శనివారం రోజు సాయంత్రం దీపం వెలిగించిన తర్వాత తప్పకుండా నల్లటి వస్త్రాలతో పాటు గొడుగు, ఆహారాలను దానం చేయడం వల్ల పుణ్యఫలం ఎంతగానో లభిస్తుంది.

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

శని దోషాల తీవ్రత తగ్గాలంటే తప్పకుండా హనుమంతుడిని పూజించడం చాలా మంచిది. శనివారం ఆంజనేయస్వామి ఆలయాన్ని సందర్శించి హనుమాన్ చాలీసాను పాటించడం వల్ల మానసిక ప్రశాంతత కూడా చేకూరుతుందని జ్యోతిష్యుడు చెబుతున్నారు. శనివారం రోజు కొత్త ఇనుప వస్తువులను కొనుగోలు చేయకూడదని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా దీనికి బదులుగా మీరు గతంలో కొన్న ఇనుప వస్తువులను దానం చేయడం చాలా శుభప్రదం.. శని దేవుడిని ఆరాధించేటప్పుడు భయంతో కాకుండా భక్తితో సేవించడం చాలా మంచిది. ముఖ్యంగా ఈరోజు మద్యంతో పాటు మాంసాహారం వంటి ఆహారాలకు దూరంగా ఉండడం శ్రేయస్కరం. క్రమశిక్షణతో కూడిన జీవితం, సత్యాలు పలకడం ద్వారా శని దేవుడి అనుగ్రహం ఎల్లప్పుడూ మీపై ఉంటుంది..

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report
Advertisement

Kavitha Party: హైదరాబాద్‌లో భారీ ఏర్పాట్లు.. రేపే కవిత రాజకీయ పార్టీ ఆవిర్భావం

Munirabad, Telangana:

Kavitha Political Party: తెలంగాణలో దాదాపు రెండు దశాబ్దాల పాటు సొంత కుటుంబంతో కలిసి రాజకీయం చేసిన మాజీ ఎమ్మెల్సీ కవిత రేపటి నుంచి సరికొత్త రాజకీయం చేయనున్నారు. సొంత తండ్రి కేసీఆర్, సోదరుడు కేటీఆర్‌తోపాటు కల్వకుంట్ల కుటుంబంతో తీవ్ర విభేదాలు ఏర్పడి.. అనంతరం బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి బహిష్కరణకు గురయిన కవిత సొంత దారి చూసుకున్నారు. ఈ క్రమంలో రేపు కొత్త రాజకీయ పార్టీని ఆమె స్థాపించనున్నారు. పార్టీ ఆవిర్భావ కార్యక్రమానికి హైదరాబాద్‌లోని ఓ అత్యంత ఖరీదైన కన్వెన్షన్‌ సెంటర్‌లో భారీ ఏర్పాట్లు జరిగాయి. కవిత పార్టీకి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

పార్టీ ప్రకటన సభకు హైదరాబాద్‌లో అట్టహాసంగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. పార్టీ ప్రకటన సభకు ప్రొఫెసర్ జయశంకర్ సార్ ప్రాంగణంగా నామకరణం చేయగా.. సర్వాంగ సుందరంగా ఏర్పాట్లు జరిగాయి. 33 జిల్లాల నుంచి దాదాపు 50 వేల మంది తరలివస్తారని తెలుస్తోంది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మునీరాబాద్‌లోని అద్వయ కన్వెన్షన్‌లో కవిత పార్టీ ఆవిర్భావ కార్యక్రమం జరగనుంది. రెండు దశాబ్దాల కిందట తెలంగాణ స్వరాష్ట్ర సాధన ఉద్యమంలో సాంస్కృతిక విప్లవానికి అండగా తెలంగాణ జాగృతి ఏర్పడింది. 20 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇప్పుడు సరికొత్త రాజకీయ జీవితం ప్రారంభిస్తున్నారు. 

కవిత షెడ్యూల్‌..
శనివారం ఉదయం 7.30 గంటలకు కవిత బంజారాహిల్స్‌లోని తన నివాసం నుంచి ర్యాలీగా అమరవీరుల స్తూపానికి పయనం
ఉదయం 8.15 గంటలకు అమరవీరుల స్తూపం వద్ద నివాళి
ఉదయం 8.25 గంటలకు అమరవీరుల స్తూపం వద్ద నుంచి సభకు పయనం
ఉదయం 9.30 గంటలకు మేడ్చల్ జిల్లా మునీరాబాద్ లోని అద్వయ కన్వెన్షన్ హాల్ మెయిన్ గేట్ వద్దకు రాక
ఉదయం 10 గంటలకు పార్టీ జెండా ఆవిష్కరణ
ఉదయం 10.05 గంటల ప్రసంగం ప్రారంభం

సభ ప్రాంగణం పేరు : ప్రొఫెసర్ జయశంకర్ సార్ సభా ప్రాంగణం
ప్రధాన ద్వారం : ప్రజాకవి కాళోజీ నారాయణ రావు ద్వారం
ఇతర ద్వారాల పేర్లు :రాణి రుద్రమ దేవి ద్వారం
మారోజు వీరన్న ద్వారం
చాకలి ఐలమ్మ ద్వారం

పార్టీ ఆవిర్భావం సందర్భంగా ఏర్పాటుచేసిన భోజనశాలల పేర్లు:
సురవరం ప్రతాపరెడ్డి భోజనశాల
సమ్మక్క సారలమ్ భోజనశాల 
షోయబుల్లా ఖాన్ (మీడియా) భోజనశాల

34 వంటకాలతో తెలంగాణ రుచులు
కొత్త పార్టీ ప్రకటన సందర్భంగా నిర్వహిస్తున్న కార్యక్రమంలో పెద్ద ఎత్తున భోజనాలు ఏర్పాటుచేశారు. మధ్యాహ్న భోజనం కోసం 34 రకాల వంటకాలను సిద్ధం చేశారు

నాన్ వెజ్
తలకాయ కూర, బోటీ ఫ్రై, తెలంగాణ మటన్ కర్రీ, నాటు కోడి పులుసు, బొమ్మిడాయల పులుసు, హైదరాబాదీ చికెన్ దమ్ బిర్యానీ, మిర్చి కా సాలాన్, ఎగ్ ఇగురు
శాకాహారం,
బగరా బైంగన్ మసాలా కర్రీ, కందగడ్డ ఫ్రై, పాలకూర, మామిడి పప్పు, ఆలూ టామాటా, చామగడ్డ పులుసు, కట్ చారు

తెలంగాణ ప్రత్యేక వంటకాలు: మక్క గారెలు, జొన్న రొట్టె, సర్వపిండి, బూరెలు, అరిసెలు 

బగరా రైస్, వైట్ రైస్, సాంబర్, రోటి పచ్చడి, దోస, ఆవకాయ, మిర్చి బజ్జి, పచ్చి పులుసు, పాపడ్, పెరుగు, రైతా
వేసవి సందర్భంగా మజ్జిగ, రాగి అంబలి 
మిఠాయిలు: బటర్‌స్కాచ్ ఐస్‌క్రీమ్, షాహి తుక్‌డా, జిలేబీ

0
0
Report
Advertisement
Advertisement
Back to top