ముంపు బాధితులను ఆడుకోవాలని కాంట్రాక్టర్ కు ఆదేశం
Bellampalle, Telangana:మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం కాల్ టెక్స్ ఏరియాలో రెండు రోజుల క్రితం వరద నీటిలో ఇళ్లు మునిగిపోయిన బాధితులను ఆదుకోవాలని మునిసిపల్ ఛైర్పర్సన్ జక్కుల శ్వేత, కమిషనర్ శ్రీనివాస రావు సంబంధిత రైల్వే కాంట్రాక్టర్ ను ఆదేశించారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల వరద నీరు వచ్చి ఇళ్లు నీళ్లల్లో మునిగిపోయాయ్నారు. బాధితులకు నష్టపరిహారం అందించాలన్నారు.हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
Huawei: ఏప్రిల్ 20న ఎంట్రీ.. కిరిన్ 9030 ప్రాసెసర్తో Huawei Pura 90 Pro Max.. బాహుబలి ఫీచర్లు!
Hyderabad, Telangana:Huawei Pura 90 Pro Max Leaks Telugu News: స్మార్ట్ఫోన్ ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉన్న హువావే అతి త్వరలోనే మరో కొత్త మొబైల్ను విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.. దీనిని కంపెనీ పురా 90 సిరీస్తో విడుదల చేసి సంచలనం సృష్టించేందుకు సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి.. చైనాకు చెందిన ప్రముఖ టిప్స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ ఈ వివరాలను స్వయంగా తన సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేశారు.. ఈ స్మార్ట్ఫోన్ అద్భుతమైన బ్యాటరీ లైఫ్తో పాటు ఎన్నో రకాల కెమెరా ఫీచర్లతో విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది.. ముఖ్యంగా ఇది చూడడానికి ఎంతో ప్రత్యేకమైన డిజైన్లు కలిగి ఉండే అవకాశాలు ఉన్నట్లు లీకైన ఫోటోలు చెబుతున్నాయి. అయితే, ఈ మొబైల్కు సంబంధించిన అన్ని రకాల వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.
లీకైన వివరాల ప్రకారం.. ఈ స్మార్ట్ఫోన్ సిరీస్లో ఎంతో శక్తివంతమైన 6500mAh భారీ బ్యాటరీని కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా బేస్ మోడల్స్లో 6000mAh భారీ బ్యాటరీ ఉండే అవకాశాలున్నాయి. ప్రో మోడల్స్లో మాత్రం అద్భుతమైన ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో పాటు చాలా రకాల కొత్త కొత్త ఫీచర్లు అందుబాటులోకి రాబోతున్నట్లు సమాచారం ముఖ్యంగా వైర్లెస్ చార్జింగ్ టెక్నాలజీని మరింత మెరుగుపరుస్తూ ఈ స్మార్ట్ఫోన్స్ను తయారు చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
ఈ స్మార్ట్ఫోన్లో ఎంతో శక్తివంతమైన 200 మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ కెమెరా ఉండబోతోంది. అంతేకాకుండా అదనంగా 40MP అల్ట్రా వైడ్ కెమెరాతో పాటు 50MP ప్రధాన కెమెరాను కూడా కలిగి ఉంటుంది. ఇందులోని అల్ట్రా వైడ్ లైన్స్ 4k వీడియో సపోర్టింగ్ను కూడా కలిగి ఉంటుంది తక్కువ కాంతిలో ఎక్కువ క్వాలిటీ ఫోటోలను అందించేందుకు ఎంతగానో సహాయపడుతుంది ముఖ్యంగా ఇందులో వివిధ రకాల కెమెరా మోడ్లు కూడా ఉన్నట్లు సమాచారం. దీనివల్ల కావలసినప్పుడల్లా మోడ్స్ మార్చుకొని.. ఫోటోలను దిగొచ్చు.
Read more: Cheap Luxury Cars: కేవలం రూ. 15 లక్షలకే BMW.. ఆడి కారు రూ. 7.50 లక్షలే.. ఎక్కడో తెలుసా?
పురా 90 ప్రో మాక్స్ స్మార్ట్ఫోన్ చాలా ప్రత్యేకమైన 6.87-అంగుళాల 1.5K రిజల్యూషన్ కలిగిన OLED డిస్ప్లేతో విడుదల కాబోతోంది.. ఇది 120Hz రిఫ్రెష్ రేట్ను సపోర్ట్ చేస్తుందని కంపెనీ లీక్ అయిన వివరాలు చెబుతున్నాయి.. హువావే సొంతంగా అభివృద్ధి చేసిన కిరిన్ 9030 (Kirin 9030) ప్రాసెసర్తో ఈ ఫోన్ పనిచేస్తుందని వార్తలు వస్తున్నాయి. ఈ మొబైల్ను కంపెనీ 16gb ర్యామ్తో విడుదల చేయబోతోంది. ఇది వివిధ స్టోరేజ్ ఆప్షన్స్లో అందుబాటులో ఉంటుంది. అలాగే స్టోరేజ్ వేరియంటును బట్టి ధర కూడా నిర్ణయిస్తారని టెక్ నిపుణులు భావిస్తున్నారు..
ఈ స్మార్ట్ఫోన్ను హువావే కంపెనీ ఏప్రిల్ 20వ తేదీన చైనాలో అధికారికంగా విడుదల చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అక్కడ విడుదల చేసిన తర్వాతే అంతర్జాతీయ మార్కెట్లో అందుబాటులోకి తీసుకురావాలని కంపెనీ యోచిస్తుందట. అంతేకాకుండా ఈ మొబైల్ విడుదలయితే వివిధ ప్రీమియం బ్రాండ్లతో కూడిన స్మార్ట్ఫోన్స్తో ఈ మొబైల్ సిరీస్ పోటీ పడే అవకాశాలున్నాయి. అయితే, అతి త్వరలోనే కంపెనీ ఈ స్మార్ట్ఫోన్స్కి సంబంధించిన ఫీచర్స్ను అధికారికంగా వెల్లడించబోతోంది.
Read more: Cheap Luxury Cars: కేవలం రూ. 15 లక్షలకే BMW.. ఆడి కారు రూ. 7.50 లక్షలే.. ఎక్కడో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
YS Jagan On Pawan Kalyan: స్వరం మార్చిన వైసీపీ అధినేత..జగన్ నోట డిప్యూటీ సీఎం మాట..వైఎస్ జగన్ ఎమోషనల్ ట్వీట్!
Vijayawada, Andhra Pradesh:YS Jagan On Pawan Kalyan Health: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి తాజాగా సర్జరీ అయిన సంగతి తెలిసిందే. ఇటీవలే పవన్ కళ్యాణ్ అస్వస్థతకు గురైన నేపథ్యంలో ఆయన్ని హుటాహుటిన హైదరాబాద్లో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత సర్జరీ అవసరమని వైద్యులు సూచించడంతో వెంటనే సర్జరీ చేశారు. అయితే ఇదే విషయమై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత జగన్ సోషల్ మీడియాలో స్పందించారు. పవన్ కళ్యాణ్ ఆరోగ్యం పూర్తిగా మెరుగవ్వాలని వారు ఆశించారు.
అయితే వైసీపీ అధినేత జగన్ స్పందించిన తీరు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేరుగానీ, ఆయన పార్టీ గురించి ప్రస్తావించేందుకు ఇష్టపడలేదు. పవన్ కళ్యాణ్ని గతంలో జగన్ దత్తపుత్రుడు అంటూ పరోక్షంగా సంభోధించేవారు. అధికారంలో ఉన్న అన్ని రోజులు పవన్ కళ్యాణ్ గురించి ప్రస్తావించేందుకు ఇష్టపడని జగన్.. ఇప్పుడు స్పెషల్గా పవన్ కళ్యాణ్ను ఆయన పేరుతో జగన్ ట్వీట్లో ప్రస్తావించడంతో ఇప్పుడు ఇరు పార్టీల నేతలు ఆశ్చర్యానికి గురవుతున్నారు.
Wishing @PawanKalyan Garu a speedy and complete recovery following his surgery. Get well soon!
— YS Jagan Mohan Reddy (@ysjagan) April 19, 2026
2024 ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్కు అభినందనలు తెలిపేందుకు వైఎస్ జగన్ ఇష్టపడలేదు. కానీ, ఇప్పుడు ఈ ఘటన మరింత చర్చ మారింది. కూటమిలో ఉన్న పార్టీలు బలంగా ఉండడంతో రానురాను అధికారానికి దూరమైపోతామేమో అని అటు వైసీపీ నేతలు కూడా అంతర్గతంగా చర్చించుకుంటున్నారు.
అయితే ఇలాంటి పరిస్థితుల్లో కూటమిని విడగొట్టాలని వైసీపీ గతంలో ఎన్నో ప్రయత్నాలు చేసిన సంగతి తెలిసిందే. ఇలాంటి రాజకీయ ప్రణాళికల్లో భాగంగా జనసేనకు దగ్గరైతే బాగుంటుందని ఎప్పటి నుంచో వైసీపీ సీనియర్ నేతలు చెబుతున్న సత్యమిది. తాజాగా జరిగిన పరిణామాలతో జనసేతతో కయ్యం కంటే వియ్యం బెటర్ అని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ ను వ్యక్తిగతంగా ఎన్నో విమర్శలు చేసిన వైసీపీ పార్టీ.. ఇప్పుడు డిప్యూటీ సీఎం పేరు ఎత్తేందుకు కొంత ఆలోచిస్తున్న మాట వాస్తవమే. ఇప్పుడు అధికారం కోల్పయిన తర్వాత పవన్ కళ్యాణ్ను వ్యక్తిగతంగా విమర్శించడం మానేసి.. సానుకూలంగా ఉంటే కనీసం వైసీపీ పార్టీపై నెగెటివిటీ తగ్గుతుందని వైసీపీ నేతలు భావిస్తున్నట్లు సమాచారం. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ ఆరోగ్యం బాగుపడాలని వైసీపీ అధినేత చేసిన ట్వీట్పై ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో తెగ చర్చ జరుగుతోంది.
Spoke to Andhra Pradesh Deputy Chief Minister Shri Pawan Kalyan Garu and enquired about his well-being. He is remarkably courageous and I am sure he will recover very soon. Praying for his good health.@PawanKalyan
— Narendra Modi (@narendramodi) April 19, 2026
డిప్యూటీ సీఎంకు ప్రధాని మోదీ సందేశం..
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు జరిగిన సర్జరీపై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. ఇదే విషయమై మోదీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు ఫోన్లో మాట్లాడినట్లు మోదీ ట్వీట్లో స్పష్టం చేశారు. పవన్ యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నట్లు మోదీ తెలిపారు. పవన్ లాంటి ధైర్యవంతులు, త్వరగా కోలుకుంటారనే నమ్మకం తనకు ఉన్నట్లు మోదీ చెప్పుకొచ్చారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరోగ్యం మెరుగుపడాలని కోరుకుంటున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Vivo X300 FE: 90W ఫాస్ట్ ఛార్జింగ్, 6500mAh బ్యాటరీ.. Vivo నుంచి పవర్ ప్యాక్డ్ స్మార్ట్ఫోన్!
Hyderabad, Telangana:Vivo X300 FE Price Cut: ప్రముఖ స్మార్ట్ఫోన్ దిగ్గజం వివో మరో పవర్ఫుల్ ఫ్లాగ్ షిప్ స్మార్ట్ఫోన్ భారత్ మార్కెట్లోకి విడుదల చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. దీనిని కంపెనీ వివో x300 Fe పేరుతో లాంచ్ చెయ్యబోతోంది. ఈ స్మార్ట్ఫోన్ అద్భుతమైన కెమెరా సామర్థ్యంతో పాటు భారీ బ్యాటరీ ప్యాకప్తో Tech ప్రియులను ఆకర్షించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా ఈ మొబైల్ ప్రధాన ఆకర్షణగా కెమెరా ఉండబోతోంది. ఎందుకంటే ఇది మోస్ట్ పవర్ఫుల్ కెమెరా సెటప్తో విడుదల కాబోతున్నట్లు లీకైన వివరాలు చెబుతున్నాయి. అయితే, ఈ స్మార్ట్ఫోన్ ఎలాంటి ఫీచర్లతో అందుబాటులోకి వస్తుందో? ప్రస్తుతం ఈ మొబైల్కు సంబంధించిన లీక్ అయిన వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
వివో x300 Fe స్మార్ట్ఫోన్ ప్రధాన ఆకర్షణ దీని బ్యాటరీ కొన్ని లీకైన వివరాలు చెబుతున్నాయి. దీనిని కంపెనీ ఎంతో శక్తివంతమైన 6500mAh బ్యాటరీతో లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. ఇది అద్భుతమైన బ్యాటరీని చార్జ్ చేసేందుకు ప్రత్యేకమైన 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు కూడా లభిస్తుంది. అయితే, ఈ సదుపాయం ఉండడం వల్ల తక్కువ సమయంలోనే ఫోన్ పూర్తిగా చార్జ్ అవుతుంది. ఈ బ్యాటరీ దాదాపు రెండు రోజుల వరకు ప్లే బ్యాక్ను అందిస్తుందని కంపెనీ క్లైమ్ చేయబోతున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి..
ఇక ఈ మొబైల్ ప్రత్యేకత ఏంటంటే.. దీని బ్యాక్ కెమెరా.. ఈ వివో x300 Fe స్మార్ట్ఫోన్ వెనుక భాగంలో త్రిపుల్ కెమెరా సెటప్ని కలిగి ఉంటుంది. చూడడానికి చాలా ఆకర్షణీయంగా కెమెరా మాడ్యూయల్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఇది ఎంతో ప్రత్యేకమైన 50MP ప్రధాన కెమెరాను కలిగి ఉండబోతోంది. అలాగే దీనికి తోడు అదనంగా 50MP టెలిఫోటో లెన్స్, 50MP కెమెరాలు ఉండడం విశేషం.. ఫ్రంట్ భాగంలో కూడా చాలా అద్భుతమైన కెమెరా సెటప్ ను కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. వీడియో కాలింగ్ కోసం ఈ కెమెరా ఎంతగానో సహాయపడుతుందట...
Read more: Cheap Luxury Cars: కేవలం రూ. 15 లక్షలకే BMW.. ఆడి కారు రూ. 7.50 లక్షలే.. ఎక్కడో తెలుసా?
ఇక ఈ Vivo X300 FE మొబైల్ చాలా అద్భుతమైన 6.31 అంగుళాల 1.5K OLED డిస్ప్లేను కలిగి ఉంటుంది. దీనితోపాటు 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్టుతో లభిస్తుంది. దీనివల్ల గేమింగ్తో పాటు వీడియోలు చూసేందుకు చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇక ఈ స్మార్ట్ఫోన్ ఎంతో శక్తివంతమైన Qualcomm Snapdragon 8 Gen 5 ప్రాసెసర్ను కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. ఇది మల్టీ టాస్కింగ్ తో పాటు పెద్ద పెద్ద గేమ్స్ ఆడేందుకు ఎంతగానో సహాయపడుతుంది. అయితే, ఈ మొబైల్ భారత మార్కెట్లోకి విడుదలయితే ధర రూ.65,000 నుంచి ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి..
Read more: Cheap Luxury Cars: కేవలం రూ. 15 లక్షలకే BMW.. ఆడి కారు రూ. 7.50 లక్షలే.. ఎక్కడో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
JEE Main Results 2026: రేపే JEE Main సెషన్-2 రిజల్ట్స్! స్కోర్ కార్డ్, డైరెక్ట్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..!
Hyderabad, Telangana:JEE Main Session 2 Results 2026 Out: జేఈఈ మెయిన్స్ పరీక్షలు 11 లక్షల మంది విద్యార్థులు ఈ ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. ఇక సెషన్ 2 బీఈ/ బీటెక్ పేపర్ 1 ఫలితాలు ఆలిండియా ర్యాంక్ తో పాటు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ రేపు విడుదల చేసే అవకాశం ఉంది. ఫలితాలు వెల్లడించిన తర్వాత స్కోర్ కార్డును అధికారిక వెబ్సైటు Jeemain.nta.nic.in లో అప్లికేషన్ నెంబర్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సెషన్ 1 లో 13 లక్షల మంది విద్యార్థులు పరీక్షకు హాజరు అయ్యారు. ఇందులో 12 మంది విద్యార్థులకు 100 శాతం లభించింది
జేఈఈ మెయిన్ సెషన్ 2 స్కోర్ కార్డును డౌన్లోడ్ చేసుకునే విధానం..
అధికారిక వెబ్సైట్ Jeemain.nta.nic.in ఓపెన్ చేసి అందులో జేఈఈ మెయిన్ సెషన్ 2 బీఈ/బీటెక్ పేపర్ 1 ఫలితాలు 2026 ఎంపిక చేసుకోవాలి. అక్కడ మీ అప్లికేషన్ నెంబర్ పాస్వర్డ్ నమోదు చేసి స్కోర్ కార్డును మీ స్క్రీన్ పైన కనిపిస్తుంది. వెంటనే డౌన్లోడ్ చేసుకొని సేవ్ చేసి పెట్టుకోవాలి.
జేఈఈ మెయిన్ పరీక్షలో అర్హత పొందిన అభ్యర్థులు జేఈఈ అడ్వాన్స్ పరీక్షలకు అర్హత సాధిస్తారు. ఇది ఐఐటీ లాంటి ఇన్స్టిట్యూట్లో సీటు పొందడానికి మార్గమని చెప్పొచ్చు. జేఈఈ అడ్వాన్సుడ్ లో మంచి ప్రతిభ చూపించిన అభ్యర్థులకు ఐఐటి, ఎన్ఐటి, IIT ఇనిస్టిట్యూట్లో కౌన్సిలింగ్ ప్రక్రియ మొదలవుతుంది. జేఈఈ అడ్వాన్స్డ్ 2026 ఎగ్జామినేషన్ మే 17, 2026 నిర్వహించే అవకాశం ఉంది. సెషన్ 2 పరీక్ష ఏప్రిల్ 2, 8వ తేదీన కంప్యూటర్ ఆధారితంగా దేశవ్యాప్తంగా 304 సిటీల్లో నిర్వహించారు.
జేఈఈ మెయిన్స్ 2026 స్కోర్ కార్డులో విద్యార్థికి సంబంధించిన పేరు, క్రమ సంఖ్య, తల్లిదండ్రుల వివరాలు, రాష్ట్రం, అర్హత, సబ్జెక్టువారీగా పర్సంటేజ్, మొత్తం మార్కులు, ఆల్ ఇండియా ర్యాంకు క్యాటగిరి ర్యాంకు, క్వాలిఫైయింగ్ స్టేటస్ జేఈఈ అడ్వాన్స్డ్ వివరాలు పొందుపరిచి ఉంటాయి.
Also Read: CISCE Results 2026: త్వరలోనే ICSE, ISC ఫలితాలు.. రిజల్ట్స్ లింక్, స్కోర్కార్డ్ వివరాలు ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
Lord Hanuman: ఆంజనేయుడి పేరెత్తని ఊరు.. స్వామిపై ఆ గ్రామస్తులకు ఎందుకు అంత కోపం?
Hyderabad, Telangana:Lord Hanuman Latest Telugu News: భారతదేశంలో రామాయణం.. రామనామం వినబడని గ్రామం ఉండటం అరుదు.. హనుమంతుడిని ఆరాధించని హిందూ గ్రామం అసలు ఉండదేమో.. కానీ దేవ భూమిగా పిలిచే ఉత్తరాఖండ్లోని చమేలీ జిల్లాలు ఉన్న ద్రోణగిరి అనే గ్రామం ఎందుకు పూర్తిగా భిన్నంగా ఉంటుంది.. అక్కడ హనుమంతుడికి గుడి ఉండదు.. కనీసం ఆయన పేరు మీద జెండాలు కూడా కనిపించవటే నమ్ముతారా? నమ్మాల్సిందే. ఇదంతా దేవుడిపై ద్వేషంతో కాదు.. ఒకనాటి చారిత్రక అవమానం కారణంగా వారు పాటిస్తున్న నిరసన.. అవును మీరు చదివింది నిజమే.. ఆనాడు జరిగిన ఓ సంఘటనకు అవమానానికి సూచికగా ఇదంతా జరుగుతోంది.
పురాణాల ప్రకారం.. రామ రావణ యుద్ధ సమయంలో మేఘనాథుడి అస్రానికి లక్ష్మణుడు మూర్చ పడిపోతాడు. ఆ సమయంలో లక్ష్మణుడి ప్రాణాలను కాపాడటానికి సంజీవని మూలిక అవసరమవుతుంది. ఆ మూలికను తెచ్చే బాధ్యత హనుమంతుడు స్వీకరించడం మనందరికీ తెలిసిందే.. హిమాలయాల్లోని ద్రోణగిరి పర్వతంపై ఆ మూలిక ఉందని తెలుసుకున్న హనుమ.. అక్కడికి చేరుకుంటాడు. అయితే చీకటి పడటంతో ఏది సంజీవని మొక్కో గుర్తుపట్టలేక.. ఏకంగా ఆ పర్వతాన్ని పెకలించుకొని లంకకు తీసుకొని వెళ్ళిపోతాడు.
ద్రోణగిరి గ్రామస్తులు ఆ పర్వతాన్ని తమ గ్రామ దేవతగా.. ఆరాధ్య దైవంగా పూజిస్తారు. హనుమంతుడు ఆ పర్వతాన్ని తీసుకెళ్లే సమయంలో తమ గ్రామ దేవత అనుమతి తీసుకోలేదు.. ఇది తమ దేవతను అవమానించడమేనని స్థానికులు నమ్ముతారు. తమ ఆరాధ్య దైవమైన కొండలు కొంత భాగాన్ని హనుమంతుడు అపహరించుకుపోయాడనేది వారి ప్రధాన ఆవేదన. తమ పూర్వికుల నుంచి వస్తున్న నమ్మకం ప్రకారం.. హనుమంతుడు వారి కొండను ముక్కలు చేసి తీసుకెళ్లడం వల్ల గ్రామదేవత అపవిత్రమైందని.. అందుకే వారు ఆయనను పూజించారని స్థానిక గ్రామస్తులు చెబుతున్నారు..
ఈ గ్రామంలో నేటికీ శ్రీరాముని పూజిస్తారు కానీ.. హనుమంతుడి ప్రస్తావన అస్సలు రాదట.. రామ లీల ఉత్సవాలు నిర్వహించిన హనుమంతుడి పాత్ర ప్రదర్శించారట.. విషయం ఏమిటంటే వేట నిర్వహించే గ్రామ ఉత్సవాల్లో హనుమంతుడికి పూజలు చేసిన మహిళలను కూడా కుల బహిష్కరణ చేస్తామని వారి పెద్దలు హెచ్చరిస్తారట.. ప్రస్తుతం అంతకఠిన నిబంధనలు లేకపోయినా.. ఇప్పటికీ గ్రామంలో ఎవ్వరు హనుమంతుని విగ్రహాన్ని ప్రతిష్టించారు. భక్తితో కూడిన ఒక వింత నిరసనగా ఈ సాంప్రదాయం చరిత్రలో నిలిచిపోయింది..
Also Read: చాట్ జీపీటీ వాడకంలో ఆ నగరమే ఫస్ట్.. హైదరాబాద్ ప్లేస్ ఎక్కడ? ఆసక్తికరంగా OpenAI లేటెస్ట్ రిపోర్ట్!
Hyderabad Police: హైదరాబాద్లో ‘ఆపరేషన్ సేఫ్ స్కూల్'.. 558 షాపులపై పోలీస్ రైడ్
Hyderabad, Telangana:Police Special Raid: తరగతి గదిలో విద్యా బుద్ధులు నేర్చుకునే విద్యార్థులు.. విద్యాలయం బయటకు వచ్చాక ఆరు బయట కూడా బుద్ధిగా ఉండేలా హైదరాబాద్ పోలీసులు ప్రత్యేక ఆపరేషన్ చేశారు. విద్యాలయాలు సురక్షిత ప్రాంతాలుగా తీర్చిదిద్దేందుకు పోలీసులు దాడులు చేశారు. దేశానికి వెన్నెముకగా ఉన్న భావితరం చెడుదారి పట్టకుండా.. అడ్డదారులు తొక్కకుండా హైదరాబాద్ పోలీసులు ప్రత్యేక తనిఖీలు చేశారు. పలు ప్రాంతాల్లో 558 దుకాణాల్లో తనిఖీలు చేపట్టారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
భావితరాల ఉజ్వల భవిష్యత్తును చిదిమేస్తున్న డ్రగ్స్ మహమ్మారిని అంతమొందించడమే లక్ష్యంగా హైదరాబాద్ సిటీ పోలీస్ విభాగం ఆపరేషన్ సేఫ్ స్కూల్ పేరుతో శనివారం భారీ స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. స్కూళ్లు, కళాశాలల పరిసరాలను వ్యసనరహితంగా తీర్చిదిద్ది.. చిన్నారులు పెడదోవ పట్టకుండా చూడాలనే సంకల్పంతో హైదరాబాద్ పోలీస్ ప్రత్యేక సోదాలు చేపట్టింది. విద్యాసంస్థల సమీపంలో లభించే పొగాకు ఉత్పత్తులతో విద్యార్థులు క్రమంగా ఆల్కహాల్, డ్రగ్స్ వంటి వ్యసనాలకు బానిసలయ్యే ప్రమాదం ఉందని పోలీస్ శాఖ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ అలవాట్లు చివరకు వారిని చిన్నపాటి నేరాల నుంచి తీవ్రమైన నేరాల వైపు పురికొల్పి.. వారి బంగారు భవిష్యత్తును అంధకారం చేస్తున్నాయని పోలీస్ శాఖ గుర్తించింది. ఈ విషవలయాన్ని ప్రాథమిక దశలోనే తుంచివేసేందుకు పోలీసులు ఆపరేషన్ సేఫ్ స్కూల్ తనిఖీలు చేపట్టారు.
సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తుల చట్టం 2003 సెక్షన్ 6 (బీ) ప్రకారం విద్యాసంస్థలకు 100 గజాల లోపు పొగాకు విక్రయాలు పూర్తిగా నిషిద్ధమని దుకాణా నిర్వాహకులకు తెలిపారు. మైనర్లకు పొగాకు ఉత్పత్తులను విక్రయించడం జువైనల్ జస్టిస్ యాక్ట్ సెక్షన్ 77 ప్రకారం శిక్షార్హమైన నేరం. ఈ చట్టాల అమలును పక్కాగా పర్యవేక్షిస్తూ, నిబంధనలు ఉల్లంఘించినట్లు పలు దుకాణాలను పోలీసులు గుర్తించారు. దీంతో ఏకకాలంలో దాడులు నిర్వహించి కేసులు నమోదు చేశారు.
పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ శనివారం సుమారు 5 వేల మంది సిబ్బంది విద్యా సంస్థల సమీపంలో పొగాకు ఉత్పత్తులను విక్రయిస్తున్న 558 దుకాణాల్లో ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్లోని చిరాగ్ అలీ లేన్, రెడ్ హిల్స్, మెహదీపట్నం, మల్లెపల్లి ప్రియా టాకీస్ జంక్షన్, గోశామహాల్ వంటి రద్దీ ప్రాంతాల్లోని విద్యాసంస్థల సమీపంలో ఉన్న దుకాణాలను పోలీసులు స్వయంగా తనిఖీ చేశారు. ఈ డ్రైవ్ లో టాస్క్ ఫోర్స్, స్పెషల్ టీమ్స్, హెచ్-న్యూ, రిజర్వ్, లా అండ్ ఆర్డర్ పోలీసులు పాల్గొని తనిఖీలు చేపట్టారు. నిబంధనలు అతిక్రమించి విద్యాసంస్థల సమీపంలో సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తులు విక్రయిస్తున్న నిర్వాహకులపై చట్టప్రకారం కేసులు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు.
'మైనర్లకు పొగాకు ఉత్పత్తులు విక్రయిస్తూ వారి భవిష్యత్తుతో ఆడుకునే వారిపై ఉక్కుపాదం మోపుతాం. పాఠశాలలు, కళాశాలల సమీపంలో ఇలాంటి విక్రయాలకు పాల్పడే వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు' అని కమిషనర్ సజ్జనార్ స్పష్టం చేశారు. ఇలాంటివి పునరావృతం కాకుండా క్షేత్రస్థాయిలో నిరంతర నిఘా ఉంచేందుకు వీలుగా ‘హెచ్-న్యూ’ విభాగంలో ఒక ప్రత్యేక అధికారిని నియమిస్తున్నట్లు వెల్లడించారు.
SRH vs CSK: సన్రైజర్స్ హైదరాబాద్ అద్భుతం.. ఉప్పల్ స్టేడియంలో చెన్నై చిత్తు
Hyderabad, Telangana:Uppal Stadium: ఓటముల నుంచి కోలుకున్న చెన్నై సూపర్ కింగ్స్ అనంతరం వరుసగా రెండు విజయాలతో జోష్ మీదుండగా.. సన్రైజర్స్ హైదరాబాద్ బ్రేక్ ఇచ్చింది. ఉత్కంఠగా జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ ఆల్రౌండ్ ప్రదర్శన కనబర్చి మ్యాచ్ను సొంతం చేసుకుంది. విజయానికి అవకాశం మెండుగా ఉన్నా కూడా బౌలర్లు కొంత తడబడడంతో ఆఖరి ఓవర్లో విజయం వరించింది. 10 పరుగుల తేడాతో సన్రైజర్స్ మ్యాచ్ గెలిచింది. ఈ ఓటమితో చెన్నై హ్యాట్రిక్ విజయావకాశాలను కోల్పోయింది.
PM Modi Apology: 'భారత మహిళల్లారా నన్ను క్షమించండి': ప్రధాని నరేంద్ర మోదీ
New Delhi, Delhi:PM Narendra Modi Apology: మహిళా రిజర్వేషన్లను అడ్డుకున్న విపక్షాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రంగా తప్పుబట్టారు. మహిళా బిల్లు వీగిపోవడంతో మహిళా లోకానికి ప్రధాని మోదీ బహిరంగ క్షమాపణ చెప్పారు. మహిళా రిజర్వేషన్లను అడ్డుకునేందుకు విపక్షాలు ఎలా ప్రవర్తించాయో దేశం మొత్తం చూసింది. బిల్లును వ్యతిరేకించి విపక్షాలు తప్పు చేశాయి. ఈ సందర్భంగా మహిళలకు క్షమాపణ చెబుతున్నా' అని ప్రధాని తెలిపారు. మహిళా రిజర్వేషన్ల కోసం తాము చిత్తశుద్ధితో కట్టుబడి ఉన్నామని.. భారత నారీమణుల కలలను నాశనం చేశారు’ అని మండిపడ్డారు.
Also Read: PM Address To Nation Live: మహిళా రిజర్వేషన్ వీగిపోవడంపై క్షమాపణలు చెప్పిన ప్రధానమంత్రి
'దేశం మొత్తం మహిళా రిజర్వేషన్ బిల్లును ఎలా అడ్డగించారో చూస్తోంది. బిల్లు వీగిపోవడంపై మహిళామణులందరికీ క్షమాపణ చెబుతున్నా' అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. 'మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకునేందుకు విపక్షాలు ఎలా ప్రయత్నించారో దేశం మొత్తం చూసింది. బిల్లు వ్యతిరేకించి విపక్షాలు తప్పు చేశాయి. మహిళా రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నాం' అని మోదీ తెలిపారు. 'మహిళల స్వప్నాన్ని చిదిమేశారు. మాకు జాతీయ ప్రయోజనాలే ముఖ్యం. కాంగ్రెస్, డీఎంకే, తృణమూల్, ఎస్పీ స్వార్థ రాజకీయాలకు మహిళా లోకం బలైంది. తమకు జరిగిన అన్యాయాన్ని మహిళలు ఎప్పటికీ మరవరు. ఇది భ్రూణహత్యలతో సమానం. మహిళా బిల్లును అడ్డుకుని సంబరాలు చేసుకున్నాయి. బిల్లును అడ్డుకోవడంతో మహిళల ఆత్మాభిమానంపై దాడి చేశారు' అని మోదీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Also Read: Harish Rao: జగిత్యాల సభతో రేవంత్ రెడ్డి పోవాలి.. కేసీఆర్ రావాలి నినాదం మార్మోగుతుంది: హరీశ్ రావు
'బిల్లు వీగిపోవడంతో నేను ఎంతో ఆవేదన చెందా. విపక్షాలు సంబరాలు చేసుకోవడం విడ్డూరంగా ఉంది. దేశంలోని మహిళలను విపక్షాలు అవమానించాయి. మహిళా రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నాం. మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకుని విపక్షాలు పాపం చేశాయి. దానికి తగ్గ ప్రాయశ్చితం అనుభవిస్తాయి' అని ప్రధాని మోదీ ప్రకటించారు. మహిళా బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసిన కాంగ్రెస్, టీఎంసీ, ఎస్పీ, డీఎంకే పార్టీల తీరును ప్రధాని మోదీ తప్పుబట్టారు. ఆ పార్టీలన్నీ మహిళలకు వ్యతిరేకం అని ప్రకటించారు. నారీశక్తి ఎదగకుండా అడ్డుకున్నాయని మండిపడ్డారు. '40 ఏళ్లుగా మహిళలు తమ హక్కుల కోసం పోరాడుతున్నారు. మహిళా రిజర్వేషన్ను అడ్డుకున్న పాపం విపక్షాలను వదిలిపెట్టదు. కొందరికి దేశం కంటే రాజకీయమే ముఖ్యం. విపక్షాలు సంబరాలు చేసుకోవడం విడ్డూరంగా ఉంది. పాపం చేసిన విపక్షాలకు శిక్ష తప్పదు. మహిళలకు రిజర్వేషన్ ఇవ్వడం విపక్షాలకు ఇష్టం లేదు. మహిళా బిల్లును అడ్డుకుని బ్రూణహత్యకు పాల్పడ్డాయి' అని మోదీ చెప్పారు.
'కాంగ్రెస్, డీఎంకే, తృణమూల్, ఎస్పీలు మహిళలను ఎదగనీయరు. రిజర్వేషన్ల కోసం మహిళలు 40 ఏళ్లుగా ఎదరుచూస్తున్నారు. ఎంతో నిజాయితీగా తెచ్చుకున్న బిల్లును అడ్డుకున్నారు. నారీ శక్తిని ఎదగకుండా అడ్డుకున్నారు. అన్ని రాష్ట్రాల సమాన హక్కులకు బిల్లు తీసుకువచ్చాం. ప్రతిసారి కాంగ్రెస్ మహిళా బిల్లును అ్డుకుంది. కాంగ్రెస్ నిజస్వరూపం బయటపడింది. కుటుంబ పార్టీలు భయపడ్డాయి. ప్రాంతీయ పార్టీల భవిష్యత్ను కాంగ్రెస్ పణంగా పెట్టింది. డిలీమిటేషన్ను బూచీగా చూపించి మహిళా రిజర్వేషన్ బిల్లును కాంగ్రెస్ అడ్డుకుంది' అని మోదీ నిప్పులు చెరిగారు.
'మహిళా బిల్లు క్రెడిట్ తీసుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నం చేసింది. దేశ ప్రజలను విభజించి లబ్ధి పొందాలని కాంగ్రెస్ ఆలోచన. బిల్లు ఆమోదం పొందితే మరిన్ని రాష్ట్రాల్లో స్థానాలు పెరిగేవి. డీలిమిటేషన్తో ఏ రాష్ట్రాలకు అన్యాయం జరగదు. సీట్లు పెరిగితే కాంగ్రెస్, తృణమూల్, డీఎంకే, ఎస్పీకి స్థానాలు పెరిగేవి. ఇదే విషయాన్ని పదే పదే చెప్పాం. అయినా విపక్షాలు వినిపించుకోలేదు. కాంగ్రెస్ ఎప్పుడూ సంస్కరణలకు వ్యతిరేకం. ఆధార్, త్రిబుల్ తలాక్, జన్ధన్, తదితర వాటన్నింటినీ కాంగ్రెస్ వ్యతిరేకించింది' అని ప్రధాని మోదీ విమర్శించారు.
పార్లమెంటులో నారీ శక్తి వందన్ను వ్యతిరేకించిన విపక్షాలకు నేను స్పష్టంగా చెబుతున్నా. వీళ్లు మహిళల శక్తిని చాలా తేలికగా తీసుకుంటున్నారు. 21వ శతాబ్దపు మహిళలు దేశంలో జరుగుతున్న ప్రతి పరిణామాన్ని నిశితంగా గమనిస్తున్నారు. మహిళల రిజర్వేషన్ను వ్యతిరేకించిన పాపానికి విపక్షాలు కచ్చితంగా శిక్ష అనుభవిస్తాయి' నరేంద్ర మోదీ
జాతిని ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మొత్తం 28 గంటల 34 నిమిషాలు మాట్లాడారు. పలుమార్లు మహిళల పట్ల భావోద్వేగానికి లోనయ్యారు. ప్రసంగం మొత్తం కాంగ్రెస్, డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్, ఎస్పీలను నిందించారు. వారిని మహిళా లోకం క్షమించదు అని ప్రకటించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Strait Of Hormuz: హార్ముజ్ను మరోసారి క్లోజ్..ప్రపంచదేశాలకు మరోసారి ఇరాన్ వార్నింగ్!
Strait Of Hormuz Closed: హార్ముజ్ జలసంధిని తెరుస్తున్నామని ఇరాన్ చేసిన ప్రకటన 24 గంటలకు ముగియకముందే మరోసారి దాన్ని మూసివేసింది. ఈ చర్యకు అమెరికా ప్రధాన కారణం అని ఇరాన్ అధికార వర్గాలు చెబుతున్నాయి.Telangana RTC Strike: పోరుబాటకు సిద్ధమైన తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు..ఈనెల 22 నుంచి సమ్మె!
Hyderabad, Telangana:Telangana RTC Strike 2026: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ) కార్మికులు మరోసారి సమ్మె బాట పట్టారు. ఈనెల 22 నుంచి సమ్మె చేపట్టనున్నట్లు నోటీసులు ద్వారా ప్రకటించారు.Hormuz Gunfire: యుద్ధంలో బిగ్ ట్విస్ట్..భారత నౌకలపై ఇరాన్ IRGC కాల్పులు..అస్సలు ఏం జరుగుతోంది?
Hormuz Gunfire On India Merchant Ships: హార్ముజ్ జలసంధిని తెరుస్తున్నామని ఇరాన్ చేసిన ప్రకటన 24 గంటలకు ముగియకముందే మరోసారి దాన్ని మూసివేసింది. తాజాగా ఆ జలసంధి నుంచి బయటకు వచ్చేందుకు తాజాగా రెండు భారత వాణిజ్య నౌకలు ప్రయత్నించగా.. దానిపై ఇరాన్కు సంబంధించిన బలగాలు కాల్పులు జరిపాయి. ఇదే విషయాన్ని ధ్రువీకరిస్తూ ఆ దేశ మీడియా స్పష్టం చేసింది. హార్ముజ్ జలసంధిని దాటేందుకు ప్రయత్నించిన రెండు భారత వాణిజ్య నౌకలపై ఇరాన్ IRGC బలగాలు కాల్పులు జరిపినట్లు ఆ దేశ మీడియా వెల్లడించింది.
కాల్పులకు గురైన భారత వాణిజ్య నౌకల్లో ఒక్కో దాంట్లో 20 లక్షల బ్యారెళ్ల ఇరాకీ క్రూడ్ ఆయిల్తో ప్రయాణిస్తున్నట్లు సమాచారం. దీంతో కాల్పుల నేపథ్యంలో రెండు నౌకలు వెనక్కి మళ్లినట్లు సమాచారం. ఈ ఘటనలో ఎలాంటి ప్రమాదం జరగలేదని.. సిబ్బంది అంతా క్షేమంగా ఉన్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.
హర్మూజ్ జలసంధి మార్గం ద్వారా ప్రయాణిస్తున్న ఈ రెండు నౌకలపై ఇరాన్కు చెందిన ఐఆర్జీసీ గన్ బోట్లు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. కాల్పుల నేపథ్యంలో నౌకల్లోని సిబ్బందికి ఎలాంటి ప్రాణాపాయం కలగలేదని.. అందరూ సురక్షితంగా ఉన్నారని మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్ సెంటర్ స్పష్టం చేసింది. అయితే కాల్పుల వల్ల నౌకలకు ఏమైనా నష్టం వాటిల్లిందా అనేది తెలియాల్సి ఉంది.
నిన్నటి రోజున అమెరికాతో కాల్పుల ఒప్పందం ఉన్న కారణంగా ఆ ఒప్పందం ముగిసే వరకు హార్ముజ్ నుంచి ఏ నౌకలైనా వెళ్లొచ్చని ఇరాన్ అనుమతినిచ్చింది. అయితే అది కేవలం కొన్ని గంటల వరకే పరిమితమైంది. అందుకు అమెరికానే పూర్తిగా కారణం అని ఇరాన్ నాయకత్వం చెబుతోంది. ఇరాన్కు చెందిన పోర్టులపై అమెరికా దిగ్బంధం చేయడం పట్ల హార్ముజ్ జలసంధిని తిరిగి మూతపెట్టినట్లు ఇరాన్ స్పష్టం చేసింది. ఈ క్రమంలో అటుగా వెళ్తున్న భారత నౌకలపై కాల్పులు జరిపినట్లు సమాచారం అందుతోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Harish Rao: జగిత్యాల సభతో రేవంత్ రెడ్డి పోవాలి.. కేసీఆర్ రావాలి నినాదం మార్మోగుతుంది: హరీశ్ రావు
Jagtial, Telangana:KCR Jagtial Meeting: 'రాజకీయ విలువలున్న మాజీ మంత్రి జీవన్ రెడ్డి చేరికతో ఉత్తర తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి మరింత బలం. రేవంత్ పోవాలి.. కేసీఆర్ రావాలి అనే నినాదం రాష్ట్రవ్యాప్తంగా మార్మోగుతున్నది' అని మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు. తెలంగాణ ఏర్పాటును పాకిస్తాన్తో పోల్చిన బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య తక్షణమే బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ఆత్మగౌరవాన్ని అవమానిస్తుంటే పార్లమెంటులో 16 మంది కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు నోరుమెదపకపోవడం సిగ్గుచేటు అని మండిపడ్డారు.
Also Read: KCR Success March: జగిత్యాల నుంచే బీఆర్ఎస్ జైత్రయాత్ర ప్రారంభం: కేటీఆర్
ఈనెల 20వ తేదీన తొలి సీఎం కేసీఆర్ బహిరంగ సభ ఏర్పాట్లను జగిత్యాలలో శనివారం పరిశీలించిన అనంతరం జరిగిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడారు. 'రేవంత్ రెడ్డిది హైబ్రిడ్ మోడల్ కాదు.. అది కేంద్రంలోని బీజేపీ పెద్దలతో కుదుర్చుకున్న క్రాస్ బ్రీడ్ బంధం. డీలిమిటేషన్ పేరుతో మహిళా రిజర్వేషన్ల బిల్లును అటకెక్కించి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మహిళలకు తీరని ద్రోహం చేశాయి. బడే భాయ్కి భయపడే ఎంపీ తేజస్వీ వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి స్పందించలేదు' అని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు హరీశ్ రావు మండిపడ్డారు.
Also Read: Chandrababu YS Jagan: మహిళా బిల్లుపై ఇండి కూటమిని తప్పుబట్టిన చంద్రబాబు, వైఎస్ జగన్
'కాంగ్రెస్ సీనియర్ నాయకులు, రాజకీయాల్లో ఎంతో విలువలతో కూడిన నాయకుడు పెద్దలు జీవన్ రెడ్డి ఈ నెల 20వ తేదీన కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. ఆయన చేరిక కరీంనగర్ జిల్లాకే కాదు, యావత్ ఉత్తర తెలంగాణకు, బీఆర్ఎస్ పార్టీకి ఎంతో బలాన్ని ఇస్తుంది. రాష్ట్రంలో ప్రజలకు ఒక స్పష్టమైన క్లారిటీ వచ్చేసింది. రేవంత్ రెడ్డి పోవాలి.. కేసీఆర్ రావాలి అని ప్రజలు బలంగా కోరుకుంటున్నారు అనడానికి జీవన్ రెడ్డి గారి చేరిక ఒక సజీవ సాక్ష్యం' అని మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు.
Also Read: IPL 2026: కలకత్తా ఐదో ఓటమి.. గిల్ దంచుడుకు గుజరాత్ టైటాన్స్ భారీ విజయం
'పార్లమెంటులో జరిగిన రెండు పరిణామాలు తెలంగాణ సమాజాన్ని తీవ్రంగా కలచివేశాయి. బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య తెలంగాణ ఏర్పాటును ఇండియా పాకిస్తాన్ విభజనతో పోల్చడం 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని తీవ్రంగా దెబ్బతీయడమే. బేషరతుగా క్షమాపణలు చెప్పాల్సింది పోయి కిషన్ రెడ్డి ఆ వ్యాఖ్యలను వెనుకేసుకొచ్చే ప్రయత్నం చేయడం అత్యంత దుర్మార్గం' అని బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ లీడర్ హరీశ్ రావు మండిపడ్డారు. 'తేజస్వీ సూర్య మాట్లాడిన మాటలు చూస్తుంటే తెలంగాణ ప్రజల గుండెలు రగిలిపోతున్నాయి. కేసీఆర్ నాయకత్వంలో సకల జనులు పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని కించపరుస్తారా?' అని ప్రశ్నించారు.
'అంబేడ్కర్ రచించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం లోక్సభ, రాజ్యసభలో బిల్లులు పాసై, రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా ప్రజాస్వామిక పద్ధతిలో తెలంగాణ ఏర్పడింది. కనీస అవగాహన లేకుండా తెలంగాణపై, ఉద్యమంపై బీజేపీ నేతలు విషం చిమ్ముతున్నారు. ఒక ఎంపీ తప్పు మాట్లాడితే ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వం దాన్ని ఖండించాల్సింది పోయి సమర్థించడం దారుణం. బీజేపీ తక్షణమే తేజస్వీ వ్యాఖ్యలపై బేషరతుగా క్షమాపణ చెప్పాలి.. లేదంటే తెలంగాణ మనోభావాలను దెబ్బతీసిన పార్టీగా బీజేపీ మిగిలిపోతుంది' అని మాజీ మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్నటి లోక్సభ సమావేశాల్లో బీఆర్ఎస్ ఎంపీలు లేని లోటు స్పష్టంగా కనిపించిందని పేర్కొన్నారు.
'బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు సభలో ఉండి ఉంటే తేజస్వీకి తెలంగాణ బిడ్డల తరఫున దీటైన.. మూతిపగిలే సమాధానం చెప్పేవాళ్లం. 8 మంది కాంగ్రెస్, 8 మంది బీజేపీ ఎంపీలు పెదవులు మూసుకొని మౌనంగా కూర్చున్నారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుంటే ప్రశ్నించాల్సిన బాధ్యత మీపై లేదా?' అని బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలను మాజీ మంత్రి హరీశ్ రావు నిలదీశారు. 'అదే రాజ్యసభలో ఉన్న ముగ్గురు బీఆర్ఎస్ ఎంపీలు మాత్రం ప్రాజెక్టులపై అవాకులు చవాకులు పేలిన కేంద్ర జలవనరుల మంత్రికి దీటైన సమాధానం ఇచ్చారు. స్పీకర్ను కలిసి ఆధారాలు చూపించి రికార్డులను సవరించారు' అని గుర్తుచేశారు.
'రేవంత్ రెడ్డి, బీజేపీ మధ్య ఉన్న బడే భాయ్ ఛోటే భాయ్ బంధం మరోసారి బట్టబయలైంది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నాయకుల ఇళ్లను ముట్టడించాలని బీజేపీ పిలుపునిస్తే.. రేవంత్ రెడ్డి మాత్రం ఢిల్లీలో బీజేపీ కేంద్రమంత్రి శ్రీనివాస్ వర్మ ఇంటికి భోజనానికి వెళ్లాడు. కార్యకర్తలేమో కొట్లాడుకోవాలి.. మీరేమో విందులు చేసుకోవాలా?' అని రేవంత్ రెడ్డిని మాజీ మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. 'డీలిమిటేషన్పై రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన హైబ్రిడ్ విధానం ఏంటో ఇవాళ స్పష్టమైంది. అది హైబ్రిడ్ కాదు క్రాస్బ్రీడ్ అని అర్థమైంది. ఈ క్రాస్బ్రీడ్ సిద్ధాంతం రాహుల్ గాంధీకి, సోనియా గాంధీకి అర్థమవుతుందో లేదో? అని సందేహం వ్యక్తం చేశారు. బడే భాయ్కి భయపడే తెలంగాణను అవమానించిన తేజస్వీ సూర్య వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి ఇప్పటిదాకా కనీసం స్పందించలేదని గుర్తుచేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
KCR Success March: జగిత్యాల నుంచే బీఆర్ఎస్ జైత్రయాత్ర ప్రారంభం: కేటీఆర్
Jagtial, Telangana:KTR Jagtial Speech: జగిత్యాల నుంచే బీఆర్ఎస్ జైత్రయాత్ర ప్రారంభమవుతుందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. తిరిగి జగిత్యాల నుంచే మళ్లీ పూర్వ వైభవం సాధించడానికి.. కేసీఆర్ ముఖ్యమంత్రి కావడానికి జగిత్యాల ప్రజల ఆశీర్వాదంతోనే కదం తొక్కుతామని ప్రకటించారు. రాష్ట్రంలో ఒక రాజకీయ పునరేకీకరణ జరుగుతోందని.. సింహం బయటికి వస్తోంది అంటే గుంటనక్కల గుండెల్లో ఇవాళ రైళ్లు పరుగెడుతున్నాయి' అని రేవంత్ రెడ్డిని కేటీఆర్ విమర్శించారు.
Also Read: Chandrababu YS Jagan: మహిళా బిల్లుపై ఇండి కూటమిని తప్పుబట్టిన చంద్రబాబు, వైఎస్ జగన్
ఏప్రిల్ 20వ తేదీన జగిత్యాలలో నిర్వహించనున్న బీఆర్ఎస్ పార్టీ అధినేత, తొలి సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభా ప్రాంగణాన్ని శనివారం సందర్శించిన అనంతరం పార్టీ సీనియర్ నాయకులతో కలిసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. జగిత్యాలలో కోలాహలం, ఒక పండుగ వాతావరణం ఇవాళ అందరికీ కనబడుతోందని తెలిపారు. కేసీఆర్ సంవత్సరం తర్వాత ఒక బహిరంగ సభకు వస్తున్నారంటే ఎన్నో రకాల కుట్రలు, కుతంత్రాలకు తెరలేపి కాంగ్రెస్ ప్రభుత్వం జగిత్యాలలో జరగబోతున్న చైత్రయాత్రను అడ్డుకునే ఒక చిల్లర ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. 'రేవంత్ రెడ్డి, మంత్రులు ఎంత సిల్లీ రాజకీయాలు చేస్తున్నారంటే.. కేసీఆర్ ఇక్కడికి వస్తున్నారంటే మేడిగడ్డకు వెళ్తారట. రెండున్నరేళ్లుగా మేడిగడ్డకు వెళ్లేందుకు రేవంత్ రెడ్డికి సమయం లేకుండా ఉండి అర్జెంట్గా కేసీఆర్ బహిరంగ సభ ఇక్కడ ఉంటే.. టీవీల్లో సగం కేసీఆర్ను చూపెట్టాలి, సగం రేవంత్ రెడ్డిని చూపెట్టాలి' అని మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు.
Also Read: Women Reservation Bill: ప్రధాని మోదీకి వరుస ఎదురుదెబ్బలు.. నల్ల చట్టాల నుంచి మహిళా రిజర్వేషన్ దాకా
'పేపర్లలో సగం రేవంత్ రెడ్డిదే రాయాలి. అవతలి వైపు కేసీఆర్ది రాయాలని ఒక చిల్లర ప్రయత్నం. అంటే ఇంత కుత్సితమైన, ఇంత కుసంస్కారమైన, ఇంత చిన్న మెదడు ఉన్న ముఖ్యమంత్రి బహుశా భారతదేశంలో ఎవరూ ఉండరు.. రేవంత్ రెడ్డి తప్ప. ఆయనకు హైట్ తక్కువ అనుకున్నాం, బుర్ర కూడా తక్కువనే' అని సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ విమర్శించారు. 'ఇంత చిల్లరగా ఉండకూడదు రాజకీయాలు. కేసీఆర్లాంటి ఒక నాయకుడు ఆయన ఈ వయసులో ఈ స్థాయికి చేరుకున్న తర్వాత ఆయనకు పేపర్లో ఏమి రాస్తారు, టీవీ వాళ్లు ఏమి చూపెడతారు అనే విషయాలు పెద్దగా ప్రాధాన్యం ఉండదు. కేసీఆర్ ఇక్కడికి వస్తుంటే కోరుట్లకు వెళ్లి వచ్చేవారందరికీ ఇక్కడికి రానీయకుండా రోడ్డు తవ్వుతున్నారట. మూడేళ్లుగా గుర్తుకు రాని ఈ రోడ్డు, ఇప్పుడే గుర్తుకు వచ్చింది సడన్గా?' అని ప్రశ్నించారు. 'ఇంత చీప్ రాజకీయాలు, ఇంత చిల్లర ప్రయత్నాలతో జగిత్యాలలో జనప్రభంజనాన్ని అడ్డుకుంటామని రేవంత్ రెడ్డి, ఇక్కడున్న హైబ్రిడ్ ఎమ్మెల్యే. ఒక హైబ్రీడ్ కూడా కాదు, ఇది ఏం బ్రీడో ఇది. క్రాస్బ్రీడ్.. ఇది ఏం బ్రీడో ఆ బ్రీడ్ ఎమ్మెల్యే ఇక్కడున్న ఆయన ఏ పార్టీ ఏమిటో ఆయనకే తెలియదు' అని విమర్శించారు.
Also Read: Bandi Sanjay: సోనియాగాంధీని రేవంత్ రెడ్డి బలిదేవత అనలేదా?: బండి సంజయ్
'కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో కూర్చుంటాడు.. మంత్రి పక్కన కూర్చుంటాడు. క్రాస్ బ్రీడ్ అనాలా, హైబ్రీడ్ అనాలా, ఏ బ్రీడ్ అనాలి? ఆయన ఏందో ఆయనే చెప్పుకోవాలి. ఇవాళ రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ వాళ్ల భయం కూడా ఏమిటంటే ఇక్కడికి కేసీఆర్ వచ్చి, జీవన్ రెడ్డి అందరూ కలిసి ఒక వేదికపై మాట్లాడితే జగిత్యాల నుంచే మళ్లీ బీఆర్ఎస్ చైత్రయాత్ర మొదలవుతుంది. దండయాత్ర మొదలవుతుంది' అని మాజీ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. రేవంత్ రెడ్డికి భరతం పట్టడానికి తెలంగాణ ప్రజలు ఇప్పటికే రంగం సిద్ధం చేశారనే ఒక వాతావరణం వస్తుందనే భయం ఆయనకు పట్టుకుందని పేర్కొన్నారు.
'రేవంత్ రెడ్డిది అట్టర్ఫ్లాప్ పాలన. ఆరు గ్యారెంటీలు, 420 హామీలు, 13 డిక్లరేషన్లు అన్ని వర్గాలను మోసం చేసిన విషయం బయటపడుతుందని ఆయనకు భయం పట్టుకుంది. అందుకే ఈ రకమైన చిలిపి ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఒకటి మాత్రం వాస్తవం. ఇదే జగిత్యాలలో కేసీఆర్ గతంలో ఎన్నో బహిరంగ సభలు నిర్వహించారు. ఈ సభ కూడా అద్భుతంగా విజయవంతమవుతుంది' అని మాజీ మంత్రి కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా.. ఎన్ని చిల్లర కుట్రలు చేసినా అన్నిటినీ అధిగమించడానికి బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం అహర్నిశలు కష్టపడుతోందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Viral Video: స్ట్రా వేసి స్టైల్గా జ్యూస్ తాగేసిన కొండముచ్చు.. వీడియో చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
Hyderabad, Telangana:Monkey Drinks Mango Juice Video Watch: జంతువుల తెలివితేటలు కొన్నిసార్లు మనుషులకే ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటాయి. ముఖ్యంగా కొండముచ్చు చేసే పనులు అచ్చం మనుషులను పోలి ఉండటం మనం తరచుగా అక్కడక్కడ చూస్తూ ఉంటాం. తాజాగా ఒక కొండముచ్చుకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ఎండల వేడికో ఏమో కానీ.. ఒక కొండముచ్చు స్ట్రా సహాయంతో ఎంతో స్టైల్గా మ్యాంగో జ్యూస్ తాగుతున్న దృశ్యాలు ఇప్పుడు వైరల్ అవుతున్న ఈ వీడియోలో మీరు చూడొచ్చు. ఈ వీడియోకు సంబంధించిన అన్ని రకాల వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..
వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక యువకుడు తన చేతిలో మాజా జ్యూస్ డబ్బా పట్టుకొని ఉండడం మీరు చూడొచ్చు. అందులో ఒక స్ట్రా వేసి.. జనాభాసాల్లో అటు ఇటు తిరుగుతూ ఒకచోట కూర్చున్న కొండముచ్చుకు అందించాడు. సాధారణంగా జంతువులకు ఏదైనా ఇస్తే అవి నోటితో లాక్కోవడం లేదా నేలపాలు చేయడం చేస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ కొండముచ్చు మాత్రం చాలా క్లాస్ గా వ్యవహరించింది. ఆ యువకుడు స్ట్రాను దాని నోటి దగ్గరకు తీసుకెళ్లగానే.. అది చాలా చాకచక్యంగా నోటితో పట్టుకొని లోపల ఉన్న జ్యూస్ ను జుర్రుకుంటూ తాగేసింది.
ఈ వీడియో చూస్తుంటే ఆ కొండముచ్చు స్ట్రా సహాయంతో తాగడం కొత్తేమీ కాదని అర్థమవుతుంది. ఒక చుక్క కూడా కింద పడకుండా.. ఆది జ్యూస్ ను చాలా ఎంజాయ్ చేస్తున్న తీరు చూసి సోషల్ మీడియా వినియోగదారులు సైతం ఆశ్చర్యానికి గురవుతున్నారు. దీని తెలివితేటలు మామూలుగా లేవు అని కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు కామెంట్లలో స్పందిస్తూ వస్తుంటే.. మరికొంతమంది మనుషులకు జంతువులకు మధ్య తేడా లేదని మళ్లీ నిరూపితమైందని అంటూ కామెంట్లతో హోరెత్తిస్తున్నారు..
ప్రస్తుతం ఈ వీడియో ఇంస్టాగ్రామ్తో పాటు ఎక్స్ వంటి ప్లాట్ఫార్మ్స్లో విపరీతంగా వైరల్ అవుతూ వస్తోంది. ఈ వీడియోను కొన్ని లక్షల మందికి పైగా సోషల్ మీడియా వినియోగదారులు వీక్షించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా జంతు ప్రేమికులంతా ఈ వీడియోను చూసి లైక్ కూడా చేసి ఇతరులకు షేర్ చేస్తున్నారు. మరి కొంతమంది మాత్రం జంతువులకు ఇలాంటి డ్రింక్స్ తాగించడం మంచిది కాదని.. దీనివల్ల అది ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు గురయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు..
Also Read: DA Hike: కేంద్ర ఉద్యోగులకు గుడ్ న్యూస్.. డీఎ 2% పెంపు మంజూరు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Viral Video: నగరంలో దోమల విలయతాండవం.. సెక్యూరిటీ గార్డ్ ఖతర్నాక్ ఐడియా.. వీడియో!
Hyderabad, Telangana:Mosquito Net Idea Viral Video Watch Here: సాధారణంగా రాత్రి వేళల్లో సెక్యూరిటీ గార్డులు చేతిలో టార్చ్ లైట్తో పాటు లాటీ పట్టుకొని అపార్ట్మెంట్ల వద్ద కాపలా కాయడం మనం చూస్తూ ఉంటాం.. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే సెక్యూరిటీ గార్డ్ మాత్రం వీటన్నిటికీ భిన్నంగా.. ఒళ్లంతా దోమల తెర కప్పుకొని డ్యూటీ చేస్తున్నాడు. హైదరాబాద్ నగరంలో దోమల బెడద ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఈ దృశ్యమే నిర్దర్శనంగా నిలుస్తోంది. ప్రస్తుతం ఈ వినూత్న ప్రయత్నానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ వస్తోంది. దీనికి సంబంధించిన అన్ని రకాల వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..
భాగ్యనగరంలోని ఒక అపార్ట్మెంటులో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డ్.. రాత్రి వేళల్లో విపరీతమైన దోమల ధాడిని ఎదుర్కోలేకపోతున్నాడు.. కాయిల్స్ వెలిగించినా.. ఆయింట్మెంట్ రాసుకున్న ఫలితం లేకపోవడంతో ఈ వినూత్న ఆలోచన చేశాడు.. తన కుర్చీ చుట్టూ తల నుంచి కాలి వరకు పూర్తిగా కవరియ్యలా ఒక తెల్లటి దోమతెరను ధరించాడు. దోమతెరలు కూర్చుని దర్జాగా తన పనిని తాను చేసుకుంటున్నాడు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియోనే సోషల్ మీడియా వినియోగదారులను ఆశ్చర్యపోయేలా చేస్తుంది.
అయితే, ఈ దృశ్యాలను అదే అపార్ట్మెంట్లో నివసిస్తున్న ఒక గృహిణి చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అధికాస్త వైరల్గా మారింది. ఈ వీడియో పై సోషల్ మీడియా వినియోగదారులు రకరకాలుగా స్పందిస్తూ వస్తున్నారు.. భయ్యా నీ ఐడియా అద్భుతం.. దోమల నుంచి రక్షణకు ఇంతకంటే మంచి మార్గం లేదు.. అంటూ కొందరు కామెంట్స్ చేస్తుంటే.. మరికొందరు పాపం ఆ సెక్యూరిటీ గార్డు పరిస్థితి చూస్తుంటే జాలేస్తోంది.. కనీసం దోమలు లేని వాతావరణాన్ని కూడా యాజమాన్యం కల్పించలేకపోతోంది అంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ వస్తున్నారు..
హైదరాబాద్ లో డెంగ్యూతో పాటు మలేరియా కేసులు పెరుగుతున్న తరుణంలో.. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడంలో తప్పు లేదని మరి కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు కామెంట్ చేస్తూ వస్తున్నారు. అయితే ఇంకొంతమంది మాత్రం రేవంత్ రెడ్డి ప్రభుత్వం దోమల నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని.. అందువల్లే నగరంలో దోమలు విపరీతంగా పెరిగిపోతున్నాయని ప్రభుత్వం పై ఫైర్ అవుతున్నారు. అంతేకాకుండా ఈ వీడియో నగరంలోని పారిశుద్ధ్య లోపాన్ని కూడా ఎత్తిచూపుతోంది.. మురుగునీరు నిలిచిపోవడంతో పాటు చెత్తాచెదారం పేరుకుపోవడం వల్ల దోమలు స్వైర విహారం చేస్తున్నాయని.. జీహెచ్ఎంసీ అధికారులు తక్షణమే స్పందించి ఫాగింగ్ చేయించాలని స్థానికులు కోరుతున్నారు.
Also Read: DA Hike: కేంద్ర ఉద్యోగులకు గుడ్ న్యూస్.. డీఎ 2% పెంపు మంజూరు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
