దళిత సంఘాల ఐక్య వేదిక అధ్యక్షునిగా చిలుక రాజనర్సు
Bellampalle, Kannal Rural, Telangana:దళిత సంఘాల ఐక్య వేదిక అధ్యక్షునిగా చిలుక రాజనర్సు మరోసారి ఎన్నికయ్యారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని ఎస్సీ కమ్యూనిటీ హాల్లో దళిత సంఘాల ఐక్యవేదిక అధ్యక్షుడు గోమాస రాజం అధ్యక్షతన అత్యవసర సమావేశం నిర్వహించారు. 3నెలల క్రితం దళిత సంఘాల అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన దరసంగాలు అధ్యక్షుడు చిలక రాజనర్సును సంఘం ఐక్యత కోసం భవనిర్మానం కోసం అభివృద్ధి పని కోసం పని చేయాలని కోరారు.हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
YS Jagan Press Meet: చంద్రబాబుపై మరోసారి ధ్వజమెత్తిన వైఎస్ జగన్..రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం నడుస్తుందని ఆరోపణ!
Vijayawada, Andhra Pradesh:YS Jagan Latest Press Meet: రాష్ట్రంలో దిగజారిన శాంతిభద్రతలు, రైతాంగ సమస్యలు, కూటమి ప్రభుత్వంలో సాగుతున్న అరాచకాలపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో 'రూల్ ఆఫ్ లా' (చట్టబద్ధ పాలన) స్థానంలో 'రూల్ ఆఫ్ ఫియర్' (భయాందోళనల పాలన) నడుస్తోందని ఆయన ఆరోపించారు.
రెడ్బుక్ రాజ్యాంగం.. భయానక వాతావరణం
రెండేళ్ల క్రితం వరకు సంక్షేమం, విద్య, వైద్యం, పరిపాలనా సంస్కరణల్లో విప్లవాత్మక మార్పులతో దేశంలోనే ఏపీ పేరు మారుమోగిందని.. కానీ నేడు కస్టోడియల్ డెత్స్, శవాల మాయం, రెడ్బుక్ రాజ్యాంగం, అబద్ధాల పాలనకు కేరాఫ్ అడ్రస్గా మారిందని జగన్ విమర్శించారు.
చంద్రబాబు తన అవినీతి, దోపిడీని ఎవరూ ప్రశ్నించకూడదనే ఉద్దేశంతో చట్టాన్ని చేతిలోకి తీసుకుని ప్రతిపక్షాలు, సోషల్ మీడియా యాక్టివిస్టులు, జర్నలిస్టులపై అరాచకాలను ప్రయోగిస్తున్నారని మండిపడ్డారు. ప్రజలకు పోలీస్ స్టేషన్లపై నమ్మకం పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
లాకప్ డెత్స్.. అమానవీయ ఘటనలు
రాష్ట్రంలో సాగుతున్న 'జంగిల్ రాజ్' (రాక్షస పాలన)కు అద్దం పట్టేలా పలు ఘటనలను వైఎస్ జగన్ ఉదహరించారు. విజయవాడలో సాయికృష్ణ కేసు, పోలీసుల వేధింపులకు బలైన క్రాంతికుమార్ ఉదంతం, కర్నూలు జిల్లాలో దళిత మహిళ గంగమ్మ లాకప్ డెత్, తెనాలిలో తిరుపతమ్మ, శ్రీకాకుళంలో కళావతి కేసులను ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఉదహరించారు.
"కస్టడీలోని వ్యక్తిని దారుణంగా కొట్టి చంపి, కనీసం కుటుంబ సభ్యులకు బూడిద కూడా ఇవ్వకుండా శవాన్ని మాయం చేయడం అత్యంత అమానవీయ, పాశవిక చర్య. స్టేట్ హెడ్క్వార్టర్స్ పోలీసులే దీనికి ఒడిగట్టడం యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది" అని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు.
డైవర్షన్ పాలిటిక్స్..
ఈ ఘోరాలపై ప్రశ్నిస్తే చంద్రబాబు తన అనుకూల మీడియాతో ఎదురుదాడి చేయిస్తున్నారని.. ప్రజల దృష్టిని మళ్లించడానికి తన పొలిటికల్ పార్టనర్ను (సైడ్ క్యారెక్టర్లా) తెరపైకి తెచ్చి డ్రామాలు ఆడిస్తున్నారని విమర్శించారు. సాయికృష్ణను మొదట రౌడీషీటర్ అని అవమానించి, జనం ఛీత్కరించుకునేసరికి యూ-టర్న్ తీసుకుని సెక్రటేరియట్కు పిలిపించుకున్నారని ఎద్దేవా చేశారు.
నిందితులను కాపాడుతున్న సీపీ, డీజీపీ?
సాయికృష్ణ కేసులో రిమాండ్ రిపోర్టును గమనిస్తే పెద్దలను కాపాడేందుకు దర్యాప్తును ఎలా వీక్ చేస్తున్నారో స్పష్టమవుతోందని జగన్ ఆరోపించారు.
ఉన్నతాధికారుల బాధ్యత ఏది?: టాస్క్ఫోర్స్ పోలీసులు సాయికృష్ణను కృష్ణలంక పీఎస్కు అప్పగించినట్లు రిమాండ్ రిపోర్టులో ఉంది. టాస్క్ఫోర్స్ నేరుగా పోలీస్ కమిషనర్ (CP) కింద పనిచేస్తుంది. మరి సిపిని ఎందుకు విచారించడం లేదు?
ఫిర్యాదులను పట్టించుకోలేదు: మే 28న సాయికృష్ణ తల్లి తన కొడుకు లాకప్ డెత్పై అనుమానాలు ఉన్నాయని విజయవాడ సీపీకి అర్జీ ఇచ్చినా, బంధువులు డీజీపీకి చెప్పినా ఎందుకు స్పందించలేదు?
రక్షణ వలయం: "ఇక్కడ సీఐని సీపీ కాపాడితే.. సీపీని డీజీపీ, డీజీపీని స్వయంగా చంద్రబాబు కాపాడుతున్నారు" అని జగన్ తీవ్ర విమర్శలు చేశారు. క్రాంతికుమార్ మరణవాంగ్మూలం వీడియో వైరల్ అయినా ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. తాము స్వయంగా బాధితులను పరామర్శించిన 4 రోజుల వరకు అరెస్టులు చేయలేదని, తానే గనుక వెళ్లకపోతే ఈ రెండు కేసులను పూర్తిగా నొక్కేసేవారని స్పష్టం చేశారు.
విజయవాడ నగరంలోనే ఇలాంటి ఘోరాలు జరిగితే.. రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చని జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. గత రెండేళ్లుగా సాగుతున్న ఈ రెడ్బుక్ పాలనలో.. ఆధారాలు నాశనం చేయడం, తప్పుడు సాక్ష్యాలు సృష్టించడం సర్వసాధారణమైపోయిందని, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇంతటి మానవహక్కుల ఉల్లంఘనను తామెన్నడూ చూడలేదని జగన్ పేర్కొన్నారు.
Also REad: ముగ్గురు హీరోయిన్లతో హైటెక్ లెవల్ వ్యభిచారం..ముంబైలో చీకటి దందా బట్టబయలు
Also REad; AP New Pension: ఏపీ ప్రజలకు అదిరిపోయే న్యూస్..జూలై 1 నుంచి కొత్త పింఛన్లు పంపిణీ..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Flipkart GOAT సేల్లో అదిరిపోయే ఆఫర్.. రూ.56 వేలకే Samsung Galaxy S25 ఫోన్..
Hyderabad, Telangana:Flipkart GOAT Sale: ప్రీమియం Samsung స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి ఇదే అద్భుతమైన అవకాశంగా భావించవచ్చు. ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం Flipkart ప్రారంభించబోతున్న GOAT (Greatest of All Time) సేల్లో భాగంగా Samsung ఫ్లాగ్షిప్ మొబైల్పై కళ్లు చెదిరే డిస్కౌంట్ ఆఫర్స్ను ప్రకటించింది. Samsung గెలాక్సీ సిరీస్లో ఎంతో క్రేజ్ ఉన్న Samsung Galaxy S25 5G స్మార్ట్ఫోన్పై ఊహించని రేంజ్లో డిస్కౌంట్ ఆఫర్స్ అందుబాటులోకి రాబోతున్నాయి.. మార్కెట్లో భారీ డిమాండ్ ఉన్న ఈ ఫోన్ను ఇప్పుడు సగం కంటే తక్కువ ధరకే సొంతం చేసుకునే అద్భుతమైన ఛాన్స్ కస్టమర్లకు లభిస్తోంది.
రూ.18 వేల ఫ్లాట్ డిస్కౌంట్.. రూ.56 వేల లోపే..
సాధారణంగా Samsung ప్రీమియం మోడల్స్ ధరలు సామాన్యులకు కాస్త అందుబాటు దూరంలో ఉంటాయని మనందరికీ తెలుసు. అయితే, ఈ సేల్లో 128 GB స్టోరేజ్ వేరియంట్ Samsung Galaxy S25 5G స్మార్ట్ఫోన్ అసలు ధర MRP రూ. 74,999తో అందుబాటులో ఉండగా.. ఫ్లిప్కార్ట్ ఏకంగా రూ. 18,999 ఫ్లాట్ తగ్గింపు లభిస్తోంది.. ఈ సేల్లో భాగంగా ఈ ఫ్లాట్ డిస్కౌంట్ వల్ల ఫోన్ ధర ఒక్కసారిగా రూ.56,000 లోపుకు పడిపోతుందని ఫ్లిప్కార్ట్ అందిస్తోంది.. ప్రీమియం ఫీచర్లు కోరుకునే వారికి ఈ ఆఫర్ పెద్ద పండగ లాంటిదని భావించవచ్చు.
అదనంగా బ్యాంక్ ఆఫర్స్..
ఫ్లాట్ డిస్కౌంట్తో పాటు కస్టమర్లకు మరింత ఉపశమనం కలిగించేలా బ్యాంక్ ఆఫర్లను కూడా ఫ్లిప్కార్ట్ అందిస్తూ వస్తోంది. ఈ సేల్లో భాగంగా కొనుగోలు చేసేటప్పుడు ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ (Flipkart Axis Bank) లేదా ఎస్బీఐ (SBI) బ్యాంక్ క్రెడిట్ కార్డ్లను వినియోగించి పేమెంట్ చేస్తే.. వినియోగదారులకు ఏకంగా దాదాపు రూ.3,500 వరకు అదనపు భారీ డిస్కౌంట్ లభిస్తోంది.. ఈ స్మార్ట్ఫోన్ ధర మరింత అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి..
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
రూ. 26,050 ఎక్స్చేంజ్ బోనస్..
ఫ్లిప్కార్ట్ GOAT సేల్లో అన్నిటికంటే హైలైట్ ఏమిటంటే భారీ ఎక్స్చేంజ్ ఆఫర్గా భావించవచ్చు.. మీ పాత స్మార్ట్ఫోన్ను ఎక్స్చేంజ్ చేస్తే, గరిష్టంగా రూ.26,050 వరకు ఎక్స్చేంజ్ బోనస్ కూడా లభిస్తుంది.. ఒకవేళ మీరు ఎక్స్చేంజ్ చేసే పాత ఫోన్ కండిషన్ బాగుండి.. గరిష్ట బోనస్ను పొందితే.. ఈ ప్రీమియం Samsung Galaxy S25 5G ఫోన్ను కేవలం రూ.29,950 లోపే ఆర్డర్ చేసుకోవచ్చు.. అయితే, ఈ ఎక్స్చేంజ్ బోనస్ పూర్తిగా మీరు ఎక్స్చేంజ్ చేసే పాత స్మార్ట్ఫోన్ వర్కింగ్ కండిషన్తో పాటు బ్రాండ్ వ్యాల్యూతో పాటు స్క్రాచెస్ లేకపోవడం వంటి అంశాలపై ఆధారపడి ఉంటుందని ఫ్లిప్కార్ట్ తెలుపుతోంది.
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
India Vs England: గంభీర్ మార్క్ లెవల్ భారీ ప్లాన్..ఇంగ్లాండ్ టీ20 సిరీస్కు ముందు ఓపెనింగ్ జోడీలో భారీ మార్పు!
Hyderabad, Telangana:India Vs England T20I Series: ఇంగ్లాండ్తో టీ20 సిరీస్కు ముందు టీమ్ఇండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ సంచలన నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం అందుతుంది. ఇటీవల జరిగిన ఐర్లాండ్ సిరీస్లో భారత జట్టు ఘోరపరాజయాన్ని మూటగట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే అందులో భారత బ్యాటర్ల వైఫల్యం పెద్ద కారణమని విమర్శలు వస్తున్న నేపథ్యంలో మేనేజ్మెంట్ జట్టులో కీలక మార్పులు చేసినట్లు తెలుస్తోంది. నేటి నుంచి అనగా జూలై 1 నుంచి ప్రారంభం కానున్న టీ20 సిరీస్ (5 మ్యాచ్లు)లో భారత కోచ్ సరికొత్త ప్లాన్తో రాబోతున్నారని తెలుస్తోంది.
ఓటమి తర్వాత ఒత్తిడిలో టీమిండియా..
భారత క్రికెట్ జట్టు ఇంగ్లాండ్ పర్యటన నేటి నుంచి ప్రారంభం కానుంది. ఇంగ్లాండ్ తో సిరీస్ లో భాగంగా ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ తర్వాత జులై 14 నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. అయితే ఈ పర్యటనకు ముందు ఐర్లాండ్ చేతిలో టీమిండియా 2-0 తేడాతో క్లీన్స్వీప్ అయిన సంగతి తెలిసిందే. ఈ విషయం భారత క్రికెట్ అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. సులువుగా గెలుస్తామనుకున్న మ్యాచ్ల్లో భారత బ్యాటర్ల నిర్లక్ష్యం కారణంగా సిరీస్ కోల్పోవడంతో పాటు భారత ఓపెనర్లు పేలవ ప్రదర్శనతో రాణించలేకపోవడం వంటివి ప్రధాన కారణాలుగా తెలుస్తున్నాయి. దీంతో ఇంగ్లాండ్ తో జరిగిన సిరీస్ లో బలమైన ఓపెనర్లను ప్లేయింగ్ లెవెల్ లోకి తీసుకోవాలని మేనేజ్మెంట్ ప్లాన్ చేస్తుంది.
ఐలాండ్తో జరిగిన సిరీస్లో ఓపెనింగ్ బ్యాటర్లు అభిషేక్ శర్మ, సంజు సాంసంగ్ ఆశించిన స్థాయిలో రాణించలేదు. గత టీ20 వరల్డ్ కప్ టోర్నీలో వీరి కాంబినేషన్ పెద్దగా క్లిక్ కాలేదు. కానీ ఐర్లాండ్తో జరిగిన మ్యాచ్తో వీరిని మరోసారి ఓపెనింగ్ భాగస్వాములుగా తీసుకురావడం పట్ల విమర్శలు వెలుగుతున్నాయి.
అభిషేక్ తోడుగా వైభవ్ సూర్యవంశీ
వరుస వైఫల్యల నేపథ్యంలో ఇంగ్లాండ్తో జరుగునున్న టీ20 సిరీస్ భారత భారత తుదిజట్టులో భారీ మార్పులు ఖాయమని సమాచారం అందుతుంది. ఐపీఎల్ 2026 సీజన్లో 16 మ్యాచ్లో ఏకంగా 776 పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్న యువ కెరటం సూర్యవంశంపై సెలెక్టర్లు మొగ్గు చూపినట్లు తెలుస్తుంది. అయితే నేటి మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం ఖరారు అయినట్లు బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి.
ఐర్లాండ్తో జరిగిన టీ20 సిరీస్ లోనే వైభవ్ సూర్యవంశీ అరంగేట్రం చేస్తాడని భావించిన అప్పుడు నిరాశ మిగిలింది. అయితే సంజూ శాంసన్ అభిశిక్ శర్మల పేలవ ప్రదర్శన కారణంగా ఓపెనింగ్ భాగస్వామ్యంలో వైభవ్ కు అవకాశం దక్కుతుందని గట్టిగా నమ్ముతున్నారు. అదే జరిగితే ఇషాన్ కిషన్కు వికెట్ కీపర్ బాధ్యతలను విషయానికి చేపట్టే అవకాశం ఉంది.
Also REad: వైభవ్ సూర్యవంశీని ఎందుకు ఆడించలేదు? ఐర్లాండ్పై ఓటమితో మాజీ క్రికెటర్ సూటిప్రశ్న!
Also Read: టీ20 ప్రపంచకప్లో భారత్ ఘోర పరాజయం..ఆస్ట్రేలియాతో ఓటమి తర్వాత టోర్నీ నుంచి అవుట్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లే ప్రయాణికులకు TGSRTC శుభవార్త.. కొత్తగా పెరిగిన స్టాప్ల లిస్ట్ ఇదే!
Hyderabad, Telangana:Hyderabad To Bangalore New Bus Stops: తెలంగాణ, కర్ణాటక సరిహద్దు రాష్ట్రాలు కావడంతో, ప్రజల మధ్య రాకపోకలు ఎక్కువగా ఉంటాయి. బంధువుల కోసం లేదా ఉద్యోగాల రీత్యా ఎక్కువ మంది తెలంగాణ నుండి బెంగళూరుకు, అలాగే బెంగళూరు నుండి తెలంగాణకు ప్రయాణిస్తుంటారు. వీరి సౌకర్యార్థం తెలంగాణ ఆర్టీసీ ఒక బంపర్ గుడ్ న్యూస్ చెప్పింది. బెంగళూరు, హైదరాబాద్ మధ్య ప్రయాణించే వారికి బస్సు సౌకర్యాలను మరింత మెరుగుపరుస్తూ, ఏసీ, స్లీపర్, నాన్-ఏసీ బస్సుల బోర్డింగ్ , అలైటింగ్ పాయింట్లను పెంచుతున్నట్లు ప్రకటించింది.
బెంగళూరు రూట్లలో కొత్త బోర్డింగ్, అలైటింగ్ పాయింట్లు ఈ విధంగా ఉన్నాయి:
చందాపూర్ రూట్ ద్వారా వెళ్లేవారు.. చందాపూర్, బొమ్మసంద్ర, ఎలక్ట్రానిక్ సిటీ, బొమ్మనహళ్లి మెట్రో స్టేషన్, మడివాల కెంపెగౌడ బస్ స్టేషన్, హెబ్బల్, అలహంక, బెంగళూరు ఎయిర్పోర్ట్ టోల్ ప్లాజా నుండి దేవనహళ్లి బైపాస్ వరకు పాయింట్లు ఉన్నాయి.
పీనియా రూట్ ద్వారా వెళ్లే వారికి.. యశ్వంత్ పురం మెట్రో స్టేషన్ నుండి కెంపెగౌడ బస్ స్టేషన్, బెంగళూరు ఎయిర్పోర్ట్ టోల్ ప్లాజా నుండి దేవనహళ్లి బైపాస్ వరకు సౌకర్యం ఉంటుంది.
మార్తహళ్లి రూట్ ద్వారా వెళ్లే వారికి.. వర్టూర్ జంక్షన్ నుండి మార్తహళ్లి, దొమ్మలూరు బ్రిడ్జి, కెంపెగౌడ బస్ స్టేషన్, హెబ్బల్, అలహంక, బెంగళూరు ఎయిర్పోర్ట్ టోల్ ప్లాజా,దేవనహళ్లి బైపాస్ మీదుగా బస్సులు వెళ్తాయి.
హైదరాబాద్లో బోర్డింగ్, అలైటింగ్ పాయింట్ల వివరాలు ఇలా ఉన్నాయి:
ప్రతిరోజూ హైదరాబాద్ నుండి వందలాది మంది బెంగళూరుకు ప్రయాణిస్తుంటారు. వీరి కోసం పటాన్చెరు, జేబీఎస్, హయత్ నగర్ వంటి ప్రాంతాలలో కొత్త పాయింట్లను అందుబాటులోకి తెచ్చారు.
జేబీఎస్ రూటు ద్వారా వెళ్లే బస్సులు ఎంజీబీఎస్, ఆరాంఘర్, శంషాబాద్ వంటి అన్ని ప్రధాన ప్రాంతాల్లో ఆగుతాయి. అలాగే పటాన్ చెరు నుండి వెళ్లే బస్సులు కూడా పటాన్ చెరు, ఎంజీబీఎస్, ఆరాంఘర్, శంషాబాద్లోని ప్రధాన స్టాపుల్లో ఆగుతాయి. అంతేకాకుండా, హయత్ నగర్ రూట్ నుండి కూడా ఎంజీబీఎస్, ఆరెంజ్ మరియు హైదరాబాద్లోని ప్రధాన ప్రాంతాల్లో బోర్డింగ్, అలైటింగ్ సౌకర్యం ఉంది.
Also Read: SIR ఎన్యుమరేషన్ ఫారమ్ను తప్పులు లేకుండా ఆన్లైన్లో ఫిల్ చేయడం ఎలా? స్టెప్-బై-స్టెప్ ప్రాసెస్ ఇదిగో!
Also Read: ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ తీపి కబురు.. భారీగా నిధులు విడుదల
టీజీఎస్ఆర్టీసీ కల్పిస్తున్న ఈ అద్భుతమైన అవకాశాన్ని తెలంగాణ, బెంగళూరు ప్రజలు వినియోగించుకోవాలని సంస్థ కోరుతోంది. ప్రయాణికుల సౌకర్యం కోసం ఇంటికి దగ్గరలో ఉన్న పాయింట్ల వద్ద సులభంగా బోర్డింగ్, అలైటింగ్ చేసుకోవడానికి ఈ కీలక నిర్ణయం తీసుకుంది. మీరు ముందుగానే బస్సు టికెట్లను బుక్ చేసుకోవచ్చు. టికెట్ల కోసం టీజీఎస్ఆర్టీసీ అధికారిక వెబ్సైట్ https://www.tgsrtcbus.in/ ను సందర్శించి, మీకు, మీ కుటుంబ సభ్యులకు కావాల్సిన సీట్లను సులభంగా రిజర్వ్ చేసుకోవచ్చు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Flipkart GOAT సేల్ ధమాకా.. iPhone 17 సిరీస్పై రూ. 22,000 భారీ డిస్కౌంట్!
Hyderabad, Telangana:Flipkart GOAT Sale 2026 iPhone 17 Offer: యాపిల్ ఐఫోన్ కొనుగోలు చేయాలనుకునేవారికి ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ అద్భుతమైన శుభవార్తను అందిస్తోంది. దేశవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫ్లిప్కార్ట్ GOAT సేల్ (Flipkart GOAT Sale) జూలై 4 నుంచి మొదలు కాబోతోంది. ఈ సేల్లో స్మార్ట్ఫోన్లు, హోమ్ అప్లయన్సెస్తో పాటు స్మార్ట్ వేరబుల్స్పై ఫ్లిప్కార్ట్ భారీ ఆఫర్లను అందిస్తోంది.. అయితే అన్నింటికంటే ముఖ్యంగా.. యాపిల్ లేటెస్ట్ ఫ్లాగ్షిప్ సిరీస్ అయిన ఐఫోన్ 17 (iPhone 17) మోడల్స్పై ఊహించని స్థాయిలో ఏకంగా రూ.22,000 వరకు భారీ తగ్గింపును అందించబోతున్నట్లు ఫ్లిప్కార్ట్ ప్రకటించింది.
బ్యాంక్ ఆఫర్లతో భారీ డిస్కౌంట్..
ఫ్లిప్కార్ట్ ఈ సేల్ కోసం ప్రముఖ బ్యాంక్ పార్ట్నర్లతో అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్స్ను అందిస్తూ వస్తోంది. ఐఫోన్ కొనుగోలు చేసేవారికి ప్రత్యేకమైన ఫ్లాట్ డిస్కౌంట్తో పాటు, ఈ సేల్లో భాగంగా ICICI బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా (BoB)తో పాటు HSBC బ్యాంక్ క్రెడిట్ కార్డ్లను ఉపయోగించి కొనుగోలు చేస్తే అదనంగా 10 శాతం వరకు ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తోంది.. దీనితో పాటు ప్రత్యేకమైన ఎక్స్ఛేంజ్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉండడం విశేషం..
ఐఫోన్ 17 సిరీస్ ధర, ఆఫర్ల వివరాలు..
సాధారణంగా ఐఫోన్ 17 (iPhone 17) స్మార్ట్ఫోన్ మార్కెట్లో ఇది ధర రూ. 82,900తో అందుబాటులో ఉండగా.. ఈ ఫ్లిప్కార్ట్ సేల్లో కేవలం రూ.70,990కే సొంతం చేసుకోవచ్చు. ఇందులో 120Hz ప్రోమోషన్ డిస్ప్లే, A19 చిప్సెట్తో పాటు 48MP+48MP కెమెరా సెటప్ అందుబాటులో ఉంది..ఇక ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీని ఇష్టపడే వారి కోసం తయారు చేసిన ఈ ఐఫోన్ 17 ప్రో (iPhone 17 Pro) స్మార్ట్ఫోన్ అసలు ధర రూ. 1,34,000తో అందుబాటులో ఉండగా.. ఈ సేల్లో ఏకంగా రూ.22,000 తగ్గింపుతో రూ. 1,12,000కే అందుబాటులో రాబోతోంది.
ఈ సిరీస్లోనే అత్యంత ప్రీమియం మోడల్ అయిన ఐఫోన్ 17 ప్రో మాక్స్ (iPhone 17 Pro Max) ధర రూ. 1,49,900 నుంచి రూ.1,27,900 కి తగ్గబోతోందని ఫ్లిప్కార్ట్ ప్రత్యేకమైన బ్యానర్ రన్ చేస్తోంది.. ఇక ఈ స్మార్ట్ఫోన్ 6.9 ఇంచుల సూపర్ రెటినా XDR డిస్ప్లేతో పాటు 2000 నిట్స్ బ్రైట్నెస్తో అద్భుతమైన స్క్రీన్ అనుభూతిని అందిస్తుంది. దీంతో పాటు బడ్జెట్ ప్రీమియం రేంజ్లో లభించే ఈ ఐఫోన్ 17ఇ (iPhone 17e) స్మార్ట్ఫోన్ అసలు ధర రూ.64,900 కాగా.. ఈ సేల్లో రూ.60,900 ధరకే అందుబాటులో ఉంది.
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
స్లిమ్తో పాటు స్టైలిష్ లుక్తో ఆకట్టుకునే ఐఫోన్ ఎయిర్ (iPhone Air) రూ. 1,19,900 నుంచి భారీ డిస్కౌంట్ తర్వాత రూ.95,900కే అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో కంపెనీ మోస్ట్ పవర్ఫుల్ శక్తివంతమైన A19 ప్రో ప్రాసెసర్ అందించింది. యాపిల్ ఐఫోన్ 17 సిరీస్ ఫోన్లను అత్యంత తక్కువ ధరకే సొంతం చేసుకోవాలనుకునే వారికి ఈ ఫ్లిప్కార్ట్ GOAT సేల్ ఒక అద్భుతమైన అవకాశంగా భావించవచ్చు. జూలై 4న ప్రారంభమయ్యే ఈ సేల్లో స్టాక్ ముగిసేలోపే మీ నచ్చిన ఐఫోన్ను బుక్ చేసుకోండి.
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Goddess Lakshmi Blessings: లక్ష్మీదేవికి ఇష్టమైన 4 రాశులు ఇవే.. ఇక వీరికి తిరుగుండదు, అపార ధనలాభం!
Hyderabad, Telangana:Goddess Lakshmi Blessings Latest News: జ్యోతిష్య శాస్త్రంలో ఐశ్వర్యానికి, సిరిసంపదలకు అధిదేవతగా లక్ష్మీదేవిని భక్తిశ్రద్ధలతో కొలుస్తూ ఉంటారు. ప్రతి ఇంట్లోనూ శుక్రవారం అమ్మవారి పూజలు ఎంతో భక్తిశ్రద్ధలతో జరుగుతూ ఉంటాయి. అయితే, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. లక్ష్మీదేవికి కొన్ని రాశులంటే అత్యంత ప్రీతికరం.. ఆయా రాశుల వారిపై అమ్మవారి ప్రత్యేక అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతుపున్నారు.. దీనివల్ల వారు జీవితంలో ఊహించని స్థాయిలో ధనలాభం, కీర్తి ప్రతిష్టలు, విజయాలతో పాటు విలాసవంతమైన జీవితం లభిస్తుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అయితే, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో? అత్యధిక లాభాలు పొందే రాశులేవో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ రాశులవారికి బంపర్ లాభాలు:
వృషభ రాశి (Taurus)
లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన రాశులలో వృషభ రాశి మొదటి వరుసలో ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఈ రాశి వారికి అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా లభిస్తూ ఉంటాయి.. వీరి ఆదాయ వనరులు నిరంతరం విపరీతంగా పెరుగుతాయి. అలాగే ఆర్థికంగా ఎప్పుడూ స్థిరంగా ఉండే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నించే వారికి ఈ సమయంలో శుభవార్తలు కూడా తప్పకుండా అందుకుంటారు.. కార్యాలయంలో వీరి గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు విపరీతంగా పెరుగుతాయి. ఉద్యోగస్తులకు జీతాల పెరుగుదలతో పాటు ప్రమోషన్లు లభించే బలమైన అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.
సింహ రాశి (Leo)
సింహ రాశికి అధిపతి నవగ్రహాల రాజు అయిన సూర్యభగవానుడుగా భావిస్తూ ఉంటారు.. ఈ రాశి వారు దృఢ సంకల్పం, అంకితభావంతో పాటు ఎంతో అద్భుతమైన బుద్ధిని కలిగి ఉంటారు. వీరి కష్టాన్ని గుర్తించి లక్ష్మీదేవి అపారమైన అనుగ్రహాన్ని అందిస్తుంది.. వీరు అడుగుపెట్టిన ప్రతి రంగంలోనూ అద్భుతమైన విజయాలు కలుగుతాయి.. ఆర్థికంగా వీరు చాలా బలంగా ఉంటారు. అమ్మవారి కృప వల్ల వీరు ఎప్పుడూ ఇతరులపై ఆధారపడాల్సిన అవసరం కూడా రాదని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.
మీన రాశి (Pisces)
లక్ష్మీదేవికి ఇష్టమైన మరో ముఖ్యమైన రాశి మీన రాశి.. అమ్మవారి అనుగ్రహం వల్ల ఈ రాశి వారికి జీవితంలో ఎప్పుడు డబ్బుకు ఎలాంటి కొరత అనేది ఉండదని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. వీరు తమ నిరంతర శ్రమతో పాటు సత్ప్రవర్తనతో లక్ష్మీదేవి అనుగ్రహం సులభంగా పొందుతారు. వ్యాపార, ఉద్యోగ రంగాలలో వీరు నిరంతరం లాభాలను ఆర్జిస్తూ ఐశ్వర్యవంతమైన జీవితాన్ని గడిపే అవకాశాలు ఉన్నాయి..
తులా రాశి (Libra)
తులా రాశికి అధిపతి శుక్ర గ్రహం.. జ్యోతిష్యశాస్త్రంలో శుక్రుడిని ఆకర్షణ, సంపద, విలాసాలకు కారకుడిగా చెప్పుకుండారు. అందుకే తులా రాశి వారిపై శుక్రుడితో పాటు లక్ష్మీదేవి ప్రత్యేక ఆశీస్సులు లభిస్తూ ఉంటాయి. అమ్మవారి దయతో వీరు జీవితంలో అన్ని రకాల సుఖసంతోషాలను కలుగుతాయి.. వీరు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోరని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఎలాంటి పనులు చేపట్టిన విజయాలు సులభంగా సాధించే ఛాన్స్లు ఉన్నాయి.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
గమనిక.. 
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..
Rahu Transit 2026: హనుమంతుడి ఆశీస్సులు, రాహువు అనుగ్రహం..ఈ రోజు నుంచి ఈ రాశుల వారికి గోల్డెన్ డేస్!
Hyderabad, Telangana:Rahu Transit In Dhanishta Nakshatra 2026 Telugu: జ్యోతిష్య శాస్త్రంలో అత్యంత ప్రభావవంతమైన గ్రహంగా భావించే రాహువు తన నక్షత్ర సంచారం చేశాడు.. 2026 జూన్ 30 మంగళవారం రోజున రాహువు కుంభ రాశి నుంచి ధనిష్ఠ నక్షత్రంలోకి ప్రవేశించాడు.. ఈ నక్షత్రంలో రాహువు గ్రహం డిసెంబర్ 2026 వరకు సంచార దశలో ఉంటాడు.. రాహువు ఈ నక్షత్ర సంచారం అన్ని రాశుల వారి ఆరోగ్యం, ఉద్యోగం, ఆర్థిక స్థితితో పాటు కుటుంబ సంబంధాలపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అయితే, ముఖ్యంగా మూడు రాశుల వారికి ఈ సమయం ఎంతో అదృష్టాన్ని, విజయాలను తెచ్చిపెట్టబోతోంది.. మంగళవారం నుంచి ఈ రాశుల వారికి హనుమంతుడి అనుగ్రహంతో పాటు రాహువు ప్రత్యేక అనుగ్రహం లభించి.. ఈ సమయం కొన్ని రాశులవారికి గోల్డెన్ పీరియడ్గా ఉండబోతోంది. అయితే, ఈ సమయంలో ఏయే రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందో? అదృష్టాన్ని పొందే రాశులేవో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
మేష రాశి (Aries)
మేష రాశి వారికి రాహువు నక్షత్ర సంచారంతో ఈ సమయం అత్యంత లాభదాయకంగా ఉంటుంది.. సుదీర్ఘకాలంగా నిలిచిపోయిన పనులు మళ్లీ వేగం ప్రారంభమవుతాయి.. ఆదాయానికి కొత్త మార్గాలు సులభండా తెరుకుకుంటాయి. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. కార్యాలయంలో ఉన్నతాధికారుల నుంచి పూర్తి సపోర్ట్ కూడా అందుతుంది.. కష్ట సమయాల్లో నమ్మకమైన స్నేహితుడు లేదా సన్నిహితుడి సహాయం మీకు కొండంత బలాన్ని అందిస్తుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఈ కాలం ఎంతో అనుకూలంగా ఉంటుంది. అలాగే వారు ఆశించిన మంచి ఫలితాలు కూడా పొందుతారు.
సింహ రాశి (Leo)
సింహ రాశి వారికి ఈ నక్షత్ర సంచారం అదృష్టాన్ని రెట్టింపు చేయడమే కాకుండా.. ఆర్థికంగా ఎదగడానికి సరికొత్త అవకాశాలను అందిస్తుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్ లేదా అదనపు బాధ్యతలు దక్కే అవకాశాలు కూడా ఉన్నాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. అలాగే మీ ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతుంది. గతంలో చేసిన పెట్టుబడుల నుంచి మంచి లాభాలు కూడా కలుగుతాయి. కుటుంబంలో సుఖసంతోషాలు ఊహించని స్థాయిలో పెరుగుతాయి. మనస్సు ప్రశాంతంగా కూడా మారుతుంది.. దీర్ఘకాలికంగా వేధిస్తున్న కుటుంబ సమస్యలన్నింటికీ ఈ సమయంలో పరిష్కారం అవుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.
తులా రాశి (Libra)
తులా రాశి వారికి రాహువు ధనిష్ఠ నక్షత్ర సంచారం కారణంగా కెరీర్, వ్యాపార రంగాలలో సానుకూల మార్పులను తీసుకు వస్తుందని జ్యోతిష్యులు తెలుపుతుపున్నారు. వ్యాపారస్తులు ఈ సమయంలో చేసే సుదూర ప్రయాణాల వల్ల భారీగా లాభాలను కూడా అందిస్తాయి.. సమాజంలో కొత్త పరిచయాలు కూడా విపరీతంగా ఏర్పడతాయి. ఇవి భవిష్యత్తులో మీకు ఎంతగానో ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారాన్ని విస్తరించడానికి ఊహించని అవకాశాలు లభిస్తాయి. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి మెరుగైన ప్యాకేజీతో కూడిన మంచి అవకాశాలు కూడా లభించబోతున్నాయి. ఈ కాలంలో చేసే ప్రయాణాలు మీ భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
గమనిక.. 
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..
Vaidhriti Yog: జూలై 22న వైధృతి యోగం.. ఆ 4 రాశుల వారికి ఇక తిరుగుండదు, డబ్బే డబ్బు!
Hyderabad, Telangana:Vaidhriti Yog On July 22 Latest News: జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలు, నక్షత్రాల సంచారాలు మానవ జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతాయని మనందరికీ తెలుసు. గ్రహాల మార్పుల వల్ల ఎప్పటికప్పుడు సరికొత్త యోగాలు ఏర్పడుతుంటాయి. ఈ క్రమంలోనే రాబోయే జూలై 22 (బుధవారం) రోజు ఒక అరుదైన, విశేషమైన ఖగోళ సంఘటన జరగబోతోంది. సూర్యుడు, చంద్రుల కలయిక కారణంగా అత్యంత శక్తివంతమైన వైధృతి యోగం ఏర్పడనుంది. ఈ యోగాని ఎంతో ప్రత్యేమైన ప్రాముఖ్యత ఉంటుంది.
సనాతన ధర్మంలో, జ్యోతిష్య శాస్త్రంలో వైధృతి యోగాన్ని అంతగా శుభప్రదమైనదిగా భావించరు. కానీ, ఆశ్చర్యకరంగా ఈసారి ఏర్పడబోయే వైధృతి యోగం కొన్ని రాశుల వారిపై ఊహించని సానుకూల ప్రభావాన్ని చూపించబోతోంది. జూలై 22 సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ యోగం ప్రభావం ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఈ ప్రత్యేక సమయంలో సూర్య-చంద్రుల అనుగ్రహంతో 4 రాశుల వారి జాతకాలు పూర్తిగా మారబోతున్నాయి. వారి జీవితాల్లో సుఖసంతోషాలతో పాటు ఆర్థికంగా అద్భుతమైన లాభాలు కలుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అయితే, ఈ సంచారంతో ఏయే రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందో? అదృష్టాన్ని పొందే రాశులేవో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
మేష రాశి (Aries):
మేష రాశి వారికి ఈ వైధృతి యోగం అపారమైన శుభ ఫలితాలను అందించబోతోంది.. ఉద్యోగ లేదా వ్యాపార రంగాలలో ఉన్న వారికి ఊహించని శుభవార్తలు వింటారు.. మీ ఆర్థిక స్థితి గణనీయంగా మెరుగుపడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దీర్ఘకాలంగా వేధిస్తున్న డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ శాశ్వతంగా తొలగిపోతాయి. ప్రేమ సంబంధాలలో సానుకూల మార్పులు రావడం ప్రారంభమవుతాయి.. వివాహిత జీవితంలో భాగస్వామి నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. అదృష్టం మీ వైపు ఉండటంతో అనుకున్న పనులు చకచకా సాగిపోతాయి.
సింహ రాశి (Leo):
సింహ రాశి వారికి ఈ యోగం పురోభివృద్ధికి నాంది పలకబోతోంది. వీరికి ఈ సమయంలో ఆత్మవిశ్వాసంతో పాటు వ్యక్తిత్వం మరింత ఆకర్షణీయంగా మారబోతోందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. కార్యాలయంలో లేదా ఉద్యోగ రంగంలో చాలా కాలంగా ఎదుర్కొంటున్న ఆటంకాలు తొలగిపోతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు.. పనుల్లో వేగం పెరుగుతుంది. సమాజంలో, పని చేసే చోట మీ గౌరవ మర్యాదలు విపరీతంగా పెరుగుతాయి.. అలాగే, తండ్రితో ఉన్న సంబంధాలు మరింత బలపడే అవకాశం ఉందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.
వృశ్చిక రాశి (Scorpio):
వృశ్చిక రాశి వారికి ఈ వైధృతి యోగం కొత్త అవకాశాలను అందించబోతోంది.. సుదీర్ఘకాలంగా మంచి ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఈ సమయంలో మంచి ఉద్యోగ అవకాశం లభించే ఛాన్స్లు కనిపిస్తున్నాయి. తండ్రుల ద్వారా భారీ మొత్తంలో ఆస్తులు కూడా పొందుతారు. ఆకస్మిక ధనలాభం కలిగే సూచనలు కలిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం కూడా తప్పకుండా కలుగుతుంది.. కార్యాలయంలో కొత్త బాధ్యతలు పెరగడంతో పాటు, అదనపు ఆదాయ వనరులు లభిస్తాయి.. ఈ కాలంలో కుటుంబ సభ్యుల పూర్తి సహకారం మీకు లభిస్తుంది.
ధనుస్సు రాశి (Sagittarius):
సూర్య-చంద్రుల ఈ విశేష కలయిక ధనుస్సు రాశి వారికి అత్యంత లాభదాయకంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అదృష్టం మీకు వంద శాతం అండగా ఉండడం వల్ల జీవితంలోని వివిధ రంగాలలో విజయాలు సాధిస్తారు. ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాలపై ఆసక్తి విపరీతంగా పెరుగుతుంది.. మీ సానుకూల ఆలోచనా విధానం జీవితంలో కీలక నిర్ణయాలు తీసుకోవడానికి ఎంతో సహాయపడుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఈ యోగం ప్రభావంతో సుదూర ప్రయాణాలు చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. విద్యార్థులకు ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది.. పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు. పాత పెట్టుబడుల నుంచి భారీగా లాభాలు చేకూరే అవకాశం ఉంది.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
గమనిక.. 
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..
తెల్లవారుజామున ఘోర సంఘటన.. అన్నదమ్ముళ్లను బలిగొన్న ఆర్టీసీ బస్సు
Gajuwaka, Andhra Pradesh:Vizag Road Accident: ఒక కుటుంబంలో ఆర్టీసీ బస్సు తీవ్ర విషాదం నింపింది. నిర్లక్ష్యం కారణంగా ఇద్దరి ప్రాణాలను ఆర్టీసీ బస్సు బలిగొన్నది. కుటుంబంలో అన్నదమ్ముళ్లుగా ఉన్న ఆ ఇద్దరు సోదరులు మరణంలోనూ రక్త సంబంధం వీడలేదు. బస్సు రూపంలో మృత్యువు కబళించడంతో వారిద్దరూ ప్రాణాలు కోల్పోయారు. ఏపీలోని విశాఖపట్టణంలో చోటుచేసుకున్న ఈ విషాద సంఘటన ఒక కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
Also Read: ఏరువాక పౌర్ణమి రోజు తుంగభద్ర నదిలో కాడెడ్లు మృతి.. గుండెలవిసేలా రైతుల రోదన
విశాఖపట్టణం అక్కయ్యపాలెం ప్రాంతానికి చెందిన పొట్నూరు రమేశ్, పొట్నూరు సతీశ్ సోదరులు. వీరిద్దరూ బజాజ్, రిలయన్స్ సంస్థల్లో పని చేస్తూ కుటుంబానికి ఆసరాగా ఉంటున్నారు. బుధవారం తెల్లవారుజామున ఇద్దరు అన్నదమ్ముళ్లు పని మీద బైక్పై బయటకు వచ్చారు. అనకాపల్లి వైపు నుంచి గాజువాక వైపు వస్తున్న సమయంలో శ్రీనగర్ వంతెనపైకి ఎక్కిన సోదరుల బైక్ను అత్యంత వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది.
గాజువాక శ్రీనగర్ జాతీయ రహదారిపై జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో అన్నదమ్ముళ్లు రమేశ్, సతీశ్ ఇద్దరు తీవ్ర గాయాలపాలయ్యారు. వారు ప్రయాణిస్తున్న బుల్లెట్ బైక్ ఫుట్పాత్ను ఢీకొనడంతో ఇద్దరు కిందపడ్డారు. ఇద్దరి తలలకు తీవ్ర గాయాలవడంతో ఘటనా స్థలంలోనే వారిద్దరూ మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు రోడ్డు ప్రమాద స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం విశాఖపట్టణంలోని కేజీహెచ్కు తరలించారు. దువ్వాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరినీ కోల్పోయిన ఆ కుటుంబం తీవ్ర దుఃఖంలో మునిగింది. వారి స్వస్థలం అక్కయ్యపాలెంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుల కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు.
Also Read: ఏపీలో బయటపడ్డ మరో బంగారు గని.. టన్నుల కొద్దీ బంగారం నిల్వలు
నిత్యం ప్రమాదాలు
అనకాపల్లి-గాజువాక వైపు ఉన్న శ్రీనగర్ వంతెన ఇరుకుగా మారడంతో నిత్యం ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని స్థానికులు చెబుతున్నారు. అక్కడ ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని వాహనాదారులు డిమాండ్ చేస్తున్నారు. దీనికితోడు ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు ఆరోపిస్తున్నారు. తెల్లవారుజామునే రెండు నిండు ప్రాణాలు రోడ్డు ప్రమాదంలో కోల్పోవడం విషాదం నింపింది. మృతుల కుటుంబానికి ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
ఏరువాక పౌర్ణమి రోజు నదిలో కాడెడ్లు మృతి.. గుండెలవిసేలా రైతు దంపతుల రోదన
Kurnool, Andhra Pradesh:Farmer Couple Heart Break: ఏరువాక పండుగ అంటే రైతులు చేసుకునేది. తమకు ఎల్లప్పుడూ వ్యవసాయ పనుల్లో సహాయం చేస్తున్న పశుపక్ష్యాదులతో ఆనందంగా గడిపే పండుగ ఏరువాక పౌర్ణమి. ఈ పండుగ రోజే తీవ్ర విషాద సంఘటన ఏర్పడింది. తుంగభద్ర నదీ తీరంలో వెళ్తున్న రెండు కాడెడ్లు పొరపాటున నీటిలో పడిపోయాయి. వెంటనే అప్రమత్తమైన రైతు దంపతులు వాటిని కాపాడేందుకు ప్రయత్నించగా.. అయితే కాడెడ్లు అప్పటికే నీటిలో మునిగిపోయి మృతి చెందాయి. ఈ సంఘటన ఏపీలోని కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. అయితే ఈ సంఘటనపై టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.
కర్నూలు జిల్లా మంచాలకు చెందిన కురవ సురేష్ వ్యవసాయం చేస్తుంటాడు. వ్యవసాయ పనుల కోసం రెండు కాడెడ్లు ఉన్నాయి. వాటిని ఎంతో అపురూపంగా.. ప్రేమగా చూసుకునేవారు. ఆలనా పాలనా చూసుకుంటూ కాడెడ్లను కుటుంబసభ్యుల్లా చూసుకుంటున్నారు. ఎడ్లకు సంబంధించిన పండుగ ఏరువాక పౌర్ణమి కావడంతో మంగళవారం పండుగ చేసుకుందామని భావించారు. అయితే తుంగభద్ర నదీ తీరంలో ఈ రెండు కాడెడ్లు నీటిలో పడిపోయాయి. ఆ తర్వాత కొద్దిసేపటికే నీటిలో మునిగి అవి మరణించాయి. కాడెడ్లు మృతి చెందడంతో సురేశ్ దంపతులు గుండెలవిసేలా రోదించారు. కుటుంబసభ్యుల్లా ఉన్న ఎడ్లు మృతి చెందడంతో ఆ రైతు దంపతులు రోదించిన విధానం అందరినీ ఆవేదనకు గురి చేస్తోంది. ఈ సంఘటనపై సీఎం చంద్రబాబు 'ఎక్స్' వేదికగా స్పందించారు.
'పశువులను సంపదగా భావిస్తాం. రైతన్నకు వెన్నుదన్నుగా ఉండేవి కాడెద్దులు. కుటుంబసభ్యుల్లా భావించే రెండు ఎద్దులు తుంగభద్ర నదిలో ప్రమాదవశాత్తూ చనిపోవడం ఎంతో బాధ కలిగించింది' అని సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. అన్నదాతకు పవిత్రమైన రోజైన ఏరువాక పౌర్ణమి నాడు ఇవి మృతి చెందడం, ఆ యజమాని కుటుంబం ఆవేదనతో విలపించడం తనన్నెంతో కలిచివేసిందని తెలిపారు. ఎడ్లు లేని లోటు పూడ్చలేనిదైనప్పటికీ వాటి యజమాని కుటుంబానికి ప్రభుత్వం తరపున పరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్కు ఇప్పటికే ఆదేశించినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రాణంలా చూసుకునే ఎడ్లను కోల్పోయిన ఆ కుటుంబానికి కొంత సాయంగా నిలవాలని సూచించినట్లు చెప్పారు.
నేడు సత్యవేడులో పర్యటన
తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు నేడు పర్యటించనున్నారు. మాదనపాలెం సమీపంలోని హీరో మోటోకార్ప్ రెండో గ్లోబల్ పార్ట్స్ సెంటర్కు నేడు శంకుస్థాపన చేయనున్నారు. ఏపీఐఐసీ పరిధిలో ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు భూమిపూజ జరగనుంది. సీఎం పర్యటన సందర్భంగా భద్రతా ఏర్పాట్లు, హెలిపాడ్, వేదిక, రాకపోకల మార్గాలను జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బారాయుడు పరిశీలించారు. నెల్లూరు పర్యటన అనంతరం సాయంత్రం 4:20 గంటలకు హీరో మోటోకార్ప్ హెలిపాడ్కు సీఎం రానున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు ఘన స్వాగతం పలికేందుకు సిద్ధమయ్యారు. శంకుస్థాపన అనంతరం హీరో మోటోకార్ప్ ప్లాంట్ను ముఖ్యమంత్రి సందర్శించనున్నారు. రాత్రి 7 గంటలకు శ్రీ సిటీ గెస్ట్ హౌస్కు చేరుకుని అక్కడే బస చేయనున్నారు.
పశువులను సంపదగా భావిస్తాం. రైతన్నకు వెన్నుదన్నుగా ఉండేవి కాడెద్దులు. కుటుంబ సభ్యుల్లా భావించే రెండు ఎద్దులు తుంగభద్ర నదిలో ప్రమాదవశాత్తూ చనిపోవడం ఎంతో బాధ కలిగించింది. అన్నదాతకు పవిత్రమైన రోజైన ఏరువాక పౌర్ణమి నాడు ఇవి మృతి చెందడం, ఆ యజమాని కుటుంబం ఆవేదనతో విలపించడం నన్నెంతో… pic.twitter.com/ivz4SXAfrU
— N Chandrababu Naidu (@ncbn) June 30, 2026
రైతులకు ఎగ్గొట్టిన రూ.30 వేల కోట్లు ఎప్పుడిస్తావ్ రేవంత్ రెడ్డి?: సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
Wanaparthy, Telangana:Rythu Bharosa: ఎకరాకు ఏడాదికి రూ.15 వేలు, కౌలు రైతులు, భూ యజమానులు, రైతు కూలీలకు రైతు భరోసా ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రైతులను దారుణంగా మోసం చేసిందని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. 'తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ పాలనలో మృగశిర కార్తె వచ్చినట్లు రైతుబంధు రైతుల ఖాతాల్లో ఠంచనుగా పడిపోయేది. ఒక్కసారి రైతుబంధు వేయడం మొదలైతే ఏ రోజు ఏ రైతు ఖాతాలో, ఎన్ని ఎకరాలకు సంబంధించిన డబ్బులు పడతాయో సామాన్య రైతుకు కూడా తెలిసిపోయేది' అని వ్యవసాయ శాఖ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గుర్తుచేశారు.
రైతు భరోసా పేరిట మరోసారి రేవంత్ రెడ్డి మీటింగ్ పెట్టి రైతుల ఖాతాల్లో డబ్బులు వేస్తున్నట్లు పీఆర్ స్టంట్లు చేయడంపై మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఖండించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఓ ప్రకటన చేశారు. కాంగ్రెస్ మోసలు వివరిస్తూనే రైతులకు కేసీఆర్ ప్రభుత్వం ఏమేం చేసిందనేది వివరించారు. 'రైతు భరోసా అమలు విషయంలో రేవంత్ సర్కార్ పిల్లిమొగ్గలు వేస్తుంది. ఎకరాకు రూ.15 వేలను రూ.12 వేలకు కుదించింది. అధికారంలోకి వచ్చిన తర్వాత మూడుసార్లు రైతు భరోసా ఎగ్గొట్టారు. ఒకసారి ఊర్ల వారీగా రైతు భరోసా వేశారు. అది గందరగోళంగా మారడంతో మళ్లీ ఎకరాల వారీగా వేశారు. దానిని కూడా మధ్యలోనే ఆపివేశారు' అని సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గుర్తుచేశారు. గత యాసంగిలో అందరు రైతులకు అని చెప్పి రెండెకరాల వరకు వేసి చేతులు దులుపుకుందని మండిపడ్డారు.
'ఇప్పుడు రైతు భరోసా అంటూ మళ్లీ కొత్త నాటకం మొదలుపెట్టింది. రైతుల ఖాతాల్లో డబ్బులు నేరుగా వేయడానికి సభల పేరుతో వృథా ఖర్చులు ఎందుకు?' అని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు. పంటల కొనుగోళ్ల విషయంలోనూ ఈ సర్కారు చేతులెత్తేసిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఎంత కొంటే అంతే కొంటామని చెప్పి బాధ్యతల నుంచి తప్పుకున్నాడని రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. యూరియా యాప్ రైతులకు శాపంగా మారిందని చెప్పారు. ఈ వైఫల్యాల నుంచి రైతుల దృష్టిని మరల్చడానికి రైతు భరోసా పేరుతో కాంగ్రెస్ పీఆర్ స్టంట్లు చేస్తోందని విమర్శించారు. రైతులందరికీ రైతు భరోసా వేయాలని, గతంలో ఎగ్గొట్టిన రైతు భరోసా నిధులు విడుదల చేయాలని వ్యవసాయ శాఖ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు.
ఏపీలో బయటపడ్డ మరో బంగారు గని.. టన్నుల కొద్దీ బంగారం నిల్వలు
Thummala, Andhra Pradesh:Jowkala Mines: బంగారానికి అడ్డాగా ఆంధ్రప్రదేశ్ మారనుంది. ఏపీలో బంగారం నిక్షేపాలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే కర్నూలు జిల్లా జొన్నగిరిలో బంగారం గనులు ప్రారంభమవగా బంగారం మార్కెట్లో ఏపీ బ్రాండ్ హవా కొనసాగిస్తోంది. ఇదే క్రమంలో మరో చోట కూడా బంగారం గనులు బయటపడ్డాయి. చిత్తూరు జిల్లా కుప్పంలోనూ బంగారు గనులున్నాయని గుర్తించారు. అంతేకాకుండా సత్యసాయి జిల్లాలో కూడా బంగారం నిక్షేపాలు ఉన్నాయని అధికారులు తేల్చారు.
సత్యసాయి జిల్లాలోని ఎన్పీకుంట మండలం జౌకల ప్రాంతంలో ఖనిజాన్వేషణ ప్రక్రియను ఏపీ ప్రభుత్వం వేగవంతం చేసింది. ఇక్కడ బంగారం నిల్వలు ఉన్నాయని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. గతంలోనే జౌకల ప్రాంతంలో భారీగా బంగారం నిక్షేపాలు ఉన్నాయని పరిశోధనల్లో తేలింది. అయితే ఇక్కడ బంగారం ఎంత మేరకు ఉందో తెలుసుకునేందుకు పరిశోధనలు చేసేందుకు అధికార యంత్రాంగం సిద్ధమైంది. బంగారాన్ని అన్వేషించేందుకు ఆరు ప్రైవేట్ ఏజెన్సీలకు ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది.
జౌకల ప్రాంతంలో మొత్తం ఆరు బ్లాకులు ఉండగా అక్కడ నాలుగు దశల్లో అధికారులు, శాస్త్రవేత్తల బృందం పరిశోధన చేయనుంది. పరిశోధనలు పూర్తయ్యాక వచ్చే నివేదికలను పరిశీలించి బంగారం నిక్షేపాలపై ఒక స్పష్టత రానుంది. నివేదికలో ఉన్న అంశాల ఆధారంగా అక్కడ తవ్వకాలు చేయాలా? వద్దా? అనేది నిర్ణయానికి వస్తారు. 2015లోనే శ్రీ సత్యసాయి జిల్లా జౌకల ప్రాంతంలో బంగారం నిక్షేపాలు ఉన్నాయని మినరల్ ఎక్స్ప్లోరేషన్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ ట్రస్ట్ పరిశోధనలు చేసింది.
కర్ణాటకలోని కోలార్ గ్రీన్స్టోన్ బెల్ట్తో ఈ ప్రాంతంతో జౌకల ప్రాంతం పోలి ఉందని.. ఇక్కడ బంగారు నిల్వలు ఉన్నట్లు ట్రస్ట్ సభ్యులు గుర్తించారు. అయితే 2022లో ఈ పరిశోధనలు జీ4 దశలో నిలిచిపోవడంతో బంగారం నిల్వల పరిశోధన ప్రక్రియ నిలిచిపోయింది. జొన్నగిరిలో బంగారు తవ్వకాలు ప్రారంభమైన తర్వాత ఏపీ ప్రభుత్వం జౌకలపై దృష్టి సారించింది. ఆగిపోయిన జీ4 దశ నుంచి మళ్లీ బంగారం నిక్షేపాలపై పరిశోధనలను ప్రారంభించనుంది. పరిశోధనల తర్వాత జౌకల ప్రాంతంలో బంగారు నిల్వలపై ఒక స్పష్టత వస్తుంది. నిక్షేపాలు ఉంటే తవ్వకాలకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇవ్వనుంది.
బంగారం నిల్వలు ఉన్నాయని చెబుతున్న జౌకల వెలిగల్లు గ్రీన్స్టోన్ బెల్ట్ కొత్తపల్లి బ్లాక్ ప్రాంతంలో ఉంది. ఈ ప్రాంతంలో ఆరు బ్లాకుల్లో 5,560 హెక్టార్లలో పూర్తిస్థాయి పరిశోధనలు జరగనున్నాయి. 2001లోనే ఇక్కడ ప్రాథమికంగా బంగారం నిక్షేపాల కోసం అన్వేషించగా ఓ సంస్థ పరిశోధన చేసేందుకు లైసెన్సు కోసం దరఖాస్తు చేసుకుంది. అయితే ఏం జరిగిందో తెలియదు కానీ ఆ తర్వాత అడుగులు ముందుకు పడలేదు. ఈ ఒక్క జౌకల ప్రాంతం మాత్రమే కాదు రామగిరి, రొద్దం ప్రాంతంలోనూ బంగారు నిల్వలు ఉన్నాయని తెలుస్తోంది. ఆయా ప్రాంతాల్లో బంగారు నిల్వలు ఉంటే వాటిని వేలం వేసి ప్రైవేట్ సంస్థలకు అప్పగించాలని ఏపీ ప్రభుత్వం చూస్తోంది. ఇదే కాకుండా చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో బంగారు గనులు ఉన్నట్లు తెలుస్తోంది. గుడుపల్లె మండలం చిగురుగుంట-బిసానత్తం బ్లాక్లో బంగారం ఉందని వార్తలు వస్తున్నాయి. ఈ ప్రాంతం కర్ణాటకలోని కేజీఎఫ్ ప్రాంతానికి 27 కిలోమీటర్ల దూరంలో ఉండడంతో ఇక్కడ కూడా బంగారం నిక్షేపాలు ఉంటాయని తెలుస్తోంది. అక్కడ కూడా త్వరలో పరిశోధనలు చేసే అవకాశం ఉంది.
రైతులను నిండా ముంచిన రేవంత్ రెడ్డిది రైతు వంచన ప్రభుత్వం.. హరీశ్ రావు తీవ్ర ఆగ్రహం
Mahbubnagar, Telangana:Harish Rao Challenge: 'తెలంగాణ కోసం రాజీనామా చేయమంటే జిరాక్స్ కాయితం ఇచ్చిన చరిత్ర రేవంత్ రెడ్డిది. రేవంత్ రెడ్డి ఉద్యమం గురించి, త్యాగాల గురించి మాట్లాడుతుంటే నవ్విపోదురు గాక నాకేం సిగ్గు అన్నట్టు ఉంది ఆయన తీరు' అని అసహనం వ్యక్తం చేశారు. పాలమూరు ప్రజల జోష్ చేస్తుంటే బీఆర్ఎస్ పార్టీ మళ్లీ కచ్చితంగా అధికారంలోకి వస్తుంది అనే నమ్మకం ఉందని విశ్వాసం వ్యక్తం చేశారు. జడ్చర్లలో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ సమావేశంలో మాజీ మంత్రి హరీష్ రావు కీలక ప్రసంగం చేశారు.
'హైదరాబాద్లో రేవంత్ రెడ్డి రైతు ఆశీర్వాద సభ అని పెడుతున్నాడు. అది రైతు ఆశీర్వాద సభ కాదు రైతుల వంచన సభ' అని మాజీ మంత్రి హరీశ్ రావు ప్రకటించారు. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి రైతును వంచించుతూనే ఉన్నాడని ఆరోపించారు. 'యాసంగి రైతు బంధు ఎగొట్టి ఇప్పుడు మళ్లీ వానాకాలం రైతుబంధు వేస్తానని మోసం చేస్తున్నాడు. రైతు రుణమాఫీ రూ.2 లక్షలు కాదు కదా రూ.లక్ష లోపు ఉన్నవాళ్లకు కూడా చెయ్యలేదు' అని రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
'నల్గొండలో ఒట్టేసి చెబుతున్నా మూసీ ప్రాజెక్ట్ పూర్తి చేస్తానన్నాడు. ఆ ఒట్టు అనేదానికి ప్రాణం ఉంటే ఈ రేవంత్ రెడ్డి అబద్ధాలకు ఉరేసుకొని ఎప్పుడో ఆత్మహత్య చేసుకునేది. కనిపించిన దేవుడి మీద ఒట్టు పెట్టి రుణమాఫీ చేయకుండా దేవుళ్లనే మోసం చేసిన ఘనుడు రేవంత్ రెడ్డి' అని బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు గుర్తుచేశారు. 'పాలమూరు బిడ్డలు స్వచ్ఛమైన పాలలాంటి మనుసున్న బిడ్డలు. రేవంత్ రెడ్డి జూట మాటలు, బట్టెబాజ్ మాటలతో పాలమూరు పరువు తీస్తున్నాడు' అని మండిపడ్డారు.
'ఎన్నికల్లో మాట ఇచ్చి తప్పిన మనిషి రేవంత్ రెడ్డి. హామీ ఇవ్వక పోయినా ప్రజలకు కావాల్సింది అర్ధం చేసుకొని రుణమాఫీ చేసిన నాయకుడు కేసీఆర్. రైతుబంధు పేరిట రూ.29, 300 కోట్లు రైతులకు రేవంత్ రెడ్డి బాకీపడ్డాడు. జూపల్లి కృష్ణారావు మతి ఉండి మాట్లాడుతాడో మతి లేక మాట్లాడతాడో అర్ధం కాదు' అని మాజీ మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. 'ఎన్నికలకు ముందు అన్ని పంటలకు బోనస్ అని చెప్పి.. అధికారంలోకి వచ్చాక సన్న వడ్లకే అన్నారు. ఇప్పుడు కేవలం 7 ఏడు రకాల వడ్లకే అంటున్నారు' అని గుర్తుచేశారు.
'కేసీఆర్ హయాంలో యూరియా కోసం గోదాములు కట్టించి నిల్వ ఉంచాడు. కానీ రేవంత్ రెడ్డి యాపులు అంటూ నాటకాలు చేస్తున్నాడు. అసెంబ్లీలో తరుగు పెడితే తోలు తీస్తానని రేవంత్ రెడ్డి అన్నాడు. కానీ తెలంగాణలో ఏ ఊరులో అయినా తరుగు లేకుండా ఒక్క బస్తా కొన్నారా? రేవంత్ రెడ్డి ఎంత మంది తోళ్లు తీశాడు?' అని బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు ప్రశ్నించారు. దళారుల చేతిలో, రైస్ మిల్లర్ల చేతిలో రేవంత్ రెడ్డి తోలు బొమ్మ అయ్యాడు తప్ప ఎవరి తోలు తియ్యలేదు అని విమర్శించారు.
'కేసీఆర్ అధికారంలో ఉన్నపుడు 24 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చింది బీఆర్ఎస్. రేవంత్ రెడ్డి వచ్చాక 6 గంటలకు వచ్చింది. రైతుల కరెంటులో కోత పెట్టడానికే రైతు డిస్కం. సోలార్ పవర్ మాత్రమే రైతు డిస్కంలకు కేటాయిస్తారంట. ఒకవేళ అదే జరిగితే పొద్దున్న 9 నుండి సాయంత్రం 4 వరకే కరెంట్ వస్తది. రైతు డిస్కమ్ అనేది రైతు 24 గంటల కరెంటుకి ఉరితాడు అవుతది' అని రైతులను మాజీ మంత్రి హరీశ్ రావు హెచ్చరించారు. 'కేసీఆర్ ఇచ్చిన రైతు బీమా రైతు కుటుంబాలకు ఒక ధీమా లెక్క ఉండే. కానీ కేసీఆర్ పోయాక ఒక 6 నెలల నుంచి రైతు బీమా బంద్ అయ్యింది. ఎల్ఐసీకి బీమా డబ్బులను రేవంత్ రెడ్డి కట్టలేదు. 7,600 రైతు కుటుంబాలు రైతు బీమా కోసం ఎదురుచూస్తున్నాయి' అని రేవంత్ రెడ్డి మోసాలను సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు వివరించారు.
తెలంగాణలో రేవంత్ రెడ్డి మోసం చేయని ఒక్క వర్గం లేదు: హరీశ్ రావు
Mahbubnagar, Telangana:Harish Rao vs Revanth Reddy: రైతులకు బాకీపడ్డ రూ.30 వేల కోట్లు ఎప్పుడు ఇస్తావో చెప్పాలని రైతుల పక్షాన రేవంత్ రెడ్డిని మాజీ మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు. మిగిలిపోయిన రుణమాఫీ ఎప్పటిలోగా పూర్తి చేస్తావో చెప్పాలని రైతుల పక్షాన నిలదీశారు. 'కేంద్రం కొనుమన్న పంటే కొంటాం, కేంద్రం కొనుమన్న అంతే కొంటాం అని అంటున్న రేవంత్ రెడ్డి మీరు ఉన్నది ఎందుకు. కేంద్రానికి సరెండర్ అయ్యారా? కేంద్రం టార్గెట్ 50 లక్షల మెట్రిక్ టన్నులు. అంతే కొంటే మిగితా రైతుల పరిస్థితి ఏంటి..? వడ్లు కొనే చేతకాని ప్రభుత్వాన్ని రైతులు నమ్ముతారా?' అని ప్రశ్నించారు.
జడ్చర్లలో బీఆర్ఎస్ పార్టీ నాయకుల విస్తృత సమావేశం నిర్వహించగా.. మాజీ మంత్రి హరీష్ రావు కీలక ప్రసంగం చేశారు. 'కరోనా వచ్చినా కరువు వచ్చినా కేసీఆర్ హయాంలో రైతు బంధు ఆగలేదు. 11 విడతల్లో రూ.73 వేల కోట్లు కేసీఆర్ రైతుబంధు ఇచ్చాడు. రేవంత్ రెడ్డి వచ్చాక వచ్చిన 5 విడతల్లో 3 విడతలు ఎగొట్టాడు. మూడు పంటలకు మూడుసార్లు రైతు బంధు ఇవ్వాలన్నాడు ఇప్పటికే మూడు రైతు బంధులు ఎగ్గొట్టాడు' అని రేవంత్ రెడ్డి మోసాలను బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు వివరించారు. బీఆర్ఎస్ పార్టీ హయాంలో 2021-2022లో 92 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొన్నామని.. దానితో పోల్చుతే మీరుకొన్నది ఎంత? అని రేవంత్ రెడ్డిని తీసిపడేశారు.
'పాలమూరు పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిది. కల్వకుర్తిలో 3 లక్షల 30 వేల ఎకరాలకు నీరు ఇచ్చాం. నెట్టెంపాడుకు లక్ష 60 వేల ఎకరాలకు నీరు ఇచ్చాం, భీమాలో లక్ష 70 వేల ఎకరాలకు నీరు ఇచ్చాం. చెరువులు, కాల్వలు పూర్తి చేసి వలసలను వాపస్ తెచ్చాం. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి మూడేళ్లు అవుతోంది ఒక్క ఎకరాకు నీళ్లు ఇచ్చావా?' అని బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు ప్రశ్నించారు.
'తుంగభద్ర నది మీద శ్రీశైలం ప్రాజెక్టుకు నీళ్లు రాకుండా 65 టీఎంసీలతో ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలు డ్యాములు కడుతుంటే మన పాలమూరు రంగారెడ్డి పరిస్థితి ఏంటి?' అని రేవంత్ రెడ్డిని మాజీ మంత్రి హరీశ్ రావు నిలదీశారు. 'ఇంటర్లింకింగ్ అఫ్ రివర్స్, ఆల్మట్టి ఎత్తు, అక్రమ ప్రాజెక్టులు తుంగభద్ర, కృష్ణపై కడుతున్న ప్రాజెక్ట్లపై ఒక్క మాట కూడా మాట్లాడకుండా రేవంత్ రెడ్డి నోరు మూసుకున్నాడు' అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
'తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ మాట ఇచ్చాడు. తండాలను గ్రామ పంచాయితీలను చేస్తానన్నాడు చేసి చూపించాడు. హైకోర్టు మొట్టికాయలు వేసినా పిల్లలకు ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు ఇవ్వడం లేదు. ఫీజు కట్టక పిల్లల సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు వారి చదువులు ఆగిపోతున్నాయి' అని మాజీ మంత్రి హరీశ్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. 'రేవంత్ పాలనలో ఎస్సీ/ఎస్టీలకు అన్యాయం. బీసీలకు అన్యాయం, వృద్ధులకు మోసం, రైతులకు ఢోకా రేవంత్ రెడ్డి మోసం చేయని ఒక్క వర్గం లేదు' అని విమర్శించారు.
'అందాల పోటీలకు వంద కోట్లు ఉంటాయి, ఫ్యూచర్ సిటీకి, నీ మనవడు ఫుట్బాల్ ఆటకు, మూసీకి వందల కోట్లు ఉంటాయి. పిల్లల చదువులకు ఉండవా రేవంత్ రెడ్డి. డబ్బులు లేక కాదు ఇవ్వాలనే మనుసు నీకు లేదు' అని రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. సంగారెడ్డి పాశమైలారం సిగాచీ ఘటనలో 54 మంది చనిపోతే మనిషికి కోటి రూపాయలు ఇస్తానని ఇప్పటివరకు రూపాయి కూడా ఇవ్వలేదని గుర్తుచేశారు. 'రూ.200 ఉన్న పింఛన్ను రూ.2000 చేసిన ఘనత కేసీఆర్. రూ.4000 ఇస్తానన్న రేవంత్ రెడ్డి రూపాయి కూడా పెంచలేదు. ఒక్క కొత్త పింఛన్ ఇవ్వలేదు' అని బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు గుర్తుచేశారు. ప్రతి కార్యకార్త ఒక సైనికుడి లాగా పోరాడాలని.. ప్రతి గ్రామంలో రేవంత్ చేస్తున్న స్కాంల మీద, తప్పిన మాట మీద చర్చ పెట్టాలని గులాబీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. 'కొడంగల్లో నరేందర్ రెడ్డి చిత్తూ చిత్తుగా ఓడిస్తే పోయి మల్కాజిగిరిలో 5000 ఓట్లతో గెలిచావు. మల్ల నిన్ను ఇక్కడ ఓడించడం ఖాయం. పాలమూరులో 14 సీట్లకు 14 సీట్లను గెలిచి తీరుతాం. బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయం' అని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు హరీశ్ రావు పూర్తి విశ్వాసం ప్రకటించారు.
దమ్ముంటే రాజీనామా చేయాలని అంటున్నారు. నీ అయ్య జాగీరా? రేవంత్ రెడ్డి ఫైర్
Hyderabad, Telangana:Farmers Welfare: 'ప్రభుత్వ ఉద్యోగులకు విడతల వారీగా జీతాలు ఇచ్చారు. కష్టమైనా ఫస్టు తారీఖున జీతాలు ఇవ్వాల్సిందేనని అధికారులను ఆదేశించా. బడి పిల్లల కూరగాయలు, బట్టలకు కూడా చెల్లించకుండా బకాయిలు పెట్టారు. సర్పంచ్లకు వందల కోట్లు బకాయిలు పెట్టారు. సర్పంచ్లు ఆత్మహత్యలు చేసుకున్నారు. సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ధర్నాలు చేశారు. బకాయిలు పెట్టింది బకాసురులు కట్టే పని మాత్రం నాకు పడింది. ఇనుప కంచెలు వేసుకుని నేను లోపల లేను' అని రేవంత్ రెడ్డి తెలిపారు.
నవాబులం కాదు బీకారులం
హైదరాబాద్ మాదాపూర్లో రైతులకు రైతు బంధు నిధులు విడుదల చేసిన అనంతరం రేవంత్ రెడ్డి కీలక ప్రసంగం చేశారు. బీజేపీతోపాటు బీఆర్ఎస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. షేర్వానీ వేసుకుని నవాబు అని చెప్పుకోలేం.. మనం నవాబులం కాదు బీకారులం అని తెలిపారు. 'స్వయం సహాయక మహిళలు బడి పిల్లలకు వండి పెడితే వాళ్లకు కూడా డబ్బులు ఇవ్వలేదు. హాస్టళ్లలో చదువుకునే పిల్లలకు మెస్ ఛార్జీలు, కాస్మోటిక్ ఛార్జీలు ఇవ్వలేదు' అని రేవంత్ రెడ్డి బీద అరుపులు అరిచారు. అప్పులతో పాటు అడ్డగోలుగా తప్పులు కూడా చేశాడు.. ఢిల్లీకి పోయే పరిస్థితి లేకుండా చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు.
చర్చకు సిద్ధమా?
'రైతుల కోసం ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేద్దాం. చర్చకు సిద్ధమా? పదేళ్లలో మీరు ఏం చేశారో, రెండున్నర యేళ్లలో మేం ఏం చేశామో చర్చకు సిద్ధం' అని బీఆర్ఎస్ పార్టీకి రేవంత్ రెడ్డి సవాల్ చేశారు. కాళేశ్వరం కోసం రూ.లక్షా రెండు వేల కోట్లు చెల్లిస్తే రెండేళ్లలో కూలిపోయి కూలేశ్వరం అయింది. డబ్బులు గోదావరిలో కలిసిపోయాయి. ఏ ఊరిలో రైతులు పంటలు పండించినా కాళేశ్వరం నీళ్లతోనే పండాయి అన్నారు. మూడేళ్లలో కాళేశ్వరం నుంచి చుక్క నీరు రాకపోయినా 2 కోట్ల 80 లక్షల టన్నుల ధాన్యాన్ని తెలంగాణ రైతులు పండించారు. కేసీఆర్ ఎంత కాలం కాశీ మజలీ కథలు చెపుతావు?' అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
తెలంగాణలో ఆటలు సాగవు
'చిన్న రాక్షసులు బయలుదేరి కేసీఆర్ రావాలని కోరుకుంటున్నారని చెపుతున్నాడు. కేసీఆర్ రావాలని ఎవరు కోరుకుంటున్నారు? రూ.లక్ష రుణమాఫీ చేయలేదు. దళితులకు మూడెకరాలు ఇవ్వలేదు. కోటీ ఎకరాలకు నీళ్లు ఇస్తానని చెప్పి ఇవ్వలేదు' అని రేవంత్ రెడ్డి విమర్శించారు. 'ప్రతి పేదవాడి ఖాతాల్లో రూ.15 లక్షలు వేస్తానని మోదీ చెప్పాడు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్నాడు.. 24 కోట్ల ఉద్యోగాలు రావాలి ..వచ్చాయా..?' అని ప్రశ్నించారు. తెలంగాణలో బండి సంజయ్, కిషన్ రెడ్డికి మాత్రమే ఉద్యోగాలు ఇచ్చాడని ఎద్దేవా చేశారు. బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్ వచ్చే ప్రభుత్వం మాదే అంటున్నాడు.. ఏందీ వచ్చేది.. తెలంగాణలో ఆటలు సాగవు అని హెచ్చరించారు.
'పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు రూ.8 వేల కోట్ల బకాయిలు పెట్టిపోయారు. ఆర్టీసీ రూ.వెయ్యి కోట్ల లాభాల్లోకి వచ్చింది.. సింగరేణి లాభాల్లోకి తెచ్చాం. ధరణిని బంగాళాఖాతంలో వేసి భూభారతి తెచ్చి సమస్యలు పరిష్కరిస్తున్నాం. ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నాం. ఇప్పటివరకు రూ.11 వేల కోట్లు ఆర్టీసీకి ప్రభుత్వం చెల్లించింది. ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం వద్దని ఆటో వాళ్లను రెచ్చగొట్టి ధర్నాలు చేయించే ప్రయత్నం చేశారు. వెయ్యి బస్సులకు మహిళా సంఘాలను యజమానులను చేశాం' అని రేవంత్ రెడ్డి చిట్టా విప్పారు.
నీ అయ్య జాగీరా?
'దమ్ముంటే రాజీనామా చేయాలని అంటున్నారు. నీ అయ్య జాగీరా? నీ తాత గడీలు అనుకుంటున్నావా? గడీల ముందు బానిసలమా రాజీనామా చేయడానికి' అని ప్రతిపక్షాలపై రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 'ఒక్క నిజం చెప్పితే తలకాయ వెయ్యి వక్కలు అవుతుందన్న శాపం కల్వకుంట్ల కుటుంబానికి ఉన్నట్లుంది. ఒకరికి మించి ఒకరు అబద్దాలు చెబుతున్నారు. కేసీఆర్ను మించి అబద్దాలు చెపుతున్నారు. బుద్ది మారనంత వరకు దేవుడు వాళ్లను క్షమించరు' అని విమర్శించారు. 'బతుకమ్మ చీరలను జొన్న చేను కాడ పిట్టలు కొట్టడానికి కట్టారు. మేం పెట్టిన చీరలను ఆడబిడ్డలు సంతోషంగా కట్టుకుంటున్నారు' అని తెలిపారు.
