icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

EPF e-Nomination: పీఎఫ్ ఖాతాదారులు చేసే ఆ ఒక్క చిన్న తప్పు.. కుటుంబానికి భారీ నష్టం.. ఈ పని ఇప్పుడే పూర్తి చేయండి..!!

BBhoomi31m ago
Lakshmapur, Telangana:

E-Nomination: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ 1952 ఈపీఎఫ్ స్కీమ్  నిబంధనల ప్రకారం..ఈపీఎఫ్ సభ్యులందరికీ ఇ-నామినేషన్‌ను తప్పనిసరి చేసింది. చెల్లుబాటు అయ్యే నామినేషన్ ఉండటం వలన, సభ్యుడు మరణించిన సందర్భంలో నామినీకి ఈపీఎఫ్ఓ బెనిఫిట్స్ అందేలా చేస్తుంది.  నామినీని జోడించే సౌకర్యం EPFO ​​పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంది. PF ఖాతాదారులు తమ ఇంట్లో నుంచే నామినేషన్ కోసం సులభంగా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే, ఇ-నామినేషన్ సకాలంలో ఇ-సంతకం చేస్తేనే.. చెల్లుబాటు అవుతుంది.

మీరు మీ PF ఖాతాకు నామినీని చేర్చి, ఇ-సంతకం పెట్టడం మర్చిపోయినట్లయితే..  ఆ ప్రక్రియ పూర్తి కానట్లే.  దీనివల్ల నిధులు అందుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. EPF ఇ-నామినేషన్ పత్రం ప్రకారం, ఒకవేళ సభ్యుడు మరణిస్తే, కేవలం దాఖలు చేసి, సంతకం చేయని PDF ఇ-నామినేషన్‌ను ప్రాసెస్ చేయరు.

మీ EPF ఇ-నామినేషన్‌పై ఇ-సంతకం ఎలా చేయాలి?
EPF ఇ-నామినేషన్‌ను ధృవీకరించడానికి, సభ్యులు ఇ-సంతకం ప్రక్రియను పూర్తి చేయాలి. నామినీ వివరాలను సమర్పించిన తర్వాత ఈ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ తెలుస్తోంది. 

దశ 1: EPFO ​​సభ్యుల పోర్టల్‌లోకి లాగిన్ అవ్వండి

దశ 2: 'నిర్వహణ' ట్యాబ్‌కు వెళ్లి, ఆపై 'ఇ-నామినేషన్'ను ఎంచుకోండి.

దశ 3: 'ఇ-సైన్' లింక్‌పై క్లిక్ చేసి, తదుపరి పేజీలో చెక్‌బాక్స్‌ను ఎంచుకోండి.

దశ 4: రెండు ఆధార్ ఆధారిత ప్రమాణీకరణ ఎంపికలలో ఒకదాన్ని ఎంచుకోండి.

ఆధార్ సంఖ్య/వర్చువల్ ID (VID)

5వ దశ: మీ ఆధార్ నంబర్ లేదా వర్చువల్ ఐడిని నమోదు చేసి, వెరిఫై బటన్‌ను నొక్కండి.

6వ దశ: సభ్యుని ఆధార్ అనుసంధానిత మొబైల్ నంబర్‌కు ఒక OTP పంపబడుతుంది.

7వ దశ: OTPని ఎంటర్ చేసి, ఆపై సబ్మిట్ బటన్‌ను నొక్కండి

OTP ధృవీకరించబడిన తర్వాత, నామినేషన్ వివరాలు EPFO ​​డేటాబేస్‌లో భద్రపరచబడతాయి మరియు ఇ-నామినేషన్ ప్రక్రియ పూర్తవుతుంది.

16-అంకెల ఆధార్ వర్చువల్ ఐడి (VID)ని ఎలా రూపొందించాలి

ఇ-సైనింగ్ కోసం వర్చువల్ ఐడిని ఉపయోగించాలనుకునే సభ్యులు ఈ క్రింది దశలను అనుసరించి UIDAI వెబ్‌సైట్ నుండి దానిని సృష్టించుకోవచ్చు:

మొదటి దశ: UIDAI వెబ్‌సైట్ uidai.gov.in ను సందర్శించండి.

దశ 2: ఆధార్ సేవల క్రింద ఉన్న 'వర్చువల్ ఐడి (VID) జనరేటర్' పై క్లిక్ చేయండి

దశ 3: మీ 12 అంకెల ఆధార్ నంబర్ మరియు క్యాప్చా కోడ్‌ను నమోదు చేయండి

దశ 4: 'OTP పంపండి' పై క్లిక్ చేసి, ఆపై నమోదిత మొబైల్ నంబర్‌కు వచ్చిన OTPని నమోదు చేయండి

5వ దశ: కింది వాటిలో ఒకదాన్ని ఎంచుకోండి:

Also Read: Maruti Suzuki June Offers: జూన్‌లో కారు కొంటున్నారా? Nexa మోడల్స్ పై రూ. 2.15 లక్షల వరకు భారీ డిస్కౌంట్..!!

కొత్త VIDని క్రియేట్  చేసుకోండి / లేదంటే ఉన్న VIDని పొందండి

ఈ దశలన్నీ పూర్తి చేసిన తర్వాత, మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు 16 అంకెల వర్చువల్ ఐడి వస్తుంది. అయితే సభ్యులు ఒక విషయాన్ని గమనించాలి. వారు ఇప్పటికే ఒక VIDని కలిగి ఉన్నట్లయితే.. ఆ తర్వాత మరొకటి క్రియేట్ చేస్తే.. కొత్త VID మాత్రమే చెల్లుబాటు అవుతుంది. కొత్త VID క్రియేట్ చేసిన  తర్వాత మీరు పాత VIDని ఎంటర్ చేస్తే, ఆ VID ఇన్ వ్యాలిడ్ అనే మెసేజ్ వస్తుంది. 

EPF నామినేషన్ నియమాలు:
EPF-EPS లకు నామినేషన్ నియమాలు వేర్వేరుగా ఉంటాయి. EPF చట్టం ప్రకారం, కుటుంబం అంటే.. పురుష ఉద్యోగులకు , వారి భార్య, పిల్లలు (వివాహితులు లేదా అవివాహితులు), వారిపై ఆధారపడిన తల్లిదండ్రులు, కుమారుని వితంతువు,  పిల్లలు కుటుంబంగా పరిగణిస్తారు. మహిళా ఉద్యోగి విషయంలో..అయితే.. ఆమె భర్త, పిల్లలు (వివాహితులు లేదా అవివాహితులు), ఆమెపై ఆధారపడిన తల్లిదండ్రులు, భర్తపై ఆధారపడిన తల్లిదండ్రులు, కొడుకు వితంతువు, పిల్లలు కుటుంబంగా పరిగణిస్తారు. 

EPS అయితే  కుటుంబం అంటే  ఉద్యోగి   భార్య/భర్త, ఉద్యోగి   మైనర్ కుమారుడు లేదా కూతురు,   దత్తపుత్రుడు లేదా కుమార్తె నామినీగా పరిగణిస్తారు. 

Also Read: LPG Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. మళ్లీ పెరిగిన వంటగ్యాస్

 

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Bigg Boss 10 Telugu: బిగ్‌బాస్ సీజన్ 10 ప్రోమో వచ్చేసింది! ఈసారి 'దశావతారమే' అంటూ నాగ్ వీడియో రిలీజ్!

Hyderabad, Telangana:

Bigg Boss 10 Telugu Promo: తెలుగు బుల్లితెరపై అత్యంత ప్రజాదరణ పొందిన అతిపెద్ద రియాలిటీ షో 'బిగ్ బాస్' సరికొత్త మైలురాయిని చేరుకోవడానికి సిద్ధమైంది. ఇప్పటివరకు విజయవంతంగా 9 సీజన్లను పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షో, ఇప్పుడు ప్రతిష్టాత్మకమైన 10వ సీజన్‌లోకి అడుగుపెడుతోంది. ఇటీవల ముగిసిన 9వ సీజన్‌లో కామన్ మెన్ కేటగిరీ నుంచి వచ్చిన కళ్యాణ్ పడాల విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా స్టార్ మా విడుదల చేసిన బిగ్ బాస్ సీజన్ 10 అఫీషియల్ ప్రోమో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

హోస్ట్ ఎవరంటే..!
ఈ సీజన్‌కు కూడా హోస్ట్‌గా ఎవరు వ్యవహరిస్తారనే ఉత్కంఠకు తెరదించుతూ.. కింగ్ నాగార్జున తనదైన స్టైలిష్ లుక్, పవర్‌ఫుల్ ఎనర్జీతో ప్రోమోలో ప్రత్యక్షమయ్యారు. 'నాగ్ సార్‌కి మేము కల్ట్ ఫ్యాన్స్' అనే బ్యాక్‌గ్రౌండ్ సాంగ్‌తో సాగిన ఈ ప్రోమోలో నాగార్జున హోస్టింగ్ హైలైట్‌గా నిలిచింది.

"బిగ్ బాస్ అంటే ఎన్నో యుద్ధాలు గెలుచుకున్న రాజ్యం మాత్రమే కాదు, ఎంతో మంది హృదయాలను గెలుచుకున్న మహా సామ్రాజ్యం" అంటూ నాగ్ చెప్పిన డైలాగ్స్ ప్రేక్షకుల్లో జోష్ నింపాయి. అయితే ఈ మహా సామ్రాజ్యాన్ని రూల్ చేసేది తాను కాదని, బిగ్ బాస్‌ను అమితంగా ప్రేమించే అభిమానులేనని ఆయన స్పష్టం చేశారు.

ఈసారి ప్రోమోను కాస్త విభిన్నంగా, ప్రజలకు కనెక్ట్ అయ్యేలా డిజైన్ చేశారు. సాధారణ సెలూన్ షాపుల నుండి హైటెక్ ఐటీ ఆఫీసుల వరకు.. ఇళ్లలోని కుటుంబ సభ్యులందరూ బిగ్ బాస్ కోసం ఎంతగా ఎదురుచూస్తారో ఇందులో చూపించారు. ప్రతి ఒక్కరి జీవితంలో ఇదొక డైలీ డోస్ ఎంటర్టైన్‌మెంట్‌గా మారిందని.. సరికొత్త ఎమోషన్స్, గొడవలు, నవ్వులతో ఈ షో కొత్త అధ్యాయాన్ని లిఖించబోతుందని హింట్ ఇచ్చారు.

ప్రోమో చివర్లో నాగార్జున చెప్తూ.. "ఈ ప్రస్థానం ఇంకో కొత్త చాప్టర్‌కి సాక్ష్యం కాబోతోంది. ఈ సారి మీరు చూడబోయేది బిగ్ బాస్ 'దశావతారం'. ఈ సారి  ఆటలో సవాల్ కాదు.. ఆటే సవాల్!" అంటూ షోపై అంచనాలను భారీగా పెంచేశారు. కింగ్ నాగ్ మార్క్ ఎనర్జీతో ఉన్న ఈ 'కమింగ్ సూన్' ప్రోమో చూస్తుంటే, ఈ సారి కంటెస్టెంట్ల ఎంపిక, టాస్కులు మరింత పవర్‌ఫుల్‌గా ఉండబోతున్నాయని స్పష్టమవుతోంది. బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ పదో సీజన్ త్వరలోనే గ్రాండ్‌గా ప్రారంభం కానుంది.

Also Read: జీ స్టూడియోస్‌లో సినిమా ఛాన్స్..! విజేతలకు రూ.5 లక్షల బహుమతి!

Also Read: స్వర్గానికి దారి చూపిస్తానంటూ ఊరిస్తున్న బిగ్‌బాస్ బ్యూటీ దివి..జిమ్‌లో అందాల ఆరబోత!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Talliki Vandanam 2026: 'తల్లికి వందనం' నిధుల విడుదల తేదీ మార్పు! అకౌంట్లోకి డబ్బులు పడేది ఆ రోజే!

Vijayawada, Andhra Pradesh:

Talliki Vandanam List 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 'తల్లికి వందనం' పథకం నిధుల విడుదల తేదీపై కీలక అప్‌డేట్ వచ్చింది. స్కూళ్లు, ఇంటర్ కాలేజీలకు వెళ్లే విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ కావాల్సిన ఈ ఏడాది నిధుల విడుదల కాస్త ఆలస్యం కానుంది. ముందుగా అనుకున్న తేదీ కంటే వారం రోజులు ఆలస్యంగా, జూన్ 19న ఈ నిధులను విడుదల చేయడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.

తేదీ మారడానికి ప్రధాన కారణం ఇదే!
1) పథకంలో ఎలాంటి అవకతవకలు జరగకుండా, అర్హులైన ప్రతి ఒక్కరికీ లబ్ధి చేకూరాలనేది ప్రభుత్వ ఉద్దేశం. ఇందుకోసం స్కూళ్ల నుండి సేకరించిన విద్యార్థుల డేటాను నిశితంగా పరిశీలించడానికి సచివాలయాలకు పంపారు.

2) ప్రభుత్వం ఈసారి కఠినమైన గైడ్‌లైన్స్ జారీ చేయడంతో, నిబంధనల ప్రకారం లబ్ధిదారుల అర్హతలను క్షేత్రస్థాయిలో అధికారులు అత్యంత పారదర్శకంగా తనిఖీ చేస్తున్నారు.

3) ఈ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 60 లక్షలకు పైగా లబ్ధిదారులు ఉన్నారు. ఇంత భారీ సంఖ్యలో ఉన్న డేటాను పరిశీలించి, తుది జాబితాను ఖరారు చేయడానికి మరింత సమయం పడుతోంది.

రాష్ట్రంలో వేసవి సెలవుల అనంతరం కొత్త విద్యా సంవత్సరం జూన్ 12న ప్రారంభం కానుంది. అయితే పాఠశాలలు తెరిచే రోజే ఈ నిధులను తల్లుల ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం భావించింది. కానీ, పైన పేర్కొన్న సాంకేతిక, పరిశీలన ప్రక్రియల కారణంగా జూన్ 12న నిధుల విడుదల సాధ్యం కావడం లేదు.

తాజా సమాచారం ప్రకారం.. జూన్ 19న తల్లికి వందనం నిధులను విడుదల చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. క్షేత్రస్థాయి పరిశీలన పూర్తయి, అర్హుల తుది జాబితా సిద్ధమైన వెంటనే దీనిపై ప్రభుత్వం నుండి అధికారిక ప్రకటన వెలువడనుంది. జూన్ 19 లేదా ఒక రోజు అటుఇటుగా నిధుల జమ కావడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.

Also Read: పవన్ కల్యాణ్ 'ఓజీ' సినిమా చూపిస్తూ మహిళకు సర్జరీ..ఏపీలో బ్రెయిన్ సర్జరీ సక్సెస్!

Also Read: టీచర్లు, క్లాస్‌రూమ్‌లు లేని సరికొత్త 'స్కూల్ 21'లో నారా లోకేష్, శ్రీకృష్ణ దేవరాయలు

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement

Kondagattu: కొండగట్టు ఆలయంలోకి.. తుపాకీతో లోపలికి వెళ్లిన మాజీ మంత్రి సెక్యూరిటీ!

Hyderabad, Telangana:

Kondagattu Temple Security Breach Latest News: ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు అంజన్న ఆలయంలో శనివారం తీవ్ర కలకలం రేగింది.. ఆలయ నిబంధనలకు విరుద్ధంగా ఆయుధాలతో లోపలికి ప్రవేశించడంపై భక్తులతో పాటు స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. మాజీమంత్రి అల్లోల ఇంద్రకీరణ్ రెడ్డి పర్యటనలు చోటు చేసుకున్న ఈ భద్రతా లోపం ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అసలు ఆయుధాలతో హనుమాన్ మందిరంలోకి వెళ్లడానికి గల కారణాలేంటి? ఈ అంశానికి సంబంధించిన అన్ని వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం..

కుటుంబ సమేతంగా మాజీ మంత్రి పూజలు..
మాజీ మంత్రి అల్లోల ఇంద్ర కిరణ్ రెడ్డి శనివారం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి వారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.. ఆలయానికి చేరుకున్న ఆయనకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.. అనంతరం ఇంద్రకీరణ్ రెడ్డి స్వామివారికి ప్రత్యేకమైన పూజలు నిర్వహించారు. వేద పండితులు మంత్రోచ్ఛారణల నడుమ ఆయనకు.. ఆయన కుటుంబ సభ్యులకు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించి ఆశీర్వచనాలు అందజేశారు..

తుపాకీతో ప్రవేశం..
ఈ పర్యటన అంతా బాగానే సాగుతున్న సమయంలో.. మాజీ మంత్రి వెంట వచ్చిన వ్యక్తిగత భద్రత సిబ్బంది ఒకరు తన అధికారిక తుపాకీతో నేరుగా ఆలయం ప్రాంగణంలోకి ప్రవేశించారు.. కొండగట్టు అంజన్న క్షేత్ర నిబంధనల ప్రకారం ఆలయ ప్రాంగణంలోకి ఎలాంటి ఆయుధాలతో పాటు నిషిద్ధ వస్తువులను తీసుకురాకూడదు.. అంతేకాకుండా కొన్ని రకాల ఐరన్ వస్తువులను కూడా తీసుకురాకూడదని నిబంధనలో ఉన్నట్లు తెలుస్తోంది..

భద్రత సిబ్బంది వెపన్తో గర్భాలయ పరిసర ప్రాంతాల్లో.. తిరుగుతున్నప్పటికీ ఆలయ అధికారులతో పాటు భద్రత సిబ్బంది కనీసం పట్టించుకోకపోవడంపై భక్తులు మండిపడుతున్నారు. సాధారణ భక్తులను తనిఖీల పేరుతో గంటల తరబడి ఇబ్బందులు పెట్టే అధికారులు.. రాజకీయ నాయకులు వస్తే మాత్రం నిబంధనలను తుంగలో తొక్కుతారా? ఆలయ పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత అధికారులపై లేదా? అని అక్కడున్న పలువురు భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు..

Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!

అధికారులు నిర్లక్ష్యం పై విమర్శలు..
ఇటీవల కాలంలో ఆలయ భద్రతపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టినప్పటికీ.. క్షేత్రస్థాయిలో ఇలాంటి ఘటనలు పునరావృతం కావడం అధికారుల నిర్లక్ష్యానికి అడ్డం పడుతుందని భక్తుల నుంచి విమర్శలు వస్తున్నాయి. వీఐపీల పర్యటనల సమయంలో నిబంధనలు అందరికీ ఒకేలా వర్తింపజేయాలని.. ఆలయ ప్రాంగణంలోకి ఆయుధాలతో ప్రవేశించిన భద్రత సిబ్బందిపై.. దానికి బాధ్యులైన అధికారులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియా వినియోగదారులతో పాటు అంజన్న భక్తులు డిమాండ్ చేస్తూ వస్తున్నారు.

Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

0
0
Report

Lpg Price: సంక్షోభంలోనూ సామాన్యుడికి ఊరట.. అమెరికా, పాకిస్తాన్ల కంటే మన దేశంలోనే చాలా తక్కువ ధరకే వంటగ్యాస్ సరఫరా..!!

BBhoomi1h ago
Lakshmapur, Telangana:

 Lpg Price: మిడిల్ ఈస్ట్ లో నెలకున్న సంక్షోభం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు భారీగా పెరిగిపోతున్నాయి. అయినప్పటికీ భారత ప్రభుత్వం మాత్రం దేశీయ వినియోగదారులపై ఆ భారం పడకుండా కాపాడుతోంది.  సౌదీ కాంట్రాక్ట్ ప్రైస్ ఫిబ్రవరి నుంచి జూన్ మధ్య సుమారు 46శాతం పెరగడంతో ప్రస్తుతం ఒక గ్యాస్ సిలిండర్ అసలు సరఫరా ఖర్చు రూ. 1600 దాటిపోయింది. అయినా కూడా సామాన్యులకు భద్రత కల్పిస్తూ సాధారణ వినియోగదారులకు 942 రూపాయలకే సిలిండర్ అందిస్తోంది. ప్రధానమంత్రి ఉజ్వల యోజన లబ్దిదారులకు లభించే అదనపు సబ్సిడీ వల్ల వారు కేవలం రూ. 642 కే సిలిండర్ పొందుతున్నారు. మన పొరుగు దేశాలు అయిన నేపాల్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంకతోపాటు అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా వంటి అభివ్రుద్ధి చెందిన దేశాల కంటే కూడా భారత్ లోనే వంటగ్యాస్ ధరలు చాలా తక్కువగా ఉన్నాయని చెప్పాలి. 

ప్రభుత్వ గణాంకాల ప్రకారం..  ప్రస్తుతం ఒక గృహ వినియోగ ఎల్‌పిజి సిలిండర్ సరఫరా ఖర్చు రూ. 1,600 దాటింది. అయినప్పటికీ, సాధారణ వినియోగదారులకు సిలిండర్లు రూ. 942కే అందుబాటులో ఉంచుతున్నారు. అంటే, వినియోగదారులు కాకుండా ప్రభుత్వం,  చమురు కంపెనీలే ఒక్కో సిలిండర్‌పై సుమారు రూ. 700 భారాన్ని మోస్తున్నాయి. నగరాలను బట్టి పంపిణీ ఖర్చులు కొద్దిగా మారవచ్చు.  కానీ మొత్తమ్మీద, గృహ వినియోగదారులకు మార్కెట్ ధర కంటే గణనీయంగా తక్కువ ధరకే గ్యాస్ అందుతోంది.

భారతదేశంలో పెట్రోలియం ఉత్పత్తుల ధరలు అంతర్జాతీయ మార్కెట్ పోకడలచే ప్రభావితమవుతాయి. ఎల్పీజీ విషయంలో, దేశం తన అవసరాలలో అధిక భాగాన్ని దిగుమతి చేసుకుంటుంది. దిగుమతి చేసుకున్న ఎల్పీజీ ధర ప్రధానంగా సౌదీ అరామ్కో నిర్దేశించిన సౌదీ కాంట్రాక్ట్ ప్రైస్  పై ఆధారపడి ఉంటుంది. అయితే, అంతర్జాతీయ ధరలు పెరిగినప్పటికీ, దేశీయ వంటగ్యాస్ ధరలలోని పూర్తి పెరుగుదల వినియోగదారులకు బదిలీ కాలేదు. ఈ కారణంగానే దేశీయ సిలిండర్ ధరలు మార్కెట్ ధరల కంటే గణనీయంగా తక్కువగా ఉంటాయి.

Also Read: Maruti Suzuki June Offers: జూన్‌లో కారు కొంటున్నారా? Nexa మోడల్స్ పై రూ. 2.15 లక్షల వరకు భారీ డిస్కౌంట్..!!

పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, హోర్ముజ్ జలసంధిలో అంతరాయాలు ప్రపంచ ఎల్‌పిజి మార్కెట్‌పై కూడా ప్రభావం చూపాయి. ఫిబ్రవరిలో సౌదీ ప్రామాణిక ఎల్‌పిజి ధర టన్నుకు సుమారు $543గా ఉండగా, ప్రాంతీయ సంక్షోభం తర్వాత అది గణనీయంగా పెరిగింది.  ఏప్రిల్‌లో ధర టన్నుకు $775కు పెరగగా, జూన్‌లో అది దాదాపు టన్నుకు $790కి చేరుకుంది. ఫిబ్రవరితో పోలిస్తే అంతర్జాతీయ ఎల్‌పిజి బెంచ్‌మార్క్‌లో ఇది దాదాపు 46 శాతం పెరుగుదలను సూచిస్తుంది, దీనివల్ల దిగుమతి ఖర్చులు గణనీయంగా పెరిగాయి.

ప్రభుత్వం ప్రకారం, పశ్చిమ ఆసియాలో సంక్షోభం కొనసాగుతున్నప్పటికీ, ఇంధన దిగుమతులు, సరఫరాలు సజావుగా సాగిన కొద్ది దేశాలలో భారతదేశం ఒకటిగా నిలిచింది. హోర్ముజ్ జలసంధిలో సవాళ్లు ఎదురైనప్పటికీ, దేశం పెట్రోలియం ఉత్పత్తుల కొరతను ఎదుర్కోలేదు.  భారతదేశంలో గృహ వంటగ్యాస్ ధరలు పొరుగు దేశాల కంటే తక్కువగా ఉండటమే కాకుండా, యునైటెడ్ స్టేట్స్, ఆస్ట్రేలియా,  కెనడా వంటి అభివృద్ధి చెందిన దేశాల కంటే కూడా గణనీయంగా చౌకగా ఉన్నాయని ప్రభుత్వం పేర్కొంది. పెరుగుతున్న ప్రపంచ ఖర్చులు,  భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ, వినియోగదారులకు ఉపశమనం అందించడానికి సబ్సిడీలు,  ధరల నియంత్రణలు కొనసాగిస్తోంది. 

కాగా దేశీయ ఎల్పీజీ ధరలు జూన్ 7వ తేదీన రూ. 29 పెరిగాయి. 3 నెలల్లో దేశీయ గ్యాస్ ధరలు పెరగడం ఇది రెండోసారి. అయినప్పటికీ, వంటగ్యాస్ అమ్మకాలలో భారతదేశం అత్యంత చౌకైన దేశాలలో ఒకటిగా ఉందని ప్రభుత్వం చెబుతోంది.

Also Read: LPG Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. మళ్లీ పెరిగిన వంటగ్యాస్

Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. దయచేసి దీన్ని పెట్టుబడి, ఆర్థిక లేదా వ్యాపార సలహాగా భావించవద్దు. గుర్తుంచుకోండి స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టోకరెన్సీలు, రియల్ ఎస్టేట్, విలువైన లోహాలు వంటి అన్ని రకాల పెట్టుబడులు మార్కెట్ ఆటు పోటులు రిస్కులకు లోబడి ఉంటాయి. దీని అర్థం, మీరు లాభపడవచ్చు లేదా నష్టపోవచ్చు. మీరు తీసుకునే ఎలాంటి పెట్టుబడి నిర్ణయాలు లేదా వ్యాపార కార్యకలాపాల వల్ల కలిగే నష్టాలు లేదా లాభాలకు మా సంస్థ జీ తెలుగు వెబ్ పోర్టల్ ఎట్టి పరిస్థితుల్లోనూ బాధ్యత వహించదు. ఏదైనా ఆర్థిక నిర్ణయం తీసుకునే ముందు, తప్పకుండా ఒక రిజిస్టర్డ్ లేదా సర్టిఫైడ్ ఆర్థిక నిపుణుడిని సంప్రదించి, వారి సలహా తీసుకోమని పాఠకులకు సిఫార్సు చేస్తున్నాము.

 

 

 

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

 

0
0
Report

Maruti Suzuki June Offers: జూన్‌లో కారు కొంటున్నారా? Nexa మోడల్స్ పై రూ. 2.15 లక్షల వరకు భారీ డిస్కౌంట్..!!

BBhoomi2h ago
Lakshmapur, Telangana:

Maruti Suzuki June Offers: కొత్త కారు కొనాలనుకునేవారికి మారుతీ సుజుకీ అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. జూన్ 2026లో  మీకు ఒక గొప్ప అవకాశాన్ని అందిస్తోంది. ఈ నెలలో..  కంపెనీ తన నెక్సా శ్రేణిపై రూ. 2.15 లక్షల వరకు విలువైన ప్రయోజనాలు, డిస్కౌంట్లను అందిస్తోంది. వీటిలో ఇన్విక్టో, గ్రాండ్ విటారా, బాలెనో, ఫ్రాంక్స్, XL6, జిమ్నీ,  ఇగ్నిస్ వంటి ప్రముఖ మోడళ్లు ఉన్నాయి. ఈ ఆఫర్లన్నీ జూన్ 2026 వరకు చెల్లుబాటులో ఉంటాయి. అయితే, ఈ ప్రయోజనాలు ప్రాంతం, వేరియంట్ లభ్యత,  డీలర్‌షిప్ ప్లాన్‌లను బట్టి మారే అవకాశం ఉంటుంది. 

ఈ నెలలో, మారుతి సుజుకి ప్రీమియం MPV అయిన ఇన్విక్టో భారీ డిస్కౌంట్ తో అందుబాటులో ఉంది. ఈ మోడల్ కన్స్యూమర్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు, స్క్రాపేజ్ బోనస్‌లు, అప్‌గ్రేడ్ లాయల్టీ బోనస్‌లు,  కార్పొరేట్ డిస్కౌంట్‌లతో సహా మొత్తం రూ. 2.15 లక్షల వరకు ప్రయోజనాలను అందిస్తుంది. 

ఇక గ్రాండ్ విటారా   సిగ్మా పెట్రోల్ వేరియంట్ రూ. 1.35 లక్షల వరకు ప్రయోజనాలను అందిస్తుండగా, డెల్టా మాన్యువల్,  ఆటోమేటిక్ వేరియంట్లు రూ.1.25 లక్షల వరకు డిస్కౌంట్ అందుబాటులో ఉంది. 

జీటా, ఆల్ఫా AWD వేరియంట్లు రూ. 85,000 వరకు ప్రయోజనాలను, ఉచిత 5 సంవత్సరాల పొడిగించిన వారంటీని అందిస్తున్నాయి. గ్రాండ్ విటారా  స్ట్రాంగ్ హైబ్రిడ్ వేరియంట్లు ఢిల్లీలో జీరో రోడ్ టాక్స్ ప్రయోజనాలతో సహా అతిపెద్ద తగ్గింపును పొందుతున్నాయి. దీనితో మొత్తం ప్రయోజనం రూ. 1.85 లక్షలకు చేరుకుంది. అదనంగా రూ. 90,000 వరకు అదనపు ప్రయోజనాలు, కాంప్లిమెంటరీ 5 సంవత్సరాల వారంటీ కూడా అందిస్తోంది. 

Also Read: మళ్లీ పెరిగిన వంటగ్యాస్ ధరలు.. ఎంత పెరిగిందో చూస్తే షాకవుతారు..!!

 ఇగ్నిస్ హ్యాచ్‌బ్యాక్ విభాగంలో, ఇగ్నిస్ ఏజీఎస్ వేరియంట్లపై రూ. 45,000 వరకు, మాన్యువల్ వేరియంట్లపై రూ. 40,000 వరకు ప్రయోజనాలు అందిస్తోంది. అయితే, ప్రస్తుతం ఇగ్నిస్ ఉత్పత్తి నిలిచిపోయినందున, ఈ ఆఫర్ కేవలం డీలర్ స్టాక్‌లకు మాత్రమే వర్తిస్తుంది. 

బాలెనో  పెట్రోల్ ఏజీఎస్ వేరియంట్లపై రూ. 40,000 వరకు, సీఎన్‌జీ వేరియంట్లపై రూ. 35,000 వరకు ప్రయోజనాలు అందిస్తున్నారు.  ఫ్రాంక్స్  ఇతర మారుతి మోడళ్లతో పోలిస్తే, ఫ్రాంక్స్‌పై కొద్దిగా తక్కువ డిస్కౌంట్ లభిస్తోంది. దీని టర్బో పెట్రోల్ వేరియంట్లపై రూ. 25,000 వరకు ప్రయోజనాలు లభిస్తుండగా, ఇతర పెట్రోల్, ఏజీఎస్, సీఎన్‌జీ వేరియంట్లపై రూ. 15,000 వరకు ప్రయోజనాలు లభిస్తున్నాయి.

 ఎక్స్‌ఎల్6 మరియు జిమ్నీ మారుతి సుజుకి ఎంపీవీ ఎక్స్‌ఎల్6   పెట్రోల్, సీఎన్‌జీ వేరియంట్లు రెండింటిపై రూ. 45,000 వరకు డిస్కౌంట్లు అందిస్తున్నారు. లైఫ్‌స్టైల్ ఎస్‌యూవీ జిమ్నీ అన్ని వేరియంట్‌లపై రూ. 45,000 వరకు ప్రయోజనాలను కూడా అందిస్తుంది.

ఈ ఆఫర్లన్నీ జూన్ 2026 వరకు మాత్రమే వర్తిస్తాయన్న విషయాన్ని గమనించాలి. 

Also Read: LPG Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. మళ్లీ పెరిగిన వంటగ్యాస్ ధరలు.. ఎంత పెరిగిందో చూస్తే షాకవుతారు..!!

Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. దయచేసి దీన్ని పెట్టుబడి, ఆర్థిక లేదా వ్యాపార సలహాగా భావించవద్దు. గుర్తుంచుకోండి స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టోకరెన్సీలు, రియల్ ఎస్టేట్, విలువైన లోహాలు వంటి అన్ని రకాల పెట్టుబడులు మార్కెట్ ఆటు పోటులు రిస్కులకు లోబడి ఉంటాయి. దీని అర్థం, మీరు లాభపడవచ్చు లేదా నష్టపోవచ్చు. మీరు తీసుకునే ఎలాంటి పెట్టుబడి నిర్ణయాలు లేదా వ్యాపార కార్యకలాపాల వల్ల కలిగే నష్టాలు లేదా లాభాలకు మా సంస్థ జీ తెలుగు వెబ్ పోర్టల్ ఎట్టి పరిస్థితుల్లోనూ బాధ్యత వహించదు. ఏదైనా ఆర్థిక నిర్ణయం తీసుకునే ముందు, తప్పకుండా ఒక రిజిస్టర్డ్ లేదా సర్టిఫైడ్ ఆర్థిక నిపుణుడిని సంప్రదించి, వారి సలహా తీసుకోమని పాఠకులకు సిఫార్సు చేస్తున్నాము.

 

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement

Telangana: రైతులకు షాక్.. వరి కొయ్యలు కాలిస్తే రూ.20,000 వరకు జరిమానా!

Hyderabad, Telangana:

Stop Stubble Burning Latest News: పంట చేతికొచ్చిన ఆనందంలో వరికోయ్యలను తగలబెడుతున్న రైతులకు వ్యవసాయ, పంచాయతీరాజ్ అధికారులు గట్టి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. వరి కొయ్యలను కాల్చడం వల్ల పర్యావరణానికి ఊహించని ముప్పు వాటిల్లడమే కాకుండా.. క్రమంగా భూసారం దెబ్బతింటుందని అధికారులు పదే పదే చెప్పినప్పటికీ కొందరు రైతులు మాత్రం వారి మాటలు పెడచెవిన పెడుతున్నారు. ఈ క్రమంలో నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు యంత్రాంగం సిద్ధమైంది. అలాగే అధికారుల మాటలు వినని రైతులకు యంత్రాంగం ఊహించని షాక్ ఇస్తోంది..

5000 వరకు జరిమానా..
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం పరిధిలోని రాజారాంతాండ గ్రామంలో నిన్న ఒక రైతుకు అధికారులు ఊహించని షాక్ ఇచ్చారు. పొలంలో వరి కొయ్యలను తగలబెడుతున్నందుకుగాను.. స్థానిక పంచాయతీ కార్యదర్శి సదరు రైతుకు దాదాపు రూ.5 వేల రూపాయల వరకు జరిమానాలను విధించారు. ఈ ఘటన స్థానిక రైతుల్లో ఒక్కసారిగా కలకలం రేపింది. ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తే.. ఎంతటి వారైనా జరిమానా తప్పదని అధికారులు ఈ చర్యల ద్వారా స్పష్టమైన సంకేతాలు పంపుతున్నారు.

జీవో నెం. 27 ప్రకారం కఠిన చర్యలు..
పర్యావరణ పరిరక్షణతో పాటు భూసార రక్షణ ధ్యేయంగా  ప్రభుత్వం తీసుకొచ్చిన GO MS NO 27 ప్రకారం.. వరి కొయ్యలు కాల్చే వారిపై కఠినమైన జరిమానాలు  విధించాలనే అధికారాన్ని గ్రామపంచాయతీలకు కల్పించారు. తొలిసారి తప్పు చేస్తే.. దాదాపు రూ.5 వేల వరకు జరిమానా విధించాలని.. పదే పదే అదే తప్పులు చేస్తే నష్ట తీవ్రతను బట్టి గరిష్టంగా రూ.20 వేల వరకు జరిమానా విధించే అధికారం గ్రామపంచాయతీ కార్యదర్శికి ఉంటుంది. వరి కొయ్యలను కాల్చడం వల్ల భూమిలోని మిత్ర పురుగులతో పాటు సూక్ష్మజీవులు చనిపోయి భూమిని సహాయంగా మారుతుంది.. దీనివల్ల వచ్చే పంటకు పెట్టుబడి ఖర్చు విపరీతంగా పెరుగుతుందని.. జిల్లాకు సంబంధించిన వ్యవసాయ అధికారులు తెలుపుతున్నారు..

రైతులు ప్రత్యామ్నాయాలు ఎంచుకోవాలి..
పంట అవశేషాలను తగలబెట్టే సాంప్రదాయానికి స్వస్తి చెప్పాలని వ్యవసాయ అధికారులు కోరుతున్నారు.. కొయ్యలను కాల్చడానికి బదులుగా రోటవేటర్ సహాయం లేదా అత్యాధునిక యంత్రాల సహాయంతో వాటిని భూమిలోనే దున్నేయాలని.. తద్వారా అవి కుళ్లిపోయి భూమికి మంచి సేంద్రీయ ఎరువుగా మారుతాయని సూచిస్తున్నారు. జరిమానాల బారిన పడి ఆర్థికంగా నష్టపోకుండా.. రైతులంతా బాధ్యతగా వ్యవహరించి పర్యావరణాన్ని కాపాడాలని అధికారులు విజ్ఞప్తి చేస్తూ వస్తున్నారు..

Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

0
0
Report

Mars Transit 2026: శుక్రుడి రాశిలోకి కుజుడి ఎంట్రీ.. ఆ 4 రాశుల వారికి తిరుగులేని అదృష్టం, కోటీశ్వరులయ్యే ఛాన్స్!

Hyderabad, Telangana:

Mars Transit In Taurus 2026 Effect On Zodiac: వేద జ్యోతిష్య శాస్త్రంలో కుజ గ్రహాన్ని ధైర్యంతో పాటు వీరత్వం కోపం బలం రక్తపాతానికి అధిపతిగా సూచిస్తూ ఉంటారు. అలాగే దీనిని ఎరుపు రంగు గ్రహంగా కూడా చెప్పుకుంటారు. ఇదిలా ఉంటే జూన్ 21వ తేదీన కుజుడు ధన రాశిని మార్చుకోబోతున్నాడు. ఈసారి అగ్నితత్వ రాశి అయిన కుజుడు భూతత్వ రాశి ఆయన వృషభ రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. వృషభ రాశి వారికి అధిపతి శుక్రుడు.. ఫలితంగా అత్యంత ప్రభావవంతమైన గ్రహంగా చెప్పుకునే కుజుడు, శుక్రుని రాశిలోకి సంచారం చేయడం కారణంగా మొత్తం అన్ని రాశులు ప్రభావితం కాబోతున్నాయి. ముఖ్యంగా ఈ సమయంలో నాలుగు రాశుల వారికి అత్యంత శుభప్రదమైన ప్రభావం పడబోతోంది. దీని కారణంగా వారికి సంపాదన కూడా విపరీతంగా పెరగడమే కాకుండా జీవితంలో ఆనందం పెరిగి కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. అలాగే శాంతి కూడా పెరుగుతుంది.. అయితే కుజుడి ప్రభావంతో అత్యధిక లాభాలు పొందబోతున్న రాశులు ఏవో ఇప్పుడు తెలుసుకున్న. 

ఈ రాశులవారికి బంఫర్‌ లాభాలు:
వృషభ రాశి 
వృషభ రాశిలో జన్మించిన వ్యక్తులకు కుజ గ్రహ సంచారం నేరుగా ఈ రాశిలోనే జరగడం కారణంగా వీరి జీవితాలపై ఊహించని ప్రభావం పడుతుంది. ఈ సమయంలో కొత్త వ్యక్తులతో పరిచయాలు విపరీతంగా పెరుగుతాయి. మీకు మీ స్నేహితుల నుంచి అద్భుతమైన సపోర్టు లభిస్తుంది. వృత్తి జీవితంలో మంచి మంచి శుభవార్తలు వినే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఉద్యోగాలు చేసే వ్యక్తులు ఈ సమయంలో పదోన్నతులు పొందే అవకాశాలు కూడా ఉన్నాయి.. ప్రేమ జీవితం అద్భుతంగా ఉండటమే కాకుండా భాగస్వామితో మంచి అవగాహన ఏర్పడి మంచి స్నేహం కుదురుతుంది. ఈ సమయంలో మంచి జీవితాన్ని గడిపేందుకు ఇష్టపడతారు. జీవిత భాగస్వామితో కలిసి ప్రయాణాలు చేసే అవకాశాలున్నాయి.

కర్కాటక రాశి 
కర్కాటక రాశిలో జన్మించిన వ్యక్తులకు కుజుడు 11వ స్థానంలోకి ప్రవేశించబోతున్నాడు. దీని కారణంగా సాంఘిక సంబంధాలు మరింత ఊహించని స్థాయిలో మెరుగుపడతాయి. వీరికి ఈ సమయంలో కష్టానికి తగిన ప్రతిఫలం కూడా లభించబోతోంది. పనుల్లో గొప్ప గొప్ప విజయాలు సాధించడమే కాకుండా అనుకున్న పనులు సులభంగా చేయగలిగి అద్భుతమైన అవకాశాలు పొందగలుగుతారు. ఆర్థిక పరిస్థితులు బలపడడమే కాకుండా భవిష్యత్తు కోసం ఎంతో కష్టపడతారు. దీంతో పాటు ఆర్థిక పరిస్థితులు ఊహించని స్థాయిలో మెరుగుపడతాయి. కొత్త ప్రణాళికలను రూపొందించడం కారణంగా అద్భుతమైన ధన లాభాలు పొందగలుగుతారు..

సింహరాశి 
సింహరాశిలో జన్మించిన వ్యక్తులకు దశమ భావంలోకి గుజుడు సంచారం చేస్తాడు.. వృత్తి జీవితంలో ఘననీయమైన లాభాలు కలుగుతాయి. అలాగే కుజ గ్రహ సంచారంతో వృత్తి జీవితంపై ప్రత్యేకమైన శుభ ప్రభావం పడి.. ఈ సమయంలో భారీ మొత్తంలో డబ్బులు పొందగలుగుతారు. ముఖ్యంగా జీవితంలో వివిధ రకాల సుఖ భోగాలు పెరుగుతాయి. ఈ సమయంలో ఎలాంటి ప్రయత్నాలు చేసినా మంచి అదృష్టాన్ని పొందుతారు. పెద్ద పెద్ద ఆర్థిక లాభాలు పొంది.. వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతోపాటు అనుకున్న పనుల్లో విజయాలు కూడా సులభంగా సాధిస్తారు..

మీన రాశి 
మీన రాశిలో జన్మించిన వ్యక్తులకు కుజుడు తృతీయభావంలోకి ప్రవేశించబోతున్నాడు. దీని కారణంగా వీరికి ధైర్యం పెరగడమే కాకుండా బలం అనేక రేట్లు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. జీవితంలో అద్భుతమైన పురోగతి లభించడమే కాకుండా విజయానికి మార్గాలు సుగుమవుతాయి. అంతేకాకుండా ఈ సమయంలో ఆత్మవిశ్వాసం విపరీతంగా పెరుగుతుంది. కెరీర్ గ్రాఫ్ కూడా ఒక్కసారిగా పెరిగి ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు. దీంతో పాటు ఎల్లప్పుడు సంతోషంగా జీవితాన్ని ముందుకు సాగిస్తారు. ప్రతి విషయంలో ఓపికతో అడుగులు వేయడం వల్ల మంచి మంచి ప్రయోజనాలు పొందుతారు..

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

గమనిక.. 

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report

Budhaditya Rajayoga: జూన్ 15 నుంచి ఈ 3 రాశుల వారికి బంపర్ జాక్‌పాట్.. బుధాదిత్య రాజయోగంతో కోటీశ్వరులయ్యే ఛాన్స్!

Hyderabad, Telangana:

Budhaditya Rajayoga Effect On Zodiac: జ్యోతిష్య శాస్త్రం పరంగా.. గ్రహ సంచారాలు మానవ జీవితాల పై భారీ ప్రభావాన్ని చూపుతాయి. ఇక జూన్ నెలలోని గ్రహస్థితులు కొన్ని రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉండబోతున్నాయి. ముఖ్యంగా జూన్ మధ్య వారాల్లో కొన్ని రాశుల వారికి అద్భుతమైన యోగాల ప్రభావం లభించబోతోంది. ఇదిలా ఉంటే జూన్ 15న సూర్య భగవానుడు తన రాశిని మార్చుకోబోతున్నాడు.. బుద్ధికి కారకుడైన బుధుడు ఇప్పటికే ఆ గ్రహంలో సంచార దశలో ఉన్నాడు. అయితే, దీనికి కారణంగానే సూర్య, బుధ గ్రహాలు కలయిక జరగబోతోంది. దీని కారణంగా ఎంతో శక్తివంతమైన బుధాదిత్య ఉద్యోగం ఏర్పడుతుంది. దీంతో ఆయారాశల వారికి అద్భుతమైన ధన లాభాలు కలుగుతాయి. ఆర్థికంగా ఎంతో మేలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి..

ఈ రాశులవారికి బంపర్‌ జాక్‌పాట్..
మేష రాశి 
ఈ శక్తివంతమైన ప్రభావంతో మేష రాశి వారికి కెరీర్ పరంగా చాలా విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా పెద్ద ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే వ్యాపారంలో గొప్ప పురోగతి లభించి.. అనుకున్నంత స్థాయిలో సంపాదించగలుగుతారు. ఈ సమయంలో కుటుంబ సభ్యుల సమస్యలు కూడా ఎంతో సులభంగా పరిష్కారం కాబోతున్నాయి. ముఖ్యంగా వ్యాపారాల్లో డబ్బు లభించడమే కాకుండా.. మానసిక ప్రశాంతత కూడా దొరుకుతుంది. దీని కారణంగా వీరు కుటుంబ సభ్యులతో ఎంతో ఆనందంగా ఉండగలుగుతారు. ముఖ్యంగా ఈ సమయంలో విహారయాత్రలకు కూడా ప్లాన్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. 

వృషభ రాశి 
ఎంతో శక్తివంతమైన బుధాదిత్య రాజయోగ ప్రభావంతో వృషభ రాశి వారికి పెండింగ్‌లో ఉన్న ప్రతి పని ఎంతో సులభంగా పూర్తవుతుంది. ఈ సమయంలో తీసుకునే సరైన నిర్ణయాలు జీవితాంతం అద్భుతమైన అవకాశాలను అందిస్తూ ఉంటాయి. ముఖ్యంగా వీరికి ఈ సమయంలో తప్పకుండా జీతం విపరీతంగా పెరుగుతుంది. గతంలో రాజకీయ రంగాలతో పాటు సామాజిక రంగాల్లో పనులు చేసిన వ్యక్తులందరికీ పదవులు కూడా లభించబోతున్నాయి. ఇక వ్యాపారస్తులకు కొత్త ప్రాజెక్టులు లభించడమే కాకుండా.. అధికారుల నుంచి మంచి సపోర్ట్ లభిస్తుంది. దీంతోపాటు ఎలాంటి పనులు చేసిన గొప్ప గొప్ప అవకాశాలు పొందే అదృష్టం సొంతం అవుతుంది. 

మిధున రాశి 
బుధాదిత్య రాజయోగ ప్రభావంతో మిధున రాశి వారికి కూడా ఆత్మవిశ్వాసం అద్భుతంగా పెరుగుతుంది. వ్యక్తిత్వం కొత్త రూపాన్ని సంతరించుకునే అవకాశాలు అనిపిస్తున్నాయి. ఈ సమయంలో మీ అన్ని కష్టాలకు ప్రతిఫలం లభిస్తుంది. సమాజంలో గౌరవం కూడా పొందగలుగుతారు. డబ్బు కోరత ఉన్న వ్యక్తులకు ఈ సమయంలో ఆర్థికంగా మెరుగుదల కూడా కనిపిస్తుంది. ఉద్యోగంలో భారీ పురోగతి కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో కూడా మంచి ఫలితాలు పొందగలుగుతారు. కాబట్టి ఎలాంటి ఆందోళన చెందకుండా జీవితాన్ని ముందుకు సాగించడం మంచిదని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా ఇప్పటికే తీవ్ర సమస్యలు ఉన్నవా కాస్త ఆలోచించడం మంచిది..

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

గమనిక.. 

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report
Advertisement

Ruchaka Raja Yoga: జూన్ 21న కుజ సంచారం.. ఈ 4 రాశుల వారికి రుచక రాజయోగంతో ఇక తిరుగుండదు!

Hyderabad, Telangana:

Mars Transit June 2026 Effect On Zodiac: జూన్ చివరి వారంలో అత్యంత ముఖ్యమైన చోటు చేసుకోబోతోంది. ఇది జ్యోతిష్య శాస్త్రం పరంగా చాలా ప్రత్యేకంగా ఉండబోతోంది. ముఖ్యంగా జూన్ 21వ తేదీన కుజుడు తన రాశిని మార్చుకొని వృషభరాశిలోకి ప్రవేశిస్తాడు. శుక్రుడు ఇప్పటికే అక్కడే సంచార దశలో ఉన్నాడు. దీంతో ఈ రెండు గ్రహాలు కలయిక ఒక శుభప్రదమైన రుచక రాజయోగాన్ని సృష్టించబోతోంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఈ యోగ ప్రభావం చాలా శుభ్రమైందిగా చెప్పకుంటారు. దీనివల్ల కొన్ని రాశుల వారికి ఆర్థికంగా లాభాలు రావడమే కాకుండా అన్ని పనుల్లో విజయం సాధించే అదృష్టాన్ని సొంతం చేసుకోగలుగుతారు. దీనివల్ల వీరికి సమాజంలో గౌరవం ఊహించని స్థాయిలో పెరుగుతుంది..

జ్యోతిష్య శాస్త్రంలో కుజ గ్రహా న్ని బలంతో పాటు ధైర్యం, శక్తి, నాయకత్వానికి అధిపతిగా పరిగణిస్తారు. మరోవైపు శుక్రుడు ఆనందంతో పాటు శ్రేయస్సు, విలాసవంతం, సౌందర్యం, వైభవానికి ప్రతీకగా చెప్పుకుంటారు. ఈ రెండు గ్రహాలు కలిసినప్పుడు ఏర్పడే శుభయోగాన్నే రుచక రాజయోగంగా పిలుస్తారు. ఈ యోగం అన్ని రాశుల పని జీవితాల్లో అద్భుతమైన మెరుగుదలను అందిస్తుంది. అంతేకాకుండా నిర్ణయాలు తీసుకునే సామర్థ్యాన్ని పెంచుతుంది.. అలాగే ఆర్థికంగా బలవంతులను కూడా చేస్తుంది. అయితే ఈ శుభయోగ ప్రభావం కొన్ని రాశుల వారిపైనే ఉంటుంది. ఏ రాశుల వారికి జూన్ చివరి వారంలో ఏర్పడే రుచక రాజయోగ ప్రభావం అద్భుతమైన అవకాశాలను అందిస్తుందో తెలుసుకుందాం..

ఈ రాశులవారికి బంపర్‌ లాభాలు:
వృషభ రాశి 
రుచక రాజయోగం ప్రభావంతో వృషభ రాశి వారిపై అత్యంత సానుకూలమైన ప్రభావం పడుతుంది. దీని కారణంగా వృత్తిలో కొత్త అవకాశాలు లభించడమే కాకుండా చాలా చాలాకాలంగా ఉన్న ప్రణాళికలు అమల్లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యక్తిగత జీవితంలో కూడా సానుకూలమైన మార్పులకు సూచనలు కనిపిస్తున్నాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. ప్రేమ సంబంధాలు మరింత మధురంగా మారే అవకాశాలు ఉన్నాయి. ఆస్తి కొనుగోలు చేయాలనుకునే వారికి.. పెట్టబడులు పెట్టాలనుకునే వారికి ఈ సమయం ఎంతో లాభదాయకంగా ఉంటుంది..

సింహరాశి 
సింహరాశిలో జన్మించిన వ్యక్తులకు ఈ సమయంలో ఆర్థికంగా అద్భుతమైన అవకాశాలు కలుగుతాయి. ముఖ్యంగా అదృష్టం సహకరించడంతో పెండింగ్లో ఉన్న ప్రతి పని ఎంతో సులభంగా పూర్తవుతుంది. ఈ సమయంలో కోపాన్ని అదుపులో ఉంచుకుని అన్ని రకాల పనులను చేయడం చాలా మంచిది. అంతేకాకుండా ఓపికతో నిర్ణయాలు తీసుకోగలిగితే జీవితంలో అద్భుతమైన అవకాశాలు పొందుతారు. అంతేకాకుండా వృత్తిపరమైన విజయాలు సాధించి ఆర్థిక పురోగతికి అద్భుతమైన అవకాశాలు కలుగుతాయి. ఇవే కాకుండా సింహరాశి వారికి మరెన్నో లాభాలు కలుగుతాయి..

కర్కాటక రాశి 
కర్కాటక రాశిలో జన్మించిన వ్యక్తులకు రుచక రాజయోగ ప్రభావంతో కొత్త బాధ్యతలు లభించడమే కాకుండా పదోన్నతులు కలిగే అవకాశాలు కల్పిస్తున్నాయి. సమాజంలో గౌరవం కూడా పెరిగే సూచనలు ఉన్నాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఈ సమయంలో సానుకూల దృక్పథాన్ని కలిగి ఉండటమే కాకుండా.. ఒత్తిడికి గురవ్వకుండా ఉంటారు. పెద్ద ఆర్థిక పరమైన రిస్కులు తీసుకునే ముందు కొన్ని రకాల జాగ్రత్తలు పాటించడం మంచిది. అంతేకాకుండా పెట్టుబడులు పెట్టే యోచనలో ఉన్నట్లయితే ఒకటికి రెండుసార్లు ఆలోచించండి.

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

మీన రాశి 
రుచక రాజయోగ ప్రభావంతో మీన రాశి వారికి ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా కోరుకున్న కోరికను నెరవేరడమే కాకుండా సమాజంలో గౌరవం కూడా లభించబోతోంది. దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలు ఎంతో సులభంగా పూర్తవుతాయి అడ్డంకులు కూడా తొలగిపోయి.. విశేషమైన ప్రయోజనాలు పొందే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు ఏదైనా నిర్ణయాలు తీసుకోవడం వల్ల మంచి మంచి ప్రయోజనాలు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. అధిక విషయాల్లో నిపుణుల సూచనలు తీసుకోవడం ఎంతో మంచిది..

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

గమనిక.. 

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report

Petro Price Hike: వాహనదారులకు మరోసారి కోలుకోలేని షాక్.. లీటరుపై రూ. 5 పెరగనున్న పెట్రోల్, డీజీల్ ధరలు..!!

BBhoomi4h ago
Lakshmapur, Telangana:

Petro Price Hike: దేశంలో వాహనదారులకు మరోసారి బిగ్ షాక్ తగేలేలా కనిపిస్తోంది. ఇప్పటికే భారీగా పెరుగుతున్న నిత్యావసరాల ధరలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు.. మరోసారి ఇంధన ధరలు షాక్ ఇవ్వబోతున్నాయి. రానున్న రోజుల్లో పెట్రోల్, డీజీల్ ధరలు లీటరుకు మరో 5 నుంచి 10 రూపాయల వరకు పెరిగే ఛాన్స్  ఉందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. మే నెలలో ఇంధన ధరలు దాదాపు 8శాతం పెరిగాయి. అయినా కూడా ప్రభుత్వ రంగ చమురు కంపెనీల ఆర్థిక ఇబ్బందులు ఇంకా తొలగిపోకపోవడంతో మరోసారి ఇంధనలు ధరలు పెంచేందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. 

గత మూడు వారాలుగా పలుమార్లు ధరలు పెంచినప్పటికీ, ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు  పెరిగిన ముడి చమురు ధరలు, పశ్చిమ ఆసియా సంక్షోభం వల్ల కలిగిన ఇంధన నష్టాల మధ్య ప్రతిరోజూ సుమారు రూ. 610 కోట్ల మేర నష్టాలను చవిచూస్తుండటంతో, పెట్రోల్,  డీజిల్ ధరలను లీటరుకు మరో రూ. 5 పెంచే అవకాశం ఉందని తెలుస్తోంది.  గత మే 15వ తేదీన పెట్రోల్, డీజీల్ ధరలు లీటరుకు దాదాపు 7.5 మేర పెరిగిన సంగతి తెలిసిందే. అయినా కూడా కంపెనీలకు లీటర్ పెట్రోల్ కు రూ. 5.5, డీజీల్ లీటర్ కు 4.5 చొప్పున నష్టాలు వస్తున్నాయి. ఈ నష్టాలను పూడ్చుకునేందుకు ఇంధన ధరలను పెంచాల్సి వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. 

పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు రూ. 7.5 పెరిగితే వినియోగదారుల ద్రవ్యోల్బణానికి సుమారు 36 బేసిస్ పాయింట్లు అదనంగా చేరవచ్చని, అదే మొత్తం మీద లీటరుకు రూ. 10 పెరిగితే ఈ ప్రభావం 48 బేసిస్ పాయింట్లకు చేరవచ్చని  క్రిసిల్ రేటింగ్స్ ఏజెన్సీ అంచనా వేస్తోంది. రవాణా ఖర్చులే ప్రధాన ప్రసార మార్గంగా ఉంటాయని అంచనా. భారతదేశ లాజిస్టిక్స్ ఖర్చులలో సరుకు రవాణా వాటా 54శాతం కాగా, మొత్తం సరుకు రవాణాలో దాదాపు 71శాతం రోడ్డు రవాణా ద్వారానే జరుగుతుందని క్రిసిల్ పేర్కొంది. రోడ్డు రవాణా ఖర్చులలో కేవలం ఇంధనానికే సుమారు 42శాతం కేటాయిస్తోంది. దీనివల్ల ఇంధన ధరల పెరుగుదల సరఫరా గొలుసులను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది.

Also Read: LPG Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. మళ్లీ పెరిగిన వంటగ్యాస్ ధరలు.. ఎంత పెరిగిందో చూస్తే షాకవుతారు..!!

ఫలితంగా, రవాణాపై ఆధారపడిన రంగాలు అధిక వ్యయాలను ఎదుర్కోవలసి వస్తుందని అంచనా. పెరుగుతున్న రవాణా ఖర్చులు చిల్లర ధరలపై ప్రభావం చూపడం వల్ల, పాల ఉత్పత్తులు, పండ్లు, పప్పుధాన్యాలు, సుగంధ ద్రవ్యాలు, టీ, కాఫీ, గుడ్లు, మాంసం, చేపలు వంటి వర్గాలలో ధరల బదిలీ బలంగా ఉండవచ్చని క్రిసిల్ పేర్కొంది.పెరిగిన ముడి చమురు ఆధారిత ముడిసరుకులు,  అధిక రవాణా ఖర్చుల వల్ల తయారీదారులు కూడా ద్వంద్వ వ్యయ ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఇది లాభాల మార్జిన్‌లు,  వినియోగదారుల ధరలపై ఒత్తిడిని పెంచుతోంది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి రెండు నెలల్లో ముడి చమురు ధరలు బ్యారెల్‌కు సగటున సుమారు $112గా ఉన్నాయి. ఇది క్రిసిల్ పూర్తి సంవత్సర ప్రాథమిక అంచనా అయిన బ్యారెల్‌కు $95 కంటే గణనీయంగా ఎక్కువ అని పెర్కొంది.  ఇటీవలి ధరల పెంపు తర్వాత కూడా ఇంధన రిటైలర్లు గణనీయమైన నష్టాలను చవిచూస్తున్నందున, ఓఎంసీ ఆర్థిక వనరులు, ద్రవ్యోల్బణ నిర్వహణ,  వినియోగదారుల కొనుగోలు శక్తిని సమతుల్యం చేయడంపై చర్చ రాబోయే వారాల్లో తీవ్రతరం కానుంది.

Also Read: Bitcoin Price Crash: క్రిప్టో ఇన్వెస్టర్లకు బిగ్ షాక్.. అక్టోబర్ 2024 తర్వాత తొలిసారిగా $60,000 దిగువకు Bitcoin.. అసలు కారణం ఇదే..!!

ముడి చమురు ధరలు రానున్న కాలంలో తగ్గుతాయా లేదా అనేది పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులపై ఆధారపడి ఉంది. ఇరాన్ తో అమెరికా జరుపుతున్న  చర్చలు తుది అంకానికి చేరి.. ఇజ్రాయెల్ వైపు నుంచి ఎలాంటి దాడులు జరగనట్లయితే.. ముడి చమురు ధరలు పడిపోయే ఛాన్స్ ఉంటుంది. కానీ ప్రస్తుతానికి మధ్య ప్రాచ్యంలో ఘర్షణలు ఇంకా సద్ధుమణగడం లేదు. హర్మూజ్ జల సంధి వేదికగా జరుగుతున్న ఆధిపత్య పోరు, లెబనాన్ పై జరుగుతున్న దాడులు ఇంధన మార్కెట్ ను శాసిస్తున్నాయి. ఈ సంక్షోభం ఈవిధంగానే కొనసాగినట్లయితే భారతీయ వినియోగదారులకు ఇంధన మంటలు తప్పదు. 
 

Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. దయచేసి దీన్ని పెట్టుబడి, ఆర్థిక లేదా వ్యాపార సలహాగా భావించవద్దు. గుర్తుంచుకోండి స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టోకరెన్సీలు, రియల్ ఎస్టేట్, విలువైన లోహాలు వంటి అన్ని రకాల పెట్టుబడులు మార్కెట్ ఆటు పోటులు రిస్కులకు లోబడి ఉంటాయి. దీని అర్థం, మీరు లాభపడవచ్చు లేదా నష్టపోవచ్చు. మీరు తీసుకునే ఎలాంటి పెట్టుబడి నిర్ణయాలు లేదా వ్యాపార కార్యకలాపాల వల్ల కలిగే నష్టాలు లేదా లాభాలకు మా సంస్థ జీ తెలుగు వెబ్ పోర్టల్ ఎట్టి పరిస్థితుల్లోనూ బాధ్యత వహించదు. ఏదైనా ఆర్థిక నిర్ణయం తీసుకునే ముందు, తప్పకుండా ఒక రిజిస్టర్డ్ లేదా సర్టిఫైడ్ ఆర్థిక నిపుణుడిని సంప్రదించి, వారి సలహా తీసుకోమని పాఠకులకు సిఫార్సు చేస్తున్నాము.

 

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Gold Rate Today: యూఎస్ జాబ్స్ డేటా ఎఫెక్ట్.. పాతాళానికి బంగారం, వెండి ధరలు.. సిల్వర్ రూ. 10వేలు డౌన్.. మే 7వ తేదీ ధరలివే..!!

BBhoomi5h ago
Lakshmapur, Telangana:

Gold Rate Today: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తత కారణంగా బంగారం ధరలు నిరంతరం మారుతున్నాయి. ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ ప్రకారంబంగారం10 గ్రాముల బంగారం ధర రూ. 1,59,900 కు పడిపోయింది.  మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్  లో 24-క్యారెట్ల బంగారం ఫ్యూచర్స్ ధర ఈ ఉదయం 2.47శాతం లేదా రూ. 3,947 తగ్గి, 10 గ్రాములకు రూ. 1,55,600 కు చేరింది. గత ట్రేడింగ్ లో  10 గ్రాములకు రూ. 1,59,547 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ బంగారం ధర స్వల్పంగా తగ్గి ఔన్సుకు $4,470.79 కు చేరింది. ఇండియన్ బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ వెల్లడించిన వివరాల ప్రకారం, శుక్రవారం మార్కెట్ ముగిసే సమయానికి  10 గ్రాములకు రూ. 1,54,238 వద్ద ఉంది. శని, ఆదివారాల్లో మార్కెట్ మూసి ఉన్నందున, ఈ రెండు రోజులూ ఇదే ధర వర్తిస్తుంది. గుడ్‌రిటర్న్స్  తెలిపిన వివరాల ప్రకారం..  24-క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములకు రూ. 1,55,910 గా ఉంది.  గత 8 రోజుల్లో బంగారం ధర దాదాపు రూ. 5వేల వరకు తగ్గింది. 

24 క్యారెట్ల బంగారం (999): 10 గ్రాములకు రూ. 154238

23 క్యారెట్ల (995) బంగారం: 10 గ్రాములకు రూ. 153620

22 క్యారెట్ల (916) బంగారం: 10 గ్రాములకు రూ. 141282

18 క్యారెట్ల బంగారం (750): 10 గ్రాములకు రూ. 115679

14 క్యారెట్ల (585) బంగారం: 10 గ్రాములకు రూ. 90,229

అంతర్జాతీయ మార్కెట్‌లో బలహీన ధోరణి మధ్య,  శనివారం జాతీయ రాజధాని బులియన్ మార్కెట్‌లో 10 గ్రాముల బంగారం ధరలు రూ. 400 మేర తగ్గి రూ. 1.59 లక్షలకు చేరాయి. స్థానిక మార్కెట్ నిపుణుల ప్రకారం, గురువారం ముగింపు స్థాయి అయిన 10 గ్రాముల రూ. 1,60,300తో పోలిస్తే, 99.9 శాతం స్వచ్ఛమైన బంగారం ధర  రూ. 400 మేర తగ్గి 10 గ్రాములకు రూ. 1,59,900కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్‌లో, స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు $4,470.79కి స్వల్పంగా తగ్గింది.

Also Read: మళ్లీ పెరిగిన వంటగ్యాస్ ధరలు.. ఎంత పెరిగిందో చూస్తే షాకవుతారు..!!

ఫ్యూచర్స్ ట్రేడ్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ. 1,221 మేర తగ్గి రూ. 1.58 లక్షలకు చేరింది. అధిక చమురు ధరలు, పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, అధిక వడ్డీ రేట్లపై ఆందోళనలు పెట్టుబడిదారుల విశ్వాసాన్ని తగ్గించడంతో, గోల్డ్ ఫ్యూచర్స్ ధరలు పడిపోయాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌లో ఆగస్టు డెలివరీ కాంట్రాక్ట్ ధర రూ. 1,221, అంటే సుమారు ఒక శాతం తగ్గి, 10 గ్రాములకు రూ. 1,58,326కు చేరింది. ఇందులో 8,346 లాట్లు ట్రేడ్ అయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో, న్యూయార్క్‌లోని కామెక్స్ గోల్డ్ ఫ్యూచర్స్ ఆగస్టు కాంట్రాక్ట్ ధర ఔన్సుకు $16.63, అంటే 0.37 శాతం తగ్గి $4,488.37కు చేరింది.

అటు వెండి ధరలు కూడా భారీగా తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో కిలో వెండిపై రూ. 10వేల వరకు తగ్గింది. దీంతో నేడు కిలో వెండి రూ. 2.70లక్షలకు దిగివచ్చింది. అంతకు ముందు రోజుల్లో 5వేల తగ్గింది. మూడు రోజుల్లో 20వేలు తగ్గింది. 

Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. దయచేసి దీన్ని పెట్టుబడి, ఆర్థిక లేదా వ్యాపార సలహాగా భావించవద్దు. గుర్తుంచుకోండి స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టోకరెన్సీలు, రియల్ ఎస్టేట్, విలువైన లోహాలు వంటి అన్ని రకాల పెట్టుబడులు మార్కెట్ ఆటు పోటులు రిస్కులకు లోబడి ఉంటాయి. దీని అర్థం, మీరు లాభపడవచ్చు లేదా నష్టపోవచ్చు. మీరు తీసుకునే ఎలాంటి పెట్టుబడి నిర్ణయాలు లేదా వ్యాపార కార్యకలాపాల వల్ల కలిగే నష్టాలు లేదా లాభాలకు మా సంస్థ జీ తెలుగు వెబ్ పోర్టల్ ఎట్టి పరిస్థితుల్లోనూ బాధ్యత వహించదు. ఏదైనా ఆర్థిక నిర్ణయం తీసుకునే ముందు, తప్పకుండా ఒక రిజిస్టర్డ్ లేదా సర్టిఫైడ్ ఆర్థిక నిపుణుడిని సంప్రదించి, వారి సలహా తీసుకోమని పాఠకులకు సిఫార్సు చేస్తున్నాము.

 

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement

Bitcoin Price Crash: క్రిప్టో ఇన్వెస్టర్లకు బిగ్ షాక్.. అక్టోబర్ 2024 తర్వాత తొలిసారిగా $60,000 దిగువకు Bitcoin.. అసలు కారణం ఇదే..!!

BBhoomi5h ago
Lakshmapur, Telangana:

Bitcoin Price Crash: బిట్‌కాయిన్ ధర కుప్పకూలింది. అక్టోబర్ 2024 తర్వాత తొలిసారిగా..  బిట్‌కాయిన్ ధర  60,000 డాలర్ల  కంటే దిగువకు పడిపోయింది. శుక్రవారం న్యూయార్క్ ట్రేడింగ్ సమయంలో ఈ అతిపెద్ద క్రిప్టోకరెన్సీ 7శాతం పడిపోయి 59,101డాలర్లకు చేరింది. గత ఏడాది అక్టోబర్‌లో 126,000 డాలర్ల పైన గరిష్ట స్థాయికి చేరినప్పటి నుండి, బిట్‌కాయిన్ తన విలువలో సగానికి పైగా కోల్పోయింది. క్రిప్టో-అనుకూల డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించినప్పటి కంటే ఇప్పుడు దీని విలువ తక్కువగా ఉంది. ఇది బిట్‌కాయిన్‌లో పెట్టుబడి పెట్టడానికి ఒక అవకాశమా లేక వెంటనే ఉపసంహరించుకోవాలా?  పూర్తి వివరాలు తెలుసుకుందాం. 

బిట్‌కాయిన్ పతనం వెనుక అసలు కారణం ఏంటి?
బిట్‌కాయిన్ ఇటీవలి పతనానికి అతిపెద్ద కారణం  సంస్థాగత పెట్టుబడిదారులు లాభాలను స్వీకరించడమే అని చెప్పాలి. పెట్టుబడిదారులు ఇప్పుడు క్రిప్టో నుండి తమ నిధులను ఉపసంహరించుకుని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రక్షణ, ఇంధనం, మౌలిక సదుపాయాలు వంటి వేగవంతమైన వృద్ధిని సాధిస్తున్న రంగాలలో పెట్టుబడులు పెడుతున్నారు.  ఈ సమయంలో బంగారం,  AI స్టాక్‌లపై పెట్టుబడిదారులకు మరింత నమ్మకం పెరిగింది. 

పెట్టుబడిదారులు దేనిపై దృష్టి పెట్టాలి?
మార్కెట్ సెంటిమెంట్‌ను అర్థం చేసుకోవడానికి రాబోయే కొద్ది రోజులు కీలకమని చెబుతున్నారు మార్కెట్ విశ్లేషకులు. బిట్‌కాయిన్ $60,000-$62,000 స్థాయిని నిలబెట్టుకోగలదా లేదా అని పెట్టుబడిదారులు వేచి చూడాల్సి ఉంటుంది. ధర ఇక్కడ నిలబడితే, మార్కెట్ బూమ్ మళ్లీ వస్తుంది. దీంతో రేట్లు మళ్లీ పెరిగే అవకాశం ఉంది.

Also Read: మళ్లీ పెరిగిన వంటగ్యాస్ ధరలు.. ఎంత పెరిగిందో చూస్తే షాకవుతారు..!!

పెట్టుబడిదారులు ఇప్పుడేం చేయాలి? 
క్రిప్టో మార్కెట్‌లో భారీ హెచ్చుతగ్గులు సర్వసాధారణమే అని చెప్పాలి. స్వల్పకాలిక లాభనష్టాల గురించి ఆందోళన చెందడం లేదా భావోద్వేగాలకు లోనవడం కాకుండా, పెట్టుబడిదారులు తమ రిస్క్ తీసుకునే సామర్థ్యం, ​​బడ్జెట్, దీర్ఘకాలిక లక్ష్యాలపై దృష్టి పెట్టాలి. అయితే, కొత్త పెట్టుబడులకు దూరంగా ఉండాలి. భారత ప్రభుత్వం బిట్‌కాయిన్‌ను గుర్తించదు. కాబట్టి ఇతర పెట్టుబడి మార్గాలలో పెట్టుబడి పెట్టడం మంచిది. బిట్‌కాయిన్‌లో ఎల్లప్పుడూ అధిక స్థాయి రిస్క్ ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు. 

Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. దయచేసి దీన్ని పెట్టుబడి, ఆర్థిక లేదా వ్యాపార సలహాగా భావించవద్దు. గుర్తుంచుకోండి స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టోకరెన్సీలు, రియల్ ఎస్టేట్, విలువైన లోహాలు వంటి అన్ని రకాల పెట్టుబడులు మార్కెట్ ఆటు పోటులు రిస్కులకు లోబడి ఉంటాయి. దీని అర్థం, మీరు లాభపడవచ్చు లేదా నష్టపోవచ్చు. మీరు తీసుకునే ఎలాంటి పెట్టుబడి నిర్ణయాలు లేదా వ్యాపార కార్యకలాపాల వల్ల కలిగే నష్టాలు లేదా లాభాలకు మా సంస్థ జీ తెలుగు వెబ్ పోర్టల్ ఎట్టి పరిస్థితుల్లోనూ బాధ్యత వహించదు. ఏదైనా ఆర్థిక నిర్ణయం తీసుకునే ముందు, తప్పకుండా ఒక రిజిస్టర్డ్ లేదా సర్టిఫైడ్ ఆర్థిక నిపుణుడిని సంప్రదించి, వారి సలహా తీసుకోమని పాఠకులకు సిఫార్సు చేస్తున్నాము.

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

LPG Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. మళ్లీ పెరిగిన వంటగ్యాస్ ధరలు.. ఎంత పెరిగిందో చూస్తే షాకవుతారు..!!

BBhoomi6h ago
Lakshmapur, Telangana:

LPG price hike 2026: పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న సంక్షోభం నేపథ్యంలో, భారత ప్రభుత్వం గృహ వంటగ్యాస్ (ఎల్‌పిజి) వినియోగదారులకు మరోసారి గట్టి దెబ్బతగిలింది. 14.2 కిలోగ్రాముల గృహ వినియోగ ఎల్‌పిజి సిలిండర్ ధరను రూ. 29 పెంచుతూ ప్రభుత్వ చముర సంస్థలు శనివారం నిర్ణయం తీసుకున్నాయి. ఈ కొత్త ధరలు జూన్ 7 నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ పెంపు తర్వాత ఢిల్లీలో గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధర రూ. 913 నుంచి రూ. 942కు పెరిగింది. మూడు నెలల్లో గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ల ధరలు పెరగడం ఇది రెండోసారి. గత పెంపు మార్చి 7వ తేదీన జరిగింది. అప్పుడు ఎల్పీజీ సిలిండర్ల ధరను ఒక్కో సిలిండర్‌కు రూ. 60 పెంచారు.

పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న సంఘర్షణ ప్రపంచ ఇంధన సరఫరాలపై ప్రభావం చూపింది. దీనివల్ల అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు, ఇతర ఇంధనాల ధరలు విపరీతంగా పెరిగాయి. ఈ ఒత్తిడి ఇప్పుడు దేశీయ ఎల్పీజీ ధరలలో ప్రతిబింబిస్తోంది. ఈ తాజా పెరుగుదల ఉన్నప్పటికీ, దేశీయ ఎల్పీజీ అమ్మకాలపై చమురు మార్కెటింగ్ కంపెనీలు తమ నష్టాలను పాక్షికంగా మాత్రమే పూడ్చుకోగలవని కూడా ఆ వర్గాలు చెబుతున్నాయి. 

ధరల సవరణకు ముందు, ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు విక్రయించే ప్రతి గృహ వినియోగ ఎల్‌పిజి సిలిండర్‌పై సుమారు  రూ. 703 నష్టాన్ని చవిచూస్తున్నాయి. అందుకే ఆ కంపెనీలు చాలా కాలంగా ధరల సవరణను డిమాండ్ చేస్తున్నాయి. ఎల్‌పిజితో పాటు, ఇతర ఇంధనాల ధరలు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. మే మధ్య నుండి, పెట్రోల్, డీజిల్ ధరలు కలిపి లీటరుకు రూ. 7.50 పెరిగాయి. సిఎన్‌జి ధరలు కూడా కిలోగ్రాముకు సుమారుగా రూ. 6 పెరిగాయి.

ఇదిలా ఉండగా, ఇటీవలి ధరల పెరుగుదల ఉన్నప్పటికీ, ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్‌లను వాటి ఉత్పత్తి వ్యయం కంటే తక్కువ ధరకే అమ్ముతున్నాయని వర్గాలు చెబుతున్నాయి. చమురు కంపెనీలు పెట్రోల్‌పై లీటరుకు సుమారు రూ. 11, డీజిల్‌పై లీటరుకు సుమారు రూ. 33.6 నష్టాలను చవిచూస్తున్నాయి. పెరిగిన అంతర్జాతీయ ధరల పూర్తి భారాన్ని ప్రభుత్వం వినియోగదారులపై మోపలేదని వార్తలు వస్తున్నాయి. పెరుగుతున్న ఖర్చులలో కొంత భాగాన్ని ప్రభుత్వ రంగ చమురు కంపెనీలే ఇప్పటికీ భరిస్తున్నాయి.

ఈ పెరుగుదలతో, దేశవ్యాప్తంగా గృహ గ్యాస్ వినియోగదారులు ఇప్పుడు మునుపటి కంటే ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. అయితే, వివిధ రాష్ట్రాల్లోని పన్నులు  స్థానిక సుంకాల కారణంగా తుది చిల్లర ధరలలో స్వల్ప మార్పులు ఉండవచ్చు. ప్రజలు ఇప్పటికే పెరుగుతున్న ఆహార పదార్థాలు, ఇతర నిత్యావసర వస్తువుల ధరలతో సతమతమవుతున్న తరుణంలో ఈ ఎల్పీజీ సిలిండర్ ధరల పెరుగుదల చోటుచేసుకుంది. ఇది గృహ బడ్జెట్లపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది.

Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. దయచేసి దీన్ని పెట్టుబడి, ఆర్థిక లేదా వ్యాపార సలహాగా భావించవద్దు. గుర్తుంచుకోండి స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టోకరెన్సీలు, రియల్ ఎస్టేట్, విలువైన లోహాలు వంటి అన్ని రకాల పెట్టుబడులు మార్కెట్ ఆటు పోటులు రిస్కులకు లోబడి ఉంటాయి. దీని అర్థం, మీరు లాభపడవచ్చు లేదా నష్టపోవచ్చు. మీరు తీసుకునే ఎలాంటి పెట్టుబడి నిర్ణయాలు లేదా వ్యాపార కార్యకలాపాల వల్ల కలిగే నష్టాలు లేదా లాభాలకు మా సంస్థ జీ తెలుగు వెబ్ పోర్టల్ ఎట్టి పరిస్థితుల్లోనూ బాధ్యత వహించదు. ఏదైనా ఆర్థిక నిర్ణయం తీసుకునే ముందు, తప్పకుండా ఒక రిజిస్టర్డ్ లేదా సర్టిఫైడ్ ఆర్థిక నిపుణుడిని సంప్రదించి, వారి సలహా తీసుకోమని పాఠకులకు సిఫార్సు చేస్తున్నాము.

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

 

0
0
Report

KTR: వచ్చేది కేసీఆర్‌ ప్రభుత్వమే.. ఎన్నారైలు తెలంగాణ అభివృద్ధికి సహకరించాలి: కేటీఆర్‌

Baddipadaga, Telangana:

Telangana Formation Day At Malaysia: 'రైతులకు ఉచితంగా 24 గంటలపాటు కరెంట్ ఇచ్చిన ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ. ప్రతి గడపకు నల్లా పెట్టి ఇంటింటికీ నీళ్లు ఇచ్చిన మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ. కరెంట్ కోతలతో అల్లాడిన చోటే కరెంట్ కోతలంటే తెల్వని పరిస్థితిని సృష్టించింది తెలంగాణ. నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిస్ అనే మహమ్మారిని తరిమికొట్టింది కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ. 70 లక్షల మంది రైతు కుటుంబాలకు రైతుబంధు ఇచ్చి తెలంగాణ రైతులను దేశంలోనే నెంబర్ వన్‌గా కేసీఆర్ నాయకత్వం నిలబెట్టింది' అని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్ కేటీఆర్‌ తెలిపారు. 'ఆయిల్, అణ్వాయుధాలు ఉన్నవాడు కాదు లీడర్.. ఆలోచన ఉన్నవాడే అసలైన లీడర్. కొత్త ఆవిష్కరణలతో, నవ్య సాంకేతికతతో పోటెత్తే యువ సముద్రం భారతదేశం.. తెలంగాణలో ఉంది. ఇవాళ జెన్-జీ కొత్త శక్తితో.. కొత్త ఉత్సాహంతో తొణికిసలాడుతున్నది' అని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ తెలిపారు.

పామాయిల్ విప్లవం
మలేషియాలోని కౌలాలంపూర్ నగరంలో మలేషియా తెలంగాణ అసోసియేషన్ (మైటా), బీఆర్ఎస్ పార్టీ మలేషియా శాఖల సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన తెలంగాణ ఆవిర్భావ వేడుకలలో పాల్గొని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక ప్రసంగం చేశారు. మలేషియాతో కూడా తెలంగాణకి ఒక అద్భుతమైన సంబంధం ఉంది. మలేషియా మాదిరే తెలంగాణలోనూ పామాయిల్ విప్లవం సాధించి, రైతుల వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలనే ఏకైక ఉద్దేశంతో పామాయిల్ కోసం మలేషియా నుంచి విత్తనాలు, మొక్కలు తీసుకువచ్చి తెలంగాణలో నాటించారు' అని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ గుర్తుచేశారు. కేసీఆర్‌ కృషి ఫలితంగా ఈరోజు భారతదేశంలోనే అత్యధికంగా పామాయిల్ ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రాల్లో ఒకటిగా తెలంగాణ నిలిచిందని సగర్వంగా ప్రకటించారు.

ఆలోచన ఉన్నవాడే అగ్రస్థానంలో
'ప్రపంచం విపరీతమైన మార్పులకు గురవుతున్నది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వంటి సాంకేతిక రంగాలు ప్రపంచాన్ని కుదిపేస్తున్నాయి. కేవలం విజ్ఞానం ఉన్నవాడే నాయకుడని, ఆ దేశం మాత్రమే ఎదుగుతుంది.  ఒకనాడు అణ్వాయుధాలు ఉన్నవాడు నాయకుడైతే.. ఈరోజు విజ్ఞానం, ఆలోచన ఉన్నవాడే అగ్రస్థానంలో నిలబడుతున్నారు. అందుకే తెలంగాణ రాష్ట్రానికి ఎన్నారైల సేవలు కావాలని.. తెలంగాణ అభివృద్ధికి వారి సూచనలు, భవిష్యత్తుకు ప్రవాసుల మద్దతు అవసరం' అని మాజీ మంత్రి కేటీఆర్‌ విజ్ఞప్తి చేశారు.

బీఆర్‌ఎస్‌ పార్టీకి ఒక ప్రత్యేక విజన్
'10 సంవత్సరాల పాటు వెనుకబడిన తెలంగాణను అగ్రస్థానంలో నిలిపిన కేసీఆర్‌కు, బీఆర్‌ఎస్‌ పార్టీకి వచ్చే 25 సంవత్సరాల కోసం, తెలంగాణ భవిష్యత్తు కోసం ఒక ప్రత్యేక విజన్ ఉంది. అలాంటి అద్భుతమైన విజన్‌ను నిజం చేయగలిగే శక్తి ముమ్మాటికీ కేసీఆర్‌కే ఉంది. 10 సంవత్సరాల ఆయన పరిపాలనే దానికి సజీవ సాక్ష్ం' అని మాజీ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. 60 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో కరెంట్ కోతలతో తల్లడిల్లిన తెలంగాణకు 24 గంటల ఉచిత, నాణ్యమైన విద్యుత్‌ను అన్ని రంగాలకు అందించిన తీరుగానే.. రాబోయే రోజుల్లో అభివృద్ధి చెందిన దేశాల మాదిరిగా 24 గంటల పాటు స్వచ్ఛమైన తాగునీటిని నిరంతరం సరఫరా చేయాలన్నదే తమ ప్రధాన విజన్' అని కేటీఆర్ ప్రకటించారు. 

భవిష్యత్‌ ప్రణాళిక
'ప్రజారవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని, ఆ దిశగా పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తాం. తెలంగాణను తిరిగి అభివృద్ధి పథంలో నిలిపే శక్తి కేసీఆరకే ఉంది. కేసీఆర్ ప్రభుత్వం తిరిగి రాగానే భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా తెలంగాణను తీర్చిదిద్దుతాం' అని తమ భవిష్యత్‌ ప్రణాళికను బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ వివరించారు. 'ప్రస్తుతం ప్రపంచంలోని అనేక దేశాల్లో విపరీతమైన మార్పులు వస్తున్న నేపథ్యంలో ప్రవాస భారతీయులు స్థానికులతో కలిసిమెలిసి ముందుకు సాగాల్సిన అవసరాన్ని గుర్తించాలి' అని సూచించారు. 'స్థానికులతో, స్థానిక సంస్కృతితో కలిసి ముందుకు పోతే ప్రతి దేశంలోనూ తెలంగాణ బిడ్డలు అద్భుతమైన విజయాలు సాధిస్తారు' అని కేటీఆర్ తెలిపారు.

కలిసి రావాలి
తెలంగాణ రాష్ట్రం కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం ప్రవాస భారతీయులంతా తమతో కలిసి రావాలని మాజీ మంత్రి కేటీఆర్‌ పిలుపునిచ్చారు. మలేషియాలో ఈ అద్భుతమైన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మలేషియా తెలుగు అసోసియేషన్‌తో పాటు బీఆర్‌ఎస్ ఎన్నారై మలేషియా శాఖకు, పార్టీ శ్రేణులకు కేటీఆర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

0
0
Report
Advertisement
Advertisement
Back to top