దళిత సంఘాల ఐక్య వేదిక అధ్యక్షునిగా చిలుక రాజనర్సు
Bellampalle, Kannal Rural, Telangana:దళిత సంఘాల ఐక్య వేదిక అధ్యక్షునిగా చిలుక రాజనర్సు మరోసారి ఎన్నికయ్యారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని ఎస్సీ కమ్యూనిటీ హాల్లో దళిత సంఘాల ఐక్యవేదిక అధ్యక్షుడు గోమాస రాజం అధ్యక్షతన అత్యవసర సమావేశం నిర్వహించారు. 3నెలల క్రితం దళిత సంఘాల అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన దరసంగాలు అధ్యక్షుడు చిలక రాజనర్సును సంఘం ఐక్యత కోసం భవనిర్మానం కోసం అభివృద్ధి పని కోసం పని చేయాలని కోరారు.हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
Bhogapuram Airport: అదిరిపోయిన భోగాపురం ఎయిర్పోర్ట్ విజువల్స్
Gudepuvalasa, Andhra Pradesh:Watch Visuals Of Bhogapuram Airport Video At Vizag PM Modi Will Launch On August 1stTDP MLC: ఎమ్మెల్సీ కోసం 20 మంది పోటీ.. చంద్రబాబు ఛాయిస్ వీళ్లే!
Kanagumakulapalli, Andhra Pradesh:TDP Chief Chandrababu Exercise Governer Quota MLC Candidates In TDP Know The DetailsJeevan Reddy: రైతులకు సాగునీటి కోసం అధికారులకు జీవన్ రెడ్డి ఫోన్కాల్
Jagtial, Telangana:Former Minister T Jeevan Reddy Phone Call To Officials For Farmers Issue Watchడీఈ, ఎస్ఈలకు మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఫోన్.. ఖరీఫ్ పంటలను కాపాడాలని విజ్ఞప్తి
Jagtial, Telangana:BRS Party: ఎత్తిపోతల మోటర్లు మరమ్మతు చేపట్టి వెంటనే ఖరీఫ్ పంటకు నీరు అందించాలని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. సాగునీరు అందించి రైతులను ఆదుకోవాలని కోరారు. కొల్వాయి ఆరేపల్లిలో మోటార్లు మరమ్మతు చేయించాలని.. ఏడాదికాలంగా మరమ్మతులు చేపట్టడం లేదని తెలిపారు. అధికారులు అంచనాలు రూపొందించేది ఎప్పుడు నీళ్లు అందించేది ఎప్పుడు అని మాజీ మంత్రి జీవన్ రెడ్డి ప్రశ్నించారు.
బీర్పూర్ మండలం కొల్వాయి ఎత్తిపోతల పథకాన్ని సోమవారం రైతులతో కలిసి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్ రెడ్డి సందర్శించారు. అక్కడ కాలిపోయిన మోటార్లను పరిశీలించారు. ట్రాన్స్ఫార్మర్ కాలిపోవడంతో నీళ్లు అందక సాగు చేయడం లేదని రైతులు జీవన్ రెడ్డికి తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఈ సందర్భంగా విద్యుత్ డీఈ, ఎస్ఈలతో మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఫోన్లు చేసి మాట్లాడారు. సాగునీరు కోసం వెంటనే మోటార్లు ఆన్ చేయాలని విజ్ఞప్తి చేశారు.
'రైతుల అదృష్టం కొద్ది కాలువలో నీళ్లు ఉన్నాయని వాటిని సద్వినియోగం చేసుకునేందుకు మోటర్లు మరమ్మతు చేపట్టి పంపులు వినియోగించాలి. కొల్వాయి, ఆరేపల్లిలో పంపుసెట్లు నిలిచిపోయి ఏడాది గడుస్తుంది. రేకులపల్లెలో పంపుసెట్టు నిలిచిపోయింది. కమ్మనూరులో ట్రాన్స్ఫార్మర్ లేక పంపుసెట్టు వినియోగం కోసం ఏడాదిగా ఎదురుచూస్తున్నారు. మంగేలలో ట్రాన్స్ఫార్మర్ రీప్లేస్మెంట్ నేటికి రాలేదు. ఈనెల 31వ తేదీలోగా మోటార్ల మరమ్మతు, ట్రాన్స్ఫార్మర్ల రీప్లేస్మెంట్ చేస్తే ఖరీఫ్ పంట సాగు చేసుకునే అవకాశం ఉంది' అని అధికారులతో ఫోన్లో మాజీ మంత్రి జీవన్ రెడ్డి వివరించారు.
ఆగస్టు ఒకటో తేదీ నాటికి పంపుసెట్లు సిద్ధం చేయాలని.. లేకపోతే నీళ్లు ఉండి కూడా పంటలు ఎండిపోవడానికి మీరే బాధ్యత వహించాల్సి వస్తుందని అధికారులకు ఫోన్లో మాజీ మంత్రి జీవన్ రెడ్డి హెచ్చరించారు. నీళ్లు ఉండి కూడా పంటలు పండించుకోలేని దుస్థితి రాకుండా చూడాలని కోరారు. అన్ని పంపు సెట్లు వినియోగంలో తీసుకువచ్చి ఖరీఫ్ పంటకు నీరు అందించాలని అధికారులను విజ్ఞప్తి చేశారు. క్షేత్రస్థాయిలో పరిస్థితిని అంచనావేసేందుకు అధికారులు పంపుసెట్లు పరిశీలించాలని అధికారులకు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్ రెడ్డి సూచించారు.
31 లోగా కమ్మనూరు మంగల పంపు చెట్ల ద్వారా నీరు అందించాలి.
కుల్వాయి, ఆరేపల్లిలో ప్రధాన సమస్య పరిష్కరించే బాధ్యత తీసుకోవాలని అధికారులకు మాజీ మంత్రి జీవన్ రెడ్డి సూచించారు. మరమ్మతులకు డబ్బులు లేవని మాత్రం చెప్పొద్దన్నారు. ప్రభుత్వ ఖజానా ఖాళీ అయింది అని చెబితే రైతులే మరమ్మతులు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. బీర్పూర్లో నిలిచిపోయిన పంపుసెట్లు అన్ని ప్రారంభించాలని లేకపోతే రైతులు ప్రజావాణి ఎదుట కూర్చుంటారని హెచ్చరించారు. 'కొల్వాయి, ఆరేపల్లి లో మూడు పంపులు పనిచేయడం లేదు. రైతుల సమస్య అర్థం చేసుకోండి. సమయానికి నీళ్లు ఇవ్వకపోతే ఖరీఫ్ సాగు ఎట్లా సాధ్యమవుతుంది. సీజన్ పోయిన తర్వాత మరమ్మతులు చేయిస్తే లాభం ఏముంది. పంట సాగు చేపట్టకపోతే మీరే బాధ్యత వహించాలి' అని అధికారులను బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్ రెడ్డి హెచ్చరక చేశారు.
Peddi Sudarshan Reddy: పెద్ది సుదర్శన్ రెడ్డి కోసం ఆస్పత్రికి వచ్చిన కేసీఆర్
Hyderabad, Telangana:Telangana First CM KCR Back With Peddi Sudarshan Reddy Family Watch VideoKCR: పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి ధైర్యం చెప్పిన కేసీఆర్
Hyderabad, Telangana:MLC Aspirants: గవర్నర్ కోటాకు టీడీపీలో తీవ్ర పోటీ.. 20 ఆశావహుల్లో ఎవరికీ అదృష్టం వరించునో..?
Nuzendla, Andhra Pradesh:TDP Governor Quota MLC: ఆంధ్రప్రదేశ్లో మరోసారి పదవుల జాతర జరగనుంది. శాసనమండలిలో జూలై 28వ తేదీ నాటికి రెండు గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి. వాటిని భర్తీ చేసేందుకు టీడీపీ అధిష్ఠానం కసరత్తు ప్రారంభించింది. వైఎస్సార్సీపీకి చెందిన ఎమ్మెల్సీలు పండుల రవీంద్ర బాబు, జకీయా ఖనుమ్ పదవీ కాలం ముగియనుండగా.. ఆ రెండు స్థానాలతోపాటు గవర్నర్ కోటాలో మరో రెండు స్థానాలు భర్తీ కానున్నాయి. భర్తీ కానున్న నాలుగు పదవుల్లో రెండు స్థానాలు టీడీపీకి దక్కనున్నాయి. పదవీకాలం ముగుస్తున్న జకీయా ఖనుమ్ వైఎస్సార్సీపీ నుంచి బీజేపీలో చేరడంతో మరోసారి అవకాశం లభించే ఛాన్స్ ఉంది. మిగిలిన మూడింటిలో జనసేన పార్టీకి ఒకటి దక్కనుండగా.. మిగిలిన రెండు ఎమ్మెల్సీ స్థానాలు తెలుగుదేశం పార్టీకి దక్కనున్నాయి. ఈ ఎమ్మెల్సీ పదవి కోసం తెలుగుదేశం పార్టీ నుంచి పెద్ద ఎత్తున పోటీ నెలకొంది. రేసులో మోపిదేవి వెంకట రమణా రావు, డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి, వర్ల రామయ్య, శ్రీనివాసులురెడ్డి, పనబాక లక్ష్మి తదితరులు ఉన్నారు.
చంద్రబాబు తీవ్ర కసరత్తు
గవర్నర్ కోటా ఎమ్మెల్సీ రెండు స్థానాల కోసం రేసులో 20 మందికి పైగా ఆశావహులు ఉన్నారు. అభ్యర్థులను నేడో రేపో ప్రకటించాల్సి ఉండడంతో ఎవరికి అవకాశం దక్కుతుందోనని రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ఆ రెండు స్థానాల్ని భర్తీ చేసేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర కసరత్తు చేస్తున్నారు. సామాజిక, రాజకీయ, ప్రాంతీయ సమీకరణాలను దృష్టిలో ఉంచుకొని అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి తీవ్ర పోటీ
గతంలో సీట్లు త్యాగం చేసిన వారు.. రాజ్యసభ ఛాన్స్ మిస్సయిన సీనియర్లు అధినేత చంద్రబాబును ప్రసన్నం చేసుకుంటున్నారు. ఇప్పటికే పలుమార్లు తమ వినతులు చెప్పుకున్నారు. అయితే ఆశావహుల్లో ఉమ్మడి కృష్ణా జిల్లా నాయకుల జాబితా పెద్దగానే ఉంది. కృష్ణా జిల్లా నుంచి రేసులో వర్ల రామయ్య, దేవినేని ఉమామహేశ్వరరావు, వంగవీటి రాధా, టీడీ జనార్దన్, గొట్టిపాటి రామకృష్ణ, బుద్ధా వెంకన్న ఉన్నారు.
ఒకటి రాయలసీమకు
గోదావరి జిల్లా నుంచి క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన మంతెన సత్యనారాయణరాజు మరోసారి ఎమ్మెల్సీ పదవిని ఆశిస్తున్నారు. రెండింటిలో ఒక సీటు రాయలసీమ ప్రాంతానికి చెందిన నాయకులకు కేటాయించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. అలా అయితే రాయలసీమ నుంచి రేసులో రెడ్డప్పగారి శ్రీనివాస్ రెడ్డి, తిప్పేస్వామి, బీటెక్ రవి, ప్రభాకర్ చౌదరి ఉన్నారు. దివ్యాంగుల కోటాలో ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని ఇస్తామని గతంలో చంద్రబాబు హామీ ఇవ్వడంతో ఈసారి తనకు అవకాశం లభిస్తుందని గ్రంథాలయ పరిషత్ ఛైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు విశ్వాసంతో ఉన్నారు. ఎమ్మెల్సీ పదవి కోసం కూడా ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు.
బ్రాహ్మణ కోటాలో..
ఎమ్మెల్సీ పదవి కోసం బ్రాహ్మణ కోటాలో సీనియర్ నాయకుడు ఏవీ రమణ పోటీపడుతుండగా.. తనకు అవకాశం కల్పించాలని ఆయన ఇప్పటికే పార్టీ అధిష్టానానికి మొరపెట్టుకున్నారు. ఇక డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి, మోపిదేవి వెంకట రమణా రావు, కొమ్మాలపాటి శ్రీధర్, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ, మంగళగిరి సీనియర్ నాయకుడు పోతినేని శ్రీనివాసరావు కూడా ఎమ్మెల్సీ పదవి రేసులో ఉన్నారు. నేడో రేపో టీడీపీ అధిష్టానం ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం ఖరారు చేయనుంది. చివరి వరకు తమకు అవకాశం దక్కేలా ఆశావహులు లాబీయింగ్ చేస్తున్నారు. మరి ఎవరినీ అదృష్టం వరిస్తుందనేది ఉత్కంఠ నెలకొంది.
KCR: 'మా పెద్దిని కాపాడండి'.. వైద్యులకు చేతులెత్తి నమస్కరించిన మాజీ సీఎం కేసీఆర్
Hyderabad, Telangana:KCR With Doctors: తన వెన్నంటి ఉంటూ వచ్చిన తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యంపై తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ సందర్భంగా ఆస్పత్రికి వచ్చి వైద్యులను ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. చేతులెత్తి నమస్కరించి మా పెద్దిని కాపాడాలని కోరారు. ఏం చేస్తారో చేయండి కానీ పెద్ది సుదర్శన్ రెడ్డిని బతికించాలని కేసీఆర్ వైద్యులకు చెప్పారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
పార్టీ నాయకత్వానికి ఆదేశాలు
తెలంగాణ ఉద్యమకారుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి నిన్న గుండెపోటుకు గురవగా.. వరంగల్ నుంచి హైదరాబాద్ సికింద్రాబాద్లోని యశోద ఆస్పత్రికి తరలించిన విషయం తెలిసిందే. పెద్ది గుండెపోటుకు గురయ్యాడనే సమాచారం తెలుసుకున్న నాటి నుంచి కేసీఆర్ తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఎప్పటికప్పుడు పెద్దికి అందించే వైద్య చికిత్సపై పార్టీ నాయకత్వానికి ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం యశోద ఆస్పత్రికి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ వచ్చారు.
'దేవుడున్నాడు, డాక్టర్లున్నారు'
పెద్ది సుదర్శన్ రెడ్డికి చికిత్స అందుతున్న ఐసీయూ వార్డుకు చేరుకొని వైద్యులతో కలిసి అక్కడ పెద్దికి అందుతున్న చికిత్స విధానాన్ని పరిశీలించారు. దాదాపు అరగంట సేపు అక్కడే నిలుచుని డాక్టర్లతో చికిత్స అందుతున్న తీరును గురించి ఆరా తీశారు. పెద్ది సుదర్శన్ రెడ్డిని చూసిన అనంతరం వైద్యులతో మాజీ సీఎం కేసీఆర్ మాట్లాడారు. ఏం చేస్తరో చేయండి.. మా పెద్దిని కాపాడండి అని విజ్ఞప్తి చేసినట్లు బీఆర్ఎస్ పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా వైద్యులకు చేతులెత్తి కేసీఆర్ నమస్కరించారు. 'దేవుడున్నాడు, డాక్టర్లున్నారు. అన్నీ సవ్యంగానే జరుగుతాయి. గుండె చెదురొద్దు ధైర్యంగా ఉండండి' ఈ సందర్భంగా పెద్ది సుదర్శన్ రెడ్డి భార్యాపిల్లలు, కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పారు.
♦️ ఎంజేస్తరో చేయండి.. మా పెద్దిని కాపాడండి
- వైద్యులకు చేతులెత్తి నమస్కరించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు♦️ దేవుడున్నాడు, డాక్టర్లున్నారు.. అన్నీ సవ్యంగానే జరుగుతాయి. గుండె చెదరొద్దు ధైర్యంగా ఉండండి
- పెద్ది భార్యా పిల్లలు, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పిన కేసీఆర్ గారు.… pic.twitter.com/T5iJ9ooiAF
— BRS Party (@BRSparty) July 27, 2026
మరో 48 గంటలు సమయం
పెద్ది సుదర్శన్ రెడ్డికి అందుతున్న అత్యున్నత చికిత్సపై గులాబీ అధినేత కేసీఆర్ ఆరా తీశారు. ప్రపంచ స్థాయి అత్యుత్తమ చికిత్స అందుతున్నదని వైద్యులు తెలిపారు. పూర్తిస్థాయి సమాచారం ఇవ్వడానికి మరో 48 గంటలు పడుతుందని డాక్టర్లు చెప్పారు. అవసరమైన మేరకు విదేశాల నుంచి కూడా డాక్టర్లతో కన్సల్టెన్సీ తీసుకుంటున్నట్లు డాక్టర్లు వివరించారు. గుండె, ఊపిరితిత్తులు మిగతా అవయవాలు అన్నీ పనిచేస్తున్నాయని కాకపోతే.. కొంత బ్రెయిన్ ఇంకా పునరుత్తేజం చెందాల్సి ఉందని.. దీనికి మరో 48 గంటలు సమయం పట్టే అవకాశం ఉందని వైద్యులు మాజీ సీఎం కేసీఆర్కు వివరించారు. ఇటువంటి పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో.. స్పష్టమైన నిర్దిష్ట సమాచారం ఇవ్వడానికి మరికొంత సమయం పడుతుందని తెలిపారు. ఖర్చుకు వెనకాడకుండా పెద్ది సుదర్శన్ రెడ్డిని కాపాడుకోవడానికి బీఆర్ఎస్ పార్టీ శాయశక్తులా కృషి చేస్తుందని మాజీ సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
యశోద ఆసుపత్రిలో పెద్ది సుదర్శన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులను పరామర్శించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు.
పెద్ది సుదర్శన్ రెడ్డి గారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకుని, మెరుగైన చికిత్స అందించాలని సూచించారు. pic.twitter.com/hBPRH7iZIO
— KTR News (@KTR_News) July 27, 2026
అత్యున్నత స్థాయి సాంకేతిక పరిజ్ఞానం కలిగిన వ్యవస్థలతో, సీనియర్ డాక్టర్లతో చికిత్సను అందిస్తున్నామని డాక్టర్లు తెలిపారు. ఎప్పటికప్పుడు ఎంఆర్ఐ తదితర అవసరమైన పరీక్షలు చేస్తూ డాక్టర్ల బృందం సమావేశమవుతూ నిర్ణయాలు తీసుకుంటూ ఆరోగ్య పరిస్థితిని మెరుగుపరిచేలా అత్యున్నత చికిత్స అందిస్తున్నట్లు డాక్టర్లు వెల్లడించారు. తమ శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నామని యశోద ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ పవన్ గోరుకంటి, ఎండీ ఏఎస్ రావు జేఎస్ రావు వివరించారు.
అనంతరం పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబసభ్యుల వద్దకు చేరుకున్న కేసీఆర్ వారికి భరోసా.. ధైర్యాన్ని అందించారు. వైద్యుల కృషితో, దేవుడి దయతో, ప్రజల ఆశీర్వాదంతో పెద్ది సుదర్శన్ రెడ్డి కోలుకుంటాడని కేసీఆర్ విశ్వాసాన్ని ప్రకటించారు. ఆందోళన చెందవద్దని భార్యాపిల్లలకు కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చి గుండె ధైర్యం నింపారు. అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందిస్తామని కుటుంబ సభ్యులకు ఓదార్పునిచ్చారు.
గులాబీ నేతలు ఆస్పత్రిలో మకాం
పెద్ది సుదర్శన్ రెడ్డి కోసం బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం మొత్తం ఆస్పత్రిలో ఉండడం విశేషం. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, రాజయ్య, వేముల ప్రశాంత్ రెడ్డి, సత్యవతి రాథోడ్, పద్మారావు గౌడ్, మాజీ ఎంపీలు వినోద్ కుమార్, జోగినపల్లి సంతోష్ కుమార్, ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, డాక్టర్ సంజయ్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, పార్టీ నాయకులు గ్యాదరి బాలమల్లు, సతీశ్ రెడ్డి, రజినీ సాయిచంద్, పల్లె రవికుమార్, రాజాం యాదవ్, వాసుదేవరెడ్డి, గజ్జెల నగేష్, చిరుమల్ల రాకేశ్, ఎర్రోళ్ల శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
BRS Party: పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యంపై ప్రముఖులు ఆరా
Hyderabad, Telangana:Former Ministers And BRS Party MLAs Inquiry Into Wellbeing Of Peddi Sudarshan Reddy Watch Visualsచంద్రబాబు సభలో పాల్గొన్న బాలిక బలవన్మరణం
Secunderabad, Telangana:SSC Students Ends Life Herself CM Chandrababu Express Condolence Watch VideoAV Ranganath: తెలంగాణ హైకోర్టు సంచలనం.. హైడ్రా కమిషనర్గా ఏవీ రంగనాథ్ తొలగింపు
Hyderabad, Telangana:HYDRAA Commissioner AV Ranganath: తెలంగాణలో సంచలన పరిణామం చోటుచేసుకుంది. ప్రజల ఆస్తులపై విధ్వసం సృష్టిస్తున్న హైడ్రాపై తెలంగాణ హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. ప్రజల ఆస్తుల పరిరక్షించాల్సిన హైడ్రా విధ్వంసం సృష్టిస్తుండడంతో రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం పలుమార్లు హెచ్చరించినా హైడ్రా తీరు మారలేదు. పలుమార్లు కోర్టు ధిక్కరణ.. ఉల్లంఘనలకు పాల్పడడంతో ఎట్టకేలకు హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. హైడ్రా కమిషనర్గా ఏవీ రంగనాథ్ను తొలగించాలని ఆదేశించింది.
శాంతా కన్స్ట్రక్షన్ భూముల అంశంలో దాఖలైన ధిక్కరణ పిటిషన్కు సంబంధించి రంగనాథ్ క్షమాపణ కోరుతూ అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు ఆగ్రహించిన సంగతి తెలిసిందే. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలంగాణా హైకోర్టుకు క్షమాపణ చెప్పారు. క్షమాపణ కోరుతూ హైకోర్టులో రంగనాథ్ అఫిడవిట్ దాఖలు చేశారు. రంగనాథ్పై మొత్తం 63 కోర్టు ధిక్కరణ పిటిషన్లు ఉన్నాయని, ఇన్ని ధిక్కరణ పిటిషన్లు ఎందుకు ఉన్నాయని హైకోర్టు ప్రశ్నించింది.
లోతుకుంట భూముల వ్యవహారంలో తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. హైకోర్టుకు క్షమాపణలు చెబుతూ హైడ్రా కమిషనర్ రంగనాథ్ కోర్టులు, న్యాయ వ్యవస్థపై ఎంతో నమ్మకం ఉందని అఫిడవిట్లో పేర్కొన్నారు. లోతుకుంట సర్వే నెంబర్ 1,2లోని 40 ఎకరాల్లోకి హైడ్రా వెళ్లలేదని రంగనాథ్ వివరణ ఇచ్చారు. పిటిషనర్ అవాస్తవాలు చెప్పారని కోర్టుకు రంగనాథ్ విన్నవించారు. 63 కోర్టు ధిక్కరణ పిటిషన్లు ఎందుకు ఉన్నాయని ఈ సందర్భంగా రంగనాథ్ను ధర్మాసనం ప్రశ్నించింది.
వరుస కోర్టు ధిక్కరణ పిటిషన్లు ఉండడంతో రంగనాథ్పై తెలంగాణ హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. ఎంత చెప్పినా తీరు మార్చుకోకపోవడంతో హైడ్రా నుంచి రంగనాథ్ను తొలగించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి హైకోర్ట్ ఆదేశించింది. రంగనాథ్ను హైడ్రా కమిషనర్ స్థానం నుంచి తప్పించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సెక్రటరీ ర్యాంకు స్థానంలో ఉన్న ఉన్నతాధికారి ఇలా కోర్టు ఉత్తర్వులను ధిక్కరించడం సరికాదని హైకోర్టు హితవు పలికింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. రంగనాథ్ స్థానంలో హైడ్రా కమిషనర్గా అర్హత కలిగిన అధికారిని నియమించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి హైకోర్టు సూచించిందిజ
Akividu Ramalayam News: పంతం నెగ్గించుకున్న రఘురామ కృష్ణరాజు..ఆకివీడు రామాలయ నిర్మాణానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్!
Akividu, Andhra Pradesh:Akividu Ramalayam Supreme Court: ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు సుప్రీంకోర్టులో తన పంతం నెగ్గించుకున్నారు. ఉండి నియోజకవర్గ పరిధిలోని ఆకివీడు రామాలయ నిర్మాణంపై తలెత్తిన వివాదంలో స్థానిక కోర్టు నుంచి హైకోర్టు, తాజాగా దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వరకు పోరాడి ఊరట పొందారు. ఆకివీడు రామాలయ పునర్నిర్మాణానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆయన హర్షం వ్యక్తం చేశారు.
సుప్రీంకోర్టులో ఏం జరిగింది?
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు తాజాగా తాను విడుదల చేసిన వీడియోలో ఆయన మాట్లాడుతూ.. ఆకివీడు రామాలయం వివాదంపై ఇరువర్గాల మధ్య బలమైన వాదోపవాదాలు జరిగిన అనంతరం, జడ శ్రావణ్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టేసిందని తెలిపారు.
హైకోర్టులో వాస్తవాలను దాచిపెట్టి ప్రతివాదులు సుప్రీంకోర్టులో 'స్టేటస్ కో' (యథాతథ స్థితి) ఉత్తర్వులు తెచ్చుకున్నారని ఆయన పేర్కొన్నారు. హైకోర్టు మూడు బెంచ్లు తోసిపుచ్చిన వాదనలను సుప్రీంలో ప్రస్తావించకపోవడం వల్లే గతంలో స్టే వచ్చిందని, ఇప్పుడు ఆ విషయం స్పష్టమవడంతో కోర్టు తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని వెల్లడించారు.
ఆకివీడులో రామాలయం నిర్మాణానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్!
రామాలయం తరఫున సమర్థవంతంగా వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది సుయోధన్ గారికి, రాష్ట్ర ప్రభుత్వం తరఫున సమర్థవంతంగా వాదించిన ప్రేరణ సింగ్ గారికి నా హృదయపూర్వక అభినందనలు.
ఈ పోరాటంలో శ్రీరాముని విజయాన్ని ఆకాంక్షిస్తూ నాకు… pic.twitter.com/RhEeloHRop
— K Raghu Rama Krishna Raju (RRR) (@KRaghuRaju) July 27, 2026
ఆకివీడులో సుమారు 90 ఏళ్లుగా ప్రభుత్వ స్థలంలో ఉన్న ఆలయాన్ని, తిరిగి అదే స్థలంలో నిర్మించుకోవడంలో తప్పేముందని ప్రశ్నిస్తూ సుప్రీంకోర్టు ఈ పిటిషన్ను కొట్టేసినట్లు ఆయన స్పష్టం చేశారు.
"నవంబర్ నాటికి ఆలయ నిర్మాణం పూర్తి"
కేవలం నాలుగు సెంట్ల స్థలమైనప్పటికీ, ఆకివీడులో రామాలయాన్ని అత్యంత సర్వాంగ సుందరంగా నిర్మిస్తామని రఘురామ ప్రకటించారు. వచ్చే నవంబర్ నెలాఖరు నాటికి ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మత సామరస్యంపై కీలక వ్యాఖ్యలు చేశారు. "ఇప్పటికైనా గొడవలకు స్వస్తి పలికి రామాలయం నిర్మాణానికి అందరూ సహకరించాలి. మన మతాన్ని ప్రేమించుకుందాం, అన్యమతాలను గౌరవిద్దాం. నిబంధనల ప్రకారం ఎవరి మతానికి సంబంధించిన ఆలయాన్ని వారు నిర్మించుకుంటుంటే ఎటువంటి ఇబ్బందులు సృష్టించకూడదు. అనుమతులు లేకుండా కడితే చట్టపరంగా చర్యలు తీసుకోవడంలో తప్పులేదు" అని ఆయన పిలుపునిచ్చారు.
Also Read: ఏపీ విద్యార్థులకు పండుగే పండుగ.. స్కూళ్లకు ఏకంగా 10 రోజులు సెలవులు!
Also Read: 21 ఏళ్లకే ఎమ్మెల్యే, ఎంపీలుగా యువత.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రపోజల్ సాధ్యమేనా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
AP School Holidays: ఏపీ విద్యార్థులకు పండుగే పండుగ.. స్కూళ్లకు ఏకంగా 10 రోజులు సెలవులు!
Vijayawada, Andhra Pradesh:AP School Holidays News: ఆంధ్రప్రదేశ్లోని పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు అదిరిపోయే గుడ్న్యూస్. రాబోయే ఆగస్టు నెలలో వరుస సెలవులు రానున్నాయి. ఆదివారాలు, రెండో శనివారంతో పాటు పలు జాతీయ, మతపరమైన పండుగలు కలిసి రావడంతో విద్యార్థులకు ఏకంగా 10 రోజుల పాటు సెలవులు దక్కనున్నాయి.
ఆగస్టు నెలలో మొత్తం 31 రోజులు ఉండగా.. అందులో 10 రోజులు హాలిడేస్ పోను, కేవలం 21 రోజులు మాత్రమే స్కూల్స్, కాలేజీలు పనిచేయనున్నాయి.
ఆగస్టు నెలలో సెలవుల పూర్తి జాబితా..
ఆగస్టు 2: ఆదివారం (సాధారణ సెలవు)
ఆగస్టు 8: రెండో శనివారం సెలవు
ఆగస్టు 9: ఆదివారం (సాధారణ సెలవు)
ఆగస్టు 15: శనివారం - స్వాతంత్ర్య దినోత్సవం (జెండా వందనం అనంతరం పాఠశాలలు ముగుస్తాయి)
ఆగస్టు 16: ఆదివారం (సాధారణ సెలవు)
ఆగస్టు 21: శుక్రవారం - వరలక్ష్మీ వ్రతం
ఆగస్టు 23: ఆదివారం (సాధారణ సెలవు)
ఆగస్టు 25: మంగళవారం - మిలాద్-ఉన్-నబీ
ఆగస్టు 30: ఆదివారం (సాధారణ సెలవు)
ఉద్యోగులకు ఆప్షనల్ హాలిడేస్:
ఇక ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగుల కోసం కొన్ని ఆప్షనల్ (ఐచ్ఛిక) సెలవులు కూడా అందుబాటులో ఉన్నాయి.
ఆగస్టు 4: ఐచ్ఛిక సెలవు (ఆప్షనల్ హాలీడే)
ఆగస్టు 15: పార్సీ నూతన సంవత్సరం
ఆగస్టు 28: శ్రావణ పౌర్ణమి
సంబంధిత శాఖలు, విద్యా సంస్థలు తమ అవసరాలకు అనుగుణంగా వీటిని ఆప్షనల్ హాలిడేస్గా వినియోగించుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం లేదా విద్యాశాఖ జారీ చేసే అధికారిక ఉత్తర్వుల ప్రకారం స్థానిక పండుగలు, వాతావరణ పరిస్థితులు లేదా పరిపాలనా కారణాలరీత్యా ఈ సెలవుల్లో చిన్నపాటి మార్పులు ఉండే అవకాశం ఉంది.
సింహాచలం గిరిప్రదక్షిణకు ప్రత్యేక సెలవులు..
ఇదిలా ఉంటే, విశాఖపట్నంలోని ప్రసిద్ధ సింహాచలం ఆలయంలో జరిగే వార్షిక గిరిప్రదక్షిణ సందర్భంగా ప్రత్యేక సెలవులను ప్రకటించారు. గిరిప్రదక్షిణ మార్గంలో ఉన్న 221 పాఠశాలలు, కళాశాలలకు సంబంధిత తేదీలలో (జూలై 28, 29) సెలవు ప్రకటించినట్లు అధికారులు తెలిపారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ సెలవుల జాబితాను దృష్టిలో ఉంచుకుని తమ పనులను ముందుగానే ప్లాన్ చేసుకోవాలని సూచించారు.
Also Read: బంగాళాఖాతంలో అలజడి..వాయుగుండంగా మారిన అల్పపీడనం! ఆ జిల్లాల్లో అలర్ట్!
Also Read: 21 ఏళ్లకే ఎమ్మెల్యే, ఎంపీలుగా యువత.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రపోజల్ సాధ్యమేనా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Dhanush Political Entry: రాజకీయాల్లోకి మరో స్టార్ హీరో ఎంట్రీ! మరో కథానాయకుడు పొలిటికల్ పార్టీకి రంగం సిద్ధం?
Nagalapuram, Tamil Nadu:Dhanush Political Entry Video: కోలీవుడ్ స్టార్ హీరో, జాతీయ అవార్డు గ్రహీత ధనుష్ తాజాగా చేసిన వ్యాఖ్యలు తమిళ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. కేవలం సినిమాలకే పరిమితం కాకుండా సామాజిక సేవలో చురుగ్గా పాల్గొనాలని ఆయన తన అభిమాన సంఘాలకు ఇచ్చిన పిలుపు.. ఆయన రాజకీయ ప్రవేశంపై ఊహాగానాలకు బలాన్ని చేకూరుస్తోంది. అందుకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
అభిమానులకు ధనుష్ సూచనలు ఇవే..
అభిమానుల ఐక్యతకు గొప్ప శక్తి ఉంటుందని, దానిని కేవలం సినిమా వేడుకలకే పరిమితం చేయకూడదని ధనుష్ స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఆయన కొన్ని కీలక సూచనలు చేశారు. తనను కలవడం కోసం లేదా ఆడియో ఫంక్షన్లలో హడావిడి చేయడం కోసం మాత్రమే అభిమానుల బలాన్ని ఉపయోగించొద్దని, ప్రజలకు ఉపయోగపడే సేవా కార్యక్రమాలను ముమ్మరం చేయాలని సూచించారు.
పేద కుటుంబాలకు చేతనైనంత సహాయం అందించాలని, సమాజ హితం కోసం తమతో పాటు మరింత మందిని ప్రోత్సహించేలా అడుగులు వేయాలని కోరారు.
Looks like we can expect Dhanush launching his new party sooner than expected.
Vijay had been doing many welfare activities for years through his Vijay Makkal Iyakkam before officially launching TVK in 2024. One of the big events that confirmed his entry sooner was the 2023… https://t.co/XDZOvVg3pa pic.twitter.com/rQkcdRFCn6— Raghu Rajaram (@RaghuTweetbook) July 26, 2026
విజయ్ బాటలోనే పయనిస్తున్నారా?
ధనుష్ చేసిన ఈ తాజా వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్గా మారడంతో పాటు, త్వరలోనే ఆయన కొత్త రాజకీయ పార్టీని ప్రకటించే అవకాశం ఉందనే ప్రచారం ఊపందుకుంది. ముఖ్యమంత్రి విజయ్ కూడా తన పార్టీ 'టీవీకే' (TVK) స్థాపించడానికి ముందు సరిగ్గా ఇలాంటి సామాజిక కార్యక్రమాల ద్వారానే ప్రజల్లోకి వెళ్లారు. ఇప్పుడు ధనుష్ కూడా అదే మార్గాన్ని ఎంచుకున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
తమిళనాడు రాజకీయాలకు, సినిమా రంగానికి విడదీయరాని బంధం ఉంది. ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత నుంచి నేటి విజయ్ వరకు ఎందరో సినీ ప్రముఖులు రాజకీయాల్లో తిరుగులేని ముద్ర వేశారు. ఇదే స్ఫూర్తితో ధనుష్ కూడా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
'రాయన్' అవార్డు వివాదంపై నిజాయితీగా స్పందన
తన స్వీయ దర్శకత్వంలో వచ్చిన 'రాయన్' చిత్రానికి జాతీయ చలనచిత్ర అవార్డు రావడంపై వస్తున్న విమర్శలపైనా ధనుష్ ఎంతో హుందాగా స్పందించారు. "ఈ అవార్డు పొందడానికి రాయన్ కంటే మెరుగైన సినిమాలు ఎన్నో ఉన్నాయంటూ వస్తున్న విమర్శలను నేను స్వాగతిస్తున్నాను. అందులో వాస్తవం ఉందని నేను అంగీకరిస్తున్నాను. 2024లో నిజంగానే రాయన్ కన్నా అద్భుతమైన సినిమాలు విడుదలయ్యాయి" అని పేర్కొంటూ తనపై వచ్చిన ట్రోల్స్కు చెక్ పెట్టారు.
Also Read: బొద్దింకల పార్టీకి బాలీవుడ్ నటి పెద్ద సవాలు.."దమ్ముంటే ఆ మంత్రిని రాజీనామా చేయించండి
Also Read: డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఇంట తీవ్ర విషాదం..కూతురు పవిత్ర ఎమోషనల్ పోస్ట్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Mirabai Chanu Gold: మీరాబాయి చానుకు బంగారు పతకం..కామన్ వెల్త్ గేమ్స్లో భారత జెండా రెపరెపలు
Scotland:Mirabai Chanu Gold Medal: టోక్యో ఒలింపిక్స్ రజత పతక విజేత, స్టార్ వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను.. బంగారు పతకాన్ని సాధించింది. ఆదివారం గ్లాస్గోలో జరిగిన మహిళల 48 కేజీల విభాగంలో టైటిల్ గెలుచుకుని.. 2026 కామన్వెల్త్ గేమ్స్లో భారతదేశానికి తొలి స్వర్ణ పతకాన్ని అందించింది.
31 ఏళ్ల ఈ క్రీడాకారిణి స్నాచ్లో కామన్వెల్త్ గేమ్స్ రికార్డు స్థాయిలో 85 కేజీలు ఎత్తి, ఆ తర్వాత క్లీన్ అండ్ జర్క్లో గేమ్స్ రికార్డు స్థాయిలో 105 కేజీలు నమోదు చేశారు. మొత్తం 190 కేజీల బరువు ఎత్తి ఆమె స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నారు.
ఈ విజయంతో మీరాబాయికి వరుసగా మూడో కామన్వెల్త్ గేమ్స్ స్వర్ణ పతకం లభించింది. ఆమె గతంలో 2018 గోల్డ్ కోస్ట్ గేమ్స్, 2022 బర్మింగ్హామ్ గేమ్స్లో కూడా ఈ టైటిల్ను గెలుచుకున్నారు.
టోక్యో ఒలింపిక్స్ రజత పతక విజేత అయిన ఈమె, అంతకుముందు గ్లాస్గోలోనే జరిగిన 2014 కామన్వెల్త్ గేమ్స్లో కూడా రజత పతకం సాధించారు. పోటీ ప్రారంభం నుండి ముగింపు వరకు మీరాబాయి పూర్తి నియంత్రణలో ఉన్నారు.
మొత్తం 168 కేజీల బరువు ఎత్తి రజత పతకం గెలుచుకున్న నైజీరియాకు చెందిన రూత్ అసుక్వో న్యోంగ్ కంటే ఆమె 22 కేజీల ఆధిక్యంతో ముగించారు. 82 కిలోల బరువుతో తన తొలి స్నాచ్ ప్రయత్నంలో విఫలమవడంతో ఆమె పతనం ప్రారంభమైంది. అయితే, ఆమె తన తదుపరి ప్రయత్నాలలో కోలుకుని, రికార్డు స్థాయిలో 85 కిలోల బరువును ఎత్తింది.
రికార్డు సృష్టించిన స్నాచ్ ఫలితంగా క్లీన్ అండ్ జర్క్లో ఎనిమిది కిలోల ఆధిక్యం సాధించిన ఈ మణిపురి లిఫ్టర్, తన మొదటి ప్రయత్నంలో బార్ను జారవిడిచింది. కానీ, ఒక ఛాంపియన్లా పుంజుకుని, తన రెండవ ప్రయత్నంలో 105 కిలోల బరువును ఎత్తి, పోటీ ముగియక ముందే స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది.
ఈ లిఫ్ట్ స్వర్ణాన్ని అందించడమే కాకుండా, క్లీన్ అండ్ జర్క్ విభాగంలో కామన్వెల్త్ గేమ్స్ రికార్డును బద్దలు కొట్టి, మొత్తం లిఫ్ట్ మార్కును కూడా అధిగమించింది.
బంగారు పతకం ఖాయం ఇప్పటికే కావడంతో, రెండు నెలల కన్నా తక్కువ సమయంలో ప్రారంభం కానున్న ఆసియా క్రీడలను దృష్టిలో ఉంచుకుని మీరాబాయి తన మూడవ క్లీన్ అండ్ జర్క్ లిఫ్ట్ను ప్రయత్నించలేదు.
Also Read: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2027 ఫైనల్ షెడ్యూల్ ఖరారు..ఈ సారి ఫైనల్ ఎక్కడ జరుగుతుంది
Also Read: ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్కు జైలు శిక్ష?! ఆ కేసులో అడ్డంగా బుక్కయ్యాడు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
