దళిత సంఘాల ఐక్య వేదిక అధ్యక్షునిగా చిలుక రాజనర్సు
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
APSRTC Free Bus Travel Scheme: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రభుత్వం ఉగాది కానుక అందిస్తోంది. ఇప్పటికే అమలులో ఉన్న ఉచిత ఆర్టీసీ బస్సు పథకాన్ని మరికొంత మందికి విస్తరిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మహిళలకు అందిస్తున్న ఉచిత బస్సు పథకాన్ని పురుషులకు కూడా అందిస్తూ ప్రభుత్వం ప్రకటన చేసింది. రేపు ఆ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది. దివ్యాంగులకు అందిస్తున్న కొత్త పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించనుంది.
Also Read: Harish Rao: తెలంగాణను చంద్రబాబుకు రేవంత్ రెడ్డి తాకట్టు.. నదీ జలాలపై హరీశ్ రావు తీవ్ర వ్యాఖ్యలు
దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే దివ్యాంగ శక్తి పథకాన్ని రేపు మంగళగిరిలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్నారు. రాష్ట్రంలోని 11.16 లక్షల దివ్యాంగులకు కూటమి ప్రభుత్వ ఉగాది కానుక అందిస్తోందని.. దివ్యాంగ్ శక్తి పథకం ద్వారా 12.76 లక్షల మంది దివ్యాంగులు, సహాయకులకు లబ్ది జరుగుతుందని ఏపీఎస్ ఆర్టీసీ ప్రకటించింది. దివ్యాంగులకు సహయకులుగా వచ్చే వారికి 50 శాతం టికెట్ రాయితీ కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది.
Also Read: KCR Wishes: నందిని సిద్దారెడ్డికి అభినందనల వెల్లువ.. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు శుభాకాంక్షలు
ఉచిత బస్సు పథకంలో 40 శాతం వైకల్యం దాటిన దివ్యాంగులకు వర్తిస్తుందని ఏపీఎస్ఆర్టీసీ తెలిపింది. 4 నుంచి 21 వర్గాల దివ్యాంగులకు ‘దివ్యాంగ శక్తి’ పథకం విస్తరణ చేయనున్నట్లు ఆర్టీసీ సంస్థ వెల్లడించింది. దివ్యాంగులకు అందిస్తున్న ఈ పథకం అమలు కోసం ఏపీ ప్రభుత్వం ఏడాదికి రూ.207 కోట్లను ఆర్టీసీకి చెల్లించనుంది. రూ.207 కోట్ల భారాన్ని దివ్యాంగుల సంక్షేమం కోసం ఏపీ ప్రభుత్వం భరించనుంది. మంగళగిరి నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్, బీజేపీ ఏపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్లతో కలిసి రేపు దివ్యాంగ శక్తి పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభిస్తారని ఏపీఎస్ఆర్టీసీ తెలిపింది. పథకాన్ని ప్రారంభించిన దివ్యాంగులతో కలిసి చంద్రబాబు, పవన్ కల్యాణ్ ప్రయాణం చేయనున్నారు. అనంతరం దివ్యాంగులతో ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం ఆత్మీయ విందు జరగనుంది.
Also Read: Govt Employees: ప్రభుత్వ ఉద్యోగులు కీలక నిర్ణయం.. పీఆర్సీ, ఐఆర్, డీఏ పెంపు కోసం ఉగాదికి డెడ్లైన్
దివ్యాంగ శక్తి రేపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో దివ్యాంగ్ శక్తి కార్యక్రమాన్ని ఎమ్మెల్యేలు ప్రారంభించనున్నారు. ఆర్టీసీ బస్సులో దివ్యాంగులతో కలిసి ప్రయాణించనున్నారు. అనంతరం దివ్యాంగులతో కలిసి భోజనం చేస్తారు. స్త్రీ శక్తి బస్సుల్లో దివ్యాంగులు ఉచితంగా ప్రయాణించే వెసులుబాటు కల్పించడంతో దివ్యాంగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మహిళలకు అందిస్తున్న స్త్రీ శక్తి పథకం ద్వారా 52 కోట్లకు పైగా మహిళలు ఉచిత ప్రయాణాలు చేశారు. ఉచిత బస్సు పథకం కోసం ఇప్పటివరకు రూ.1,826 కోట్లకు పైగా ఏపీ ప్రభుత్వం ఖర్చు చేసింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Kid Holding Snakes Viral Video Watch: ప్రస్తుతం సోషల్ మీడియాలో పిల్లలు ఎలాంటి పనులు చేసిన దృశ్యాలైన రీల్స్ రూపంలో పోస్ట్ చేస్తే వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా సోషల్ మీడియాలో ఓ బాలుడికి సంబంధించిన వీడియో విపరీతంగా వైరల్ అవుతూ వస్తుంది. ఈ వీడియోలో ఆ బాలుడు ప్రమాదకరమైన రెండు పాములను ఎడమ కుడి చేతుల్లో పట్టుకోవడం చూసి అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు. దీనికి సంబంధించిన దృశ్యాలు అన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వస్తున్నాయి. ముఖ్యంగా ఈ వీడియోలను చూసి వన్యప్రాణి సంరక్షకులు కూడా ఆశ్చర్యానికి గురవుతున్నారు. అయితే, దీనికి సంబంధించిన అన్ని రకాల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో ఓ బాలుడు అత్యంత ప్రమాదకరమైన రెండు పాములను రెండు చేతుల్లో పట్టుకుని అందరినీ ఆశ్చర్యపోయేలా చేసాడు. సాధారణంగా పెద్దలే పాములను చూసి భయపడిపోతూ ఉంటారు. అలాంటిది ఈ వీడియోలో బాలుడు అత్యంత ప్రమాదకరమైన రెండు పాములను పట్టుకుని వాటితో ఆటలాడడం చూసి ఇప్పుడంతా ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఈ వీడియోకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. ఇందులో బాలుడు అతని పక్కనే మరో ఇద్దరు బాలుర్లు కనిపించడం మీరు చూడొచ్చు.
అయితే, ఆ బాలుడు తన రెండు చేతుల్లో ప్రమాదకరమైన నాగుపాములను పట్టుకున్నారు. అంతేకాకుండా ఆ పాములను పట్టుకొని అటూ ఇటూ ఊపడం మీరు చూడొచ్చు. పంట పొలాల్లో తిరుగుతున్న పాములను పట్టుకుని ఉండొచ్చని వన్యప్రాణి సంరక్షకులు చెబుతున్నారు. ఆ బాలుడు పాములను పట్టుకుని అటు ఇటు ఊపుతుంటే.. అతని పక్కనే ఉన్న మరో బాలుడు దానిని చూసి భయపడిపోతూ దూరం జరగడం కూడా మీరు చూడొచ్చు. ఇలా ఆ బాలుడు పాములను పట్టుకున్న సందర్భంలో అక్కడే ఉన్న ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడు ఇది కాస్త వైరల్ గా మారింది..
ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోను ఓ ఇంస్టాగ్రామ్ ఖాతా నుంచి పోస్ట్ చేశారు. ఈ వీడియోను 8 లక్షల మందికి పైగా సోషల్ మీడియా వినియోగదారులు వీక్షించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా దీనిని చూసి చాలామంది లైక్ కూడా చేశారు. అయితే, ఈ వీడియో చూసిన కొంతమంది మాత్రం.. ఇవి ప్రమాదకరమైన పాములు కావని జెర్రీబోతు జాతికి సంబంధించిన పాములని కామెంట్లు చేస్తున్నారు. అంతేకాకుండా మరికొంతమంది అయితే బాలుడు సూపర్ అంటూ కామెంట్లు చేస్తూ వస్తున్నారు. ఏది ఏమైనా ఇలాంటి ప్రమాదకరమైన పాములను పట్టుకోవడం చాలా డేంజర్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Venomous Cobra Video Watch: ప్రస్తుతం సోషల్ మీడియాలో లైక్స్తో పాటు వ్యూస్ పెంచుకోవడానికి యువత ఎంత సాహసానికైనా వెనకాడడం లేదు.. రియల్ స్పీచ్తో ప్రమాదకరమైన విన్యాసాలు చేస్తూ చివరికి ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన ఎన్నో వీడియోలు మనం సోషల్ మీడియాలో తరచుగా చూస్తూనే ఉన్నాం.. ముఖ్యంగా కొంతమందైతే ప్రమాదకరమైన పాములను పట్టుకుని.. వ్యూస్ కోసం విన్యాసాలు చేస్తూ ఉన్నారు. అయితే, ఇప్పుడు పిల్లలు instagramలో ఫేమస్ అవ్వడానికి ప్రమాదకరమైన పాములతో చెలగాటమాడుతూ వీడియోలు రీల్స్ పోస్ట్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి..
ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోను చూస్తే అందరూ ఆశ్చర్య పోవాల్సిందే. ఎందుకంటే ఈ వీడియోలో ఓ చిన్న బాలుడు అత్యంత ప్రమాదకరమైన నాగుపామును పట్టుకొని.. అది నివసించే ఓ పుట్టలో చేతులు పెడుతున్నాడు.. ఇప్పుడు ఈ దృశ్యాలు అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసేలా చేస్తున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. ఈ వీడియోలో ఆ బాలుడు ఏకంగా ఓ పుట్టలో నుంచి ప్రమాదకరమైన నాగుపామును బయటకు తీసి దానిని ఎడమ చేతితో పట్టుకొని ఉండడం మీరు చూడొచ్చు..
అంతేకాకుండా ఆ బాలుడు దాని పుట్టలో పెట్టిన గుడ్లను కూడా బయటికి ఒక్కటొక్కటిగా తీసి అక్కడే పక్కన పెట్టడం మీరు గమనించవచ్చు. ఈ వీడియోలో ఆ బాలుడు తీసిన గుడ్లతో పాటు అత్యంత ప్రమాదకరమైన పాము కూడా చేతిలో కనిపిస్తుంది. అయితే, అంత చిన్న వయసులో ఏ మాత్రం భయపడకుండా పుట్టలో నుంచి పామును తీసిన వీడియోను చూసి సోషల్ మీడియా వినియోగదారులు ఒక్కసారిగా కంగు తిన్నారు. చిన్న బుడతడైన ఆ బాబు అత్యంత ప్రమాదకరమైన పాములు పుట్టలోంచి తీయడం చూసి ఆశ్చర్యపోయారు..
సాధారణంగా అత్యంత ప్రమాదకరమైన నాగుపాములను చూసి పెద్దవారి ఎంతో భయపడిపోతూ ఉంటారు.. అలాంటిది ఆ బాలుడు అంత పెద్ద నాగుపాము పట్టుకొని ఆటలాడుతుంటే.. వన్యప్రాణి సంరక్షకులు సైతం ఆశ్చర్య పోవాల్సి వస్తుంది. అంతేకాకుండా ఆ బాలుడు పాము తలను పట్టుకున్న సందర్భంలో.. ఆ పాము దాని నోటిని గట్టిగా తెరిచేందుకు ప్రయత్నిస్తుంది. అయితే, ఈ సమయంలో ఏమాత్రం భయపడకుండా ఆ బాలుడు దాని తలను మరో చేతితో గట్టిగా పట్టుకోవడం మీరు వీడియోలో చూడొచ్చు. ఈ వీడియో చూసిన సోషల్ మీడియా వినియోగదారులు వారి అభిప్రాయాలను కామెంట్ల రూపంలో వ్యక్తం చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Carrier 2026 Model AC Price Cut: ఎప్పటినుంచో Carrier 2026 Model AC Price:మంచి ఏసీని కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే, ఇది మీకోసమే.. ఎందుకంటే ఫ్లిప్కార్ట్లో వేసవి సందర్భంగా కొన్ని ఏసీలు అత్యంత తక్కువ ధరకే అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా భీమియం ఫీచర్స్ కలిగిన ఏసీలు కూడా అతి తక్కువ ధరల్లో లభించడం విశేషం. ఎప్పటినుంచో చీప్ ధరలో ఏసీలు కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది అద్భుతమైన అవకాశం గా భావించవచ్చు.
ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్కార్ట్లో క్యారియర్ (Carrier) 2026 మోడల్ 1 Ton 3 Star Split AI Inverter ఏసీ అత్యంత చవక ధరలో అందుబాటులో ఉంది. ఇది ఇప్పుడే కొనుగోలు చేసే వారికి 40 శాతం పైగా ప్రత్యేకమైన ఫ్లాట్ డిస్కౌంట్తో లభిస్తుంది. అద్భుతమైన ఫీచర్స్ కూడా అందుబాటులో ఉండడం విశేషం.. ఇక ఈ ఏసీకి సంబంధించిన ఫీచర్స్ వివరాల్లోకి వెళితే.. దీనిని కంపెనీ ప్రత్యేకమైన ఏఐ ఇన్వర్టర్ టెక్నాలజీతో అందుబాటులోకి తీసుకువచ్చింది. దీన్నిబట్టి గదిలో ఉష్ణోగ్రతకు అనుకూలంగా ఆటోమేటిక్గా కూలింగ్తో పాటు ఇతర అంశాలను అడ్జస్ట్ చేస్తుంది. దీనివల్ల విద్యుత్ కూడా పూర్తిగా ఆదా అవుతుంది. అలాగే ఇది అవసరానికి తగ్గట్టుగా ఆరు రకాలుగా ఏసీ కెపాసిటీని మార్చుకోవచ్చు.
ఈ ఏసీలో అద్భుతమైన స్మార్ట్ ఎనర్జీ డిస్ప్లే కూడా అందుబాటులో ఉంది. ఏసి ఎంత విద్యుత్ వినియోగిస్తుందో.. ఈ డిస్ప్లే ను వినియోగించి రియల్ టైం తెలుసుకోవచ్చు. అంతేకాకుండా వేసవిలో గదిని వేగంగా చల్లపరిచేందుకు ఇన్స్టా కూలింగ్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. దీనివల్ల గదిలో ఎంత ఉష్ణోగ్రతలు ఉన్నప్పటికీ.. గదిని చల్లగా చేసేందుకు ఎంతగానో సహాయపడుతుంది.
అంతేకాకుండా ఇందులో ఆటో డీ ఫారెస్ట్ క్లీనింగ్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. ఇది ఇండోర్ యూనిట్లోని దుమ్ముతో పాటు మంచును ఆటోమేటిక్గా క్లీన్ చేసి.. స్వచ్ఛమైన గాలిన అందించేందుకు క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. దీంతోపాటు ఇందులో PM 2.5 ఫిల్టర్ అందుబాటులో ఉంది ఇది గాలిలోని సూక్ష్మ ధూళికణాలను తొలగించేందుకు సహాయపడుతుంది.
Also Read: Redmi 14C 5G Offer: రెడ్మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్ఫోన్..అదిరిపోయే ఆఫర్!
అంతేకాకుండా మెరుగైన కూలింగ్ కోసం.. 100 శాతం కాపర్ కండెన్సర్ కాయిల్తో లభిస్తోంది. ప్రస్తుతం ఈ ఏసీ ధరకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. దీనిని మార్కెట్లో కంపెనీ MRP ధర రూ.55,100తో అందుబాటులో ఉంచింది. అయితే, ఇప్పుడే దీనిని కొనుగోలు చేసే వారికి ఫ్లిప్కార్ట్ అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్స్ అందిస్తుంది. ముఖ్యంగా ఇప్పుడే ఫ్లిప్కార్ట్లో కొనుగోలు చేస్తే భారీ డిస్కౌంట్తో రూ.29,990 లోపే పొందవచ్చు..
అంతేకాకుండా ఈ ఏసీ పై ప్రత్యేకమైన బ్యాంకు డిస్కౌంట్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. అయితే, వీటిని వినియోగించు కొనుగోలు చేయాలనుకునే వారు తప్పకుండా.. యాక్సిస్ బ్యాంక్ కోటక్ మహీంద్రా బ్యాంకులకు సంబంధించిన క్రెడిట్ కార్డులను వినియోగించి పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేస్తే ఏకంగా రూ.3000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. అంతేకాకుండా ఎక్స్చేంజ్ బోనస్ కూడా అందుబాటులో ఉంది. దీనిని వినియోగిస్తే రూ.6 వేల తగ్గింపు లభిస్తుంది. దీంతో వీటన్నింటిని వినియోగించి పేమెంట్ చేసే వారికి రూ. 20 వేళలోపే దీనిని పొందవచ్చు..
Also Read: Redmi 14C 5G Offer: రెడ్మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్ఫోన్..అదిరిపోయే ఆఫర్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Dhanusu Rasi Parabhava Nama Samvatsaram Predictions 2026: రాబోయే 2026 పరాభవనామ సంవత్సరంలో ధనస్సు రాశి వారికి మిశ్రమ ఫలితాలు కలగబోతున్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ ఏడాది ధనస్సు రాశి వారికి ఆదాయం 14 ఉండగా..వ్యయం 11గా ఉంది. రాజ్యపూజం ఐదు తో పాటు అవమానం ఆరుగా ఉంది.. ఈ లెక్కల ప్రకారం ఆర్థికంగా బాగున్నప్పటికీ.. మానసిక ధైర్యంతో పాటు కష్టపడే తత్వం ఈ ఏడాది అత్యంత కీలకము కాబోతోంది. అంతేకాకుండా ధనస్సు రాశి వారికి ఈ సమయంలో మిశ్రమ ఫలితాలు కలిగినప్పటికీ.. కొన్ని రకాల అవకాశాలు మాత్రం తప్పకుండా లభించబోతున్నాయి..
వృత్తి, వ్యాపారాల పరంగా..
ధనస్సు రాశి వారికి ఈ ఏడాది విజయాలు అంత సులభంగా దక్కమని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన స్థాయి కంటే కొంచెం తక్కువ లాభాలు కలిగే అవకాశాలున్నాయి. ఉద్యోగాలు చేస్తున్న వారికి పని ఒత్తిడి విపరీతంగా పెరుగుతుంది. అంతేకాకుండా ఈ సమయంలో అదనపు బాధ్యతలు కూడా పెరిగే అవకాశాలున్నాయి. అయితే పట్టుదలతో పని చేయడం వల్ల ప్రమోషన్లు కూడా లభిస్తాయి. వ్యాపారస్తులు ఈ సమయంలో భారీ పెట్టుబడులకు దూరంగా ఉండటం చాలా మంచిది. దీంతోపాటు చిన్న చిన్న పెట్టుబడులతో వ్యాపారాలు విస్తరిస్తేనే అద్భుతమైన లాభాలు పొందుతారు. ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారాల్లో నమ్మకద్రోహం జరిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఈ సమయంలో తప్పకుండా అప్రమత్తంగా ఉండాలి..
కుటుంబం, ఆరోగ్యం..
అర్ధాష్టమి శని ప్రభావం వల్ల అప్పుడప్పుడు ధనస్సు రాశి వారికి అనారోగ్య సమస్యలు తలెత్తినప్పటికీ.. వీరు ఎంతో ఉత్సాహంతో పాటు చురుకుదనం చూపిస్తూ ముందుకు వెళ్తారు. అంతేకాకుండా కొన్ని సందర్భాల్లో ఉత్సాహం తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు కాస్ట్ జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. లేనిపక్షంలో చిన్నపాటి విభేదాలు వచ్చి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఈ సమయంలో నమ్మినవారే వెన్నుపోటు పొడిచే ప్రమాదం ఉన్నట్లు జ్యోతిష్యులు తెలుపుతున్నారు. వ్యక్తిగత విషయాలను అందరితో పంచుకోవడం శ్రేయస్కరమని వారు చెబుతున్నారు..
విద్యార్థులకు, ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులకు..
ఈ ఏడాది విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పూర్తిగా తగ్గే అవకాశాలున్నాయి. కానీ పట్టుదలతో చదివితే మంచిర్యాంకులు కూడా పొందే అవకాశాలు ఉన్నాయి. సీట్లు సాధించడమే కాకుండా పెద్దపెద్ద యూనివర్సిటీల్లో అనుకున్న స్థాయిలో ర్యాంకులు సాధించగలుగుతారు. ఇక క్రీడా రంగాల్లో రాణించగలిగి అద్భుతమైన విజయాలు సాధించగలుగుతారు. స్త్రీలకు ఈ ఏడాది పరిస్థితులు ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటాయి.. కాబట్టి మీరు కూడా పరిస్థితులను బట్టి ముందుకు సాగాల్సి ఉంటుంది. వివాహం కోసం వేచి చూస్తున్న వారికి కొంత ఆలస్యమైన మంచి సంబంధం కుదురుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.
పరిహారాలు..
ఈ ఏడాది మీ జీవితంలో వస్తున్న ప్రతికూలతను పోగొట్టడానికి తప్పకుండా గురు, శని, కేతు గ్రహాల జపాలు చేసుకోవడం చాలా మంచిది. అంతేకాకుండా శనగల తో పాటు నల్ల నువ్వులను, ఉలవలను దానం చేయడం వల్ల శుభ ఫలితాలు కూడా కలుగుతాయి. ముఖ్యంగా శ్రీకాళహస్తితో పాటు అరుణాచలం, అయ్యప్ప స్వామి దేవాలయాలను సందర్శించుకోవడం వల్ల అద్భుతమైన ఫలితాలు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పాటించడం వల్ల ఈ సమయంలో వస్తున్న అనేక రకాల సమస్యలు పరిష్కారం అవుతాయి. అంతేకాకుండా ఇతరులతో బాగా ఉండటం వల్ల కూడా మంచి ఫలితాలు పొందుతారు.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Sri Parabhava Nama Samvatsaram Vrischika Rashi Phalalu 2026 News: 2026 2027 శ్రీ పరాభవ నామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి అద్భుతమైన ఫలితాలు ఉండబోతున్నాయని జ్యోతిష్య శాస్త్రం నిపుణులు చెబుతున్నారు.. ఈ ఏడాది ఈ రాశి వారికి ఆదాయం 11 ఉండగా.. వ్యాయం 8 గా ఉంది.. రాజ్యపూజం రెండు, అవమానం ఆరుగా నమోదయింది. కాబట్టి ఈ రాశి వారికి పరాభవ నామ సంవత్సరం ఎంతో అద్భుతంగా ఉండబోతుంది. ముఖ్యంగా వీరికి ఈ సమయంలో అద్భుతమైన ప్రయోజనాలు కలిగే అవకాశాలున్నాయి. అనుకోకుండా ధన లాభాలు కూడా కలుగుతాయి. అయితే ఈ పరాభవ నామ సంవత్సరం వృశ్చిక రాశి వారికి ఎలాంటి ఫలితాలను అందించబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఆరోగ్యంపరంగా..
ఈ సంవత్సరంలోని వృశ్చిక రాశి వారికి గురుగ్రహం జూన్ వరకు సువర్ణమూర్తిగా ఉండటం వల్ల వీరికి దీర్ఘాయుష్షు సిద్ధిస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. తరచుగా అనారోగ్య భయాలు ఉన్నప్పటికీ ఇవి కేవలం మానసికమైననని.. వీరు నూరేళ్ల పాటు సుఖంగా ఉంటారని తెలిపారు. ప్రారంభంలో తలనొప్పితో పాటు అజీర్ణం, దంత సమస్యలు ఉన్నప్పటికీ క్రమంగా ఆరోగ్యం మెరుగుపడుతుంది. తీవ్రమైన అనారోగ్య సమస్యల నుంచి బయటపడటానికి..వ్యాధిహర వైష్ణవ కవచం పారాయణం చేయాలని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలైనా పూర్తిగా దూరమవుతాయి..
ఆర్థికం, వృత్తి..
హఠాత్తుగా వృశ్చిక రాశి వారికి ధన లాభాలు కలగడమే ఈ ఏడాది విశేషం.. వ్యాపారస్తులకు.. ముఖ్యంగా స్టాక్ మార్కెట్ రంగాల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల బాగా కలిసి వచ్చే అవకాశాలున్నాయి. రైతులు పంటల ద్వారా భారీ మొత్తంలో లాభాలు కూడా పొందుతారు. విద్యార్థులు ఉన్నత విద్యల కోసం విదేశాలకు కూడా వెళ్లగలుగుతారు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అద్భుతంగా ఫలించబోతున్నాయి. సాంకేతిక రంగాల్లఉండేడే వారికి ఈ కాలం ఎంతో అనుకూలంగా ఉండబోతుంది. ముఖ్యంగా ఈ ఏడాది ఆర్థికంగా వృశ్చిక రాశి వారికి అద్భుతమైన లాభాలు కలగడమే కాకుండా విజయాలు కలగడం విశేషం..
కుటుంబం పరంగా..
కుటుంబం పరంగా తల్లి ఆరోగ్యం చాలా బాగుంటుంది. గతంలో ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ.. ఈ సమయంలో వీటి నుంచి కాస్త ఉపశమనం కలగబోతోంది. దీనివల్ల ఇంట్లో ఆనందం విపరీతంగా పెరుగుతుంది. అయితే భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో తప్పకుండా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ సమయంలో ఒకరినొకరు అతిగా నమ్మి మోసపోకుండా జాగ్రత్త వహించాలని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. మాట విషయంలో కూడా చాలా జాగ్రత్తలు పాటించడం అవసరం..
ముఖ్యంగా మార్చి నుంచి మే వరకు వృశ్చిక రాశి వారికి గృహ వాతావరణం చాలా అద్భుతంగా ఉంటుంది. వీరికి అదృష్టం కలిసి రావడమే కాకుండా ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి. జూన్ నుంచి ఆగస్టు వరకు సామాజిక పరిచయాలు విపరీతంగా పెరుగుతాయి. ఆధ్యాత్మిక చింతన కూడా పెరిగే అవకాశాలున్నాయి. అలాగే సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు తీర్థయాత్రలకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. విందుతో పాటు వినోదా కాలంలో చాలా అద్భుతమైన సంతోషాన్ని పొందుతారు. ఇక డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు తల్లిదండ్రుల సహకారమందుతుంది.. దీని కారణంగా వీరి సంపాదన కూడా విపరీతంగా పెరుగుతుంది.
అదృష్ట అంశాలు..
వృశ్చిక రాశి వారికి అదృష్ట సంఖ్య ఈ ఏడాది 9.. అంతేకాకుండా సోమా మంగళ గురువారాలు వీరికి కలిసి వస్తాయి. కాబట్టి ఎలాంటి పనులైన ఈ సమయంలో చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు పొందుతారు. దోష నివారణకు హనుమంతుడిని లేదా రుద్రుడిని ఆరాధించడం చాలా మంచిదని జ్యోతిష్యులు చెబుతున్నారు. దీంతోపాటు హనుమత్ కవచ పారాయణం చేయడం వల్ల ఆపదలు కూడా తొలగిపోతాయి. అలాగే ఎన్నో రకాల సమస్యల నుంచి విముక్తి పొందడానికి నిత్యం దేవాలయానికి వెళ్లడం చాలా మంచిది.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Parabhava Nama Samvatsaram Tula Rashi: శ్రీ పరాభవ నామ సంవత్సరంలో తులా రాశి వారికి గ్రహ స్థితిగతుల కారణంగా మిశ్రమ ఫలితాలు కలుగుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ ఏడాది జీవితంలో ఆర్థిక పురోగతితో పాటు కొన్ని వ్యక్తిగత సవాళ్లు ఎదురైనప్పటికీ.. కొన్ని రకాల ప్రయోజనాలు మాత్రం జీవితాన్ని అద్భుతం చేయబోతున్నాయి. అయితే శని గురు గ్రహాల సంచారం ఈ రాశి వారిపై చూపే ప్రభావం వల్ల వృత్తితో పాటు వ్యాపారగాల్లో కీలకమైన మార్పులు చోటు చేసుకోబోతున్నట్లు జ్యోతిష్యులు చెబుతున్నారు. అంతేకాకుండా ఆర్థికంగా కూడా ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగబోతున్నాయి.
ఆదాయం వ్యాయాయాలు: ఏడాది తులారాశి వారికి ఆర్థిక పరిస్థితులను పరిశీలిస్తే.. ఆదాయం 2, వ్యాయం 8 గా ఉందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ గణాంకాలను బట్టి చూస్తే రాబడి కంటే ఖర్చులు అధికంగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా అనవసర ఖర్చులు తగ్గించుకోవడం, పొదుపుపై దృష్టి పెట్టడం ఏడాది మీకు అత్యంత అవసరమని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అలాగే భూ సంబంధిత వివాదాలు పరిష్కారానికి కాస్త డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా ఏర్పడుతుంది. చేతికి వచ్చిన డబ్బులు నిలకడగా ఉండడం చాలా కష్టమవుతోంది.
రాజ్య పూజ్యం అవమానం..
సామాజిక హోదా తో పాటు గౌరవ మర్యాదల విషయంలో తులారాశి వారికి సమానం ఉంది. ఈ ఏడాది రాజ్యపూజం 6 తో పాటు అవమానం ఆరుగా ఉంది. కాబట్టి సమాజంలో మీకు ఉన్న గౌరవానికి ఎటువంటి భంగం కలగకున్నప్పటికీ.. మీ మాటల తీరు వల్ల సన్నిహితులతో చిన్నపాటి విభేదాలు వచ్చే ప్రమాదముంది. వివాదాలకు దూరంగా ఉండటంతో పాటు ఎదుటివారి అభిప్రాయాలను గౌరవించడం వల్ల అవమానాలను నివారించవచ్చని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
రంగాల వారీగా ఫలితాలు..
ఉద్యోగ వృత్తిపరంగా..
ఉద్యోగస్తులకు ఈ సమయంలో పని ఒత్తిడి పెరిగినప్పటికీ మీ ప్రతిభకు తగిన గుర్తింపు కూడా లభించే అవకాశాలున్నాయి.. పై అధికారుల సపోర్టుతో క లిస్టుతరమైన పనులు కూడా ఎంతో సులభంగా చేస్తారు. నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు వచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులు పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. కొత్త భాగస్వామ్య ఒప్పందాలు చేసుకునే ముందు న్యాయ సలహాలు తీసుకోవడం మంచిది. అలాగే మార్కెటింగ్ రంగాల్లో ఉన్నవారికి లాభసాటిగా మారుతుంది.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
ఆరోగ్యం..
ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది.. ముఖ్యంగా జీర్ణ సంబంధిత సమస్యలతో పాటు కంటి ఇన్ఫెక్షన్ల వంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న వ్యక్తులకు కొన్ని రకాల సమస్యలు వస్తాయి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడమే కాకుండా సమతుల్య ఆహారం తీసుకోవడం వల్ల విశేషమైన ఫలితాలు పొందుతారు. మొత్తం మీద తులారాశి వారికి పరాభవ నామ సంవత్సరం సహనాన్ని పరీక్షించేదిగా ఉన్నప్పటికీ.. పట్టుదలతో శ్రమిస్తే విజయం మీ సొంతమవుతుంది. ప్రతి శనివారం వీరు తప్పకుండా శని చాలీసా పఠించడమే కాకుండా శివారాధన చేయడం వల్ల ప్రతికూల శక్తులు తొలగిపోయి. అద్భుతమైన లాభాలు పొందగలుగుతారు..
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Shani Surya Yuti 2026 Effect On Zodiac Telugu: గ్రహాల కదలికలతో పాటు వాటి మార్గంలో వచ్చే మార్పులను చాలామంది ప్రత్యేకమైన విగా భావిస్తారు. ఎందుకంటే ఒక గ్రహం తన రాశిని మారినప్పుడు అది 12 రాశులను ప్రభావితం చేస్తుంది. అయితే, అన్ని రాశుల మీద ప్రభావం ఒకేలా ఉండకపోయినా.. కొన్ని సందర్భాల్లో మాత్రం ప్రభావం సానుకూలంగా మారుతుంది. మరికొన్ని సందర్భాల్లో ప్రతికూలంగా అని మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. సూర్యుడు ఇప్పటికే మీనరాశిలో ప్రవేశించాడు. శని గ్రహంతో కలయిక జరిగింది.. అయితే, ఈ రెండు గ్రహాల కలయిక కారణంగా ఏర్పడిన ప్రభావం చాలా సానుకూలంగా ఉండబోతోంది. కొన్ని రాశుల వారికి ఈ సమయంలో అనేక మార్పులు రాబోతున్నాయి.
మార్చి 15న తెల్లవారి జామున ఒకటి గంటల సమయంలో సూర్యుడు మీనరాశిలోకి ప్రవేశించాడు. మీన రాశి గురు గ్రహం అధిపతిగా ఉంటుంది. అలాంటిది సూర్యశని గ్రహాల కలయిక కారణంగా కొన్ని రాశుల వారికి ఈ సమయంలో ఒత్తిడి కూడా పూర్తిగా తగ్గిపోతుంది. అంతేకాకుండా ఆర్థిక ప్రయోజనాలు కూడా కలుగబోతున్నాయి. అనుకున్న పనుల్లో ఊహించని మార్పులు కూడా పొందబోతున్నారు.
మేషరాశి
మేష రాశి వారికి ఈ సంచారం చాలా అద్భుతంగా ఉంటుంది.. 12వ స్థానంలో మేష రాశి వారికి ఈ రెండు గ్రహాల కలయిక జరిగింది. దీని ఫలితంగా ఖర్చులు కూడా పూర్తిగా తగ్గే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆర్థికంగా పురోగతి కూడా ఉంటుంది. ఈ సమయంలో వీరు మిశ్రమ లాభాలు పొందుతారు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వచ్చినప్పటికీ తప్పకుండా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ముఖ్యంగా బడ్జెట్ను నియంత్రించుకోవడం మంచిది. అవసరమైన ఖర్చులకు దూరంగా ఉంటేనే జీవితంలో రాణించగలుగుతారు.
సింహరాశి
సింహరాశిలో జన్మించిన వ్యక్తులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. సూర్యుడు ఈ సమయంలో 8 వ స్థానంలో సంచార దశలో ఉండబోతున్నాడు. వీరిపై కేతు ప్రభావం కూడా కనిపిస్తుంది. దీనివల్ల వీరు చట్టవరమైన పనుల్లో నిర్లక్ష్యం వహించకపోవడం చాలా మంచిది. అలాగే బ్యాంకింగ్ రంగంలో ఉన్న వ్యక్తులకు కూడా కొన్ని రకాల ప్రయోజనాలు కలిగినప్పటికీ.. పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకునే క్రమంలో జాగ్రత్త గా ఉండాల్సి ఉంటుంది. ముఖ్యంగా పెట్టుబడులు పెట్టాలనుకుంటున్న వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
తులారాశి
తులా రాశిలో జన్మించిన వ్యక్తులు కూడా ఈ గ్రహ సంచారాల కారణంగా ఒత్తిడి పూర్తిగా పెరిగే అవకాశాలున్నాయి. దీంతోపాటు ఆరవ స్థానంలో సూర్యుడు ఉండడం వల్ల వీరికి బాధ్యతలు కూడా పెరగవచ్చు. అలాగే ఈ సమయంలో ఇతరుల నుంచి విమర్శలు కూడా ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా పరిస్థితులు కూడా గతంలో కంటే ఇప్పుడు సమస్యలను తెరిచి పెట్టేలా ఉండబోతున్నాయి. ఓపికగా ఉండి జీవితాన్ని చక్కదిద్దుకోవడం చాలా మంచిది.
మీన రాశి
సూర్యుడు మీనరాశిలోకి ప్రవేశించినప్పుడు.. మీన రాశి వారికి మిశ్రమ ప్రయోజనాలు కలుగుతూ ఉంటాయి. ముఖ్యంగా వీరికి ఈ సమయంలో కెరీర్ పరంగా కాస్త ఒడిదుడుకులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆర్థిక నిర్ణయాలను తెలివితేటలతో తీసుకోకపోతే తీవ్ర నష్టాలు సంభవించవచ్చు. దీంతోపాటు వ్యక్తిగత జీవితంలో కూడా అనేక సమస్యలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు ఈ సమయంలో కాస్త జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది..
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Chaturgrahi Rajayoga Effect On Zodiac 2026: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలకు కదలికలతో పాటు కలయికలు మానవ జీవితంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని మనందరికీ తెలిసిందే. తాజాగా మార్చి 16 సాయంత్రం కుంభరాశిలో ఒక అరుదైన, అత్యంత శక్తివంతమైన చతుర్గ్రహీ రాజయోగం ఏర్పడింది. ప్రస్తుతం కుంభ రాశిలో రాహువుతో పాటు కుజుడు, బుధుడు గ్రహాలు కలయిక జరిపాయి. అలాగే మార్చ్ 16వ తేదీ సాయంత్రం 6 గంటల సమయంలో చంద్రుడు కూడా కుంభరాశిలోకి ప్రవేశించడం వల్ల. ఈ నాలుగు గ్రహాలు కలయిక జరిగింది. ఫలితంగానే ఎంతో శక్తివంతమైన చతుర్గ్రహీ యోగం రాజయోగం ఏర్పడింది. అయితే దీని ప్రభావం రాశుల వారిపై ఉన్నప్పుడు విశేషమైన ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా మూడురాశుల వారికి ధన లాభాలతో పాటు వృత్తిపరమైన జీవితం కొనసాగిస్తున్న వారి విజయం సాధించగలుగుతారు. అయితే ఈ శక్తివంతమైన రాజయోగ ప్రభావం కొన్ని రాశుల వారికి అద్భుతమైన అవకాశాలను అందించబోతోంది.
ఈ మూడు రాశులకు మేలు జరుగుతుంది.
మేషరాశి
మేష రాశి వారికి ఎంతో శక్తివంతమైన చతుర్గ్రహీ యోగం వల్ల అద్భుతమైన పురోగతి లభించబోతోంది. ముఖ్యంగా వీరికి గతంలో కష్టపడిన పనుల్లో అద్భుతమైన ప్రతిఫలం లభించబోతోంది. దీంతోపాటు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వ్యక్తులకు కొత్త అవకాశాలు తలుపుతట్టబోతున్నాయి. అలాగే కుటుంబ జీవితంలో సుఖ సంతోషాలు నెలకొంటాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. దీంతోపాటు అదృష్టం తోడవడంతో దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న పనులు కూడా ఎంతో సులభంగా పూర్తవుతాయి. ఈ సమయంలో చేసే పనుల్లో అద్భుతమైన ఆర్థిక లాభాలు కలుగుతాయి. పెండింగ్లో ఉన్న చిన్న చిన్న పనులు కూడా త్వరగా పూర్తవుతాయి. ఈ సమయంలో పెట్టుబడులు భవిష్యత్తుకు అద్భుతమైన అవకాశాలను కూడా అందించబోతున్నాయి.
వృషభ రాశి
వృషభ రాశిలో జన్మించిన వ్యక్తులకు ఈ యోగం ప్రభావంతో చిక్కులన్నీ తొలగిపోబోతున్నాయి. ముఖ్యంగా కెరీర్లో ఎదుర్కొంటున్న సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. ఆర్థిక పరిస్థితులు గతంలో కంటే ఇప్పుడు మరింత మెరుగుపడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మహిళలు మిత్రులుగా ఉన్న వ్యక్తులకు ఈ సమయంలో అద్భుతమైన ధన లాభాలు కూడా కలుగుతాయి. భాగస్వామ్య వ్యాపారాల్లో కలిసి రాబోతోంది. అంతేకాకుండా ఆరోగ్య సమస్యల నుంచి కోలుకునే అవకాశాలున్నాయి. నిలిచిపోయిన పాత బాకీలు తిరిగి వసూల్ అయ్యే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అంతేకాకుండా అనుకున్నంత డబ్బు కూడా ఎంతో సులభంగా పొందగలుగుతారు.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
తులారాశి
తులా రాశిలో జన్మించిన వ్యక్తులకు కూడా ఈ సమయంలో మంచి విద్యా లభించబోతోంది. ఉద్యోగ రంగాల్లో పనులు చేస్తున్న వ్యక్తులకు అత్యున్నత గౌరవం లభిస్తుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వ్యక్తులకు కూడా ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఎంతటి కష్టమైన పనుల్లోనైనా తులా రాశి వారు అద్భుతమైన విజయాలు సాధించగలుగుతారు. విదేశీ ప్రయాణాలు చేయాలనుకుంటున్న వ్యక్తులకు ఈ సమయం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. అంతేకాకుండా విదేశీ సంస్థల్లో పెట్టుబడిన పెట్టి వ్యాపారాలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రేమ జీవితం కూడా ఈ సమయంలో తులా రాశి వారికి చాలా అద్భుతంగా ఉండబోతోంది. ముఖ్యంగా కోరుకున్న వారితో పెళ్లిళ్లు కూడా కుదురుతాయి..
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Jupiter Direct in Gemini Effect On Zodiac: గ్రహగమనాల్లో వచ్చే మార్పులు మానవ జీవితంపై లోతైన ప్రభావాన్ని చూపుతాయని అందరికీ తెలిసిందే. జ్యోతిష్య శాస్త్రం గణాంకాల ప్రకారం దేవగురువుగా పిలిచే బృహస్పతి మార్చి 11వ తేదీ నుంచి మిథున రాశిలో తిరోగమనాన్ని ముగించి.. సాధారణ స్థితిలోకి ప్రవేశించాడు. ఈ మార్పు జూన్ రెండవ తేదీ వరకు కొనసాగుతుంది. గురుగ్రహం జ్ఞానంతో పాటు ఐశ్వర్యం సంతానానికి సూచికగా భావిస్తారు.. అంతేకాకుండా గురు గ్రహాన్ని అదృష్ట దేవతగా కూడా చెప్పుకుంటారు. అలాంటిది ఈ గ్రహ మార్పుల కారణంగా అనేక రాశుల వారి జీవితాల్లో శుభ ఫలితాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో ముఖ్యంగా కుంభ రాశి వారికి విశేషమైన ఫలితాలు కలుగుతాయి.
కుంభ రాశి
ఈ గ్రహ సంచారం కుంభరాశి వారికి అత్యంత అనుకూలంగా ఉండబోతోంది. వీరు చేపట్టిన ప్రతి ప్రణాళిక విజయవంతంగా పూర్తవుతుంది. ఊహించని విధంగా ఆర్థిక లాభాలు కలగడమే కాకుండా కొత్త కొత్త అవకాశాలు కూడా లభిస్తాయి. ముఖ్యంగా విద్యార్థులకు, సంతానం కోసం వేచి చూస్తున్న వ్యక్తులకు అద్భుతమైన శుభవార్తను లభిస్తాయి. దీంతోపాటు ఆర్థికంగా కూడా చాలా వరకు బలపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. బద్ధకాన్ని వదిలి కష్టపడి పనిచేయడం వల్ల అద్భుతమైన అదృష్టం దక్కించుకునే అవకాశాలు కూడా ఉన్నాయి.. దీంతో పాటు కోరుకున్న కోరికలు చాలా వరకు నెరవేరుతాయి..
ఈ రాశుల వారిపై కూడా ఊహించని ప్రభావం..
మేష రాశి
ఈ సమయంలో మేష రాశి వారికి కార్యాలయాల్లో సానుకూలమైన మార్పులు రావడం ప్రారంభమవుతాయి. ప్రభుత్వ ఉద్యోగాలు చేసిన వ్యక్తులకు కూడా అద్భుతమైన లాభాలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా పెండింగ్లో ఉన్న పనులు సులభంగా పూర్తవుతాయి. అనుకున్న ఫలితాల్లో అద్భుతమైన విజయాలు సాధిస్తారు.
మిథున రాశి
వ్యాపారాలు చేస్తున్న మిథునరాశుల వారికి ఈ సమయంలో లాభాలు రావడం ఊహించని స్థాయిలో పెరుగుతాయి. ముఖ్యంగా చిన్న వ్యాపారాలు చేసే వ్యక్తులు తమ వ్యాపారాలను విస్తరించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఆరోగ్యం కూడా చాలా వరకు మెరుగుపడే సూచనలు కనిపిస్తున్నాయని జ్యోతిష్యులు చెబుతున్నారు.
సింహరాశి
సింహరాశి వారికి ఈ సమయంలో కొత్త ఆదాయ వనరులు కూడా లభిస్తాయి. ఉద్యోగ అన్వేషణలో ఉన్నవారికి మంచి మంచి అవకాశాలు కూడా లభించబోతున్నాయి. దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకు ఈ సమయంలో అద్భుతమైన పరిష్కారం లభించబోతోంది. ఎప్పటినుంచో తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకు సులభంగా విముక్తి లభించబోతోంది.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
తులారాశి
తులారాశి వారికి ఈ సమయంలో అదృష్టం తోడు ఉండబోతుంది. దీని కారణంగా గతంలో నుంచి వస్తున్న ఆటగాలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. ముఖ్యంగా ప్రయాణాలు చేయడం ఈ సమయంలో చాలా మంచిదని జ్యోతిష్యులు చెబుతున్నారు. ప్రయాణాలు చేయడం వల్ల చాలా వరకు కలిసి వచ్చే అవకాశాలున్నాయి.
ధనస్సు రాశి
రాశి రాశి వారికి ఆర్థిక పరిస్థితులు గతంలో కంటే ఇప్పుడు మరింత బలోపేతం అవుతాయి. కానీ ఈ సమయంలో కోపాన్ని అదుపులో ఉంచుకోవడం చాలా మంచిదని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. లేదంటే అనేక సమస్యల బారిన పడే అవకాశాలు ఉన్నాయి. దీర్ఘకాలిక సమస్యల నుంచి కూడా చాలా వరకు ఉపశమనం కలుగుతుంది.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Jeevan Reddy Likely To Resign: అధికారంలోని కాంగ్రెస్ పార్టీకి ఊహించని ఎదురుదెబ్బ తగులుతోంది. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేను లాక్కున్న కాంగ్రెస్ పార్టీకి పాపం తగిలినట్టు ఉంది. అక్కడ స్థానికంగా బలమైన నాయకుడిగా ఉన్న మాజీ మంత్రి జీవన్ రెడ్డి హస్తం పార్టీకి గుడ్ బై చెప్పే సమయం వచ్చేసింది. ఇప్పటికే పార్టీ మారుతారని పుకార్లు వస్తుండగా తాజాగా కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలు చించేయడంతో అది ఖాయంగా కనిపిస్తోంది. ఆత్మగౌరవానికే భంగం వాటిల్లిన నేపథ్యంలో సీనియర్ నాయకుడిగా ఉన్న జీవన్ రెడ్డి రాజీనామా చేయనుండడం కాంగ్రెస్ పార్టీకి భారీ ఎదురుదెబ్బగా చెప్పవచ్చు. ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులకు ప్రాధాన్యం లభించకపోవడంతో కాంగ్రెస్లో సీనియర్లు పునరాలోచనలో పడ్డారు.
Also Read: Harish Rao: తెలంగాణను చంద్రబాబుకు రేవంత్ రెడ్డి తాకట్టు.. నదీ జలాలపై హరీశ్ రావు తీవ్ర వ్యాఖ్యలు
తనను అవమానిస్తూ.. జగిత్యాలలో తనకు ప్రాధాన్యం లేకుండా చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి జీవన్ రెడ్డి బుద్ధి చెబుతున్నారు. ఇప్పటికే సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల్లో తన ప్రతాపం ఏమిటో చూపినా కూడా పార్టీ అధిష్టానం ఖాతరు చేయకపోవడంతో జీవన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్కు గుడ్ బై చెప్పేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే జగిత్యాలలోని తన నివాసం వద్ద కాంగ్రెస్ ఫ్లెక్సీలు చించేశారు. పాత బ్యానర్లు, ఫ్లెక్సీలు తొలగించి కేవలం తన ఫొటో మాత్రమే ఉండేలా ఫ్లెక్సీలు ముద్రించారు.
Also Read: KCR Wishes: నందిని సిద్దారెడ్డికి అభినందనల వెల్లువ.. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు శుభాకాంక్షలు
ఫలించని బుజ్జగింపు
పార్టీని వీడేందుకు సిద్ధమైన జీవన్ రెడ్డిని బుజ్జగించేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైనా కూడా ఆయన ససేమిరా అంటున్నారు. దీంతో సోమవారం ఉదయం జీవన్ రెడ్డికి పార్టీ రాష్ట్ర ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ ఫోన్ చేసి నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు. పార్టీ వీడరాదని విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. అయితే మీనాక్షి నటరాజన్ బుజ్జగింపు చర్యలను జీవన్ రెడ్డి పట్టించుకోలేదు. 'నలభై ఏళ్ల కాంగ్రెస్ ప్రయాణానికి మీరిచ్చే బహుమతి ఇదేనా? ఇక కాంగ్రెస్ పార్టీతో ప్రయాణం చాలు' అంటూ ఫోన్లో మీనాక్షికి ఘాటుగా సమాధానమిచ్చినట్లు చర్చ జరుగుతోంది.
ముహూర్తం అప్పుడే!
కాంగ్రెస్కు రేపో మాపో గుడ్బై చెప్పేయనున్న మాజీ మంత్రి జీవన్ రెడ్డి కొద్ది రోజుల్లోనే బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్తో సమావేశమైనట్లు వార్తలు వస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీలోకి కేసీఆర్ సాదరంగా ఆహ్వానం పలికేందుకు అంగీకరించారని.. ఆయన చేరిక లాంఛనంగా కనిపిస్తోంది. సంప్రదింపులు పూర్తవడంతో జగిత్యాలలో ఫ్లెక్సీలు చించేశారు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ సమక్షంలో జీవన్ రెడ్డి చేరడం ఖాయమే. ఈనెల 25 వ తేదీన గులాబీ తీర్థం పుచ్చుకోవడానికి ముహూర్తం నిర్ణయమైందని సమాచారం. పార్టీలో చేరిన అనంతరం జగిత్యాలలో జీవన్ రెడ్డి భారీ బహిరంగ సభ పెట్టనున్నారని సమాచారం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Women Heart Attack Death: యముడు ఎప్పుడూ పిలుస్తాడేమో కానీ ఊహించని పరిస్థితిలో మరణాలు సంభవిస్తున్నాయి. ఆరోగ్యంగా.. అందరి మధ్యలో ఉన్న వారు కూడా ఆకస్మికంగా కుప్పకూలి మరణిస్తున్నారు. అలా ఓ శుభకార్యానికి అతిథిగా వచ్చిన వివాహిత ఫొటో దిగి శుభాకాంక్షలు చెబుతున్న క్రమంలో కుప్పకూలిపోయారు. ఏం జరిగిందో తెలియదు కానీ ఆమె వేదికపైనే పడిపోయారు. ఆమెను లేపి చూడగా అప్పటికే మరణించారు. హుటాహుటినా ఆస్పత్రికి తరలించినా కూడా అక్కడి వైద్యులు అదే విషయాన్ని చెప్పారు. దీంతో ఒక్కసారిగా శుభకార్యం కాస్త విషాదంగా మారింది. ఈ సంఘటన తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది.
Also Read: Harish Rao: తెలంగాణను చంద్రబాబుకు రేవంత్ రెడ్డి తాకట్టు.. నదీ జలాలపై హరీశ్ రావు తీవ్ర వ్యాఖ్యలు
ఖమ్మం నగరంలోని త్రీటౌన్ ప్రాంతానికి చెందిన సుష్మిత వివాహితురాలు. ఆమె ఖమ్మంలో జరిగిన బంధువుల శుభకార్యంలో పాల్గొన్నారు. ఇంట్లో జరుగుతున్న గృహ ప్రవేశ వేడుకకు హాజరై సందడి చేశారు. అందరితో కలిసి సరదాగా గడుపుతూ.. ఆ జ్ఞాపకాలను పదిలపరుచుకునేందుకు బంధువులతో కలిసి సుష్మిత ఫొటో దిగేందుకు వచ్చారు. కుటుంబసభ్యులకు శుభాకాంక్షలు చెప్పి ఫొటో దిగుతుండగా ఉన్నఫళంగా ఆమె కుప్పకూలిపోయారు. పడిపోతున్న ఆమెను బంధువులు పట్టుకోవడానికి ప్రయత్నించినా కూడా ఆమె కిందపడిపోయారు.
Also Read: KCR Wishes: నందిని సిద్దారెడ్డికి అభినందనల వెల్లువ.. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు శుభాకాంక్షలు
ఏం జరిగిందో తెలియదు అందరూ దిగ్భ్రాంతికి గురయ్యారు. వెంటనే సుష్మితను లేపే ప్రయత్నం చేయగా.. చలనం లేదు. వెంటనే బంధువులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఆమెను పరిశీలించిన వైద్యులు అప్పటికే చనిపోయిందని ధృవీకరించారు. ఈ హఠత్పరిణామానికి కుటుంబసభ్యులు, బంధువులు షాక్లో ఉండిపోయారు. అందరితో కలివిడిగా ఉంటూ సుష్మిత కొన్ని క్షణాల్లోనే ఈ లోకాన్ని విడిచిపోవడం అంతా విస్మయానికి గురయ్యారు.
గుండెపోటుతో హఠాన్మరణం పొందడంతో సుష్మిత కుటుంబసభ్యులు కన్నీటి సంద్రంలో మునిగారు. ఆమె ఆకస్మిక మరణానికి తీవ్రమైన గుండెపోటు కారణంగా తెలుస్తోంది. అయితే ఫంక్షన్లో ఆమె కుప్పకూలిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మనిషికి చావు ఇలా కూడా వస్తుందా? అని సందేహం వ్యక్తమవుతోంది. యముడు ఇలా సంతోషంలో ఉన్న సమయంలో ఎలా ప్రాణం తీసుకెళ్తాడోనని ఆ వీడియో చూసి కామెంట్ చేస్తున్నారు. ఇలాంటి సంఘటన అందరినీ కలచివేస్తోంది. కాగా ఇప్పటివరకు పురుషులకు మాత్రమే గుండెపోటు వస్తుందని చర్చ జరుగుతుండగా.. ఖమ్మంలో జరిగిన సంఘటనతో మహిళలకు కూడా గుండెపోటు వస్తుందని రుజువైందని చెబుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Telangana Hailstorm Rains: వేసవికాలం ప్రారంభమే ఎండలు దంచికొడుతున్నాయి. ఎండ వేడిమిని ప్రజలు తట్టుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో అకస్మాత్తుగా వర్షం కురిసింది. హైదరాబాద్తోపాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో అకాల వర్షం పడింది. దీంతో ఆయా ప్రాంతాల్లో కొంత ప్రజలు ఇబ్బందులు పడ్డారు. జల్లులతోపాటు మోస్తరు నుంచి భారీ వర్షం పడగా.. కొన్నిచోట్ల వడగళ్లు పడ్డాయి. ఈ వర్షాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
Also Read: Govt Employees: ప్రభుత్వ ఉద్యోగులు కీలక నిర్ణయం.. పీఆర్సీ, ఐఆర్, డీఏ పెంపు కోసం ఉగాదికి డెడ్లైన్
హైదరాబాద్తోపాటు మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో సోమవారం సాయంత్రం వాన పడింది. కొన్నిచోట్ల దంచికొట్టగా.. మరికొన్ని చోట్ల మోస్తరు వర్షం పడింది. ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరికి గురయిన ప్రజలు ఈ వర్షంతో కాస్త ఉపశమనం పొందారు. అయితే అకాల వర్షాలతో రైతులు భయపడిపోయారు. పంట చేతికి వస్తున్న సమయంలో వర్షం పడడంతో పంట నష్టం ఏర్పడుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
హైదరాబాద్లోని కొన్ని ప్రాంతాల్లో వర్షం పడింది. బోరబండ, ఎర్రగడ్డ, సనత్నగర్, బంజారాహిల్స్, తార్నాక, విద్యానగర్ తదితర ప్రాంతాల్లో చినుకులతోపాటు మోస్తరు వర్షం కురిసింది. జిల్లాలో ఈ వర్షం తీవ్రంగా ప్రభావం చూపింది. ఈదురుగాలులతో కూడిన వర్షం పడడంతో వ్యసాయానికి తీరని నష్టం వాటిల్లుతోంది. ఇప్పటికే సిద్దిపేట జిల్లాలో పంటలకు తీవ్ర నష్టం రాగా.. ఇప్పుడు మరోసారి వర్షం పడడంతో రైతుల నడ్డి విరిగింది. అర్ధ గంట సేపు వాన దంచికొట్టడమే కాకుండా పెద్ద పెద్ద సైజులో వడగళ్లు పడ్డాయి.
Also Read: Harish Rao: తెలంగాణను చంద్రబాబుకు రేవంత్ రెడ్డి తాకట్టు.. నదీ జలాలపై హరీశ్ రావు తీవ్ర వ్యాఖ్యలు
ఈదురుగాలులకు పలు చోట్ల చెట్లు నేలకొరిగాయి. దీంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. మెదక్ జిల్లా హవేళి ఘన్పూర్ మండలంలో భారీ వర్షంతోపాటు పెద్ద పెద్ద వడగళ్లు పడ్డాయి. కామారెడ్డి జిల్లా జుక్కల్, నాగిరెడ్డిపేట మండలాల్లో మోస్తరు వర్షం పడింది. వాతావరణ శాఖ చేసిన సూచనల ప్రకారం ఆదివారంతోపాటు సోమవారం కూడా వర్షం పడింది. రానున్న రోజుల్లో కూడా పలుచోట్ల వర్షం పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook