సాయుధ పోరాటానికి మతం రంగు పులుముతున్న బీజేపీ
Bellampalle, Kannal Rural, Telangana:తెలంగాణ రైతాంగం జరిపిన సాయుధ పోరాటాన్ని బీజేపీ వక్రీకరించి మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి వాడుకుంటుందని ఏఐటీయూసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య అన్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో ఆదివారం మాట్లాడుతూ కమ్యూనిస్టుల నాయకత్వంలో జరిగిన ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పోరాటం రైతాంగ సాయుధ పోరాటం అన్నారు. పోరాటంలో 4,300 మంది అమరులు అయ్యారని తెలిపారు. పోరాటంతో సంబంధం లేని శక్తులు ఈ పోరాటానికి మతం రంగు పులిమి ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నాయని పేర్కొన్నారు.हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
తిరుమలలో సతీసమేతంగా మాజీ మంత్రి హరీశ్ రావు
Tirupati Urban, Andhra Pradesh:Telangana Ex Minister Harish Rao Visits Tirumala Temple Along With Wife Watch Videoభర్త కోసం అన్నా లెజినోవా తిరుమలలో మొక్కులు
Dharmavaram, Andhra Pradesh:Pawan Kalyan Wife Anna Lezhneva Visits To Tirumala Temple Watch Videoతిరుమలలో మొక్కు తీర్చుకున్న పవన్ కల్యాణ్ భార్య అన్నా లెజినోవా
Tirupati Urban, Andhra Pradesh:AP Deputy CM Anna Lezhneva Offers Special Poojas In Tirumala Templeతిరుమలలో వైఎస్ జగన్ సోదరి సునీతా రెడ్డి
Dharmavaram, Andhra Pradesh:Former CM YS Jagan Sister YS Sunitha Reddy At Tirumala Temple Watch Videoగురు ఆదిత్య యోగంతో కుబేరులు కాబోతున్న రాశులు ఇవే!
Hyderabad, Telangana:Guru Aditya Yoga July 2026 Latest News: జూలై నెల చివరి వారంలో ఒక అద్భుతమైన గ్రహకూటమి ఏర్పడబోతోందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. జూలై 16న సూర్య గ్రహం మిథున రాశిని విడిచిపెట్టి.. కర్కాటక రాశిలోకి సంచారం చేయబోతోంది. మరోవైపు, పవిత్రమైన శ్రావణ మాసం కూడా మొదలు కాబోతోంది.. జూలై 25న శని దేవుడు వక్రగతిలో కూడా ప్రయాణించోతున్నాడు.. ఇదే సమయంలో, సూర్యుడికి అత్యంత సమీపంలోకి రావడం వల్ల దేవగురువైన బృహస్పతి అస్తమించడం కూడా విశేషం.. ఈ గ్రహాల కదలికల కారణంగా ఎంతో శక్తివంతమైన గురు ఆదిత్య యోగం అనే అత్యంత శక్తివంతమైన, శుభప్రదమైన యోగం కూడా ఏర్పడబోతోంది..
ఈ రాశులవారికి బంపర్ లాభాలు..
మకర రాశి (Capricorn)
మకర రాశి వారికి ఈ చివరి 10 రోజుల్లో తన స్నేహితుల నుంచి ఆశించిన సహాయ, సహకారాలు కూడా లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ఫ్లాట్ ప్రకారం పనులు ఎంతో సులభంగా పూర్తి చేసి.. అధికారుల సపోర్ట్ను కూడా పొందుతారు. అలాగే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఈ సమయం ఎంతో లాభదాయకంగా ఉంటుంది. పరీక్షలు రాసేవారికి ఈ సమయం ఎంతో అద్భుతంగా ఉంటుంది.
సింహ రాశి (Leo)
సింహ రాశివారికి ఈ చివరి 10 రోజుల్లో అదృష్టం పూర్తిగా రెట్టింపు అవుతుంది. అంతేకాకుండా సమాజంలో ఉన్నత స్థానంలోకి ఎదిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే వ్యక్తులతో పరిచయాలు కూడా ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా చాలా కాలంగా నిలిచిపోయిన పనులు కూడా సులభంగా పూర్తవుతాయి. ముఖ్యంగా ఉద్యోగాలు చేసేవారికి మంచి మంచి ప్రమోషన్స్ కూడా లభిస్తాయి. కొత్త ఇడ్లు కొనుగోలు చేసేవారికి ధన లాభాలు కలుగుతాయి.
ధనుస్సు రాశి (Sagittarius)
ఉద్యోగాలు చేసే ధనుస్సు రాశివారికి కెరీర్ పరంగా అద్భుతమైన పెద్ద శుభవార్తలు కూడా పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆఫీసులో పైఅధికారులు మీ పనితీరుకు తగ్గ ప్రశంసలు కూడా లభిస్తాయి.. వ్యాపారంలో ఆశించిన లాభాలు సాధించడమే కాకుండా.. పెద్ద మొత్తంలో ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. కుటుంబంలో ఆనందం కూడా రెట్టింపు అవుతుంది. దీని కారణంగా బోలెడు ప్రయోజనాలు కలుగుతాయి.
కర్కాటక రాశి (Cancer)
మోస్ట్ పవర్ఫుల్ గురు ఆదిత్య యోగంతో కర్కాటక రాశిలోనే ఏర్పడడం కారణంగా ఈ రాశివారికి కూడా ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది. మీలోని బద్ధకాన్ని వదిలిపెట్టి.. ఏకాగ్రతతో కష్టపడి పనిచేస్తారని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. కొత్త ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి ఈ సమయంలో మంచి మంచి అద్భుతాను అందిస్తుంది. కార్యాలయంలో పెద్ద అవకాశాలు కూడా సులభంగా లభిస్తాయి.
వృషభ రాశి (Taurus)
శక్తివంతమైన గురు ఆదిత్య యోగంతో జూలై చివరి రోజులు వృషభ రాశి వారికి అత్యంత అద్భుతంగా ఉంటుంది. వీరు అనుకున్న పనులన్నీ ఎంతో సులభంగా పూర్తవుతాయి. అంతేకాకుండా పనులు కూడా ఎంతో సులభంగా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీలో ఒక రకమైన కొత్త శక్తి కనిపిస్తుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. సహోద్యోగులందరి సహాయం ముందుకు వెళ్తారు.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
గమనిక.. 
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..
పెన్షన్ లేదు.. హెల్త్ కార్డు ఊసే లేదు.. విశ్రాంత సీపీఎస్ ఉద్యోగుల వెతలు.. పట్టించుకోని సర్కార్..!!
Secunderabad, Telangana:CPS Retired Employees: రాష్ట్రంలో పదవీ విరమణ చేసిన సీపీఎస్ ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా మారింది. ఇప్పటికే వారు తమ పెన్షన్లను కోల్పోయారు. తాజాగా హెల్త్ కార్డును కూడా కోల్పోయారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 9,600 మంది సీపీఎస్ ఉద్యోగులు పదవీ విరమణ చేశారు. వారికి ప్రాథమిక పెన్షన్ కంటే తక్కువగా.. అంటే 2,000-3,000 రూపాయల కన్నా తక్కువ పెన్షన్ అందుతోందని యూనియన్ నాయకులు చెబుతున్నారు. ప్రభుత్వం పదవీ విరమణ చేసిన ఓపీఎస్ ఉద్యోగుల పెన్షన్ల నుండి 1.5శాతం ప్రీమియం మినహాయించి వారికి హెల్త్ కార్డులు జారీ చేస్తోంది. సీపీఎస్ ఉద్యోగుల పెన్షన్ల నుండి 1.5శాతం ప్రీమియం మినహాయించడానికి మార్గం లేదు. ఫలితంగా.. వారికి హెల్త్ కార్డులు జారీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. అటు పెన్షన్ అందక.. ఇటు హెల్త్ కార్డు లేకుండా తీవ్ర వివక్షకు గురవుతున్నామని సీపీఎస్ విశ్రాంత ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 2.5 లక్షల మంది సీపీఎస్ ఉద్యోగులు ఉన్నారు. ప్రస్తుతం వారందరూ పనిచేస్తున్న ఉద్యోగులు కాబట్టి, వారి ప్రాథమిక జీతంలో 1.5శాతం హెల్త్ కార్డుల కోసం మినహాయిస్తున్నారు. భవిష్యత్తులో వీరంతా ఏదొక రోజు పదవీ విరమణ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత వారికి అందే పింఛను చాలా తక్కువగా ఉంటుంది. దీని కారణంగా, వారు EHS ప్రీమియంలు చెల్లించలేని పరిస్థితులు కూడా నెలకొంటాయి. అంటే.. CPS ఉద్యోగులు ఉద్యోగంలో ఉన్నంత కాలం మాత్రమే హెల్త్ కార్డ్ వర్తిస్తుంది. హెల్త్ కార్డ్ ఉద్దేశ్యం ఏమిటని CPS ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ఇది కేవలం OPS ఉద్యోగులకు , పింఛనుదారులకు మాత్రమే వర్తిస్తుంది. అంతేకాకుండా, మొత్తం ఉద్యోగులలో 70శాతం ఉన్న CPS ఉద్యోగులను ట్రస్ట్ బోర్డులో చేర్చకూడదా? అని ఉపాధి సంఘాల నాయకులు ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. EHS అమలులో తమను భాగస్వాములను చేయనందున, CPS, పదవీ విరమణ చేసిన CPS ఉద్యోగుల సమస్యలను పరిష్కరించే అవకాశం లేదని వారు ఫిర్యాదు చేస్తున్నారు.
వృద్ధాప్యంలో ఆర్థిక, ఆరోగ్య భద్రత లేదా?
రాష్ట్ర ప్రభుత్వం CPS ఉద్యోగుల సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేసింది. సెప్టెంబర్ 1, 2004 తర్వాత నియమితులైన వారందరూ పదవీ విరమణ తర్వాత పింఛను ప్రయోజనాలను కోల్పోతారు. పర్యవసానంగా, వారికి హెల్త్ కార్డులు వర్తించవు. ప్రభుత్వం వీలైనంత త్వరగా CPSను రద్దు చేసి, పాత పింఛను పథకాన్ని అమలు చేయాలి. అప్పటి వరకు, పదవీ విరమణ చేసిన CPS ఉద్యోగులకు నగదు రహిత వైద్య చికిత్సను కొనసాగించాలి. EHS ట్రస్ట్ బోర్డులో CPS ఉద్యోగ సంఘాలకు ప్రాతినిధ్యం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.
Also Read: తెలంగాణ PRCపై ఉద్యోగులు గంపెడాశలు.. ఈసారైనా ప్రభుత్వం కరుణిస్తుందా?
Also Read: ఇది స్కూలా లేక IAS, IPS ల తయారీ కేంద్రమా?
Also Read: సీపీఎస్ రద్దు కోసం జన జాగరణ యాత్ర..ఆగస్టు 23న హైదరాబాద్లో మహా సభ..!!
Also Read: తెలంగాణ ఉపాధ్యాయుడికి అరుదైన గుర్తింపు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Hydrogen Train Launch: దేశంలో తొలి హైడ్రోజన్ రైలు జాతికి అంకితం.."భవిష్యత్తు అంతా దీనితోనే!"
jawa, Haryana:PM Modi Hydrogen Train Launch: భారత రైల్వే రంగంలో సరికొత్త విప్లవానికి తెరలేచింది. నేడు అనగా జూలై 17 హైడ్రోజన్ రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు. హర్యానాలో దేశంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ రైలు సర్వీసును ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ చారిత్రాత్మక ఘట్టం అనంతరం ప్రధాని మోదీ దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ, రాబోయే కాలమంతా హైడ్రోజన్ ఇంధనానిదేనని స్పష్టం చేశారు.ధరణి పోర్టల్పై సిట్ విచారణ.. తెలంగాణ మంత్రివర్గం కీలక నిర్ణయాలు
Hyderabad, Telangana:Dharani Portal: తెలంగాణలో అత్యంత వేగంగా మారుతున్న కీలక రాజకీయ పరిణామాల నేపథ్యంలో తెలంగాణ మంత్రివర్గ సమావేశమైంది. కీలక అంశాలపై చర్చించిన తెలంగాణ మంత్రిమండలి ధరణి పోర్టల్పై సిట్ విచారణ చేయాలని నిర్ణయించింది. నీటి పారుదల ప్రాజెక్టులపై మంత్రిమండలి అంచనాలు సవరించింది. హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ పురోగతప.. ఎల్నినో ప్రభావం, తాగునీటి భద్రతపై మంత్రిమండలి చర్చ జరిగింది.
హైదరాబాద్లోని సచివాలయంలో గురువారం జరిగిన మంత్రిమండలి సమావేశం కొన్ని గంటల పాటు సాగింది. నీటిపారుదల ప్రాజెక్టులపై మంత్రిమండలి సమీక్ష చేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుతోపాటు నిర్మాణంలో ఉన్న ఇతర సాగునీటి ప్రాజెక్టులపై, మెట్రో రైలు రెండో దశ పురోగతిపై, కేంద్రం కమిటీ ఏర్పాటు జాప్యంపై ప్రభుత్వ వైఖరిపై మంత్రిమండలి చర్చ చేసింది. ఎల్-నినో ప్రభావం, తాగునీటి భద్రత చర్యలపై చర్చించింది.
బుల్లెట్ ట్రైన్ భూ సేకరణ, వ్యయ అంశాలపై చర్చ, మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు పురోగతిపై మంత్రిమండలి చర్చ చేసింది. కృష్ణా–గోదావరి జల వివాదం, సుప్రీంకోర్టు వ్యవహారంపై వ్యూహం వంటి పలు కీలక పరిపాలనా, అభివృద్ధి ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ధరణి పోర్టల్ అక్రమాలపై సిటి విచారణ కు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. జగిత్యాల జిల్లా డిగ్రీ కాలేజీలో పలు పోస్టులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. హాన్స్ చెరులో ఇందిరమ్మ ఇళ్ల కోసం భూమి కేటాయింపుకు మంత్రిమండలి నిర్ణయించింది. బుల్లెట్ ట్రైన్ అలైన్మెంట్ మార్పునకు మంత్రివర్గం పచ్చజెండా ఊపింది. తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం–2018 సవరణకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పలు పరిపాలనా, అభివృద్ధి అంశాలకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది.
విచారణకు సిద్ధం
ధరణి అక్రమాలపై సిట్ విచారణకు ప్రభుత్వం సిద్ధమైంది. ధరణి పోర్టల్లో జరిగిన అక్రమాలపై సమగ్ర దర్యాప్తు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. ధరణి పోర్టల్పై ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటుకు కసరత్తు చేస్తోంది. భూ రికార్డుల మార్పులు, అక్రమ మ్యూటేషన్లపై విచారణకు మంత్రిమండలి నిర్ణయించింది. ప్రభుత్వ, అసైన్డ్, వక్ఫ్, దేవాదాయ భూముల లావాదేవీలపై దృష్టి సారించింది. అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలకు ప్రభుత్వం సిద్ధమైందని ప్రకటించింది.
అవసరమైతే మాజీ అధికారులు, బాధ్యులకు నోటీసులు ఇవ్వాలని.. సాంకేతిక అంశాలపై నిపుణుల సహకారంతో దర్యాప్తు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. ధరణి ద్వారా జరిగిన భూ వివాదాలన్నింటిపై వివరాల సేకరణ చేసింది. అక్రమంగా లబ్ధి పొందిన వారిపై కేసుల నమోదుకు అవకాశం. ధరణి పోర్టల్లో రాష్ట్రవ్యాప్తంగా ఫిర్యాదులు, పత్రాల పరిశీలన ప్రారంభమైంది. బాధితులకు న్యాయం చేయడమే లక్ష్యమని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. భూ పరిపాలనలో పారదర్శకతకు ప్రభుత్వం చర్యలు తీసుకోనుందని.. సిట్ విచారణతో ధరణి అక్రమాల అసలు నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం.
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ ఫ్యాన్స్కు షాకింగ్ న్యూస్..వరల్డ్కప్ చెదిరింది..ఎల్లుండి వన్డేలకు రిటైర్మెంట్!
England:Rohit Sharma Retirement News: భారత్కు ఎన్నో మ్యాచ్ల్లో ఒంటి చెత్తో అద్భుత విజయాలను అందించిన హిట్మ్యాన్ రోహిత్ శర్మ కల నెరవేరకుండానే కెరీర్ ముగియనున్నట్లు తెలుస్తోంది. 2027 వన్డే వరల్డ్ కప్ ప్రణాళికల్లో రోహిత్ శర్మ లేడని సెలెక్టర్ల నుంచి స్పష్టమైన సమాచారం వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. జూలై 19న ఇంగ్లాండ్తో లార్డ్స్ మైదానంలో జరగనున్న మూడో వన్డే మ్యాచ్తో రోహిత్ శర్మ టీమిండియా జెర్సీలో చివరిసారిగా కనిపించనున్నారని నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది. రోహిత్ శర్మ భవిష్యత్పై బీసీసీఐ సీనియర్ సెలక్షన్ కమిటీ కఠిన నిర్ణయం తీసుకుందని నిపుణులు అంటున్నారు.'తల్లికి వందనం'పై సీఎం చంద్రబాబు తీపి కబురు.. ఇకపై అంగన్వాడీ సిబ్బందికి వర్తింపు
Nuzendla, Andhra Pradesh:Thalliki Vandanam Scheme: విద్యార్థుల తల్లులకు ఆర్థిక సహాయం అందించే తల్లికి వందనం పథకంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పథకాన్ని మరికొంత మందికి విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తల్లికి వందనం పథకాన్ని అంగన్వాడీ సిబ్బందికి అమలు చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు అంగన్వాడీ సిబ్బందికి శుభవార్త ప్రకటించారు. ఏపీ ప్రభుత్వం అంగన్వాడీ టీచర్లు, సహాయకులకు తల్లికి వందనం పథకం అమలు చేయనుంది.
అంగన్వాడీలకు 'తల్లికి వందనం' పథకం వర్తించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. టీచర్లు, మినీ టీచర్లు, ఆయాలకు పథకం అమలు చేయనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకున్న నిర్ణయంపై మంత్రి గుమ్మిడి సంధ్యారాణి హర్షం వ్యక్తం చేశారు. అంగన్వాడీల చిరకాల కోరిక నెరవేరిందని మంత్రి సంధ్యారాణి ప్రకటించారు. అర్బన్, రూరల్ అంగన్వాడీ సిబ్బంది అందరికీ తల్లికి వందనం పథకం వర్తించనున్నట్లు తెలిపారు.
అంగన్వాడీల విజ్ఞప్తిపై ఏపీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. అంగన్వాడీల సంక్షేమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఎల్లప్పుడూ పెద్దపీట వేస్తున్నారని మంత్రి సంధ్యారాణి తెలిపారు. జీతాల పెంపు, గ్రాట్యుటీ తర్వాత 'తల్లికి వందనం' వరం అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. అంగన్వాడీ కుటుంబం తరఫున ముఖ్యమంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు.
ప్రభుత్వ నిర్ణయంతో అంగన్వాడీ సిబ్బందిలో ఆనందం వెల్లివిరుస్తోందని.. సిబ్బంది సేవలకు గుర్తింపుగా 'తల్లికి వందనం' అమలు చేస్తున్నట్లు మంత్రి సంధ్యారాణి వివరించారు. అంగన్వాడీలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని.. అంగన్వాడీ సిబ్బందికి మరింత భరోసా కల్పించే నిర్ణయం ఇది అని ప్రకటించారు.
ATM Sleeping Viral Video: ఏటీఎంలో ఏసీలో దర్జాగా నిద్రపోతున్నాడు.. ఇలా కూడా ఉండారా గురూ!
Hyderabad, Telangana:SBI ATM Sleeping Viral Video: డబ్బు డిపాజిట్, విత్డ్రా వంటి వాటి కోసం వినియోగించే ఏటీఎం మెషీన్ దగ్గర ఓ విచిత్రమైన సంఘటన జరిగింది. మనలో చాలామందికి ఏటీఎంలో డబ్బును తీయడం వేయడం వంటి తెలిసే ఉంటుంది. ఆ ఏటీఎంల వద్ద ఎయిర్ కండిషనర్ కూడా ఉంటుందనే విషయం అందరికి తెలిసి విషయమే. అయితే తాజాగా ఉత్తరప్రదేశ్లో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. ఎండల తాకిడి తట్టుకోలేక ఓ వ్యక్తి ఏటీఎం మెషీన్ ఉండే ఏసీ దగ్గర పడుకొని నిద్రపోయాడు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఏం జరిగిందంటే?
ఉత్తరప్రదేశ్లోని మౌ జిల్లాలో ఏసీ సౌకర్యం ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బిఐ) ఏటిఎమ్ కియోస్క్లో ఒక వ్యక్తి నిద్రపోతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో బ్యాంకు ఏటిఎమ్లలో భద్రతా ఏర్పాట్లపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మౌలోని భిటి ప్రాంతంలో ఉన్న ఒక ఎస్బిఐ ఏటిఎమ్లో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. అక్కడ గుర్తుతెలియని ఒక వ్యక్తి బూత్ నేలపై హాయిగా పడుకుని కనిపించాడు. బయట ఉన్న వేడి, తేమ నుండి రక్షణ కోసం ఏసీ ఉన్న ఆ ప్రదేశాన్ని ఆశ్రయంగా వాడుకుంటున్నట్లు స్పష్టమవుతోంది.
ప్రత్యక్ష సాక్షుల ప్రకారం.. నగదు విత్డ్రా చేసుకోవడానికి ఏటిఎమ్కు వచ్చిన వినియోగదారులు లోపల ఆ వ్యక్తి నిద్రపోవడాన్ని గమనించారు. వారిలో ఒకరు ఈ దృశ్యాన్ని వీడియో తీసి ఆన్లైన్లో పంచుకున్నారు. సోషల్ మీడియాలో అది వేగంగా వ్యాపించడంతో, ఒక వ్యక్తి ఏటిఎమ్ బూత్లో ఎవరికీ కనపడకుండా ఎలా ఉండగలడని చాలామంది ప్రశ్నించడం మొదలుపెట్టారు. ఆ ప్రదేశంలో భద్రతా సిబ్బంది లేకపోవడం అనే విషయంపై కూడా ఈ వీడియో దృష్టిని ఆకర్షించింది.
జీవన్ రామ్ ఇంటర్ కాలేజీకి ఎదురుగా ఉన్న ఆ కియోస్క్ వద్ద సిబ్బంది ఎవరూ లేరని సమాచారం. దీంతో ఆ ప్రదేశంలోని వినియోగదారుల భద్రత, బ్యాంకింగ్ మౌలిక సదుపాయాల భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఏటీఎం భద్రత బ్యాంకు బాధ్యత అని అధికారులు స్పష్టం చేశారు. బ్యాంకులు తమ సొంత భద్రతా సిబ్బందిని నియమించి, ఏటీఎం కియోస్క్ల వద్ద సరైన నిఘా ఉండేలా చూసుకోవాలని, అవసరమైతే పోలీసులు జోక్యం చేసుకోవచ్చని, కానీ తగినంత భద్రతను ఏర్పాటు చేయాల్సిన బాధ్యత బ్యాంకుపైనే ఉంటుందని సిటీ సర్కిల్ ఆఫీసర్ (సీఓ) నితేష్ ప్రతాప్ తెలిపారు.
దేశవ్యాప్తంగా ఏటీఎంలలో దొంగతనాలు, విధ్వంసకాండ కేసులు వెలుగులోకి వస్తున్న నేపథ్యంలో ఈ ఘటన ఏటీఎం భద్రతపై విస్తృత ఆందోళనలను మళ్లీ రేకెత్తించింది. ప్రతి ఆఫ్-సైట్ కియోస్క్ వద్ద ఇరవై నాలుగు గంటల భద్రతా సిబ్బంది తప్పనిసరి కానప్పటికీ, బ్యాంకింగ్ నిబంధనల ప్రకారం పనిచేసే నిఘా వ్యవస్థలు తప్పనిసరిగా ఉండాలి. ఆ వీడియో వైరల్ అయిన తర్వాత.. ఏటీఎం బూత్ల దుర్వినియోగాన్ని నివారించడానికి, వినియోగదారులను, ఆస్తులను కాపాడటానికి భద్రతను కట్టుదిట్టం చేయాలని, సీసీటీవీ కవరేజీని పెంచాలని, క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించాలని స్థానిక నివాసితులు బ్యాంకుకు పిలుపునిచ్చారు.
Also Read: "భవిష్యత్తు అంతా హైడ్రోజన్దే"..చారిత్రాత్మక రైలు ఆవిష్కరణ ఘట్టంలో ప్రధాని మోదీ!
ALso REad: Metro Lovers Kissing: మెట్రో రైలులో లవర్స్ ముద్దులాట..బూతులు తిడుతున్న ప్రయాణికులు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Supreme Court Voter: ఓటరు లిస్టులో పేరు లేకపోతే పౌరసత్వం పోయినట్టేనా? సుప్రీంకోర్టు సంచలన తీర్పు!
New Delhi, Delhi:Supreme Court Voter List: ఓటరు జాబితాలో పేరు లేనంత మాత్రాన ఎవరూ తమ భారత పౌరసత్వాన్ని కోల్పోరని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పశ్చిమ బెంగాల్లో చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియకు వ్యతిరేకంగా దాఖలైన ఒక పిటిషన్ను విచారించిన సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. ఒక వ్యక్తి పౌరసత్వాన్ని నిర్ధారించే అంతిమ అధికారం భారత ఎన్నికల సంఘానికి (ECI) లేదని కోర్టు తేల్చి చెప్పింది. ఈ పిటిషన్ను భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, జస్టిస్ జయమాల్య బాగ్చి, జస్టిస్ వి.మోహనలతో కూడిన ధర్మాసనం విచారించింది.
సుప్రీంకోర్టు క్లారిటీ..
ఒక వ్యక్తి భారత పౌరుడా, కాదా అని నిర్ణయించే తుది అధికారం ఎన్నికల సంఘానికి లేదని ధర్మాసనం స్పష్టం చేసింది. ఓటరు జాబితాలో పేరు లేకపోవడం అనేది కేవలం ఆ వ్యక్తికి ప్రస్తుతానికి 'ఓటు హక్కు' లేదని మాత్రమే సూచిస్తుంది. అంతే తప్ప, అది పౌరసత్వాన్ని రద్దు చేసే పత్రం కాబోదని న్యాయస్థానం తేల్చి చెప్పింది.
ఎన్నికల ప్రక్రియ కోసం ఈసీ చేసే వెరిఫికేషన్ కేవలం ఓటర్ల జాబితా రూపకల్పనకు మాత్రమే పరిమితమని పేర్కొంది. గతంలో బీహార్ SIR కేసులో ఇచ్చిన తీర్పులోనే ఈ విషయాన్ని తాము స్పష్టం చేశామని కోర్టు గుర్తు చేసింది.
నిలిచిపోతున్న సంక్షేమ పథకాలు..
పశ్చిమ బెంగాల్లో ఓటరు జాబితా సవరణ తర్వాత తలెత్తిన తీవ్రమైన సమస్యలను పిటిషనర్ ప్రసేన్జిత్ బోస్ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఓటరు జాబితా నుండి తొలగింపునకు గురైన వారు 19 అప్పీలేట్ ట్రిబ్యునళ్ల ముందు దాదాపు 34 లక్షల అప్పీళ్లు చేసుకున్నారు. కానీ, ఇప్పటివరకు కేవలం 38,000 అప్పీళ్లు మాత్రమే పరిష్కారమయ్యాయి (వీటిలో 70% మందికి అనుకూలంగా తీర్పు వచ్చింది).
ఈ అప్పీళ్లు పెండింగ్లో ఉండగానే, ఓటరు జాబితాలో పేరు లేని వారికి ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS-రేషన్) ప్రయోజనాలను, అన్నపూర్ణ యోజన వంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలను నిలిపివేస్తూ బెంగాల్ ప్రభుత్వం నోటిఫికేషన్లు జారీ చేసింది. ఓటు లేని వారికి కనీసం కుల ధృవీకరణ పత్రాలు (Caste Certificates) కూడా ఇవ్వడం లేదని న్యాయవాది కోర్టుకు తెలిపారు.
న్యాయస్థానం తదుపరి ఆదేశాలు..
ఈ పరిణామాలపై స్పందించిన సుప్రీంకోర్టు.. ఒక వ్యక్తిని ఓటర్ల జాబితా నుండి తొలగించిన తర్వాత, వారి పౌరసత్వ స్థితిని నిర్ధారించడానికి కేంద్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవడం ఎన్నికల సంఘం బాధ్యత అని స్పష్టం చేసింది.
ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో పారదర్శకత ఉండాలని, తప్పుగా పేర్లు తొలగింపునకు గురైన వారి కోసం బలమైన అప్పీల్ వ్యవస్థ ఉండాలని కోర్టు సూచించింది. పశ్చిమ బెంగాల్ ఎస్ఐఆర్ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లతో పాటు, ప్రభుత్వ పథకాలను నిలిపివేయడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై కూడా సమగ్ర విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు ధర్మాసనం వెల్లడించింది.
Also Read: "భవిష్యత్తు అంతా హైడ్రోజన్దే"..చారిత్రాత్మక రైలు ఆవిష్కరణ ఘట్టంలో ప్రధాని మోదీ!
Also Read: సాంప్రదాయ విలువలకు నిలువెత్తు రూపం..సేవే పరమావధిగా జీవితం..నంద్ కిషోర్ లైఫ్ హిస్టరీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
మందుబాబులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు.. తెల్లవారుజామున 4.30 వరకు మద్యం విక్రయాలు
Baddipadaga, Telangana:Liquor Sales: ఫుట్బాల్ ప్రపంచకప్ నేపథ్యంలో మందుబాబులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు వినిపించింది. ఫిఫా ప్రపంచకప్ 2026 ఫైనల్ మ్యాచ్ సందర్భంగా మద్యం విక్రయాల సమయం పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. హోటళ్లు, రెస్టారెంట్లు, బార్లు, పబ్లు తెరచి ఉంచే సమయాన్ని తెలంగాణ ప్రభుత్వం పెంచేసింది. క్రీడాభిమానుల నుంచి వచ్చిన డిమాండ్ నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
హైదరాబాద్లోని క్రీడాభిమానుల నుంచి వచ్చిన భారీ అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అర్జెంటీనా, స్పెయిన్ మధ్య జరగనున్న ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ను బహిరంగంగా ప్రదర్శించాలనుకునే అన్ని రకాల కమర్షియల్, ప్రైవేట్ స్పోర్ట్స్ ఎస్టాబ్లిష్మెంట్లతో పాటు హోటళ్లు, రెస్టారెంట్లు, పబ్లను తెరిచి ఉంచేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
ఈ మెగా ఫైనల్ మ్యాచ్ సోమవారం అర్ధరాత్రి 12:30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం మ్యాచ్ ముగిసే సమయం వరకు క్రీడాభిమానులు మ్యాచ్ వీక్షించేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. హోటళ్లు, రెస్టారెంట్లు, పబ్లు తదితర వాణిజ్య సంస్థలను తెరచి ఉంవవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ సడలింపులతోపాటు న్యూ ఇయర్ వేడుకల సమయంలో విధించే సాధారణ నిబంధనలు యథావిధిగా అమలులో ఉంటాయని ప్రభుత్వం తెలిపింది. తెలంగాణ బార్ అండ్ రెస్టారెంట్స్ ఓనర్స్ అసోసియేషన్ విజ్ఞప్తి మేరకు అనుమతిస్తూ ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
డ్రంక్ అండ్ డ్రైవ్ వంటి ఉల్లంఘనలపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తారని తెలంగాణ ప్రభుత్వం హెచ్చరించింది. శాంతిభద్రతల విషయంలో జీరో టాలరెన్స్ విధానాన్ని అవలంభిస్తారని అధికారులు హెచ్చరిక చేశారు. ఫిఫా వరల్డ్ కప్ సందర్భంగా తెలంగాణలో తెల్లవారుజాము వరకు మద్యం విక్రయాలు జరగనున్నాయి. ఇటీవలే ఇదే తరహా కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కర్ణాటక బాటలోనే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం నడుస్తోంది.
==> 18వ తేదీన జరిగే ఫిఫా వరల్డ్ కప్ థర్డ్ ప్లేస్ ప్లే-ఆఫ్ మ్యాచ్ సందర్భంగా 19వ తేదీ తెల్లవారుజామున 4.30 గంటల వరకు మద్యం విక్రయాలు జరగనున్నాయి.
==> 19వ తేదీన జరిగే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా అర్ధరాత్రి నుంచి 20వ తేదీ తెల్లవారుజామున 3 గంటల వరకు మద్యం అమ్మకాలకు అనుమతి
ఎక్కడ చూడవచ్చు
ఫిఫా ప్రపంచకప్ మ్యాచ్లు జీ5 యాప్లో చూడవచ్చు. జీ మీడియా నెట్వర్క్కు సంబంధించి స్పోర్ట్స్ ఛానళ్లు యునైట్8 స్పోర్ట్స్ లలో ప్రత్యక్ష ప్రసారం జరుగుతాయి. ఫుట్బాల్ ప్రపంచకప్ను జీ5లో చూస్తూ ఎంజాయ్ చేయవచ్చు.
Empty Stomach Water: ఉదయాన్నే ఖాళీ కడుపుతో నీళ్లు తాగితే ఏమవుతుంది? పుకార్లపై వైద్యుల స్పందన ఇదే!
Hyderabad, Telangana:Empty Stomach Water In Morning: ఉదయాన్నే నిద్రలేవగానే కాస్త నీరు తాగమని మన పెద్దవారు చెబుతుంటారు. అయితే దాని వెనుక ఓ ఆరోగ్య రహస్యం ఉందట. ఉదయాన్నే నీళ్లు తాగడం ఎందుకు ముఖ్యమంటే.. మనం రాత్రి పడుకున్నాక దాదాపు 6 నుండి 8 గంటల పాటు శరీరానికి నీరు అందదట. దీనివల్ల ఉదయానికి శరీరం స్వల్పంగా డీహైడ్రేషన్ (నిర్జలీకరణం)కు గురవుతుందట. అందుకే, నిద్రలేవగానే నీళ్లు తాగడం వల్ల శరీరానికి అవసరమైన ద్రవాలు మళ్లీ అంది, అవయవాలు చురుగ్గా పనిచేయడం ప్రారంభిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
లభించే నిజమైన ఆరోగ్య ప్రయోజనాలు..
ఉదయం 1 లేదా 2 గ్లాసుల నీరు తాగడం వల్ల శరీరానికి వెంటనే జలసమృద్ధి (Hydration) కలిగి, రోజంతా ఉత్సాహంగా ఉండటానికి సహాయపడుతుంది. నీరు జీర్ణవ్యవస్థను శుభ్రపరుస్తుంది. కొంతమందిలో ఇది మలబద్ధకం సమస్యను నివారించడంలో తోడ్పడుతుంది.
ఈ విధంగా ఉదయమే నీళ్లు తాగడం వల్ల బాడీ టెంపరేచర్ సమతుల్యంగా ఉంటుంది. మూత్రపిండాలు సక్రమంగా పనిచేస్తూ, మూత్రం ద్వారా శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపడానికి తగినంత నీరు అవసరం.
వైరల్ అవుతున్న అపోహలు.. వైద్యుల హెచ్చరిక!
సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్నట్లుగా ఖాళీ కడుపుతో నీళ్లు తాగడం వల్ల అన్ని రోగాలూ నయమవుతాయనడానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. నీరు తాగడం మంచి అలవాటే కానీ.. ఇది ఏ వ్యాధికీ సంపూర్ణ చికిత్స కాదు.
కేవలం ఉదయాన్నే నీళ్లు తాగడం వల్లే బరువు తగ్గడం, మధుమేహం (డయాబెటిస్) నియంత్రణ కావడం లేదా క్యాన్సర్ వంటి తీవ్ర వ్యాధులు నయమవడం సాధ్యం కాదు.
ఎంత నీరు తాగాలి? ఎవరికి ప్రమాదం?
నీరు తాగే విషయంలో ఒకే నియమం అందరికీ వర్తించదు. సాధారణంగా ఉదయం 1 లేదా 2 గ్లాసుల నీరు తాగవచ్చు. ఆ తర్వాత రోజంతా దాహాన్ని బట్టి తగినంత నీరు తీసుకోవాలి. అయితే, కింది సమస్యలు ఉన్నవారు వైద్యుల సలహా లేకుండా ఒకేసారి ఎక్కువ నీరు తాగకపోవడమే మంచిదని చెబుతున్నారు.
1) మూత్రపిండాల (కిడ్నీ) సమస్యలు ఉన్నవారు
2) గుండె జబ్బులు ఉన్నవారు
3) శరీరంలో నీటి పరిమాణాన్ని నియంత్రించాల్సిన ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవారు.
ఆరోగ్యకరమైన ఉదయపు దినచర్య..
నిజమైన ఆరోగ్యం కేవలం నీళ్లతోనే సాధ్యం కాదు. పరిపూర్ణ ఆరోగ్యం కోసం ఉదయం పూట వీటిని అలవాటు చేసుకోండి. నిద్రలేచిన వెంటనే తగినంత నీరు తాగండి. ఆ తర్వాత ఒక 15-20 నిమిషాల పాటు తేలికపాటి వ్యాయామం లేదా వాకింగ్ చేయండి. తాజా పండ్లు, కూరగాయలతో కూడిన పోషకమైన అల్పాహారం తీసుకోండి. రోజంతా శరీరానికి తగినంత నీటిని అందిస్తూ ఉండండి.
గమనిక: ఉదయాన్నే నీళ్లు తాగడం మంచి అలవాటే అయినప్పటికీ, సోషల్ మీడియాలో వచ్చే ప్రతి చిట్కాను గుడ్డిగా నమ్మకూడదు. ఏదైనా కొత్త ఆరోగ్య నియమాన్ని పాటించే ముందు ఫ్యామిలీ డాక్టర్ను సంప్రదించడం ఎల్లప్పుడూ శ్రేయస్కరం.
Also Read: Middle Age Men Fitness: 50 ఏళ్లు దాటిన మగాళ్లకు స్టామినా తగ్గకుండా ఉండాలంటే..!
Also Read; Onion Juice Benefits: ఉల్లిపాయ జ్యూస్ ఎప్పుడైనా తాగారా? తాగితే ఏం జరుగుతుంది?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Mohammad Nawaz Breach: డోపింగ్ వివాదంలో పాకిస్థాన్ స్టార్ క్రికెటర్కు షాక్..3 నెలల నిషేధం విధించిన ఐసీసీ!
Hyderabad, Sindh:Mohammad Nawaz Breach News: డోపింగ్ నిరోధక రూల్స్ ఉల్లఘించిన కారణంగా పాకిస్థాన్ స్టార్ స్పిన్నర్ మహమ్మద్ నవాజ్పై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) మూడు నెలల పాటు నిషేధం విధించింది. అన్ని రకాల క్రికెట్ పోటీల నుండి అతడిని సస్పెండ్ చేస్తున్నట్లు ఐసీసీ శుక్రవారం ఒక ప్రకటనలో అధికారికంగా వెల్లడించింది.
దొరికిపోయిన స్పిన్నర్..
ఫిబ్రవరి 7న శ్రీలంకలోని కొలంబోలో నెదర్లాండ్స్తో జరిగిన పురుషుల టీ20 మ్యాచ్ ముగిసిన అనంతరం మహమ్మద్ నవాజ్కు డోపింగ్ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో అతడు నిషేధిత మాదకద్రవ్యం 'కార్బాక్సీ-THC' (Carboxy-THC) తీసుకున్నట్లు తేలింది. సాధారణంగా గంజాయి వినియోగాన్ని గుర్తించడానికి ఈ పరీక్ష చేస్తారు.
శిక్ష తగ్గింపునకు అవకాశం..
ఐసీసీ నిర్ణయాన్ని నవాజ్ అంగీకరించాడు. అయితే, క్రీడా ప్రదర్శనను మెరుగుపరుచుకోవడానికి తాను ఈ పదార్థాన్ని వాడలేదని, మ్యాచ్కు దూరంగా ఉన్న సమయంలోనే దీనిని తీసుకున్నానని అతడు నిరూపించగలిగాడు. దీంతో ఐసీసీ అతడికి 3 నెలల స్వల్ప కాల నిషేధాన్ని ఖరారు చేసింది. నవాజ్ మే 1వ తేదీ నుంచే స్వచ్ఛందంగా తాత్కాలిక నిషేధాన్ని పాటిస్తుండటంతో, ఆ తేదీ నుంచే ఈ శిక్షా కాలం అమల్లోకి వచ్చినట్లు ఐసీసీ పరిగణించింది.
ప్రస్తుతం రెండున్నర నెలల నిషేధాన్ని పూర్తి చేసుకున్న నవాజ్.. ఐసీసీ సూచించిన మాదకద్రవ్యాల విముక్తి చికిత్స కార్యక్రమాన్ని (Rehabilitation Program) విజయవంతంగా పూర్తి చేస్తే ఈ శిక్షా కాలాన్ని ఒక నెలకు తగ్గిస్తారు. ఒకవేళ ఐసీసీ సంతృప్తి చెందేలా ఈ ప్రోగ్రామ్ను ముగిస్తే అతడు మళ్లీ అదనంగా ఎలాంటి నిషేధాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు.
రికార్డులు రద్దు.. పేలవ ఫామ్..
ఐసీసీ నిబంధనల ప్రకారం.. ఫిబ్రవరి 7న నెదర్లాండ్స్తో జరిగిన మ్యాచ్తో పాటు, మే 1వ తేదీ వరకు నవాజ్ ఆడిన మ్యాచ్ల రికార్డులు, సాధించిన ఫలితాలను రద్దు చేశారు. నవాజ్ చివరిసారిగా పాకిస్థాన్ సూపర్ లీగ్ (PSL)లో ముల్తాన్ సుల్తాన్స్ తరపున ఆడాడు. ఆ టోర్నీలో 6 మ్యాచ్ల్లో కేవలం 54 పరుగులు మాత్రమే చేసి, బౌలింగ్లో 9 మ్యాచ్లలో 6 వికెట్లు తీసినప్పటికీ భారీగా పరుగులు సమర్పించుకుని తీవ్ర నిరాశపరిచాడు. తాజాగా డోపింగ్ వివాదం అతడి కెరీర్ను మరింత కష్టాల్లోకి నెట్టింది.
Also Read: ఫ్రాన్స్ vs స్పెయిన్ సెమీఫైనల్.. ఫైనల్ బెర్త్ కోసం 'యూరోపియన్' యుద్ధం!
Also REad: ఫిఫా ప్రపంచకప్ సెమీఫైనల్స్లో హోరాహోరీ టీమ్స్..ట్రోఫీ గెలిచే సత్తా ఎవరికి ఉందంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
