సాయుధ పోరాటానికి మతం రంగు పులుముతున్న బీజేపీ
Bellampalle, Kannal Rural, Telangana:తెలంగాణ రైతాంగం జరిపిన సాయుధ పోరాటాన్ని బీజేపీ వక్రీకరించి మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి వాడుకుంటుందని ఏఐటీయూసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య అన్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో ఆదివారం మాట్లాడుతూ కమ్యూనిస్టుల నాయకత్వంలో జరిగిన ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పోరాటం రైతాంగ సాయుధ పోరాటం అన్నారు. పోరాటంలో 4,300 మంది అమరులు అయ్యారని తెలిపారు. పోరాటంతో సంబంధం లేని శక్తులు ఈ పోరాటానికి మతం రంగు పులిమి ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నాయని పేర్కొన్నారు.हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
Vivo S50t 5G లాంచ్.. 6500mAh బ్యాటరీ, కెమెరాలతో అదరగొడుతున్న కొత్త ఫోన్!
Hyderabad, Telangana:Vivo S50t 5G Launched: స్మార్ట్ఫోన్ మార్కెట్లో తమదైన ముద్ర వేసుకున్న ప్రముఖ చైనీస్ స్మార్ట్ఫోన్ కంపెనీ వీవో తాజాగా కొత్తగా ఎస్ సిరీస్ నుంచి అద్భుతమైన మొబైల్ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఇది ప్రీమియం ఫీచర్స్తో అందుబాటులోకి వచ్చింది. దీనిని కంపెనీ Vivo S50t 5G పేరుతో లాంచ్ చేసింది. ఇది ప్రీమియం కెమెరాతో పాటు భారీ బ్యాటరీతో కస్టమర్స్ను ఆకట్టుకునేలా కంపెనీ రూపొందించింది. అలాగే ఇందులో వీవో ఎన్నో రకాల కొత్త ఫీచర్స్ను కూడా అందుబాటులోకి తీసుకు వచ్చిన్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ స్మార్ట్ఫోన్ మోడల్కు సంబంధించిన అన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఈ Vivo S50t 5G స్మార్ట్ఫోన్ ఫీచర్స్కి సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఇది 6.59 అంగుళాల AMOLED డిస్ప్లేను కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా 1.5K రిజల్యూషన్తో పాటు 120Hz రిఫ్రెష్ రేట్ను సపోర్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇవే కాకుండా ఇందులో టెస్ట్ స్నాప్డ్రాగన్ 8s Gen 3 (Snapdragon 8s Gen 3) చిప్సెట్ ప్రాసెసర్తో లాంచ్ చేయబోతోంది. అలాగే ఇది ఆండ్రాయిడ్ 16 ఆధారిత OriginOS 6పై రన్ అవుతుంది. దీంతో పాటు మల్టీ టాస్కింగ్ చేసేందుకు ఈ మొబైల్ చాలా అద్భుతంగా పని చేస్తుంది.
ఈ స్మార్ట్ఫోన్ వెనక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్ను కూడా కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇందులో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో పాటు అదనంగా 8 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ లెన్స్ కెమెరాతో పాటు 50 మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో కెమెరాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇక ఫ్రంట్ భాగంలో ఈ స్మార్ట్ఫోన్ అద్భుతమైన కెమెరా సెటప్ను కూడా కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో 50 మెగాపిక్సెల్ పవర్ఫుల్ కెమెరాను కూడా కలిగి ఉంటుంది. ఇది హై-క్వాలిటీ ఫొటోలతో పాటు అద్భుతమైన వీడియోను కూడా రికార్డ్ చేయగలుగుతుంది.
ఈ స్మార్ట్ఫోర్ ప్రధాన ఆకర్శణ ఏంటంటే దాని బ్యాటరీ.. ఇందులో కంపెనీ 6500mAh శక్తివంతమైన బ్యాటరీని అందిస్తోంది. అంతేకాకుండా దీనికి తోడుగా 90W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా అందిస్తోంది. అలాగే తక్కువ సమయంలోనే ఫోన్ ఛార్జింగ్ అయ్యేందుకు అద్భుతమైన టెక్నాలజీని అందిస్తోంది. దీంతో పాటు ఇందులో అల్ట్రాసోనిక్ ఫింగర్ప్రింట్ స్కానర్ వంటి అత్యాధునిక ఫీచర్లు కూడా అందుబాటులో ఉంచిన్నట్లు తెలుస్తోంది.
Also Read: Spray Fan Offer: అమెజాన్ బంపర్ ఆఫర్.. రూ.1,099కే AC లాంటి గాలినిచ్చే డబుల్ ఎండెడ్ స్ప్రే ఫ్యాన్!
ప్రస్తుతం ఈ స్మార్ట్ఫోన్ చైనా మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చింది. అయితే, ఇది మొత్తం రెండు స్టోరేజ్ వేరియంట్స్లో అందుబాటులో ఉంది. మొదటి వేరియంట్ 12GB RAM + 512GB స్టోరేజ్ మోడల్ ధర సుమారు రూ.48,500 నుంచి ప్రారంభమవుతుంది. అలాగే రెండవ 16GB RAM + 512GB మోడల్ ధర రూ. 50,000తో లభిస్తోంది. అయితే, ఇప్పటికే ఇది చైనాలో వివో అధికారక వెబ్సైట్లో కూడా అందుబాటులోకి వచ్చింది. అయితే, భారత్లో కూడా త్వరలో విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది.
Also Read: Spray Fan Offer: అమెజాన్ బంపర్ ఆఫర్.. రూ.1,099కే AC లాంటి గాలినిచ్చే డబుల్ ఎండెడ్ స్ప్రే ఫ్యాన్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Sun Transit 2026: రోహిణి నక్షత్రంలోకి సూర్యుడి సంచారం.. ఈ రాశులకు ఆర్థికంగా తిరుగులేని అదృష్టం!
Hyderabad, Telangana:Sun Transit In Rohini Nakshatra 2026: మే నెలలో అత్యంత ప్రధాన గ్రహంగా పరిగణించే సూర్యుడు కూడా రాశి సంచారం చేయబోతోంది. ఈ సమయంలో సూర్యుడు నక్షత్రం సంచారం చేయబోతోంది. అయితే, చాలా నెలల తర్వాత నక్షత్ర సంచారం చేయడం విశేషం.. సూర్యుడు చంద్రునికి అత్యంత ప్రియమైన రోహిణి నక్షత్రంలోకి సంచారం చేసేందుకు సిద్ధమైంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. రోహిణి నక్షత్రం చాలా శుభప్రదమైనదిగా భావిస్తారు. ఈ నక్షత్రంలోకి సూర్యుడు ప్రవేశించడం వల్ల కొన్ని రాశులవారికి ఈ సమయంలో అద్భుతమైన పురోగతి లభించబోతోంది. ముఖ్యంగా ప్రకృతిలో అనేక మార్పులు రాబోతున్నాయి. అయితే, కొన్ని రాశులవారికి మాత్రం ఈ సమయంలో అద్భుతమైన అవకాశాలు కూడా లభించబోతున్నాయి. సూర్యుడి సంచారంతో ఏయే రాశులవారికి ఈ సమయం చాలా లాభదాయకంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
రోహిణి నక్షత్రం అన్ని నక్షత్రాల్లోకి నాలుగవ నక్షత్రంగా చెప్పకుంటారు. ఈ నక్షత్రానికి చంద్రుడితో పాటు బ్రహ్మదేవుడు అధిపతిగా వ్యవహరిస్తూ ఉంటారు. అలాగే ఈ నక్షత్ర చిహ్నం ఎద్దుల బండిగా ఉందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఇది పెరుగుదలతో పాటు పురోగతి, బరువు మోసే సామర్థ్యానికి సూచికగా భావిస్తారు. ఈ రోహిణి నక్షత్రాన్ని ఆనందంతో పాటు విలాసం, పరిశ్రమ, సంపదకు సూచికగా భావిస్తారు. అయితే, ఈ సూర్యుడు రోహిణి నక్షత్రంలోకి ప్రవేశించడం వల్ల కొన్ని రాశులవారికి ఈ సమయం చాలా లాభదాయకంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.
ఈ రాశులవారికి బంపర్ జాక్పాట్:
సింహరాశి:
రోహిణి నక్షత్రంలోకి అన్ని గ్రహాలకు అధిపతిగా వ్యవహరించే సూర్యుడు సంచారం చేయడంతో ఈ సొంత రాశివారికి వృత్తిపరంగా చాలా అద్భుతంగా ఉంటుంది. అంతేకాకుండా వ్యాపారాలు చేసేవారికి ఈ సమయం చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే పెట్టుబడులు పెట్టేవారికి ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది. అలాగే అద్భుతమైన ఆదాయ వనరులు కూడా లభిస్తాయి. ఎన్నో రకాల సమస్యలు ఈ సమయంలో తొలగిపోయే ఛాన్స్లు కనిపిస్తున్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.
వృషభ రాశి:
రోహిణి నక్షత్రంలోకి సూర్యుడు సంచారం చేయడంతో వృషభ రాశివారికి కూడా ఈ సమయం చాలా శుభప్రదంగా మారుతుంది. ముఖ్యంగా వ్యక్తిగత జీవితంలో మార్పులు వస్తాయి. అలాగే డబ్బులు సంపాదించడానికి కొత్త కొత్త మార్గాలు కూడా లభిస్తాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. సూర్యుడి ప్రభావంతో దీర్ఘకాలిక సమస్యలు కూడా సులభంగా దూరమవుతాయి. అంతేకాకుండా ఆర్థికంగా పొదుపు కూడా గణనీయంగా పెరిగే సూచనలు కనిపిస్తున్నారు.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
ధనుస్సు రాశి:
సూర్యుని ప్రభావంతో ధనుస్సు రాశివారికి కూడా ఈ సమయంలో అద్భుతమైన అవకాశాలు కూడా లభిస్తాయి. నిలిచిపోయిన పాత డబ్బులు కూడా తిరిగిపొందుతారు. అలాగే ఈ సమయంలో అనుకున్న పనుల్లో అద్భుతమైన విజయాలు సాధిస్తారు. భవిష్యత్కు తగ్గ డబ్బులు కూడా సంపాదించే ఛాన్స్లు కూడా ఉన్నాయి. ఈ సమయంలో ఆర్థిక ప్రణాళికల్లో కూడా ఊహించని సక్సెస్ సాధించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దీర్ఘకాలిక సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Govt Employees: 100 రోజుల్లో అన్నింటికి పరిష్కారం.. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు
Hyderabad, Telangana:Telangana Govt Employees: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులతోపాటు టీచర్లు, రిటైర్మెంట్ పొందిన ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త వినిపించింది. ఉద్యోగులకు సంబంధించిన అన్నీ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది. వంద రోజుల్లోపే సమస్యలు, డిమాండ్లు నెరవేరుస్తామని ప్రభుత్వం ప్రకటన చేసింది. వేతన సవరణ సంఘంతోపాటు రిటైర్మెంట్ బెనిఫిట్స్ తదితర సమస్యలు నెరవేరుస్తామని ఉప ముఖ్యమంత్రి ప్రకటించారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
Also Read: Pending Traffic Challan: పెండింగ్ ట్రాఫిక్ చలాన్లపై తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం
వంద రోజులు
ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో హైదరాబాద్లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సమావేశమయ్యారు. ఉద్యోగ సంఘాలు తమ 45 సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. సమస్యల పరిష్కారం, ఆర్థికభారంపై ఉద్యోగ సంఘాలతో సుదీర్ఘ చర్చ జరిగింది. ఉద్యోగుల సమస్యలపై సానుకూలంగా స్పందించిన ఉప ముఖ్యమంత్రి.. ముఖ్యమంత్రితో చర్చించి 100 రోజుల్లోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రతినెల ఉద్యోగులకు రూ.వెయ్యి కోట్లు కేటాయించేందుకు చర్యలు తీసుకుంటామని ఉద్యోగులకు మాట ఇచ్చారు. సమస్యలు పరిష్కరించేందుకు సిద్ధంగా ఉండడంతో ఉద్యమ కార్యచరణ వాయిదా వేసుకోవాలని ఉద్యోగులకు డిప్యూటీ సీఎం సూచించారు.
Also Read: Govt Employees: డిప్యూటీ సీఎంతో భేటీ! తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు నేడే భారీ శుభవార్త?
ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి సారించినట్లు తాజా సమావేశం స్పష్టం చేస్తోంది. రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కాంటింజెంట్ ఉద్యోగులు, పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యలను ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఉప ముఖ్యమంత్రికి వివరించారు. ఉద్యోగుల ప్రధాన సమస్యల పరిష్కారం చేస్తామని.. వాటితో ప్రభుత్వంపై పడే ఆర్థిక భారం, సత్వరం పరిష్కరించాల్సిన సమస్యలపై ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో డిప్యూటీ సీఎం సుదీర్ఘంగా చర్చించారు.
Also Read: Sanath Nagar TIMS: హైదరాబాద్లో మరో కొత్త నిమ్స్ తరహా ఆస్పత్రి.. ఎక్కడో తెలుసా?
ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేందుకు ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు ప్రారంభించిందని.. అయితే అన్ని సమస్యలను ఏకకాలంలో కాకుండా దశల వారీగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని డిప్యూటీ సీఎం ఉద్యోగ సంఘాల ప్రతినిధులకు తెలిపారు. పెన్షనర్ల సమస్యలను వంద రోజులలోనే పరిష్కరిస్తామని ఇప్పటికే మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నామని.. ఉద్యోగుల సమస్యలను కూడా ప్రాధాన్య క్రమంలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
సానుకూలం
ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఇచ్చిన వినతులపై త్వరలోనే సీఎం తో చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుంటామని డిప్యూటీ సీఎం తెలిపారు. సాధ్యమైనంత త్వరగా పీఆర్సీ నివేదికను తెప్పించుకొని అమలు చేస్తామని ఎలాంటి ఆందోళన చెందాల్సిన పని లేదని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘాలు ఉద్యమ కార్యచరణను విరమించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వంపై ఆర్థిక భారం పడినా ఉద్యోగుల సమస్యలపై ప్రజా ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా త్వరలోనే ముఖ్యమంత్రితో ప్రత్యేకంగా సమావేశమై తీపి కబురు చెప్తానని డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు.
కార్యాచరణపై త్వరలో నిర్ణయం
ఈ సమావేశంపై ఉద్యోగ సంఘాలు సంతృప్తి వ్యక్తం చేశాయి. త్వరలోనే ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు, కాంటిజెంట్ ఉద్యోగులకు ప్రభుత్వం నుంచి తీపి కబురు వస్తుందని ఉద్యోగ సంఘాలు ఆశాభావం వ్యక్తం చేశాయి. ఈనెల 5వ తేదీన చేపట్టనున్న కార్యాచరణపై ఉద్యోగ సంఘాల జేఏసీతోపాటు ఉద్యోగ సంఘాల ప్రతినిధులందరితో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి తెలిపారు. సమావేశానికి ఉద్యోగ సంఘాల జేఏసీ భాగస్వామ్య ఉద్యోగ సంఘాల ప్రతినిధులు రామకృష్ణ, రాములు, బాణాల రాం రెడ్డి, పెంటయ్య, రమేశ్ పాక, డాక్టర్ నిర్మల, ఎండీ హబీబ్ మియా, మహిపాల్ రెడ్డి, దర్శన్ గౌడ్, భిక్షం, ఉపేందర్ రావు, రాబర్ట్ బ్రూస్, డాక్టర్ సైదులు, బుచ్చయ్య, కుమార స్వామి, హబీబ్ మియా, వెంకటేశం, వివేక్, మమత, క్రాంతి కుమార్, రవి, నరేందర్, స్వామి, దేవిక, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
CM Revanth RTC JAC: సీఎం రేవంత్ రెడ్డితో ఆర్టీసీ జేఏసీ మీటింగ్..ఆర్టీసీ విలీనమా? గుర్తింపు సంఘాల ఎన్నికలా?
Hyderabad, Telangana:CM Revanth RTC JAC Meet: తెలంగాణ ఆర్టీసీ జేఏసీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం కానున్నట్లు సమాచారం. అయితే ఇదే సమావేశంలో ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనమా? గుర్తింపు సంఘాల ఎన్నికల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారా? అనేది తేలిపోతుంది.Peddi New Release Date: రామ్చరణ్ 'పెద్ది' సినిమా రిలీజ్ డేట్ వచ్చేసింది! బుచ్చిబాబు అదరగొట్టాడు!
Hyderabad, Telangana:Peddi Movie New Release Date: మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'పెద్ది' సినిమా రిలీజ్ డేట్ వచ్చేసింది. ఇప్పటికే ఈ సినిమా పలుమార్లు వాయిదా పడగా..2026 జూన్ 4న సినిమా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.Fee Reimbursement: రేవంత్ రెడ్డి బీసీ జేఏసీ ఆగ్రహం.. తీవ్ర హెచ్చరిక
Hyderabad, Telangana:Watch BC JAC Leaders Fire On Revanth Reddy A Head Fee Reimbursement Scheme AbolishPending Traffic Challan: పెండింగ్ ట్రాఫిక్ చలాన్లపై తెలంగాణ హైకోర్టు కీలక నిర్ణయం
Hyderabad, Telangana:Pending Traffic Challan: ట్రాఫిక్ పెండింగ్ చలాన్లపై గతంలో ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘించిన తెలంగాణ పోలీసులపై హైకోర్టు తప్పుబట్టింది. స్పష్టమైన ఆదేశాలు ఉన్నా ట్రాఫిక్ పోలీసులు, తెలంగాణ పోలీసులు ఉల్లంఘించారని ఆరోపణలు రావడంతో ఈ అంశం హైకోర్టుకు చేరింది. పిటిషన్లు చేసిన వాదనలను విన్న హైకోర్టు తెలంగాణ ట్రాఫిక్ పోలీసులతోపాటు కొత్త డీజీపీ, పాత డీజీపీలకు నోటీసులు జారీ చేసింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
Also Read: Govt Employees: డిప్యూటీ సీఎంతో భేటీ! తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు నేడే భారీ శుభవార్త?
ట్రాఫిక్ పెండింగ్ చలాన్లు వ్యవహారంపై హైకోర్టు గతంలో కీలక ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. పెండింగ్ చలాన్లు ఉంటే వాహనాలు సీజ్ చేయరాదని జనవరి 20వ తేదీన హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చినా కూడా ట్రాఫిక్ పోలీసులు వాహనాలు సీజ్ చేస్తున్నారు. దీంతో కోర్టు ధిక్కరణ కింద డీజీపీ సీవీ ఆనంద్, మాజీ డీజీపీ శివధర్ రెడ్డి, ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డేవిస్లకు హైకోర్టు నోటీసులు అందించింది.
Also Read: Sanath Nagar TIMS: హైదరాబాద్లో మరో కొత్త నిమ్స్ తరహా ఆస్పత్రి.. ఎక్కడో తెలుసా?
హైకోర్టు తీర్పులకు విరుద్ధంగా ఏప్రిల్ 9వ తేదీన మల్లికార్జున అనే వ్యక్తి బైక్ను పోలీసులు సీజ్ చేశారు. దీంతో కోర్టు ధిక్కరణ పిటిషన్ను అతడు దాఖలు చేశాడు. హోమ్ శాఖ సెక్రటరీ, డీజీపీ, ట్రాఫిక్ అదనపు సీపీ, రవాణా శాఖ కమిషనర్లను పిటిషన్లో ప్రతివాదులుగా చేర్చాడు. పెండింగ్ చలాన్లు ఉంటే వాహనాలు సీజ్ చేయరాదని జనవరి 20న ఇచ్చిన ఉత్తర్వులను ప్రత్యేకంగా పిటిషనర్ ప్రస్తావించారు. కోర్టు ఉత్తర్వులను పోలీసులు ఉల్లంఘించారని పిటిషన్లో స్పష్టంగా పేర్కొన్నారు.
కోర్టు ఉత్తర్వులను ట్రాఫిక్ పోలీసులు పట్టించుకోవడం లేదని న్యాయవాది విజయ్ గోపాల్ ఆరోపించారు. వాహనం ఆర్సీ బుక్ను ఎం వాలెట్లో చూపించినా ట్రాఫిక్ పోలీసులు అంగీకరించడం లేదని న్యాయవాది విజయ్ గోపాల్ వివరించారు. ఈ అంశంపై హైకోర్టు ప్రతివాదులకు నోటిసులు జారీ, కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణ వచ్చే నెల 19వ తేదీకి వాయిదా వేసింది.
డీజీపీ నియామకంపై విచారణ
తెలంగాణ పూర్తిస్థాయి డీజీపీగా సీవీ ఆనంద్ నియామకంపై హైకోర్టులో విచారణ జరిగింది. సీవీ ఆనంద్ను రెగ్యులర్ డీజీపీగా నియమించినట్లు ఏజీ కోర్టుకు వివరించారు. పూర్తి స్థాయి డీజీపీ నియామకం జీఓ ప్రతిని అడ్వకేట్ జనరల్ కోర్టుకు సమర్పించారు. ప్రభుత్వం ఇచ్చిన జీఓని పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు.. డీజీపీగా పనిచేసిన బి శివధర్ రెడ్డి తాత్కాలిక డీజీపీ నియామకం చట్టబద్ధమా కాదా అనే అంశంపై తరువాత నిర్ణయం తీసుకుంటామని హైకోర్టు తెలిపింది. ఈ విషయంలో శివధర్ రెడ్డి తరఫు న్యాయవాది వాదనలు విన్న తరువాతే తుది నిర్ణయం తీసుకుంటామని న్యాయస్థానం పేర్కొంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Fee Reimbursement: ఫీజు రీయింబర్స్మెంట్ రద్దుకు రేవంత్ రెడ్డి కుట్ర: బీసీ జేఏసీ
Hyderabad, Telangana:Students Fee Reimbursement: తెలంగాణ విద్యార్థులతో రేవంత్ రెడ్డి ఆటలాడుకుంటున్నారని బీసీ జేఏసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. పేద, బడుగు బలహీనవర్గాల విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఎందుకు చెల్లించడం లేదని బీసీ జేఏసీ నిలదీసింది. ఫీజు రీయింబర్స్మెంట్ అనేది విద్యార్థుల హక్కు.. ఇది ఎవరి భిక్షం కాదని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి జేబుల నుంచి ఇస్తలేరు. భట్టి విక్రమార్క కష్టపడి చెమటోడ్చిన డబ్బులు కావు' అని బీసీ జేఏసీ నాయకులు తెలిపారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించకపోతే తెలంగాణ రాష్ట్రం అగ్గి అవుతుందని హెచ్చరించారు.
Also Read: Govt Employees: డిప్యూటీ సీఎంతో భేటీ! తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు నేడే భారీ శుభవార్త?
ఫీజు రీయింబర్స్మెంట్ పథకంపై ప్రభుత్వం ఇచ్చిన జీవో నెంబర్ 7ను రద్దు చేయాలని హైదరాబాద్లో బీసీ జేఏసీ సమావేశం నిర్వహించింది. జీవోకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేపట్టాలని విద్యార్థులకు బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన జీవోలను కాలబెట్టి శాంతియుత నిరసనలు తెలుపాలని విజ్ఞప్తి చేశారు. విద్యార్థుల నుండే ఫీజు వసూలు చేసుకోవాలన్న హైకోర్టు తీర్పుకు ప్రభుత్వమే కారణం అని స్పష్టం చేశారు.
Also Read: Education Year: విద్యా సంవత్సరానికి స్కూల్ డ్రెస్సులు, నోటు పుస్తకాలు సకాలంలో అందాలి: తెలంగాణ సీఎం
'ఉన్నత విద్య నుండి బడుగు విద్యార్థులను రేవంత్ రెడ్డి ప్రభుత్వం దూరం చేస్తోంది. విద్యార్థుల ఖాతాల్లోకి ఫీజులు చెల్లిస్తామన్న ప్రభుత్వ నిర్ణయం అవివేకం. ఫీజుల రీయింబర్స్మెంట్ పథకాన్ని నీరుగార్చడానికి జీవో నెంబర్ 7ను ప్రభుత్వం తీసుకువచ్చింది' అని బీసీ జేఏసీ స్పష్టం చేసింది. ప్రభుత్వానికి దమ్ముంటే ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని రద్దు చేస్తామని ప్రకటించాలని రేవంత్ రెడ్డికి సవాల్ చేసింది. ఆనాటి కాంగ్రెస్ ఫీజుల పథకం తెస్తే.. ఈనాటి కాంగ్రెస్ ఆ పథకాన్ని రద్దు చేయాలని చూస్తోందని మండిపడ్డారు. ఫీజు రీయింబర్స్మెంట్పై కాంగ్రెస్ ప్రభుత్వం డొంకతిరుగుడు మాటలు మానుకోవాలని హితవు పలికారు. ఫీజుల బకాయిలు ఇవ్వకపోతే జూన్ నెలలో లక్ష మంది విద్యార్థులతో హైదరాబాద్ను దిగ్భందిస్తామని బీసీ జేఏసీ హెచ్చరించింది. ఫీజు రీయింబర్స్మెంట్పై తాము కోర్టుకు వెళ్తామని బీసీ జేఏసీ ప్రకటించింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Kondagattu: ఎండకాలంలోనూ ఎండని సీతమ్మ బావి నీరు.. కొండగట్టు అంజన్న ఆలయ రహస్యం ఇదే!
Hyderabad, Telangana:Seethamma Bavi Kondagattu Latest News: తెలంగాణలోని అత్యంత మహివాన్మితమైన పుణ్యక్షేత్రాల్లో ఒకటైన కొండగట్టు అంజన్న ఆలయంలో ఒక ప్రత్యేకమైన ఆచారం కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతూ వస్తోంది. సాక్షాత్తు సీతమ్మ తల్లి పేరుతో పిలుచుకునే సీతమ్మ భావించి సేకరించిన పవిత్ర జలాలతోనే స్వామివారికి నిత్యం అభిషేకం నిర్వహించడం ఇక్కడి విశేషం.. ఈ సాంప్రదాయం వెనకున్న ఆసక్తికరమైన విషయాలను ఆలయ అర్చకులు ఇటీవల వెల్లడించారు. అవేంటో? ఈ బావిలో నుంచి తీసిన నీటిని అభిషేకం చేయడానికి గల కారణాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
ఆలయానికి దిగువన.. సుమారు 6 కిలోమీటర్ దూరంలో దట్టమైన పచ్చని చెట్ల మధ్య సహజ సిద్ధంగా ఏర్పడిన భావి సీతమ్మ భావిగా ప్రసిద్ధి చెందింది. ఈ భావి నీరు అత్యంత స్వచ్ఛమైనదిగా.. మధురంగా ఉంటుందని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. నిత్యం ఇద్దరు అర్చకులు తెల్లవారి జామునే ఈ భావి వద్దకు వెళ్లి.. సాంప్రదాయ బద్ధంగా రాగి బిందెలతో నీటిని సేకరించి ఆలయానికి తీసుకు వస్తారు.. స్వామివారికి చేసే అభిషేకం నుంచి భక్తులకు పంచే తీర్థ ప్రసాదాల తయారీ వరకు ఈ పవిత్ర జలాలనే వినియోగిస్తారట..
ఈ బావికి ఉన్న అతిపెద్ద విశేషం ఏంటంటే.. ఎండలు దంచి కొట్టే మండు వేసవిలో కూడా ఇందులో నీరు ఇనికిపోకుండా ఉండడం.. చుట్టుపక్కల ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటి.. సాధారణ బోర్లు ఎండిపోయినప్పటికీ.. ఈ సీతమ్మ బావిలో మాత్రం నీరు ఎప్పుడూ నిండు గానే ఉండటం భక్తులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇది సాక్షాత్తు అంజన్న చల్లని చూపు వల్లే సాధ్యమని.. ప్రకృతి ప్రసాదించిన వరమని స్థానికులు చెబుతూ ఉంటారు..
సుదూర ప్రాంతాల నుంచి వచ్చే యాత్రికులు సైతం ఈ సీతమ్మ భావి ప్రత్యేకత గురించి తెలుసుకొని.. అంజన్నకు జరిపి అభిషేకంలో వాడే జలాల గొప్పతనాన్ని చెప్పుకుంటూ ఉంటారు. కొండగట్టు క్షేత్రం ఆధ్యాత్మికతకు, ప్రకృతి సమతుల్యతకు ఈ భావి ఒక సజీవ నిదర్శనంగా నిలుస్తుందని అర్చకులు చెబుతున్నారు. ఆ జలాల పవిత్రతను అనుభూతి చెందుతూ ఉంటారు. ప్రకృతి సిద్ధంగా లభించే ఈ నీరును తీర్ధంగా ఇవ్వడం వల్ల.. అంజన్న భక్తులకు ఒక అద్భుతమైన భక్తి అనుభూతిని నింపుతుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Sircilla: దేశమే గర్వించేలా.. సిరిసిల్ల వెంకటపల్లి సత్తా.. జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపు!
Hyderabad, Telangana:Sircilla News: గ్రామీణ స్థానిక సంస్థల పనితీరును సమగ్రంగా అంచనా వేస్తూ.. కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన పంచాయతీ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్ 2.0 (2023-24) నివేదికలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అత్యుత్తమ ప్రదర్శనతో అగ్రస్థానంలో నిలిచింది. రాష్ట్రం మొత్తం 86.41.లతో నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకోగా.. అందులో రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలంలోని వెంకటపల్లి గ్రామం తన ప్రతిభతో జాతీయస్థాయిలో ప్రత్యేకమైన గుర్తింపు పొందింది.. అయితే, ఈ గుర్తింపు ఏంటో, ఆ ఊరికి దక్కిన గౌరవం ఏంటో దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
గ్రామీణ అభివృద్ధితో పాటు సామాజిక న్యాయం, ప్రజాస్వామ్యం వంటి కీలక అంశాల్లో వెంకటపల్లి అద్భుతమైన ప్రగతిని కనబరిచింది. కేంద్రం నిర్దేశించిన కఠినమైన ప్రమాణాలను సమర్ధవంతంగా అమలు చేస్తూ.. రెండు ప్రధాన విభాగాల్లో అత్యుత్తమ గ్రేడ్లను కైవసం చేసుకుంది.. చైల్డ్ ఫ్రెండ్లీ పంచాయతీ విభాగంలో 96.67 స్కోర్ సాధించి.. ఏ ప్లస్ గ్రేడ్ ని దక్కించుకోగా.. సోషల్ జస్టిస్ విభాగంలో 88.82 స్కూలుతో ఏ గ్రేడును సొంతం చేసుకుంది.. అంతేకాకుండా వివిధ విభాగాల్లో కూడా అద్భుతమైన స్కోర్లను సాధించినట్లు తెలుస్తోంది.
ఒక చిన్న గ్రామం జాతీయస్థాయిలో ఇలాంటి ఘనత సాధించడం వెనక స్థానిక పాలన యంత్రాంగం తో పాటు ప్రజాప్రతినిధులు, గ్రామస్తుల సమిష్టి కృషి దాగి ఉంది. పాఠశాలల్లో మౌలిక వసతులతో పాటు పిల్లల హక్కుల పరిరక్షణ, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన వంటి చర్యల వల్ల చైల్డ్ ఫ్రెండ్లీ విభాగంలో వెంకటపల్లికి అత్యుత్తమ గుర్తింపు లభించింది. అదేవిధంగా సమాజంలోని అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించడంతోపాటు సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు పారదర్శకంగా చేరవేయడంలో గ్రామపంచాయతీ చూపిన చొరవ సోషల్ జస్టిస్ విభాగంలో అద్భుతమైన ఫలితాలను అందించింది..
కేంద్ర ప్రభుత్వ నివేదికలో వెంకటపల్లి పేరు ప్రముఖంగా కనిపించడంతో జిల్లా వ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.. గ్రామ అభివృద్ధిలో ఇది ఒక మైలురాయని.. రాబోయే రోజుల్లో మరిన్ని విభాగాల్లోనూ ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తామని గ్రామ పాలకవర్గం ఆశాభావం వ్యక్తం చేస్తోంది. దేశానికి ఆదర్శంగా నిలిచిన వెంకటపల్లి, మిగతా గ్రామాలకు కూడా స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. తెలంగాణ రాష్ట్రం సాధించిన ఈ అరుదైన విజయంలో సిరిసిల్ల జిల్లాకు చెందిన ఈ గ్రామం కీలక పాత్ర పోషించడం విశేషం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
GT Vs RCB Catch: బంతి నేలను తాకినా అంపైర్ ఎందుకు ఔట్ ఇచ్చాడో తెలుసా! ఆర్సీబీ అభిమానుల మండిపాటు!
Hyderabad, Telangana:GT Vs RCB Catch Controversy: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో గురువారం అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), గుజరాత్ టైటాన్స్ (GT) తలపడ్డాయి. ఈ మ్యాచ్లో ఆతిథ్య గుజరాత్ టైటాన్స్ జట్టు గెలుపొందగా.. తొలిసారి బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటిదార్ క్యాచ్ పెద్ద చర్చకు దారితీసింది. ఈ విషయంలో అంపైర్తో విరాట్ కోహ్లీ వాగ్వాదం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
ఈ సంఘటన ఆర్సిబి ఇన్నింగ్స్లోని 8వ ఓవర్లో జరిగింది. అర్షద్ ఖాన్ వేసిన బంతిని రజత్ పాటిదార్ డీప్ బ్యాక్వర్డ్ స్క్వేర్ వైపు కొట్టాడు. అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న జాసన్ హోల్డర్, దాన్ని పట్టుకోవడానికి పరుగెత్తి స్లైడ్ చేశాడు. అయితే, హోల్డర్ పట్టుకున్న బంతిని వెంటనే నేలపై తాకింది. ఆన్-ఫీల్డ్ అంపైర్ సాఫ్ట్ సిగ్నల్ నియమం ఇప్పుడు అమలులో లేనప్పటికీ, థర్డ్ అంపైర్ కూడా దానిని 'అవుట్'గా ప్రకటించడం ఇప్పుడు వివాదానికి దారితీసింది.
ఐసీసీ 33.3 రూల్ ఏమి చెబుతుంది?
క్రికెట్ లా 33.3 ప్రకారం, ఒక ఫీల్డర్ బంతిపై మాత్రమే కాకుండా తన కదలికలపై కూడా పూర్తి నియంత్రణ కలిగి ఉండాలి. ఫీల్డర్ బంతిని పట్టుకున్న తర్వాత జారుతున్నప్పుడు లేదా కింద పడుతున్నప్పుడు బంతి నేలను తాకితే, అది చట్టబద్ధమైన క్యాచ్గా పరిగణించరు.
గతంలో యాషెస్ సిరీస్లో మిచెల్ స్టార్క్ ఇలాంటి క్యాచ్ పట్టినప్పుడు, దానిని 'నాటౌట్'గా ప్రకటించారు. ఆ సంఘటనను ప్రస్తావించిన ఇర్ఫాన్ పఠాన్, ఆకాష్ చోప్రా వంటి మాజీ క్రికెటర్లు అంపైర్ నిర్ణయం పట్ల తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు.
అంపైర్కు అశ్విన్ సపోర్ట్..
అయితే, టీవీ అంపైర్ భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. క్యాచ్ పట్టిన వెంటనే బంతి తన నియంత్రణలోకి వచ్చిందని, క్యాచ్ పూర్తయిన తర్వాతే స్లైడింగ్ జరిగిందని చెబుతూ జాసన్ హోల్డర్ తన నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. దీనికి స్పందిస్తూ రవిచంద్రన్ అశ్విన్, హోల్డర్ చేతులు పెద్దవిగా ఉన్నాయని, బంతి అతని చేతుల్లో పూర్తిగా ఇమిడిపోయిందని అన్నారు. అతని వేళ్ల మధ్య గడ్డి ఉన్నంత మాత్రాన బంతి నేలను తాకినట్లు కాదని ఆయన పేర్కొన్నారు.
మొత్తానికి గుజరాత్ టైటాన్స్ మ్యాచ్లో 4 వికెట్ల తేడాతో గెలిచినా.. జేసన్ హోల్డర్కు ఇందులో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వచ్చినా.. ఐపీఎల్ చరిత్రలో ఇదో మాయని మచ్చగా మిగిలిపోయే అవకాశం ఉంది. అలాగే, ఈ సంఘటనతో ఆర్సీబీ అభిమానులు మనస్తాపం చెందారన్నది కూడా నిజం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Govt Employees: డిప్యూటీ సీఎంతో భేటీ! తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు నేడే భారీ శుభవార్త?
Hyderabad, Telangana:Telangana Pay Revision Committee: వేతన సవరణ సంఘం కోసం తీవ్ర ఎదురుచూపులు చూస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్దారులకు నేడు తెలంగాణ ప్రభుత్వం భారీ శుభవార్త అందించే అవకాశం ఉంది. వేతన సవరణ సంఘంపై కీలక ముందడుగు పడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. పీఆర్సీతోపాటు భారీగా పెండింగ్ ఉన్న డీఏ, రిటైర్మెంట్ బెనిఫిట్స్పై కదలిక వస్తుందని ప్రభుత్వ ఉద్యోగ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వంతో ఉద్యోగ సంఘాల చర్చల విశేషాలు ఇలా ఉన్నాయి.
Also Read: Sanath Nagar TIMS: హైదరాబాద్లో మరో కొత్త నిమ్స్ తరహా ఆస్పత్రి.. ఎక్కడో తెలుసా?
ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సమస్యలపై నేడు హైదరాబాద్లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సమావేశం కానున్నారు. ఉద్యోగ సంఘాల నేతలతో డిప్యూటీ సీఎం చర్చించనున్నారు. అయితే ఈ సమావేశానికి ఉద్యోగ సంఘాలన్నింటినీ కాకుండా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లోని 9 శాశ్వత సంఘాల నాయకులను మాత్రమే ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో టీఎన్జీవో, టీజీవో, సెక్రటేరియట్ అసోసియేషన్ (టీజీఎస్ఏ), పీఆర్టీయూ టీఎస్, ఎస్టీయూ టీఎస్, ట్రెస్మా, క్లాస్ 4 ఎంప్లాయీస్ సెంట్రల్ అసోసియేషన్, టీఎస్ యూటీఎఫ్, టీఆర్టీఎఫ్ ప్రతినిధులు హాజరు కానున్నారు.
Also Read: Liver Transplant: గాంధీ దవాఖానాలో 18 నెలల బాలుడికి లివర్ మార్పిడి.. అన్నీ ఉచితంగా
ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం.. హక్కుగా రావాల్సిన డీఏ, రిటైర్మెంట్ బెనిఫిట్స్, పీఆర్సీ తదితర అపరిష్కృతంగా ఉన్నాయి. ఉద్యోగుల డిమాండ్లు, సమస్యలు పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తుండడంతో ఉద్యోగ సంఘాలు పోరాటానికి సిద్ధమైన విషయం తెలిసిందే. ఇప్పటికే పలు దశల్లో ప్రభుత్వానికి తమ ఆక్రోశాన్ని.. నిరసనల ద్వారా తెలిపారు. తమ డిమాండ్ల పరిష్కారానికి దశల వారీగా నిరసన కార్యక్రమాలకు ఉద్యోగుల జేఏసీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా కొన్ని వారాల కిందట కలెక్టరేట్, సెక్రటేరియట్లో నిరసన ర్యాలీలు చేసిన సంగతి తెలిసిందే. మే 5వ తేదీన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ సంఘాలు నిరాహార దీక్షలు ప్రారంభించనున్నాయి. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించింది. ఈ క్రమంలోనే ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం సమావేశం కానుంది. ఆయా సమస్యలపై చర్చించాలని డిప్యూటీ సీఎం నిర్ణయించినట్లు తెలుస్తోంది.
Also Read: AP Rains: మండే ఎండల వేళ ఆంధ్రప్రదేశ్కు చల్లటి కబురు.. రేపు ఈ జిల్లాల్లో వర్షాలు
ప్రభుత్వ ఉద్యోగులకు మొత్తం 64 డిమాండ్లు ఉన్నాయి. వాటిలో ప్రధానమైనది కొత్త వేతన సవరణ సంఘం (పీఆర్సీ). పీఆర్సీ నివేదిక తెప్పించుకొని అమలు చేయాలని ఉద్యోగ సంఘాల నాయకులు సమావేశంలో ప్రధానంగా డిమాండ్ లేవనెత్తనున్నారు. వాస్తవంగా కొత్త పీఆర్సీ 2023 జూలై 1వ తేదీ నుంచి అమలు కావాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు నివేదిక రాలేదు. దీనికితోడు రిటైర్మెంట్ పొందిన విశ్రాంత ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనాలను (బెనిఫిట్స్) దాదాపు రూ.10 వేల కోట్లు పెండింగ్లో ఉన్నాయి. వాటిని చెల్లించాలని, సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ఉద్యోగ సంఘాలు ప్రధానంగా చేస్తున్న డిమాండ్లు. వాటిని డిప్యూటీ సీఎంతో జరిగే సమావేశంలో ప్రధానంగా ప్రస్తావిస్తామని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. ఈసారి స్పష్టమైన హామీ.. నిర్ణయంతోనే వస్తామని ఉద్యోగ సంఘాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఉద్యోగ సంఘాల ఆందోళనలు, నిరసనల నేపథ్యంలో ప్రభుత్వం నేడు ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Lakshmi Narayana Rajayoga: లక్ష్మీ నారాయణ రాజయోగంతో ఈ రాశుల వారి లైఫ్ మారిపోబోతోంది.. అపార సంపద మీ సొంతం!
Hyderabad, Telangana:Lakshmi Narayana Rajayoga May 2026: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మే నెల ఎంతో ప్రత్యేకమైనది. గ్రహగమనంలో వచ్చే మార్పుల వల్ల ఈ నెలలో అత్యంత శుభప్రదమైన లక్ష్మీనారాయణ రాజయోగం ఏర్పడుతోంది. ముఖ్యంగా శుభగ్రహాలైన బుధుడితో పాటు శుక్రుడు ఒకే రాశిలో కలయిక జరగడం కారణంగానే ఈ శక్తివంతమైన అరుదైన రాజయోగం ఏర్పడుతుంది. అయితే, ఈ రాజయోగ ప్రభావం జాతకంలో గ్రహ స్థితులను బట్టి ఫలితాలను అందించబోతోంది. లక్ష్మీనారాయణ రాజయోగం జాతకంలో శుభస్థానంలో ఉన్న రాశుల వారికి అపారమైన సంపద కలగడమే కాకుండా కెరీర్లో అద్భుతమైన పురోగతి, కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. దీంతోపాటు ఆర్థికంగా కృంగిపోయిన వారికి అనేక సమస్యల నుంచి పరిష్కారం దొరుకుతుంది.
సాధారణంగా బుధుడిని తెలివితేటలతో పాటు వాక్చాతుర్యానికి కారకుడిగా భావిస్తూ ఉంటారు.. ఇక శుక్రుడిని భోగభాగ్యాలతో పాటు వైభోగానికి అధిపతిగా చెప్పుకుంటారు. వీరి కలయిక కారణంగా కొన్ని రాశుల వారికి వ్యక్తిగత జీవితాల్లో అద్భుతమైన సుఖసంతోషాలు పెరగడమే కాకుండా వ్యాపార రంగాల్లో ఉన్నవారికి లాభాలు కలుగుతూ ఉంటాయి. ఉద్యోగాలు చేసే వారికి పదోన్నతులు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ యోగం కారణంగా క్రింది రాశుల వారికి దిమ్మతిరిగే ధన లాభాలు కలుగుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు.
ఈ రాశులవారికి ఊహించని ధన లాభాలు:
వృషభ రాశి
లక్ష్మీనారాయణ రాజయోగం కారణంగా వృషభ రాశి వారికి ఆకస్మాత్తుగా ధను లాభాలు కలిగే అవకాశాలున్నాయి. నిలిచిపోయిన పనులు పూర్తవుడమే కాకుండా.. కెరీర్ పరంగా అద్భుతమైన నిర్ణయాలు తీసుకుంటారు. ముఖ్యంగా జీవితంలో సానుకూలమైన లాభాలు రావడం ప్రారంభమవుతాయి. ఎప్పటినుంచో దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకు ఈ సమయం చాలా అద్భుతమైన అవకాశాలను అందిస్తుంది.
సింహరాశి
సింహరాశిలో జన్మించిన వ్యక్తులకు కూడా వ్యాపారాలపరంగా భారీ లాభాలు రావడం ప్రారంభమవుతాయి. వీరికి సమాజంలో అద్భుతమైన గౌరవం పెరగడమే కాకుండా కొత్త పెట్టుబడుల నుంచి బోలేడు ప్రయోజనాలు కలుగుతాయి. తీవ్ర అనారోగ్య సమస్యలతో ఉన్న వ్యక్తులకు కాస్త పరిష్కారం కూడా దొరుకుతుంది. అంతేకాకుండా ఆర్థికంగా దిమ్మ తిరిగే ధన లాభాలు కలుగుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు.
మకర రాశి
మకర రాశిలో జన్మించిన వ్యక్తులకు కుటుంబంలో సంతోషకరమైన వాతావరణము నెలకొంటుంది. ముఖ్యంగా వీరు అనుకున్న పనులు ఎంతో సులభంగా చేయగలుగుతారు. దీర్ఘకాలిక సమస్యల నుంచి ఎంతో సులభంగా పరిష్కారం దొరుకుతుంది. అంతేకాకుండా విదేశీ ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. తీవ్ర సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకు పరిష్కారం కూడా దొరకబోతోంది.
కుంభరాశి
కుంభరాశిలో జన్మించిన వ్యక్తులకు మే నెల చాలా అద్భుతంగా ఉండబోతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులందరికీ ఈ సమయంలో చక్కటి పరిష్కారం ఉండబోతోంది. ముఖ్యంగా పోటీ పరీక్షలు రాసే ప్రతి విద్యార్థికి విశేషమైన ఫలితాలు కలుగుతాయి. అంతేకాకుండా ఉద్యోగాలు చేస్తున్న వ్యక్తులకు ఈ సమయం గోల్డెన్ జాక్పాట్ కొట్టబోతున్నారు. అలాగే అన్ని రకాల సమస్యలు ఎంతో సులభంగా తొలగిపోబోతున్నాయి..
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Hyderabad: ముగ్గురితో ఎఫైర్.. భార్య ప్రైవేట్ వీడియోలు నెట్టింట వైరల్, తట్టుకోలేక హుస్సేన్ సాగర్లో దూకి టెకీ బలవన్మరణం!
Hyderabad, Telangana:Wife's Private Videos with 3 Men Techie Suicide: అక్రమ సంబంధాలు కుటుంబాలను విచ్ఛిన్నం చేయడమే కాకుండా.. పిల్లలను కూడా అనాథలుగా మారుస్తున్నాయి. ఒకరి ప్రాణాలు తీయడం.. లేక వాళ్ళు సూసైడ్ చేసుకునే పరిస్థితులకు దారితీస్తున్నాయి. హైదరాబాదులోని ఇలాంటి దారుణ ఘటన మరొకటి వెలుగులోకి వచ్చింది. తన భార్య ఆగడాలను చూడలేక హుస్సేన్ సాగర్లోకి దూకి ఓ టెకీ ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల ప్రకారం.. ఏపీలోని మార్కాపురం చెందిన సీతారాం (36),నంద్యాలకు చెందిన రేణుకతో 2018లో వివాహం జరిగింది. అయితే ప్రస్తుతం వీరికి ఏడు, ఐదేళ్ల వయస్సున్న ఇద్దరు మగ పిల్లలు కూడా ఉన్నారు . సీతారాం సాఫ్ట్వేర్ ఇంజినీర్ గా పనిచేస్తూ నెలకు రూ.2 లక్షల జీతం కూడా సంపాదిస్తున్నారు. వీరి కుటుంబం హాయిగా ఆనందంగా బాచుపల్లిలో స్థిరపడిపోయింది. అయితే భార్య రేణుక మాత్రం అక్రమ సంబంధాలు పెట్టుకుంటూ ప్రైవేటు వీడియోలు కూడా తీసుకుంది. ఏడాదిన్నరలోనే ముగ్గురితో అక్రమ సంబంధం పెట్టుకుంది. అయితే, రమణారెడ్డి అనే వ్యక్తి రేణుకతో ప్రైవేటుగా ఉన్న వీడియోలను తీశాడు. దాన్ని ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయడంతో సీతారాం కంటపడింది. దీంతో ఆయన తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. సోషల్ మీడియాలో తన భార్య వీడియో వైరల్ అయింది. దీంతో తన భార్య నిజస్వరూపం బయటపడింది. తన భార్య రేణుకతోపాటు మరో ఐదుగురు పేర్లు చెబుతూ వాట్సాప్ స్టేటస్ కూడా పెట్టాడు సీతారాం.
అయితే ఫిబ్రవరిలోనే ఈ ఘటన జరిగిందని బాచుపల్లి సబ్ ఇన్స్పెక్టర్ హరీష్ వెల్లడించారు. అతని తండ్రి చూసి వెంటనే హుస్సేన్ సాగర్ కి పరిగెత్తి పోలీసులను కూడా సంప్రదించారు. ఇక మృతదేహాన్ని బయటికి తీశారు లేక్ పోలీసులు. వెంటనే జీరో ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. బాచుపల్లి పోలీస్ స్టేషన్ కి బదిలీ చేశారు. తీవ్రమనోవేధనతోనే తన కొడుకు సీతారాం సూసైడ్ చేసుకున్నాడని మృతుడి తండ్రి.. కోడలు, రమణారెడ్డి, కిషోర్, శ్రవణ్ అనే వ్యక్తుల పేర్లతో కేసు పెట్టాడు. రేణుక రమణారెడ్డి తో ఉన్న ప్రైవేటు వీడియోను నా కొడుకుకి పంపించింది. దీంతో మానసిక క్షోభతో కొడుకు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపాడు. ఏప్రిల్ 21న బాచుపల్లి పోలీసులు రేణుక రమణ పై సెక్షన్ 108 ప్రకారం అరెస్టు చేశారు. ఇద్దరిని జ్యూడిషియల్ రిమాండ్ కూడా పంపారు. అయితే కేసు ఇంకా లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
19 పేజీల సుదీర్ఘ సూసైడ్ రాసి మరి సీతారాం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎంతో ఆనందంగా చూసుకుంటున్న తన భార్యకు అసలు ఏం కావాలి? ఆమె ఏం కోరుకుంటుంది? అని తాను తట్టుకోలేకపోయాడు. అసలు రేణుకకు ఏం కావాలి? ప్రేమనా? లేక శృంగారమా? నా భార్యకు ఏ లోటు రాకుండా చూసుకున్నా కానీ ఆమె నాకు నమ్మకద్రోహం చేసిందంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. సూసైడ్ నోట్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఇక భార్య చేసిన మోసానికి భర్త ప్రాణాలు కోల్పోగా.. ఇద్దరు పిల్లలు అనాథలుగా మిగిలిపోయారు.
READ ALSO: కర్నూల్ జిలాల్లో ఘోర ప్రమాదం.. 8 మంది దుర్మరణం, 15 మందికి తీవ్రగాయాలు..!
READ ALSO: ప్రేమోన్మాది వేంకటేశ్పై పోలీసులు కాల్పులు.. ఇద్దరు కానిస్టేబుల్స్పై దాడిచేసి తప్పిచుకునే యత్నం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Education Year: విద్యా సంవత్సరానికి స్కూల్ డ్రెస్సులు, నోటు పుస్తకాలు సకాలంలో అందాలి: తెలంగాణ సీఎం
Hyderabad, Telangana:Academic Year 2026-27: రాబోయే విద్యా సంవత్సరంపై తెలంగాణ ముఖ్యమంత్రి సమీక్ష చేసి విద్యా శాఖ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. స్కూల్ డ్రెస్సులు, నోటు పుస్తకాలు తదితర అన్నీ ఏర్పాట్లు స్కూళ్ల ప్రారంభానికి ముందే సిద్ధం కావాలని ఆదేశించారు. విద్యాశాఖలో అవకతవకలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చేందుకు ప్రయత్నం చేస్తున్నామని ముఖ్యమంత్రి వివరించారు.
Also Read: Ambati Rambabu: వైఎస్సార్ సమాధి వేదికగా అంబటి రాంబాబు సంచలన శపథం
హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని తన నివాసంలో ముఖ్యమంత్రి విద్యా శాఖపై సమీక్ష చేశారు. విద్యా శాఖతోపాటు బీసీ, మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల పరిధిలోని విద్యా సంస్థల్లో రానున్న విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు అందజేసే సామగ్రి సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్పై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించి సమీక్షించారు. ఈ సందర్భంగా విద్యా శాఖ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. 'విద్యార్థులకు అవసరమైన విద్యా సామగ్రి సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలి. దుస్తులు, నోటు పుస్తకాలు, ఇతర సామగ్రి సకాలంలో అందిస్తే విద్యార్థులు చదువుపై పూర్తిస్థాయిలో శ్రద్ధ చూపుతారు' అని సీఎం పేర్కొన్నారు.
గతంలో ఏ శాఖకు ఆ శాఖ విడిగా ప్రొక్యూర్మెంట్, సరఫరా చేయడంతో ఏకరూపత లోపించడం, అనేక అక్రమాలు చోటుచేసుకునేవి. వాటిని అరికట్టేందుకు కేంద్రీకృత కొనుగోలు విధానాన్ని అమలులోకి తెచ్చాం. అవకతవకలు ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదు. సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ విధానంతో జవాబుదారీతనం పెరుగుతుంది' అని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వం విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చేందుకు ప్రయత్నం చేస్తోందని.. సరఫరాదారుల ప్రయోజనాలు కాపాడేందుకు కాదని స్పష్టం చేశారు.
'విద్యార్థులకు అందజేసే నోటు పుస్తకాలు, ట్రంక్ పెట్టెలు, ప్లేట్లు, గ్లాసులు, ట్రాక్ సూట్లు, బెడ్ షీట్లు, స్కూల్ బ్యాగులు, ఐడీ కార్డులు, యూనిఫాంలు అన్నీ నాణ్యమైనవి ఉండాలి. నాణ్యతతో పాటు సకాలంలో అందడంపైన ప్రత్యేక శ్రద్ధ వహించాలి' అని అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశించారు. జూన్ 15 నాటికి విద్యార్థులకు అవసరమైన సామగ్రి మొత్తం అందాలని.. అలా అందగానే సరఫరాదారులకు చెల్లింపులు పూర్తి చేయాలని సూచించారు.
'విద్యార్థులకు అందించే వస్తువులకు సంబంధిత మండల స్థాయిలో ఒక నోడల్ అధికారిని నియమించాలి. అక్కడి నుంచి క్షేత్ర స్థాయిలో గ్రామాల్లోని పాఠశాలలు, హాస్టళ్లకు వస్తువులు పంపిణీ జరిగేలా చర్యలు చేపట్టాలి. పంపిణీకి సంబంధించి ఎప్పటికప్పుడు ఫొటోలు, వీడియోలు తీయించాలి. ప్రతి విద్యార్థికి వారికి అవసరమైన సామగ్రి అంతా అందిందా లేదా అనే దానిని తనిఖీ చేసుకోవాలి' అని ముఖ్యమంత్రి తెలిపారు. నోటు పుస్తకాలు, యూనిఫాం, ఇతర సామగ్రి నాణ్యత, వాటిని అందుకున్న తర్వాత వారి భావాలను తెలియజేసేందుకు విద్యార్థుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవాలని విద్యా శాఖ అధికారులకు సీఎం సూచించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, విద్యా శాఖల మధ్య సమన్వయానికి ఒక కమిటీని నియమించాలని చెప్పారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
