సాయుధ పోరాటానికి మతం రంగు పులుముతున్న బీజేపీ
Bellampalle, Kannal Rural, Telangana:తెలంగాణ రైతాంగం జరిపిన సాయుధ పోరాటాన్ని బీజేపీ వక్రీకరించి మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి వాడుకుంటుందని ఏఐటీయూసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య అన్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో ఆదివారం మాట్లాడుతూ కమ్యూనిస్టుల నాయకత్వంలో జరిగిన ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పోరాటం రైతాంగ సాయుధ పోరాటం అన్నారు. పోరాటంలో 4,300 మంది అమరులు అయ్యారని తెలిపారు. పోరాటంతో సంబంధం లేని శక్తులు ఈ పోరాటానికి మతం రంగు పులిమి ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నాయని పేర్కొన్నారు.हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
Jagtial: జగిత్యాలలో ఇందిరమ్మ లబ్ధిదారులకు అవమానం? తిండి దగ్గర ఆంక్షలు..
Hyderabad, Telangana:Jagtial Ministers Meeting: పేదలకు ఆసరాగా నిలవాల్సిన ప్రభుత్వం... వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తోందన్న విమర్శలు ఊహించని స్థాయిలో వస్తున్నాయి. జగిత్యాల జిల్లా కేంద్రంలో మంత్రుల పర్యటన సందర్భంగా.. స్థానిక నూకపల్లి డబుల్ బెడ్రూం కాలనీలో చోటుచేసుకున్న ఘటన తీవ్ర దుమారానికి దారి తీసేలా చేస్తోంది.. మంత్రుల సభకు జనాన్ని సమీకరించేందుకు మున్సిపల్ యంత్రాంగం అనుసరించిన తీరు లబ్ధిదారులను తీవ్ర మనస్తాపానికి గురిచేసింది.
మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు అడ్లూరి లక్ష్మణ్ కుమార్లతో పాటు స్థానిక MLA డా. సంజయ్ కుమార్తో పాటు మేడిపల్లి సత్యంలు హాజరవుతున్న ఇందిరమ్మ లబ్ధిదారుల ముఖాముఖి కార్యక్రమానికి రావాల్సిందిగా అధికారులు కాలనీవాసులను ఆహ్వానించారట.. అయితే, అక్కడికి చేరుకున్న మున్సిపల్ సిబ్బంది ఒక్కో ఇంటికి ఒకే ఒక్క భోజన టోకెన్ ఇస్తూ.. వివిధ షరతులు విధించడంతో స్థానికులను ఆశ్చర్యానికి గురయ్యారట.. ఇంట్లో నలుగురైదుగురం ఉంటే.. ఒక్కరికే తిండి పెడతారా? మిగతా కుటుంబ సభ్యులు ఏం కావాలి?.. అంటూ నిరుపేద మహిళలు అధికారులను నిలదీసే ప్రయత్నం కూడా చేశారట.. కడుపు నింపే తిండి వద్ద కూడా ఇలాంటి లెక్కలు వేయడం పేదలను తీవ్రంగా అవమానించడమేనని.. స్థానికులు మండిపడుతున్నారు.
సభ ప్రాంగణానికి తరలిరావాలని ఒత్తిడి చేసిన అధికారులు.. కాలనీ నుంచి అక్కడికి చేరుకోవడానికి కనీస రవాణా సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేయకపోవడం గమనార్హం.. నూకపల్లి కాలనీ నుంచి ప్రధాన పట్టణానికి చేరుకోవడానికి ఆటోలతో పాటు బస్సు సౌకర్యాలు లేక వృద్ధులు, మహిళలు, చంటిపిల్లల తల్లులు తీవ్ర ఇబ్బందులు పడ్డట్లు కూడా తెలుస్తోంది.. సభలకు జనాన్ని తరలించుకోవడానికే మేం పనికొస్తామా? మా కనీస సమస్యలు.. ప్రయాణ అవసరాలు మీకు పట్టవా? అంటూ.. ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Eshwar Sai: బాసింగా బాసింగా సాంగ్ ఫేమ్ ఈశ్వర్సాయి రాసలీలలు.. రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న
ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం కాస్తా.. అధికారుల నిర్లక్ష్యంతో పాటు అధికారుల నిబంధనల వల్ల తీవ్ర వివాదాలకు కేంద్రంగా మారింది.. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పక్షపాతి అని మంత్రులు పదేపదే చెబుతున్న సమయంలో.. క్షేత్రస్థాయిలో భోజనం విషయంలో సైతం ఆంక్షలు విధించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నట్లు తెలుస్తోంది.. ప్రజాప్రతినిధులు ఇప్పటికైనా స్పందించి.. ఇలాంటి అస్తవ్యస్త ఏర్పాట్లకు కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Also Read: Eshwar Sai: బాసింగా బాసింగా సాంగ్ ఫేమ్ ఈశ్వర్సాయి రాసలీలలు.. రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Cobra Video: వామ్మె.. పొలంలో ట్రాక్టర్కు అడ్డంగా భారీ కింగ్ కోబ్రా.. వీడియో ఇదే..
Hyderabad, Telangana:Massive King Cobra Video: పొలాల్లో వ్యవసాయ పనులు చేసుకునే రైతులకు అప్పుడప్పుడు అత్యంత ప్రమాదకరమైన పాములు కనిపించడం చాలా సాధారణం.. అయితే, ఒక్కోసారి ఊహించని విధంగా భారీ సైజులో ఉండే విష సర్పాలు ఎదురై రైతులను భయాందోళనకు గురి చేస్తూ ఉంటాయి.. తాజాగా సోషల్ మీడియాలో నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేస్తున్న ఒక వీడియో ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఒక భారీ నాగుపాము ట్రాక్టర్ అడ్డంగా నిలబడి పడగ విప్పడం, ఆ తర్వాత జరిగిన పరిణామాలు నెటిజన్లను తీవ్ర ఆశ్చర్యానికి గురి చేసేలా చేస్తున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసకుందాం..
వైరల్ అవుతున్న వీడియోలో ఒక వ్యవసాయ భూమిలో పనులు జరుగుతుండడం మీరు గమనించవచ్చు. ఓ రైతు తన ట్రాక్టర్ను నడుపుకుంటూ ముందుకు వెళ్లడం మీరు గమనించవచ్చు. అంతేకాకుండా అంతా మామూలుగానే సాగుతున్న ఆ సమయంలో.. భారీ కోబ్రా ఆ ట్రాక్టర్ చక్రాల ముందుకు రావడం మీరు ఈ వీడియోలో క్లియర్గా చూడొచ్చు.. ప్రమాదాన్ని పసిగట్టిన ట్రాక్టర్ డ్రైవర్ అద్భుతమైన టైమింగ్తో బ్రేకులు వేయడం కూడా మీరు చూడొచ్చు..ఈ సమయంలో ఏమాత్రం ముందుకు వెళ్లినా ఆ పాము ట్రాక్టర్ టైరు కింద నలిగిపోయి ఉండేది..
అంతేకాకుండా ఈ వీడియోలో ఆ పాము టైరు ముందు నిలబడి బుసలు కొడుతూ పడగ విప్పిన దృశ్యం చూస్తుంటే ఎవరికైనా భయం కలగక తప్పదు.. ఈ పరిస్థితిని చూసిన వారు వెంటనే స్నేక్ క్యాచర్ సమాచారం అందించిన్నట్లు తెలుస్తోంది. ఈ వీడియోను కోబ్రా రెప్టైల్స్ (Cobra Reptiles) అనే యూట్యూబ్ ఛానెల్కి వారు వీడియోగా చిత్రీకరించి పోస్ట్ చేసిన్నట్లు తెలుస్తోంది.. అయితే, ఈ వీడియోలో ఆ నాగుపామును పట్టుకునేందుకు.. ఒకరు ఎలాంటి పరికరాలు ఉపయోగించకుండా.. కేవలం ఒక సాధారణ ప్లాస్టిక్ పీవీసీ పైపును చేతుల్లో పట్టుకుని అత్యంత సులభంగా ఆ పామును అందులోకి పంపే ప్రయత్నం చేశారు.
Also Read: Viral Pic: ఇదేం క్రియేటివిటీ రా బాబు.. మూత్రం పోస్తూ ప్రీ వెడ్డింగ్ ఫోటో స్టిల్స్..
పాము వెనుక భాగాన్ని నెమ్మదిగా చేత్తో పట్టుకుని.. దాని తల భాగాన్ని ఆ పైపులోకి దూర్చాడం మీరు ఈ వీడియోలో చూడొచ్చు.. ఏమాత్రం భయం లేకుండా.. ఎంతో నైపుణ్యంతో ఆ స్నేక్ క్యాచర్ పామును సురక్షితంగా రక్షించిన తీరు అందరినీ ఆశ్చర్యపోయేలా చేస్తోంది..సాధారణంగా ఇలాంటి పాములను చూసినప్పుడు భయంతో రైతులు పాములను కొట్టి చంపుతూ ఉంటారు. అయితే, ఇక్కడ మాత్రం ట్రాక్టర్ డ్రైవర్ సమయస్ఫూర్తి.. స్నేక్ క్యాచర్ ఎక్పీరియన్స్ మూగ జీవి ప్రాణాలను కాపాడాయి. ప్రస్తుతం ఈ యూట్యూబ్ షార్ట్ వీడియో సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో విపరీతంగా వైరల్గా మారింది. చాలా మంది ఈ వీడియో చూసిన కామెంట్లు కూడా పెడుతున్నారు.
Also Read: Viral Pic: ఇదేం క్రియేటివిటీ రా బాబు.. మూత్రం పోస్తూ ప్రీ వెడ్డింగ్ ఫోటో స్టిల్స్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Telangana BJP: రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దులో రాజకీయ కోణం లేదు: బీజేపీ
Baddipadaga, Telangana:Revanth Reddy US Tour Cancel: అమెరికా పర్యటనకు వెళ్లాల్సిన రేవంత్ రెడ్డి టూర్ను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడంతో తెలంగాణ తీవ్ర రాజకీయ వివాదం నెలకొంది. అతడి అమెరికా పర్యటన రద్దు విషయమై కాంగ్రెస్, బీజేపీ మధ్య విమర్శలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు వివరణ ఇచ్చారు. రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దు కావడం.. వారితోపాటు వెళ్లేవారికి పనులు చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని వెల్లడించారు.
హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణ డాక్టర్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో భారీగా బీజేపీలో చేరికలు జరిగాయి. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనపై రాంచందర్ రావు స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. 'ముఖ్యమంత్రులు లేదా మంత్రుల విదేశీ పర్యటనలకు విదేశాంగ శాఖ (MEA) నుండి నిబంధనల ప్రకారం క్లియరెన్స్ తీసుకోవడం సాధారణ పరిపాలనా ప్రక్రియ మాత్రమే. పర్యటన ఉద్దేశం, ఆహ్వానించిన సంస్థల వివరాలు, భద్రత, ప్రోటోకాల్, ద్వైపాక్షిక సంబంధాలు వంటి అనేక అంశాలను పరిశీలించిన తర్వాతే అనుమతులు ఉంటాయి' అని వివరించారు. 'విదేశాలకు వెళ్లేవారికి క్లియరెన్స్ ఉంటుంది. కార్యక్రమాలలో పాల్గొనే వ్యక్తుల హోదాను కూడా చూశాకే కేంద్ర విదేశాంగ శాఖ అనుమతి ఉంటుంది' అని వెల్లడించారు.
'తరుణ్ గగోయ్ కూడా గతంలో అమెరికా పర్యటన కోసం అనుమతి ఇవ్వలేదు. అప్పుడు యూపీఏ ప్రభుత్వమే ఉంది' అని రాంచందర్ రావు వివరించారు. రేవంత్ రెడ్డి గతంలో వెళ్లినప్పుడు ఆపలేదు కదా అని గుర్తుచేశారు. 'ఇది ఒక పద్ధతి ప్రకారం జరుగుతుంది. అందులో భాగంగానే అనుమతి ఇవ్వలేదు. అంతేకానీ దీనిలో ఎటువంటి రాజకీయకోణం లేదు' అని స్పష్టం చేశారు. నీట్ విద్యార్థులు తనను కలవడంతో వారితో రాంచందర్ మాట్లాడారు.
ముఖ్యమంత్రులు లేదా మంత్రుల విదేశీ పర్యటనలకు విదేశాంగ శాఖ (MEA) నుండి నిబంధనల ప్రకారం క్లియరెన్స్ తీసుకోవడం సాధారణ పరిపాలనా ప్రక్రియ మాత్రమే. పర్యటన ఉద్దేశం, ఆహ్వానించిన సంస్థల వివరాలు, భద్రత, ప్రోటోకాల్, ద్వైపాక్షిక సంబంధాలు వంటి అనేక అంశాలను పరిశీలించిన తర్వాతే అనుమతులు ఉంటాయి.… pic.twitter.com/fFlvPyI8nd
— BJP Telangana (@BJP4Telangana) August 21, 2026
'స్టూడెంట్స్ వద్ద అదనంగా ఫీజు వసూలు చేశారో వాళ్లకు తిరిగి ఇచ్చివేయాలని హై కోర్టు తీర్పు ఇచ్చింది. అదనంగా ఫీజు వసూలు చేసిన కాలేజీల నుంచి పేరెంట్స్కు తిరిగి ఇప్పించాలని నన్ను కోరారు' అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు తెలిపారు. ఈ సందర్భంగా తనను కలిసిన నీట్ విద్యార్థుల తల్లితండ్రులతో మాట్లాడి వారికి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. 'ఎన్ఎంసీ, టీఏఎఫ్ఆర్సీ నిబంధన ప్రకారం నాలుగున్నరేళ్లకే ఫీజు తీసుకోవాలి. కానీ ప్రైవేట్ కాలేజీలు ఇంటర్న్షిప్ ఏడాదికి కూడా ఫీజు వసూలు చేస్తున్నాయి' అని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోయారు.
'ఫీజు కట్టని విద్యార్థులను క్లాసులకు రానివ్వకపోవడం, బయోమెట్రిక్ హాజరు బ్లాక్ చేయడం, హాల్ టికెట్లు ఆపడం చేస్తున్నారు. ఇంటర్న్షిప్ విద్యార్థులకు ఇవ్వాల్సిన స్టైఫండ్ ఇవ్వడం లేదు' అని విద్యార్థుల తల్లిదండ్రులు బీజేపీ అధ్యక్షుడికి మొరపెట్టుకున్నారు. అదనంగా వసూలు చేసిన ఫీజు వెనక్కి ఇవ్వాలని, స్టైపెండ్ నిబంధనల ప్రకారం ఇవ్వాలని, రూల్స్ ఉల్లంఘించిన కాలేజీలపై చర్యలు తీసుకునేలా చూడాలని కోరారు. బాధిత విద్యార్థులకు బీజేపీ అండగా ఉంటుందని.. ఈ అంశంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటం చేస్తామని రాంచందర్ రావు హామీ ఇచ్చారు.
Shavukaru Janaki: సినీ పరిశ్రమ దిగ్భ్రాంతి.. దిగ్గజ నటి షావుకారి జానకి కన్నుమూత
Chennai, Tamil Nadu:Shavukaru Janaki Passes Away: దక్షిణ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వందల సినిమాలు చేసి దక్షిణాది ప్రేక్షకులను అలరించిన దిగ్గజ నటి షావుకారు జానకి (94) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ తీవ్ర అనారోగ్యానికి గురయిన ఆమె కొన్ని రోజుల కిందట చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూ శుక్రవారం మధ్యాహ్నం ఆమె తుదిశ్వాస విడిచారు. కొన్ని దశాబ్దాలపాటు సినీ పరిశ్రమలో అగ్ర హీరోయిన్గా షావుకారు జానకి నటించారు. ఆమె మృతికి దక్షిణాది సీని పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఆమె మృతికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతోపాటు తమిళనాడు ముఖ్యమంత్రి సంతాపం ప్రకటించారు.
Irumudi Public Talk: 'ఇరుముడి' సినిమా హిట్టా..ఫట్టా..? పబ్లిక్ టాక్ ఎలా ఉందో చూడండి!
Hyderabad, Telangana:Irumudi Movie Public Talk: మాస్ మహారాజ్ రవితేజ ప్రధానపాత్రలో ప్రియా భవానీ శంకర్ జంటగా నటించిన చిత్రం 'ఇరుముడి'. డివోషనల్ థ్రిల్లర్గా రూపొందుతోన్న ఈ చిత్రం ఆగస్టు 21న విడుదలైంది. డివోషనల్ థ్రిల్లర్ జోనర్గా రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులను అలరించిందా లేదా అనేది పబ్లిక్ టాక్ ద్వారా తెలుసుకుందాం.AP Local Body Elections: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది..ఎన్నికలు ఎప్పుడంటే?
Nunna, Vijayawada, Andhra Pradesh:AP Local Body Elections Update: ఆంధ్రప్రదేశ్లో రాజకీయల చుట్టూ ఇప్పుడు ఆసక్తికర పరిస్థితి ఏర్పడింది. మరో నెల రోజుల్లో స్థానిక సంస్థల, మున్సిపల్ ఎన్నికల నగారా మోగనుండడంతో అధికార, ప్రతిపక్ష పార్టీలు సిద్ధమయ్యాయి. తాజాగా ఎన్నికల షెడ్యూల్ తేదీలు విడుదల అయ్యాయి. వాటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.ఇరుముడి మూవీ రివ్యూ.. పబ్లిక్ టాక్ ఇదే!
Hyderabad, Telangana:Irumudi Movie Review: ఈ రోజు విడుదలైన ఇరుముడి చిత్రం బాక్సాఫీస్ బద్దలు కొట్టబోతున్నట్లు తెలుస్తోంది. శబరిమల యాత్ర నేపథ్యంతో పాటు మంచి భావోద్వేగంతో రూపొందించిన ఈ చిత్రం ప్రేక్షకులను అద్భుతంగా ఆకట్టుందని టాక్ నడుస్తోంది. ప్రధాన పాత్రధారులు ఈ సినిమాకు ప్రాణం పోశాయి. అయితే, ఈ సినిమా రివ్యూను ప్రేక్షకుల మాటాల్లోనే తెలుసుకుందాం..Irumudi Movie Review: అయ్యప్ప భక్తులను ఇరుముడి కట్టిపడేసిందా.. సినిమా ఎలా ఉందంటే?
Hyderabad, Telangana:Irumudi Movie Review: శబరిమల అయ్యప్ప దీక్ష వైభవాన్ని చెబుతూ తెరకెక్కిన ఇరుముడి చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. అద్భుతమైన కథతో సాగే ఈ సినిమా ప్రయాణం ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. అయితే, ఈ మూవీ ఎలా ఉందో ప్రేక్షకుల ద్వారా తెలుసుకుందాం..థియేటర్లలో ఇరుముడి సందడి.. ప్రేక్షకులు ఏమంటున్నారంటే?
Hyderabad, Telangana:Irumudi Movie Review: ఆధ్యాత్మిక భావనలతో కూడిన సరికొత్త కథనంతో ఇరుముడి ప్రేక్షకుల ముందుకొచ్చి సందడి చేస్తోంది.. కథలో అద్భుతమైన భక్తి, కుటుంబ బంధాలు, జీవిత సత్యాలను చక్కగా ప్రతిబింబించగా... కొన్ని సన్నివేశాలు చాలా అద్భుతంగా ఉన్నట్లు టాక్ నడుస్తోంది. అయితే, ఈ సినిమా ఎలా ఉందో ప్రేక్షకుల మాటాల్లో తెలుకుందాం..
Agni Pariksha Trolls: బిగ్బాస్ 'అగ్నిపరీక్ష 2'పై పెరుగుతున్న విమర్శలు..షో జడ్జ్ల వైఖరిపై నెటిజన్ల ఆగ్రహం!
Hyderabad, Telangana:Agni Pariksha 2 Controversy: 'బిగ్బాస్' రియాలిటీ షోలోకి సాధారణ వ్యక్తులకు అవకాశం కల్పించే ఉద్దేశంతో ప్రారంభమైన 'అగ్నిపరీక్ష 2' ఆడిషన్స్ షో ప్రస్తుతం తీవ్ర వివాదాల్లో చిక్కుకుంది. ఈ కార్యక్రమంలో నిర్ణేతలుగా (జడ్జీలుగా) వ్యవహరిస్తున్న నటులు నవదీప్, అభిజిత్, బిందు మాధవిల తీరుపై కోట్లాది మంది ప్రేక్షకులు, నెటిజన్లు తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కంటెస్టెంట్లను పరీక్షించే విధానం, జెండర్ ఆధారంగా వ్యత్యాసాలు చూపించడం, వ్యక్తిగత వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఇవ్వడం వంటి అంశాలు సోషల్ మీడియా వేదికగా తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.
ప్రధాన వివాదాలు, ప్రేక్షకుల ఆరోపణలు..
1) పక్షపాతం, జెండర్ వ్యత్యాసం: ఈ షో ఆడిషన్స్ కంటెస్టెంట్లకు ప్రతిభను నిరూపించుకునే 'అగ్నిపరీక్ష'లా కాకుండా ఒక 'స్వయంవరం'లా సాగుతోందని కొందరు విమర్శిస్తున్నారు. పురుష కంటెస్టెంట్లు వచ్చినప్పుడు వారు తమ విషయాలు పూర్తిస్థాయిలో చెప్పే అవకాశం ఇవ్వకుండానే త్వరితగతిన 'రెడ్ కార్డ్' ఇచ్చి పంపించేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. అదే సమయంలో మహిళా కంటెస్టెంట్లు వచ్చినప్పుడు మాత్రం జడ్జీలు ఎక్కువ సమయం కేటాయిస్తూ, ఫ్రెండ్లీగా సంభాషిస్తున్నారని ప్రేక్షకులు మండిపడుతున్నారు.
2) ట్రాన్స్జెండర్ కంటెస్టెంట్పై ప్రవర్తన: ఆడిషన్స్కు వచ్చిన ప్రముఖ ట్రాన్స్జెండర్ కంటెస్టెంట్ ఉప్పల్ బాలు పట్ల జడ్జీలు ప్రవర్తించిన తీరు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్కు దారితీసింది. ఆయనతో మాట్లాడిన విధానం, చేసిన కొన్ని వ్యాఖ్యలు అవమానకరంగా ఉన్నాయని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. కంటెస్టెంట్ ప్రతిభను, వ్యక్తిత్వాన్ని గౌరవించాల్సిన బాధ్యత జడ్జీలపై ఉందని హితవు పలుకుతున్నారు.
3) అభిజిత్ రెడ్ కార్డ్ వివాదం: ఒక కంటెస్టెంట్ సరదాగా బిగ్బాస్ విజేత అభిజిత్ను ఉద్దేశించి, "బిగ్బాస్ గెలిచిన తర్వాత కొన్నాళ్ల పాటు ఎక్కడా కనిపించలేదు" అని కామెంట్ చేయగా, దాన్ని అభిజిత్ వ్యక్తిగతంగా తీసుకుని వెంటనే రెడ్ కార్డ్ ఇచ్చి పంపడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సరదా సంభాషణలకు కూడా అవకాశం ఇవ్వకపోవడం సరైన పద్ధతి కాదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
ప్రేక్షకుల విజ్ఞప్తి..
మొత్తానికి, 'అగ్నిపరీక్ష 2' వేదికపై ప్రతిభకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలని, ఎలాంటి లింగ వివక్ష లేదా పక్షపాతం లేకుండా కంటెస్టెంట్లందరినీ సమానంగా చూడాలని నెటిజన్లు కోరుతున్నారు. షోను మరింత ప్రొఫెషనల్గా నిర్వహించాలని సూచిస్తున్నారు. ఈ వరుస విమర్శలపై షో నిర్వాహకులు గానీ, జడ్జీలు గానీ ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.
Also Read: నవదీప్, బిందు మాధవి తర్వాత..ఇప్పుడు నాగార్జునపై వీడియో రిలీజ్ చేసిన ఉప్పల్ బాలు!
Also Read: 'టాక్సిక్' సెన్సార్ రివ్యూ..బాక్సాఫీస్ వద్ద యశ్ 'టాక్సిక్' ప్రభంజనం సృష్టిస్తుందా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Prabhas Surgery: హీరో ప్రభాస్కు మరో సర్జరీ..సోషల్ మీడియాలో డాక్టర్ ఎమోషనల్ పోస్ట్..ఏం జరిగింది?
Hyderabad, Telangana:Prabhas Surgery News: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్కు సర్జరీ జరిగినట్లు టాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే అందుకు ప్రధాన కారణంగా ప్రభాస్ ఓ వైద్యుడ్ని కలవడమే. హైదరాబాద్లోని ప్రముఖ అపోలో హాస్పిటల్స్లో మోకాలు, తుంటి, క్రీడా సంబంధిత గాయాల చికిత్సలో నిపుణులైన ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ కె.జె. రెడ్డి సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక పోస్ట్ ప్రస్తుతం టాలీవుడ్తో పాటు గ్లోబల్ స్టార్ ప్రభాస్ అభిమానులలో తీవ్ర కలకలాన్ని రేపుతోంది.
డాక్టర్ రెడ్డి, నటుడు ప్రభాస్తో కలిసి దిగిన ఒక ఫోటోను తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పంచుకున్నారు. అయితే, ఆ ఫోటోతో పాటు ఆయన పెట్టిన సుదీర్ఘ సందేశంలో ప్రభాస్ ఆరోగ్య బాధ్యతను ప్రస్తావించడంతో పాటు ఆయన పడిన "వ్యక్తిగత త్యాగాల" గురించి రాయడం ఈ ఆందోళనలకు ప్రధాన కారణమైంది.
డాక్టర్ రెడ్డి తన పోస్ట్లో ప్రభాస్ అద్భుతమైన నిరాడంబరత్వాన్ని కొనియాడారు. "ప్రభాస్ గురించి తెలుసుకోవడం, ఆయన ఆరోగ్య బాధ్యతను స్వీకరించడం నాకు ఎంతో సంతోషాన్నిచ్చింది. అపారమైన విజయం సాధించినప్పటికీ, ఆయన ఎంతో నిరాడంబరంగా, ఆప్యాయంగా, మర్యాదపూర్వకంగా ఉంటారు. ఆయన సానుకూల దృక్పథం, అద్భుతమైన స్వభావం ఆయన్ని నిజంగా ప్రత్యేకమైన వ్యక్తిగా నిలబెడతాయి" అని ప్రశంసించారు.
దీనితో పాటు, ఒక విజయవంతమైన స్టార్ హీరో సాధించిన విజయాల వెనుక తరచుగా బయటి ప్రపంచానికి కనిపించని త్యాగాల గురించి కూడా డాక్టర్ ఒక సందేశాన్ని పంచుకున్నారు. "మీరు ఒక విజయవంతమైన వ్యక్తిని చూసినప్పుడు, కేవలం వారి బహిరంగ విజయాలను మాత్రమే చూస్తారు తప్ప, ఆ స్థాయికి చేరుకోవడానికి వారు చేసిన వ్యక్తిగత త్యాగాలను ఎప్పుడూ గమనించరు" అని ఆ ఫోటోపై ఉన్న సందేశం ద్వారా వివరించారు.
డాక్టర్ రెడ్డి ప్రభాస్ మంచి ఆరోగ్యం, సంతోషం, నిరంతర విజయాలను ఆకాంక్షిస్తూ పోస్ట్ను ముగించినప్పటికీ, ఆయన "ఆరోగ్య బాధ్యత", "త్యాగాలు" అని రాయడం వల్ల ప్రభాస్కు ఏమైనా శస్త్రచికిత్స జరిగిందా అనే కలవరం అభిమానుల్లో నెలకొంది. గతంలో 'బాహుబలి', 'సాహో', 'సలార్' వంటి భారీ యాక్షన్ చిత్రాల చిత్రీకరణ సమయంలో ప్రభాస్ పలుమార్లు గాయపడ్డారు. ముఖ్యంగా మోకాలి సమస్యల వల్ల ఆయన గతంలో రెండుసార్లు శస్త్రచికిత్సలు కూడా చేయించుకున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన చిత్రీకరణలో కూడా ఆయనకు మరోసారి గాయమైనట్లు సమాచారం ఉంది.
ఈ పోస్ట్ చూసిన అభిమానులు సోషల్ మీడియాలో స్పందిస్తూ తమ ఆందోళనతో పాటు కృతజ్ఞతలను వ్యక్తపరుస్తున్నారు. ఓ అభిమాని కామెంట్ చేస్తూ.. "మా హీరోని ఇంత బాగా చూసుకుంటున్నందుకు ధన్యవాదాలు డాక్టర్. దయచేసి ఆయన ఆరోగ్యాన్ని ఎల్లప్పుడూ బాగుండేలా చూడండి" అని వ్యాఖ్యానించారు. మరొకరు "ప్రజలు కేవలం బాక్సాఫీస్ వసూళ్లను మాత్రమే చూస్తారు, కానీ ప్రతి పాత్ర కోసం ప్రభాస్ అన్న పడే శ్రమ, చెమట, అంకితభావం మాకు తెలుసు" అని భావోద్వేగంగా రాశారు.
మరికొందరు "మీ మాటలు ప్రభాస్ అనే అద్భుతమైన వ్యక్తిత్వాన్ని చక్కగా ఆవిష్కరించాయి. మీ ఆప్యాయమైన మాటలకు ధన్యవాదాలు సార్" అని వైద్యుడికి కృతజ్ఞతలు తెలిపారు. వృత్తిపరంగా ప్రభాస్ ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా 'స్పిరిట్', హను రాఘవపూడి 'ఫౌజీ' చిత్రాలతో పాటు, నాగ్ అశ్విన్ 'కల్కి 2898 AD' సీక్వెల్లో 'భైరవ' పాత్రలో బిజీగా ఉన్నారు. ఈ భారీ ప్రాజెక్టుల నేపథ్యంలో, ఆయన పూర్తి ఆరోగ్యంతో ముందుకు సాగాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు కోరుకుంటున్నారు.
Also Read: నవదీప్, బిందు మాధవి తర్వాత..ఇప్పుడు నాగార్జునపై వీడియో రిలీజ్ చేసిన ఉప్పల్ బాలు!
Also Read: ఫోక్ డాన్సర్ల వివాదం.. ఈశ్వర్ సాయి భార్యపై రివర్స్ కేసు పెడుతున్న మాధురి రాథోడ్?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
ED Raids Avinash Reddy: వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి ఈడీ షాక్..ఏపీ, తెలంగాణల్లో 10 చోట్ల ఏకధాటిగా సోదాలు!
Vijayawada, Andhra Pradesh:ED Raids On MP Avinash Reddy: తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు మరోసారి ఉత్కంఠ రేకెత్తించే రీతిలో విస్తృత స్థాయి సోదాలు చేపట్టారు. ఏపీలోని కడప పార్లమెంటు సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డికి సంబంధించిన నివాసాలు, కార్యాలయాలపై ఏకకాలంలో ఈ తనిఖీలు జరుగుతున్నాయి. మనీలాండరింగ్ ఆరోపణలు, అనుమానాస్పద ఆర్థిక లావాదేవీల దర్యాప్తులో భాగంగా ఈ చర్యలు తీసుకున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
ఈడీ దర్యాప్తు ముఖ్యాంశాలు..
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని ఎంపీ అవినాష్ రెడ్డికి సంబంధించిన వివిధ ప్రధాన ప్రాంతాలలో ఏకకాలంలో మొత్తం 10 చోట్ల ఈడీ అధికారులు ఈ తనిఖీలు నిర్వహిస్తున్నారు.
ప్రధానంగా అనుమానాస్పద ఆర్థిక లావాదేవీలు, మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) నిబంధనల ఉల్లంఘనలు, ఆర్థికపరమైన అక్రమాలపై ఈ విచారణ కొనసాగుతోంది.
ఈ తనిఖీల సమయంలో అధికారులు పలు కీలకమైన పత్రాలు, డిజిటల్ రికార్డులు, బ్యాంకు ఖాతాల వివరాలు, ఆస్తులకు సంబంధించిన కాగితాలను సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సోదాలు కొనసాగుతుండగా ఈ దర్యాప్తునకు సంబంధించి మరిన్ని అధికారిక వివరాలు వెలువడాల్సి ఉంది.
Also Read: "డీఎస్సీ లీకేజీలపై సీబీఐ విచారణ జరపాలి..లోకేష్ రాజీనామా చేయాలి" వైఎస్ జగన్ డిమాండ్
Also Read: తెలంగాణలో సినిమా థియేటర్లలో కొత్త రేట్లు..నిర్మాతలకు కాంగ్రెస్ ప్రభుత్వం కీలక ఆదేశం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Toxic Censor Review: 'టాక్సిక్' సెన్సార్ రివ్యూ..బాక్సాఫీస్ వద్ద యశ్ 'టాక్సిక్' ప్రభంజనం సృష్టిస్తుందా?
Hyderabad, Telangana:Toxic Movie Censor Review: 'కేజీఎఫ్ 1', 'కేజీఎఫ్ 2' చిత్రాల ద్వారా పాన్ ఇండియా రేంజ్ లో విపరీతమైన క్రేజ్, గుర్తింపు తెచ్చుకున్న హీరో యశ్. దాదాపు నాలుగేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత యశ్ హీరోగా నటిస్తూ ప్రేక్షకుల ముందుకు వస్తున్న సరికొత్త చిత్రం 'టాక్సిక్'. ఇటీవల విడుదలైన ఈ సినిమా అఫీషియల్ ట్రైలర్ తో మూవీపై అంచనాలు ఒక్కసారిగా ఆకాశాన్నంటాయి. ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 26వ తేదీన ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కావడానికి సిద్ధంగా ఉంది.
కన్నడ, మలయాళం, తమిళం, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఒకేసారి ఒకే రోజున ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ తరుణంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ కార్యక్రమాలను కూడా అత్యంత వేగవంతం చేసింది. ఈ ప్రతిష్టాత్మక 'టాక్సిక్' చిత్రానికి ప్రతిభావంతురాలైన మహిళా దర్శకురాలు గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహించడం విశేషం. కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్ స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్లపై ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ చిత్రంలో యశ్ సరసన కియారా అద్వానీ, నయనతార, హ్యుమా ఖురేషి, తారా సుతారియా, రుక్మిణి వసంత్ హీరోయిన్లుగా నటించారు.
ఇక 'టాక్సిక్' మూవీ ఇటీవల సెన్సార్ కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈ సినిమా రన్ టైమ్ భారత్ లో మొదట 3 గంటల 15 నిమిషాలుగా ఉంది. అయితే ప్రేక్షకులు బోర్ ఫీల్ కాకుండా మరింత గ్రిప్పింగ్ గా ఉంచేందుకు దానిని 2 గంటల 54 నిమిషాలకు (సుమారుగా 174 నిమిషాలు) కుదించారు. ఈ భారీ రన్ టైమ్ టాక్సిక్ సినిమాకు ప్లస్ అవుతుందా లేదా మైనస్ అవుతుందా అనేది వేచి చూడాలి. ఇక ఈ మూవీ ఇంగ్లీష్ వెర్షన్ ను ప్రపంచవ్యాప్తంగా దాదాపు 3 వేలకు పైగా స్క్రీన్స్ లో రిలీజ్ చేస్తున్నారు. అలాగే ఇండియన్ వెర్షన్ మూవీని కూడా రికార్డు స్థాయిలో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
'ఏ' (A) సర్టిఫికెట్ జారీ..
సెన్సార్ రిపోర్టు ప్రకారం.. టాక్సిక్ సినిమా థియేటర్లలో వేరే లెవెల్ లో ఉండబోతోందనే విషయం స్పష్టమవుతోంది. ఈ సినిమాలో హీరో యశ్ ద్విపాత్రాభినయం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. పాజిటివ్, నెగెటివ్ రెండు క్యారెక్టర్లలో కూడా ఆయన తన నట విశ్వరూపాన్ని చూపించారని సమాచారం. ముఖ్యంగా సెకండాఫ్ లో వచ్చే కొన్ని అద్భుతమైన యాక్షన్ ఎపిసోడ్స్ సినిమా మొత్తానికి మేజర్ హైలైట్ గా నిలవబోతున్నాయని సెన్సార్ సభ్యులు చెబుతున్నారు. ఇదే గనుక నిజమైతే యశ్ కెరీర్ లోనే కాకుండా, మొత్తం భారతీయ చిత్ర పరిశ్రమలోనే టాక్సిక్ మూవీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తుందని గట్టిగా టాక్ వినిపిస్తోంది.
ఒక మహిళా దర్శకురాలు ఇంతటి భారీ యాక్షన్, 'ఏ' సర్టిఫికెట్ ఉన్న సినిమా తీసి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ కొట్టడం సామాన్యమైన విషయం కాదని నెటిజన్లు సామాజిక మాధ్యమాలలో చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ జోరు 1 మిలియన్ వరకు ఉందని తెలుస్తోంది. ఇక ఈ సినిమా పూర్తి స్థాయి రివ్యూ మరియు టాక్ తెలుసుకోవడం కోసం ప్రేక్షకులు ఆగస్టు 26 వరకు ఆగాల్సిందే. అంతకంటే ముందుగానే ఆగస్టు 22న హైదరాబాద్ లోని మల్లారెడ్డి యూనివర్సిటీలో ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమాన్ని చాలా ఘనంగా నిర్వహించనున్నారు.
Also Read: ఫోక్ డాన్సర్ల వివాదం.. ఈశ్వర్ సాయి భార్యపై రివర్స్ కేసు పెడుతున్న మాధురి రాథోడ్?
Also Read: 'ధురంధర్' నటి ఆయేషా ఖాన్ నిశ్చితార్థం..అతడి ఫొటో సీక్రెట్గా..సోషల్ మీడియాలో వైరల్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Uppal Balu Nagarjuna: నవదీప్, బిందు మాధవి తర్వాత..ఇప్పుడు నాగార్జునపై వీడియో రిలీజ్ చేసిన ఉప్పల్ బాలు!
Hyderabad, Telangana:Uppal Balu Akkineni Nagarjuna: తెలుగు బుల్లితెరపై అత్యంత ప్రజాదరణ పొందిన రియాల్టీ షో 'బిగ్బాస్' త్వరలోనే సీజన్ 10తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో, సామాన్యులకు హౌస్లోకి వెళ్లే సువర్ణావకాశాన్ని కల్పించేందుకు నిర్వాహకులు 'అగ్నిపరీక్ష 2' ఆడిషన్స్ నిర్వహిస్తున్నారు. అయితే, ఈ ఆడిషన్స్ నుంచి ఎలిమినేట్ అయిన సోషల్ మీడియా ఫేమ్ ఉప్పల్ బాలు వ్యవహారం ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్గా మారింది.
జడ్జిలపై సంచలన ఆరోపణలు..
ఇటీవల బిగ్బాస్ అగ్నిపరీక్ష ఆడిషన్స్కు వెళ్లిన ఉప్పల్ బాలు అక్కడ ఎలిమినేట్ అయ్యారు. అనంతరం ఆయన షో జడ్జిలైన నవదీప్, బిందు మాధవి, అభిజిత్లపై తీవ్ర ఆరోపణలు చేశారు. ముఖ్యంగా జడ్జి నవదీప్ తన వీడియోలు చాలా వల్గర్ (అసభ్యంగా) ఉంటాయని అంటూ తనను అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు.
మరో జడ్జి బిందు మాధవి తనను 'ట్రాన్స్'వా అని ప్రశ్నించిందని బాలు పేర్కొన్నారు. కేవలం బాలు మాత్రమే కాకుండా, ఎలిమినేట్ అయిన ఇతర కంటెస్టెంట్స్ కూడా నిర్వాహకులు, జడ్జిలపై పలు ఆరోపణలు చేస్తున్నారు.
ట్విస్ట్ ఇచ్చిన ఉప్పల్ బాలు..
అయితే, తాజాగా తన ఇన్స్టాగ్రామ్లో ఉప్పల్ బాలు పోస్ట్ చేసిన మరో వీడియో సోషల్ మీడియాను ఊపేస్తోంది. జడ్జిలపై విమర్శలను పక్కన పెట్టి, ఈసారి ఆయన బిగ్బాస్ నిర్వాహకులకు, హోస్ట్ నాగార్జునకు నేరుగా ఒక ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. "ప్లీజ్.. ఒక్క అవకాశం ఇవ్వండి.. దయచేసి నన్ను తీసుకోండి" అంటూ ఆయన చేతులు జోడించి వేడుకున్నారు. కనీసం వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారానైనా తనను షోలోకి పంపాలని నాగార్జునను, నిర్వాహకులను కోరారు. ఇదే తన చివరి వీడియో అని స్పష్టం చేశారు.
"రేటింగ్స్ పెంచే బాధ్యత నాదే!" తనకు ఒక్క అవకాశం ఇస్తే తప్పకుండా షో రేటింగ్స్ పెరుగుతాయని, ప్రేక్షకులు కోరుకునే ఫుల్ కామెడీని అందిస్తానని ఉప్పల్ బాలు హామీ ఇచ్చారు. హౌస్లో ఏ టాస్క్ ఇచ్చినా తాను ఆడతానని, తన అభిమానులు కూడా తాను బిగ్బాస్ హౌస్లోకి వెళ్లాలని బలంగా కోరుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. తనకు మద్దతుగా బిగ్బాస్ టీమ్కు మెసేజ్లు పంపాలని ఫాలోవర్స్కు విజ్ఞప్తి చేశారు.
'అడగడంలో తప్పు లేదు కదా' అని ప్రశ్నిస్తూ, అవకాశం ఇస్తే తన సత్తా నిరూపించుకుంటానని ఉప్పల్ బాలు వేడుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుండగా, నెటిజన్ల నుంచి ఉప్పల్ బాలుకు విశేష మద్దతు లభిస్తోంది. మరి ఈ విజ్ఞప్తిపై కింగ్ నాగార్జున, బిగ్బాస్ టీమ్ ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.
Also Read: ఫోక్ డాన్సర్ల వివాదం.. ఈశ్వర్ సాయి భార్యపై రివర్స్ కేసు పెడుతున్న మాధురి రాథోడ్?
Also Read: నటి మీనా భర్త మృతి వెనుక అసలు నిజం ఇదే..ఇంటర్వ్యూలో చెబుతూ కంటతడి పెట్టిన హీరోయిన్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Vizag School Tragedy: విశాఖలోని ప్రైవేట్ స్కూల్లో తీవ్ర విషాదం..టీచర్ కొట్టిన తర్వాత కుప్పకూలి యూకేజీ చిన్నారి మృతి!
Visakhapatnam, Andhra Pradesh:Vizag School Tragedy News: విశాఖపట్నంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నగరంలోని వన్ టౌన్ పరిధిలోని లిటిల్ గార్డెన్ స్కూల్ అనే ప్రైవేట్ పాఠశాలలో దారుణమైన ఘటన జరిగింది. టీచర్ దెబ్బలను తట్టుకోలేక ఆరేళ్ల బాలుడు మృతి చెందినట్లు సమాచారం. హోంవర్క్ చేయలేదనే కారణంతో ఉపాధ్యాయురాలు కొట్టడం వల్లే తమ బిడ్డ ప్రాణాలు కోల్పోయాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
ఏం జరిగిందంటే..?
విశాఖపట్నం వన్ టౌన్ పరిధిలోని లిటిల్ గార్డెన్ స్కూల్ లో ప్రణయ్ తేజ అనే బాలుడు యూకేజీ చదువుతున్నాడు. అయితే క్లాస్ రూమ్ లో టీచర్ అందరి హోంవర్క్ ను పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో ప్రణయ్ తేజను హోంవర్క్ చేయలేదని ఉపాధ్యాయురాలు బెదిరించారు. దాంతో భయపడిపోయిన ప్రణయ్.. కొట్టొద్దు అంటూ విలపించాడు. అయినా ఆ ఉపాధ్యాయురాలు బాలుడి చెంపపై కొట్టింది. దాంతో బెదిరిపోయిన బాలుడు.. క్లాస్ రూమ్ లోనే స్పృహ కోల్పోయాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీల్లో రికార్డు అయ్యాయి. వెంటనే బాలుడ్ని కేజీహెచ్ కు తరలించారు. అయితే అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న బాలుడి తల్లిదండ్రులు, బంధువులు ఆస్పత్రికి చేరుకుని కన్నీటి పర్యంతం అయ్యారు. మరోవైపు బాలుడు ప్రణయ్ తేజ మృతిపై మంత్రి లోకేశ్ స్పందించారు. టీచర్ కొట్టడంతో చిన్నారి మరణించడం బాధాకరం అని అన్నారు. బాధ్యులు, సంబంధిత పాఠశాల యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు ఉంటాయన్నారు. ప్రణయ్ తేజ తల్లిదండ్రులకు జరిగిన నష్టాన్ని ఎవరూ పూడ్చలేనిదాని.. వారికి తన ప్రగాఢ సంతాపం తెలియజేయడంతో పాటు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ మేరకు ఎక్స్ లో లోకేశ్ పోస్ట్ పెట్టారు.
ఇక ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపట్టి.. బాధ్యులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇకపై ఏ విద్యార్థి కూడా ఇలాంటి విషాదానికి బలికాకుండా ప్రతి పాఠశాలలో పటిష్టమైన భద్రతా చర్యలు అమలు చేయాలని, ఉపాధ్యాయుల ప్రవర్తనపై కఠిన పర్యవేక్షణ ఉండాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. విద్యార్థులకు విద్యతో పాటు భద్రత కల్పించడం ప్రతి పాఠశాల యాజమాన్యం బాధ్యత అని.. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఘటనను అత్యంత సీరియస్గా తీసుకుని కఠిన నిర్ణయాలు అమలు చేయాలని తల్లిదండ్రులతో పాటు స్థానికులు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు.
Also Read: "డీఎస్సీ లీకేజీలపై సీబీఐ విచారణ జరపాలి..లోకేష్ రాజీనామా చేయాలి" వైఎస్ జగన్ డిమాండ్
Also Read: స్కూల్ విద్యార్థులపై వీధికుక్కల వరుస దాడులు..ఆ స్కూళ్లకు వరుసగా 4 రోజులు సెలవులు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

)