Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Mancherial504251

ఒకే కాన్పులో ఐదు మేక పిల్లలకు జననం

Aug 25, 2024 10:20:20
Bellampalle, Telangana
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం, బుదా కలన్ గ్రామంలో అద్భుతం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఆవుల అంజి అనే వ్యక్తికి చెందిన మేక ఐదు మేక పిల్లలకు శనివారం రాత్రి జన్మనిచ్చింది. ఈ మేక మొదటి కాన్పులోనే ఐదు మేక పిల్లలకు జన్మనిచ్చిందని అంజి తెలిపారు. ఐదు మేక పిల్లలను సంరక్షించేందుకు వైద్యుల సలహాలు సూచనలు కావాలని అతడు కోరారు. మేక పిల్లలను చూసేందుకు గ్రామ ప్రజలు తరలివస్తున్నారు.
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
Dec 02, 2025 16:00:57
227
comment0
Report
IPInamdar Paresh
Dec 02, 2025 15:53:04
Hyderabad, Telangana:

Jana sena party clarify on pawan kalyan statement: ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాన్ ఇటీవల కోనసీమలో చేసిన వ్యాఖ్యలు దుమారంగా మారిన విషయం తెలిసిందే. గతంలో కోనసీమలో కొబ్బరి చెట్లు ఎంతో పచ్చగా ఉండేవన్నారు.కానీ ఇప్పుడు తలలు తీసేసినట్లు ఉన్నాయన్నారు.  రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయేందుకు గోదావరి జిల్లాల పచ్చదనమే కారణమన్నారు. తెలంగాణ  నేతలు గోదావరి జిల్లాల్లోపచ్చదనం బాగుంటుందని అనేవారని, దిష్టితగిలినట్లు ఉందని వెటకారంగా మాట్లాడారు.ఈ వ్యాఖ్యలపై దుమారం రాజుకుంది.

దీనిపై ఇప్పటికే కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు పవన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సినిమాటో గ్రఫి మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి పవన్ కళ్యాణ్ సినిమాలను ఆడనిచ్చేదనిలేదన్నారు. అంతేకాకుండా.. పవన్ కళ్యాణ్ బేషరతుగా సారీ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ గొడవ కాస్త తారాస్థాయికి చేరడంతో ప్రస్తుతం పవన్ సారీ చెప్పాలని పలువురు నేతలు కూడా హల్చల్ చేస్తున్నారు.ఏకంగా పవన్ ఆస్తులు అంటూ..ఏపీ,తెలంగాణ ప్రజల మధ్య కాంట్రవర్సీ రాజేసేలా ట్రోల్స్ చేస్తున్నారు.

దీనిపై తాజాగా.. జనసేన పార్టీ రియాక్ట్ అయ్యింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోనసీమలో చేసిన వ్యాఖ్యల్నికొంతమంది కావాలని ఉద్దేష పూర్వకంగా వక్రీకరించారని చెబుతు ఒకప్రకటన విడుదల చేసింది.

Read more: Komati Reddy Venkat Reddy: నీ సినిమాలు ఆడనివ్వం.!. పవన్ కళ్యాణ్‌పై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..

ఇరు తెలుగు స్టేట్స్ ల మధ్య సోదర భావం ఉన్న ఈ తరుణంలో పవన్ వ్యాఖ్యల్ని కావాలని వక్రీకరించోద్దని జనసేన పార్టీ కీలక అప్పీల్ చేసింది.ఈ నేపథ్యంలో ఈ వివాదం ప్రస్తుతం రెండు తెలుగు స్టేట్స్ ల మధ్య హాట్ టాపిక్ గా మారింది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

151
comment0
Report
IPInamdar Paresh
Dec 02, 2025 14:29:45
Hyderabad, Telangana:

Akhanda 2 thandavam movie ticket prices hike in Andhra Pradesh: బాలయ్య అభిమానులు ప్రస్తుతం అఖండ 2 మూవీని ఎప్పుడు చూస్తామా అంటూ పూనకాలతో ఊగిపోతున్నారు. ముఖ్యంగా ఇటీవల ఎక్కడ చూసిన బాలయ్య అఖండ 2 తాండవం మూవీ గురించి తెగ చర్చించుకుంటున్నారు. బాలయ్య, బొయపాటి కాంబినేషన్ చూస్తే న్యూటన్  సైతం దబిడి దిబిడి కావాల్సిందే అంటూ సెటైర్ లు వేస్తున్నారు. న్యూటన్ ఒకవేళ బతికి ఉంటే.. బాలయ్య,బోయపాటిలు ఆయనకే సవాల్ విసిరే వారని కూడా తెగ రచ్చ చేస్తున్నారు.

ఈ క్రమంలో అభిమానులు ఎంతగానో జోష్ తో ఎదురు చూస్తున్న బాలయ్య అఖండ 2 తాండవం మూవీ డిసెంబర్ 5 న రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఏపీ చంద్రబాబు నాయుడు సర్కారు మూడు రోజుల ముందు టికెట్ల విషయంలో కీలకనిర్ణయం తీసుకుంది. 

 నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా వస్తున్న అఖండ 2 : తాండవం సినిమా టికెట్ల ధరలను పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్లలో రూ.75, మల్టీప్లెక్స్‌ల్లో రూ.100 జీఎస్టీతో కలిపి పెంచుకునేందుకు పర్మిషన్ ఇచ్చింది. అంతే కాకుండా.. 

అదే విధంగా.. ఈ టికెట్ ధరను రూ.600  జీఎస్టీతో పాటుగా నిర్ణయించారు. రోజుకు ఐదు షోలు నిర్వహించుకోవచ్చని తెలిపింది. డిసెంబర్ 4వ తేదీన రాత్రి 8 గంటల నుంచి 10 గంటల మధ్యలో ప్రీమియర్‌ షోలకు  ఏపీ సర్కారు పర్మిషన్ ఇచ్చింది.

Read more: Star Actress: ఆ డైరెక్టర్ నడుము చూపించమన్నాడు.!. షాకింగ్ నిజం రివీల్ చేసిన ప్రభాస్ మూవీ నటి..

దీనితో పాటు.. పెంచిన ధరలు విడుదల తేదీ అంటే.. డిసెంబర్‌ 5  నుంచి పది రోజుల పాటు అమల్లో ఉంటాయని ఉత్తర్వుల్లో జారీ చేసింది. దీంతో బాలయ్య అభిమానులు పూనకాలతో ఊగిపోతున్నారు. మూడు రోజుల ముందే బాలయ్య మూవీ కోసం ఏపీ సర్కారు తీసుకున్న నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

152
comment0
Report
IPInamdar Paresh
Dec 02, 2025 13:51:13
Hyderabad, Telangana:

Imran Khan Health Stable But Facing Mental Torture says Uzma khanum: పాకిస్థాన్ లో గత కొన్ని రోజులుగా మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను జైల్లోనే చంపేశారని వార్తలు సంచలనంగా మారాయి. దీనికి బలం చేకూర్చే విధంగా పాక్ అధికారులు కనీసం వారి కుటుంబ సభ్యుల్ని కూడా జైల్లోకి అనుమతించలేదు. అంతేకాకుండా.. ఇమ్రాన్ సానుభూతిపరులు, అభిమానులు, కుటుంబ సభ్యులు నిరసనలకు దిగిన కూడా పాక్ సర్కారు పట్టించుకోలేదు. దీని వెనుక ఏదో కుట్ర కోణం ఉందని, ఇమ్రాన్ ఖాన్ ను చంపేసి ఉంటారని చాలా మంది బలంగా నమ్మారు. దీంతో ఈరోజు రావల్పిండిలో  ఇమ్రాన్ ఖాన్ సానుభూతి పరులు నిరసనలకు దిగారు.

 

దీంతో  పాక్ ప్రభుత్వం 144 సెకన్ కూడా విధించింది.ఈ క్రమంలో పాక్ సర్కారు ఇమ్రాన్ ఖాన్ సోదరి డాక్టర్ ఉజ్మా ఖాన్ ను జైల్లోకి అనుమతించింది. దీంతో కొన్ని రోజులుగా ఇమ్రాన్ ఖాన్ మరణంపై వస్తున్నరూమర్స్ కు తెరపడింది. ఇమ్రాన్ ఖాన్ సోదరి డాక్టర్ ఉజ్మా ఖాన్ ను జైల్లోకి అధికారులు అనుమతించారు. దీంతో ఆమె కొద్దిసేపు ఇమ్రాన్ ఖాన్ తో మాట్లాడారు. తన సోదరుడితో భేటీ తర్వాత ఉజ్మాఖాన్ జైలు బైట తన సోదరుడి జైల్లో బతికే ఉన్నాడని చెప్పారు. అయితే..ఈ ప్రకటనతో ఆయన మరణ వార్తలకు ఫుల్ స్టాప్ పడింది. ఈ క్రమంలో ఇమ్రాన్ ఖాన్ సోదరి ఉజ్మాఖాన్ మాట్లాడుతూ..

ఇమ్రాన్ ఖాన్ జనాదరణకు పాక్ ప్రభుత్వంవణికిపోతుందని చెప్పుకొచ్చింది.అందుకే ఆయన్ను ఏకాకిని చేసి, దేశం విడిచి వెళ్లేలా ఒత్తిడి తెస్తున్నాని ఆరోపణలు గుప్పించింది. కానీ జైల్లో మాత్రం తన సోదరుడ్ని తీవ్రంగా మానసికంగా హింసిస్తున్నారని ఉజ్మాఖాన్ పలు విషయాల్ని వెల్లడించారు. అయితే.. అసలు ఇన్ని రోజులుగా ఇమ్రాన్ ఖాన్ లేరని వస్తున్న రూమర్స్ వేళ.. ఆయన బతికే ఉన్నారన్న వార్తలు విని అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Read more: Imran khan Death rumours: ఇమ్రాన్ ఖాన్ మరణంపై వార్తలు.. రావల్పిండిలో హైటెన్షన్.. 144 సెక్షన్..

ఎప్పటికైన ఆయన మరల తిరిగి వస్తారని ఇమ్రాన్ ఖాన్ పై తమకున్న అభిమానంను చాటుకుంటున్నారు.  మరోవైపు.. 72 ఏళ్ల ఇమ్రాన్ ఖాన్.. 2022లో అవిశ్వాస తీర్మానంలో అధికారం కోల్పోయిన తర్వాత..అనూహ్యంగా నమోదైన అవినీతి కేసుల కింద 2023 ఆగస్టు నుంచి జైల్లో ఉన్న విషయం తెలిసిందే.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

157
comment0
Report
IPInamdar Paresh
Dec 02, 2025 12:34:09
Hyderabad, Telangana:

Ranveer singh apologises controversy row on kantara chapter 1 controversy: రిషభ్ శెట్టి హీరోగా, దర్శకత్వం వహించిన కాంతారా చాప్టర్ 1 మూవీ ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ లను షేక్ చేసింది. ఈ మూవీలో రిషభ్, రుక్మిణి వసంత్ నటనకు వరల్డ్ వైడ్ గా అభిమానులు ఫిదా అవుతున్నారు. అయితే.. ఈ మూవీలో కాంతారా దైవం అనుకరణను చూపించారు.  ముఖ్యంగా కన్నడిగులు పంజూర్లీ దైవంను తమ ఆరాధ్య దైవంగా భావిస్తారు. అందుకే మూవీ యూనిట్ ఇప్పటికే కాంతారా మూవీ రిలీజ్ అయ్యాక కూడా.. మూవీలో దైవంను ఎవరు కూడా ఇమిటేట్ చేయోద్దని, ఇది ఎంతో మంది మత విశ్వాసాలు, మనోభావాలకు చెందినదిగా మూవీ టీమ్ చెప్పింది.

అయితే..  ఇటీవల గోవాలో  ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ముగింపు వేడుకలు జరిగాయి. దీనిలో బాలీవుడ్ నటుడు రణ్ వీర్ సింగ్, కాంతారా చాప్టర్ 1 హీరో రిషబ్ శెట్టి పాల్గొన్నారు. ఈ క్రమంలో రణ్ వీర్ సింగ్ చేసిన కొన్ని కామెంట్స్ కాంట్రవర్సీగా మారాయి. రిషబ్ శెట్టిని రణ్ వీర్ సింగ్ ఎంతో ప్రశంసించారు .

అయితే.. ఈ మూవీలో క్లైమాక్స్ లో  చాముండి దైవం ఆవహించినప్పుడు రిషభ్ శెట్టి అవుట్ స్టాండింగ్ నటనతో అదరగొట్టారన్నారు. కళ్లు పెద్దవిగా చేసి.. హీరో దెయ్యం పాత్ర   రిషభ్లో ప్రవేశించినప్పుడు సీన్ లు బాగున్నాయని అన్నాడు.  అంతేకాకుండా.. ఈ మూవీలో ఓ.. అన్న శబ్దంను కూడా మిమిక్రీ చేశారు. దీనిపై జోకులు కూడా వేశారు. ఈ క్రమంలో కన్నడిగులు పంజూర్లీ , చాముండీలను దైవంగా భావిస్తారు. తమ దైవాన్ని దెయ్యం అంటూ రణ్ వీర్ చేసిన కామెంట్స్ పై మండిపడ్డారు. 

మా ప్రాంతా ఇలవేల్పును అలా పోల్చడం సరికాదని రణ్‌వీర్‌సింగ్‌ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. అయితే దీనిపై రిషబ్‌ ఎక్కడా స్పందించలేదు. దీనిపై రణ్ వీర్ సింగ్ పై పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేశారు. ఈ క్రమంలో తాజాగా.. రణ్ వీర్ సింగ్ ఇన్ స్టా వేదికగా కీలక ప్రకటన  చేశారు. కాంతారా చాప్టర్ 1 మూవీలో.. రిషబ్‌ శెట్టి అద్భుతమైన నటుడు అని హైలైట్‌ చేయడమే నా మాటల్లోని ప్రధాన ఉద్దేశ్యమంటూ క్లారిటీ ఇచ్చారు. ఒక నటుడిగా ఆయన ప్రదర్శనను ఇలా తాను ఆ సీన్ ను ఇమిటేట్ చేసి చూపించినట్లు చెప్పుకొచ్చారు.

Read more: Samantha Marriage: ఒకరి ఇంటిని పాడుచేసి కొత్తిల్లు కట్టుకున్నావ్.!. సమంతపై స్టార్ హీరోయిన్ సంచలన ట్విట్..

 రిషబ్ శెట్టి అంటే తనకు ఎంతో గౌరవమని అదే విధంగా.. అందరి సంప్రదాయలు, నమ్మకాలను, దైవాలను గౌరవిస్తానని అన్నారు. నా మాటలు ఎవరినైనా బాధపెట్టి ఉంటే మనస్ఫూర్తిగా  క్షమాపణ కోరుతున్నానంటూ తన  పోస్ట్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట హల్ చల్ గా మారింది. దీంతో ఈ కాంటవర్సీకి ఫుల్ స్టాప్ పడినట్లైంది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

113
comment0
Report
IPInamdar Paresh
Dec 02, 2025 12:33:43
Hyderabad, Telangana:

komati reddy Venkat reddy fires on ap deputy cm pawan kalyan: ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల ఏపీలోని కోనసీమలో పర్యటించారు.ఈ క్రమంలో స్థానికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. కోనసీమ పచ్చదనం, కొబ్బరి బొండాల దిగుబడి మొదలైన విషయాలపై మాట్లాడారు. అయితే.. దీనిలో భాగంగా కోనసీమల ఇటీవల పచ్చదనంపై తెలంగాణ వాళ్ల దిష్టి తగిలినట్లు ఉందని వెటకారంగా మాట్లాడారు. అందుకే ఇక్కడ పచ్చదనం ముందులా లేదంటూ సెటైర్ లు వేశారు.

ఈ కామెంట్స్ కాస్త  పొలిటికల్ టర్న్ తీసుకున్నాయి. రెండు రాష్ట్రాల నేతల మధ్య ఈ అంశంపై మాటల తూటాలు పేలుతున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు పవన్ కు ఏకీపారేశారు. తెలంగాణ నుంచి కోనసీమకు ఎవరు వెళ్లడంలేదని, ఏపీ నుంచి కోనసీమ నుంచి హైదరాబాద్ కు ప్రజలు వస్తున్నారని కౌంటర్ లు ఇచ్చారు. బుర్రుండే పవన్ ఈ మాటలు మాట్లాడుతున్నాడా అంటూ మండిపడ్డారు.

ఇది కాస్త రెండు తెలుగు స్టేట్స్ ల మధ్య కాంట్రవర్సీగా మారింది. తాజాగా..  పవన్ కళ్యాన్ చేసిన వ్యాఖ్యలపై సినిమాటో గ్రఫి మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు రెండు తెలుగు స్టేట్స్ ల మధ్య వివాదంనురాజేసేవిగా ఉన్నాయన్నారు. అంతేకాకుండా.. ఈ కామెంట్స్ పై పవన్ వెంటనే సారీ చెప్పాలన్నారు.

Read more: Vaikunta Dwara Darshan: ఆల్ టైమ్ రికార్డుల్లో వైకుంఠ ద్వార దర్శనం బుక్కింగ్ .. మరికొన్ని గంటల్లోనే లక్కీ డీప్ టొకెన్ల కేటాయింపు..

తెలంగాణ ప్రజల్ని అవమానిస్తే ఊరుకోబోమన్నారు. పవన్ సారీ చెబితే... ఇక్కడ ఆయన సినిమాలు ఆడుతాయని,లేకుంటే ఒక్కసినిమా కూడా ఆడనివ్వమంటూ మాస్ వార్నింగ్ ఇచ్చారు. మరోవైపు  మంత్రి వాకిడి శ్రీహరి కూడా దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ వనరుల్ని దోచుకుని ఈ స్థాయికి వారు ఎదిగారన్నారు. మెచురిటీతో మాట్లాడాలని, మైలేజ్ కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సబబుకాదని పవన్ పై మంత్రి వాకిడి శ్రీహరి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

93
comment0
Report
IPInamdar Paresh
Dec 02, 2025 12:33:12
Hyderabad, Telangana:

Pak govt imposed 144 section in Rawalpindi over Imran khan supporters protest: గత కొన్నిరోజులుగా పాక్ లో ఒక్కసారిగా మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ హత్యకు గురయ్యారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీంతో పాక్ లో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది.  దీంతో  ఆయన కుటుంబ సభ్యులు, మద్దతు దారులు పెద్ద ఎత్తున పాక్ లో నిరసనలకు దిగారు. ఇమ్రాన్ ఖాన్ ను వెంటనే తమకు చూపించాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా.. ఇమ్రాన్ ఖాన్ కుటుంబ సభ్యులు సైతం రావల్పిండిలోని అడియాలా జైలు వద్దకు వెళ్లి నిరసనలకు దిగారు. అయితే.. దీనిపై ఇటీవల జైలు అధికారులు, పాక్ ప్రభుత్వం  మాత్రం ఈ వార్తలలో నిజంలేదని, ఆయన సురక్షితంగా ఉన్నారని చెప్పారు.

కానీ ఆయన వద్దకు మాత్రం కుటుంబ సభ్యుల్ని అనుమతించలేదు. ఇక్కడే అందరిలో అనుమానాలు తలెత్తుతున్నాయి. ఒక వేళ ఇమ్రాన్ ఖాన్ జైలులో ఉంటే... అలాగైతే తమకు చూపించాలంటూ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. కానీ ఇప్పటి వరకు ఆయన ముఖాన్ని చూపించలేదని
దీనివల్ల ప్రజలలో అనుమానాలు మరింత పెరుగుతున్నాయని ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఇమ్రాన్ ఖాన్ కుటుంబ సభ్యులు, మద్దతుదారులు, రావల్పిండిలోని అడియాలా జైలువద్దకు చేరుకుని భారీగా నిరసనలు చేపట్టారు. పాక్ ప్రభుత్వంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మరోవైపు పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ 2023 ఆగస్టు నుండి జైల్లో ఉన్నారు. 

గత నెల రోజులుగా ఆయనను చూసేందుకు కుటుంబ సభ్యులు జైలు అధికారులను కోరుతున్నారు. అయితే.. ఇటీవల భారీ పుకార్ల నేపథ్యంలో.. ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు భారీ స్థాయిలో రావల్పిండికి చేరుకుని నిరసనలకు దిగారు . దీంతో ఉద్రిక్త వాతావరణం తలెత్తడంతో పాక్ ప్రభుత్వం రావల్పిండితో పాటు, పలు ప్రాంతాల్లో సెక్షన్ 144 విధించారు. రావల్పిండిలో సమావేశాలు, సిట్-ఇన్‌లు, ర్యాలీలు, ఊరేగింపులు, ప్రదర్శనలు నిర్వహించకుండా కీలక ఆదేశాలు జారీ చేసింది.

Read more: Imran Khan: ఇమ్రాన్ ఖాన్ బతికున్నాడా..? చనిపోయాడా..? ఇంతకీ పాకిస్థాన్ లో ఏం జరుగుతోంది..!

 ఈ సెక్షన్ డిసెంబర్ 1 నుంచి 3 వరకు మూడు రోజుల పాటు అమల్లో ఉంటుందని పోలీసులు తెలిపారు. మరోవైపు ఇమ్రాన్ ఖాన్ ను తమకు చూపిస్తే ఈ వివాదం ఉండదని  తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ కోరుతుంది. మరోవైపు.. ఇమ్రాన్ ఖాన్‌ను ఎందుకు కలవనివ్వడంలేదని, దీని వెనకాల ఏదో కుట్ర జరిగిందని పార్టీ ప్రతినిధులు పాక్ ప్రభుత్వంపై  ప్రశ్నలు సంధిస్తున్నారు. మరోవైపు పాక్ లో ప్రస్తుతం ఎక్కడ చూసిన ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

60
comment0
Report
IPInamdar Paresh
Dec 02, 2025 12:32:44
Hyderabad, Telangana:

cm Revanth reddy controversy comments on Hindu deities: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తిచేసుకున్న నేపథ్యంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా మంత్రులు, ప్రజా ప్రతినిధులు రెండెళ్లలో కాంగ్రెస్ ఏవిధంగా తెలంగాణను ముందుకు తీసుకెళ్లిందో నేతలు చెప్పాలన్నారు. బడి , గుడి, రచ్చ బండ, స్మశానం ఇలా ప్రతి చోట ఎక్కడ గ్యాదరింగ్ జరిగిన అక్కడ కాంగ్రెస్ అమలు చేస్తున్న పథకాల గురించి చెప్పాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.  ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మరోసారి తమ అపోసిషన్ పార్టీలపై  మండిపడ్డారు.  తాను.. ముఖ్యమంత్రి కాకముందు మస్తు మంది మీద నాకు కోపం ఉండేదని,  రూంలో వేసి కట్టె తీసుకొని అలిసిపోయే దాకా కొట్టాలని ఉండేదని సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వారిని కొట్టి ఎనర్జీ ఎందుకు లాస్ కావాలని వదిలేశానన్నారు.

 

అంతేకాకుండా.. హిందూ దేవతలపై కూడా వివాదాస్పద  వ్యాఖ్యలు చేశారు. పెళ్లి కానోడికి హనుమంతుడు, రెండు పెళ్ళిలు చేసుకునే వాళ్లకు ఒక దేవుడు ఉన్నడు,  మందు తాగేటోళ్లకు ఇంకో దేవుడు ఉన్నాడని.. ఒక్కొక్కరికి ఒక్కో దేవుడు ఉన్నాడంటూ సీఎం రేవంత్ రెడ్డి వేటకారంగా మాట్లాడారు.  అదే విధంగా.. మోడీని బుల్లెట్ ట్రైన్ ఇస్తవా.. సస్తవా అని అడగడానికి ఢిల్లీ పోతున్ననంటూ సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
 కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన చీరలు  90 శాతం మందికి అందాయన్నారు.

ఎన్ని కల కోడ్ కారణంగా కొంత మందికి ఇవ్వలేదన్నారు. ఎన్నికల కోడ్ తర్వాత చీరల పంపిణి ఉంటుందన్నారు. అదే విధంగా.. ఉస్మానియా యూనివర్సిటీకి డిసెంబర్ 7వ తేదీన వెళ్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ యూనివర్సిటీ అభివృద్ధికి ఎంత ఖర్చు అయినా నిధులు కేటాయిస్తామని స్పష్టం చేశారు. ఎంతో మంది రాజకీయ దురంధరుల్ని ఉస్మానియా ఇచ్చిందన్నారు.  కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు సోనియా, రాహుల్ గాంధీలపై కేసులు పెడితే భయపడేది లేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

ప్రైవేట్‌ సంస్థల్లో పని చేసిన వారికి రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ ఉండవని.. ఈ నేపథ్యంలో ఎప్పుడో మూతపడిన నేషనల్‌ హెరాల్డ్‌ సిబ్బందిని  ఆదుకున్నరన్నారు.  పత్రికను తిరిగి నడిపించాలనే ఉద్దేశ్యంతో బోర్డు ఆఫ్‌ డైరెక్టర్లుగా కొంత మంది కాంగ్రెస్‌ పార్టీ నేతలను తీసుకున్నారన్నారని స్పష్టం చేశారు. దేశం కోసం గాంధీ కుటుంబం ఎన్నో త్యాగాలు చేసిందన్నారు.

Read more: Komati Reddy Venkat Reddy: నీ సినిమాలు ఆడనివ్వం.!. పవన్ కళ్యాణ్‌పై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..

ఇదిలా ఉండగా సీఎం రేవంత్ రెడ్డి రూమ్ ల పడేసి కొట్టాలనుండే వ్యాఖ్యలను కొంత మంది నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయించిన అప్పట్లో కీలక బీఆర్ఎస్ నేతల్ని కొట్టాలనుందా సార్.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియో వైరల్ గా మారాయి.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

102
comment0
Report
IPInamdar Paresh
Dec 02, 2025 12:32:20
Hyderabad, Telangana:

Venu Swamy First reaction on Samantha and raj nidimoru wedding video: సమంతా , రాజ్ నిడిమోరులు ఇటీవల వివాహ బంధంతో ఒక్కటైయ్యారు. ఈ క్రమంలో కోయంబత్తురులో వీరి పెళ్లి వేడుక ఎంతో గ్రాండ్ జరిగింది. అయితే.. మొత్తంగా వీరి పెళ్లి ఈషా ఫౌండేషన్ లో భూతశుద్ది క్రతువు పద్దతిలో జరిగింది. ఈ క్రతువులో పంచ భూతాలను శుద్ది చేసుకుంటారు. ఈషా ఫౌండేషన్ దగ్గర ఒక కొలను ఉంటుంది. దానిలో స్నానం చేసి శుద్ది పొందుతారంటారు. ఈ క్రతువుతో పూర్వజన్మ కర్మలు అంటుకొవంటారు. తెలిసి, తెలియక చేసిన కర్మలు అంటుకోవాని దీని ప్రభావం వల్ల కొత్తగా పెళ్లి తర్వాత సంసార జీవితంలో ఎలాంటి ఆటంకాలు కూడా ఉండవని భావిస్తారు.

 

అందుకే ఈ క్రతువును నిర్వహిస్తారు. కర్మల వల్లనే జీవితంలో సమస్యలు వస్తాయని అలాంటిది కర్మలప్రభావం దీనిలో ఉండదని కూడా ఈషా ఫౌండేషన్ నిర్వాహకులు చెబుతున్నారు.  ఈ నేపథ్యంలో ప్రస్తుతం  సమంతా, రాజ్ నిడిమోరుల పెళ్లిపై కాంట్రవర్సీ జ్యోతిష్యుడు వేణు స్వామి మొదటిసారి రియాక్ట్ అయ్యారు. నిన్నటి నుంచి తనకు చాలా మంది ఫోన్ లు , మెస్సెజ్ లు చేస్తున్నారని, మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా సమంత, రాజ్ నిడిమోరుల పెళ్లిపై ఫోకస్ పెట్టిందన్నారు.

అయితే.. వారి పెళ్లి  భూతశుద్ది క్రతువు పద్దతిలో జరిగినట్లు తెలిసిందన్నారు. అంతేకాకుండా.. గత మూడు రోజుల నుంచి తాను.. కొత్తగా రిలీజ్ కాబోయే మూవీ కోసం భగళా ముఖి అమ్మవారికి పూజలు చేస్తున్నట్లు చెప్పారు. ఎవరి పట్టింపులు తనకు ప్రస్తుతం లేవన్నారు. వ్యక్తిగతంగా టార్గెట్ చేయాలంటే ఒకలాగా, ఫెమస్ కావాలంటే మరోలాగా కొంత మంది ప్రొజెక్ట్ చేస్తారన్నారు.

Read more: Ranveer singh: కాంతారా మూవీపై వివాదాస్పద వ్యాఖ్యలు.. ఫైనల్‌గా కీలక ప్రకటన చేసిన రణ్ వీర్ సింగ్..

తనను ఎలా సేవ్ చేసుకొవాలో  భగళముఖి, కామఖ్యఅమ్మవారు, వెంకటేశ్వర స్వామిపై తన భారం ఉంచానని వ్యాఖ్యలు చేశారు.  మొత్తంగా చాలా మంది నెటిజన్లకు వేణు స్వామి సమంతా పెళ్లిపై చేసిన కామెంట్స్ బిగ్ ట్విస్ట్ ఇచ్చాయని చెప్పుకొవచ్చు. ఈ వీడియో వైరల్గా మారింది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

90
comment0
Report
Dec 02, 2025 10:14:03
157
comment0
Report
Dec 01, 2025 16:13:29
111
comment0
Report
Dec 01, 2025 08:59:07
112
comment0
Report
ఇపఇనాందార్ పరేశ్
Nov 28, 2025 00:19:03
Kanagumakulapalli, Andhra Pradesh:

Rj mahvash mocking comments on smriti mandhana palash muchhal wedding: ప్రస్తుతం స్మృతి మంధాన, పలాష్ ముచ్చల్ ల పెళ్లి వాయిదా అంశం నెట్టింట హట్ టాపిక్ గా మారింది. దీనిపై నెటిజన్లు ఎవరికి నచ్చినట్లు వారు రూమర్స్ వైరల్ చేస్తున్నారు .మొత్తంగా కొంత మంది పలాష్ ముచ్చల్ కు మరో యువతితో ఎఫైర్ ఉందని, అది తెలిసి స్మృతి మంధాన తండ్రికి గుండెపోటు వచ్చిందని కొంత మంది ప్రచారం చేస్తున్నారు. అయితే.. ఇటీవల తరచుగా పలాష్ ముచ్చల్ కూడా ఆస్పత్రి పాలయ్యాడు. ముంబైకి తీసుకెళ్లిమరీ ఆయనకు చికిత్స అందించారు.

 

పలాష్ సోదరి, తల్లి కూడా ఈ విషయంపై తమ ప్రైవసీని గౌరవించాలని కోరారు.  అదే విధంగా స్మృతి మంధాన తండ్రి అంటే పలాష్ ముచ్చల్ కు చాలా గౌరవమని పలాష్ తల్లి చెప్పింది. ఈ క్రమంలో పలాష్ ముచ్చల్ మరో యువతితో చేసిన  వాట్సాప్ చాట్స్, ఫోటోలు నెట్టింట హల్ చల్ చేశాయి. మరోవైపు స్మృతి మంధాన తన ఇన్ స్టాలోని నిశ్చితార్థం, ప్రీవెడ్డింగ్ కు చెందిన అన్ని ఫోటోలు, వీడియోలను డిలీట్ చేశారు.ఈ రచ్చ నేపథ్యంలో 

యుజ్వేంద్ర చాహల్ ప్రియురాలు అని గతంలో వార్తలలో ఎక్కిన కొరియోగ్రాఫర్ ఆర్జే మహ్‌వష్ తన ఇన్ స్టాలో ఒక వీడియోను పోస్ట్ చేశారు. స్మృతి మంధాన,పలాష్ రచ్చ నడుస్తున్న నేపథ్యంలో ఈ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తుంది. ఈ వీడియోలో  మహ్ వష్ మాట్లాడుతూ .. మగాళ్లు ఒట్టి మాయగాళ్లంటూ ఫైర్ అయ్యింది.

ఎవరిని నమ్మడానికి వీల్లేదని, ఒకవేళ అమ్మాయిలు పెళ్లి కుదిరితే సోషల్ మీడియాలో అతగాడి ఫోటోను పబ్లిక్ లో పెట్టాలని , అతను ఎవరితో అయిన డేటింగ్ లో ఉన్నాడో అని పూర్తిగా ఎంక్వైరీ చేసుకొవాలన్నారు. అంతేకాకుండా..ఈ విషయంలో మోహమాటం ఉంటే తనకు చెప్పాలని, తాను అలాంటి వారి సమాచారం సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానంది.

కనీసం ఫస్ట్ నైట్ కు ముందు మీ పార్టనర్ గురించి పూర్తిగా తెలుసుకుని ప్రొసీడ్ అవ్వాలన్నారు. ఒక వేళ తనకు పెళ్లి సెట్ అయిన వారం ముందు సోషల్ మీడియాలో అతని ఫోటోను షేర్ చేస్తానని, అతను ఎవరితో అయిన డేటింగ్ చేశాడా.?.. ఒక వేళ చేస్తే వారు తనకు మెస్సెజ్ చేయాలని కూడా చెప్తానంటూ మహ్ వష్ వీడియోను రిలీజ్ చేసింది.

Read more: Palash Muchhal: మరో యువతితో పలాష్ రొమాన్స్.?... స్మృతి మంధాన పెళ్లి వాయిదా వెనుక షాకింగ్ నిజాలు.!.

ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్గా మారింది. దీనిపై నెటిజన్లు.. స్మృతి మంధాన, పలాష్ ల గురించే ఈ వీడియోపెట్టారు కదా.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే.. దీనికి మాత్రం మహ్ వష్ మాత్రం ఎలాంటి రిప్లై ఇవ్వలేదు.

373
comment0
Report
Advertisement
Back to top