ఒకే కాన్పులో ఐదు మేక పిల్లలకు జననం
Bellampalle, Telangana:మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం, బుదా కలన్ గ్రామంలో అద్భుతం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఆవుల అంజి అనే వ్యక్తికి చెందిన మేక ఐదు మేక పిల్లలకు శనివారం రాత్రి జన్మనిచ్చింది. ఈ మేక మొదటి కాన్పులోనే ఐదు మేక పిల్లలకు జన్మనిచ్చిందని అంజి తెలిపారు. ఐదు మేక పిల్లలను సంరక్షించేందుకు వైద్యుల సలహాలు సూచనలు కావాలని అతడు కోరారు. మేక పిల్లలను చూసేందుకు గ్రామ ప్రజలు తరలివస్తున్నారు.हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
Fee Reimbursement: ఫీజు రీయింబర్స్మెంట్ రద్దుకు రేవంత్ రెడ్డి కుట్ర: బీసీ జేఏసీ
Hyderabad, Telangana:Students Fee Reimbursement: తెలంగాణ విద్యార్థులతో రేవంత్ రెడ్డి ఆటలాడుకుంటున్నారని బీసీ జేఏసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. పేద, బడుగు బలహీనవర్గాల విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఎందుకు చెల్లించడం లేదని బీసీ జేఏసీ నిలదీసింది. ఫీజు రీయింబర్స్మెంట్ అనేది విద్యార్థుల హక్కు.. ఇది ఎవరి భిక్షం కాదని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి జేబుల నుంచి ఇస్తలేరు. భట్టి విక్రమార్క కష్టపడి చెమటోడ్చిన డబ్బులు కావు' అని బీసీ జేఏసీ నాయకులు తెలిపారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించకపోతే తెలంగాణ రాష్ట్రం అగ్గి అవుతుందని హెచ్చరించారు.
Also Read: Govt Employees: డిప్యూటీ సీఎంతో భేటీ! తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు నేడే భారీ శుభవార్త?
ఫీజు రీయింబర్స్మెంట్ పథకంపై ప్రభుత్వం ఇచ్చిన జీవో నెంబర్ 7ను రద్దు చేయాలని హైదరాబాద్లో బీసీ జేఏసీ సమావేశం నిర్వహించింది. జీవోకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేపట్టాలని విద్యార్థులకు బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన జీవోలను కాలబెట్టి శాంతియుత నిరసనలు తెలుపాలని విజ్ఞప్తి చేశారు. విద్యార్థుల నుండే ఫీజు వసూలు చేసుకోవాలన్న హైకోర్టు తీర్పుకు ప్రభుత్వమే కారణం అని స్పష్టం చేశారు.
Also Read: Education Year: విద్యా సంవత్సరానికి స్కూల్ డ్రెస్సులు, నోటు పుస్తకాలు సకాలంలో అందాలి: తెలంగాణ సీఎం
'ఉన్నత విద్య నుండి బడుగు విద్యార్థులను రేవంత్ రెడ్డి ప్రభుత్వం దూరం చేస్తోంది. విద్యార్థుల ఖాతాల్లోకి ఫీజులు చెల్లిస్తామన్న ప్రభుత్వ నిర్ణయం అవివేకం. ఫీజుల రీయింబర్స్మెంట్ పథకాన్ని నీరుగార్చడానికి జీవో నెంబర్ 7ను ప్రభుత్వం తీసుకువచ్చింది' అని బీసీ జేఏసీ స్పష్టం చేసింది. ప్రభుత్వానికి దమ్ముంటే ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని రద్దు చేస్తామని ప్రకటించాలని రేవంత్ రెడ్డికి సవాల్ చేసింది. ఆనాటి కాంగ్రెస్ ఫీజుల పథకం తెస్తే.. ఈనాటి కాంగ్రెస్ ఆ పథకాన్ని రద్దు చేయాలని చూస్తోందని మండిపడ్డారు. ఫీజు రీయింబర్స్మెంట్పై కాంగ్రెస్ ప్రభుత్వం డొంకతిరుగుడు మాటలు మానుకోవాలని హితవు పలికారు. ఫీజుల బకాయిలు ఇవ్వకపోతే జూన్ నెలలో లక్ష మంది విద్యార్థులతో హైదరాబాద్ను దిగ్భందిస్తామని బీసీ జేఏసీ హెచ్చరించింది. ఫీజు రీయింబర్స్మెంట్పై తాము కోర్టుకు వెళ్తామని బీసీ జేఏసీ ప్రకటించింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Kondagattu: ఎండకాలంలోనూ ఎండని సీతమ్మ బావి నీరు.. కొండగట్టు అంజన్న ఆలయ రహస్యం ఇదే!
Hyderabad, Telangana:Seethamma Bavi Kondagattu Latest News: తెలంగాణలోని అత్యంత మహివాన్మితమైన పుణ్యక్షేత్రాల్లో ఒకటైన కొండగట్టు అంజన్న ఆలయంలో ఒక ప్రత్యేకమైన ఆచారం కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతూ వస్తోంది. సాక్షాత్తు సీతమ్మ తల్లి పేరుతో పిలుచుకునే సీతమ్మ భావించి సేకరించిన పవిత్ర జలాలతోనే స్వామివారికి నిత్యం అభిషేకం నిర్వహించడం ఇక్కడి విశేషం.. ఈ సాంప్రదాయం వెనకున్న ఆసక్తికరమైన విషయాలను ఆలయ అర్చకులు ఇటీవల వెల్లడించారు. అవేంటో? ఈ బావిలో నుంచి తీసిన నీటిని అభిషేకం చేయడానికి గల కారణాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
ఆలయానికి దిగువన.. సుమారు 6 కిలోమీటర్ దూరంలో దట్టమైన పచ్చని చెట్ల మధ్య సహజ సిద్ధంగా ఏర్పడిన భావి సీతమ్మ భావిగా ప్రసిద్ధి చెందింది. ఈ భావి నీరు అత్యంత స్వచ్ఛమైనదిగా.. మధురంగా ఉంటుందని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. నిత్యం ఇద్దరు అర్చకులు తెల్లవారి జామునే ఈ భావి వద్దకు వెళ్లి.. సాంప్రదాయ బద్ధంగా రాగి బిందెలతో నీటిని సేకరించి ఆలయానికి తీసుకు వస్తారు.. స్వామివారికి చేసే అభిషేకం నుంచి భక్తులకు పంచే తీర్థ ప్రసాదాల తయారీ వరకు ఈ పవిత్ర జలాలనే వినియోగిస్తారట..
ఈ బావికి ఉన్న అతిపెద్ద విశేషం ఏంటంటే.. ఎండలు దంచి కొట్టే మండు వేసవిలో కూడా ఇందులో నీరు ఇనికిపోకుండా ఉండడం.. చుట్టుపక్కల ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటి.. సాధారణ బోర్లు ఎండిపోయినప్పటికీ.. ఈ సీతమ్మ బావిలో మాత్రం నీరు ఎప్పుడూ నిండు గానే ఉండటం భక్తులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇది సాక్షాత్తు అంజన్న చల్లని చూపు వల్లే సాధ్యమని.. ప్రకృతి ప్రసాదించిన వరమని స్థానికులు చెబుతూ ఉంటారు..
సుదూర ప్రాంతాల నుంచి వచ్చే యాత్రికులు సైతం ఈ సీతమ్మ భావి ప్రత్యేకత గురించి తెలుసుకొని.. అంజన్నకు జరిపి అభిషేకంలో వాడే జలాల గొప్పతనాన్ని చెప్పుకుంటూ ఉంటారు. కొండగట్టు క్షేత్రం ఆధ్యాత్మికతకు, ప్రకృతి సమతుల్యతకు ఈ భావి ఒక సజీవ నిదర్శనంగా నిలుస్తుందని అర్చకులు చెబుతున్నారు. ఆ జలాల పవిత్రతను అనుభూతి చెందుతూ ఉంటారు. ప్రకృతి సిద్ధంగా లభించే ఈ నీరును తీర్ధంగా ఇవ్వడం వల్ల.. అంజన్న భక్తులకు ఒక అద్భుతమైన భక్తి అనుభూతిని నింపుతుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Sircilla: దేశమే గర్వించేలా.. సిరిసిల్ల వెంకటపల్లి సత్తా.. జాతీయ స్థాయిలో అరుదైన గుర్తింపు!
Hyderabad, Telangana:Sircilla News: గ్రామీణ స్థానిక సంస్థల పనితీరును సమగ్రంగా అంచనా వేస్తూ.. కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన పంచాయతీ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్ 2.0 (2023-24) నివేదికలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అత్యుత్తమ ప్రదర్శనతో అగ్రస్థానంలో నిలిచింది. రాష్ట్రం మొత్తం 86.41.లతో నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకోగా.. అందులో రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలంలోని వెంకటపల్లి గ్రామం తన ప్రతిభతో జాతీయస్థాయిలో ప్రత్యేకమైన గుర్తింపు పొందింది.. అయితే, ఈ గుర్తింపు ఏంటో, ఆ ఊరికి దక్కిన గౌరవం ఏంటో దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
గ్రామీణ అభివృద్ధితో పాటు సామాజిక న్యాయం, ప్రజాస్వామ్యం వంటి కీలక అంశాల్లో వెంకటపల్లి అద్భుతమైన ప్రగతిని కనబరిచింది. కేంద్రం నిర్దేశించిన కఠినమైన ప్రమాణాలను సమర్ధవంతంగా అమలు చేస్తూ.. రెండు ప్రధాన విభాగాల్లో అత్యుత్తమ గ్రేడ్లను కైవసం చేసుకుంది.. చైల్డ్ ఫ్రెండ్లీ పంచాయతీ విభాగంలో 96.67 స్కోర్ సాధించి.. ఏ ప్లస్ గ్రేడ్ ని దక్కించుకోగా.. సోషల్ జస్టిస్ విభాగంలో 88.82 స్కూలుతో ఏ గ్రేడును సొంతం చేసుకుంది.. అంతేకాకుండా వివిధ విభాగాల్లో కూడా అద్భుతమైన స్కోర్లను సాధించినట్లు తెలుస్తోంది.
ఒక చిన్న గ్రామం జాతీయస్థాయిలో ఇలాంటి ఘనత సాధించడం వెనక స్థానిక పాలన యంత్రాంగం తో పాటు ప్రజాప్రతినిధులు, గ్రామస్తుల సమిష్టి కృషి దాగి ఉంది. పాఠశాలల్లో మౌలిక వసతులతో పాటు పిల్లల హక్కుల పరిరక్షణ, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన వంటి చర్యల వల్ల చైల్డ్ ఫ్రెండ్లీ విభాగంలో వెంకటపల్లికి అత్యుత్తమ గుర్తింపు లభించింది. అదేవిధంగా సమాజంలోని అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించడంతోపాటు సంక్షేమ పథకాలను లబ్ధిదారులకు పారదర్శకంగా చేరవేయడంలో గ్రామపంచాయతీ చూపిన చొరవ సోషల్ జస్టిస్ విభాగంలో అద్భుతమైన ఫలితాలను అందించింది..
కేంద్ర ప్రభుత్వ నివేదికలో వెంకటపల్లి పేరు ప్రముఖంగా కనిపించడంతో జిల్లా వ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.. గ్రామ అభివృద్ధిలో ఇది ఒక మైలురాయని.. రాబోయే రోజుల్లో మరిన్ని విభాగాల్లోనూ ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తామని గ్రామ పాలకవర్గం ఆశాభావం వ్యక్తం చేస్తోంది. దేశానికి ఆదర్శంగా నిలిచిన వెంకటపల్లి, మిగతా గ్రామాలకు కూడా స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. తెలంగాణ రాష్ట్రం సాధించిన ఈ అరుదైన విజయంలో సిరిసిల్ల జిల్లాకు చెందిన ఈ గ్రామం కీలక పాత్ర పోషించడం విశేషం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
GT Vs RCB Catch: బంతి నేలను తాకినా అంపైర్ ఎందుకు ఔట్ ఇచ్చాడో తెలుసా! ఆర్సీబీ అభిమానుల మండిపాటు!
Hyderabad, Telangana:GT Vs RCB Catch Controversy: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో గురువారం అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), గుజరాత్ టైటాన్స్ (GT) తలపడ్డాయి. ఈ మ్యాచ్లో ఆతిథ్య గుజరాత్ టైటాన్స్ జట్టు గెలుపొందగా.. తొలిసారి బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటిదార్ క్యాచ్ పెద్ద చర్చకు దారితీసింది. ఈ విషయంలో అంపైర్తో విరాట్ కోహ్లీ వాగ్వాదం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
ఈ సంఘటన ఆర్సిబి ఇన్నింగ్స్లోని 8వ ఓవర్లో జరిగింది. అర్షద్ ఖాన్ వేసిన బంతిని రజత్ పాటిదార్ డీప్ బ్యాక్వర్డ్ స్క్వేర్ వైపు కొట్టాడు. అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న జాసన్ హోల్డర్, దాన్ని పట్టుకోవడానికి పరుగెత్తి స్లైడ్ చేశాడు. అయితే, హోల్డర్ పట్టుకున్న బంతిని వెంటనే నేలపై తాకింది. ఆన్-ఫీల్డ్ అంపైర్ సాఫ్ట్ సిగ్నల్ నియమం ఇప్పుడు అమలులో లేనప్పటికీ, థర్డ్ అంపైర్ కూడా దానిని 'అవుట్'గా ప్రకటించడం ఇప్పుడు వివాదానికి దారితీసింది.
ఐసీసీ 33.3 రూల్ ఏమి చెబుతుంది?
క్రికెట్ లా 33.3 ప్రకారం, ఒక ఫీల్డర్ బంతిపై మాత్రమే కాకుండా తన కదలికలపై కూడా పూర్తి నియంత్రణ కలిగి ఉండాలి. ఫీల్డర్ బంతిని పట్టుకున్న తర్వాత జారుతున్నప్పుడు లేదా కింద పడుతున్నప్పుడు బంతి నేలను తాకితే, అది చట్టబద్ధమైన క్యాచ్గా పరిగణించరు.
గతంలో యాషెస్ సిరీస్లో మిచెల్ స్టార్క్ ఇలాంటి క్యాచ్ పట్టినప్పుడు, దానిని 'నాటౌట్'గా ప్రకటించారు. ఆ సంఘటనను ప్రస్తావించిన ఇర్ఫాన్ పఠాన్, ఆకాష్ చోప్రా వంటి మాజీ క్రికెటర్లు అంపైర్ నిర్ణయం పట్ల తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు.
అంపైర్కు అశ్విన్ సపోర్ట్..
అయితే, టీవీ అంపైర్ భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. క్యాచ్ పట్టిన వెంటనే బంతి తన నియంత్రణలోకి వచ్చిందని, క్యాచ్ పూర్తయిన తర్వాతే స్లైడింగ్ జరిగిందని చెబుతూ జాసన్ హోల్డర్ తన నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. దీనికి స్పందిస్తూ రవిచంద్రన్ అశ్విన్, హోల్డర్ చేతులు పెద్దవిగా ఉన్నాయని, బంతి అతని చేతుల్లో పూర్తిగా ఇమిడిపోయిందని అన్నారు. అతని వేళ్ల మధ్య గడ్డి ఉన్నంత మాత్రాన బంతి నేలను తాకినట్లు కాదని ఆయన పేర్కొన్నారు.
మొత్తానికి గుజరాత్ టైటాన్స్ మ్యాచ్లో 4 వికెట్ల తేడాతో గెలిచినా.. జేసన్ హోల్డర్కు ఇందులో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వచ్చినా.. ఐపీఎల్ చరిత్రలో ఇదో మాయని మచ్చగా మిగిలిపోయే అవకాశం ఉంది. అలాగే, ఈ సంఘటనతో ఆర్సీబీ అభిమానులు మనస్తాపం చెందారన్నది కూడా నిజం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Govt Employees: డిప్యూటీ సీఎంతో భేటీ! తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు నేడే భారీ శుభవార్త?
Hyderabad, Telangana:Telangana Pay Revision Committee: వేతన సవరణ సంఘం కోసం తీవ్ర ఎదురుచూపులు చూస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్దారులకు నేడు తెలంగాణ ప్రభుత్వం భారీ శుభవార్త అందించే అవకాశం ఉంది. వేతన సవరణ సంఘంపై కీలక ముందడుగు పడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. పీఆర్సీతోపాటు భారీగా పెండింగ్ ఉన్న డీఏ, రిటైర్మెంట్ బెనిఫిట్స్పై కదలిక వస్తుందని ప్రభుత్వ ఉద్యోగ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వంతో ఉద్యోగ సంఘాల చర్చల విశేషాలు ఇలా ఉన్నాయి.
Also Read: Sanath Nagar TIMS: హైదరాబాద్లో మరో కొత్త నిమ్స్ తరహా ఆస్పత్రి.. ఎక్కడో తెలుసా?
ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సమస్యలపై నేడు హైదరాబాద్లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సమావేశం కానున్నారు. ఉద్యోగ సంఘాల నేతలతో డిప్యూటీ సీఎం చర్చించనున్నారు. అయితే ఈ సమావేశానికి ఉద్యోగ సంఘాలన్నింటినీ కాకుండా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లోని 9 శాశ్వత సంఘాల నాయకులను మాత్రమే ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో టీఎన్జీవో, టీజీవో, సెక్రటేరియట్ అసోసియేషన్ (టీజీఎస్ఏ), పీఆర్టీయూ టీఎస్, ఎస్టీయూ టీఎస్, ట్రెస్మా, క్లాస్ 4 ఎంప్లాయీస్ సెంట్రల్ అసోసియేషన్, టీఎస్ యూటీఎఫ్, టీఆర్టీఎఫ్ ప్రతినిధులు హాజరు కానున్నారు.
Also Read: Liver Transplant: గాంధీ దవాఖానాలో 18 నెలల బాలుడికి లివర్ మార్పిడి.. అన్నీ ఉచితంగా
ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం.. హక్కుగా రావాల్సిన డీఏ, రిటైర్మెంట్ బెనిఫిట్స్, పీఆర్సీ తదితర అపరిష్కృతంగా ఉన్నాయి. ఉద్యోగుల డిమాండ్లు, సమస్యలు పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తుండడంతో ఉద్యోగ సంఘాలు పోరాటానికి సిద్ధమైన విషయం తెలిసిందే. ఇప్పటికే పలు దశల్లో ప్రభుత్వానికి తమ ఆక్రోశాన్ని.. నిరసనల ద్వారా తెలిపారు. తమ డిమాండ్ల పరిష్కారానికి దశల వారీగా నిరసన కార్యక్రమాలకు ఉద్యోగుల జేఏసీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా కొన్ని వారాల కిందట కలెక్టరేట్, సెక్రటేరియట్లో నిరసన ర్యాలీలు చేసిన సంగతి తెలిసిందే. మే 5వ తేదీన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ సంఘాలు నిరాహార దీక్షలు ప్రారంభించనున్నాయి. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించింది. ఈ క్రమంలోనే ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం సమావేశం కానుంది. ఆయా సమస్యలపై చర్చించాలని డిప్యూటీ సీఎం నిర్ణయించినట్లు తెలుస్తోంది.
Also Read: AP Rains: మండే ఎండల వేళ ఆంధ్రప్రదేశ్కు చల్లటి కబురు.. రేపు ఈ జిల్లాల్లో వర్షాలు
ప్రభుత్వ ఉద్యోగులకు మొత్తం 64 డిమాండ్లు ఉన్నాయి. వాటిలో ప్రధానమైనది కొత్త వేతన సవరణ సంఘం (పీఆర్సీ). పీఆర్సీ నివేదిక తెప్పించుకొని అమలు చేయాలని ఉద్యోగ సంఘాల నాయకులు సమావేశంలో ప్రధానంగా డిమాండ్ లేవనెత్తనున్నారు. వాస్తవంగా కొత్త పీఆర్సీ 2023 జూలై 1వ తేదీ నుంచి అమలు కావాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు నివేదిక రాలేదు. దీనికితోడు రిటైర్మెంట్ పొందిన విశ్రాంత ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనాలను (బెనిఫిట్స్) దాదాపు రూ.10 వేల కోట్లు పెండింగ్లో ఉన్నాయి. వాటిని చెల్లించాలని, సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ఉద్యోగ సంఘాలు ప్రధానంగా చేస్తున్న డిమాండ్లు. వాటిని డిప్యూటీ సీఎంతో జరిగే సమావేశంలో ప్రధానంగా ప్రస్తావిస్తామని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. ఈసారి స్పష్టమైన హామీ.. నిర్ణయంతోనే వస్తామని ఉద్యోగ సంఘాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఉద్యోగ సంఘాల ఆందోళనలు, నిరసనల నేపథ్యంలో ప్రభుత్వం నేడు ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Lakshmi Narayana Rajayoga: లక్ష్మీ నారాయణ రాజయోగంతో ఈ రాశుల వారి లైఫ్ మారిపోబోతోంది.. అపార సంపద మీ సొంతం!
Hyderabad, Telangana:Lakshmi Narayana Rajayoga May 2026: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మే నెల ఎంతో ప్రత్యేకమైనది. గ్రహగమనంలో వచ్చే మార్పుల వల్ల ఈ నెలలో అత్యంత శుభప్రదమైన లక్ష్మీనారాయణ రాజయోగం ఏర్పడుతోంది. ముఖ్యంగా శుభగ్రహాలైన బుధుడితో పాటు శుక్రుడు ఒకే రాశిలో కలయిక జరగడం కారణంగానే ఈ శక్తివంతమైన అరుదైన రాజయోగం ఏర్పడుతుంది. అయితే, ఈ రాజయోగ ప్రభావం జాతకంలో గ్రహ స్థితులను బట్టి ఫలితాలను అందించబోతోంది. లక్ష్మీనారాయణ రాజయోగం జాతకంలో శుభస్థానంలో ఉన్న రాశుల వారికి అపారమైన సంపద కలగడమే కాకుండా కెరీర్లో అద్భుతమైన పురోగతి, కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. దీంతోపాటు ఆర్థికంగా కృంగిపోయిన వారికి అనేక సమస్యల నుంచి పరిష్కారం దొరుకుతుంది.
సాధారణంగా బుధుడిని తెలివితేటలతో పాటు వాక్చాతుర్యానికి కారకుడిగా భావిస్తూ ఉంటారు.. ఇక శుక్రుడిని భోగభాగ్యాలతో పాటు వైభోగానికి అధిపతిగా చెప్పుకుంటారు. వీరి కలయిక కారణంగా కొన్ని రాశుల వారికి వ్యక్తిగత జీవితాల్లో అద్భుతమైన సుఖసంతోషాలు పెరగడమే కాకుండా వ్యాపార రంగాల్లో ఉన్నవారికి లాభాలు కలుగుతూ ఉంటాయి. ఉద్యోగాలు చేసే వారికి పదోన్నతులు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ యోగం కారణంగా క్రింది రాశుల వారికి దిమ్మతిరిగే ధన లాభాలు కలుగుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు.
ఈ రాశులవారికి ఊహించని ధన లాభాలు:
వృషభ రాశి
లక్ష్మీనారాయణ రాజయోగం కారణంగా వృషభ రాశి వారికి ఆకస్మాత్తుగా ధను లాభాలు కలిగే అవకాశాలున్నాయి. నిలిచిపోయిన పనులు పూర్తవుడమే కాకుండా.. కెరీర్ పరంగా అద్భుతమైన నిర్ణయాలు తీసుకుంటారు. ముఖ్యంగా జీవితంలో సానుకూలమైన లాభాలు రావడం ప్రారంభమవుతాయి. ఎప్పటినుంచో దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకు ఈ సమయం చాలా అద్భుతమైన అవకాశాలను అందిస్తుంది.
సింహరాశి
సింహరాశిలో జన్మించిన వ్యక్తులకు కూడా వ్యాపారాలపరంగా భారీ లాభాలు రావడం ప్రారంభమవుతాయి. వీరికి సమాజంలో అద్భుతమైన గౌరవం పెరగడమే కాకుండా కొత్త పెట్టుబడుల నుంచి బోలేడు ప్రయోజనాలు కలుగుతాయి. తీవ్ర అనారోగ్య సమస్యలతో ఉన్న వ్యక్తులకు కాస్త పరిష్కారం కూడా దొరుకుతుంది. అంతేకాకుండా ఆర్థికంగా దిమ్మ తిరిగే ధన లాభాలు కలుగుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు.
మకర రాశి
మకర రాశిలో జన్మించిన వ్యక్తులకు కుటుంబంలో సంతోషకరమైన వాతావరణము నెలకొంటుంది. ముఖ్యంగా వీరు అనుకున్న పనులు ఎంతో సులభంగా చేయగలుగుతారు. దీర్ఘకాలిక సమస్యల నుంచి ఎంతో సులభంగా పరిష్కారం దొరుకుతుంది. అంతేకాకుండా విదేశీ ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. తీవ్ర సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకు పరిష్కారం కూడా దొరకబోతోంది.
కుంభరాశి
కుంభరాశిలో జన్మించిన వ్యక్తులకు మే నెల చాలా అద్భుతంగా ఉండబోతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులందరికీ ఈ సమయంలో చక్కటి పరిష్కారం ఉండబోతోంది. ముఖ్యంగా పోటీ పరీక్షలు రాసే ప్రతి విద్యార్థికి విశేషమైన ఫలితాలు కలుగుతాయి. అంతేకాకుండా ఉద్యోగాలు చేస్తున్న వ్యక్తులకు ఈ సమయం గోల్డెన్ జాక్పాట్ కొట్టబోతున్నారు. అలాగే అన్ని రకాల సమస్యలు ఎంతో సులభంగా తొలగిపోబోతున్నాయి..
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Hyderabad: ముగ్గురితో ఎఫైర్.. భార్య ప్రైవేట్ వీడియోలు నెట్టింట వైరల్, తట్టుకోలేక హుస్సేన్ సాగర్లో దూకి టెకీ బలవన్మరణం!
Hyderabad, Telangana:Wife's Private Videos with 3 Men Techie Suicide: అక్రమ సంబంధాలు కుటుంబాలను విచ్ఛిన్నం చేయడమే కాకుండా.. పిల్లలను కూడా అనాథలుగా మారుస్తున్నాయి. ఒకరి ప్రాణాలు తీయడం.. లేక వాళ్ళు సూసైడ్ చేసుకునే పరిస్థితులకు దారితీస్తున్నాయి. హైదరాబాదులోని ఇలాంటి దారుణ ఘటన మరొకటి వెలుగులోకి వచ్చింది. తన భార్య ఆగడాలను చూడలేక హుస్సేన్ సాగర్లోకి దూకి ఓ టెకీ ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల ప్రకారం.. ఏపీలోని మార్కాపురం చెందిన సీతారాం (36),నంద్యాలకు చెందిన రేణుకతో 2018లో వివాహం జరిగింది. అయితే ప్రస్తుతం వీరికి ఏడు, ఐదేళ్ల వయస్సున్న ఇద్దరు మగ పిల్లలు కూడా ఉన్నారు . సీతారాం సాఫ్ట్వేర్ ఇంజినీర్ గా పనిచేస్తూ నెలకు రూ.2 లక్షల జీతం కూడా సంపాదిస్తున్నారు. వీరి కుటుంబం హాయిగా ఆనందంగా బాచుపల్లిలో స్థిరపడిపోయింది. అయితే భార్య రేణుక మాత్రం అక్రమ సంబంధాలు పెట్టుకుంటూ ప్రైవేటు వీడియోలు కూడా తీసుకుంది. ఏడాదిన్నరలోనే ముగ్గురితో అక్రమ సంబంధం పెట్టుకుంది. అయితే, రమణారెడ్డి అనే వ్యక్తి రేణుకతో ప్రైవేటుగా ఉన్న వీడియోలను తీశాడు. దాన్ని ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయడంతో సీతారాం కంటపడింది. దీంతో ఆయన తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. సోషల్ మీడియాలో తన భార్య వీడియో వైరల్ అయింది. దీంతో తన భార్య నిజస్వరూపం బయటపడింది. తన భార్య రేణుకతోపాటు మరో ఐదుగురు పేర్లు చెబుతూ వాట్సాప్ స్టేటస్ కూడా పెట్టాడు సీతారాం.
అయితే ఫిబ్రవరిలోనే ఈ ఘటన జరిగిందని బాచుపల్లి సబ్ ఇన్స్పెక్టర్ హరీష్ వెల్లడించారు. అతని తండ్రి చూసి వెంటనే హుస్సేన్ సాగర్ కి పరిగెత్తి పోలీసులను కూడా సంప్రదించారు. ఇక మృతదేహాన్ని బయటికి తీశారు లేక్ పోలీసులు. వెంటనే జీరో ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. బాచుపల్లి పోలీస్ స్టేషన్ కి బదిలీ చేశారు. తీవ్రమనోవేధనతోనే తన కొడుకు సీతారాం సూసైడ్ చేసుకున్నాడని మృతుడి తండ్రి.. కోడలు, రమణారెడ్డి, కిషోర్, శ్రవణ్ అనే వ్యక్తుల పేర్లతో కేసు పెట్టాడు. రేణుక రమణారెడ్డి తో ఉన్న ప్రైవేటు వీడియోను నా కొడుకుకి పంపించింది. దీంతో మానసిక క్షోభతో కొడుకు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపాడు. ఏప్రిల్ 21న బాచుపల్లి పోలీసులు రేణుక రమణ పై సెక్షన్ 108 ప్రకారం అరెస్టు చేశారు. ఇద్దరిని జ్యూడిషియల్ రిమాండ్ కూడా పంపారు. అయితే కేసు ఇంకా లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
19 పేజీల సుదీర్ఘ సూసైడ్ రాసి మరి సీతారాం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎంతో ఆనందంగా చూసుకుంటున్న తన భార్యకు అసలు ఏం కావాలి? ఆమె ఏం కోరుకుంటుంది? అని తాను తట్టుకోలేకపోయాడు. అసలు రేణుకకు ఏం కావాలి? ప్రేమనా? లేక శృంగారమా? నా భార్యకు ఏ లోటు రాకుండా చూసుకున్నా కానీ ఆమె నాకు నమ్మకద్రోహం చేసిందంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. సూసైడ్ నోట్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఇక భార్య చేసిన మోసానికి భర్త ప్రాణాలు కోల్పోగా.. ఇద్దరు పిల్లలు అనాథలుగా మిగిలిపోయారు.
READ ALSO: కర్నూల్ జిలాల్లో ఘోర ప్రమాదం.. 8 మంది దుర్మరణం, 15 మందికి తీవ్రగాయాలు..!
READ ALSO: ప్రేమోన్మాది వేంకటేశ్పై పోలీసులు కాల్పులు.. ఇద్దరు కానిస్టేబుల్స్పై దాడిచేసి తప్పిచుకునే యత్నం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Education Year: విద్యా సంవత్సరానికి స్కూల్ డ్రెస్సులు, నోటు పుస్తకాలు సకాలంలో అందాలి: తెలంగాణ సీఎం
Hyderabad, Telangana:Academic Year 2026-27: రాబోయే విద్యా సంవత్సరంపై తెలంగాణ ముఖ్యమంత్రి సమీక్ష చేసి విద్యా శాఖ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. స్కూల్ డ్రెస్సులు, నోటు పుస్తకాలు తదితర అన్నీ ఏర్పాట్లు స్కూళ్ల ప్రారంభానికి ముందే సిద్ధం కావాలని ఆదేశించారు. విద్యాశాఖలో అవకతవకలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చేందుకు ప్రయత్నం చేస్తున్నామని ముఖ్యమంత్రి వివరించారు.
Also Read: Ambati Rambabu: వైఎస్సార్ సమాధి వేదికగా అంబటి రాంబాబు సంచలన శపథం
హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని తన నివాసంలో ముఖ్యమంత్రి విద్యా శాఖపై సమీక్ష చేశారు. విద్యా శాఖతోపాటు బీసీ, మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల పరిధిలోని విద్యా సంస్థల్లో రానున్న విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు అందజేసే సామగ్రి సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్పై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించి సమీక్షించారు. ఈ సందర్భంగా విద్యా శాఖ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. 'విద్యార్థులకు అవసరమైన విద్యా సామగ్రి సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలి. దుస్తులు, నోటు పుస్తకాలు, ఇతర సామగ్రి సకాలంలో అందిస్తే విద్యార్థులు చదువుపై పూర్తిస్థాయిలో శ్రద్ధ చూపుతారు' అని సీఎం పేర్కొన్నారు.
గతంలో ఏ శాఖకు ఆ శాఖ విడిగా ప్రొక్యూర్మెంట్, సరఫరా చేయడంతో ఏకరూపత లోపించడం, అనేక అక్రమాలు చోటుచేసుకునేవి. వాటిని అరికట్టేందుకు కేంద్రీకృత కొనుగోలు విధానాన్ని అమలులోకి తెచ్చాం. అవకతవకలు ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదు. సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ విధానంతో జవాబుదారీతనం పెరుగుతుంది' అని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వం విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చేందుకు ప్రయత్నం చేస్తోందని.. సరఫరాదారుల ప్రయోజనాలు కాపాడేందుకు కాదని స్పష్టం చేశారు.
'విద్యార్థులకు అందజేసే నోటు పుస్తకాలు, ట్రంక్ పెట్టెలు, ప్లేట్లు, గ్లాసులు, ట్రాక్ సూట్లు, బెడ్ షీట్లు, స్కూల్ బ్యాగులు, ఐడీ కార్డులు, యూనిఫాంలు అన్నీ నాణ్యమైనవి ఉండాలి. నాణ్యతతో పాటు సకాలంలో అందడంపైన ప్రత్యేక శ్రద్ధ వహించాలి' అని అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశించారు. జూన్ 15 నాటికి విద్యార్థులకు అవసరమైన సామగ్రి మొత్తం అందాలని.. అలా అందగానే సరఫరాదారులకు చెల్లింపులు పూర్తి చేయాలని సూచించారు.
'విద్యార్థులకు అందించే వస్తువులకు సంబంధిత మండల స్థాయిలో ఒక నోడల్ అధికారిని నియమించాలి. అక్కడి నుంచి క్షేత్ర స్థాయిలో గ్రామాల్లోని పాఠశాలలు, హాస్టళ్లకు వస్తువులు పంపిణీ జరిగేలా చర్యలు చేపట్టాలి. పంపిణీకి సంబంధించి ఎప్పటికప్పుడు ఫొటోలు, వీడియోలు తీయించాలి. ప్రతి విద్యార్థికి వారికి అవసరమైన సామగ్రి అంతా అందిందా లేదా అనే దానిని తనిఖీ చేసుకోవాలి' అని ముఖ్యమంత్రి తెలిపారు. నోటు పుస్తకాలు, యూనిఫాం, ఇతర సామగ్రి నాణ్యత, వాటిని అందుకున్న తర్వాత వారి భావాలను తెలియజేసేందుకు విద్యార్థుల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవాలని విద్యా శాఖ అధికారులకు సీఎం సూచించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, విద్యా శాఖల మధ్య సమన్వయానికి ఒక కమిటీని నియమించాలని చెప్పారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Sanath Nagar TIMS: హైదరాబాద్లో మరో కొత్త నిమ్స్ తరహా ఆస్పత్రి.. ఎక్కడో తెలుసా?
Hyderabad, Telangana:Tomorrow Sanathnagar TIMS Open: ప్రజల ఆరోగ్య జీవనాన్ని మెరుగుపర్చేందుకు.. నగర ప్రజల జీవన కాలం మరింత పెంచేందుకు హైదరాబాద్లో మరో అతి పెద్ద ప్రభుత్వ ఆస్పత్రి ప్రారంభం కానుంది. రేపటి నుంచే ఆస్పత్రిలో సేవలు అందుబాటులోకి రానున్నాయి. కేసీఆర్ ప్రభుత్వం నిర్మించిన సనత్నగర్ టిమ్స్ ఆస్పత్రిలో రేపటి నుంచి ఔట్ పేషెంట్ వైద్య సేవలు అందనున్నాయి. నగర ప్రజలు టిమ్స్ ఆస్పత్రి సేవలను సద్వినియోగం చేసుకోవచ్చు. ట్రయల్ రన్లో భాగంగా ఈ వైద్య సేవలను అందుబాటులోకి తీసుకువస్తున్నారు.
Also Read: Liver Transplant: గాంధీ దవాఖానాలో 18 నెలల బాలుడికి లివర్ మార్పిడి.. అన్నీ ఉచితంగా
హైదరాబాద్ సనత్నగర్లోని తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్) నిర్మాణాలు పూర్తయి కొన్ని నెలలు అవుతున్నాయి. ఈ ఆస్పత్రి ప్రారంభానికి సిద్ధమైనా కాంగ్రెస్ ప్రభుత్వం రిబ్బన్ కట్ చేయడం లేదు. అట్టహాసంగా ప్రారంభోత్సవం చేయకుండానే ఈ ఆస్పత్రి అందుబాటులోకి రానుంది. సనత్నగర్ టిమ్స్ ఆస్పత్రి ప్రారంభానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలోనే ఆస్పత్రిలో ఔట్ పేషెంట్ వైద్య సేవలు అందించనున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ప్రకటించారు.
సనత్నగర్లోని టిమ్స్ ఆస్పత్రిలో వైద్య సేవల్లో ట్రయల్ రన్ నిర్వహించేందుకు ఆరోగ్యశాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. శుక్రవారం నుంచి సుమారు నెల రోజుల పాటు ట్రయల్ రన్ కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ట్రయల్ రన్లో భాగంగా రోజూ ఉదయం 9 గంటల నుంచి 11 వరకు ఔట్ పేషెంట్, డయాగ్నసిస్ సేవలు టిమ్స్ ఆస్పత్రిలో అందించనున్నారు. కార్డియాలజీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ, గ్యాస్ట్రోఎంటరాలజీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీతో పాటు మొత్తం 22 విభాగాల్లో ఈ ఆస్పత్రిలో ట్రయల్ రన్లో భాగంగా అందుబాటులోకి తీసుకువస్తున్నారు. 22 విభాగాల వైద్య సేవలకు సంబంధించిన డాక్టర్లు, పారా మెడికల్ సిబ్బందిని అధికారులు నియమించారు.
Also Read: AP Cabinet Meeting: కృష్ణా నది నుంచి అమరావతికి రక్షణ.. పలు కీలక నిర్ణయాలకు మంత్రిమండలి ఆమోదం
హైదరాబాద్ ప్రజలు ఖుషీ
అత్యంత ప్రతిష్టాత్మకంగా గత కేసీఆర్ ప్రభుత్వం నిర్మించిన సనత్నగర్ టిమ్స్ ఆస్పత్రి అందుబాటులోకి రానుండడంతో హైదరాబాద్ ప్రజలకు ఊరట లభించనుంది. ముందే అరకొరగా ఉన్న ప్రభుత్వ వైద్య సదుపాయాల నేపథ్యంలో టిమ్స్ ఆస్పత్రి ప్రారంభం కానుండడంతో హైదరాబాద్ ప్రజలకు ప్రభుత్వ వైద్యం అందుబాటులోకి రానుంది. మల్టీ స్పెషాలిటీ స్థాయిలో ప్రభుత్వ వైద్యం అందనుండడంతో హైదరాబాద్ ప్రజలు ఈ ఆసత్ప్రిని సద్వినియోగం చేసుకోవడానికి సిద్ధమయ్యారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Liver Transplant: గాంధీ దవాఖానాలో 18 నెలల బాలుడికి లివర్ మార్పిడి.. అన్నీ ఉచితంగా
Hyderabad, Telangana:Gandhi Hospital Liver Transplant: ప్రభుత్వ ఆస్పత్రి అంటే నిర్లక్ష్యం.. చిన్నచూపు ఉంటుంది. అలాంటి అపఖ్యాతిని ప్రభుత్వ ఆస్పత్రులు తుడిచేస్తున్నాయి. అత్యంత అరుదైన శస్త్రచికిత్సలను చేసి ప్రైవేటు ఆస్పత్రులకు దీటుగా సమాధానం ఇస్తున్నాయి. అలా ఏపీ, తెలంగాణలోనే అతిపెద్ద ఆస్పత్రి గాంధీ దవాఖానాలో 18 నెలల బాలుడికి అత్యంత అరుదైన కాలేయ మార్పిడి శస్త్ర చికిత్సను విజయవంతంగా చేశారు. దాదాపు 14 గంటలు కష్టపడి ఆ చిన్నారికి మళ్లీ ఊపిరి పోశారు. ఈ అరుదైన శస్త్రచికిత్సకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
Also Read: AP Cabinet Meeting: కృష్ణా నది నుంచి అమరావతికి రక్షణ.. పలు కీలక నిర్ణయాలకు మంత్రిమండలి ఆమోదం
ఉస్మానియా జనరల్ ఆస్పత్రిలో గ్లైకోజెన్ స్టోరేజ్ అనే అరుదైన డిసీజ్తో బాధపడుతున్న 18 నెలల చిన్నారికి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ శస్త్రచికిత్స విజయవంతంగా చేశారు. కేవలం 10 కిలోల బరువు ఉన్న బాలునికి.. సుమారు 14 గంటల పాటు శ్రమించి 240 గ్రాముల లివర్ అమర్చారు. చికిత్స అనంతరం చిన్నారి ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్ మధుసూదన్ తెలిపారు. హైదరాబాద్ నగరానికి చెందిన మహ్మద్ ఇర్ఫాన్, సాజియా దంపతుల 18 నెలల కుమారుడు అఫన్ కొంతకాలంగా తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు.
Also Read: Ambati Rambabu: వైఎస్సార్ సమాధి వేదికగా అంబటి రాంబాబు సంచలన శపథం
తరచుగా ఆకలితో ఏడుస్తుండడం, మత్తుగా ఉండటం, పొట్ట ఉబ్బరం వంటి లక్షణాలతో చిన్నారి అఫన్ బాధపడుతున్నాడు. తల్లిదండ్రులు బాలుడిని ఉస్మానియా ఆస్పత్రికి తీసుకువచ్చి వైద్యులు చూపించగా.. అవసరమైన వైద్య పరీక్షలు చేయించారు. రక్తంలో షుగర్ లెవల్స్ చాలా తక్కువగా ఉండడం, కొవ్వు పదార్థాలు అధికంగా ఉండటం, కాలేయం అసాధారణంగా విస్తరించి ఉండడాన్ని డాక్టర్లు గుర్తించారు. బాలుడి సమస్యపై మరింత లోతుగా అధ్యయనం చేసి గ్లైకోజెన్ స్టోరేజ్ (టైప్-III) అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్టుగా గాంధీ వైద్యులు నిర్ధారణ చేశారు.
వ్యాధి లక్షణాలు
గ్లైకోజెన్ స్టోరేజ్ (టైప్-III) వ్యాధితో శరీరంలో గ్లైకోజెన్ను గ్లూకోజ్గా మార్చే ఎంజైమ్ లోపంతో ఏర్పడుతుంది. దీని కారణంగా శరీరంలో నిల్వ ఉన్న శక్తిని వినియోగించుకోలేకపోవడం, తరచూ హైపోగ్లైసీమియా, కాలేయం పెద్దగా అవడం, కండరాల బలహీనత వంటి సమస్యలు తలెత్తుతాయి. దీర్ఘకాలంలో గుండె, మెదడు, కండరాలపై కూడా ప్రభావం చూపే ప్రమాదం ఉంది.
చిన్నారికి అప్పటికే వ్యాధి ముదిరి పరిస్థితి విషమంగా మారడంతో లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలని వైద్యులు నిర్ణయించారు. చిన్నారి తండ్రి నుంచి లివర్లోని కొంత భాగాన్ని సేకరించి బాలుడికి అమర్చారు. డాక్టర్ మధుసూదన్ నేతృత్వంలోని సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగానికి చెందిన వైద్యుల బృందం సుమారు 14 గంటల పాటు ఈ శస్త్రచికిత్స నిర్వహించారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో సుమారు రూ.50 లక్షల వరకు ఖర్చవనుండగా.. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ప్రభుత్వ సహకారంతో రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా చేశారు. అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా చేసిన వైద్యులను ఉస్మానియా సూపరింటెండెంట్ డాక్టర్ రాకేశ్ సహాయ్ అభినందించారు.
మంత్రి అభినందన
10 కిలోల బరువున్న చిన్నారికి అత్యంత అరుదైన శస్త్రచికిత్స నిర్వహించి ప్రాణాలు కాపాడిన ఉస్మానియా వైద్యులను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అభినందించారు. ఈ శస్త్రచికిత్సతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న డాక్టర్ల సామర్థ్యాన్ని మరోసారి నిరూపించారని తెలిపారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే అందుతున్నాయని పేర్కొన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Petrol And Diesel: ఏపీలో పెట్రోల్, డీజిల్ సరఫరాకు బ్రేక్ పడొద్దు: షర్మిల, మాధవ్
Nuzendla, Andhra Pradesh:Petrol And Diesel Shortage: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్రోలు, డీజిల్ వంటి అత్యవసర ఇంధనాలు ప్రతి వినియోగదారుడిఎలాంటి అంతరాయం లేకుండా నిరంతరం అందుబాటులో ఉండాలని ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ కోరారు. పెట్రోల్ బంక్ యాజమాన్యాలు సమగ్ర చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో మొత్తం 4,312 పెట్రోల్ బంకులు ఉండగా.. వాటిలో సుమారు 1.29 శాతం (దాదాపు 56 బంకులు) కృత్రిమ కొరత సృష్టిస్తున్నాయని ఆరోపించారు. ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి మాధవ్ విజ్ఞప్తి చేశారు.
Also Read: AP Rains: మండే ఎండల వేళ ఆంధ్రప్రదేశ్కు చల్లటి కబురు.. రేపు ఈ జిల్లాల్లో వర్షాలు
కొన్ని ప్రాంతాల్లో ఇంధన సరఫరాపై అనిశ్చితి నెలకొనే అవకాశాల దృష్ట్యా.. ముందస్తుగా తగిన నిల్వలు ఉంచుకుని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని పీవీఎన్ మాధవ్ డిమాండ్ చేశారు. పెట్రోల్, డీజిల్ సంక్షోభం వ్యవసాయం, రవాణా, అత్యవసర సేవల వంటి కీలక రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంధన సరఫరా వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహించడం ద్వారా ప్రజల్లో నమ్మకం పెంపొందించడంతో పాటు ఆర్థిక కార్యకలాపాలు అంతరాయం లేకుండా కొనసాగేందుకు సహకరించాలని బంక్ నిర్వాహకులకు పీవీఎన్ మాధవ్ విజ్ఞప్తి చేశారు. సంబంధిత ప్రభుత్వ శాఖలు పరిస్థితిని పర్యవేక్షిస్తూ అవసరమైన మార్గదర్శకాలు జారీ చేయాలని పీవీయన్ మాధవ్ సూచించారు.
Also Read: Census 2027: జనగణనతో ఆర్థిక, సామాజిక అభివృద్ధికి బలమైన పునాది: యార్లగడ్డ వెంకట్రావు
పెట్రోల్, డీజిల్ సంక్షోభంపై షర్మిల స్పందన
'డీజిల్ కోసం రైతులు.. పెట్రోల్ కోసం సాధారణ ప్రజలు గంటల కొద్ది క్యూలో పడిగాపులు. ఇలాంటి అత్యవసర స్థితిలో ప్రజా అవసరాల మీద దృష్టి పెట్టాల్సిన ప్రభుత్వం బడా కాంట్రాక్టర్ల కోసం మాట్లాడటం ఏమిటి? వారి ప్రయోజనాలే ముఖ్యంగా పని చేయడం ఏంటి?' అని కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నిలదీశారు. 'బడా కాంట్రాక్టర్ల కోసమే ప్రత్యేకంగా డీజిల్ సరఫరా కోరడం ఏమిటి? ఇదేనా ఈ ప్రభుత్వ ధోరణి? రైతుకన్నా కాంట్రాక్టర్ ముఖ్యమా? ప్రజల కష్టాల కన్నా అమరావతి పనులే ప్రాధాన్యమా?' అని ప్రశ్నించారు. 'ఇది పాలన కాదు పూర్తిగా ప్రాధాన్యతల వైఫల్యం. ముందుగా రైతులు, సాధారణ ప్రజలకు నిరంతర ఇంధన సరఫరా సాగేలా చూడాలి' అని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. ప్రజలు ఎలా పోతే ఏంటి .. మాకు కాంట్రాక్టర్లే ముఖ్యం అనుకుంటే ప్రజల కష్టాలను పట్టించుకోని ఈ ప్రభుత్వానికి ప్రజలే తగిన గుణపాఠం చెప్తారని 'ఎక్స్' వేదికగా కూటమి ప్రభుత్వాన్ని వైఎస్ షర్మిల హెచ్చరించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
AP Rains: మండే ఎండల వేళ ఆంధ్రప్రదేశ్కు చల్లటి కబురు.. రేపు ఈ జిల్లాల్లో వర్షాలు
Nuzendla, Andhra Pradesh:AP Rain Alert: ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతోపాటు ఉక్కపోతకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలో వారికి వాతావరణ శాఖ చల్లటి కబురు అందించింది. రేపు ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతాయని ప్రకటించారు. రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో ఎండతీవ్రత.. మరికొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయని ప్రకటించారు.
Also Read: Ambati Rambabu: వైఎస్సార్ సమాధి వేదికగా అంబటి రాంబాబు సంచలన శపథం
వర్షం ప్రభావం
అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న వేళ ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. అంతర్గత కర్ణాటక నుంచి తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు సముద్ర మట్టానికి సగటున 0.9 కి.మీ ఎత్తులో ద్రోణి విస్తరించి ఉంది. దీని ప్రభావంతో శుక్రవారం శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, నెల్లూరు, అనంతపురం, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. రానున్న మూడు రోజులు అకాల వర్షాలకు ఆస్కారం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వర్షాలు, పిడుగులు పడే ప్రమాదం ఉండడంతో రైతులు వ్యవసాయ పనుల్లో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఉరుములతో కూడిన వర్షం పడేటప్పుడు పొలాల్లో పని చేసే రైతులు, కూలీలు, పశు కాపరులు చెట్ల కింద నిలబడరాదని హెచ్చరించింది.
Also Read: AP Cabinet Meeting: కృష్ణా నది నుంచి అమరావతికి రక్షణ.. కీలక నిర్ణయాలకు మంత్రిమండలి ఆమోదం
అత్యధిక ఉష్ణోగ్రత
నెల్లూరు జిల్లా గూడూరులో ఈ సీజన్లోనే అత్యధిక ఉష్ణోగ్రత 45.8 డిగ్రీలు రికార్డు అయ్యింది. పల్నాడు జిల్లాలో 28 మండలాలు, వైఎస్సార్ కడపలో 26, తిరుపతిలో 25, నెల్లూరులో 25, ప్రకాశంలో 22, మార్కాపురంలో 15, నంద్యాలలో 14, చిత్తూరు 13, గుంటూరులో 11 మండలాలు మొత్తంగా 28 జిల్లాల్లో 20 జిల్లాల పరిధిలోని 216 మండలాల్లో ఎండ తీవ్ర ప్రభావం చూపింది. 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది.
రేపు వడగాల్పులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలతోపాటు పార్వతీపురం మన్యం జిల్లా బలిజపేట, గరుగుబిల్లి, జియ్యమ్మవలస, కొమరాడ, పార్వతీపురం, సీతంపేట, సీతానగరం మండలాలు, పోలవరం జిల్లా చింతూరు, కూనవరం మండలాల్లో (9) తీవ్ర వడగాల్పులు వస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మరో 49 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.
Also Read: RS Praveen Kumar: కేటీఆర్, హరీశ్ రావు ఇంటి సీసీ కెమెరాలు హ్యాకింగ్: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
ఈ జిల్లాల్లో..
వడగాలులు ఈ జిల్లాలో వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. విజయనగరం జిల్లా 10, మన్యం 6, పోలవరం 5, కాకినాడ 3, తూర్పుగోదావరి 3, ఏలూరు 3, ఎన్టీఆర్ 4, గుంటూరు 3, పల్నాడు 11, మార్కాపురం 1 మండలాల్లో మొత్తం 49 ప్రాంతాల్లో వడగాలులు ప్రభావం చూపనున్నాయి.
గురువారం ఉష్ణోగ్రతలు
వేసవికాలంలో గురువారం కూడా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నెల్లూరు జిల్లా గూడూరులో 45.8 డిగ్రీలు, పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో 45.2, మార్కాపురం జిల్లా నందనమారెళ్లలో 45, తిరుపతి జిల్లా రాయలచెరువులో 44.3, ఎన్టీఆర్ జిల్లా తొర్రగుడిపాడు, ప్రకాశం జిల్లా వలేటివారిపాలెంలో 43.6, బాపట్ల జిల్లా కారంచేడు, చిత్తూరు జిల్లా తవణంపల్లెలో 43.5, నంద్యాల జిల్లా సంజామలలో 43.2, వైఎస్సార్ కడప జిల్లా కోడూరులో 43 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Census 2027: జనగణనతో ఆర్థిక, సామాజిక అభివృద్ధికి బలమైన పునాది: యార్లగడ్డ వెంకట్రావు
Vijayawada, Andhra Pradesh:Census 2027 Self-Registration: దేశ ఆర్థిక, సామాజిక అభివృద్ధికి జనగణనే బలమైన పునాది అవుతుందని.. ప్రతి ఇంటికీ వచ్చే ఎన్యూమరేటర్లకు ప్రజలు పూర్తిస్థాయిలో సహకరించాలని ప్రభుత్వ విప్, టీడీపీ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ప్రజలకు సూచించారు. ప్రజలందరూ జనగణనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. జనగణన 2027 స్వీయ నమోదు ప్రక్రియలో ప్రజలందరూ పాల్గొనాలని కోరారు. క్షేత్రస్థాయిలో పర్యటించే అధికారులకు ప్రజలు ఎటువంటి భయం, సంకోచం లేకుండా సరైన సమాచారాన్ని అందించాలని సూచించారు.
Also Read: Ambati Rambabu: వైఎస్సార్ సమాధి వేదికగా అంబటి రాంబాబు సంచలన శపథం
జనగణన 2027లో భాగంగా ప్రభుత్వం కల్పించిన స్వీయ నమోదు అవకాశాన్ని ప్రభుత్వ విప్, టీడీపీ ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు వినియోగించుకున్నారు. విజయవాడ ఎమ్మెల్యే కార్యాలయంలో తహసీల్దార్ శివయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తన కుటుంబ వివరాలను జనగణన పోర్టల్లో నమోదు చేశారు. దేశాభివృద్ధిలో కీలకమైన జనగణన ప్రక్రియకు ప్రజలందరూ పూర్తిస్థాయిలో సహకరించాలని యార్లగడ్డ వెంకట్రావు కోరారు.
Also Read: AP Cabinet Meeting: కృష్ణా నది నుంచి అమరావతికి రక్షణ.. పలు కీలక నిర్ణయాలకు మంత్రిమండలి ఆమోదం
ఈ సందర్భంగా తహసీల్దార్ స్వీయ నమోదు ప్రక్రియలోని ప్రాముఖ్యతను, వివరాలను నమోదు చేసే విధానాన్ని ఎమ్మెల్యేకు వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ.. జనగణన అనేది కేవలం జనాభా లెక్కల సేకరణ మాత్రమే కాదని.. రాబోయే కాలానికి దేశ ఆర్థిక, సామాజిక అభివృద్ధికి అవసరమైన ప్రణాళికలను రూపొందించడానికి ఇది ఒక బలమైన పునాది అని తెలిపారు. మే 1వ తేదీ నుంచి ప్రారంభమై మే 31వ తేదీ వరకు కొనసాగే ఈ ప్రక్రియలో భాగంగా ప్రభుత్వ అధికారులు, ఎన్యూమరేటర్లు ప్రతి ఇంటికీ వచ్చి వివరాలను సేకరిస్తారని వివరించారు. క్షేత్రస్థాయిలో పర్యటించే అధికారులకు ప్రజలు ఎటువంటి భయం, సంకోచం లేకుండా సరైన సమాచారాన్ని అందించాలని చెప్పారు. ఈ జాతీయ కార్యసాధనలో భాగస్వాములు కావాలని టీడీపీ ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో గన్నవరం నియోజకవర్గ ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలందరూ చొరవ చూపాలని పిలుపునిచ్చారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
