ఒకే కాన్పులో ఐదు మేక పిల్లలకు జననం
Bellampalle, Telangana:మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం, బుదా కలన్ గ్రామంలో అద్భుతం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఆవుల అంజి అనే వ్యక్తికి చెందిన మేక ఐదు మేక పిల్లలకు శనివారం రాత్రి జన్మనిచ్చింది. ఈ మేక మొదటి కాన్పులోనే ఐదు మేక పిల్లలకు జన్మనిచ్చిందని అంజి తెలిపారు. ఐదు మేక పిల్లలను సంరక్షించేందుకు వైద్యుల సలహాలు సూచనలు కావాలని అతడు కోరారు. మేక పిల్లలను చూసేందుకు గ్రామ ప్రజలు తరలివస్తున్నారు.हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
Petrol Diesel Price: భారీగా తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు..ట్రంప్ ప్రకటనతో ఒక్కసారి పడిపోయిన ఇంధన ధరలు!
Petrol Diesel Price News: పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా గత కొన్ని నెలలుగా వరుసగా పెరుగుతున్న ఇంధన ధరలకు త్వరలోనే బ్రేక్ పడనుంది. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య కుదిరిన చారిత్రాత్మక శాంతి ఒప్పందం ప్రపంచ దేశాలకు పెద్ద ఊరటనిచ్చింది. వ్యూహాత్మక సముద్ర మార్గమైన 'హోర్ముజ్ జలసంధి'ని ఎలాంటి టోల్ ఫీజులు లేకుండా తిరిగి తెరుస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.
ఈ పరిణామంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు (క్రూడ్ ఆయిల్) ధరలు ఒక్కసారిగా కుప్పకూలాయి. ఆదివారం రాత్రి బ్రెంట్ క్రూడ్ ధర 3.9 శాతం తగ్గి బ్యారెల్కు 84 డాలర్లకు పడిపోగా, యూఎస్ క్రూడ్ 4.8 శాతం మేర తగ్గి దాదాపు 81 డాలర్లకు చేరింది. గడిచిన మార్చి నెల తర్వాత చమురు ధరలు ఈ స్థాయికి పడిపోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
హోర్ముజ్ జలసంధి ఎందుకు అంత కీలకం?
ప్రపంచవ్యాప్తంగా రవాణా అయ్యే ముడి చమురులో అత్యధిక భాగం ఈ హోర్ముజ్ జలసంధి ద్వారానే సాగుతుంది. ఈ ఏడాది ఫిబ్రవరి చివరిలో ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల అనంతరం ఈ మార్గాన్ని మూసివేశారు. ఈ దిగ్బంధనం కారణంగా వాణిజ్య నౌకలు ప్రత్యామ్నాయ మార్గాల కోసం లేదా సురక్షిత ప్రయాణం కోసం సగటున 2 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.16 కోట్లకు పైగా) అదనపు భారాన్ని భరించాల్సి వచ్చింది.
ఒకవేళ ఈ దిగ్బంధనం ఇలాగే కొనసాగి ఉంటే, అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు బ్యారెల్కు 100 డాలర్లను దాటేసేవని, అమెరికాలో గ్యాసోలిన్ ధరలు రికార్డు స్థాయికి చేరేవని నిపుణులు హెచ్చరించారు. ఈ ఉద్రిక్తతలకు శాంతి ఒప్పందంతో తెరపడటంతో ప్రపంచ ఇంధన మార్కెట్ ఊపిరి పీల్చుకుంది.
భారతదేశానికి ఎలాంటి ప్రయోజనం?
భారతదేశం తన ముడి చమురు అవసరాలలో 85 శాతం కంటే ఎక్కువ భాగాన్ని ఇతర దేశాల నుంచే దిగుమతి చేసుకుంటుంది. హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరవడం వల్ల భారత్కు రెండు రకాలుగా లాభం చేకూరుతుంది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గడం వల్ల దేశ దిగుమతి బిల్లు భారీగా తగ్గుతుంది. సముద్ర రవాణా మార్గం సుగమం కావడంతో రవాణా ఖర్చులు మరియు ఇన్సూరెన్స్ ప్రీమియంలు భారం తగ్గుతాయి.
అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల కారణంగా దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు దాదాపు 8 శాతం నుండి 8.5 శాతం వరకు పెరిగాయి. అయితే ప్రస్తుత సానుకూల పరిణామాలపై భారత పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి స్పందిస్తూ.. రాబోయే నెలల్లో చమురు, గ్యాస్ ధరలు తగ్గే అవకాశం ఉందని అంచనా వేశారు.
అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధర 80 డాలర్ల స్థాయికి చేరినందున, దేశీయ చమురు కంపెనీలు త్వరలోనే పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు రూ.3 నుండి రూ.5 రూపాయల వరకు తగ్గించే అవకాశం ఉంది. దీనితో పాటు సామాన్యుడిపై భారం తగ్గించేలా వంటగ్యాస్ (LPG) సిలిండర్ ధరలు కూడా తగ్గే ఛాన్స్ ఉంది.
(గమనిక: చమురు ధరల తగ్గింపుపై ప్రభుత్వ రంగ సంస్థల నుండి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ రానున్న రోజుల్లో సామాన్యుడికి ఇంధన ధరల నుండి ఉపశమనం లభించడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. దీన్ని జీ తెలుగు న్యూస్ ధ్రువీకరిచడం లేదు.)
Also Read: అమెరికా-ఇరాన్ దేశాల మధ్య శాంతి ఒప్పందం..యుద్ధం ముగిసిందని ట్రంప్ సంచలన ప్రకటన!
Also Read: భారీగా పడిపోతున్న బంగారం ధరలు..ఇదే జరిగితే గోల్డ్ రేటు కుప్పకూలిపోవడం ఖాయం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
KTR: హైదరాబాద్ మెట్రో 2పై విఫలమైన రేవంత్ రెడ్డి ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలి: కేటీఆర్
Baddipadaga, Telangana:Hyderabad Metro Dispute: 'తెలంగాణ ప్రయోజనాల కోసం ప్రధానిమంత్రిని ప్రశ్నించలేని అసమర్ధుడు రేవంత్ రెడ్డి. మెట్రో రెండో దశకు అనుమతి దక్కకపోవడం రేవంత్ రెడ్డి అసమర్థ పాలనకు నిదర్శనం. తనపై వేలాడుతున్న ఓటుకు నోటు కేసు వల్లనే కేంద్రాన్ని ప్రశ్నించలేని అసమర్ధతలో ఉన్నాడు. 71 సార్లు ఢిల్లీకి వెళ్లిన రేవంత్ రెడ్డిని బీజేపీ దేకడం లేదు. ప్రధానిని ప్రశ్నించలేకనే ప్రతిపక్షంపై నిందలు వేసే నీచ ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నాడు' అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
రేవంత్ రెడ్డి చేతకానితనంపై
మెట్రో రెండో దశపై రేవంత్ రెడ్డి నిర్వహించిన ప్రెస్మీట్పై కేటీఆర్ స్పందిస్తూ కీలక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి చేతకానితనంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 'మెట్రో రెండో దశను సాధించడంలో అట్టర్ ఫ్లాప్ అయినందుకు, మొదటి దశను ఆగం చేస్తున్నందుకు రేవంత్ రెడ్డి వెంటనే ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పాలి' అని డిమాండ్ చేశారు. హైదరాబాద్ మెట్రో రైల్ పూర్తి చేసిన ఘనత ముమ్మాటికి కేసీఆర్దే అని మాజీ మంత్రి కేటీఆర్ ప్రకటించారు.
కేసీఆర్ చొరవ తీసుకుని
'28 శాతం మెట్రో పనులు కూడా పూర్తి చేయకుండా ప్రాజెక్టును చిక్కుల్లో వదిలేసిన నాటి కాంగ్రెస్. 2014లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాగానే కేసీఆర్ చొరవ తీసుకుని 72 శాతం పనులను పూర్తి చేశారు' అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వివరించారు. కేవలం తన స్వార్థ ప్రయోజనాలకోసం ఉనికిలో లేని ఊహ నగరానికి మెట్రో రెండో దశను రేవంత్ రెడ్డి ప్రతిపాదించాడని తెలిపారు. కానీ గత ప్రభుత్వం ట్రాఫిక్ రద్దీ, నగర విస్తరణ, ప్రజల రోజు వారి అవసరాల కోసం మెట్రో రెండో దశను ప్రతిపాదించింది' అని వెల్లడించారు.
బడేభాయ్ ని మెప్పించి ఒప్పించలేక
71 సార్లు ఢిల్లీకి చక్కర్లు కొట్టినప్పటికీ తన 'బడేభాయ్'ని మెప్పించి ప్రాజెక్టును ఒప్పించలేకపోవడం రేవంత్ రెడ్డి చేతకానితనానికి, దద్దమ్మ పాలనకు నిలువెత్తు నిదర్శనమని మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. 'ఎల్ అండ్ టీపై బెదిరింపులు, ఆస్తుల కొల్లగొట్టే కుట్రతోనే ఎల్ అండ్ టీ సంస్థ పారిపోతున్నది. ఎల్ అండ్ టీపై బెదిరింపులతో మెట్రో రైల్ ఆస్తులు కొల్లగొట్టే కుట్ర' అని తీవ్ర ఆరోపణలు చేశారు. మెట్రో ఫేజ్-2 ప్రాజెక్టును కేంద్రం నుంచి సాధించలేక, తన చేతకానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకే రేవంత్ రెడ్డి ఇన్ని కుప్పిగంతులు తొక్కుతున్నారని, అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి తన అసమర్థతను దాచుకోవడానికి అనేక అబద్ధాలు ఆడుతున్నారని విమర్శించారు.
బీజేపీతో చీకటి ఒప్పందాలు
యూపీ, అహ్మదాబాద్, వైజాగ్ వంటి నగరాలకు కేంద్రం మెట్రోలను మంజూరు చేస్తుంటే, హైదరాబాద్కు ఎందుకు తీసుకురాలేకపోయారో ముందుగా ప్రజలకు జవాబు చెప్పాలని మాజీ మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి అసమర్థ పాలనకు నిదర్శనం మెట్రో రెండో దశకి అనుమతి దక్కకపోవడం అని తెలిపారు. రాష్ట్రం ప్రతిపాదించిన మెట్రో విస్తరణకు అనుమతి ఇవ్వని కేంద్ర ప్రభుత్వంపై, నరేంద్ర మోదీని విమర్శించే సత్తా ధైర్యం రేవంత్ రెడ్డికి లేదు అని విమర్శించారు. తనపై నమోదైన ఓటుకు నోటు కేసు ఉచ్చు బిగుస్తుందనే భయంతో బీజేపీతో చీకటి ఒప్పందాలు చేసుకోవడంతోనే ఈ పరిస్థితి ఏర్పడిందని తెలిపారు.
రేవంత్ రెడ్డి నీచమైన ప్రయత్నం
కేంద్ర ప్రభుత్వంలోని బీజేపీని కాకుండా తెలంగాణలో ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీని విమర్శించి ప్రజలను తప్పుదోవ పట్టించే నీచమైన ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నారని మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. బీజేపీతో రేవంత్ రెడ్డికి ఉన్న లోపాయికారి ఒప్పందంతోనే ఎన్నిసార్లు ఢిల్లీ పర్యటనలు చేసినా పట్టించుకోవడం లేదని గుర్తుచేశారు. తన చేతగానితనానికి రేవంత్ రెడ్డి హైదరాబాద్ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సమర్థవంతమైన నాయకుడు ఉంటే గతంలో కేసీఆర్ పాలనలో అనుమతులు, రుణాలు శరవేగంగా ఎలా వచ్చాయో, మీ దిక్కుమాలిన పాలనలో అవి ఎందుకు ఆగిపోయాయో ప్రజలకు అర్థమవుతోందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వివరించారు.
Japan Football Fans: హృదయాలను గెలిచిన జపాన్ ఫ్యాన్స్..మ్యాచ్ తర్వాత చెత్తను శుభ్రం చేసిన అభిమానులు!
Hyderabad, Telangana:Japan Football Fans Clean Stadium: ఫీఫా ప్రపంచకప్ 2026లో భాగంగా జపాన్ అభిమానులు చేసిన పనికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అమెరికాలోని డల్లాస్ స్టేడియంలో ఆదివారం (జూన్ 14) నెదర్లాండ్స్తో జరిగిన మ్యాచ్లో జపాన్ అద్భుతంగా ఆడి మ్యాచ్ను 2-2 పాయింట్లతో డ్రా చేసింది. అయితే ఆటతో ఫుట్బాల్ ఆటగాళ్లు తమ అభిమానుల హృదయాలను గెలుచుకోగా.. జపాన్ అభిమానులు కూడా తమ వంతు బాధ్యతగా ఆతిథ్య దేశం పట్ల గౌరవ సూచకంగా మ్యాచ్ తర్వాత స్టేడియంను శుభ్రం చేశారు.
తమ జట్టు పాల్గొనే క్రీడా ఈవెంట్లలో మ్యాచ్ల తర్వాత తాము కూర్చున్న ప్రాంతాన్ని శుభ్రం చేయడం జపాన్ అభిమానులకు అలవాటు. ఇప్పుడు ఫీఫా వరల్డ్ కప్ 2026 వారి సంస్కృతికి మరో ఉదాహరణగా నిలిచింది. ఆదివారం మ్యాచ్ తర్వాత అభిమానులు స్టేడియంను శుభ్రం చేస్తున్న వీడియోను FIFA నిర్వాహకులు సోషల్ మీడియాలో షేర్ చేశారు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు ఎంతోమంది హృదయాలను గెలుచుకుంటోంది.
జపాన్ ఫ్యాన్స్ ఎందుకు శుభ్రం చేస్తున్నారు?
ఫీఫా అధికారిక X (ట్విట్టర్) ఖాతాలో షేర్ చేసిన వీడియోలో.. అభిమానులు చెత్తను నీలం రంగు సంచులలో వేస్తూ స్టేడియంలో తాము కూర్చున్న ప్రాంతాన్ని శుభ్రం చేయడం కనిపిస్తుంది. అప్పుడు ఒక అభిమాని ఈ పనికి గల కారణాన్ని వెల్లడించారు. "అది మా సంస్కృతి. ఇది అన్నింటి పట్ల గౌరవం - ఆటగాళ్ల పట్ల, తోటి అభిమానుల పట్ల, స్టేడియం పట్ల గౌరవం. ఇక్కడ ఉండటం మాకు గౌరవప్రదమైన విషయం, కాబట్టి మేము చెత్తను అలాగే వదిలి వెళ్లకూడదనుకుంటున్నాము. అందుకే మేము ఇలా చేస్తున్నాము" అని ఆ వీడియోలో స్పష్టం చేశారు.
ఈ ఆలోచన "Tatsu tori ato wo nigosazu" అనే జపనీస్ సామెత యొక్క సారాంశాన్ని ప్రతిబింబిస్తుంది. దీనికి ఆంగ్లంలో "A bird leaves nothing behind" (పక్షి ఎటువంటి ఆనవాళ్లనూ వదిలిపెట్టదు) అని అర్థం. ఈ సామెత యొక్క అసలు అర్థం "ఏదైనా ప్రదేశాన్ని మీరు ఎలా చూశారో, తిరిగి వెళ్లేటప్పుడు కూడా అలాగే ఉంచడం" అని అర్థం వస్తుంది.
The reason Japan fans clean the stadium after each game. Respect. 🤝🇯🇵 pic.twitter.com/o9qJUOLefY
— FIFA (@FIFAcom) June 15, 2026
చిన్నతనంలోనే పాఠశాలల్లో తరగతి గదులు, కారిడార్లను శుభ్రం చేయడం ద్వారా ఈ విధానం ప్రజలలో అలవాటుగా మారుతుంది. ఒసాకా యూనివర్సిటీకి చెందిన సోషియాలజీ ప్రొఫెసర్ స్కాట్ నార్త్ 2018లో BBCకి ఇలా వివరించారు. "చిన్నప్పటి నుండి నిరంతరం గుర్తుచేయడం వల్ల, ఈ ప్రవర్తనలు చాలా మంది ప్రజలకు అలవాటుగా మారిపోతాయి" అని ఆయన అన్నారు.
జపాన్ తర్వాతి మ్యాచ్లు..
జపాన్ తన రెండవ గ్రూప్ F మ్యాచ్ను జూన్ 20న మెక్సికోలోని ఎస్టాడియో మాంటెర్రేలో ట్యునీషియాతో ఆడనుంది. ఆ తర్వాత జూన్ 25న డల్లాస్ స్టేడియంలో స్వీడన్తో గ్రూప్ దశలో చివరి మ్యాచ్లో తలపడుతుంది. నెదర్లాండ్స్తో 2-2తో మ్యాచ్ డ్రా అయిన తర్వాత, జపాన్ ప్రస్తుతం తన గ్రూప్లో స్వీడన్ తర్వాత రెండవ స్థానంలో ఉంది.
భారతదేశంలో జపాన్ ఆడనున్న ఫుట్బాల్ ప్రపంచకప్ మ్యాచ్లను ప్రత్యక్షప్రసారం చూడొచ్చు. జీ మీడియాకు సంబంధించిన Zee5 యాప్ లేదా వెబ్సైట్ ద్వారా ఫుట్ బాల్ ప్రపంచకప్ మ్యాచ్లను లైవ్లో వీక్షించవచ్చు.
Also Read: పాకిస్థాన్ బౌలర్ మెడ పట్టుకున్న టీమ్ఇండియా బ్యాటర్..సోషల్ మీడియాలో వైరల్ వీడియో!
Also Read: ప్రపంచకప్లో విజయఢంకా మోగించిన జర్మనీ..కురాకో జట్టుపై 7 గోల్స్లో భారీ గెలుపు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Tuni Girl Missing: 10 రోజులైనా కనిపించిన చిన్నారి జాడ..అమావాస్య రోజున రాత్రికి ఏం జరగబోతుంది?
Tuni, Andhra Pradesh:Tuni Girl Missing Case: ఆడుకుంటూ అటవీ ప్రాంతంలోకి వెళ్లిన చిన్నారి కనిపించకకుండా పోయి నేటికి 10 రోజులు పూర్తయ్యింది. అయినా కూడా బాలిక ఆచూకీ లభించలేదు. పోలీసులు, సహాయక బృందాలు అడవిని జల్లెడ పడుతున్నా జాడ కనిపించకపోవడంతో తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర ఆందోళన రేకెత్తుతోంది. అయితే నేడు అమావాస్య కావడం వల్ల అనేక పుకార్లకు ఈ ఘటన కారకమైంది. అమావాస్య రాత్రికి ఏం జరుగుతుందో అని స్థానికులు అందోళన చెందుతున్నారు.Pawan Kalyan: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై మరోసారి పవన్ కల్యాణ్ కీలక ప్రకటన..తాను ఎప్పటికీ తెలంగాణకు వ్యతిరేకం కాదని వెల్లడి!
Delhi, Delhi:Pawan Kalyan On Telangana: దేశ రాజధాని ఢిల్లీ వేదికగా 'జనసేన ప్రస్థానం - జాతీయ సమగ్రత కోసం' సమావేశాన్ని జనసేన పార్టీ ప్రారంభించింది. జనసేన పార్టీని ప్రారంభించి 12 ఏళ్లు పూర్తైన సందర్భంగా పార్టీ అధినేత, ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అయితే ఈ సందర్భంగా మాట్లాడుతూ తాను ఎప్పుడూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకం కాదని.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించిన తీరును తప్పుబట్టినట్లు ఆయన ప్రస్తావించారు.Peko Kalp Collaboration: చిన్న, మధ్య తరహా వ్యాపారాలకు సరికొత్త భాగస్వామ్యం..మరో డిజిటల్ విప్లవానికి నాంది పలికిన పెకో, కల్ప్!
Hyderabad, Telangana:Peko And Kalp Collaboration: యూఏఈ వ్యాపార రంగంలో ఒక సరికొత్త డిజిటల్ విప్లవానికి తెరలేచింది. దుబాయ్కు చెందిన ప్రముఖ ఆల్-ఇన్-వన్ బిజినెస్ మేనేజ్మెంట్ ప్లాట్ఫారమ్ 'పెకో' (Peko).. ప్రముఖ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, టోకనైజేషన్ టెక్నాలజీ సంస్థ 'కల్ప్' (Culp) చేతులు కలిపాయి. చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఫైనాన్స్, వాణిజ్య రంగాలను మరింత బలోపేతం చేసేందుకు ఈ రెండు కంపెనీలు ఒక వ్యూహాత్మక ఒప్పందం (ఎంఓయూ)పై సంతకాలు చేశాయి. దీనివల్ల సాధారణంగా పెద్ద కార్పొరేట్ కంపెనీలకే పరిమితమయ్యే ఏఐ (AI), స్మార్ట్ పేమెంట్స్ వంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీలు ఇకపై చిన్న వ్యాపారులకు కూడా అందుబాటులోకి రానున్నాయి.
నేటి డిజిటల్ యుగంలో వ్యాపారంలో కేవలం మంచి ప్రొడక్ట్ లేదా సర్వీస్ ఉంటే సరిపోదు. వాటితో పాటు కింది సేవలు కూడా అంతే ముఖ్యంగా అవసరం దాపురించింది. ఇన్వాయిసింగ్, బిల్లింగ్, అకౌంటింగ్, టాక్స్, జీతాల నిర్వహణ, కస్టమర్ మేనేజ్మెంట్, లైసెన్సింగ్ వంటివి ప్రస్తుత కాలంలో అత్యవసరంగా మారాయి.
పెద్ద కంపెనీలు ఈ పనుల కోసం ఖరీదైన సాఫ్ట్వేర్లను వాడుతుంటాయి. కానీ చిన్న వ్యాపారాలకు (SMEs) అంత బడ్జెట్ ఉండదు. ఇక్కడే పెకో-కల్ప్ భాగస్వామ్యం చిన్న వ్యాపారాల పనిని మరింత సులభతరం, వేగవంతం, సురక్షితంగా మార్చబోతుంది.
పెకో - కల్ప్ టెక్నాలజీ హైలైట్స్
ఈ ఒప్పందం ప్రకారం.. కల్ప్ సంస్థకు చెందిన అత్యాధునిక డిజిటల్ మౌలిక సదుపాయాలను పెకో ప్లాట్ఫామ్తో అనుసంధానిస్తారు. దీని ద్వారా వ్యాపారాలకు కింది డిజిటల్ సేవలు లభిస్తాయి. వ్యాపార లావాదేవీలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాయంతో మరింత సులభతరం చేయడంతో పాటు మరింత సురక్షితమైన, పారదర్శకమైన లావాదేవీల నిర్వహణ దీని బాధ్యత. అలాగే వేగవంతమైన వాల్యూ-మూవ్మెంట్ మౌలిక సదుపాయాలు.. సురక్షితమైన కీ-మేనేజ్మెంట్తో కూడిన టోకనైజేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటివి కీలకం కానున్నాయి.
రెండు భిన్న శక్తుల కలయిక
పెకో (Peko) అనే సంస్థ యూఏఈలో వ్యాపారాలకు ఒక ఆపరేటింగ్ సిస్టమ్లా పనిచేస్తోంది. బ్యాంకులు, ఫ్రీ జోన్లు, ప్రభుత్వ సంస్థలకు ఇన్వాయిసింగ్, పేరోల్, కార్పొరేట్ ట్రావెల్, ఇన్సూరెన్స్ వంటి 50కి పైగా సేవలను అందిస్తోంది.
మరోవైపు కల్ప్ (Culp) అనే సంస్థ డిజిటల్ ప్లాట్ఫారమ్ల వెనుక ఉండి డిజిటల్ మౌలిక సదుపాయాలను అందిస్తుంది. భాగస్వామ్య కంపెనీలు తమ సొంత బ్రాండ్ పేరుతో అధునాతన డిజిటల్ ఫైనాన్స్ సేవలు అందించేలా బ్యాకెండ్ టెక్నాలజీని సపోర్ట్ చేస్తుంది.
కంపెనీల అధినేతలు ఏమన్నారంటే..?
"మేము పెకోను నిర్మించినప్పుడు, కేవలం వ్యాపార కార్యకలాపాలను సులభతరం చేయడం మాత్రమే మా లక్ష్యం కాదు. వాటి వెనుక ఉన్న మౌలిక సదుపాయాలను సరికొత్తగా పునఃరూపకల్పన చేయడమే మా అసలు లక్ష్యం" అని పెకో ప్రతినిధి అహ్మద్ ఖాన్ అన్నారు.
"మాది 'ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫస్ట్' నమూనా. అంటే కేవలం ప్రచారం కోసం ఒక వినియోగదారు బ్రాండ్గా నిలవడం మా ఉద్దేశం కాదు. నమ్మకమైన ప్లాట్ఫారమ్ల వెనుక ఉంటూ శక్తివంతమైన సాంకేతికతను అందించడమే మా లక్ష్యం. రాబోయే దశాబ్దంలో వ్యాపారాలు డబ్బును నిర్వహించే శైలి మారబోతోంది. ఆ మార్పును SMEలు లీడ్ చేసేలా చేయడమే మా ప్లాన్" కల్ప్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ సహ వ్యవస్థాపకుడు తపన్ సంగల్ పేర్కొన్నారు.
ఒకప్పుడు కేవలం పెద్ద ఆర్థిక సంస్థలకే పరిమితమైన హై-ఎండ్ డిజిటల్ టెక్నాలజీని, సాధారణ వ్యాపారాలు కూడా రోజువారీగా ఉపయోగించుకునేలా చేయడమే ఈ డీల్ ముఖ్య ఉద్దేశం. ఈ భాగస్వామ్యం భవిష్యత్తులో చిన్న, మధ్య తరహా వ్యాపారాల ఆర్థిక వ్యవస్థను మరింత పారదర్శకంగా మార్చడంలో కీలక పాత్ర పోషించనుంది.
Also REad: భారీగా పడిపోయిన బంగారం ధరలు..రూ.3,000 తగ్గిన గోల్డ్
Also Read: భారత్లో ప్రజలు ఏడాది పాటు బంగారం కొనకపోతే ఏం జరుగుతుంది!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
IND W Vs PAK W: పాకిస్థాన్ బౌలర్ మెడ పట్టుకున్న టీమ్ఇండియా బ్యాటర్..సోషల్ మీడియాలో ఊపేస్తున్న వైరల్ వీడియో!
Hyderabad, Telangana:IND W Vs PAK W Viral Video: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న భారత్-పాకిస్థాన్ మహిళా క్రికెటర్ల గొడవకు సంబంధించిన వార్త ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్గా మారింది. ఈ హై-వోల్టేజ్ మ్యాచ్లో టీమిండియా ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే, మ్యాచ్ ముగిసిన తర్వాత ఒక వివాదాస్పద వీడియో క్రీడా వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.
ట్విట్టర్ (X) వేదికగా వైరల్ అవుతున్న వీడియోలో.. ఒక పాకిస్థాన్ బౌలర్ భారత బ్యాటర్ మీదకు దూసుకెళ్లడం, దానికి ప్రతిగా భారత ప్లేయర్ సదరు పాక్ ఆటగాడి గొంతు పట్టుకోవడం కనిపిస్తుంది. దీనిని చూసి అభిమానులు షాక్కు గురయ్యారు. ఈ వీడియో పూర్తిగా నకిలీ వీడియో. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) డీప్ఫేక్ సాంకేతికతతో ఎవరో కావాలనే దీనిని సృష్టించారు.
ఈ వీడియో ఫేక్ అనే దానికి కారణం..
మ్యాచ్ జరుగుతున్నప్పుడు నిబంధనల ప్రకారం పిచ్పై ఇద్దరు బ్యాటర్లు మాత్రమే ఉండాలి (ప్రస్తుతం బై-రన్నర్ రూల్ లేదు). కానీ ఈ వీడియోలో భారత్కు చెందిన ముగ్గురు బ్యాటర్లు మైదానంలో కనిపిస్తారు. మైదానంలో ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య ఎలాంటి ఘర్షణ లేదా వాగ్వాదం చోటుచేసుకోలేదని క్రీడా విశ్లేషకులు స్పష్టం చేశారు. సరదా కోసం క్రియేట్ చేసే ఏఐ వీడియోలు, ఇలా రెండు దేశాల క్రీడాకారుల మధ్య లేనిపోని ద్వేషాన్ని రగిల్చేలా మారడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.
'నో షేక్ హ్యాండ్'
మైదానంలో ఎలాంటి గొడవ జరగనప్పటికీ, ఇరు దేశాల మధ్య ఉన్న రాజకీయ ఉద్రిక్తతల ప్రభావం మ్యాచ్పై కనిపించింది. గత కొన్ని టోర్నమెంట్ల తరహాలోనే, ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా భారత్, పాకిస్థాన్ మహిళా ఆటగాళ్లు ఒకరికొకరు కరచాలనం చేసుకోకుండానే మైదానాన్ని వీడారు.
Things got tense in the middle as Harmanpreet Kaur and Fatima Sana Sheikh exchanged some heated words during the India vs Pakistan showdown. 😤🔥👀#INDvsPAK pic.twitter.com/62BZPjzkKr
— Faruk (@uf2151593) June 14, 2026
మ్యాచ్ హైలైట్స్
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత మహిళల జట్టు నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 170 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం 171 పరుగుల క్లిష్టమైన లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ జట్టు, భారత బౌలర్ల ధాటికి తట్టుకోలేకపోయింది. వరుస వికెట్లు కోల్పోతూ కేవలం 106 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో భారత జట్టు ఘన విజయంతో ఈ టోర్నమెంట్లో శుభారంభం చేసింది.
సాధారణంగా మహిళల క్రికెట్కు ప్రేక్షకుల ఆదరణ తక్కువగా ఉంటుందనే అపవాదును ఈ మ్యాచ్ తిరగరాసింది. దాయాదుల పోరాటాన్ని వీక్షించేందుకు అభిమానులు స్టేడియానికి పోటెత్తారు. ఈ మ్యాచ్ను చూసేందుకు ఏకంగా 18,000 మందికి పైగా ప్రేక్షకులు స్టేడియానికి వచ్చారు. మహిళల ప్రపంచ కప్ చరిత్రలోనే ఒక గ్రూప్ స్టేజ్ మ్యాచ్కు ఈ స్థాయిలో రికార్డు స్థాయిలో జనాలు రావడం ఇదే తొలిసారి.
Also Read: టీ20 ప్రపంచకప్లో బోణీ కొట్టిన భారత మహిళల జట్టు..64 పరుగులతో పాకిస్థాన్ చిత్తు!
Also Read: 'అమ్మా..5 నిమిషాల్లో చేస్తా'..లైవ్ ప్రెస్మీట్ మధ్యలో ఆపేసిన నితీశ్..వీడియో వైరల్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
FIFA World Cup: ప్రపంచకప్లో విజయఢంకా మోగించిన జర్మనీ..కురాకో జట్టుపై 7 గోల్స్లో భారీ గెలుపు!
Hyderabad, Telangana:FIFA World Cup Germany Vs Curacao: ఫిఫా ప్రపంచకప్ 2026లో మాజీ ఛాంపియన్ జర్మనీ ఊహించినట్లుగానే భారీ విజయంతో టోర్నీని ఘనంగా ప్రారంభించింది. అమెరికాలోని హ్యూస్టన్ స్టేడియం వేదికగా జూన్ 14న జరిగిన గ్రూప్ స్టేజ్ మ్యాచ్లో జర్మనీ 7-1 గోల్స్ తేడాతో కురాకో జట్టును పూర్తిగా చిత్తు చేసింది. మ్యాచ్ ప్రారంభానికి ముందే ఫేవరెట్గా బరిలోకి దిగిన జర్మనీ.. మైదానంలో వన్-సైడ్ గేమ్తో ప్రత్యర్థిని ముంచెత్తింది. ఈ మ్యాచ్కు సంబంధించిన కొన్ని విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం.
జర్మనీ గోల్స్ సునామీ..
మ్యాచ్ ప్రారంభమైన నిమిషం నుంచే జర్మనీ ఆటగాళ్లు కురాకో డిఫెన్స్పై దాడులు ప్రారంభించారు. మ్యాచ్ మొదలైన 6వ నిమిషంలోనే ఫెలిక్స్ న్మెచా అద్భుతమైన ఫీల్డ్ గోల్తో జర్మనీకి 1-0 ఆధిక్యాన్ని అందించాడు. అయితే, మ్యాచ్ 21వ నిమిషంలో కురాకో ప్లేయర్ లివానో కోమెనెన్సియా అనూహ్యంగా ఒక గోల్ సాధించి స్కోరును 1-1తో సమం చేసి జర్మనీకి షాకిచ్చాడు.
కురాకో గోల్ కొట్టడంతో అలెర్ట్ అయిన జర్మనీ మరింత దూకుడు పెంచింది. 38వ నిమిషంలో జర్మన్ ఆటగాడు నికో ష్లోటర్బెక్ అద్భుత గోల్ చేయగా.. తొలి అర్ధభాగం ముగిసేలోపు లభించిన పెనాల్టీని కై హావెర్ట్జ్ గోల్గా మలిచాడు. దీంతో ఫస్ట్ హాఫ్ ముగిసేసరికి జర్మనీ 3-1 ఆధిక్యంలో నిలిచింది.
సెకండ్ హాఫ్లో వన్-సైడ్..
రెండో అర్ధభాగంలో జర్మనీ పూర్తిగా గేర్ మార్చి కురాకోకు కోలుకునే అవకాశం ఇవ్వకుండా వరుస గోల్స్ సాధించింది. 53వ నిమిషంలో స్టార్ ప్లేయర్ జమాల్ ముసియాలా క్లాసిక్ గోల్తో స్కోర్లు 4-1 కాగా.. 68వ నిమిషంలో నాథనియెల్ బ్రౌన్ అందించిన సూపర్ గోల్తో 5-1.. అలాగే 78వ నిమిషంలో సబ్స్టిట్యూట్గా బరిలోకి దిగిన డెనిజ్ ఉండావ్ చేసిన మెరుపు గోల్ తో జర్మనీ జట్టు తిరుగులేని ఆధిక్యంతో 6-1గా నిలిచింది.
చివరి గోల్ 88వ నిమిషంలో మ్యాచ్ ముగిసే సరిగ్గా రెండు నిమిషాల ముందు కై హావెర్ట్జ్ తన వ్యక్తిగత ఖాతాలో రెండో గోల్ నమోదు చేసి జర్మనీ విజయాన్ని 7-1తో ఖరారు చేశాడు. జర్మనీ తమ తదుపరి మ్యాచ్ను అమెరికాలోని టొరొంటో స్టేడియంలో జూన్ 21న ఐవరీ కోస్ట్ జట్టుతో తలపడనుంది.
మొదటి మ్యాచ్లోనే 7 గోల్స్ కొట్టి ఫుల్ జోష్లో ఉన్న జర్మనీ.. ఇదే ఆత్మవిశ్వాసంతో జూన్ 21న ఐవరీ కోస్ట్తో తలపడనుంది. మరోవైపు, ఐవరీ కోస్ట్ జూన్ 15న (ఈరోజు) ఈక్వడార్తో జరిగే తమ తొలి మ్యాచ్లో గెలిచి టోర్నీని విజయంతో ప్రారంభించాలని పట్టుదలగా ఉంది.
Also REad: ఫిఫా ఫుట్బాల్ ప్రపంచకప్లో భారత ఆటగాళ్లు..రొనాల్డోతో పోటీపడుతున్న తమిళ అబ్బాయి!
Also Read: 'అమ్మా..5 నిమిషాల్లో చేస్తా'..లైవ్ ప్రెస్మీట్ మధ్యలో ఆపేసిన నితీశ్..వీడియో వైరల్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Denduluru Chintamaneni News: అర్ధరాత్రి టీడీపీ ఎమ్మెల్యే వీరంగం..'చంపేస్తా' అంటూ బుల్డోజర్తో లాయర్ ఇంటిపై దాడికి యత్నం!
Denduluru, Andhra Pradesh:Chintamaneni Prabhakar News: పశ్చిమ గోదావరి జిల్లా రాజకీయాల్లో దెందులూరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మరోసారి పెను సంచలనంగా మారారు. ఆదివారం అర్ధరాత్రి వేళ ఏలూరు నగరంలో ఆయన తన అనుచరులతో కలిసి చేసిన హల్చల్ స్థానికంగా తీవ్ర అలజడికి దారితీసింది. సొంత పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు, ప్రముఖ న్యాయవాది ఈడ్పుగంటి శ్రీనివాసబాబు నివాసమే లక్ష్యంగా ఎమ్మెల్యే ఈ దౌర్జన్యానికి దిగడం ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.
ఆదివారం అర్ధరాత్రి 11 గంటల సమయంలో ఏలూరు నగరంలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ భారీ అనుచర గణంతో పాటు ఏకంగా బుల్డోజర్ (JCB) వెంటబెట్టుకుని లాయర్ శ్రీనివాసబాబు ఇంటి ముందుకు వెళ్లారు. ఇంట్లో మహిళలు, పిల్లలు నిద్రిస్తున్నారనే విచక్షణ కూడా లేకుండా అర్ధరాత్రి వేళ అక్కడ బీభత్సం సృష్టించారు.
"వాడో నేనో తేలాలి.." అంటూ నడిరోడ్డుపై కేకలు
తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయిన చింతమనేని నడిరోడ్డుపై నిలబడి గట్టిగా అరుస్తూ, "వాడో నేనో తేలిపోవాలి.. చంపేస్తా!" అంటూ బహిరంగంగా ప్రాణహాని తలపెట్టేలా తీవ్ర బెదిరింపులకు దిగారు. తాను ఒక బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధి అనే విషయాన్ని కూడా మరిచిపోయి, ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసుల సమక్షంలోనే ఈ రేంజ్ వార్నింగ్లు ఇవ్వడం అక్కడ ఉన్న వారిని దిగ్భ్రాంతికి గురిచేసింది.
నడిరోడ్డుపై సాగుతున్న ఈ హైడ్రామాను ఆపేందుకు చింతమనేని కుటుంబ సభ్యులు తీవ్రంగా ప్రయత్నించారు. "వద్దు నాన్న ప్లీజ్.. ఇక్కడి నుంచి వెళ్లిపోదాం" అంటూ ఆయన కుమార్తె తండ్రిని పట్టుకుని ఎంత బతిమాలినా ఎమ్మెల్యే శాంతించలేదు.
పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించిన డీఎస్పీపై కూడా చింతమనేని తీవ్రంగా విరుచుకుపడ్డారు. "నన్ను ఆపుతారేంటి?" అంటూ పోలీసులతోనే తీవ్ర వాగ్వాదానికి దిగారు. దాదాపు అర్ధరాత్రి ఒంటి గంట వరకు ఏలూరు వీధుల్లో ఈ పొలిటికల్ హై టెన్షన్ వాతావరణం కొనసాగింది.
తెలుగు దేశం లో పెరుగుతున్న అంతర్గత దాడులు.
ఏలూరులో శ్రీనివాస్ అనే మరో టీడీపీ నాయకుడి
ఇంటిపై దాడికి వెళ్లి రౌడీలా ప్రవర్తించిన టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్.#eluru #tdp #chintamaneniprabhakar #UANow pic.twitter.com/2VTFFUu3gb— UttarandhraNow (@UttarandhraNow) June 15, 2026
వివాదాలకు కేరాఫ్ అడ్రస్ చింతమనేని..
ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఇలాంటి అరాచకాలకు దిగడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా ఆయన తీరు పలుమార్లు తీవ్ర వివాదాస్పదమైంది. గతంలో పశ్చిమ గోదావరి జిల్లాలో ఇసుక మాఫియాను అడ్డుకున్న ఒక మహిళా తహసీల్దార్ వనజాక్షిపై చింతమనేని తన అనుచరులతో కలిసి దాడి చేసిన ఉదంతం అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది.
ప్రభుత్వ అధికారులను బెదిరించడం, ల్యాండ్ సెటిల్మెంట్లు చేయడం, ప్రశ్నించిన వారిపై దౌర్జన్యాలకు దిగడం వంటి ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. గతంలోనూ పోలీసులను నిలదీయడం, విధి నిర్వహణకు ఆటంకం కలిగించడం, కుల దూషణల కేసుల్లో ఇరుక్కోవడం వంటి అనేక సంఘటనలతో ఆయన నిరంతరం వార్తల్లో నిలిచారు.
గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సైతం పలు వివాదాల్లో ఇరుక్కున్న చింతమనేని, ఇప్పుడు మళ్లీ ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా తన పాత పద్ధతిని మార్చుకోలేదని ఈ ఘటనతో స్పష్టమవుతోంది. అదీ సొంత పార్టీ నేత ఇల్లే లక్ష్యంగా, అదీ పొక్లెయిన్లతో అర్ధరాత్రి నడిరోడ్డుపై ఆయన చేసిన వీరంగంపై పార్టీ అధిష్ఠానం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.
Also Read: తిరుపతిలో దారుణం..హోటళ్లలో కుళ్లిన మాంసంతో బిర్యానీ..నాన్-వెజ్ ప్రియులకు షాక్!
Also Read: దసరా, సంక్రాంతికి స్కూల్ సెలవుల లిస్టు వచ్చేసింది! ఈ ఏడాది 87 రోజులు సెలవులు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Prabhas Marriage Proposal: ప్రభాస్కు 5,000 పెళ్లి సంబంధాలు..44 ఏళ్లయినా ఒంటరిగా ఉండడానికి కారణం ఇదే!
Hyderabad, Telangana:Prabhas 5000 Marriage Proposal: 'బాహుబలి' సినిమాతో అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్.. కేవలం ఒక ప్రాంతీయ నటుడిగానే కాకుండా, ఇండియన్ సినిమా హిస్టరీలోనే టాప్ పాన్ ఇండియా స్టార్గా ఎదిగారు. కటౌట్ చూసి నమ్మి తీరాల్సిందే అనే రేంజ్లో ఉండే ఆయన ఆకర్షణీయమైన రూపం, ఎంతో సింప్లిసిటీతో కూడిన వ్యక్తిత్వానికి దేశవ్యాప్తంగా లక్షలాది మంది అమ్మాయిలు ఫిదా అయ్యారు.
5000 లవ్ ప్రపోజల్స్!
ప్రస్తుతం ఫిలింనగర్ సర్కిల్స్తో పాటు సోషల్ మీడియాలో ఒక వార్త గట్టిగా వినిపిస్తోంది. 'బాహుబలి' సిరీస్ సమయం నుంచి ఇప్పటివరకు ప్రభాస్కు దేశ విదేశాల నుంచి ఏకంగా 5000కు పైగా పెళ్లి ప్రతిపాదనలు (మ్యారేజ్ ప్రపోజల్స్) వచ్చాయట.
ఈ వార్తపై ప్రభాస్ కానీ, ఆయన కుటుంబ సభ్యులు కానీ ఎప్పుడూ అధికారికంగా స్పందించలేదు. అయినప్పటికీ ఈ క్రేజీ అప్డేట్ చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. "ఇన్ని వేల సంబంధాలు వస్తున్నా.. మన డార్లింగ్ ఇంకా ఎందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు?" అంటూ అభిమానులు రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు.
అనుష్క శెట్టితో రూమర్స్..
ప్రభాస్ పెళ్లి ప్రస్తావన వచ్చినప్పుడల్లా టాలీవుడ్ స్వీటీ, స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి పేరు తెరపైకి రావడం సర్వసాధారణంగా మారింది. 'బిల్లా', 'మిర్చి', 'బాహుబలి' వంటి చిత్రాల్లో వీరిద్దరి జోడీకి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ ఎన్నో ఏళ్లుగా ప్రచారం సాగుతోంది. అయితే ఈ వార్తలను ప్రభాస్, అనుష్క ఇద్దరూ పలుమార్లు ఖండించారు. తామిద్దరం కేవలం పరిశ్రమలో అత్యంత ఆప్తులైన 'మంచి స్నేహితులం' మాత్రమేనని స్పష్టం చేశారు.
ప్రభాస్ పెళ్లి చేసుకోకపోవడానికి ప్రస్తుతానికైతే ఆయనకున్న 'సినిమా కమిట్మెంట్స్' ప్రధాన కారణమని చెప్పొచ్చు. బ్యాక్ టు బ్యాక్ భారీ ప్రాజెక్టులతో ఆయన డైరీ మొత్తం నిండిపోయింది. రీసెంట్గా వచ్చిన 'కల్కి 2898 ఏడీ' చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ విజయాన్ని నమోదు చేయడంతో ప్రభాస్ క్రేజ్ స్కై హైకి చేరింది.
ప్రస్తుతం ప్రభాస్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో మోస్ట్ అవేటెడ్ మూవీ 'స్పిరిట్' సినిమాతో పాటు హను రాఘవపూడి డైరెక్షన్లో 'ఫౌజీ', 'సలార్ 2' చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఈ విధంగా రాబోయే కొన్నేళ్ల పాటు ప్రభాస్ పూర్తిగా షూటింగ్లతోనే గడపనున్నారు. 44 ఏళ్ల ఈ గ్లోబల్ స్టార్ పెళ్లి ఎప్పుడు, ఎవరితో జరుగుతుందనే సస్పెన్స్కు ఇంకా తెరపడలేదు కానీ.. ఆయన 'పెళ్లి కొడుకు' అయ్యే రోజు మాత్రం భారతీయ సినీ చరిత్రలోనే ఒక పెద్ద పండుగలా నిలిచిపోవడం ఖాయం!
ALso Read: బాక్సాఫీస్ వద్ద 'పెద్ది' ప్రభంజనం..10 రోజుల్లో సినిమా కలెక్షన్స్ ఎంతో తెలుసా?
Also Read: హీరోయిన్ రష్మికపై ఎగబడ్డ ఫ్యాన్స్..తెలుగింటి కోడలికి బాడీగార్డ్గా బాలీవుడ్ బ్యూటీ!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Ind W Vs PAK W: టీ20 ప్రపంచకప్లో బోణీ కొట్టిన భారత మహిళల జట్టు..64 పరుగులతో పాకిస్థాన్ చిత్తు!
Hyderabad, Telangana:Ind W vs Pak W World Cup 2026: ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో భారత మహిళల క్రికెట్ జట్టు అద్భుత బోణీ కొట్టింది. బర్మింగ్హామ్ వేదికగా జరిగిన గ్రూప్-ఎ హై-వోల్టేజ్ మ్యాచ్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ను 64 పరుగుల భారీ తేడాతో భారత్ చిత్తు చేసింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లోనూ తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించిన టీమిండియా.. టోర్నీని ఘన విజయంతో ప్రారంభించింది.
ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ తీసుకున్న టీమ్ఇండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ నేతృత్వంలోని నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 170 పరుగులు రాబట్టింది. ఆ తర్వాత 171 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన పాకిస్థాన్ జట్టు కేవలం 17 ఓవర్లలో ఆలౌట్ అయ్యి.. 106 పరుగులతో సరిపెట్టుకోగా.. 64 పరుగులతో తేడాతో టీమ్ఇండియా భారీ విజయాన్ని నమోదు చేసింది.
మంధాన హాఫ్ సెంచరీ.. రిచా ఘోష్ మెరుపులు!
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టుకు ఆరంభంలోనే గట్టి షాక్లు తగిలాయి. ఓపెనర్ షెఫాలీ వర్మ (6), వన్డౌన్ బ్యాటర్ జెమిమా రోడ్రిగ్స్ (1) త్వరగా అవుట్ కావడంతో భారత్ 18 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
ఆ దశలో ఓపెనర్ స్మృతి మంధాన, కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ కలిసి ఇన్నింగ్స్ను అద్భుతంగా నిలబెట్టారు. వీరిద్దరూ మూడో వికెట్కు 91 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని జోడించారు. హర్మన్ప్రీత్ 35 బంతుల్లో 36 పరుగులు చేయగా.. స్మృతి మంధాన 44 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 68 పరుగులు చేసి పాక్ బౌలర్లపై విరుచుకుపడింది.
స్మృతి అవుటైన తర్వాత వికెట్ కీపర్ బ్యాటర్ రిచా ఘోష్ మెరుపు ఇన్నింగ్స్ ఆడింది. కేవలం 17 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్తో 34 పరుగులు రాబట్టి స్కోరు వేగాన్ని పెంచింది. ఆఖర్లో దీప్తి శర్మ (12 నాటౌట్) రాణించడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 170 పరుగుల భారీ స్కోరు సాధించింది. పాక్ బౌలింగ్ దళంలోని ఫాతిమా సనా, సాదియా ఇక్బాల్ తలో 2 వికెట్లు తీశారు.
దీప్తి శర్మ వికెట్ల మాయాజాలం..
171 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్కు ఓపెనర్లు మునీబా అలీ (41), గుల్ ఫిరోజా కలిసి పవర్ప్లేలో 38 పరుగులు జోడించి మంచి ఆరంభాన్నిచ్చారు. కానీ పవర్ప్లే ముగిసిన వెంటనే భారత స్పిన్నర్లు పాక్ పతనాన్ని శాసించారు.
సీనియర్ స్పిన్నర్ దీప్తి శర్మ తన 4 ఓవర్ల కోటాలో కేవలం 10 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టి పాక్ బ్యాటింగ్ లైనప్ను పూర్తిగా ముక్కలు చేసింది. గుల్ ఫిరోజా, ఆయేషా జాఫర్, అలీయా రియాజ్, నష్రా సంధు, తస్మియా రుబాబ్లను దీప్తి పెవిలియన్కు పంపింది.
మరోవైపు యువ స్పిన్నర్ శ్రీ చరణి కూడా పాక్ బ్యాటర్లను తిప్పలు పెట్టింది. ఆమె 4 ఓవర్లలో 21 పరుగులిచ్చి 3 కీలక వికెట్లు (సైరా జబీన్, నతాలియా పర్వైజ్, రమీన్ షమీమ్) ఖాతాలో వేసుకుంది. పాక్ కెప్టెన్ ఫాతిమా సనాను షెఫాలీ వర్మ డకౌట్ చేసింది. మిడిలార్డర్లో అలీయా రియాజ్ (18) మినహా ఎవరూ క్రీజులో నిలవలేకపోయారు. దీంతో పాకిస్తాన్ 17 ఓవర్లలోనే 106 పరుగులకే ఆలౌట్ అయింది.
చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్పై లభించిన ఈ తిరుగులేని ఆల్ రౌండ్ విజయంతో టీమిండియా ఉమెన్స్ జట్టు ఆత్మవిశ్వాసం రెట్టింపయింది. నెట్ రన్ రేట్ పరంగా కూడా భారత్కు ఇది పెద్ద ప్లస్ పాయింట్ కానుంది. రాబోయే ప్రపంచకప్ మ్యాచ్ల్లోనూ భారత మహిళల జట్టు ఇదే జోరును కొనసాగించాలని మెగా ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
Also Read: 'అమ్మా..5 నిమిషాల్లో చేస్తా'..లైవ్ ప్రెస్మీట్ మధ్యలో ఆపేసిన నితీశ్..వీడియో వైరల్!
Also Read: ఫిఫా ఫుట్బాల్ ప్రపంచకప్లో భారత ఆటగాళ్లు..రొనాల్డోతో పోటీపడుతున్న తమిళ అబ్బాయి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Harish Rao: హిట్లర్కు పట్టిన గతి రేవంత్ రెడ్డికి పడుతుంది: హరీశ్ రావు
Warangal, Telangana:Wargangal BRS Party Meeting: 'సర్ ప్రక్రియలో కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ అభిమానుల ఓట్లు మిస్ కాకుండా చూసుకోవాలి. ఎవరిదైనా ఓటు మిస్ అయితే హైకోర్టు వరకు వెళ్లే అవకాశం ఉంది. ఎవరైతే బాధ్యత తీసుకొని పని చెయ్యకపోతే తల్లికి ద్రోహం చేసినట్లు అవుతుంది' అని మాజీ మంత్రి హరీశ్ రావు హెచ్చరించారు. గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్లో గులాబీ జెండా ఎగరవేయాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. భవిష్యత్ అయితే బీఆర్ఎస్ పార్టీదేనని స్పష్టం చేశారు.
అంత మన మంచికి
వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో మాజీ మంత్రి హరీశ్ రావు కీలక ప్రసంగం చేశారు. 'సర్ ప్రక్రియతో దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వం ఓట్లు తొలగిస్తుంది. బీజేపీ ప్రభుత్వం ఓట్ల ఏరియాతో కొన్ని పార్టీలను దెబ్బతీశాయని వార్తలు వచ్చాయి. ఒక రాజకీయ పార్టీగా పోలింగ్ బూత్లలో మనం ఏం చేయాలో ఈరోజు మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ఎస్ఐఆర్ ప్రక్రియలో బీఆర్ఎస్ శ్రేణులు ఎంత చురుగ్గా పాల్గొంటే రేపు వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అంత మంచి మనకి జరుగుతుంది' అని మాజీ మంత్రి హరీశ్ రావు తెలిపారు. కార్పొరేటర్గా పనిచేసిన వాళ్లు, కార్పొరేటర్గా పోటీ చేయాలనుకునే వాళ్లు చాలా యాక్టివ్గా ఉండాల్సిన అవసరం ఎంతగానో ఉందని గుర్తుచేశారు.
రేవంత్ రెడ్డికి అంతే గతి
హిట్లర్కి ఏ గతి అయితే పట్టిందో రేవంత్ రెడ్డికి అంతే గతి పడుతుందని బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ప్లోర్ లీడర్ హరీశ్ రావు హెచ్చరించారు. గురుకుల పాఠశాలల్లో అవినీతి, సింగరేణిలో అవినీతి, హ్యామ్ మోడల్ రోడ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం అవినీతిమయం. మంచిర్యాలకు పోయిన భట్టి విక్రమార్క 40 లక్షల బొగ్గు ఎక్కడుందో చూయించాలని సవాల్ చేశారు. సింగరేణి కుంభకోణంపై సూటి ప్రశ్నలు వేస్తే ఎటువంటి సమాధానం రావడం లేదని తెలిపారు.
'నా అంత మొగుడు లేనట్లు'
'నేను గట్టిగా మాట్లాడితే నాపై కేసులు. సింగరేణిలో కేంద్రానికి 49 శాతం వాటా ఉంటుంది. సింగరేణిలో అవినీతి జరిగిందని నేను కిషన్ రెడ్డికి లేఖ రాస్తే దొంగ చేతికి తాళం ఇచ్చి విచారణ చేయండి. మట్టి కుప్పలపై బొగ్గు పేరుస్తున్నారు, ఇది బయట పెట్టాలి' అని భట్టి విక్రమార్క, కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీశ్ రావు సవాల్ చేశారు. 'వడ్లు కొనకముందే నా అంత మొగుడు లేనట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి పేపర్లో వాణిజ్య ప్రకటన ఇచ్చుకున్నాడు. ఆనాడే 92 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కేసీఆర్ హయాంలో కొన్నాం. 75 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు కొనకముందే మొలకెత్తిన వడ్లు కొనే తెలివిలేదు రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ పార్టీను మొలకెత్తినయ్యని అంటున్నాడు' అని మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు.
పోలీసులకు హెచ్చరిక
'కొంతమంది పోలీస్ అధికారులు ఎక్కువ చేస్తున్నారు. సర్వేలో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని వార్తలు వస్తున్నాయి. చట్ట ప్రకారం పోలీస్ అధికారులు పని చెయ్యాలి. వరంగల్లో బీఆర్ఎస్ కార్యకర్తలపై ఎక్కువగా కేసులు పెడుతున్నారు. చట్టం అందరికీ సమానమే విషయాన్ని పోలీస్ అధికారులు మరిచిపోవద్దు' అని బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు హెచ్చరించారు. 'పోలీస్ అధికారులకు మంచి చేసింది కేసీఆర్. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత పోలీసులకు 5 సరెండర్ బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. పోలీసులకు కేసీఆర్ గౌరవం పెంచారు' అని మాజీ మంత్రి హరీశ్ రావు గుర్తుచేశారు.
KTR: పాలమూరు ప్రాజెక్టుతో ద్రోహం.. కొడంగల్లో రేవంత్ రెడ్డి ఓటమి ఖాయం: కేటీఆర్
Baddipadaga, Telangana:KTR vs Revanth Reddy: మహబూబ్నగర్ ప్రజలు కాంగ్రెస్ను, రేవంత్ రెడ్డిని తరిమికొడతారని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. పాలమూరు ప్రాజెక్టును పక్కనపెట్టి ద్రోహం చేస్తున్నారని.. కొడంగల్లో రేవంత్ రెడ్డికి ఓటమి తప్పదని జోష్యం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ క్లీన్ స్వీప్ ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టాలి, బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఉమ్మడి పాలమూరు జిల్లా నాయకులకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు.
కేటీఆర్ దిశానిర్దేశం
హైదరాబాద్లోని మాజీ మంత్రి లక్ష్మా రెడ్డి నివాసంలో జరిగిన ఈ సమావేశానికి హాజరైన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రస్తుత ఎమ్మెల్యేలతో క్షేత్ర స్థాయి పరిస్థితులపై మాజీ మంత్రి కేటీఆర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. పార్టీ ప్రస్తుతం కొనసాగిస్తున్న సమావేశాలు, నియోజకవర్గ స్థాయి సమావేశాల తీరును సమీక్షించారు. త్వరలో ప్రారంభం కానున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం, పార్టీ చేపట్టనున్న సభ్యత్వ నమోదు కార్యక్రమంపై నియోజకవర్గాల వారీగా చర్చించారు. అనంతరం కేటీఆర్ కీలక ప్రసంగం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చేస్తున్న అన్యాయం ప్రతి ఒక్కరికీ అర్థమైందని, రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని పాలమూరు ప్రజలు సంపూర్ణంగా తిరస్కరిస్తారని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీని, రేవంత్ రెడ్డిని మహబూబ్నగర్ ప్రజలు జిల్లా నుంచి తరిమికొడతారని హెచ్చరించారు.
రేవంత్ రెడ్డిని కొడంగల్ నుంచి తరిమికొడతారు
'పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పక్కనపెట్టి కమీషన్ల కోసం, కాంట్రాక్టుల కోసం లక్షల ఎకరాల పంటకు నీరందకుండా రేవంత్ రెడ్డి చేస్తున్న ద్రోహం ప్రతి ఒక్కరికీ అర్థమైంది. మహబూబ్నగర్ బిడ్డను అని పదేపదే చెప్పుకుంటూ జిల్లా ప్రజలను మోసం చేస్తూ అన్ని రంగాల్లో జిల్లా అభివృద్ధికి ద్రోహం చేస్తున్న రేవంత్ రెడ్డిని కొడంగల్ నుంచి తరిమికొడతారు' అని మాజీ మంత్రి కేటీఆర్ జోష్యం చెప్పారు. గతంలో మాదిరి మరోసారి కొడంగల్ నియోజకవర్గంలోనూ రేవంత్ రెడ్డికి ప్రజలు ఎన్నికల్లో గుణపాఠం చెబుతారని తెలిపారు. జిల్లా ప్రజలకు చేయాల్సిన అభివృద్ధిని.. పూర్తి చేయాల్సిన ప్రాజెక్టులను పక్కనపెట్టి కేవలం రాజకీయాలు చేస్తున్న రేవంత్ రెడ్డికి ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని కేటీఆర్ జోష్యం చెప్పారు.
పాలమూరు అన్ని రంగాల్లో అగ్రస్థానం
తెలంగాణ ఏర్పాటుకు ముందు వలసల జిల్లాగా, కరువు జిల్లాగా ఉన్న పాలమూరును అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలిపి కరువును, వలసలను తరిమికొట్టిన ఘనత ముమ్మాటికి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్దే అని కేటీఆర్ గుర్తు చేశారు. కాంగ్రెస్ పాలన చూసిన తర్వాత ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి అర్థమవుతోందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ఒకవైపు ప్రజల్లోకి తీసుకువెళ్తూనే.. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో మనం చేసిన అభివృద్ధిని మరోసారి ప్రజలకు గుర్తుచేయాలని కేటీఆర్ సూచించారు. పాలమూరు జిల్లాకు సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అన్యాయాన్ని ఎత్తిచూపాలని దిశానిర్దేశం చేశారు.
బీఆర్ఎస్ పార్టీకి భారీగా ఆదరణ
క్షేత్ర స్థాయిలో బీఆర్ఎస్ పార్టీకి ప్రజల్లో భారీగా ఆదరణ పెరిగిందని, కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ప్రతి ఒక్కరూ గుర్తించారని మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలకు చేస్తున్న మోసం పట్ల తీవ్రంగా ఆగ్రహంతో ఉన్నారని చెప్పారు. రానున్న ఎన్నికల్లో జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ క్లీన్ స్వీప్ చేయడం ఖాయమని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజల్లో ఉన్న సానుకూలతను పార్టీకి అనుకూలంగా మలుచుకోవాల్సిన అవసరం ఉందని.. ఆ దిశగా కార్యక్రమాలు చేపట్టాలని నాయకులకు కేటీఆర్ ఆదేశించారు.
