ఒకే కాన్పులో ఐదు మేక పిల్లలకు జననం
Bellampalle, Telangana:మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం, బుదా కలన్ గ్రామంలో అద్భుతం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఆవుల అంజి అనే వ్యక్తికి చెందిన మేక ఐదు మేక పిల్లలకు శనివారం రాత్రి జన్మనిచ్చింది. ఈ మేక మొదటి కాన్పులోనే ఐదు మేక పిల్లలకు జన్మనిచ్చిందని అంజి తెలిపారు. ఐదు మేక పిల్లలను సంరక్షించేందుకు వైద్యుల సలహాలు సూచనలు కావాలని అతడు కోరారు. మేక పిల్లలను చూసేందుకు గ్రామ ప్రజలు తరలివస్తున్నారు.हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
Korean Kanakaraju Trailer:'కొరియన్ కనకరాజు' ట్రైలర్ వచ్చేసింది! వరుణ్ తేజ్ డ్యుయెల్ రోల్..సత్య వేరే లెవల్ కామెడీ!
Hyderabad, Telangana:Korean Kanakaraju Trailer Out: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందిన హారర్ కామెడీ చిత్రం 'కొరియన్ కనకరాజు'. ఆగస్టు 7న ఈ సినిమా విుడదల కానుంది. ఇటీవలే యమా జోష్లో ప్రమోషన్స్ ప్రారంభించిన చిత్రబృందం తాజాగా ట్రైలర్ను విడుదల చేశారు. ఈ మూవీ ట్రైలర్ను మెగా పవర్స్టార్ రామ్చరణ్ సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. ఈ ట్రైలర్ చూసిన తర్వాత సినిమాలో కామెడీతో పాటు యాక్షన్, అతీంద్రియ శక్తుల అంశాలను మిళితం చేసి ఫుల్ ఎంటర్టైనింగ్గా రూపొందిచినట్లు తెలుస్తోంది.
ట్రైలర్లోని అతిపెద్ద హైలైట్లలో ఒకటి వరుణ్ తేజ్ ద్విపాత్రాభినయం. హీరో వరుణ్ తేజ్ పోషించిన పాత్ర కనకరాజు అనంతపురానికి చెందిన యువకుడిగా, కొరియన్ మాఫియా డాన్గా రెండు పూర్తిగా విభిన్నమైన పాత్రలను పోషించాడు. ప్రతి పాత్రకు తగినట్లుగా అతను తన రూపాన్ని, హావభావాలను, బాడీ లాంగ్వేజ్ను మార్చుకోవడం ట్రైలర్లో చూడవచ్చు. ఇది ఆ రెండు పాత్రలను విభిన్నంగా కనిపించేలా, అనిపించేలా చేస్తుంది. పాత్రల వ్యక్తిత్వాల మధ్య వైరుధ్యం సినిమాలోని కామెడీకి, అలాగే యాక్షన్ సన్నివేశాలకు మరింత బలాన్ని చేకూరుస్తుంది.
#KoreanKanakaraju trailer is an absolute laugh riot from start to finish!@IAmVarunTej is fantastic and slips into the role with such ease 🤗🤗🤗@GandhiMerlapaka seems to have packed this one with loads of entertainment. Satya is in top form, @RitikaNayak_ looks lovely!… pic.twitter.com/363PAAgowg
— Ram Charan (@AlwaysRamCharan) August 1, 2026
ఈ కథ హారర్, కామెడీలను కలగలిపి యాక్షన్ సన్నివేశాలను కూడా జోడించినట్లుగా కనిపిస్తుంది. విభిన్న సంస్కృతుల నేపథ్యం రెండు వేర్వేరు ప్రపంచాలను ఒకచోట చేర్చి, ఉత్కంఠ, హాస్యం రెండింటికీ దారితీసే పరిస్థితులను సృష్టిస్తుంది.
ఈ చిత్రంలో హాస్యనటుడు సత్య ఒక ముఖ్యమైన పాత్ర పోషించారు. ట్రైలర్ అంతటా అనేక ఫన్నీ వన్ లైనర్ డైలాగులతో అలరించారు. అతని కామెడీ టైమింగ్ కథకు తేలికపాటి ఊపును అందిస్తుంది. అలాగే ఉత్కంఠభరితమైన సన్నివేశాల్లో ఉపశమనాన్ని కలిగించేలా చేస్తుంది.
వరుణ్ తేజ్తో అతని సన్నివేశాలు ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణలలో ఒకటిగా నిలుస్తాయని భావిస్తున్నారు. ఈ ట్రైలర్లో హీరోయిన్ రితికా నాయక్ అంతగా కనిపించలేదు. కానీ, ట్రైలర్ ఆద్యంతం హీరో వరుణ్ తేజ్, హాస్యనటుడు సత్య తమ ఇన్సెన్టివ్ డైలాగులతో అలరించారు. ఈ సినిమాకు ఎస్ఎస్ తమన్ సంగీతాన్ని అందించగా.. ఇప్పటికే విడుదలైన రెండు పాటల ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
Also Read: అందంలో హీరోయిన్లను మించిపోయిన నటి రోజా కూతురు..అన్షు లేటెస్ట్ ఫొటోలు!
Also Read: రెండో పెళ్లికి సిద్ధమైన నటి సురేఖా వాణి! కూతురు సుప్రీత పెళ్లి కూడా అప్పుడేనట!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
హైదరాబాద్ ప్రయాణికులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. మెట్రో, ఆర్టీసీకి ఒకే టికెట్..!!
Lakshmapur, Telangana:Hyderabad Metro: హైదరాబాద్ ప్రయాణికులకు గుడ్ న్యూస్. ప్రజా రవాణాను మరింత సులభం చేసే దిశగా ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. మెట్రో రైలు, టీజీఎస్ ఆర్టీసీ బస్సుల్లో ఒకే టికెట్ తో ప్రయాణించే వెసులుబాటును త్వరలోనే అందుబాటులోకి తీసుకువచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజూ అధ్యక్షతన జరిగిన హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ బోర్డు సమావేశంలో ఈ ప్రతిపాదనపై చర్చించారు.
ప్రయాణికుల సౌకర్యార్థం మెట్రో, ఆర్టీసీ సేవలను అనుసంధానిస్తూ.. కామన్ మొబిలిటీ టికెటింగ్ విధానాన్ని రూపొందించాలని సీఎస్ సంజయ్ జాజూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీనికోసం టీజీఎస్ ఆర్టీసీ అధికారులతో సంప్రదింపు జరపాలని.. ప్రయాణికులందరికీ ఉపయోగపడే విధంగా ఒక ఉమ్మడి మొబైల్ అప్లికేషన్ డెవలప్ చేయాలని సూచించారు. అంతేకాదు మెట్రో ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా రోజువారీ, వారపు, నెలలవారీ ట్రావెల్ పాసులను ప్రవేశపెట్టే అవకాశాలను కూడా పరిశీలించాలని కోరారు. మెట్రో నెట్ వర్క్ విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రయాణికుల అవసరాలను ద్రుష్టిలో ఉంచుకుని అదనపు మెట్రో కోచ్ లు కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మెట్రో రెండో దశకు సంబంధించి భూసేకరణ, ఇతర పనుల పురోగతిని కూడా సమీక్షించారు. మెట్రో మొదటి దశ స్వాధీనం, రెండవ దశ అనుమతుల తాజా ప్రగతిని సీఎస్ సమావేశంలో క్షుణ్ణంగా చర్చించారు. అదనపు బోగీలను కూడా వీలైనంత త్వరగా సమీకరించేందుకు తగు చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో రోడ్లు,రహదారులు, భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ వికాస్ రాజ్, డీజీపీ శాంతి భద్రతలు మహేష్ భగవత్, బోర్డు అఫ్ డైరెక్టర్లు మెట్రోపాలిటన్ ఏరియా, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి సిక్తా పట్నాయక్, హైదరాబాద్ మెట్రో పాలిటన్ వాటర్ వర్క్స్, సీవరేజ్ బోర్డు ఎండీ కె.అశోక్ రెడ్డి, హెచ్ఎంఆర్ఎల్ మేనేజింగ్ డైరెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, అదనపు మేనేజింగ్ డైరెక్టర్ బి.అజిత్ రెడ్డి, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ శివేంద్ర ప్రతాప్ పాల్గొన్నారు.
Also Read: మీ సమస్యలు నాకు వదిలేయండి.. ముందు పిల్లల భవిష్యత్తుపై పోరాడండి
Also Read: ఒక్కో విద్యార్థిపై రూ. 1.08 లక్షల ఖర్చు.. అయినా ప్రైవేట్ వైపేనా
Also Read: ఆ పరిచయమే కొంపముంచిందా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Chittoor: రాంగ్ కాల్తో పరిచయం.!. ప్రియుడితో మహిళ వివాహం.. ఏపీ ఘటనలో సినిమాలకు మించిన ట్విస్ట్లు.!
Hyderabad, Telangana:Wife leaves husband and children in chittoor: ఆంధ్ర ప్రదేశ్ లోని చిత్తూరులో ఇటీవల ఒక వివాహిత భర్త,ఇద్దరు పిల్లల్నివదిలేసి ఇన్ స్టా లవర్ కోసం ఇల్లు వదిలి వెళ్లిపోయింది. మరోవైపు భర్త తన భార్య కన్పించడంలేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చిత్తూరు జిల్లా గుడుపల్లి మండలం గుడికొత్తూరు గ్రామంలో చోటు చేసుకున్న ఘటన స్థానికంగా రచ్చగా మారింది. స్థానికంగా ఉండే చిరంజీవికి, శోభ(27) అనే మహిళతో 8 ఏళ్ల క్రితం వివాహం కాగా.. వీరికి ఇద్దరు పిల్లలు. ఇటీవల రాంగ్ కాల్ తో శోభకు గుంటూరు జిల్లా కండ్రిగకు చెందిన బాలాజీ నాయక్ తో పరిచయం ఏర్పడింది.
ప్రియుడిపై మోజుతో భర్త, పిల్లలను వదిలేసి వేరే కాపురం పెట్టిన వివాహిత
మొదట భర్తను చంపాలనుకొని స్కెచ్ వేసి.. తర్వాత మనసు మార్చుకొని పారిపోయి ప్రియుడిని పెళ్లి చేసుకున్న వివాహిత
చిత్తూరు జిల్లా గుడుపల్లి మండలం గుడికొత్తూరు గ్రామానికి చెందిన చిరంజీవికి శోభ(27) అనే మహిళతో 8 ఏళ్ల… pic.twitter.com/C0QF4uspGx
— Telugu Scribe (@TeluguScribe) August 1, 2026
అది కాస్త ప్రేమగా మారింది. వీరి యవ్వారం కాస్త భర్తకు తెలియడంతో భర్తను లేపేద్దామని భావించారు. కానీ ఆ తర్వాత మనసు మార్చుకున్న వివాహిత భర్త, పిల్లల్ని వదిలేసి పారిపోయింది. కుప్పంలో ఓ గుడిలో పెళ్లి చేసుకున్న శోభ, బాలాజీ నాయక్ పెళ్లి చేసుకున్నారు.ఆ తర్వాత శోభ మరో యువకుడితో కలిసి బెగ్గిలిపల్లిలో ఉంటున్నట్టు గుర్తించారు.
దీనిపై పోలీసులు రంగంలోకి దిగారు. వివాహిత ప్రియుడు మాత్రం తనను పెళ్లిచేసుకొకుంటే చచ్చిపోతానని శోభ బలవంతం పెట్టిందని చెప్పాడు. ఆమె బలవంతం వల్ల పెళ్లి చేసుకున్నానని చెప్పాడు.
ఆమె భర్త రోజు కొట్టడం , వేధించడంవల్ల ఈ విధంగా నిర్ణయం తీసుకుందని చెప్పాడు. దీంతో డైవర్స్ తీసుకొకుండా పెళ్లి చేసుకొవడం ఏంటని పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. ఈ రచ్చ కాస్త స్థానికంగా రెండు కుటుంబాల మధ్య తీవ్ర దుమారంగా మారింది. ప్రస్తుతం పోలీసులు వారిని కౌన్సెలింగ్ కు తరలించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
PM Modi Tour: భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభోత్సవంపై చంద్రబాబు సమీక్ష
Visakhapatnam, Andhra Pradesh:Chandrababu Review On Bhogapuram Airport Launching Programme With PM Modiకళ్లు చెదిరే 3D కర్వ్డ్ డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11 త్వరలోనే లాంచ్!
Hyderabad, Telangana:Iqoo Z11 5g Price: ప్రస్తుతం డిజిటల్ యుగంలో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ఫోన్ ఒక భాగమైపోయింది. సరికొత్త టెక్నాలజీ కోసం ఎదురుచూసే మన భారతీయులకు వీవో (Vivo) సబ్బ్రాండ్ అయిన ఐకూ (iQOO) ఊహించని శుభవార్తను త్వరలో అందించబోతోంది.. ఎప్పటికప్పుడు సరికొత్త వినూత్న మోడళ్లతో మార్కెట్ను షేక్ చేసే ఐకూ కంపెనీ.. త్వరలోనే భారత మార్కెట్లోకి iQOO Z11 మోడల్ను విడుదల చేసేందుకు సిద్ధమైన్నట్లు తెలుస్తోంది.
సోషల్ మీడియా ప్లాట్ఫామ్ X లో iQOO ఇటీవల విడుదల చేసిన ఒక బైనరీ కోడ్ పోస్ట్ ఇప్పుడు టెక్ వర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది. ఈ కోడ్ను విశ్లేషించగా.. భారత్కు రాబోతున్నది మరేదో కాదని.. శక్తివంతమైన iQOO Z11 అని స్పష్టమవ్వడంతో ఇప్పుడు అందరూ దీని కోసమే ఎదురు చూస్తున్నారు.
3D కర్వ్డ్ డిస్ప్లే..
ఈ స్మార్ట్ఫోన్ ఇప్పటికే చైనాలో లాంచై.. విశేష ఆదరణ పొందిన సంగతి తెలిసిందే. అయితే, మన భారతీయ వినియోగదారుల అలవాట్లు, ప్రాధాన్యతలను దృష్టిలో ఉంచుకుని కొన్ని అద్భుతమైన మార్పులతో దీనిని రూపొందించినట్లు వార్తలు వస్తున్నాయి. చైనా వేరియంట్తో పోలిస్తే.. భారతీయ వెర్షన్లో అద్భుతమైన 3D కర్వ్డ్ డిస్ప్లే (3D Curved Display)ను అందించబోతున్నట్లు తెలుస్తోంది.. చేతిలో పట్టుకోగానే ఇచ్చే రాయల్ లుక్.. కంటెంట్ చూస్తున్నప్పుడు కలిగే విజువల్ అనుభూతి ప్రాణాన్ని లేపి నిలబెట్టేలా ఉందని టెక్ నిపుణులు భావిస్తున్నారు.
పవర్ ప్యాక్డ్ పెర్ఫార్మెన్స్..
ఇటీవలే లీక్ అయిన కొన్ని వివరాల ప్రకారం.. ఈ స్మార్ట్ఫోన్ భారతదేశంలోనే తొలిసారిగా MediaTek Dimensity 7500 Turbo ఆక్టాకోర్ చిప్సెట్తో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. గేమింగ్ ఆడేటప్పుడు కానీ.. మల్టీటాస్కింగ్ చేసేటప్పుడు కానీ ఎక్కడా హ్యాంగ్ అవ్వకుండా.. అద్భుతమైన పెర్ఫార్మెన్స్ను ఇది అందిస్తుంది.
కళ్లు చెదిరే కెమెరా..
చైనా వేరియంట్ ఫీచర్ల వివరాల్లోకి వెళితే... ఇది 6.83 అంగుళాల AMOLED డిస్ల్పేను కలిగి ఉంటుంది. అంతేకాకుండా 165Hz రిఫ్రెష్ రేట్తో పాటు 16GB వరకు ర్యామ్, 512GB స్టోరేజ్ ఉన్నాయి. ఫొటోగ్రఫీ ప్రేమికుల కోసం.. ఇందులో కంపెనీ 50MP OIS ప్రధాన కెమెరాతో పాటు సెల్ఫీల కోసం 16MP ఫ్రంట్ కెమెరా అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా భారీ బ్యాటరీతో పాటు 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఫీచర్స్ కూడా లభిస్తున్నాయి.
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
వచ్చే ఆగస్టు నెలలోనే ఈ అద్భుతమైన మొబైల్ భారత మార్కెట్లోకి అడుగుపెట్టే అవకాశం ఉందని.. టెక్ నిపుణులు భావిస్తున్నారు. సరసమైన ధరలో ప్రీమియం అనుభూతిని పొందాలని అనుకునే ప్రతి ఒక్కరికీ.. iQOO Z11 స్మార్ట్ఫోన్ ఒక అద్భుతమైన కానుక కాబోతోంది.
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
ప్రాణ భయంతో విలవిలలాడిన ఈతగాడు.. ఆక్టోపస్ ఏం చేసిందో చూడండి.. వీడియో!
Hyderabad, Telangana:Octopus Attacks Video Watch Here: సముద్రం.. అనంతమైన అందాలకు నిలయం మాత్రమే కాదు.. అంచనా వేయలేని ఎన్నో ప్రమాదకరమైన జీవులకు నిలయం కూడా.. నీలిరంగు అలల వెనుక దాగి ఉన్న అజ్ఞాత ప్రపంచంలో ఏ క్షణాన ఏ ప్రమాదం ముంచుకొస్తుందో ఊహించడం చాలా కష్టం.. సరిగ్గా అలాంటి ఒక వెన్నులో వణుకు పుట్టించే భయంకరమైన ఘటన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది. దీనికి సంబంధించిన అన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
సముద్రంలో హాయిగా ఈత కొడుతూ ఆస్వాదిస్తున్న ఒక వ్యక్తికి ఊహించని విధంగా ఒక జీవి కాలయముడిలాగా మారింది. నీటిలో ఈత కొడుతున్న ఆ వ్యక్తిపై ఒక ఆక్టోపస్ (Giant Octopus) ఒక్కసారిగా విరుచుకుపడింది. ఏమాత్రం సమయం ఇవ్వకుండా.. ఆ జీవి తన అత్యంత బలమైన చేతులతో (Tentacles) అతడి వీపు భాగాన్ని గట్టిగా చుట్టేసింది. సాధారణంగా ఇవి నీటిలో చాలా బలాన్ని కలిగి ఉంటాయి. కాబట్టి వీటిని విడిపించుకోవడం చాలా కష్టం..
ఆ ఆక్టోపస్ పట్టు ఎంత దారుణంగా ఉందంటే.. దాని ఒత్తిడికి ఆ వ్యక్తి ఊపిరి ఆడటమే కష్టంగా మారింది. ప్రాణాలు పోతాయేమోనన్న భయంతో ఆ వ్యక్తి విలవిలలాడిపోయాడు. మృత్యువు తన రాక్షస పంజాతో బిగించి.. పట్టుకున్న సమయంలో ఆ వ్యక్తి ప్రాణ భయంతో ధైర్యంగా ఉండి.. దానిని విడిపించుకోవడానికి ప్రయత్నించడం మీరు చూడొచ్చు. తన శక్తినంతా వినియోగించి.. ఆక్టోపస్ పట్టు నుంచి విడిపించుకోవడానికి ఒడ్డు బయట ఎంతగానో ప్రయత్నించడం మీరు కూడా క్లియర్గా చూడొచ్చు.
Moment an octopus got clipped to a man’s back while swimming https://t.co/KuxlwqsmoO
— Instablog9ja (@instablog9ja) July 31, 2026
Also Read: పోలీస్ వ్యాన్ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!
చివరకు అద్భుత రీతిలో ఆ రాక్షస జీవి పట్టు నుంచి బయటపడి.. ప్రాణాలు దక్కించుకున్నట్లు తెలుస్తోంది.. అయితే, నీటి పైకి వచ్చాక అతడి వీపుపై పడిన భయంకరమైన ఎర్రటి గుండ్రటి గాయాలు చూసి అక్కడున్న వారందరూ షాక్ అయిన్నట్లు తెలుస్తోంది. ఈ దృశ్యాలన్నీ కెమెరాలో రికార్డు రికార్డ్ చేసి.. సోషల్ మీడియాల్లో అప్లోడ్ చేయగానే.. క్షణాల్లో వైరల్గా మారాయి. మిలియన్ల మంది నెటిజన్లు ఈ వీడియోను చూసి ఆశ్చర్యపోయారు. సముద్రం ఎంత అందమైనదో.. అంతకంటే వెయ్యి రెట్లు ప్రమాదకరమైనది అనడానికి ఈ వీడియో ఒక నిదర్శనం.. అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Also Read: పోలీస్ వ్యాన్ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Pawan Kalyan Speech Bhogapuram: ప్రధాని మోదీపై బూతులు.. విమానాశ్రయం ప్రారంభోత్సవంలో డిప్యూటీ సీఎం పవన్ ఎమోషనల్!
Gudepuvalasa, Andhra Pradesh:Pawan Kalyan Speech At Bhogapuram Airport Inauguration: అల్లూరి సీతారామరాజు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ వేదికపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వాన్ని, దేశం కోసం ఆయన పడుతున్న శ్రమను కొనియాడుతూ పవన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.
ప్రసంగంలోని ముఖ్యాంశాలు..
ఒకప్పుడు బంగారాన్ని తాకట్టు పెట్టే దుస్థితిలో ఉన్న దేశాన్ని, ప్రధాని మోదీ తనదైన పాలనతో ప్రపంచంలోనే గౌరవప్రదమైన స్థానంలో నిలబెట్టారని పవన్ ప్రశంసించారు. 144 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా మోదీ అంకితభావంతో పనిచేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొనియాడారు.
భోగాపురం ఎయిర్పోర్ట్కు వీరుడు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టడం ఉత్తరాంధ్ర ప్రజలకు ఎంతో గర్వకారణమని, ఆయన ఆశయాలను ఇది భావితరాలకు చాటుతుందని అన్నారు. ఉత్తరాంధ్రకే చెందిన జీఎమ్మార్ సంస్థ ఈ ప్రాజెక్ట్ను పూర్తి చేయడం సంతోషకరమని పేర్కొన్నారు.
భావోద్వేగ వ్యాఖ్యలు..
దేశం కోసం నిరంతరం కష్టపడుతున్న ప్రధానిని జంతర్మంతర్ వద్ద కొందరు విమర్శించడం చూసి తనకు కన్నీళ్లొచ్చాయని పవన్ కళ్యాణ్ భావోద్వేగానికి గురయ్యారు. "పళ్లున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు" తగులుతాయని, దేశ రక్షణ కోసం శ్రమిస్తున్న మోదీకి ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని పిలుపునిచ్చారు. ప్రధానిని ఎదుర్కొనే నాయకుడు లేడని, ఆయన విశాల హృదయానికి అందరూ నమస్కరించాల్సిందేనని అన్నారు.
భోగాపురం విమానాశ్రయం రాష్ట్రాభివృద్ధికి, మౌలిక వసతుల విస్తరణకు బలమైన పునాదిగా మారుతుందని, దీనిద్వారా రాష్ట్రానికి పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు భారీగా పెరుగుతాయని పవన్ ధీమా వ్యక్తం చేశారు.
Also Read: టీడీపీ Vs వైసీపీ..భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం వేళ క్రెడిట్ రాజకీయాలు..ఎవరు చేశారు
Also Read: భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచి ఎయిర్ ఇండియా సర్వీసులు ప్రారంభం..పూర్తి షెడ్యూల్ ఇదే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
ఆర్థిక వ్యవస్థ దూకుడు.. ఏకంగా 14 నెలల రికార్డును తిరగరాసిన GST వసూళ్లు..!!
Lakshmapur, Telangana:GST Collection July 2026: దేశ ఆర్థిక రంగంలో కొన్ని చాలా సానుకూల వార్తలు ఉన్నాయి. జూలై 2026లో భారతదేశ స్థూల వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు 15.4 శాతం పెరిగి, రూ. 2.11 లక్షల కోట్ల చారిత్రాత్మక సంఖ్యను బ్రేక్ చేశాయి. శనివారం ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన అధికారిక డేటా ప్రకారం.. దేశీయ లావాదేవీలలో గణనీయమైన పెరుగుదల.. దిగుమతులపై అధిక పన్ను వసూళ్ల కారణంగా జీఎస్టీ రాబడిలో ఈ గణనీయమైన పెరుగుదల నమోదైంది.
2026-27 ఆర్థిక సంవత్సరంలో నెలవారీ జీఎస్టీ వసూళ్లు రూ.2 లక్షల కోట్ల మార్కును దాటడం ఇది రెండోసారి. పెరిగిన దేశీయ వినియోగం, వ్యాపార కార్యకలాపాలు పుంజుకోవడమే ఈ వృద్ధికి ప్రధాన కారణాలని ప్రభుత్వం పేర్కొంది. గత ఏడాది జూలైలో రూ.1.83 లక్షల కోట్లుగా ఉన్న స్థూల జీఎస్టీ వసూళ్లు, ఈ ఏడాది రూ.2.11 లక్షల కోట్లకు చేరుకున్నాయి.
దేశీయ జీఎస్టీ రాబడులు కూడా 10.1 శాతం పెరిగాయి. గత ఏడాది జూలైలో రూ.1.31 లక్షల కోట్లుగా ఉన్న ఈ వసూళ్లు, ఈ ఏడాది రూ.1.45 లక్షల కోట్లకు చేరుకున్నాయి. దిగుమతులపై జీఎస్టీ వసూళ్లు మరింత వేగంగా పెరిగాయి. 28.8 శాతం వృద్ధితో ఇది రూ.1.45 లక్షల కోట్లకు (₹66,511 కోట్లు) చేరుకుంది. అదనంగా, మొత్తం స్థూల జీఎస్టీ వసూళ్లలో దిగుమతుల వాటా గణనీయంగా పెరిగింది.
జూలైలో జీఎస్టీ రీఫండ్లు కూడా 13.1 శాతం పెరిగి రూ.29,968 కోట్లకు చేరాయి. రీఫండ్లను తీసివేసిన తర్వాత, నికర జీఎస్టీ వసూళ్లు రూ.1.81 లక్షల కోట్లుగా (రూ.1.81 లక్షల కోట్లు) ఉన్నాయి, ఇది గత ఏడాదితో పోలిస్తే 15.8 శాతం పెరుగుదల. దేశీయ నికర వసూళ్లు 10.5 శాతం పెరిగి రూ.1.27 లక్షల కోట్లకు చేరగా, కస్టమ్స్ జీఎస్టీ నుంచి నికర వసూళ్లు 30.3 శాతం పెరిగి రూ.54,223 కోట్లకు (రూ.54,223 కోట్లు) చేరాయి.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి నాలుగు నెలల్లో మొత్తం జీఎస్టీ వసూళ్లు రూ.8.43 లక్షల కోట్లకు (రూ.8.43 లక్షల కోట్లు) చేరుకున్నాయి. గత సంవత్సరం ఇదే సమయానికి, ఇది రూ.7.66 లక్షల కోట్లుగా (రూ.7.66 లక్షల కోట్లు) ఉంది. ఇది 10.1 శాతం వృద్ధి. ఎస్బిఐ రీసెర్చ్ నివేదిక ప్రకారం, జిఎస్టితో పాటు ప్రాథమిక ఎక్సైజ్ సుంకంలో రాష్ట్రాల వాటాను పరిగణనలోకి తీసుకుంటే, గత సంవత్సరంతో పోలిస్తే 2026-27లో రాష్ట్రాలు అదనంగా రూ. 1.43 లక్షల కోట్లు ఆర్జించే అవకాశం ఉంది.
Also Read: మీ సమస్యలు నాకు వదిలేయండి.. ముందు పిల్లల భవిష్యత్తుపై పోరాడండి
Also Read: ఒక్కో విద్యార్థిపై రూ. 1.08 లక్షల ఖర్చు.. అయినా ప్రైవేట్ వైపేనా
Also Read: ఆ పరిచయమే కొంపముంచిందా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
రోడ్డుపై మోకాళ్ల లోతు నీళ్లు.. థర్మాకోల్ షీట్పై హాయిగా శికారు.. వీడియో ఇదే..
Hyderabad, Telangana:Man Rides Thermocol Sheet Video Watch: దేశవ్యాప్తంగా వర్షాకాలం జోరుగా కొనసాగుతోంది.. గత కొన్ని రోజులుగా పలు రాష్ట్రాల్లో కురుస్తున్న కుండపోత వర్షాల కారణంగా అనేక నగరాలతో పాటు పట్టణాలు జలమయమయ్యాయి. ప్రధాన రహదారులతో పాటు వీధులు వర్షపు నీటితో నిండిపోయి చెరువులను తలపిస్తున్నాయి. ట్రాఫిక్ స్తంభించిపోవడంతో పాటు ఇళ్లలోకి నీరు చేరడం వంటి సమస్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే, ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా కొందరు తమ వెరైటీ స్కిల్స్, అద్భుతమైన ఆలోచనలు అందరినీ ఆశ్చర్యపోయేలా చేస్తున్నాయి. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటూ పొట్టచెక్కలయ్యేలా నవ్విస్తోంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
వివరాల్లోకి వెళ్తే..
తీవ్ర వర్షపాతం కారణంగా ఒక వీధిలో మోకాలు లోతు కంటే ఎక్కువగానే నీరు నిలిచిపోయింది.. వాహనాల రాకపోకలు నిలిచిపోయి.. జనాలు ఇళ్లకే పరిమితమైన ఆ సమయంలో ఒక వ్యక్తి చేసిన విన్యాసం అందరి దృష్టినీ ఆకర్షించింది. రోడ్డుపై నిలిచిన నీటిని చూసి విసుక్కోకుండా.. అతడు ఒక వినూత్న ఆలోచన చేశాడు. ఇంట్లో ఉన్న థర్మాకోల్ షీట్ను బయటకు తీసి.. దాన్నే ఒక బోట్ మార్చుకున్నాడు.
ఆ ఫోమ్ షీట్పై హాయిగా కూర్చొని.. వర్షపు నీటిలో తేలుతూ.. తన చేతులతో నీటిని వెనక్కి నెట్టుకుంటూ హాయిగా పడవ ప్రయాణం చేశాడు. ఆ వీధిల్లో అతను అలా నవ్వుతూ తేలిపోతుంటే.. చుట్టుపక్కల ఉన్నవారు తమ ఫోన్లలో ఆ ఘటన వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడు దీనికి సంబంధించిన ఘటన ఇప్పుడు వైరల్ అవుతోంది.
Also Read: పోలీస్ వ్యాన్ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!
నెట్టింట కామెంట్ల వర్షం..
ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్గా మారింది. లక్షలాది మంది ఈ వీడియోను వీక్షించడమే కాకుండా రకరకాల కామెంట్లు చేస్తున్నారు. భారతీయుల టెక్నిక్కు ప్రపంచంలో ఎవరూ సాటి రారు.. అని కొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతుండగా.. మున్సిపల్ అధికారులు వాటర్ పార్క్ సౌకర్యం ఉచితంగా కల్పించారని, బోటింగ్ సదుపాయం కూడా అందుబాటులో ఉందని.. మరికొందరు సరదాగా కామెంట్లు చేస్తున్నారు.
Also Read: పోలీస్ వ్యాన్ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
మనుషులకే కాదు.. గేదెలకీ మేకప్.. హర్యానాలో బఫెలో బ్యూటీ పార్లర్.. వీడియో!
Hyderabad, Telangana:Buffalo Beauty Parlour Video Watch: మనుషుల అందచందాల కోసం వాడకొక బ్యూటీ పార్లర్, హెయిర్ సెలూన్ ఉండటం మనం చూస్తూనే ఉంటాం. కానీ, మనకు పాలనిస్తూ.. నిత్యం సేవలందించే మూగజీవాలైన గేదెలకు, ఎద్దులకు కూడా ఒక బ్యూటీ పార్లర్ ఉందంటే నమ్మగలరా? వినడానికి కాస్త వింతగా, ఆశ్చర్యంగా అనిపించినా.. ఇది అక్షరాలా నిజం.. హర్యానాలోని కైథల్ జిల్లాకు చెందిన సందీప్ జాఖోలీ అనే పశుప్రేమికుడు ప్రారంభించిన ఈ వినూత్న గేదెల బ్యూటీ పార్లర్ ప్రస్తుతం దేశవ్యాప్తంగానూ చర్చనీయాశమైంది. అంతేకాకుండా దీనికి సంబంధించిన వీడియోలు కూడా ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
సాధారణంగా నగరాల్లో పెంచుకునే కుక్కలు, పిల్లల ఆరోగ్యం, అందం కోసం పెంపుడు జంతువుల యజమానులు ఎంతో శ్రద్ధ తీసుకుంటూ ఉంటారు. కానీ గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు జీవనాధారమైన పాడి పశువుల శారీరక శుభ్రతను అంతగా పట్టించుకోరు.. ఈ ఆలోచనే సందీప్ మనసును కదిలించింది.. పశువులకు కూడా ఆహ్లాదకరమైన వాతావరణం, శుభ్రత, అందం అవసరమని నమ్మిన సందీప్.. పశువుల కోసం ప్రత్యేకంగా ఈ గ్రూమింగ్ సెంటర్ను ప్రారంభించారు. ప్రస్తుతం చుట్టుపక్కల గ్రామాల నుంచి రైతులు తమ పశువులను ఎంతో ఉత్సాహంగా ఇక్కడికి తీసుకొచ్చి వాటిని ముస్తాబు చేయిస్తున్నారు.
కొమ్ముల పాలిష్ నుంచి హెయిర్ కటింగ్ వరకు..
ఈ పార్లర్లో లభించే ఫీచర్స్ చూస్తే.. ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే.. పశువుల కొమ్ములను ప్రత్యేక పరికరాలతో శుభ్రం చేసి, బాగా మెరిసేలా పాలిష్ చేస్తారు. అవసరాన్ని బట్టి కొమ్ములకు ఆకర్షణీయమైన ఆకారాన్ని ఇస్తూ ఉంటారు.. అలాగే పశువులకు శారీరక వేడి తగ్గేలా.. క్రిమి కీటకాలు చేరకుండా ఉండేందుకు వీలుగా అందమైన హెయిర్ కటింగ్ చేస్తారు. ముఖ్యంగా పశువుల అందాల పోటీలకు తీసుకెళ్లేముందు రైతులు తమ జీవాలకు ఇక్కడ ప్రత్యేకమైన మేకోవర్ చేయిస్తున్నారని షాప్ యాజమాని తెలుపుతున్నారు.
నకిలీ కొమ్ములు కూడా..
ఈ పార్లర్ కేవలం పై అందానికే పరిమితం కాకుండా.. పశువుల ఆరోగ్యానికి కూడా ప్రాధాన్యతనిస్తుంది. సిబ్బంది పశువుల కాళ్లను శుభ్రం చేసి ట్రిమ్ చేస్తారు. దీనివల్ల పశువులు నడవడానికి ఇబ్బంది పడకుండా ఉండటమే కాక ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఉంటాయి. ప్రమాదవశాత్తు ఏదైనా పశువు కొమ్ము విరిగిపోతే.. ఆ స్థానంలో నిజమైన కొమ్ములా కనిపించే ఆర్టిఫిషియల్ హార్న్ కూడా పెడుతున్నారు.
Also Read: పోలీస్ వ్యాన్ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!
సందీప్ చేస్తున్న ఈ వినూత్న ప్రయోగం ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.. ఇన్స్టాగ్రామ్లో @official_sandeep_jaakholi అనే ఖాతా నుంచి ఆయన షేర్ చేసే గేదెల మేకోవర్, సింగ్ పాలిషింగ్ వీడియోలకు లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి. మూగజీవుల పట్ల సందీప్ చూపుతున్న అద్భుతమైన ప్రేమ, ఆయన ఆలోచనా విధానంపై సోషల్ మీడియా వినియోగదారులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
Also Read: పోలీస్ వ్యాన్ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. తెలంగాణలో వేగంగా విస్తరిస్తున్న కవచ్ సిస్టమ్..!!
Lakshmapur, Telangana:Kavach system, Kavach 4.0: రైలు ప్రయాణికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ.. స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన కావాక్ (ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్)ను అమలు చేయడంలో భారతీయ రైల్వే.. జాతీయ స్థాయిలో అగ్రగామిగా నిలిచింది. ఎదురెదురుగా ఢీకొనే ప్రమాదాన్ని పూర్తిగా తొలగించి, మానవ తప్పిదాల వల్ల జరిగే ప్రమాదాలను నివారించే ఈ స్మార్ట్ టెక్నాలజీని తెలంగాణ వ్యాప్తంగా వేగంగా అమలు చేస్తున్నారు. దక్షిణ కరోలినా రైల్వే (SCR)లో ఒక సాంకేతిక విప్లవాన్ని తీసుకువస్తూ.. తెలంగాణలోని 63 రైల్వే స్టేషన్లలో.. 627 రూట్ కిలోమీటర్ల మేర కావాక్ వ్యవస్థను ఇప్పటివరకు విజయవంతంగా అమలు చేశారు. గత ఆర్థిక సంవత్సరంలో, జోన్ వ్యాప్తంగా 486 రూట్ కిలోమీటర్ల మేర అధునాతన కావాక్ 4.0 వెర్షన్ను విజయవంతంగా అమలు చేసి, రైలు ట్రయల్స్ను వేగవంతం చేశారు. కీలక స్టేషన్లలో భద్రతను పెంచడానికి, 21 కొత్త డిజిటల్ ఎలక్ట్రానిక్ ఇంటర్లాకింగ్ సిస్టమ్లను ఏర్పాటు చేశారు. 479 రూట్ కిలోమీటర్ల మేర ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నలింగ్ సిస్టమ్ను ప్రవేశపెట్టి, రైలు సామర్థ్యాన్ని పెంచారు.
ఈ అధునాతన డిజిటల్ వ్యవస్థ లోకో పైలట్లకు డిజిటల్ భద్రతా వలయంగా పనిచేస్తూ, రైలు ప్రయాణాన్ని మరింత సురక్షితంగా చేస్తుంది. ఒకవేళ లోకో పైలట్ పొరపాటున రెడ్ సిగ్నల్ను గమనించకపోయినా లేదా నిర్దేశించిన వేగ పరిమితిని మించి ప్రయాణించినా, ఈ వ్యవస్థ దానిని వెంటనే గుర్తించి, స్వయంచాలకంగా బ్రేకులు వేసి రైలును ఆపుతుంది. భారీ పొగమంచు ప్రతికూల వాతావరణంలో కూడా, లోకో పైలట్ క్యాబిన్ లోపల ఉన్న డిస్ప్లే స్క్రీన్పై వస్తున్న సిగ్నల్స్ను స్పష్టంగా చూడగలరు. స్మార్ట్ టెక్నాలజీని ఉపయోగించి, ఇది ఒకే ట్రాక్పై ఒక నిర్దిష్ట దూరంలో ఒకదానికొకటి సమీపిస్తున్న రెండు రైళ్లను గుర్తించి, ఆటోమెటిగ్గా బ్రేకులు వేస్తుంది. లెవెల్ క్రాసింగ్ గేట్ను సమీపిస్తున్నప్పుడు, లోకో పైలట్ ఎటువంటి జోక్యం లేకుండా విజిల్/హార్న్ మోగించడానికి కూడా కవచ్ వీలు కల్పిస్తుంది.
ఆధునిక సాంకేతిక పురోగతులతో రూపొందించిన అధునాతన 'కవచ్ 4.0' వెర్షన్ను వేగంగా అమలు చేయడంలో దక్షిణ మధ్య రైల్వే గణనీయమైన పురోగతిని సాధిస్తోంది. సికింద్రాబాద్-ముంబై, సికింద్రాబాద్-ధర్మవరం, కాజీపేట-బల్లార్షా వంటి అధిక రద్దీ గల మార్గాలలో కవచ్ టవర్లు, ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ (OFC), ట్రాక్-సైడ్ RFID (OFID) ట్యాగ్లను ఏర్పాటు చేసే పనులు వేగంగా పురోగమిస్తున్నాయి. ఇప్పటికే 100కు పైగా లోకోమోటివ్లకు (రైలు ఇంజన్లకు) కవచ్ పరికరాలను విజయవంతంగా అమర్చారు. వికారాబాద్-బీదర్ , వాడి-వికారాబాద్-సనత్నగర్ మార్గాలలో ఈ వ్యవస్థను విస్తృతంగా పరీక్షించారు. కేంద్ర ప్రభుత్వం రైల్వే మూలధన బడ్జెట్ను రికార్డు స్థాయిలో రూ.2.77 లక్షల కోట్లకు పెంచడంతో, భద్రతా ప్రాజెక్టులకు నిధుల కేటాయింపు పూర్తిగా పూర్తయింది. దక్షిణ మధ్య రైల్వే ప్రధాన నెట్వర్క్ మొత్తాన్ని క్రమంగా 100శాతం కవచ్ కవరేజీ పరిధిలోకి తీసుకువచ్చేందుకు పనులు వేగంగా జరుగుతున్నాయి. వికారాబాద్-బీదర్, వాడి-వికారాబాద్-సనత్నగర్ వంటి మార్గాలలో కూడా పనులు వేగంగా పూర్తికావస్తున్నాయి. ఈ అధునాతన డిజిటల్ భద్రతా వ్యవస్థ అమలుతో తెలంగాణలో రైలు ప్రయాణం మరింత వేగవంతంగా, సురక్షితంగా మారుతుంది.
కొన్ని సిగ్నలింగ్ మార్గాలలో కవచ్ కేవలం ప్రాథమిక-స్థాయి రక్షణ వ్యవస్థగా మాత్రమే అందుబాటులో ఉండగా, అత్యంత అధునాతన ప్రమాణాలతో రూపొందించబడిన కవచ్ 4.0, దేశవ్యాప్తంగా విభిన్న వాతావరణాలలో మరియు సంక్లిష్టమైన సిగ్నలింగ్ వ్యవస్థలలో కూడా 100శాతం పూర్తి రక్షణను అందిస్తుంది. మునుపటి వెర్షన్తో పోలిస్తే, కవచ్ 4.0 ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ (OFC) అధునాతన రేడియో టవర్లను అనుసంధానిస్తుంది. ఇది మిల్లీసెకన్లలో నిజ-సమయ సమాచార మార్పిడిని సాధ్యం చేస్తుంది. తద్వారా ఆటోమేటిక్ బ్రేకింగ్ వ్యవస్థ తక్షణమే స్పందించడానికి వీలు కల్పిస్తుంది. అంతేకాకుండా, కవచ్ 4.0 అధిక సాంద్రత గల నెట్వర్క్ మార్గాలలో భారీ రైలు రద్దీ ఉన్న కూడళ్లలో మరింత కచ్చితత్వంతో పనిచేస్తుంది. ఈ అధునాతన ఇన్-క్యాబిన్ సిగ్నలింగ్ వ్యవస్థ, దట్టమైన పొగమంచులో కూడా లోకో పైలట్ డిస్ప్లే స్క్రీన్పై సిగ్నల్ వివరాలను స్పష్టంగా ప్రదర్శిస్తుంది. చిన్నపాటి పొరపాట్లు జరిగినా కూడా సెకన్ల వ్యవధిలో ఆటోమేటిక్ బ్రేకులను యాక్టివేట్ చేస్తుంది.
సికింద్రాబాద్లో కవచ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్...
రైల్వే శాఖ, సికింద్రాబాద్లోని ఇండియన్ రైల్వేస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిగ్నల్ ఇంజనీరింగ్ అండ్ టెలికమ్యూనికేషన్స్ (IRISET)లో కవచ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను ఏర్పాటు చేసింది. దేశవ్యాప్తంగా కవచ్ను అమలు చేయడానికి అవసరమైన లోకో పైలట్లు, సిగ్నలింగ్ ఇంజనీర్లు.. సాంకేతిక సిబ్బందికి శిక్షణ ఇవ్వడంతో పాటు, ఐఐటి హైదరాబాద్ వంటి ప్రఖ్యాత సంస్థల సహకారంతో ఈ రక్షణ వ్యవస్థకు సంబంధించిన తాజా నవీకరణల కోసం ప్రమాణాల పరిశోధన, అభివృద్ధిని కూడా ఇది నిర్వహిస్తుంది.
Also Read: మీ సమస్యలు నాకు వదిలేయండి.. ముందు పిల్లల భవిష్యత్తుపై పోరాడండి
Also Read: ఒక్కో విద్యార్థిపై రూ. 1.08 లక్షల ఖర్చు.. అయినా ప్రైవేట్ వైపేనా
Also Read: ఆ పరిచయమే కొంపముంచిందా?
Disclaimer: ఈ కథనంలో పొందుపరిచిన సమాచారం కేవలం సాధారణ అవగాహన కోసం మాత్రమే. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టుబడి, ఆర్థిక, వ్యాపార లేదా న్యాయ సలహాగా పరిగణించరాదు. ఇందులోని వివరాలు ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా సేకరించబడ్డాయి. సమాచార ఖచ్చితత్వంపై జీ తెలుగు న్యూస్ ఎలాంటి హామీ ఇవ్వదు. ఈ సమాచారాన్ని ఆధారంగా చేసుకుని తీసుకునే పెట్టుబడి లేదా ఇతర ఆర్థిక నిర్ణయాలకు సంబంధించి కలిగే లాభనష్టాలకు పూర్తిగా పాఠకులే బాధ్యులు. ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు అర్హత కలిగిన ఆర్థిక సలహాదారులను సంప్రదించడం మంచిది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
LPG Cylinder Price: సామాన్యులకు గుడ్న్యూస్..భారీగా పడిపోయిన సిలిండర్ ధరలు!
Hyderabad, Telangana:LPG Cylinder Price Cut: ఆగస్టు 1 నుంచి గ్యాస్ సిలిండర్ల ధరలను తగ్గిస్తూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల ధరలో భారీగా తగ్గింపును ప్రకటించాయి. పశ్చిమాసియాలో నెలకొన్ని ఉద్రిక్తతలు, అంతర్జాతీయ సంగర్షణల నేపథ్యంలో సిలిండర్ ధరలు వ్యాపార రంగనికి గణనీయమైన ఉపశమనాన్ని కలిగించాయి.ఉగ్రరూపంలో గోదావరి.. 55 అడుగులకు చేరిన నీటిమట్టం.. 3వ ప్రమాద హెచ్చరిక జారీ!
Hyderabad, Telangana:Godavari Floods Latest News: భారీ వర్షం కారణంగా గోదావరి భయంకర ఉగ్రరూపాన్ని చూపిస్తోంది. ఎగువ ప్రాంతాల నుంచి ఉప్పెనలా వస్తున్న వరద నీటితో భద్రాచలం వద్ద గోదావరి ప్రళయ జలాలతో పోటెత్తుతోంది. శాంతమూర్తిలా ప్రశాంతంగా సాగే గోదారమ్మ.. నేడు మృత్యుదేవతలా పరివాహక ప్రాంతాలను ముంచెత్తుతుంటే.. కళ్లెదుటే తమ ఇళ్లు, చేన్లు నీట మునిగిపోతుండటాన్ని చూసి భద్రాద్రి జిల్లా ప్రజలు కన్నీరుమున్నీరవుతున్నారు.
అర్థరాత్రి వేళ.. పెరిగిన భయం..
శనివారం ఉదయం ప్రాంతంలో భద్రాచలం వద్ద నీటిమట్టం ఒక్కసారిగా 53 అడుగులకు చేరుకోవడంతో అధికారులు తక్షణమే మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. వరద విపరీతంగా పెరగడం ముందే ఊహించిన యంత్రాంగం.. ప్రజలను హెచ్చరించడంతో పరివాహక గ్రామాల్లో భయాందోళనలు తీవ్రరూపం దాల్చాయి.
ప్రస్తుతం నీటిమట్టం ఏకంగా 55.10 అడుగుల వద్ద ప్రమాదకరంగా ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. నది తీర ప్రాంతాలను ముంచెత్తుతూ వస్తున్న ఈ దండయాత్రతో వేలాది కుటుంబాలు చెట్టుకొకరు, పుట్టకొకరుగా మారే పరిస్థితి ఏర్పడింది.. తరతరాలుగా నమ్ముకున్న నదే ఈ రోజు ఇంతలా ప్రవహించడంతో బాధితులు రోదిస్తున్న తీరు గుండెలను పిండేస్తోంది.
స్తంభించిన రవాణా వ్యవస్థ..
ఉగ్ర గోదావరి ధాటికి భద్రాచలం–వాజేడు మధ్య ప్రధాన రహదారిపై భారీగా వరద నీరు చేరుకోవడంతో ఈ మార్గంలో రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. అనేక గ్రామాలు బాహ్య ప్రపంచంతో సంబంధాలు కోల్పోయి.. జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. రహదారులన్నీ చెరువులను తలపిస్తుండటంతో ప్రయాణికులు, స్థానికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
అధికారుల హైఅలర్ట్..
పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని జిల్లా యంత్రాంగం హైఅలర్ట్ ప్రకటించింది. ముంపు ప్రాంతాల ప్రజలను రెస్క్యూ టీమ్ల సహాయంతో సురక్షితంగా పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. బాధితులకు ఉచిత భోజన వసతితో పాటు తాగునీరు, వైద్య సదుపాయాలు అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
Also Read: పోలీస్ వ్యాన్ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!
ఎగువన కురుస్తున్న వర్షాల దృష్ట్యా గోదావరి ఉద్ధృతి మరింత పెరిగే అవకాశం ఉందని.. తీర ప్రాంతాల ప్రజలు ఎవరూ ధైర్యం కోల్పోవద్దని.. అధికార యంత్రాంగానికి సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ జల ప్రళయం నుంచి భద్రగిరి రామయ్యే తమను గట్టెక్కించాలని స్థానికులు ఆ స్వామివారిని వేడుకుంటున్నారు.
Also Read: పోలీస్ వ్యాన్ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Anti PM Modi Remarks: ప్రధాని మోదీని బూతులు పట్టిన యువతి..ఇప్పుడు అమాయకంగా క్షమాపణలు చెబుతోంది!
New Delhi, Delhi:Anti PM Modi Remarks Apology Video: నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా జూలై నెలలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా తీవ్రమైన ఆందోళనలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నిరసనల్లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా దూషిస్తూ చేసిన నినాదాలు చేసినట్లు కొందరు యువత ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే ఓ అమ్మాయి మాత్రం ప్రధాని మోదీని దారుణంగా బూతులతో తిడుతూ రెచ్చిపోయిన వీడియో గతంలో వైరల్ అయ్యింది. తాజాగా ఆమెపై కేసు నమోదవ్వడం వల్ల ఆమె ఇప్పుడు తాను 15 ఏళ్ల బాలికను అంటూ క్షమాపణలు చెబుతూ ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విడుదల చేసింది.
ఏం జరిగిందంటే?
జూలై 23న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసనలో ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా దూషణాత్మక భాషను ఉపయోగించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సీజేపీ నిరసనకారిణి, ఆన్లైన్లో వెలుగులోకి వచ్చిన ఒక వీడియోలో క్షమాపణ చెప్పింది. తన వయసు 15 ఏళ్లని ఇప్పుడు ఆమె పేర్కొంది. ఢిల్లీలోని కానాట్ ప్లేస్ సందర్శించిన తర్వాత ఫ్రెండ్స్తో కలిసి తాను నిరసనలకు వెళ్లినట్లు చెప్పుకొచ్చింది. తన చుట్టూ ఉన్న వ్యక్తుల ప్రభావానికి లోనయ్యి ప్రధానమంత్రికి వ్యతిరేకంగా చేసిన నినాదాలు చేసినట్లు ఆమె చెబుతోంది.
తాజాగా విడుదల చేసిన వీడియోలో ఆమె చేతులు జోడించి ఉన్న ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. "నేను ఆ వ్యక్తుల ప్రభావానికి లోనయ్యాను" అని ఆమె వీడియోలో చెబుతోంది. "నా వయసు కేవలం 15 ఏళ్లు. నేను చేసింది క్షమించదగినది కాదు. నేను చాలా చెడ్డ మాటలు మాట్లాడాను". దీనిని తన "మొదటి, చివరి తప్పు"గా పేర్కొంటూ, ఆమె మరో మాట మాట్లాడింది. "నేను యావత్ దేశానికి క్షమాపణలు చెబుతున్నాను. నాకు చాలా సిగ్గుగా ఉంది. నన్ను నేను కూడా చూసుకోలేకపోతున్నాను. దయచేసి నన్ను క్షమించండి" అని ఆ యువతి చెప్పుకొచ్చింది.
Ruchika Singh who abused PM Modi is now crying. She said
"I am apologizing to the entire country. I am so ashamed that I cannot even lift my eyes. I am asking for forgiveness from everyone, please forgive me, please.
This is my first and last mistake. After this, I will never… pic.twitter.com/ikcPJR7Q0t
— Chota Don (@choga_don) July 31, 2026
క్షమాపణలు అంగీకరించిన మోదీ!
నిరసన సందర్భంగా తనను దూషించిన విద్యార్థులను తాను క్షమించినట్లు, వారికి శిక్ష విధించడం కాకుండా మార్గనిర్దేశం చేయాలని సమాజాన్ని కోరుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో సందేశాన్ని విడుదల చేసిన కొన్ని గంటల తర్వాత ఈ వీడియో వెలుగులోకి వచ్చింది.
"నాపైనా, నా దివంగత తల్లిపైనా ఉపయోగించిన దూషణాత్మక నినాదాలు తీవ్ర ఆవేదన కలిగించాయి" అని మోదీ అన్నారు. "కానీ యువత తమ తప్పుల నుండి నేర్చుకోవడానికి అవకాశం ఇవ్వాలి" అని ప్రధాని మోదీ వీడియోలో చెప్పుకొచ్చారు.
Also Read: సామాన్యులకు పిడుగు లాంటి వార్త..ఆగస్టు 1 నుంచి భారీగా పెరగనున్న ధరలు!
Also Read: IMD Weather Alert: ఏపీ, తెలంగాణకు భారీ తుఫాను ముప్పు..బంగాళాఖాతంలో తీవ్ర అలజడి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
హైదరాబాద్ సైబర్ క్రైమ్ DCP అరవింద్ బాబుపై వేటు!
Hyderabad, Telangana:Hyderabad Cyber Crime DCP: హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ డెప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (DCP) అరవింద్ బాబుపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఆయనను ప్రస్తుతం ఉన్న సైబర్ క్రైమ్ DCP బాధ్యతల నుంచి తప్పిస్తూ.. తెలంగాణ రాష్ట్ర DGP కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తుండటంతో అరవింద్ బాబు DGP కార్యాలయంలో రిపోర్ట్ చేశారు.
అసలేం జరిగింది?
ప్రధాని నరేంద్ర మోదీ, ఇతర ప్రముఖుల ఫోటోలతో పాటు వీడియోలను మార్ఫింగ్ చేసి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లలో అభ్యంతరకర రీతిలో పోస్ట్ చేస్తున్నారంటూ తెలంగాణ BJP నేతలు, ఇతరులు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. ఈ ఫిర్యాదులపై స్పందించిన సైబర్ క్రైమ్ పోలీసులు భారతీయ నష్యాయ సంహిత (BNS)తో పాటు సమాచార సాంకేతిక చట్టం (IT Act) కింద రెండు వేర్వేరు కేసులు నమోదు చేశారు. అయితే, పోస్టులు పెట్టిన ఖాతాదారులతో పాటు ఆయా ప్లాట్ఫామ్ల నిర్వహణ సంస్థ అయిన మెటా ఇండియా (Meta India) హెడ్ను కూడా ఈ కేసుల్లో నిందితుడిగా చేర్చడం పెద్ద వివాదానికి దారితీసింది.
జాతీయ స్థాయిలో దుమారం ..
సోషల్ మీడియా వేదికలలో వేర్వేరు వినియోగదారులు చేసిన వ్యక్తిగత పోస్టులకు వేదికను అందించే మెటా యాజమాన్యాన్ని లేదా దాని ఇండియా హెడ్ను ప్రత్యక్షంగా ఎలా బాధ్యులను చేస్తారనే అంశంపై జాతీయ స్థాయిలో తీవ్ర చర్చ నడిచింది.. IT నిబంధనలతో సాటే ప్లాట్ఫామ్ బాధ్యతలపై స్పష్టత లేకుండా కేసు నమోదు చేయడంపై ఉన్నతాధికారులు, ప్రభుత్వం తీవ్రంగా పరిగణించినట్లు సమాచారం.
Also Read: పోలీస్ వ్యాన్ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!
వివాదం ముదిరిపోవడంతో సమగ్ర పరిశీలన జరిపిన రాష్ట్ర ప్రభుత్వం.. సైబర్ క్రైమ్ డీసీపీ అరవింద్ బాబుపై వేటు వేస్తూ డీజీపీ కార్యాలయానికి బదిలీ చేసింది.. కాగా.. బాధితులు ఇచ్చిన ఫిర్యాదుల్లోని సాంకేతిక వివరాలు, వినతుల ఆధారంగానే నిందితుల పేర్లను చేర్చామని పోలీస్ వర్గాలు ప్రాథమిక వివరణ ఇచ్చాయి.. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Also Read: పోలీస్ వ్యాన్ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
