బెల్లంపల్లి సివిల్ జడ్జి గృహాన్ని ప్రారంభించిన హైకోర్టు జడ్జి
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
MI Vs KKR Match Preview: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ జోరుగా సాగుతోంది. నేడు ఐపీఎల్లో రెండో లీగ్ మ్యాచ్ జరగనుంది. ఇందులో ముంబై ఇండియన్స్ (MI), కోల్కతా నైట్ రైడర్స్ (KKR) జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్కు ముంబైలోని ప్రతిష్టాత్మక వాంఖడే స్టేడియం వేదిక కానుంది. అయితే ఈ మ్యాచ్ కు ముందు ఇరు జట్ల బలాబలాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఇదే మ్యాచ్లో ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఓ సరికొత్త రికార్డును నెలకొల్పేందుకు అవకాశం ఉంది. దీని ద్వారా, రోహిత్ ఐపీఎల్ చరిత్రలోనే ఒక అరుదైన రికార్డు కానుంది.
ప్రస్తుతం ఐపీఎల్లో కోల్కతా నైట్రైడర్స్ పై అత్యధిక పరుగులు చేసిన రికార్డు ఆస్ట్రేలియా దిగ్గజం డేవిడ్ వార్నర్ పేరిట ఉంది. వార్నర్ కేకేఆర్ జట్టుపై 28 ఇన్నింగ్స్లలో 1093 పరుగులు చేశాడు. ఈ జాబితాలో ప్రస్తుతం రోహిత్ శర్మ రెండో స్థానంలో ఉన్నాడు. రోహిత్ శర్మ ఇప్పటివరకు కోల్కతాపై ఆడిన 35 ఇన్నింగ్స్లలో 1083 పరుగులు చేశాడు.
అయితే ఆదివారం జరగబోయే మ్యాచ్లో రోహిత్ కేవలం 11 పరుగులు చేసినా.. అతను వార్నర్ను అధిగమించి అగ్రస్థానానికి చేరుకుంటాడు. కేకేఆర్పై రోహిత్ రికార్డు అద్భుతంగా ఉంది. రోహిత్ ఇప్పటికే ఇదే జట్టుపై ఒక సెంచరీ, 6 హాఫ్ సెంచరీలు సాధించాడు.
ముంబై ఇండియన్స్, కోల్కతా నైట్ రైడర్స్ మధ్య పోరు ఎప్పుడూ ఏకపక్షంగానే నడిచేవి. గతంలో కొన్ని మ్యాచ్ రికార్డులను పోలిస్తే.. ముంబైదే పైచేయిగా కనిపిస్తోంది. ఈ రెండు జట్లు ఇప్పటివరకు 35 సార్లు తలపడగా.. అందులో ముంబై 24 మ్యాచ్లలో విజయం సాధించగా.. కేకేఆర్ కేవలం 11 మ్యాచ్లలో మాత్రమే గెలిచింది. వాంఖడే స్టేడియంలో ముంబై రికార్డు మరింత మెరుగ్గా ఉంది. ఇక్కడ జరిగిన 12 మ్యాచ్లలో, ముంబై 10 సార్లు గెలుపొందగా కేకేఆర్ కేవలం 2 సార్లు మాత్రమే గెలిచింది. 2025 సీజన్లో ముంబై 8 వికెట్ల భారీ తేడాతో విజయం సాధించింది.
జట్టు బలాబలాలు..
ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ ఒక బలమైన జట్టుగా కనిపిస్తోంది. బ్యాటింగ్లో రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, క్వింటన్ డి కాక్, ర్యాన్ రికెల్టన్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రూథర్ఫోర్డ్ వంటి విధ్వంసకర ఆటగాళ్లు ముంబై బలంగా కనిపిస్తోంది. మరోవైపు బౌలింగ్లో జస్ప్రీత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్ ప్రత్యర్థి బ్యాట్స్మెన్లను భయపెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. పవర్ప్లేలో దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్ కీలక పాత్ర పోషిస్తారు.
మరోవైపు ఫామ్లో ఉన్న టిమ్ సీఫెర్ట్, ఫిన్ అలెన్ కేకేఆర్కు సహాయపడతారు. ఆ జట్టు అజింక్య రహానే, రింకు సింగ్, రోవ్మన్ పావెల్పైనే ఆధారపడుతోంది. అయితే హర్షిత్ రాణా, ఆకాష్ దీప్ గాయాల కారణంగా జట్టుకు దూరమవడంతో, కేకేఆర్ బౌలింగ్ విభాగం కాస్త బలహీనంగా కనిపిస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Russia Petrol Export Ban News: ఇదే విషయంపై రష్యా ఉప ప్రధాన మంత్రి అలెగ్జాండర్ నోవాక్ మాట్లాడుతూ..2026 ఏప్రిల్ 1 నుండి 2026 జూలై 31 వరకు రష్యా నుండి పెట్రోల్ ఎగుమతులపై పూర్తి నిషేధాన్ని విధించాలని ఆదేశించారు. రష్యా దేశీయ మార్కెట్లో పెట్రోల్ సరఫరా తగినంతగా ఉండేలా చూడటం, సామాన్యులకు ధరలను అదుపులో ఉంచడం ఈ వ్యూహాత్మక నిర్ణయం వెనుక ముఖ్య ఉద్దేశం అని తెలియజేశారు. అంతర్జాతీయ మార్కెట్లో అస్థిరత ఉన్నప్పటికీ, రష్యా పౌరులకు అందుబాటు ధరలలో ఇంధనం లభించాలని నోవాక్ స్పష్టం చేశారు.
ఎందుకీ నిర్ణయం..
పశ్చిమాసియాలో ఇజ్రాయెల్, ఇరాన్ల మధ్య కొనసాగుతున్న సంఘర్షణ అంతర్జాతీయ చమురు, పెట్రోలియం మార్కెట్లలో అనిశ్చితి నెలకొల్పిందని రష్యా భావిస్తోంది. ప్రపంచ ధరలలోని హెచ్చుతగ్గుల నుండి దేశీయ మార్కెట్ను కాపాడటానికి ఇంధన ధరలను స్థిరంగా ఉంచాల్సిన అవసరాన్ని అధ్యక్షుడు పుతిన్ స్పష్టం చేశారు. దీనికి తోడు.. గతేడాది ఉక్రెయిన్ దాడుల వల్ల దెబ్బతిన్న రిఫైనరీలకు మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉండగా, అలాగే ఇంధన నిల్వలను కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నందున, ప్రభుత్వం ఇప్పుడు తన దేశీయ అవసరాలకు ప్రాధాన్యత ఇస్తోంది.
ఏ దేశాలు ప్రభావితమవుతాయి?
రష్యా రోజుకు సుమారు 120,000 నుండి 170,000 బ్యారెళ్ల పెట్రోల్ను ఎగుమతి చేస్తుంది. ఈ నిషేధం రష్యాలో తయారైన పెట్రోల్ను అత్యధికంగా కొనుగోలు చేసే దేశాలకు పెద్ద దెబ్బ కొడుతుంది. చైనా, టర్కీ, బ్రెజిల్తో పాటు పలు ఆఫ్రికా దేశాలు, సింగపూర్ వంటి దేశాలు ఇప్పుడు తమ పెట్రోల్ అవసరాలను తీర్చుకోవడానికి ప్రత్యామ్నాయ మార్కెట్లను వెతుక్కోవాల్సి ఉంటుంది. సరఫరాలో ఈ తగ్గుదల ప్రపంచ మార్కెట్లో పెట్రోల్ కొరతకు దారితీయవచ్చని, ఇది అంతర్జాతీయ ధరలను మరింత పెంచే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
భారత్లో ప్రభావం ఎంత?
భారతీయ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. రష్యా తీసుకున్న ఈ నిర్ణయం భారతదేశంపై కనీసం ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. దీనికి ప్రధాన కారణం.. భారతదేశం శుద్ధి చేసిన పెట్రోల్కు బదులుగా రష్యా నుండి ముడి చమురును కొనుగోలు చేయడమే. భారతదేశం తన ముడి చమురు అవసరాలలో సుమారు 80% దిగుమతి చేసుకుంటుంది. అందులో దాదాపు 20% సరఫరా రష్యా నుండి వస్తుంది. ప్రపంచంలోనే అత్యంత అధునాతనమైన రిఫైనరీ నెట్వర్క్లలో ఒకటి భారతదేశంలో ఉంది. ఇది రోజుకు 5.6 మిలియన్ బ్యారెళ్ల చమురును శుద్ధి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. మనం స్వయంగా ముడి చమురును కొనుగోలు చేసి.. దానిని పెట్రోల్, డీజిల్గా శుద్ధి చేసి, విదేశీ మార్కెట్లకు కూడా ఎగుమతి చేస్తాము.
గతంలోనూ ఆంక్షలు..
రష్యా తన దేశీయ సరఫరాలను కాపాడుకోవడానికి కఠినమైన చర్యలు తీసుకోవడం ఇది మొదటిసారి కాదు. గతేడాది ధరలను నియంత్రించే ప్రయత్నంలో రష్యా పెట్రోల్, డీజిల్ ఎగుమతులపై తాత్కాలిక నిషేధాన్ని విధించింది. ప్రస్తుతం రష్యా రిఫైనరీలు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయి. ప్రభుత్వం వద్ద తగినంత నిల్వలు ఉన్నాయి. బ్రెంట్ క్రూడ్తో పోలిస్తే రష్యా 'యురల్స్ ఆయిల్' ప్రస్తుతం గణనీయమైన ప్రీమియంతో అమ్ముడవుతోందని మంత్రి నోవాక్ ఇంకా పేర్కొన్నారు. ఈ వాస్తవం మార్కెట్లో రష్యాకు ఉన్న బలమైన పట్టును స్పష్టం చేస్తుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Kavitha Apology: గతంలో తాను ఓ పని చేయలేకపోయానని.. ఈ సందర్భంగా క్షమాపణలు చెబుతున్నట్లు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ప్రకటించారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు న్యాయం చేయలేకపోయా.. క్షమించండి అని చెప్పారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఆ పాపంలో నాకు భాగం ఉందనే క్షమించాలని కోరుతున్నా అంటూ విజ్ఞప్తి చేశారు. ఏజెన్సీలకు రేవంత్ రెడ్డి కొమ్ము కాస్తూ 5 లక్షల మందికి అన్యాయం చేస్తున్నాడని మండిపడ్డారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
Also Read: IPL 2026: ఐపీఎల్ ప్రారంభం వేళ సజ్జనార్ కీలక విజ్ఞప్తి.. వారికి సీరియస్ వార్నింగ్
హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద ధర్నాచౌక్లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ నిర్వహించిన ధర్నాకు ఆమె మద్దతు ప్రకటించి మాట్లాడారు. హైదరాబాద్ వీధుల్లో 5 లక్షల మంది ఉద్యోగులు మార్చ్ చేసే రోజులు దగ్గర్లో ఉన్నాయని రేవంత్ రెడ్డిని హెచ్చరించారు. కోదండరాం, హరగోపాల్ లాంటి మేధావుల మౌనం ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు శాపంగా మారిందని మండిపడ్డారు. తెలంగాణ జాగృతి అధికారంలోకి వస్తే ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగాల వ్యవస్థే ఉండదని స్పష్టం చేశారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలకు పరిష్కారం చూపకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.
Also Read: Hyderabad Police: ర్యాపిడో ఆటోలో బంగారం బ్యాగ్.. అర్ధగంటలో తెచ్చి ఇచ్చిన హైదరాబాద్ పోలీసులు
తెలంగాణ వస్తే అసలు ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగాల వ్యవస్థే ఉండదని భావించామని.. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత పర్మినెంట్ ఉద్యోగాలనే ఔట్ సోర్సింగ్ గా మార్చేశారని మాజీ ఎమ్మెల్సీ కవిత తెలిపారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు న్యాయం చేయలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. ఆనాటి పాపంలో తనకు భాగం ఉండడంతో క్షమాపణ చెబుతున్నట్లు తెలిపారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను కాంగ్రెస్ వాళ్లు కూడా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఉన్న 5 లక్షల మంది ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగులు చేపట్టిన ఈ ఉద్యమం మరో తెలంగాణ ఉద్యమంలా ఉందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తెలిపారు.
Also Read: RCB vs SRH: ఐపీఎల్ 2026 ఆరంభంలోనే సన్రైజర్స్కు షాక్.. ఇషాన్ కిషన్ శ్రమ వృథా
తెలంగాణ ఉద్యమంలో మిలియన్ మార్చ్ ఎలా చేశామో.. అలాగే హాఫ్ మిలియన్ ఉన్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు హైదరాబాద్ వీధుల్లో మార్చ్ చేపట్టాలని కవిత పిలుపునిచ్చారు. అప్పుడు మాత్రమే ఈ రేవంత్ రెడ్డి స్పందిస్తాడని చెప్పారు. ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ విధానం కారణంగా 9 వందల ఏజెన్సీలకు మాత్రమే లాభం కలుగుతోంది తప్ప ఉద్యోగులకు జరిగిన మేలు ఏది లేదని వివరించారు. రాజుల సొమ్ము రాళ్ల పాలు అన్నట్లుగా ప్రభుత్వాలు ఉద్యోగులకు అందాల్సిన ప్రయోజనాలను ఏజెన్సీలకు దోచి పెడుతున్నారని మండిపడ్డారు.
ధర్నా చౌక్లో ఎన్ని రోజులైనా ధర్నా చేసుకొని మీ చావు మీరు చావండన్నట్లుగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నాడని మాజీ ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు. సమస్యపై పోరాటం మాత్రమే కాదు పరిష్కారమయ్యే వరకు కొట్లాడటం తెలంగాణ బిడ్డల లక్షణమని పేర్కొన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం తీసుకొచ్చిన కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ విధానం ఇప్పటికీ కొనసాగటం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. జాగృతి అధికారంలోకి వస్తే ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ అనే విధానాన్నే లేకుండా చేస్తామని ప్రకటించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Virat Kohli Test Comeback News: ఇండియన్ ప్రీమియర్ లీగ్లో నిన్న సన్రైజర్స్తో జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ బ్యాటర్ విరాట్ కోహ్లీ అద్భుతంగా రాణించిన సంగతి తెలిసిందే. టీ20 మ్యాచ్ ఆడి దాదాపుగా 10 నెలలు దాటినా.. కోహ్లీ ఫామ్ చూసి అందరు ముక్కున వేలేసుకున్నారు. అయితే ఈ క్రమంలో ఓ మాజీ క్రికెటర్ విరాట్ కోహ్లీకి ఓ సూపర్ సలహ ఇచ్చాడు. టెస్టు రిటైర్మెంట్ వెనక్కి తీసుకొని.. శుభ్మన్ గిల్ బాధ్యతలు చేపట్టాలని విరాట్ కోహ్లీకి చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ప్లేయర్ సూచించాడు. అతను ఎవరో కాదు టీమ్ఇండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు.
విరాట్ కోహ్లీ మరో ఆరేళ్ల పాటు క్రికెట్ ఆడగలడని అంబటి రాయుడు అభిప్రాయపడ్డాడు. ఇప్పుడిదే విషయంపై సోషల్ మీడియాలో విపరీతమైన చర్చ నడుస్తోంది. రెండేళ్ల క్రితం టెస్ట్ ఫార్మాట్ నుంచి కోహ్లీ అనూహ్యంగా రిటైర్ అయినప్పటికీ, ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2026తో పాటు ఇటీవలే జరిగిన వన్డే సిరీస్లలో కోహ్లీ అద్భుతమైన ప్రతిభను కనబరిచాడు.
ఐపీఎల్ 2026లో అద్భుతమైన ఫామ్..
శనివారం సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఐపీఎల్ 2026 సీజన్ ఆరంభ మ్యాచ్లో కోహ్లీ తన పాత ఫామ్ను ప్రదర్శించాడు. 202 పరుగుల లక్ష్య ఛేదనలో డిఫెండింగ్ ఛాంపియన్స్కు అండగా నిలిచి, అజేయంగా 69 పరుగులు చేసి సునాయాస విజయాన్ని అందించాడు. ఇటీవలే దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్లపై వన్డే సిరీస్లలో సెంచరీలు సాధించిన తర్వాత అంతటి స్థాయిలో కోహ్లీ ఇప్పుడు మరోసారి రాణించాడు.
దక్షిణాఫ్రికా సిరీస్ తర్వాత తాను కేవలం వన్డేలపై దృష్టి పెట్టాలని కోహ్లీ నిర్ణయించుకున్నప్పటికీ.. టెస్టు క్రికెట్ కూడా ఆడగలడని అంబటి రాయుడు అభిప్రాయపడ్డాడు. ఇటీవలే ఓ ఇంటర్య్వూలో మాట్లాడిన అంబటి రాయుడు.. విరాట్ కోహ్లీకి టెస్టుల్లో ఆడే సత్తా ఉందని ఆయన అభిప్రాయపడ్డాడు. కోహ్లీ ఫిట్నెస్ ఇప్పటికీ అత్యున్నత స్థాయిలో ఉందని రాయుడు నొక్కిచెప్పాడు. సీనియర్ ఆటగాడిగా టీమ్ఇండియాను సుదీర్ఘ ఫార్మాట్లోకి తిరిగి గాడిలోకి తీసుకొచ్చేందుకు కోహ్లీ కెప్టెన్సీ పగ్గాలను చేపట్టాలని రాయుడు సూచించాడు.
విరాట్ కోహ్లీ టెస్టు కెరీర్..
విరాట్ కోహ్లీ తన టెస్ట్ కెరీర్ను 123 మ్యాచ్లతో కెరీర్ను ముగించాడు. ఈ ఫార్మాట్లో అతను 9,230 పరుగులు చేయగా.. అందులో 30 సెంచరీలు, 31 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. టీమ్ఇండియాకు ఎంతో కష్టతరంగా మారిన బోర్డర్-గావస్కర్ ట్రోఫీ తర్వాత.. ప్రతిష్టాత్మకమైన 10,000 పరుగుల మైలురాయికి కేవలం 770 పరుగుల దూరంలో అతను రిటైర్ అయ్యాడు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Virat Kohli Flying Kiss Video: క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ అట్టహాసంగా ప్రారంభమైంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొలి మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుపై ప్రత్యర్థి టీమ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయాన్ని సాధించింది. తొలి మ్యాచ్లో విజయంతో ఆర్సీబీ సిరీస్ను ప్రారంభించింది. సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన ఈ ఉత్కంఠభరితమైన మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో గెలిచింది ఆర్సీబీ. అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్ రెండింటిలోనూ ఆకట్టుకున్న ఆర్సీబీ జట్టు.. విరాట్ కోహ్లీ అద్భుతమైన బ్యాటింగ్ ప్రతిభతో ఈ గొప్ప విజయాన్ని నమోదు చేసింది.
విరాట్ కోహ్లీ ఫ్లయింగ్ కిస్ వైరల్..
దాదాపు 10 నెలల తర్వాత టీ20 క్రికెట్లోకి పునరాగమనం చేసిన విరాట్ కోహ్లీ, తన తొలి మ్యాచ్లోనే అద్భుతమైన ప్రదర్శనతో అభిమానులను ఆకట్టుకున్నాడు. 202 పరుగుల భారీ లక్ష్యంతో బరిలో దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు విరాట్ కోహ్లీ వెన్నుదన్నుగా నిలిచాడు. అతను కొట్టిన ప్రతి సిక్సర్కు మైదానంలోని అభిమానుల కోలాహలం చెవులు చిల్లులు పడేలా ఊర్రూతలూగించాయి.
అయితే ఈ మ్యాచ్ను ప్రత్యక్షంగా చూసేందుకు విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ కూడా చిన్నస్వామి స్టేడియానికి విచ్చేసింది. ఈ మ్యాచ్లో విజయం సాధించిన తర్వాత విరాట్ కోహ్లీ తన భార్య అనుష్క శర్మకు ఫ్లైయింగ్ కిస్ ఇచ్చాడు. కోహ్లీ చేసిన పనికి అనుష్క సిగ్గు పడుతూ తన భర్తకు తిరిగి ఫ్లైయింగ్ కిస్ ఇచ్చింది. అదే సమయంలో అనుష్క శర్మతో పాటు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మహిళా జట్టు కెప్టెన్ స్మృతి మంధాన కూడా అక్కడే ఉంది. ఆమెతో పాటు మరికొందరు ఆర్సీబీ మహిళా క్రికెటర్లు ఉన్నారు. అయితే విరాట్ కోహ్లీ ఫ్లైయింగ్ కిస్ చూసి స్మృతి మంధాన దెబ్బకి షాక్కు గురైంది. అయితే అనుష్క శర్మకి కోహ్లీ కిస్ ఇస్తే స్మృతి మంధాన షాక్ అవ్వడం ఏంటని ఫ్యాన్స్ తెగ చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
సన్రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్
ఐపీఎల్ 2026 తొలి మ్యాచ్లో బెంగళూరు టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకుంది. బలమైన బ్యాటింగ్ ఆర్డర్ ఉన్న సన్రైజర్స్ హైదరాబాద్ 250కి పైగా పరుగులు చేస్తుందని అంచనా వేశారు. అయితే ఆర్సీబీ బౌలర్ జాకబ్ డఫీ తన అద్భుతమైన బౌలింగ్తో పవర్ప్లే ముగిసేలోపే సన్రైజర్స్ తొలి మూడు వికెట్లు పడగొట్టాడు. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, నితీష్ కుమార్ రెడ్డి వంటి కీలక ఆటగాళ్లందరూ వెంటవెంటనే అవుటయ్యారు.
ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన హెన్రిచ్ క్లాసెన్ 31 పరుగుల వద్ద అవుటయ్యాడు. అయితే, ప్రశాంతంగా ఆడిన కెప్టెన్ ఇషాన్ కిషన్ 38 బంతుల్లో 80 పరుగులు చేశాడు. అలాగే, చివరి దశలో తన సత్తా చాటిన యువ ఆటగాడు అనికేత్ వర్మ 43 పరుగులు చేశాడు. వీరి ప్రదర్శనతో సన్రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 201 పరుగులు రాబట్టింది. ఆర్సీబీ బౌలర్లలో జాకబ్ డఫీ, రొమారియో షెపర్డ్ చెరో 3 వికెట్లు పడగొట్టారు.
🚨Smriti Mandhana’s look of surprise steals the moment 😲🔥
When Virat Kohli & Anushka Sharma exchange a flying kiss ❤️ pic.twitter.com/160UytG5MB
— Cricket Buzz (@arshdeep3444) March 28, 2026
ఆర్సీబీ అద్భుతమైన బ్యాటింగ్
202 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మంచి ఆరంభాన్ని అందుకుంది. ఓపెనింగ్ బ్యాటర్ ఫిల్ సాల్ట్ 8 పరుగులకే ఔటైనప్పటికీ.. ఆ తర్వాత వచ్చిన విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్ చక్కగా ఆడి జట్టుకు సునాయాస విజయానికి బాటలు వేశారు. ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగిన దేవదత్ పడిక్కల్ కేవలం 26 బంతుల్లోనే 61 పరుగులు చేశాడు. మరోవైపు, విరాట్ కోహ్లీ 38 బంతుల్లో 69 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. జట్టు కెప్టెన్ రజత్ పాటిదార్ తన వంతుగా 12 బంతుల్లో 31 పరుగులు బాదాడు. దీంతో ఆర్సీబీ కేవలం 15.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి భారీ విజయాన్ని అందుకుంది.
ప్రస్తుత సీజన్లోని మొదటి మ్యాచ్లో అది కూడా సొంతగడ్డపై భారీ విజయం నమోదు చేయడంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అభిమానులు ఉత్సాహంలో ఉన్నారు. తక్కువ సమయంలోనే భారీ లక్ష్యాన్ని ఛేదించిన ఆర్సీబీ, తమ బలమైన బ్యాటింగ్ ఆర్డర్తో ఇతర జట్లకు సవాలు విసిరింది. రాబోయే మ్యాచ్లలో కూడా ఆర్సీబీ ఇదే ఫామ్తో విజయాలు కొనసాగిస్తుందో లేదో చూడాలి.
Also Read: Amaravati Farmers: అసెంబ్లీలో అమరావతి బిల్లు ఆమోదానికి ముందే కేంద్రం గుడ్ న్యూస్..రైతులకు ఇక పండగే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Petrol Price: ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం ముదురుతున్న వేళ, అమెరికా ఉపాధ్యక్షుడు జె.డి. వాన్స్ ఇంధన ధరల విషయంలో కొంత ఆశాజనకమైన వార్తను పంచుకున్నారు. ఇరాన్-అమెరికా మధ్య సాగుతున్న పోరు వల్ల ఆకాశాన్నంటిన పెట్రోల్, డీజిల్ ధరలు త్వరలోనే అదుపులోకి వస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అయితే, ఇది జరగాలంటే ఇరాన్ సముద్ర మార్గాల్లో చేస్తున్న దురాక్రమణకు ముగింపు పలకడమే ఏకైక మార్గమని ఆయన స్పష్టం చేశారు.
పెరుగుతున్న ఇంధన ధరలు - వాన్స్ విశ్లేషణ:
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. అమెరికా వంటి శక్తివంతమైన దేశాల్లో సైతం గ్యాస్ ధరలు సామాన్యుడికి భారంగా మారాయి. దీనిపై స్పందించిన జె.డి. వాన్స్, అధ్యక్షుడు ట్రంప్ ఉద్దేశం ఇరాన్తో దశాబ్దాల పాటు యుద్ధం చేయడం కాదని పేర్కొన్నారు. "మా లక్ష్యం స్పష్టం.. పని పూర్తి చేయడం మరియు త్వరగా బయటకు వచ్చేయడం (Get the job done and get out). ఇరాన్ నావికాదళం అంతర్జాతీయ వాణిజ్య నౌకలకు సవాలు విసరలేనంతగా దానిని శక్తిహీనంగా మార్చడమే మా ఆపరేషన్ ప్రధాన ఉద్దేశం" అని ఆయన వివరించారు. ఈ సైనిక చర్య విజయవంతం కాగానే చమురు సరఫరా పునరుద్ధరించబడి, ధరలు మళ్లీ సాధారణ స్థితికి వస్తాయని ఆయన హామీ ఇచ్చారు.
ఇరాన్ నౌకాదళంపై తుది పోరు:
ఇరాన్ సైనిక స్థావరాలు మరియు నౌకాదళ నౌకలను లక్ష్యంగా చేసుకుని జరిపిన క్షిపణి దాడుల తాలూకు దృశ్యాలను అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) విడుదల చేసింది. దశాబ్దాలుగా అంతర్జాతీయ జలాల్లో ఇరాన్ కొనసాగిస్తున్న ఆధిపత్యానికి ముగింపు పలికామని అమెరికా ధీమా వ్యక్తం చేస్తోంది. వాణిజ్య నౌకల రాకపోకలకు ఆటంకం కలిగిస్తున్న ఇరాన్ క్షిపణి కేంద్రాలను అమెరికా సేనలు ధ్వంసం చేశాయి.
పరస్పర విరుద్ధ నివేదికలు - యుద్ధ క్షేత్రంలో అసలేం జరుగుతోంది?
అమెరికా తాను విజయం సాధించానని చెప్తుంటే, ఇరాన్ మీడియా మాత్రం మరో భయంకరమైన కథనాన్ని వినిపిస్తోంది. దుబాయ్లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ డ్రోన్లు, బాలిస్టిక్ క్షిపణులతో భీకరంగా విరుచుకుపడిందని అక్కడి మీడియా సంస్థలు పేర్కొంటున్నాయి. ఈ దాడిలో వందలాది మంది అమెరికా సైనికులు మరణించారని, క్షతగాత్రులను తరలించడానికి అంబులెన్సులు గంటల తరబడి శ్రమించాయని ఇరాన్ నివేదికలు చెబుతున్నాయి. ఈ పరస్పర విరుద్ధమైన ప్రకటనలు అంతర్జాతీయ సమాజంలో మరింత ఆందోళనను పెంచుతున్నాయి.
యుద్ధం ఎప్పుడు ముగుస్తుంది? ధరలు ఎప్పుడు తగ్గుతాయి? అన్న సామాన్యుడి ప్రశ్నకు సమాధానం ప్రస్తుతం యుద్ధ క్షేత్రంలోనే దాగి ఉంది. అమెరికా తన 'క్విక్ ఎగ్జిట్' ప్లాన్ అమలు చేసి ధరలను అదుపులోకి తెస్తుందా లేక ఇరాన్ ప్రతిఘటనతో ఈ సంక్షోభం మరిన్ని రోజులు కొనసాగుతుందా అనేది వేచి చూడాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
No Kings protest America March 2026: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసన జ్వాలలు మిన్నంటుతున్నాయి. నో కింగ్స్ అనే శక్తివంతమైన నినాదంతో ఈ శనివారం అమెరికాలోని మొత్తం 50 రాష్ట్రాల్లో సుమారు 3,300 కంటే ఎక్కువ ఈవెంట్లు ప్లాన్ చేశారు. ఇది అమెరికా దేశీయ రాజకీయ చరిత్రలోనే అతిపెద్ద నిరసన దినంగా విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు.
ఉద్యమానికి పునాది.. ఆ ఇద్దరి మరణం : ఈ నిరసనలకు ప్రధాన కేంద్రం మిన్నియాపాలిస్. జనవరిలో ఫెడరల్ అధికారులు జరిపిన కాల్పుల్లో రెనీ గుడ్, అలెక్స్ ప్రెట్టి అనే ఇద్దరు అమెరికన్ పౌరులు ప్రాణాలు కోల్పోవడం దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. వలసదారులపై అణిచివేత పేరుతో ఫెడరల్ ఏజెంట్లు జరిపిన ఈ దాడులు, సామాన్య ప్రజల్లో భయాందోళనలను పెంచాయి. ముఖ్యంగా ముసుగులు ధరించిన ఏజెంట్లు వీధుల్లో తిరుగుతూ ప్రజలను వేధించడం అమెరికన్లకు తమ ప్రజాస్వామ్యంపై నమ్మకాన్ని పోగొట్టింది.
ఇరాన్ యుద్ధం .. సామాన్యుడిపై భారం:
నిరసనకారుల ఆగ్రహానికి మరో ప్రధాన కారణం.. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంలో అమెరికా ప్రత్యక్షంగా పాల్గొనడం. గత నెల రోజులుగా సాగుతున్న ఈ యుద్ధం వల్ల ఇప్పటివరకు 1,500 మంది ఇరాన్ పౌరులు, 13 మంది అమెరికన్ సైనికులు మరణించారు. ఈ యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా ఇంధన సరఫరా దెబ్బతిని, అమెరికాలో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకాయి. నిత్యావసరాల ధరలు పెరగడం, ఆర్థిక వ్యవస్థ అస్థిరతకు గురవ్వడం సామాన్య కుటుంబాలను రోడ్లపైకి వచ్చేలా చేసింది.
హోంల్యాండ్ సెక్యూరిటీ షట్డౌన్.. విమానాశ్రయాల్లో గందరగోళం:
మరోవైపు వలస విధానాలపై డెమొక్రాట్లు, రిపబ్లికన్ల మధ్య నెలకొన్న ప్రతిష్టంభన కారణంగా ఫిబ్రవరి 14 నుండి డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ (DHS) మూతపడింది. దీనివల్ల విమానాశ్రయాల్లో భద్రతా సిబ్బంది కొరత ఏర్పడి, ప్రయాణికులు గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. ప్రభుత్వం తన బాధ్యతలను విస్మరించి, రాజకీయ ప్రయోజనాల కోసం దేశాన్ని ఇబ్బందుల్లోకి నెడుతోందని ప్రజలు మండిపడుతున్నారు.
ప్రధాన నగరాల్లో ప్రజా ప్రభంజనం:
మిన్నియాపాలిస్ - సెయింట్ పాల్: ఇక్కడ బ్రూస్ స్ప్రింగ్స్టీన్ వంటి దిగ్గజ గాయకులు సంగీతంతో నిరసన తెలుపుతుండగా, సెనేటర్ బెర్నీ శాండర్స్, గవర్నర్ టిమ్ వాల్జ్ వంటి నాయకులు ప్రసంగించనున్నారు.
వాషింగ్టన్ డీసీ: నేషనల్ మాల్ వద్ద దాదాపు 3 లక్షల మంది పాల్గొంటారని అంచనా. ట్రంప్ నిరంకుశ పోకడలకు రాజధాని నుండే గట్టి సమాధానం ఇవ్వాలని నిరసనకారులు భావిస్తున్నారు.
చికాగో , న్యూయార్క్: చికాగోలోని గ్రాంట్ పార్క్ వద్ద మా ప్రజాస్వామ్యంపై దాడులు ఆపండి అనే నినాదాలతో లక్షలాది మంది ప్రజలు గుమిగూడుతున్నారు. న్యూయార్క్లో దాదాపు 3.5 లక్షల మంది పాల్గొంటున్నట్లు అంచనా.
ట్రంప్ ప్రభుత్వం మొదటి ఏడాదిలోనే నేషనల్ గార్డ్ను పంపడం, కోర్టుల అనుమతి లేకుండా నిర్బంధించడం వంటి చర్యలు అమెరికా రాజ్యాంగ స్ఫూర్తికే విరుద్ధమని నిరసనకారులు వాదిస్తున్నారు. ఈ శనివారం నాటి ర్యాలీలు కేవలం నిరసనలు మాత్రమే కావు, రాబోయే ఎన్నికల్లో ట్రంప్ భవిష్యత్తును నిర్ణయించే బలమైన సంకేతాలు. అమెరికాలో ప్రజాస్వామ్యం నిలుస్తుందా లేదా అనే ప్రశ్నకు ఈ ఉద్యమమే సమాధానం కానుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
PM E-DRIVE: భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల (EV) వినియోగాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పీఎం ఎలక్ట్రిక్ డ్రైవ్ రివల్యూషన్ ఇన్ ఇన్నోవేటివ్ వెహికల్ ఎన్హాన్స్మెంట్ (PM E-DRIVE) పథకంలో కీలక మార్పులు జరిగాయి. గతంలో ఉన్న 'ఫేమ్' (FAME) పథకం స్థానంలో వచ్చిన ఈ పీఎం ఈ-డ్రైవ్ గడువును పెంచుతూ కేంద్ర భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది.
కొత్త గడువు తేదీలు :
గత నిబంధనల ప్రకారం, ఎలక్ట్రిక్ టూ-వీలర్లకు సబ్సిడీ పొందే గడువు మార్చి 31, 2026 తో ముగియాల్సి ఉంది. అయితే తయారీదారులు, వినియోగదారుల అభ్యర్థన మేరకు దీనిని జూలై 31, 2026 వరకు పొడిగించారు. అంటే.. ఈ లోపు రిజిస్ట్రేషన్ చేయించుకున్న ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు మాత్రమే ప్రభుత్వ రాయితీ లభిస్తుంది. ఇక ఎలక్ట్రిక్ త్రీ-వీలర్లు (ఈ-రిక్షాలు, ఈ-కార్టులు) విషయానికి వస్తే.. వీటికి మునుపటి గడువు తేదీ అయిన మార్చి 31, 2028 వరకు రాయితీలు అందుబాటులో ఉంటాయి.
ధరల పరిమితి, సబ్సిడీ వివరాలు:
-అన్ని ఎలక్ట్రిక్ వాహనాలకు ఈ రాయితీ వర్తించదు. దీనికోసం కేంద్రం నిర్దిష్టమైన ధరల పరిమితిని విధించింది:
ఎలక్ట్రిక్ టూ-వీలర్లు: వీటి ఎక్స్-షోరూమ్ ధర రూ. 1.5 లక్షల లోపు ఉండాలి.
ఎలక్ట్రిక్ త్రీ-వీలర్లు: వీటి ధర రూ. 2.5 లక్షల లోపు ఉంటేనే సబ్సిడీకి అర్హత ఉంటుంది.
ప్రస్తుతం ఎలక్ట్రిక్ టూ-వీలర్లకు బ్యాటరీ సామర్థ్యాన్ని బట్టి ఒక కిలోవాట్ అవర్ (kWh) కు రూ. 2,500 చొప్పున గరిష్టంగా రూ. 5,000 వరకు సబ్సిడీ లభిస్తోంది.
నిధుల లభ్యత - ఒక హెచ్చరిక:
పీఎం ఈ-డ్రైవ్ పథకం కోసం కేంద్రం మొత్తం రూ. 10,900 కోట్లు కేటాయించింది. అయితే ఇది ఒక ఫండ్-లిమిటెడ్ పథకం. అంటే.. ప్రభుత్వం కేటాయించిన ఈ నిధులు పైన పేర్కొన్న గడువు తేదీల కంటే ముందే అయిపోతే, అప్పటికప్పుడు ఈ పథకాన్ని నిలిపివేస్తారు. ఆ తర్వాత ఎటువంటి రాయితీ దరఖాస్తులను స్వీకరించరు. ఇప్పటికే ఈ-త్రీవీలర్ (L5 కేటగిరీ) విభాగం తన లక్ష్యాన్ని చేరుకోవడంతో గతేడాది డిసెంబర్లోనే ఆ విభాగానికి సబ్సిడీని నిలిపివేశారు.
పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడం..పెట్రోల్, డీజిల్ దిగుమతుల భారాన్ని తగ్గించడమే లక్ష్యంగా కేంద్రం ఈ రాయితీలను అందిస్తోంది. ఎలక్ట్రిక్ వాహనం కొనాలనుకునే వారు ఈ సవరించిన గడువులను దృష్టిలో పెట్టుకుని, నిధులు ముగియక ముందే తమ వాహనాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకోవడం ఉత్తమం.
Also Read: Gold Rate Today: పసిడి ధరలకు బ్రేక్.. మార్చి 29వ తేదీ ఆదివారం విజయవాడ, హైదరాబాద్లో ధరలు ఇవే..!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Ishan Kishan: ఐపీఎల్ 2026 సీజన్ అట్టహాసంగా ప్రారంభమవగా.. తొలి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)తో తలపడిన సన్రైజర్స్ హైదరాబాద్ ఓటమిపాలైంది. బ్యాటింగ్లో అద్భుతం చేసినా బౌలింగ్లో విఫలమవడంతో కొత్త సీజన్ను సన్రైజర్స్ ఓటమితో ప్రారంభించగా.. ఆర్సీబీ విజయంతో శుభారంభం చేసింది. 201 లక్ష్యాన్ని ఆర్సీబీ 15 ఓవర్లలోనే ముగించి 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన పోరులో సన్రైజర్స్ హైదరాబాద్ టాస్ ఓడి బ్యాటింగ్కు దిగి నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ 7 పరుగులకే ఔటవగా.. ట్రావిడ్ హెడ్ 11 పరుగులకే పరిమితమయ్యాడు. ఈ క్లిష్ట సమయంలో కెప్టెన్ ఇషాన్ కిషన్ దంచికొట్టాడు. తుఫాన్ ఇన్సింగ్స్ ఆడి 38 బంతుల్లోనే 80 పరుగులు చేశాడు. 8 ఫోర్లు, 5 సిక్సర్లతో చెలరేగి ఆడాడు. నితీశ్ కుమార్ ఒక్క పరుగే చేయగా.. హెన్రిచ్ క్లాసెన్ 31 పరుగులతో పర్వాలేదనిపించాడు. సలీల్ అరోరా 9కే ఔటవగా.. అనికేత్ వర్మ అద్భుతంగా ఆడి 43 పరుగులు జోడించాడు. హర్ష్ దుబే (3), హర్షల్ పటేల్ పరుగులు చేయలేకపోయారు. ప్రత్యర్థి ఆర్సీబీ తమ సొంత గడ్డపై అద్భుతంగా ఆడాడు. జాకబ్ డఫీ అరంగేట్ర మ్యాచ్లోనే నిప్పులు చెరిగి సన్రైజర్స్ను భారీ దెబ్బతీశాడు. దీంతో ఒక దశలో హైదరాబాద్ 29 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు దిగిన బెంగళూరుకు ఓపెనర్లు మాంచి స్కోర్తో రాణించారు. దేవదత్ పడిక్కల్ కేవలం 26 బంతుల్లోనే 61 పరుగులు చేయగా.. విరాట్ కోహ్లీ తన మార్క్ షాట్లతో స్టేడియాన్ని హోరెత్తించాడు. కెప్టెన్ రజత్ పాటిదార్ (31) దూకుడుగా ఆడటంతో ఆర్సీబీ విజయం సులువైంది. కోహ్లీ 38 బంతుల్లో 69 పరుగులు చేసి అత్యధిక స్కోరర్గా నిలిచాడు. మిగతా బ్యాటర్లు తలా కొన్ని పరుగులు జోడించడంతో బెంగళూరు 15.4 ఓవర్లలోనే 202 చేసి ఆర్సీబీ విజయం సాధించింది.
బ్యాటర్లు ఘనం.. బౌలర్లు విఫలం
తొలి మ్యాచ్లోనే సన్రైజర్స్ విఫలమవడంతో మళ్లీ జట్టు కూర్పుపై విమర్శలు వస్తున్నాయి. బ్యాటింగ్ పరంగా అదరగొట్టగా.. బౌలింగ్లోనే సన్రైజర్స్ తడబడింది. ఐపీఎల్ సీజన్ తొలి నుంచి సన్రైజర్స్ ప్రధాన లోపం బౌలింగ్ లేకపోవడం. బ్యాటర్లు చేసిన భారీ స్కోర్ను బౌలర్లు కాపాడడంలో విఫలమవడంతో జట్టు పరాజయం వైపు నిలిచింది. గత సీజన్లలో కూడా ఇదే లోపంతో ఇబ్బందులు ఎదుర్కొన్న సన్రైజర్స్.. ఆ లోపం నుంచి బయటపడడం లేదు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Revanth Reddy 1 50 Lakh Crore Corruption: తెలంగాణలో తన కుంభకోణాలు, అవినీతి గురించి ప్రశ్నిస్తే రేవంత్ రెడ్డి బెదిరింపులకు దిగుతున్నారని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మైనింగ్ అక్రమాలను ప్రశ్నించిన సందర్భంలో కూడా ప్రతిపక్షాన్ని బెదిరించే ధోరణి ప్రదర్శించారని గుర్తుచేశారు. రేవంత్ రెడ్డికి బెదిరింపులు అలవాటైపోయాయని.. అలాంటి బెదిరింపులకు బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికీ భయపడదని స్పష్టం చేశారు.
Also Read: Sports Meet: అన్ని స్టేడియాలను అభివృద్ధి చేస్తాం.. స్పోర్ట్స్ మీట్లో రేవంత్ రెడ్డి
హైదరాబాద్లోని బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్లో శనివారం జరిగిన బీఆర్ఎస్వీ సమావేశంలో కేటీఆర్ కీలక ప్రసంగం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుకు ఒక్క రూపాయి లేదని చెప్పే రేవంత్ రెడ్డి.. తన అవినీతి సొమ్ముల కోసం మూసీ పేరిట రూ.లక్షన్నర కోట్లు ఖర్చు చేస్తానని చెప్పడం దారుణమని మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వం రూ.16 వేల కోట్లతో రూపొందించిన సమగ్ర ప్రణాళికను పక్కన పెట్టి భారీ అంచనాలతో అవినీతి కార్యక్రమాన్ని చేపట్టడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపణలు చేశారు.
Also Read: IPL 2026: ఐపీఎల్ ప్రారంభం వేళ సజ్జనార్ కీలక విజ్ఞప్తి.. వారికి సీరియస్ వార్నింగ్
కేసీఆర్ ప్రభుత్వం మూసీ నదిలో మురుగునీటి శుద్ధి కేంద్రాల నిర్మాణాన్ని దాదాపుగా పూర్తి చేసిందని.. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీటిని మూసీలోకి పంపించే ప్రణాళిక కూడా సిద్ధంగా ఉందని గుర్తుచేశారు. అయినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం అంచనాలను అనవసరంగా పెంచి అవినీతికి మార్గం సుగమం చేస్తోందని విమర్శించారు. మూసీ ప్రాజెక్ట్ పేరుతో లక్షలాది ఇళ్లను కూల్చివేయడానికి దాదాపు 3000 ఎకరాల భూమిని సేకరించి కార్పొరేట్ కంపెనీలకు అప్పగించే ప్రయత్నం జరుగుతోందని కేటీఆర్ ఆరోపించారు. మూసీ ఒడ్డున ఉన్న ఇళ్లు చట్ట విరుద్ధమని చెప్పే ప్రభుత్వం.. అదే ప్రాంతంలో భారీ హోటళ్లు, బిజినెస్ సెంటర్లు నిర్మించాలనుకోవడం ద్వంద్వ వైఖరి అని మండిపడ్డారు.
Also Read: Hyderabad Police: ర్యాపిడో ఆటోలో బంగారం బ్యాగ్.. అర్ధగంటలో తెచ్చి ఇచ్చిన హైదరాబాద్ పోలీసులు
మూసీ పేరిట జరుగుతున్న అవినీతి చర్యలను జాతీయ స్థాయి ప్రముఖులు కూడా వ్యతిరేకిస్తున్నారని మాజీ మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు. అయినా ఇప్పుడు దేవుడి పేరును ఉపయోగించి ప్రజలను మోసం చేసే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు. తాను చేస్తున్న అవినీతి ప్రశ్నిస్తే శివతాండవం చేస్తానని మాట్లాడటం రేవంత్ రెడ్డి అహంకారానికి నిదర్శనమని తెలిపారు. రేవంత్ రెడ్డి తన అధికార అహంకారాన్ని తగ్గించుకొని.. మూసీ ప్రాజెక్ట్ను ప్రజలకు ఇబ్బంది కలగకుండా అమలు చేయాలని తెలిపారు.
ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రం పిచ్చోడి చేతిలో రాయిలాగా మారిందని మాజీ మంత్రి కేటీఆర్ దుయ్యబట్టారు. ఎన్నికల సమయంలో అభయహస్తం పేరుతో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారని విమర్శించారు. విద్యార్థులకు విద్యా భరోసా కార్డులు, 2 లక్షల ఉద్యోగాలు, మెగా డీఎస్సీ, ఉర్దూలో ప్రత్యేక డీఎస్సీ, బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ ఇలా అన్నీ అమలు కాలేదని గుర్తుచేశారు. వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి రెండున్నరేళ్లు గడిచినా ఒక్కటీ పూర్తిగా అమలు కాలేదని విమర్శించారు. నన్ను కోసినా పైసలు లేవు అనే రేవంత్ రెడ్డి మూసీ కోసం మాత్రం రూ.లక్షల కోట్లు ఉన్నాయని చెప్పడం ప్రజలను మోసం చేయడమేనని మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Telangana Legislators Sports Meet 2026: 'నిత్యం రాజకీయాల్లో మునిగి తేలుతూ.. నిరంతరం సమస్యలంపరిష్కారం కోసం విరామం లేకుండా పనిచేసే వారికి ఇది అద్భుతమైన అవకాశం. ఇక్కడ అద్భుతంగా ఆడకపోవచ్చు.. కానీ అద్భుతమైన క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించడానికి ఎల్బీ స్టేడియం వేదిక అవుతుంది. ఈ మైదానంలో శిక్షణ పొందిన వారు మంత్రివర్గంలో ఉన్నారు. క్రికెట్లో దేశానికి వన్నె తెచ్చిన అజారుద్దీన్ మంత్రివర్గ సభ్యులుగా ఉన్నారు.
Also Read: IPL 2026: ఐపీఎల్ ప్రారంభం వేళ సజ్జనార్ కీలక విజ్ఞప్తి.. వారికి సీరియస్ వార్నింగ్
హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో ఏర్పాటుచేసిన ప్రజాప్రతినిధుల క్రీడా పోటీల కార్యక్రమంలో ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. 'రంజీ క్రికెట్ మ్యాచ్ ఆడిన వాకిటి శ్రీహరి క్రీడా శాఖ మంత్రిగా ఉన్నారు. ఒకప్పుడు క్రీడలకు ఎంతో ప్రాధాన్యం ఉండేది. కానీ తెలంగాణ ఏర్పడిన తరువాత క్రీడా స్ఫూర్తి కరువైంది. అందుకే ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్పోర్ట్స్ పాలసీని తీసుకొచ్చాం' అని తెలంగాణ సీఎం వివరించారు. మట్టిలో మాణిక్యాలను వెలికి తీయాలని సీఎం కప్ పోటీలను నిర్వహించామని చెప్పారు. 140 కోట్ల జనాభా ఉన్న మన దేశం ఒలంపిక్స్ లో ఒక్క పతకం సాధించలేదని గుర్తుచేశారు.
Also Read: Hyderabad Police: ర్యాపిడో ఆటోలో బంగారం బ్యాగ్.. అర్ధగంటలో తెచ్చి ఇచ్చిన హైదరాబాద్ పోలీసులు
'3 కోట్ల జనాభా ఉన్న సౌత్ కొరియా 32 గోల్డ్ మెడల్స్ తెచ్చుకుంది. సౌత్ కొరియా స్పోర్ట్స్ యూనివర్సిటీకే 16 గోల్డ్ మెడల్స్ వచ్చాయి. క్రీడాకారులను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రోత్సహిస్తోంది' అని రేవంత్ రెడ్డి తెలిపారు. 'విద్యార్థులకు నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా. చదువుతో పాటు క్రీడల్లో ఆసక్తి పెంచుకుని రాణించండి. క్రీడా స్ఫూర్తిని నింపేందుకే ప్రపంచ ఫుట్ బాల్ దిగ్గజం మెస్సీని హైదరాబాద్ తీసుకొచ్చాం' అని వివరించారు. దీనిపై ప్రతిపక్ష నాయకులు వివాదం సృష్టించే ప్రయత్నం చేశారని.. ఫుట్బాల్ దిగ్గజం హైదరాబాద్కు వస్తే మన ఖ్యాతి ప్రపంచానికి తెలిసింది. కానీ ప్రతిపక్ష నాయకులు డ్రగ్ లాడ్ కింగ్ను రాష్ట్రానికి పిలవాలని భావిస్తున్నారో నాకు తెలియదు' అని చెప్పారు.
'ఫామ్హౌస్ పార్టీలకు దూరంగా.. మత్తుకు దూరంగా ఉండాలని క్రీడలను ప్రోత్సహిస్తున్నాం. ఎల్బీ స్టేడియం రాజకీయ కార్యకలాపాలకే పరిమితమైంది. ఎల్బీ స్టేడియాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం. గచ్చిబౌలి స్టేడియాన్ని ప్రపంచ క్రీడా పోటీలు నిర్వహించేలా అభివృద్ధి చేయబోతున్నాం. బేగంపేట హాకీ క్రీడా మైదానాన్ని ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంది' అని తెలంగాణ సీఎం వెల్లడించారు. ఫుట్బాల్లో గతంలో దేశానికి మెడల్స్ తెచ్చిన ఏడుగురిలో 4 గురు మన ప్రాంతానికి చెందినవారు ఉన్నారని.. మళ్లీ ఆ స్థాయికి క్రీదా స్ఫూర్తిని నింపి క్రీడాకారులను తయారు చేయాలని సంకల్పించామని చెప్పారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Harish rao fires on cm revanth reddy govt in assembly session: తెలంగాణ రాజకీయాలు మరోసారి హీటెక్కాయి. ఈక్రమంలో ఇప్పటికే ఎక్కడ చాన్స్ దొరికిన అధికార, అపోసిషన్ పార్టీలు తరచుగా మాటల యుద్దంకు దిగుతాయి. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో హరీష్ రావు రాఘవ కన్స్ట్రక్షన్స్ వివాదంపై మంత్రి పొంగులేటిపై సంచలన ఆరోపణలు చేశారు. రాఘవ పేరు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తండ్రి పేరన్న సంగతి అందరికి తెలుసన్నారు. అదే విధంగా...మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి భార్య, కొడుకు, తమ్ముడు.. దూరపు బంధువులు ఎలా అవుతారని ఏకీపారేశారు. రాఘవ కన్స్ట్రక్షన్స్ డైరెక్టర్లుగా ఉన్నది పొంగులేటి సతీమణి మాధురి, కొడుకు హర్ష రెడ్డి, తమ్ముడు ప్రసాద్ రెడ్డేనని స్పష్టం చేశారు. అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ అసత్యాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
సభను సీఎం రేవంత్ తప్పుదోవ పట్టించారని ఎద్దేవా చేశారు. సభలో కాంగ్రెస్ సర్కార్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని అన్నారు. అక్రమాలపై ప్రశ్నిస్తే డొంకతిరుగుడు సమాధానాలా?.. అంటూ కాంగ్రెస్ పై ఫైర్ అయ్యారు. రాఘవ కన్స్ట్రక్షన్స్ అవినీతి, అక్రమాలపై ప్రభుత్వం తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుందన్నారు.
జవాబుదారీతనం లేకుండా సభలో దాటవేత ధోరణి ప్రదర్శిస్తున్న కాంగ్రెస్ పాలకుల తీరు శోచనీయమన్నారు. దీనికి కౌంటర్ గా సీఎం రేవంత్ రెడ్డి సైతం రాఘవ కన్స్ట్రక్షన్ పై సీబీ సిఐడి విచారణ జరిపిస్తామన్నారు. రాఘవ కన్స్ట్రక్షన్ కు సివరేజ్ ఫీజు కట్టిందని స్పష్టం చేశారు.
Read more: IPL 2026: ఐపీఎల్ ప్రారంభం వేళ సజ్జనార్ కీలక విజ్ఞప్తి.. వారికి సీరియస్ వార్నింగ్
ఇది వారు ఫిర్యాదు చేస్తే తీసుకున్న చర్య కాదని.. ఆ సంస్థ నుంచి రావాల్సిన బకాయిలు ప్రభుత్వం రాబట్టుకుందని సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. మొత్తంగా రాఘవ కన్స్ట్రక్షన్స్ అంశం తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
RCB Vs SRH Match Preview: ఐపీఎల్ 2026 సీజన్ నేడు మార్చి 28న అట్టహాసంగా ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నమెంట్లోని తొలి మ్యాచ్ బెంగళూరులోని చిన్నస్వామి క్రికెట్ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), మాజీ ఛాంపియన్ సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) తలపడనున్నాయన్న సంగతి తెలిసిందే. గత సీజన్లో అద్భుత ప్రదర్శనతో టైటిల్ గెలుచుకున్న RCB ఆత్మవిశ్వాసంతో ఉండగా, గణాంకాల పరంగా హైదరాబాద్ బలంగా కనిపిస్తోంది.
ఐపీఎల్ చరిత్రలో బెంగళూరు, హైదరాబాద్ జట్లు ఇప్పటి వరకు 26 సార్లు తలపడ్డాయి. సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు 13 మ్యాచ్లు గెలవగా, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ 11 మ్యాచ్లు గెలిచింది. అందులో మిగిలిన 2 మ్యాచ్లు డ్రాగా ముగిశాయి. ఈ గణాంకాలను పరిశీలిస్తే ఆర్సీబీపై సన్రైజర్స్ జట్టు ఆధిపత్యం పుష్కలంగా కనిపిస్తోంది.
ఆర్సీబీ బలాబలాలు..
రజత్ పాటిదార్ కెప్టెన్సీలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గత సీజన్లో కప్ గెలిచి చరిత్ర సృష్టించింది. 18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత వారు తొలిసారిగా ఐపీఎల్ ట్రోఫీని కైవసం చేసుకున్నారు. ఈసారి కూడా ఆర్సీబీ జట్టు చాలా బలంగా కనిపిస్తోంది. ముఖ్యంగా బ్యాటింగ్ విభాగంలో.. విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్ జోడి ప్రత్యర్థి బౌలర్లకు పీడకలగా మారనుంది. గత సీజన్లో వీరిద్దరూ జట్టుకు ఘోరమైన ఆరంభాన్ని అందించారు.
అతనితో పాటు దేవదత్ పడిక్కల్ ఇటీవలే దేశవాళీ క్రికెట్లోనూ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. ఈసారి అతను మూడో స్థానంలో బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది. వీరి తర్వాత టిమ్ డేవిడ్, జితేష్ శర్మ, రొమారియో షెపర్డ్ వంటి భారీ హిట్టర్లు జట్టుకు అదనపు బలాన్ని ఇస్తున్నారు. వెంకటేష్ అయ్యర్ చేరికతో జట్టు మరింత సమతుల్యంగా మారింది.
ఆర్సీబీలో బలమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న తర్వాత ఆర్సీబీ బౌలింగ్ విషయంలో కొన్ని సవాళ్లను ఎదుర్కొంటోంది. జట్టు కీలక పేసర్ జోష్ హేజిల్వుడ్ తొలి కొన్ని మ్యాచ్లకు అందుబాటులో లేడు. ఇది జట్టుకు పెద్ద దెబ్బ. హేజిల్వుడ్ లేని లోటును సీనియర్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ పూరించాల్సి ఉంటుంది. ఇప్పుడు భువి ఫాస్ట్ బౌలింగ్ యూనిట్ పూర్తి బాధ్యత తీసుకుంటున్నాడు. అదే విధంగా ఈ సీజన్లో యశ్ దయాల్ కూడా దూరంగా ఉన్నాడు. దీంతో న్యూజిలాండ్ పేసర్ జాకబ్ డఫీ ప్రదర్శన ఆర్సీబీకి చాలా కీలకం. స్పిన్ విభాగంలో కృనాల్ పాండ్యా ఆల్రౌండ్ ప్రదర్శనపై జట్టు ఆశలు పెట్టుకుంది.
సన్రైజర్స్ బలాబలాలు..
సన్రైజర్స్ హైదరాబాద్ మరోసారి తమ టాప్ ఆర్డర్ బ్యాటింగ్పైనే ఎక్కువగా ఆధారపడుతోంది. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్ వంటి ముగ్గురు విధ్వంసకర ఆటగాళ్లతో ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ లైనప్ బలంగా ఉంది. రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ అందుబాటులో లేకపోవడంతో, ప్రారంభ మ్యాచ్లలో ఇషాన్ కిషన్ జట్టును నడిపించే అవకాశం ఉంది. గత సీజన్లో హెన్రిచ్ క్లాసెన్ అత్యధిక పరుగులు సాధించాడు. అనికేత్ వర్మ గతేడాది ఫినిషర్గా తనదైన ముద్ర వేశాడు. ఈసారి నితీష్ కుమార్ రెడ్డి, లియామ్ లివింగ్స్టన్ వంటి ఆటగాళ్లపై భారీ అంచనాలు ఉన్నాయి. వీళ్లిద్దరూ బాగా రాణిస్తే, హైదరాబాద్ భారీ స్కోరు సాధించడం ఖాయం.
బ్యాటింగ్తో పోలిస్తే సన్రైజర్స్ బౌలింగ్ విభాగం కొంచెం బలహీనంగా ఉన్నట్లు కనిపిస్తుంది. పాట్ కమిన్స్ లేకపోవడం జట్టుకు పెద్ద లోటు అనే చెప్పాలి. ఇషాన్ మలింగ, హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కత్ ఫాస్ట్ బౌలింగ్ను ముందుండి నడిపించాల్సి ఉంటుంది. డెత్ ఓవర్లలో హర్షల్ పటేల్ కీలకంగా మారతాడు. హైదరాబాద్ జట్టులో స్పిన్ విభాగంలో పెద్ద ఆటగాళ్లు ఎవరూ లేరు. మొత్తంగా, నేటి మ్యాచ్లో ఏం జరుగుతుందో వేచి చూడాలి.
Also Read: Amaravati Farmers: అసెంబ్లీలో అమరావతి బిల్లు ఆమోదానికి ముందే కేంద్రం గుడ్ న్యూస్..రైతులకు ఇక పండగే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook