icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

SRH Vs RR Preview: హైదరాబాద్ Vs రాజస్థాన్..ఐపీఎల్‌లో ఈరోజు గెలుపు ఎవరిది? సూర్యవంశీ, అభిషేక్ శర్మ విధ్వంసానికి రెడీనా?

Hyderabad, Telangana:

SRH Vs RR Match Preview 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మరో రసవత్తర పోరుకు సిద్ధమైంది. నేడు హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో ఆతిథ్య జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు ప్రసారం కానుంది. అయితే రాజస్థాన్ రాయల్స్ జట్టు ఇప్పటి వరకు ఆడిన 4 మ్యాచ్‌ల్లో అన్నీ గెలుపొంది టేబుల్ టాపర్‌గా నిలిచింది. అటు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ప్రస్తుత సీజన్‌లో ఆడిన 4 మ్యాచ్‌ల్లో కేవలం ఒకేఒక్కటి గెలుపొంది పాయింట్ల పట్టికలో 7వ స్థానంలో నిలిచింది. 

ఈ మ్యాచ్ హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగనుంది. ఐపీఎల్ చరిత్రలో రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు 21 సార్లు తలపడగా.. సన్‌రైజర్స్ 12 సార్లు గెలుపొందగా.. రాజస్థాన్ కేవలం 9 సార్లు మాత్రమే విజయం సాధించింది. అయితే హెడ్-టూ-హెడ్ కౌంట్ లో ఎస్ఆర్‌హెచ్‌దే హవా కనిపిస్తుంది. 

కానీ, ప్రస్తుతం గడిచిన మ్యాచ్‌లో ఆధారంగా ఆతిథ్య జట్టుతో పోలిస్తే రాజస్థాన్ అటు బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ మెరుగ్గా కనిపిస్తుంది. అదే విధంగా ఎస్ఆర్‌హెచ్ బ్యాటింగ్ దళం కూడా ఎంతో బలంగా కనిపిస్తుంది. అయితే ఇంతకుముందు ఇదే స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు 286 అత్యధిక స్కోరు రికార్డును రాజస్థాన్‌పై నమోదు చేయడం విశేషం. 

SRH జట్టు ప్రస్తుతం ఓ ఆసక్తికర పికింగ్‌ను ఎదుర్కొనే సమస్య వచ్చిపడింది. ప్రఫుల్ హింగే ఎట్టకేలకు తన IPL అరంగేట్రం చేస్తారా లేదా అనే విషయంపై క్లారిటీ రాలేదు? పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌కు ముందే హింగే అరంగేట్రం చేస్తాడని ఇషాన్ కిషన్ ప్రకటించాడు, కానీ టాస్ తర్వాత పిచ్ పరిస్థితిని బట్టి వేరే ఎంపిక అవసరమని గ్రహించి, అతనికి బదులుగా జయదేవ్ ఉనద్కట్‌ను జట్టులోకి చేర్చుకున్నారు.

ఉప్పల్ స్టేడయంలో వేగవంతమైన పిచ్‌పై, హింగే అరంగేట్రం ఎట్టకేలకు జరిగే అవకాశం ఉంది. గత మ్యాచ్‌లో సన్‌రైజర్స్ కేవలం ముగ్గురు విదేశీ ఆటగాళ్లతో బరిలో దిగింది. తమ మిడిల్ ఆర్డర్‌ను బలోపేతం చేసేందుకు అనికేత్ వర్మ తీసుకోలేని పక్షంలో బౌలింగ్ ప్రత్యామ్నాయంగా లియామ్ లివింగ్‌స్టోన్‌ను తిరిగి జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. 

మరోవైపు గత మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టును మట్టికరింపించిన రాజస్థాన్ రాయల్స్ టీమ్ దాదాపుగా ఈ మ్యాచ్‌లోనూ కొనసాగే అవకాశం ఉంది. గత మ్యాచ్‌లో జట్టులోకి వచ్చిన బ్రిజేష్ శర్మ మిడిల్ ఓవర్లలో 37 పరుగులకు 2 వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. అతను అదే స్థానంలో కొనసాగుతాడని భావిస్తున్నారు. 

సన్‌రైజర్స్ ప్లేయింగ్ 11 అంచనా: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్ (కెప్టెన్, వికెట్ కీపర్), హెన్రిచ్ క్లాసెన్, సలీల్ అరోరా, అనికేత్ వర్మ లేదా లియామ్ లివింగ్‌స్టోన్, నితీష్ కుమార్ రెడ్డి, హర్ష్ దూబే, శివాంగ్ కుమార్, హర్షల్ పటేల్, ఈషన్ మలింగ, ప్రఫుల్ హింగే(డెబ్యూ).

రాజస్థాన్ రాయల్స్ ప్లేయింగ్ 11 అంచనా: యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, ధ్రువ్ జురెల్, రియాన్ పరాగ్ (కెప్టెన్), షిమ్రాన్ హెట్‌మైర్, డోనోవన్ ఫెరీరా, రవీంద్ర జడేజా, జోఫ్రా ఆర్చర్, నాండ్రే బర్గర్, సందీప్ శర్మ, రవి బిష్ణోయ్, బ్రిజేష్ శర్మ.

Also Read: Rohit Sharma Injury: రోహిత్ శర్మ ఔట్ కాకుండానే ఎందుకు వెళ్లిపోయాడు? కోహ్లీ, రోహిత్ ఇద్దరూ మ్యాచ్ ఆడలేదు..ఏం జరిగింది?

Also Read: MI vs RCB Match 2026: ముంబై కంచుకోట బద్దలు కొట్టిన ఆర్సీబీ..18 పరుగుల తేడాతో చిత్తు చేసిన బెంగళూరు!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement

Palnadu Crime News: పల్నాడులో పెరిగిపోతున్న పోలీసు ఆగడాలు..ఖాకీని అడ్డం పెట్టుకొని కొందరు క్రిమినల్ దందాలు..తాజాగా లాయర్‌ హత్య!

Chilakaluripet, Andhra Pradesh:

Palnadu Latest Crime News: ఆంధ్రప్రదేశ్‌లోని  పల్నాడు జిల్లాలో వరుసగా పోలీసులపై వస్తున్న అభియోగాలపై ప్రజల్లో తీవ్ర ఆందోళనలు కలిగిస్తున్నాయి. చట్టంతో పాటు ప్రజలను కాపాడాల్సిన కొందరు పోలీసులు క్రిమినల్ చర్యలకు పాల్పడతుండడంతో జిల్లా వ్యాప్తంగా రకరకాల పుకార్లు పుట్టుకొస్తున్నాయి. స్వయంగా పోలీసులే అలాంటి సంఘ విఘాత చర్యలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి. నిన్న మొన్న మాచర్లలో ఏఎస్సై ఘటన మర్చిపోకముందే ఇప్పుడు మరో హత్య కేసులో పోలీస్ కానిస్టేబుల్ ప్రత్యక్షంగా ప్రమేయం ఉన్నట్లు తేలింది. దీంతో పోలీసులపై ప్రజల్లో విశ్వాసం కోల్పోయే పరిణామాలు కనిపిస్తున్నాయి. 

తాజాగా చిలకలూరిపేట సమీపంలో 2 రోజులు క్రితం జరిగిన లాయర్ హత్య కేసులో ఇప్పుడు నిజం బయపడింది. ఈ హత్యను తొలుత ప్రమాదంగా చిత్రీకరించాలనే నిందితుల పన్నాగం బయటపడి.. ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్లను అధికారులు అరెస్టు చేయడం ఇప్పుడు జిల్లాలో పెను సంచలనంగా మారింది. 

స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఉద్యోగం చేస్తున్న పోలీస్ కానిస్టేబుల్ వెంకట కోటయ్య తాజాగా చిలకలూరిపేటలో జరిగిన హత్యకు ప్రత్యక్ష సంబంధం ఉన్నట్లు విచారణలో తేలింది. మృతుడు లాయర్ భార్యతో సదరు నిందితుడు వివాహేతర సంబంధం ఉన్నట్లు జిల్లా అధికారులు తెలిపారు. ఈ అక్రమ సంబంధం గురించి తెలుసుకున్న మృతుడు తన భార్యను తరచూ గొడవ పడుతుండేవాడని.. దీంతో అతనిపై పగ పెంచుకున్న కానిస్టేబుల్, కాపుకాసి లాయర్ హత్యకు పాల్పడ్డాడని సమాచారం. 

వారి వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న లాయర్‌ను చంపాలని పోలీస్ కానిస్టేబుల్ వెంకట కోటయ్య పన్నాగం పన్నినట్లు తెలుస్తోంది. అయితే లాయర్ హత్యకు వెంకట కోటయ్యకు సహకరించిన మరో కానిస్టేబుల్ కొండారెడ్డి శ్రీనివాసరావును కూడా పోలీసులు అరెస్టు చేశారు. అందుకు గాను సదరు వ్యక్తి రూ.5 లక్షలు పుచ్చుకున్నట్లు సమాచారం. దీంతో నిందితులుగా విచారణలో తేలడంతో ఇద్దర్ని జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

ఇదిలా ఉండగా.. ఇటీవలే పల్నాడు జిల్లాలో పోలీసులుపై వరుస ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవలే మాచర్లకు చెందిన ఓ మేజర్ యువతి హత్య కేసులో రూరల్ సీఐ సస్పెండ్ అవ్వగా.. వివాహేతర సంబంధం కారణంగా మరో సీఐ సస్పెండ్.. మహిళలను, యువతులను లైంగిక వేధింపులకు గురిచేసి ఆపై వీడియోలు చిత్రీకరించిన కేసులో మాచర్ల ఏఎస్సై సస్పెండ్‌కు గురవ్వగా..ఇప్పుడు చిలకలూరిపేటలో లాయర్‌ హత్యకు కేసులో మరో ఇద్దరు పోలీస్ కానిస్టేబుల్స్ అరెస్టు అయ్యారు. ఇలా పోలీస్ శాఖ నుంచి ఒక్కో ఘటనలు బయటపడుతున్న వేళ ప్రజల్లో ఆందోళన నెలకొంది. 

క్రిమినల్స్ నుంచి కాపాడాల్సిన పోలీసులే స్వయంగా ఇలాంటి చర్యలకు పాల్పడుతుండడం మాయని మచ్చగా మారాయి. అయితే ఇలాంటి చర్యలపై జిల్లా కలెక్టర్, ఎస్పీ కఠిన చర్యలు తీసుకోవాలని..ఇలాంటివి మళ్లీ పునరావృత్తం కాకుండా ముందస్తు జిల్లా పోలీస్ శాఖలో అంతర్గత విచారణ చేపట్టి.. ప్రజల్లో విశ్వాసం కోల్పోకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు. వరుస ఘటనల దృష్ట్యా హోంమంత్రి అనిత కూడా జిల్లాపై స్పెషల్ ఫోకస్ పెట్టి.. శాఖలో తప్పులను క్రమబద్ధీకరించాలనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. వీలైతే కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసి జిల్లాలో పోలీసు అధికారుల చర్యల పట్ల నిఘా పెట్టడమే కాకుండా ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని జిల్లాలోని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు.

Also Read: LPG Gas Shortage: భారత్‌లో మరోసారి వార్ టెన్షన్..LPG గ్యాస్ సిలిండర్లపై కేంద్రం మరో సంచలన నిర్ణయం..ఏం జరుగుతోంది!

Also Read: Vijayawada Crime News: నగ్న ఫొటోలతో విజయవాడ మహిళకు బెదిరింపులు..ఏకంగా రూ.2 కోట్లు..గతిలేక ఆత్మహత్యకు పాల్పడితే?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Rohit Sharma Injury: రోహిత్ శర్మ ఔట్ కాకుండానే ఎందుకు వెళ్లిపోయాడు? కోహ్లీ, రోహిత్ ఇద్దరూ మ్యాచ్ ఆడలేదు..ఏం జరిగింది?

Mumbai, Maharashtra:

Rohit Sharma Virat Kohli Injury: ఆదివారం వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన ఐపీఎల్ 2026 మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 18 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు 241 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా.. చేధనలో ముంబై జట్టు ఎంత కష్టపడినా ఫలితం లేకుండా పోయింది. అయితే ఈ మ్యాచ్‌లో ముంబై ఓపెనర్ రోహిత శర్మ కేవలం 13 బంతుల్లో 19 పరుగులు రాబట్టి రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. అయితే రోహిత్ శర్మ ఎందుకు పెవీలియన్ చేరాడు అనే ప్రశ్న అనేక మంది అభిమానుల్లో నెలకొంది. దాని వెనుక పెద్ద కారణమే ఉందట. 

బీసీసీఐ వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం.. కండరాల గాయం (హ్యామ్‌స్ట్రింగ్) కారణంగా రోహిత్ శర్మ అర్ధాంతరంగా వెనుదిరగాల్సి వచ్చింది.  ఈ భారీ లక్ష్యాన్ని ఛేదించడానికి ముంబై ఇండియన్స్ జట్టుకు రోహిత్ నుండి నిలకడైన ఇన్నింగ్స్ అవసరమైనా.. గాయం కారణంగా వైదొలగడం అతని ముందు జాగ్రత్త చర్యగా అభివర్ణించవచ్చు. డాట్ బాల్ ఆడిన తర్వాత రోహిత్ ముఖంలో బాధకరమైన భావోద్వేగాలు కనిపించాయి. తీవ్రమైన గాయమైనట్లు తెలుస్తోంది. ఎందుకంటే రోహిత్ లాంటి స్టార్ ఆటగాడు కేవలం చిన్న గాయంతో మైదానాన్ని విడిచిపెట్టే పరిస్థితి ఉండదు. 

మరోవైపు ఆర్సీబీ స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ కూడా చీలమండ గాయంతో ఫీల్డింగ్‌కు దూరమయ్యాడు. అదే విధంగా ముంబై ఇండియన్స్ జట్టుతో పాటు వాంఖడే స్టేడియంలో కోహ్లీ అదే రకమైన ఫామ్‌ను కొనసాగించి.. అర్ధశతకంతో చెలరేగాడు. ముంబై జట్టుపై 1,000 పరుగులు రాబట్టిన మొట్టమొదటి బ్యాటర్‌గా విరాట్ కోహ్లీ నిలిచాడు. 

ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోగా.. బ్యాటింగ్‌కు దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవరల్లో 4 వికెట్లు కోల్పోయి 240 పరుగులు రాబట్టింది. ఆర్సీబీ ఓపెనర్లు ఫిల్ సాల్ట్ (78), విరాట్ కోహ్లీ (50) మెరుపు ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నారు. అలాగే ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ రజిత్ పటిదార్ 20 బంతుల్లో 53 పరుగులు రాబట్టి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు.

చివర్లో టిమ్ డేవిడ్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడేందుకు ప్రయత్నించాడు. కానీ, చివరి ఓవర్లో విజృంభించినా.. అప్పటికే లేట్ అయిపోయింది. సీఎస్కే‌తో జరిగిన మ్యాచ్‌లో టిమ్ డేవిడ్ ఆడిన ఫామ్.. అదే విధంగా కంటిన్యూ చేసి ఉంటే ముంబైతో జరిగిన మ్యాచ్‌లో 250+ రన్స్ వచ్చేవని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. 

Also Read: MI vs RCB Match 2026: ముంబై కంచుకోట బద్దలు కొట్టిన ఆర్సీబీ..18 పరుగుల తేడాతో చిత్తు చేసిన బెంగళూరు!

Also Read: MI vs RCB Prediction: ముంబై, బెంగళూరు మ్యాచ్‌లో గెలిచేది వీళ్లే! అన్నాదమ్ముళ్ల సవాల్..కృనాల్ పాండ్యా బౌలింగ్ మారేనా?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

LPG Gas Shortage: భారత్‌లో మరోసారి వార్ టెన్షన్..LPG గ్యాస్ సిలిండర్లపై కేంద్రం మరో సంచలన నిర్ణయం..ఏం జరుగుతోంది!

Hyderabad, Telangana:

India Boosts LPG Gas Supply: పశ్చిమాసియాలో ఇరాన్ - ఇజ్రాయెల్, అమెరికాల మధ్య యుద్ధం మొదలైనప్పటి నుంచి ప్రపంచంలోని అనేక దేశాలపై కంటిమీద కునుకులేకుండా ఉంది. ఇంధనం, గ్యాస్ కొరత.. ఆపై వాటి ధరలు అమాంతం పెరిగి పోవడం వల్ల అనేక దేశాలు ఆర్థికంగా దెబ్బతిన్నాయి. దేశానికి అనేక ఓడలు ఎల్పీజీ గ్యాస్‌ను తీసుకొచ్చినా.. నేటికి మార్కెట్లో గ్యాస్ కొరత కనిపిస్తూనే ఉంది. 

అయితే తాజాగా ఇరాన్-అమెరికాల మధ్య జరిగిన చర్చలు విఫలం అవ్వడం వల్ల మరోసారి యుద్ధం తిరిగి ప్రారంభమయ్యేందుకు ఇరు దేశాలు కాలు దువ్వుతున్నాయి. ఈ క్రమంలో మరోసారి ఇంధన, గ్యాస్ కొరత ఏర్పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం సమాలోచనలు చేస్తుంది. దేశవ్యాప్తంగా ముడిచమురు, గ్యాస్ కొరతను ఏవిధంగా తగ్గించాలనే సమాలోచనలో మునిగిపోయింది. 

ఇటీవలే జరిగిన ఇరాన్-అమెరికా చర్చల్లో అమెరికా ఉపాధ్యక్షుడు 'డీల్ కుదర్లేదు' అని చెప్పిన ఒకేఒక్క మాట ఇప్పుడు ప్రపంచాన్ని భయబ్రాంతులకు గురిచేస్తుంది. ఇరాన్‌పై దాడి చేయడం సహా హోర్మూజ్ జలసంధిని పూర్తిగా నిలిపేస్తామని ఇరు దేశాలు ప్రకటిస్తున్న తరుణంలో ప్రపంచదేశాల భవిష్యత్తు ప్రణాళికలను మొదలుపెట్టాయి. రాబోయే రోజుల్లో యుద్ధం మరింత తీవ్రరూపం దాల్చనుందనే వార్తలు ఇప్పుడు ప్రపంచాన్ని అల్లకల్లోలంగా మారుస్తున్నాయి. 

అయితే తాజాగా ఇరాన్‌తో చర్చలు విఫలమైన కారణంగా అమెరికా అధ్యక్షుడు హోర్మూజ్ జలసంధిని పూర్తిగా మూసివేయాలని హెచ్చరిస్తున్నాడు. అంతటితో ఆగకుండా చైనాపై కూడా ట్రంప్ సీరియస్ అవ్వడం ఇప్పుడు మరింత తీవ్రతను పెంచేసింది. ఆ జలసంధిపై ఇరాన్, అమెరికా ఆధిపత్యం చలాయించాలనే తత్వంతో ఇతర దేశాల ఆర్థిక పరిస్థితులను దిగజారుస్తున్నాయి. దీంతో మరోసారి ముడిచమురు, గ్యాస్ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. 

ఈ క్రమంలో అవసరమైన మేర గ్యాస్ సిలిండర్లను ఏర్పాటు చేసుకోవడం ఉత్తమం అని తెలుస్తోంది. అయితే భారతదేశానికి హోర్మూజ్ జలసంధి నుంచి కేవలం 50 శాతం మాత్రమే దిగుమతులు జరుగుతున్నాయి. ఒకవేళ యుద్ధం మరింత ఉధృతంగా మారితే రష్యా నుంచి మరింతగా ముడిచమురు దిగుమతి చేసుకునే అవకాశం ఉంది. ఆ విధంగా దేశ ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం సత్వర నిర్ణయాలను తీసుకునేందుకు రంగం సిద్ధం చేసింది. 

ప్రస్తుతం ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్న వేళ దేశవ్యాప్తంగా ఇంధన, గ్యాస్ కొరత ఏర్పడకుండా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తగిన చొరవ తీసుకుంటుంది. ఒకవేళ పరిస్థితి మరింత దిగజారకుండా తగిన ఏర్పాట్లు చేస్తూ.. ఇంధనం, గ్యాస్ కొరతల ఆధారంగా ప్రజలు పడుతున్న కష్టాలు ఎన్నికల ఫలితాలపై పడకుండా జాగ్రత్త పడుతుంది. ఈ క్రమంలో కేంద్రం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే 5 కేజీల సిలిండర్లను భారీగా సరఫరా చేస్తుండగా.. ఇప్పుడు వాటిని మరింతగా సప్లై పెంచాలని యోచిస్తోంది. అదే విధంగా నేచురల్ గ్యాస్ PNG కనెక్షన్లను మరింతగా పెంచే దిశగా కేంద్రం అడుగులువేస్తుంది. 

ALso Read: Vijayawada Crime News: నగ్న ఫొటోలతో విజయవాడ మహిళకు బెదిరింపులు..ఏకంగా రూ.2 కోట్లు..గతిలేక ఆత్మహత్యకు పాల్పడితే?

Also Read: Jamili Elections In AP: ఏపీలో సంవత్సరం ముందే ఎన్నికలు?! వైసీపీ పని ఇక గోవిందా? మోదీ సర్కార్ కీలక నిర్ణయం!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement

MI vs RCB Match 2026: ముంబై కంచుకోట బద్దలు కొట్టిన ఆర్సీబీ..18 పరుగుల తేడాతో చిత్తు చేసిన బెంగళూరు!

Mumbai, Maharashtra:

MI vs RCB Match 2026 Result: ఐపీఎల్ 2026లో భాగంగా నేడు జరిగిన రెండో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ జట్టుపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు గెలుపొందింది. 18 పరుగుల తేడాతో విజయం సాధించి.. లీగ్‌లో మూడో విజయాన్ని నమోదు చేసుకుంది ఆర్సీబీ. ఇన్నాళ్లుగా ముంబై ఇండియన్స్ కంచుకోటగా వస్తున్న వాంఖడే స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు పూర్తి ఆధిక్యాన్ని కనబరిచింది. 

టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి.. 240 పరుగులు రాబట్టింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఫిలిప్ సాల్ట్ విధ్వంసకర బ్యాటింగ్‌తో 36 బంతుల్లో 78 పరుగులు రాబట్టాడు. ఇందులో 6 సిక్సర్లు, 6 ఫోర్లు ఉన్నాయి. ఇతనితో పాటు బ్యాటింగ్‌కు వచ్చిన విరాట్ కోహ్లీ (50) హాఫ్ సెంచరీతో అలరించాడు. అయితే ఆ తర్వాత బ్యాటింగ్ ‌కు వచ్చిన ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటిదార్ కూడా అర్ధశతకంతో చెలరేగాడు. 

కేవలం 20 బంతుల్లో (5 సిక్సర్లు, 4 ఫోర్లు) 53 పరుగులు రాబట్టి ఆర్సీబీ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. అలాగే మిగిలిన బ్యాటర్లు టిమ్ డేవిడ్ (34), జితేష్ శర్మ (10), రెమారియో షెఫార్డ్ (2) పరుగులతో సరిపెట్టుకున్నారు. మరోవైపు ముంబై ఇండియన్స్ బౌలర్లలో ట్రెంట్ బౌల్డ్, కెప్టెన్ హార్దిక్ పాండ్యా, మిచెల్ శాంటర్న్, శార్దూల్ ఠాకూర్ తలో వికెట్ పడగొట్టారు. 

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు నిర్దేశించిన 241 లక్ష్యంతో బరిలో దిగిన ముంబై ఇండియన్స్ జట్టు ఆది నుంచే తడబడింది. ముంబై ఓపెనర్లు రికెల్డన్ 22 బంతుల్లో 37 పరుగులు రాబట్టగా.. రోహిత్ శర్మ 19 పరుగులు చేసి రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. గాయం కారణంగా రోహిత్ మైదానాన్ని వీడినట్లు తెలిసింది. ఆ తర్వాత తొలి నుంచే నెమ్మదిగా సాగిన ముంబై ఇండియన్స్ స్కోర్స్ బోర్డు.. ఆ తర్వాత సూర్య కుమార్ యాదవ్ 22 బంతుల్లో 33 పరుగులు.. కెప్టెన్ హార్దిక్ పాండ్యా 22 బంతుల్లో 40 రన్స్ రాబట్టి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించేందుకు తమ వంతు ప్రయత్నం చేశారు. 

ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన రూథర్ ఫర్డ్ 31 బంతుల్లో 71 పరుగులు రాబట్టి.. ముంబైను ఓటమి నుంచి తప్పించేందుకు ఎంతో కృషి చేసాడు. అప్పటికే జరగాల్సిన డామేజ్ జరిగిపోయింది. మరోవైపు ఆర్సీబీ బౌలర్లలో సయూష్ శర్మ 2 వికెట్లు పడగొట్టగా.. జకోబ్ డఫీ, సలామ్ ధర్, కృనాల్ పాండ్యా చెరో వికెట్ సాధించారు. దీంతో 20 ఓవర్లలో ముంబై జ్టటు 5 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసి సరిపెట్టుకుంది. దీంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 18 పరుగులతో ఘనవిజయం సాధించింది. 

Also Read: MI vs RCB Prediction: ముంబై, బెంగళూరు మ్యాచ్‌లో గెలిచేది వీళ్లే! అన్నాదమ్ముళ్ల సవాల్..కృనాల్ పాండ్యా బౌలింగ్ మారేనా?

Also Read: Vijayawada Crime News: నగ్న ఫొటోలతో విజయవాడ మహిళకు బెదిరింపులు..ఏకంగా రూ.2 కోట్లు..గతిలేక ఆత్మహత్యకు పాల్పడితే?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Vijayawada Crime News: నగ్న ఫొటోలతో విజయవాడ మహిళకు బెదిరింపులు..ఏకంగా రూ.2 కోట్లు..గతిలేక ఆత్మహత్యకు పాల్పడితే?

Vijayawada, Andhra Pradesh:

Vijayawada Crime News: గత కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో అనేక దారుణమైన ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా కేటుగాళ్లు దందా మారుస్తున్నారు.  ఇప్పుడు అలాంటి ఓ దారుణం ఇప్పుడు విజయవాడలో జరిగింది. నగరంలోని భవానీపురంలో ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. అయితే ఓ వ్యక్తి తన నగ్న ఫొటోలతో వేధిస్తున్నాడని.. ఆ ఫొటోలతో తనను బెదిరించి ఎంతో డబ్బు దండుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. బాధితురాలిని వేధించిన కేసులో మద్దు బాల వెంకటేశ్వర్లు ఇంతటి దారుణానికి ఒడిగట్టినట్లు సమాచారం. ఇదే విషయమై నిందితుడ్ని పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. 

విజయవాడ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు బాల వెంకటేశ్వర్లు గత రెండేళ్లుగా బాధిత మహిళను వేధింపులకు గురిచేస్తున్నట్లు ఫిర్యాదు అందింది. బాధితురాలి నగ్న ఫొటోలతో బ్లాక్‌మెయిల్ చేస్తూ లైంగికంగా వేధిస్తూ.. తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. ఒకవేళ తనతో పెళ్లి కాదనుకుంటే ఆమె నగ్న చిత్రాలను సోషల్ మీడియాలో రిలీజ్ చేస్తానని బెదిరించినట్లు పోలీసులు తెలిపారు. 

నిందితుడు అంతటితో ఆగకుండా బాధితురాలి భర్తను హత్య చేస్తానని బెదిరించినట్లు తెలిసింది. అతడ్ని చంపి ఆమెను పెళ్లి చేసుకుంటానంటూ నిందితుడు వేధించసాగాడని వెల్లడించారు. ఈ బెదిరింపుల కారణంగా ఆమె మరింత మానసిక ఒత్తిడి లోనయ్యిందట. బాధితురాల్ని బెదిరించి నిందితుడు బాల వెంకటేశ్వర్లు ఇప్పటికే రూ.21 లక్షలు వసూలు చేసినట్లు విచారణలో తేలింది. 

అయితే ఆమె నగ్న ఫొటోలను పూర్తిగా డిలీట్ చేయాలంటే మరో రూ.2 కోట్లు సర్దుబాటు చేయాలని నిందితుడు బెదిరించినట్లు.. దీంతో ఆ వేధింపులు తాళలేక మహిళ ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. దీంతో వెంటనే ఆమె ఫ్యామిలీ మెంబర్స్ భవానీపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అయితే ఈ ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు ఇప్పటికే నిందితుడ్ని అరెస్టు చేశారు. అయితే నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న బాల వెంకటేశ్వర్లు ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్నట్లు విచారణ తెలిసింది. అతడి స్మార్ట్‌ఫోన్ పరిశీలించగా.. అందులో ఎందరో మహిళల నగ్న ఫొటోలతో పాటు వీడియోలు కూడా ఉండడం చూసి పోలీసులు విస్తుపోయారు. ఇతడు ఇంకెంత మంది మహిళల్ని ఈ విధంగా మోసం చేశాడనే దానిపై ఇప్పుడు పోలీసులు విచారణ వేగవంతం చేశారు. 

Also Read: Jamili Elections In AP: ఏపీలో సంవత్సరం ముందే ఎన్నికలు?! వైసీపీ పని ఇక గోవిందా? మోదీ సర్కార్ కీలక నిర్ణయం!

Also Read: MI vs RCB Prediction: ముంబై, బెంగళూరు మ్యాచ్‌లో గెలిచేది వీళ్లే! అన్నాదమ్ముళ్ల సవాల్..కృనాల్ పాండ్యా బౌలింగ్ మారేనా?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement

China New County Breaking News: సరిహద్దుల్లో చైనా కొత్త కౌంటీ.. అక్సాయ్ చిన్ నుంచి PoK వరకు డ్రాగన్ భారీ స్కెచ్!

BBhoomi20h ago
Lakshmapur, Telangana:

China vs India: డ్రాగన్ కంట్రీ చైనా తన పట్టును మరింత బిగించేందుకు శతవిధాలా ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది. తాజాగా జెన్ జియాంగ్ ప్రావిన్స్ లో పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ పీవోకే, ఆఫ్ఘానిస్తాన్ సరిహద్దులకు అతి సమీపంగా సెన్లింగ్ అనే కొత్త కౌంటీని ఏర్పాటు చేస్తూ డ్రాగన్ కంట్రీ సంచలన నిర్ణయం తీసుకుంది. మార్చి 26న అధికారికంగా వెలువడిన ఈ నిర్ణయం ఇప్పుడు అంతర్జాతీయంగా, ముఖ్యంగా దక్షిణాసియాలో తీవ్ర చర్చకు దారి తీస్తోంది. 

అయితే సెన్లింగ్ కౌంటీ ఏర్పాటు వెనుక కేవలం పరిపాలనా కారణాలేమీ లేవు. కానీ దీని వెనుక లోతైన భౌగోళిక రాజకీయ వ్యూహం మాత్రం  దాగి ఉంది. ఈ ప్రాంతం కారకోరం పర్వత శ్రేణులకు సమీపంలో ఉండటమే కాకుండా..  ఆఫ్ఘనిస్తాన్‌లోని వాఖాన్ కారిడార్‌కు అతి దగ్గరగా ఉంది. వాఖాన్ కారిడార్ అనేది తజికిస్తాన్,  పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్  మధ్య ఉన్న సుమారు 74 కిలోమీటర్ల సన్నని భూభాగం ఉంటుంది. ఈ మార్గం ద్వారా మిలిటెంట్లు లేదా ఉగ్రవాద గ్రూపులు చైనాలోకి ప్రవేశించే అవకాశం ఉందని బీజింగ్ భయపడుతోంది. అందుకే ఈ ప్రాంతంలో  స్థానిక పాలన  పేరుతో భద్రతా దళాలను, పర్యవేక్షణ వ్యవస్థలను భారీగా మోహరించేందుకు చైనా ఈ కొత్త కౌంటీని అస్త్రంగా వాడుకుంటోంది.

భారత్ ఎందుకు ఆందోళన చెందుతోంది?
చైనా చేస్తున్న ఈ విస్తరణ చర్యలు నేరుగా భారత భద్రతపై ప్రభావం చూపే అవకాశం ఉంది. దీనికి ప్రధాన కారణాలు కూడా ఉన్నాయి. అవేంటంటే

అక్సాయ్ చిన్ వివాదం: గత ఏడాది కాలంలోనే చైనా ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసిన మూడవ కౌంటీ ఇది. అంతకుముందు ఏర్పాటు చేసిన  హీన్ ,  హెకాంగ్  కౌంటీలపై భారత్ ఇప్పటికే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఎందుకంటే.. ఆ ప్రాంతాల్లోని కొన్ని భాగాలు లడఖ్‌లో అంతర్భాగమని, 1962 యుద్ధం తర్వాత చైనా వాటిని అక్రమంగా ఆక్రమించుకుందని భారత్ స్పష్టం చేస్తోంది.

CPEC ప్రభావం: సెన్లింగ్ కౌంటీ పరిపాలన కాష్గర్  కిందకు వస్తుంది. చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్   ఈ ప్రాంతం గుండానే వెళుతుంది. భారత భూభాగం   గుండా వెళ్లే ఈ ప్రాజెక్టును భారత్ మొదటి నుంచీ వ్యతిరేకిస్తోంది. ఇప్పుడు చైనా ఇక్కడ తన పరిపాలనను పటిష్టం చేయడం అంటే..  భారత సరిహద్దుల వద్ద తన పట్టును శాశ్వతం చేసుకోవడమే అని అర్థం. 

Also Read: Defender: డిఫెండర్ కొనాలా? ఎంత జీతం ఉండాలో తెలుసా! EMI ఎంత కట్టాలంటే..?    

భద్రతా సమీకరణాల్లో మార్పులు
ఈ కొత్త కౌంటీ ఏర్పాటుతో చైనా కేవలం సరిహద్దులను కాపాడుకోవడమే కాకుండా.. దక్షిణాసియాలో తన వ్యూహాత్మక నియంత్రణను పెంచుకుంటోంది. కాష్గర్ కేంద్రంగా సాగుతున్న ఈ పరిణామాలు భవిష్యత్తులో లడఖ్ సరిహద్దుల వద్ద ఉద్రిక్తతలకు దారితీయవచ్చు. సరిహద్దుల్లో మౌలిక సదుపాయాల కల్పన, సైనిక శిబిరాల ఏర్పాటు వంటి చర్యలకు  సెన్లింగ్ కౌంటీ  ఒక కేంద్ర బిందువుగా మారబోతోంది.

చైనా తీసుకున్న ఈ నిర్ణయం దక్షిణ ఆసియాలో భద్రతా సమీకరణాలను ప్రభావితం చేసే ఒక పెద్ద అడుగు అని చెప్పాలి. భారత్ ఇప్పటికే సరిహద్దుల వెంబడి తన నిఘాను పెంచినప్పటికీ..  చైనా చేస్తున్న ఈ పరిపాలనా మార్పులను దౌత్యపరంగా.. సైనికపరంగా ఎలా ఎదుర్కోబోతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. డ్రాగన్ వేస్తున్న ఈ అడుగులు కేవలం భద్రత కోసమేనా లేక ఆక్రమణల కోసమా అనేది కాలమే సమాధానం చెప్పాలి.

Also Read: TCS Jobs 2026: ఫ్రెషర్లకు పండగే.. 25 వేల మందిని తీసుకోనున్న టీసీఎస్.. డిమాండ్‌ను బట్టి మరిన్ని ఉద్యోగాలు..!!  

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

 

0
0
Report

Jamili Elections In AP: ఏపీలో సంవత్సరం ముందే ఎన్నికలు?! వైసీపీ పని ఇక గోవిందా? మోదీ సర్కార్ కీలక నిర్ణయం!

Vijayawada, Andhra Pradesh:

Jamili Elections In AP News: దేశంలో ఎప్పటి నుంచో పరిశీలనలో ఉన్న రెండు అంశాలను అమలు చేసే దిశగా కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సర్కారు సిద్ధమైంది. అందులో ఒకటి జమిలి ఎన్నికలైతే.. రెండోది పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన. ఈ రెండు అంశాలను ఈ ఏడాది చివరిలోగా తేల్చేసే విధంగా పార్లమెంట్ ఉభయ సభలు ప్రత్యేకంగా భేటీ అవ్వనున్నాయి. అయితే ఈ అంశాలపై ఇప్పటికే ఎంతో ఆలస్యమైందని మోదీ సర్కార్ భావిస్తోంది. 

ఈ నేప‌థ్యంలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసైనా సరే ఈ అంశాలపై చర్చించాలని ధ్యేయంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇదే విషయమై ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ ఇరకాటంలో పడినట్లు తెలుస్తోంది. 

ఇదే విషయమై ఇటీవలే ఏఐసీసీ ఏర్పాటు చేసిన సమావేశంలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పార్టీ అధిష్టానం చర్చ జరిపింది. అయితే జమిలి ఎన్నికలపై భిన్న స్వరాలు వినిపించినా.. పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజనను గుడ్డిగా సమర్ధించలేమని వారు తీర్మానించుకున్నట్లు సమాచారం. 

జనాభా ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన జరగాల్సి ఉంది. అయితే ఆలోగా జనాభా లెక్కింపును కూడా పూర్తి చేయాలా లేదా.. గతంలో మాదిరిగా నిష్పత్తి శాతంతో నియోజకవర్గాలను ఏర్పాటు చేయాలనే అంశాలపై ప్రతిపాదనలు అందుతున్నాయి. 

అయితే జనాభాతో సంబంధం లేకుండా అధికార బీజేపీ తమకు అనుకూల రాష్ట్రాల్లో నియోజకవర్గాలను పెంచుకొని.. రాజకీయ లబ్ధికి తెరలేపిందని కాంగ్రెస్ పార్టీ వాదిస్తోంది. దీని ద్వారా ఉత్తరాదిన భారతీయ జనతా పార్టీ బలం పెంచుకుంటే రాబోయే ఏళ్లలో అధికారం వారికి లభిస్తుందని కాంగ్రెస్ సీనియర్లు మండిపడుతున్నారు. 

అయితే జమిలి ఎన్నికలతో పాటు పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన వెనుక బీజేపీ రాజకీయ వ్యూహం ఉందని కాంగ్రెస్ అగ్రనాయకులు అంటున్నారు. ఒకవేళ జమిలి ఎన్నికల నిర్వహణపై ఈ ఏడాది చివర్లో స్పష్టత వస్తే.. తెలంగాణ రాష్ట్రంలో సరైన సమయానికి ఎన్నికలు జరుగుతాయి. కానీ, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఏడాది ముందే ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. 

ఒకవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికి ఇప్పుడు ఎన్నికలు వస్తే మళ్లీ కూటమి ప్రభుత్వమే అధికారం చేపడతుందని.. ఇటీవలే ఇండియా టుడే సర్వే వెల్లడించింది. జమిలి ఎన్నికలు జరిగితే మరోసారి వైసీపీకి పరాభవం తప్పదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

Also Read: Vishnu Priya News: "డబ్బులు కడితే స్వర్గం చూపిస్తాం" అర్ధనగ్న ఫొటోలు వైరల్..విష్ణుప్రియ దెబ్బకి ఇన్‌స్ట్రాగ్రామ్ దందా బట్టబయలు!

Also Read: Zayn Marie Khan Dacoit: 'డెకాయిట్'‌లో లేడీ పోలీస్ ఎవరో తెలుసా? స్టార్ హీరో మేనకోడలు..సీక్రెట్‌గా పెళ్లి చేసుకుంది!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement

MI vs RCB Prediction: ముంబై, బెంగళూరు మ్యాచ్‌లో గెలిచేది వీళ్లే! అన్నాదమ్ముళ్ల సవాల్..కృనాల్ పాండ్యా బౌలింగ్ మారేనా?

Mumbai, Maharashtra:

MI vs RCB Match Prediction: ఐపీఎల్ 2026లో భాగంగా నేడు డబుల్ హెడర్ మ్యాచ్‌లు జరగనున్నాయి. నేటి రెండో మ్యాచ్ ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఆతిథ్య ముంబై ఇండియన్స్ జట్టు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్‌తో తలపడనుంది. ఐపీఎల్‌లో ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్, డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీతో జరగనున్న రసవత్తరపోరుకు ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 

హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలోని ముంబై ఇండియన్స్ జట్టు తమ సీజన్ ఆరంభంలో ఒడిదుడుకులను ఎదుర్కొంది. కోల్‌కతా నైట్ రైడర్స్‌పై ఆరు వికెట్ల విజయంతో లీగ్‌లో తొలి విజయాన్ని నమోదు చేసుకోగా.. ఆ తర్వాత ఆడిన ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓటమి పాలైంది. ఇప్పుడు మరో గెలుపు కోసం ముంబై జట్టు ఎదురుచూస్తోంది. 

మరోవైపు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు రజత్ పటిదార్ నేతృత్వంలో 2026 సీజన్‌ను ఎంతో ఉత్సాహంగా ప్రారంభించింది. తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుపై ఘనవిజయం సాధించగా.. ఆ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై 43 పరుగుల ఆధిక్యంతో చిత్తుగా ఓడించింది. కానీ, తాజాగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓటమితో ఆర్సీబీ విజయాలను బ్రేక్ పడింది. అయినా ఇన్నింగ్స్ ప్రారంభంలోనే కీలక వికెట్లు కోల్పోయినా.. వారి బ్యాటింగ్, బౌలింగ్ లైనప్‌ ఎంతో గట్టిగా పోటీ ఇచ్చిన తీరు క్రికెట్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. వాంఖడే స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్‌ రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది. 

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు ఇప్పటి వరకు 36 సార్లు తలపడ్డారు. అయితే అందులో 21 మ్యాచ్‌ల్లో ముంబై ఇండియన్స్ గెలుపొందగా.. ఆర్సీబీ 15 సార్లు గెలుపొందింది. 

అదే విధంగా ముంబైలోని వాంఖడే పిచ్ ఈసారి బ్యాటింగ్ కు అనుకూలిస్తుందని.. అధిక స్కోరింగ్ మ్యాచ్‌ జరిగే అవకాశం ఉందని పిచ్ క్యూరేటర్లు చెబుతున్నారు. అయితే ఆట సాగేకొద్దీ పిచ్ తన వేగాన్ని నెమ్మదిగా కోల్పోతుంది. రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్ చేసే వాళ్లకు.. అంటే తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న వారికి ఈ పిచ్ కలిసొస్తుందని అంచనా వేస్తున్నారు. 

ఇప్పటి వరకు ఇరు జట్లు 3 మ్యాచ్‌లు ఆడగా.. ముంబై ఇండియన్స్‌తో పోలిస్తే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు అటు బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ మెరుగ్గా కనిపిస్తోంది. బహుశా ఆర్సీబీ జట్టు ఈ మ్యాచ్‌లో పైచేయి సాధించవచ్చు. కాకపోతే ముంబై ఇండియన్స్ జట్టును కూడా తక్కువ అంచనా వేసేందుకు వీలు లేదు. టేబుల్ లాస్ట్‌లో ఉన్న సీజన్లలో కూడా వారు విజేతలుగా నిలిచిన సందర్భాలు ఉన్నాయి. 

ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ తుది జట్లు అంచనా..
ముంబై ఇండియన్స్:
రోహిత్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్, ర్యాన్ రికెల్టన్ (వికెట్ కీపర్), శార్దూల్ ఠాకూర్, అశ్వనీ కుమార్, జస్‌ప్రీత్ బుమ్రా, AM గజన్‌ఫర్, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్ (ఇంపాక్ట్ ప్లేయర్).

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్, దేవ్‌దత్ పడిక్కల్, రజత్ పటిదార్ (కెప్టెన్), టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, జితేష్ శర్మ (వికెట్ కీపర్), రొమారియో షెపర్డ్, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్, అభినందన్ సింగ్, సుయాష్ శర్మ (ఇంపాక్ట్ ప్లేయర్).

ALso Read: Asha Bhosle Top 10 Songs: సింగర్ ఆశా భోస్లే పాడిన టాప్-10 సాంగ్స్..చివరి పాట తెలుగులో ఓ ఊపు ఊపేసింది!

Also Read: PBKS Vs SRH Match: సన్‌రైజర్స్‌పై పంజాబ్ కింగ్స్ ఘనవిజయం..కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మెరుపు ఇన్నింగ్స్!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

 

0
0
Report

Redmi A7 Pro: బడ్జెట్ ధరలో బ్యాటరీ బాహుబలి.. ఏప్రిల్ 13న భారత మార్కెట్లోకి Redmi A7 Pro 5G ఎంట్రీ!

Hyderabad, Telangana:

Redmi A7 Pro 5G India Launch News: ప్రముఖ  స్మార్ట్‌ఫోన్ దిగ్గజం Redmi నుంచి భారత మార్కెట్లోకి మరో సంచలన మొబైల్‌ విడుదల కాబోతోంది. దీనిని కంపెనీ రెడ్‌మి ఏ7 ప్రో 5జీ (Redmi A7 Pro 5G) పేరుతో అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఈ స్మార్ట్ ఫోన్ సాధారణ బడ్జెట్లో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. దీనిని కంపెనీ ఏప్రిల్ 13వ తేదీన భారత మార్కెట్లోకి విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మొబైల్ సాధారణ మధ్యతరగతి కుటుంబాలకు అందేలా రూ.10 వేల లోపే లభించబోతున్నట్లు తెలుస్తోంది. బడ్జెట్ స్మార్ట్ ఫోన్ అని ఫీచర్స్ లో లోపాలు వివిధ అంశాలు ఉంటాయని అనుకోవచ్చు.. కానీ ఈ స్మార్ట్ ఫోన్  ఫీచర్స్‌లో భాగంగా Redmi ఎక్కడ వెనకాడకుండా అద్భుతమైన కొత్త కొత్త స్పెసిఫికేషన్స్ తో అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. 

ఈ స్మార్ట్‌ఫోన్ ప్రధాన ఆకర్షణ ఏంటంటే దీని బ్యాటరీ.. సాధారణ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్స్‌లో 5000mAh బ్యాటరీలను చూసి ఉంటాం.. కానీ రెడ్ మీ త్వరలో విడుదల చేయబోయే ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6,300mAh బ్యాటరీ ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అదే కాకుండా అది ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు రెండు రోజుల వరకు నిరంతరాయంగా పనిచేస్తుందని కంపెనీ క్లైమ్ చేస్తోంది. అలాగే బ్యాటరీ బ్యాకప్ విషయంలో కూడా వినియోగదారులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఈ  Redmi కంపెనీ కొన్ని రకాల జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఈ Redmi A7 Pro 5G మొబైల్‌లో కంపెనీ అద్భుతమైన భారీ డిస్ప్లేను అందించబోతున్నట్లు కూడా తెలుస్తోంది. ఇందులో కంపెనీ 6.9 ఇంచుల భారీ డిస్‌ప్లేను అందించబోతున్నట్లు లీక్ అయిన వివరాలు చెబుతున్నాయి. అలాగే ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో పని చేస్తుంది. కాబట్టి దీనివల్ల గేమింగ్‌తో పాటు వీడియో స్ట్రీమింగ్ చాలా స్మూత్‌గా ఉంటుంది. ఇక ఫోటోగ్రఫీ విషయానికొస్తే.. ఇందులో అద్భుతమైన 32 మెగాపిక్సెల్ డ్యూయల్ AI కెమెరా సెటప్‌ను అందించారు. అత్యంత తక్కువ కాంతిలో కూడా నాణ్యమైన ఫోటోలు తీయడానికి ఈ కెమెరా ఎంతగానో సహాయపడుతుంది. అంతేకాకుండా సెల్ఫీల కోసం ప్రత్యేకంగా AI బ్యూటీ ఫీచర్లను కూడా అందించారు.

Also Read: Motorola g67 Power: రూ.5 వేల లోపే Motorola g67 Power.. ఫ్లిప్‌కార్ట్ సమ్మర్ సేల్ ధమాకా!

ఇక ఈ Redmi A7 Pro 5G స్మార్ట్‌ఫోన్  ఎంతో శక్తివంతమైన ఆక్టా-కోర్ 5G చిప్‌సెట్‌తో కూడిన ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఆండ్రాయిడ్ 16 ఆధారిత సరికొత్త హైపర్ ఓఎస్ 3 (HyperOS 3) ఆపరేటింగ్ సిస్టంపై రన్ అవుతుంది. ఈ మొబైల్ డిజైన్ చాలా ఆకర్షణీయమైన రంగులో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. దీని ద్వారానే ప్రీమియం లుక్కును కలిగి ఉన్నట్లు సమాచారం. అలాగే ఇందులో హైపర్ ఐలాండ్ అనే ఫీచర్ కూడా అందుబాటులో ఉంది. దీనివల్ల నోటిఫికేషన్లను ఎంతో ప్రత్యేకంగా చూడవచ్చు. అయితే, దీనిని భారత మార్కెట్లో ఏప్రిల్ 13వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు విడుదల చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

Also Read: Motorola g67 Power: రూ.5 వేల లోపే Motorola g67 Power.. ఫ్లిప్‌కార్ట్ సమ్మర్ సేల్ ధమాకా!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report

Asha Bhosle Top 10 Songs: సింగర్ ఆశా భోస్లే పాడిన టాప్-10 సాంగ్స్..చివరి పాట తెలుగులో ఓ ఊపు ఊపేసింది!

Hyderabad, Telangana:

Asha Bhosle Top 10 Songs List: దాదాపుగా 8 దశాబ్దాలకు పైగా తన గాత్రంలో ప్రేక్షకులను అలరించిన ఆ గొంతు.. నేటితో మూగబోయింది. ఎన్నో పాటలకు తన గాత్రంతో ప్రాణం పోసిన ఆ ఊపిరి ఆగిపోయింది. భారత దిగ్గజ నేపథ్య గాయనీ ఆశా భోస్లే (92) నేడు ఆదివారం ఉదయం కన్నుమూశారు. ఆమె మరణంతో చిత్రపరిశ్రమతో పాటు సంగీత ప్రపంచంలో విషాదం నెలకొంది. 

1933 సెప్టెంబర్ 8న మహారాష్ట్రలోని సాంగ్లీ అనే ఊరులో దిగ్గజ సింగర్ ఆశా భోస్లే జన్మించారు. తండ్రి పండిట్ దీనానాథ్ మంగేష్కర్ ఒక గొప్ప శాస్త్రీయ, సంగీత విద్వాంసుడిగానే కాకుండా రంగస్థల నటుడిగా ప్రసిద్ధి పొందారు. తన ఇంట్లోనే సంగీత నేపథ్యం ఉండడం వల్ల ఆశో భోస్లేకు చిన్నతనం నుంచే సంగీతంపై ఆసక్తి పెంచుకున్నారు. ఆమె 9 ఏళ్ల వయసులో తండ్రి దీనానాథ్ మంగేష్కర్ కన్నుమూయడంతో ఆ కుటుంబ బాధ్యత అంతా తన సోదరి లతా మంగేష్కర్‌పై పడింది. కుటుంబం కోసం వారిద్దరూ చిన్ననాటి నుంచే పాటలు పాడడం ప్రారంభించారు. 

అలా సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టిన ఆశా భోస్లే దాదాపుగా 8 దశాబ్దాలకు పైగా తన గాత్రంలో భారతదేశం మొత్తాన్ని ఊపేశారు. హుషారెత్తించే, మత్తెక్కించే క్యాబరే పాటలకు ఆమె పెట్టింది పేరు. అలాగే మనసుకు హత్తుకునే మధుర గీతాలతో ఎన్నో ప్రయోగాలు చేస్తూ అందర్ని ఆశ్చర్యపరిచారు. ఆమె గాత్రంలో ప్రత్యేక శైలి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. నేడు ఆమె పరమదించిన వేళ ఆశా భోస్లే పాడిన లెజండరీ సాంగ్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

1) ఆయే మెహరాబన్ - హౌరా బ్రిడ్జ్ (1958)
O.P. నయ్యర్, ఆశా భోంస్లేల కలయిక వచ్చిన ఈ పాట ఎంతో పాపులర్ అయ్యింది. మధుబాల, అశోక్ కుమార్ హీరోహీరోయిన్లుగా నటించిన "హౌరా బ్రిడ్జ్" చిత్రంలోని ఈ పాట ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంది. అప్పట్లో సూపర్ హిట్ సాంగ్‌గా నిలిచిన ఈ పాట.. ఇప్పటికీ ఎవర్ గ్రీన్ క్లాసిక్‌గా నిలిచింది. 

2) పియా తు అబ్ తో ఆజా - కారావన్ (1971)
ఆశా భోంస్లే మధురమైన గాత్రం లేకుండా హెలెన్ కొరియోగ్రఫీని ఊహించడం కష్టం. ఆమె ఆకర్షణీయమైన గాత్రం, హెలెన్ చేసిన ఉత్సాహభరితమైన క్యాబరే డ్యాన్స్ ఎంతో చక్కగా సరిపోయేవి. "కారావన్" చిత్రంలోని ఈ పాట వినేందుకు ఆహ్లాదంగా ఉండడమే కాకుండా.. ఆశా భోస్లే‌కు 'ఉత్తమ నేపథ్య గాయని'గా ఫిల్మ్‌ఫేర్ అవార్డును కూడా తెచ్చిపెట్టింది.

3) హంగామా హో గయా - అన్హోని (1973)
'క్వీన్' చిత్రంలో పారిస్‌లోని ఒక క్లబ్‌లో ఆశా భోంస్లే పాడిన 'హంగామా' పాట రీమేక్ మనం ఇటీవలే విన్నాం. ఆ పాటకు కంగనా రనౌత్ ఊపేసే స్టెప్పులతో అలరించింది. అయితే ఆశా భోస్లే పాటల ప్రత్యేకత అదే! ఈ పాట తొలిసారి 'అన్హోని' సినిమా కోసం పాడారు. 

4) దమ్ మారో దమ్ - హరే రామ హరే కృష్ణ (1971)
R.D. బర్మన్, ఆశా భోంస్లేల సింగింగ్ కాంబో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్‌ను అందించింది. వాటిలో ఒకటి 'దమ్ మారో దమ్'. ఈ పాట 'హిప్పీ' ట్రెండ్ వారికి ఓ స్పెషల్ సాంగ్‌గా మారిపోయింది. అటు బాలీవుడ్‌లోనే కాకుండా ఇటు దక్షిణాది చిత్రసీమలోని సినిమాల్లో ఏదైనా పార్టీ సన్నివేశాల్లో కచ్చితంగా ఈ పాటను ప్లే చేస్తున్నారు. ఇదో 'కల్ట్ క్లాసిక్'గా ఇప్పటికీ మన మదిలో మెదులుతోంది. ఈ పాట పాడినందుకు గానూ ఆశా భోస్లేకు ఫిల్మ్ ఫేర్ అవార్డు దక్కింది.

5) చురా లియా హై తుమ్నే జో దిల్ కో - యాదోం కీ బారాత్ (1973)
బాలీవుడ్‌లో ఇప్పటివరకు వచ్చిన అత్యంత రొమాంటిక్ సాంగ్స్‌లో ఇదొకటిగా నిలిచింది. నేటికీ ప్రతి ఒక్కరి హృదయంలో స్థానం సంపాదించుకుంది. ఆశా భోస్లే మధురమైన గాత్రం, ఆర్.డి. బర్మన్ అద్భుతమైన సంగీతం వల్ల ఈ పాట నేటికీ ఎందరినో అలరిస్తూ ఎవర్‌ గ్రీన్ క్లాసిక్‌గా నిలిచింది.

6) దునియా మే లోగోం కో  -  అప్నా దేశ్ (1972)
రాజేష్ ఖన్నా, ముంతాజ్‌ల హీరోహీరోయిన్లుగా నటించి ఈ చిత్రంలో 'దునియా మే లోగోం కో' పాట మీ మూడ్‌ను ఇట్టే మార్చేస్తుంది.

7) ఖతూబా - అలీబాబా ఔర్ 40 చోర్ 
అరబిక్ ఛాయలున్న 'ఖతూబా' సాంగ్ పాట ఎంతో ఆకట్టుకుంటుంది. ఆశా భోస్లే గాత్రం ఈ పాటను మరింత స్పెషల్‌గా మార్చింది.

8) మేరా నామ్ హై షబ్నం   -  కటి పతంగ్ (1970)
భారతదేశపు మొట్టమొదటి ర్యాప్ పాటగా ప్రసిద్ధి చెందిన ఈ పాటను టాక్-సంగ్ శైలిలో స్వరపరిచారు. ఈ ప్రయోగాత్మక పాట భారీ విజయం సాధించింది.

9) జరా సా ఝూమ్ లూ మై   -   దిల్ వాలే ధులనియా లే జాయేంగే (1995)
గత తరం నటి మధుబాల నుండి నేటి తరం కథానాయిక కాజోల్ వరకు.. ఆశా భోస్లే తన వయసుతో సంబంధం లేని గాత్రంతో అందరి కోసం పాడారు. జతిన్-లలిత్ స్వరపరిచిన, షారుఖ్ ఖాన్, కాజోల్ నటించిన ఈ ఉషారైన పాటను ఈ దిగ్గజ గాయని పాడారు.

10)  రంగీలా రే  -  రంగీలా (1995)
62 ఏళ్ల ఆశా భోస్లే 1995లో విడుదలైన 'రంగీలా' చిత్రంలో 20 ఏళ్ల వయసున్న ఊర్మిళ మటోండ్కర్ కోసం పాడి, దానికి ప్రత్యేక జ్యూరీ అవార్డును అందుకున్నారు. ఎ.ఆర్. రెహమాన్ స్వరపరిచిన ఈ చార్ట్ బస్టర్ ఇప్పటికీ స్పెషల్ సాంగ్‌గా నిలిచింది.

ALso Read: Solar Eclipse 2027: ఆగస్టులో సుదీర్ఘ సూర్యగ్రహణం..పగటిపూట సూర్యుడ్ని మింగేసే చంద్రుడు.. చీకటి పడే రోజు అతిదగ్గర్లోనే!

ALso Read: Singer Mangli Case: టాలీవుడ్ సింగర్ మంగ్లీపై కేసు నమోదు..చంపేస్తామని మంగ్లీ సోదరుడు, డైరెక్టర్ వేణు‌ బెదిరింపులు?!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement
Advertisement
Back to top