ప్రిన్సిపల్ పై చర్యలు తీసుకోవాలి
Mancherial, Telangana:మంచిర్యాల జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ మహిళ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపకులను విధుల నుంచి తొలగించా పీడీఎస్యూ రాష్ట్ర ఉపాధ్యాక్షుడు శ్రీకాంత్ డిమాండ్ చేశారు మంచిర్యాలలో ఆయన మాట్లాడుతూ.. కళాశాలలోని విద్యార్థినులతో పనులు చేపించుకోవడం వల్ల ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని ఆరోపించారు. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి ప్రిన్సిపల్, అధ్యాపకులను విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
శ్రావణ మాసంలో అరుదైన గ్రహాల కదలిక.. ఈ 3 రాశుల వారికి ఇక తిరుగుండదు, డబ్బే డబ్బు!
Hyderabad, Telangana:Shravana Masam 2026 Effect On Zodiac: పరమశివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన పవిత్ర శ్రావణ మాసం త్వరలోనే మొదలు కాబోతోంది.. ఈ ఏడాది జూలై 30 నుంచి ఆగస్టు 28 వరకు శ్రావణ మాసం కొనసాగుతుంది. అయితే, ఈ శ్రావణ మాసంలో జరగబోయే ఒక అరుదైన గ్రహాల కదలిక జ్యోతిష్య శాస్త్రంలో అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంటుందని జ్యోతిష్యలు తెలుపుతున్నారు.
సంవత్సరం పొడవునా చాలా అరుదుగా కదలికలు జరిపే శని, గురు గ్రహాలు ఈ పవిత్ర మాసంలో కూడా ప్రత్యేక కదలికలను జరుపుతాడని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. జూలై 27న శని దేవుడు వక్రగతిలోకి వెళ్లడంతో ఆ తర్వాత కొద్ది రోజులకే, అంటే ఆగస్టు 12న దేవగురువు బృహస్పతి గ్రహం కూడా అస్తమించబోతోంది. అంతేకాకుండా ఆగస్టు 19న గురు గ్రహం ఆశ్లేష నక్షత్రంలోకి సంచారం చేస్తుంది. దీని కారణంగా ఈ కింది రాశులవారి జీవితాల్లో ఊహించని మార్పులు వస్తాయి.
సింహ రాశి (Leo)
సింహ రాశి వారికి ఈ సమయంలో జీవితంలో సానుకూల మార్పులు వస్తాయి.. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు వేగంగా పూర్తవుతాయి. మానసిక ఒత్తిడి నుండి ఉపశమనం లభించడమే కాకుండా.. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు సులభంగా తొలగిపోతాయి.. కార్యాలయంలో మీ నాయకత్వ నైపుణ్యాలకు (Leadership Skills) అద్భుతమైన ప్రశంసలు దక్కుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.. దీనివల్ల సమాజంలో మీ గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు విపరీతంగా పెరుగుతాయి.
మేష రాశి (Aries)
శ్రావణ మాసంలో జరిగే గ్రహాల మార్పుల కారణంగా ఈ మేష రాశివారి జీవితంలో ఆర్థికంగా, వృత్తిపరంగా అత్యంత లాభదాయకంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అంతేకాకుండా వీరి ఆదాయంలో భారీ మార్పులు కూడా వచ్చే ఛాన్స్లు ఉన్నాయి. ఇక చాలా కాలంగా నిలిపోయిన డబ్బులు కూడా ఆకస్మాత్తుగా చేతికి కూడా అందుతాయి. అంతేకాకుండా ఉద్యోగాలు చేసేవారికి ఈ సమయంలో ప్రమోషన్స్ కూడా లభిస్తాయి. వ్యాపారాలు చేసేవారికి భారీ మొత్తంలో డీల్స్ కూడా లభిస్తాయి.
ధనుస్సు రాశి (Sagittarius)
ధనుస్సు రాశి వారికి ఈ శ్రావణ మాసంలో అద్భుతమైన అవకాశాలు కూడా కలుగుతాయి. వీరు ఆదాయం పొందడానికి కొత్త మార్గాలు సుగమమవుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అంతేకాకుండా పూర్వీకుల ఆస్తి కలిసిరావడం వల్ల అనుకున్న కోరికలు కూడా సులభంగా నెరవేరే ఛాన్స్లు కూడా కనిపిస్తున్నాయి. ధనుస్సు రాశి ఈ సమయంలో ఆర్థికంగా సువర్ణ కాలంగా భావించవచ్చు. భారీ మొత్తంలో డబ్బును కూడా సులభంగా పొందుతారు. అంతేకాకుండా వీరికి వైవాహిక, కుటుంబ జీవితంలో సంతోషకరమైన మార్పులు కూడా సులభంగా లభిస్తాయి. కోరుకున్న కోరికలు కూడా సులభంగా నెరవేరుతాయి. అలాగే ఆరోగ్యం కూడా సులభంగా మెరుగుపడుతుంది.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
గమనిక.. 
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..
జూలై 18 వరకు ఈ 4 రాశుల వారికి గండం.. రాహు-కేతువుల మధ్య అన్ని గ్రహాలు బందీ..
Hyderabad, Telangana:Rahu Ketu Effect On Zodiac Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. జూలై నెల మధ్యలో ఒక అత్యంత అరుదైన, ప్రమాదకరమైన గ్రహాల కూటమి ఏర్పడుతోంది. ప్రధాన గ్రహాలుగా పరిగణించే సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడితో పాటు గురుడు, శుక్రుడు, శని.. ఇలా అన్ని శక్తివంతమైన గ్రహాలు రాహు-కేతువుల మధ్య చిక్కుకోబోతున్నాయి. జ్యోతిష్య నిపుణుల తెలిపిన వివరాల ప్రకారం.. ఏర్పడిన ఈ గ్రహాల ప్రభావం వల్ల జూలై 18 వరకు కొన్ని రాశుల వారికి తీవ్రమైన నష్టాలతో పాటు ఊహించని ప్రమాదాలు ఎదురయ్యే అవకాశం ఉందని జ్యోతిష్యుతు తెలుపుతున్నారు.
రాహు-కేతువుల మాయాజాలం..
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. రాహువు, కేతువు ఎల్లప్పుడూ ఒకరికొకరు 180 డిగ్రీల కోణంలో సంచారం చేస్తూ ఉంటాయి. ప్రస్తుతం రాహువు కుంభ రాశిలో.. కేతువు సింహ రాశిలో సంచార దశలో కొనసాగుతున్నాయి. ఈ రెండు గ్రహాల మధ్యలో అన్ని గ్రహాలు ఒకే వైపున కేంద్రీకృతమవ్వడం వల్ల ఒక వింతైన బంధనం ఏర్పడిందని జ్యోతిష్యుతు తెలుపుతున్నారు. ప్రస్తుతం సూర్యుడు, బుధుడు మిథునంలో, చంద్రుడితో పాటు గురుడు కర్కాటకంలో, కుజుడు వృషభంలో.. శుక్రుడు సింహంతో పాటు శని మీన రాశిలో సంచార దశలో కొనసాగుతున్నాయి.
ఇలా అన్ని గ్రహాలు రాహు-కేతువుల మధ్య చిక్కుకోవడం వల్ల వాటి శుభ ప్రభావం తగ్గి.. ప్రతికూల శక్తులు బలపడే అవకాశాలు ఉన్నట్లు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అయితే, ఈ గ్రహాల అశుభప్రభావం జూలై 19న ముగుస్తుంది. జూలై 19న చంద్రుడు కన్యా రాశిలోకి ప్రవేశించిన వెంటనే.. ఈ రాహు-కేతువుల బంధం తెగిపోతుందని జ్యోతిష్యుతు తెలుపుతున్నారు.. కానీ ఆలోగా.. అంటే జూలై 18 వరకు కింది 4 రాశుల వారు చాలా అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. లేకపోతే అనేక సమస్యలు రావచ్చని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.
ఈ రాశులవారు తీవ్ర సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి..
సింహ రాశి (Leo)
ప్రస్తుతం కేతువు సింహ రాశిలోనే సంచరించబోతున్నాడు.. దీనితో పాటు శుక్రుడు కూడా ఇదే రాశిలో ఉండడం వల్ల ఈ రాశి వారి ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. మీ ఆత్మవిశ్వాసం దెబ్బతినే ఛాన్స్లు ఉన్నాయి. తప్పుడు నిర్ణయాలు తీసుకునే ప్రమాదం ఉంది. వివాహ జీవితంలో లేదా ప్రేమ వ్యవహారాల్లో తీవ్రమైన మనస్పర్థలు.. అవగాహనా లోపం ఏర్పడవచ్చని జ్యోతిష్యులు చెబుతున్నారు. భాగస్వామితో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించడం ఎంతో మంచిది..
కర్కాటక రాశి (Cancer)
కర్కాటక రాశి వారు జూలై 19 వరకు చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఈ రాశిలో సూర్యుడితో పాటు బృహస్పతి ఇద్దరూ కలిసి ఉన్నారు. అయితే, ప్రస్తుతం గురుడు తిరోగమనంలో ఉండడం వల్ల ఆయన ఇచ్చే శుభ ఫలితాలు బలహీనపడతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. దీనివల్ల కుటుంబ బాధ్యతలు ఒక్కసారిగా పెరిగిపోతాయి. మానసిక ఒత్తిడి తీవ్రమవుతుంది. భావోద్వేగాలకు లోనై ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు.
మిథున రాశి (Gemini)
ఈ గ్రహాల కూటమి మిథున రాశి వారిపై కూడా గట్టి ప్రభావం చూపుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా మీ మాటతీరు, కమ్యూనికేషన్, నిర్ణయాత్మక శక్తి దెబ్బతినే అవకాశం ఉంది. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోలేక సతమతమవుతారు. కార్యాలయంలో లేదా అత్యంత ఆప్తులతో అనవసరమైన గొడవలు.. అపార్థాలు ఏర్పడే ఛాన్స్ కూడా ఉంది.. మాట్లాడే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవడం మంచిది.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
గమనిక.. 
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..
జగన్నాథుడికి ఇష్టమైన రాశులు ఇవే.. ఈ 3 రాశుల వారికి ఇక తిరుగుండదు..
Hyderabad, Telangana:Lord Jagannath's Favorite Zodiac Signs Telugu: హిందూ సంప్రదాయంలో జగన్నాథ రథయాత్రకు అత్యంత ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది.. ఆషాఢ మాస శుక్ల పక్షమి విదియ తిథి రోజున దేశవ్యాప్తంగా రథయాత్రను అత్యంత వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు. ఈ ఏడాది జూలై 16వ తేదీ గురువారం రోజున జగన్నాథుని రథయాత్ర అంగరంగ వైభవంగా జరగబోతోంది. ఒడిశాలోని పూరీతో పాటు తెలుగు రాష్ట్రాల్లో, దేశంలోని పలు ప్రాంతాలలో ఈ ఉత్సవాన్ని ఎంతో ఘనంగా జరుపుకుంటారు. అయితే, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. జగన్నాథ మహాప్రభువు భక్తులందరికీ సమానంగా అనుగ్రహం అందించినప్పటికీ.. కొన్ని ప్రత్యేక రాశులపై ఎల్లప్పుడు ఆయన ఆనుగ్రహంతో ఆశీస్సులు ఎల్లప్పుడు ఉంటాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఈ రాశుల వారు జీవితంలో ఎలాంటి కష్టాలు ఎదురైనా మహాప్రభువు అనుగ్రహంతో వాటి నుంచి సులభంగా బయటపడతారని జ్యోతిష్యులు చెబుతున్నారు. అయితే, ఆయన ఆనుగ్రహంతో ఏయే రాశులవారికి ఎల్లప్పుడు మేలు జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ రాశులవారికి జగన్నాథుడి అనుగ్రహం..
సింహ రాశి (Leo)
జగన్నాథుడి అనుగ్రహం సింహ రాశివారికి ఎల్లప్పుడు ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. వీరికి ఎల్లప్పుడు ఆత్మవిశ్వాసంతో, ధైర్యసాహసాలతో ఉంటారు.. జగన్నాథ మహాప్రభువు వీరికి నాయకత్వ లక్షణాలను మరింత బలోపేతం చేస్తారు. స్వామివారి ప్రత్యేక కృప వల్ల వీరు తమ కెరీర్లో సరికొత్త ప్రయోజనాలు పొందుతారు. సమాజంలో తమకంటూ ఒక ప్రత్యేక ముద్రను వేయడానికి విజయం సాధిస్తారు. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను సైతం వీరు అవకాశాలుగా మార్చుకుంటారు. ప్రతి పరిస్థితిని సానుకూల (Positive) దృక్పథంతో ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి.. వీరి మానవ సంబంధాలపై కూడా జగన్నాథుని కరుణాకటాక్షాలు ఎల్లప్పుడూ ఉంటాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.
వృషభ రాశి (Taurus)
వృషభ రాశి వారికి కూడా జగన్నాథుని ఆశీస్సులు మెండుగా ఉంటాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఈ రాశి వారు చాలా కష్టపడే తత్వం కలిగి ఉండి.. నిజాయితీగా జీవించేందుకు ఇష్టపడతారు.. జగన్నాథుని అనుగ్రహం వల్ల వీరి కష్టానికి తగిన అద్భుతమైన ప్రతిఫలం లభిస్తుంది. వీరి ఆర్థిక స్థితి బలపడటంతో పాటు కుటుంబంలో శాంతితో పాటు సంతోషం కూడా రెట్టింపు అవుతుంది. సమాజంలో, కుటుంబంలో వీరి సంబంధాలు ఎంతో మధురంగా, బలంగా మారుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. వృషభ రాశి వారికి దేవునిపై ఉన్న అచంచలమైన భక్తి, జీవితంలోని ప్రతి కష్టాన్ని అధిగమించే శక్తి లభిస్తుంది.. వీరు తమ ఓర్పు, పట్టుదలతో విజయాలు సాధిస్తారు.
కర్కాటక రాశి (Cancer)
జగన్నాథుడికి అత్యంత ప్రియమైన రాశులలో కర్కాటక రాశి ఒకటి.. ఈ రాశి వారు స్వభావరీత్యా చాలా సున్నితంగా.. భావోద్వేగాలతో నిండి ఉంటారు. జగన్నాథుని ప్రత్యేక అనుగ్రహం వల్ల వీరి మనస్సులోని గందరగోళం తొలగిపోయి.. మానసిక ప్రశాంతత లభిస్తుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. మహాప్రభువు కృపతో వీరి జీవితంలో ఆర్థిక సమస్యలు సులభంగా తగ్గిపోతాయి.. కుటుంబ జీవితం ఎంతో సంతోషంగా సాగుతుంది. ఎలాంటి కష్టాలు వచ్చినా వీరు ధైర్యంగా ఎదుర్కొంటారని జ్యోతిష్యులు చెబుతున్నారు. స్వామివారి ఆశీస్సులు వీరి మనోధైర్యాన్ని ఎంతగానో పెంచుతాయి..
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
గమనిక.. 
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..
కేంద్ర మంత్రికి కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీ విజ్ఞప్తి.. ఆదిలాబాద్ సీసీఐని వెంటనే తెరిపించాలి
New Delhi, Delhi:Adilabad CCI Factory: ఆదిలాబాద్ ప్రాంతానికి ఊపిరి పోసే సీసీఐ పరిశ్రమను పునరుద్ధరణ చేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేసింది. సీసీఐ తెరిపించేదాకా బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుందని ప్రకటించింది. ఆదిలాబాద్ సీసీఐకి కేంద్రం సానుకూలంగా ఉన్నదని మంత్రి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం పదేళ్లుగా బీఆర్ఎస్ పార్టీ అనేక సందర్భాల్లో చేసిన ఒత్తిడి ఫలితంగా సీసీఐ ఆదిలాబాద్ పునరుద్ధరణపై సానుకూలంగా ఉన్నట్టు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు.
ఆదిలాబాద్లోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ప్లాంట్ను వెంటనే తెరిపించాలని డిమాండ్ చేస్తూ కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్డీ కుమారస్వామితో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ముఖ్య నాయకుల బృందం సమావేశమైంది. సీసీఐ ప్లాంట్ను పునరుద్ధరించాలని కోరుతూ మాజీ మంత్రి జోగురామన్న, బీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ ఫ్లోర్ లీడర్ వద్దిరాజు రవిచంద్ర నేతృత్వంలో సీసీఐ సాధన సమితి సభ్యుల బృందం కేంద్ర మంత్రి కుమారస్వామిని కలిసి వినతిపత్రం సమర్పించింది. దాదాపు అరగంట సేపు సాగిన ఈ సమావేశంలో ప్లాంట్ పునరుద్ధరణకు ఉన్న అవకాశాలు, ఎదురవుతున్న ఆటంకాలపై బీఆర్ఎస్ పార్టీ బృందం క్షుణ్ణంగా చర్చించింది.
ఈ సమావేశంలో సీసీఐ పునరుద్ధరణకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ఉందని మంత్రి స్పష్టం చేశారని బీఆర్ఎస్ పార్టీ బృందం వెల్లడించింది. సీసీఐ ప్లాంట్ పునఃప్రారంభం కావడానికి ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ ప్రోత్సాహం, చిత్తశుద్ది ఎంతో అవసరమని మాజీ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. కేంద్రం అడిగిన వివరాలపై స్పందిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్లాంట్ కోసం ఎలాంటి ప్రతిపాదనలు చేస్తుందో, ఎంత పెట్టుబడి పెడుతుందో వెంటనే బహిరంగంగా ప్రకటించాలని బీఆర్ఎస్ పార్టీ బృందం డిమాండ్ చేసింది. మారుమూల ప్రాంతానికి చెందిన వేలాదిమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే ఈ సీసీఐ ప్లాంట్ను తిరిగి తెరిపించే వరకు బీఆర్ఎస్ పార్టీ తన పోరాటాన్ని నిరంతరం కొనసాగిస్తుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేంద్ర మంత్రికి వివరిస్తూ.. 1980వ దశకంలో ఏర్పాటైన ఆదిలాబాద్ సీసీఐ ప్లాంట్ ఒకప్పుడు 6 వేల మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి కల్పించి ఆ ప్రాంతానికి జీవనాధారంగా నిలిచిందని గుర్తుచేశారు. వందేళ్లకు సరిపడా సున్నపురాయి నిల్వలు అక్కడ పుష్కలంగా అందుబాటులో ఉన్నాయని, 4 లక్షల మెట్రిక్ టన్నుల కెపాసిటీ కలిగిన ఈ ప్లాంట్ను తిరిగి విజయవంతంగా నడపడానికి అన్ని రకాల అవకాశాలు సంపూర్ణంగా ఉన్నాయనే విషయాన్ని కేంద్ర మంత్రికి బీఆర్ఎస్ పార్టీ బృందం వివరించింది.
2019 పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో అప్పటి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, సహాయ మంత్రి హన్సరాజ్ గంగారామ్ ఆదిలాబాద్ సీసీఐ ప్లాంట్ను తప్పకుండా తెరిపిస్తామని హామీ ఇచ్చినట్లు బీఆర్ఎస్ పార్టీ బృందం గుర్తుచేసింది. నేడు క్షేత్రస్థాయిలో దీన్ని తెరిపించాల్సింది పోయి తుక్కు (స్క్రాప్) కింద మార్చి విక్రయిస్తున్నారని మాజీ మంత్రి కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ విజ్ఞప్తిపై కేంద్ర మంత్రి కుమారస్వామి సానుకూలంగా స్పందించినట్లు వెల్లడించారు.
కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ప్లాంట్ను మళ్లీ నడపాలనే బలమైన కోరికతోనే ఉందని, దీనికోసం కచ్చితంగా ప్రయత్నం చేస్తామని బీఆర్ఎస్ పార్టీ బృందానికి కేంద్ర మంత్రి కుమార స్వామి హామీ ఇచ్చారు. అక్కడ 2,300 ఎకరాల భూమి అందుబాటులో ఉందని.. దీనిలో 770 ఎకరాలు కంపెనీకి చెందిన పట్టా భూమి కాగా.. 1,500 పైచిలుకు ఎకరాలు లీజ్ ల్యాండ్ రూపంలో ఉందని వివరించారు. ఇక్కడ రూ.2 వేల కోట్ల పెట్టుబడితో సరికొత్త ఫ్యాక్టరీని పెట్టినట్టయితే చాలా బాగుంటుందని కేంద్ర మంత్రి వివరించారు.
తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు తరగతి గదుల్లోనే ఉంది.. చదువే ఆత్మగౌరవాన్ని పెంచుతుంది: రేవంత్ రెడ్డి
Kothakota, Telangana:Kothakota Girls High School: కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో అమరుల ఆశయాలకు, త్యాగాలకు గత ప్రభుత్వం గుర్తింపు ఇవ్వలేదని బీఆర్ఎస్ పార్టీపై రేవంత్ రెడ్డి విమర్శలు చేశారు. తెలంగాణ పునర్నిర్మాణంలో మీరంతా భాగస్వాములు కావాలన్న అమరుల ఆశయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు తీసుకెళుతోందని చెప్పారు. మౌలిక వసతులు లేకపోవడంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిందని తెలిపారు. ఇంటి పేర్లు నీళ్లు అని పెట్టుకున్నోల్లు కూడా ఈ పాఠశాల గురించి ఆలోచన చేయలేదని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డిని విమర్శించారు. కానీ ఇక్కడి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఈ పాఠశాల భవనాలు నిర్మించి సౌకర్యాలు కల్పించారని కొనియాడారు.
వనపర్తి జిల్లా కొత్తకోట బాలికల ఉన్నత పాఠశాల నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి కీలక ప్రసంగం చేశారు. 'చదువొక్కటే మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది.. మన జీవితాల్లో వెలుగులు నింపుతుంది. చదువే మన ఆత్మగౌరవాన్ని పెంచుతుంది.. తల్లిదండ్రుల కళ్లల్లో ఆనందం నింపుతుంది' అని తెలంగాణ ముఖ్యమంత్రి పేర్కొన్నారు. గత ప్రభుత్వం విద్యాశాఖపై నిర్లక్ష్యం వహించిందని బీఆర్ఎస్ పార్టీపై రేవంత్ రెడ్డి విమర్శలు చేశారు. ప్రజా ప్రభుత్వం (కాంగ్రెస్) అధికారంలోకి రాగానే విద్యాశాఖకు సీనియర్ అధికారులను నియమించామని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు తరగతి గదుల్లోనే ఉందని తాను సంపూర్ణంగా నమ్ముతున్నట్లు తెలంగాణ సీఎం ప్రకటించారు. అందుకే విద్యాశాఖను తన దగ్గరే పెట్టుకున్నట్లు పేర్కొన్నారు.
'ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయకపోతే వందేళ్లయినా సమస్య పరిష్కారమా కాదు. ప్రజా ప్రభుత్వంలో ప్రభుత్వ పాఠశాలలపై ప్రత్యేక దృష్టి పెట్టాం. మొదట ఉపాధ్యాయుల ప్రమోషన్లు, బదిలీలు పూర్తి చేసి సమస్యను పరిష్కరించాం' అని రేవంత్ రెడ్డి వివరించారు. విద్యలో దేశంలో తెలంగాణ 18వ స్థానం పొందిందని.. విద్యలో తెలంగాణను దేశంలోనే మొదటి రెండు స్థానాల్లో నిలబెట్టాల్సిన బాధ్యత అందరిపై ఉందని గుర్తుచేశారు.
విద్యార్థులకు, యువతకు సాంకేతిక నైపుణ్యం అందిచే చర్యలు చేపట్టామని.. ఐటీఐలను బలోపేతం ఏటీసీలుగా అప్గ్రేడ్ చేసినట్లు రేవంత్ రెడ్డి వెల్లడించారు. 'జర్మనీ, జపాన్ లో బ్లూ కాలర్ జాబ్స్ కు మెరుగైన అవకాశాలు ఉన్నాయి. 27, 50,000 మందికి పంద్రాగస్టులోగా యంగ్ ఇండియా కిట్స్ పంపిణీ పూర్తి చేస్తాం. ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటే ఏమవుతారని మిమ్మల్ని అడిగితే మీ రేవంతన్నను చూపించండి' అని తెలంగాణ సీఎం తెలిపారు.
'ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే నేను ముఖ్యమంత్రి స్థాయికి చేరా. ప్రభుత్వ పాఠశాలలే తెలంగాణ పునర్నిర్మాణంలో కీలక పాత్ర పోషించాలి. కలం పట్టి తెలంగాణ భవిష్యత్తును తీర్చిదిద్దాలి' అని విద్యార్థులకు తెలంగాణ సీఎం సూచించారు. చదువుతోపాటు మైదానాల్లో పోటీపడాలని చెప్పారు. మట్టిలో మాణిక్యాలను వెలికితీయాలని.. క్రీడల్లో రాణించిన మీ భవిష్యత్తును తీర్చిదిద్దే బాధ్యత తనదని రేవంత్ రెడ్డి ప్రకటించారు. 'రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో విద్యార్థిపై ఏడాదికి రూ.లక్షా 8 వేలు ఖర్చు చేస్తుంది. బాగా చదువుకోండి.. జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకోండి' అని తెలంగాణ సీఎం సూచించారు.
ముద్రగడ పద్మనాభం పాడె మోసిన వైఎస్ జగన్
Kirlampudi, Andhra Pradesh:YSRCP Chief YS Jagan Attends Mudragada Padmanabham Final Rituals At Kirlampudi Watch Videoఒళ్లంతా కారం నీళ్లతో అభిషేకం.. వైరల్ అవుతున్న భక్తుడి వింత మొక్కు!
Hyderabad, Telangana:Thaipusam Festival Viral Video: భక్తికి హద్దులు లేవని.. నమ్మకం ముందు ఎలాంటి శారీరక శ్రమ అయినా తలవంచాల్సిందేనని తమిళనాడులో జరిగిన ఒక వింత ఆచారానికి సంబంధించిన ఘటన మరోసారి నిరూపించింది. తమిళనాడులోని విళ్లుపురం జిల్లా, సిద్ధాత్తూరు గ్రామంలో ప్రతి ఏటా ఎంతో వైభవంగా జరిగే తైపూసం ఉత్సవాలు ఈసారి తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. అంతేకాకుండా వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.. మురుగన్ స్వామి భక్తుడు ఒకరు పెట్టుకున్న వింత మొక్కుబడి.. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ మొక్కుబడి ఏంటి? అసలు వైరల్ అవుతున్న వీడియో ఏంటి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
కారం నీళ్లతో అభిషేకం..
సాధారణంగా దేవుళ్లకు పాలు, పెరుగుతో పాటు పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లతో అభిషేకాలు చేయడం మనం చూస్తుంటాం. కానీ.. సిద్ధాత్తూరులో జరిగిన తైపూసం ఉత్సవాల్లో మాత్రం ఇందుకు భిన్నంగా ఒళ్లు గగుర్పొడిచే దృశ్యం ఆవిష్కృతమైంది. మురుగన్ స్వామిపై ఉన్న అమితమైన భక్తితో ఒక భక్తుడు తన శరీరంపై మిరపపొడి కలిపిన నీటితో అభిషేకం చేయించుకున్నాడు.
స్వామివారికి మొక్కుకున్న మొక్కు తీర్చుకునే.. క్రమంలో భాగంగానే ఈ కఠినమైన ఆచారాన్ని నిర్వహించినట్లు తెలుస్తోంది. సదరు భక్తుడు నిలబడి ఉండగా.. ఇతర భక్తులు, పూజారులు పెద్ద ఎత్తున మిరపపొడి కలిపిన ఎర్రటి నీటిని అతడి తలపై.. శరీరంపై కుమ్మరించారు. కంటికి కారం తగిలితేనే.. తట్టుకోలేని ఈ రోజుల్లో.. ఒళ్లంతా కారం నీళ్లతో అభిషేకం చేయించుకుంటూ.. సదరు భక్తుడు చూపిన నిబ్బరం అందరినీ ఆశ్చర్యపరిచింది.
సోషల్ మీడియాను ఊపేస్తున్న వీడియో..
ఈ వింత ఆచారానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో క్షణాల్లో వైరల్గా మారింది. నెటిజన్లు ఈ దృశ్యాలను చూసి రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇది భక్తి ప్రపత్తులా? లేక మూఢనమ్మకమా? అంటూ సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. మరికొందరు ఇలాంటి శరీరానికి హాని కలిగించే పద్ధతులు అవసరమా? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా సోషల్ మీడియాలో వీడియో విపరీతంగా వైరల్ అవుతూ వస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.
తిరుమలేశుడిని దర్శించుకున్న సినీ, రాజకీయ ప్రముఖులు
Dharmavaram, Andhra Pradesh:Cine Actor Saptagiri And AP Govt WHIPs Visits To Tirumala Temple Watch Videoశ్రీశైలం భ్రమరాంబిక అమ్మవారికి అగ్గిపెట్టెలో పట్టే పట్టుచీర
Srisailam, Andhra Pradesh:Telangana Weaver Donates Pattu Saree In Match Box To Goddess Srisailam Bramarambika Watch Viral Videoక్లాస్రూమ్లోనే ఉపాధ్యాయుల రాసలీలలు.. రొమాన్స్ వీడియో వైరల్..
Hyderabad, Telangana:Teachers Romancing Video: అక్షరాలు నేర్పి.. పిల్లలను ఉన్నత విలువలతో తీర్చిదిద్దాల్సిన గురువులు ఈ బడిలో దారి తప్పి.. సమాజం ముక్కున వేలేసుకునేలా.. తోటి ఉపాధ్యాయులు తలదించుకునేలా ప్రవర్తించారు.. పవిత్రమైన దేవాలయం లాంటి పాఠశాల గదిని.. తమ కామక్రీడలకు వేదికగా మార్చుకున్నారు. ఉత్తరప్రదేశ్లోని కన్నౌజ్ జిల్లాలో ఒక ప్రభుత్వ పాఠశాల క్లాస్రూమ్లో ఒక ఉపాధ్యాయుడు, ఉపాధ్యాయురాలు రొమాన్స్ చేసుకుంటున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
సోషల్ మీడియాను ఊపేస్తోన్న వైరల్ వీడియో..
వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం.. సదరు పాఠశాలలో అసిస్టెంట్ టీచర్లుగా పనిచేస్తున్న ఒక ఉపాధ్యాయుడు, ఉపాధ్యాయురాలు క్లాస్రూమ్లోనే ఒకరినొకరు రొమాస్స్ చేసుకుంటూ.. ముద్దులు పెట్టుకుంటూ.. కెమెరాకు చిక్కారు. ఈ దృశ్యాలను ఎవరో మొబైల్ ఫోన్లో రికార్డ్ చేసి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్గా మారింది.
విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన క్లాస్రూమ్లో ఇలాంటి అశ్లీల పనులకు చేయడంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన వారే ఇలా ప్రవర్తిస్తే ఇక సమాజానికి ఏం సందేశం ఇస్తారు? అంటూ విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రంగంలోకి విద్యాశాఖ..
ఈ వ్యవహారం కాస్తా కాస్తా ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో విద్యాశాఖ అలర్ట్ అయిన్నట్లు తెలస్తోంది. కన్నౌజ్ జిల్లా బేసిక్ శిక్షా అధికారి (BSA) ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన్నట్లు సమాచారం. బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ (BEO)ను ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు చేసి.. తక్షణమే నివేదిక సమర్పించాల్సిందిగా ఆదేశించారు. వైరల్ వీడియోలోని ఉపాధ్యాయులు ఎవరు? అది ఏ పాఠశాలలో జరిగింది? అనే విషయాలపై విచారణ జరుపుతున్నారు.
విద్యావ్యవస్థకే మచ్చ..
సాధారణంగా పాఠశాలల్లో ఉపాధ్యాయులను దైవంతో సమానంగా చూస్తూ ఉంటారు.. కానీ, ఇలాంటి ఘటనలు ఉపాధ్యాయ వృత్తికే మచ్చ తెస్తున్నాయని విద్యావేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తూ వస్తున్నారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా.. భవిష్యత్తులో ప్రభుత్వ పాఠశాలల్లో ఇలాంటి అసాంఘిక పనులు జరగకుండా కఠినమైన నిబంధనలు అమలు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ కేసులో విచారణ ముగిసిన తర్వాత మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.
ప్రాణాంతక విషంగా పాలు.. మెదక్లో గుట్టుచప్పుడు కాకుండా కల్తీ పాల దందా..
Hyderabad, Telangana:Medak Adulterated Milk: ఆరోగ్యానికి అమృతం లాంటి పాలను ప్రాణాంతక విషంగా మారుస్తున్న ఒక భారీ కల్తీ ముఠాను మెదక్ జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. నర్సాపూర్ మండలం రెడ్డిపల్లి గ్రామంలో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న కల్తీ పాల తయారీ కేంద్రంపై పోలీసులు దాడి నిర్వహించారు.. విశ్వసనీయ సమాచారం మేరకు రంగంలోకి దిగిన టాస్క్ ఫోర్స్ పోలీసులు.. బుధవారం తెల్లవారుజామున ఒక్కసారిగా ఈ తయారీ కేంద్రంపై మెరుపు దాడి నిర్వహించారు.
రెడ్డిపల్లి గ్రామానికి చెందిన శివన్నగారి సుధాకర్ అనే వ్యక్తి గత కొంతకాలంగా స్వంత లాభం కోసం కృత్రిమ పాలను తయారు చేస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో ఇటీవలే తేలింది. రసాయనాలతో పాలు తయారు చేస్తుండగా.. పోలీసులు అతడిని రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. నిందితుడి నుంచి సుమారు 150 లీటర్ల కల్తీ పాలతో పాటు పెద్ద మొత్తంలో మిల్క్ పౌడర్, పాలు చిక్కగా కనిపించేందుకు ఉపయోగిస్తున్న హానికరమైన రసాయనాలు, మిక్సింగ్ సామగ్రి, ఇతర తయారీ పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు.
మూలాల అన్వేషణలో పోలీసులు..
నిందితుడు తయారు చేసిన ఈ ప్రాణాంతక కల్తీ పాలను ఎక్కడెక్కడికి సరఫరా చేస్తున్నాడు? ఈ ముఠా వెనుక ఇంకా ఎవరైనా పెద్ద తలకాయలు ఉన్నాయా? అసలు ఈ అక్రమ దందా ఎంతకాలంగా సాగుతోంది? అనే కోణంలో టాస్క్ ఫోర్స్తో పాటు స్థానిక పోలీసులు లోతుగా దర్యాప్తును మొదలు పెట్టారు.. కల్తీ పాలు ప్రజల ఆరోగ్యానికి తీవ్రమైన ముప్పును తెచ్చిపెడతాయని.. అందుకే ఈ కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని దర్యాప్తు చేస్తున్నమని.. త్వరలోనే ఈ కల్తీ నెట్వర్క్కు సంబంధించిన పూర్తి వివరాలను, నిందితుల పాత్రను బహిర్గతం చేస్తామని టాస్క్ ఫోర్స్ పోలీస్ అధికారులు తెలిపారు.
Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!
కఠిన చర్యలకు డిమాండ్..
ఈ కల్తీ పాల ఉదంతం రెడ్డిపల్లి గ్రామంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో తీవ్ర కలకలం రేపిన్నట్లు తెలుస్తోంది.. చిన్నారులతో పాటు వృద్ధులు రోజూ తాగే పాలలో ఇలాంటి ప్రాణాంతక రసాయనాలు కలుపుతున్నారని తెలిసి స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. కేవలం లాభాల కోసమే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఇలాంటి కేటుగాళ్లపై కఠినమైన P.D యాక్ట్ నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఆహార భద్రతా అధికారులు నిరంతరం తనిఖీలు చేపట్టి.. కల్తీ రాయుళ్లపై ఉక్కుపాదం మోపాలని స్థానిక ప్రజలు సైతం కోరుతున్నారు.
Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
ఆదిలాబాద్లో డ్రగ్స్ కలకలం.. భారీగా కెమికల్ డ్రగ్ స్వాధీనం..
Hyderabad, Telangana:Adilabad Drug Racket Busted: ఆదిలాబాద్ జిల్లాలో గత కొన్ని రోజులుగా గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న భారీ కెమికల్ డ్రగ్స్ దందాను పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. వైద్య అవసరాలకు, ఆపరేషన్ల సమయంలో మాత్రమే వినియోగించాల్సిన ఒక అత్యవసర ఇంజెక్షన్ను అక్రమ మార్గంలో తరలిస్తూ.. వ్యసనానికి అలవాటు పడ్డవారికి విక్రయిస్తున్న అంతరాష్ట్ర ముఠా నెట్వర్క్ను ఆదిలాబాద్ పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు..
నిషేధిత జాబితాలో ఉన్న.. మెఫెంటర్మైన్ సల్ఫేట్ ఇంజెక్షన్ IP బీను ఈ ముఠా అక్రమంగా విక్రయిస్తోంది. వివిధ మెడికల్ ఏజెన్సీలు, ఫార్మసీల నుంచి తక్కువ ధరకే వీటిని సేకరిస్తున్న ఈ కేటుగాళ్లు.. ఆ తర్వాత గంజాయి స్మగ్లర్లకు, గంజాయికి బానిసలైన యువతకు వీటిని సరఫరా చేస్తున్నారు. మార్కెట్లో ఈ డ్రగ్ రిటైల్ ధర (MRP) కేవలం రూ. 390 మాత్రమే ఉండగా.. డిమాండ్ను బట్టి ఒక్కో వయల్ను ఏకంగా రూ.1,500 చొప్పున.. అంటే దాదాపు మూడు నుంచి నాలుగు రెట్లు అధిక ధరకు విక్రయిస్తూ.. సొమ్ము చేసుకుంటున్నట్లు విచారణలో తేలింది.
విచారణతో గుట్టురట్టు..
జూలై 12వ తేదీన ఆదిలాబాద్ RTC బస్టాండ్ సమీపంలో పోలీసులు రొటీన్గా వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించిన ఒక ఆర్ఎంపీ (RMP) డాక్టర్ను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. అతడిని ముమ్మరంగా విచారించడంతో ఈ కెమికల్ డ్రగ్ రాకెట్ గుట్టు మొత్తం బయటపడింది. ఈ కేసులో మొత్తం ఏడుగురిపై కేసు నమోదు చేయగా.. ప్రస్తుతానికి ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
భారీగా డ్రగ్స్, సిరంజీలు స్వాధీనం..
ముఠాను అరెస్ట్ చేసి.. వారి వద్ద నుంచి భారీగా డ్రగ్స్ నిల్వలను పోలీసులు రికవరీ చేశారు. వారి నుంచి దాదాపు 50 టెర్మిన్ ఇంజెక్షన్ వయల్స్, 190 ఇన్సులిన్ సిరంజీలు, 2 మొబైల్ ఫోన్లు, 1 స్కూటర్ లను స్వాధీనం చేసుకున్నట్లు ఆదిలాబాద్ జిల్లా SP అఖిల్ మహాజన్ వెల్లడించారు. ఈ ఇంజెక్షన్లను కేవలం అత్యవసర వైద్య అవసరాల కోసం.. గుర్తింపు పొందిన వైద్యులకు మాత్రమే విక్రయించాల్సి ఉంటుందని.. ఇలాంటి నియంత్రిత డ్రగ్స్ను నిబంధనలకు విరుద్ధంగా.. లాభార్జనే ధ్యేయంగా అక్రమంగా విక్రయించే ఫార్మసీలు, వ్యక్తులపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని.. యువత జీవితాలను నాశనం చేసే ఇలాంటి డ్రగ్స్ దందాలపై నిరంతరం నిఘా ఉంటుందని ఎస్పీ అఖిల్ మహాజన్ తీవ్రంగా హెచ్చరించారు. పరారీలో ఉన్న మిగిలిన నలుగురు నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించినట్లు ఆయన స్పష్టం చేశారు.
Also Read: త్వరలోనే 3 లక్షల కొత్త పెన్షన్లు.. గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
చారిత్రక అగ్రోహా ధామ్లోనే నంద కిషోర్ గోయెంకా అంత్యక్రియలు
Agroha, Haryana:Agroha Dham: ఎస్సెల్ గ్రూపు చైర్మన్ నంద కిశోర్ గోయెంకా అతి పురాతనమైన అగ్రోహా ధామ్ నిర్మాణంలో, దాని అభివృద్ధిలో కీలక పాత్ర పోషించారు. సమాజ సేవకులు, వైశ్య సమాజ సంరక్షకులు నంద కిషోర్ గోయెంకా 96 ఏళ్ల వయస్సులో మరణించగా.. ఆయన అంత్యక్రియలు ఆయన పునఃనిర్మించిన ఆగ్రోహ ధామ్లోనే జరిగాయి. ఆయన మరణంతో కుటుంబసభ్యులు, అభిమానులు తీవ్ర శోకంలో మునిగారు. ఏ పవిత్రమైన అగ్రోహా ధామ్ను ఆయన తన చేతులతో తీర్చిదిద్దారో.. అదే పవిత్ర క్షేత్రంలోనే ఆయన అంత్యక్రియలు నిర్వహించి.. పంచభూతాల్లో విలీనం చేయనున్నారు.
అగ్రోహా ధామ్ అభివృద్ధిలో నంద కిషోర్ గోయెంకా పాత్ర
వైశ్య సమాజ నాయకుడు, గోయెంకా కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన బజరంగ్ దాస్ గార్గ్ మాట్లాడుతూ.. 'నంద కిషోర్ గోయెంకా అగ్రోహా ధామ్ ప్రధాన వ్యవస్థాపకులలో ఒకరు. ఆయన హర్యానా రాష్ట్రంలోని హిసార్తో పాటు అనేక సామాజిక, ధార్మిక సంస్థల అభివృద్ధికి చారిత్రాత్మక సహకారాన్ని అందించారు' అని తెలిపారు. 'నంద కిశోర్ దూరదృష్టి, అంకితభావంతోనే అగ్రోహా ధామ్ దేశంలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు, గౌరవాన్ని పొందింది. హిసార్లో విద్యా, సామాజిక రంగాల అభివృద్ధికి ఆయన ఎంతో కృషి చేశారు. 'శ్రీ దేవి భవన్ మందిర్ గౌశాల ట్రస్ట్' సంరక్షకులుగా, 'శ్రీ వైష్ణవ్ అగ్రసేన్ గౌశాల' అధ్యక్షులుగా, సంరక్షకులుగా బాధ్యతలు నిర్వర్తించారు' అని భజరంగ్ దాస్ గార్గ్ వివరించారు.
అగ్రోహా ధామ్ చరిత్ర
మహారాజ అగ్రసేన్ తన రాజధానిగా చేసుకున్న అగ్రోహా నగరం ప్రాచీన కాలం నుంచి వ్యాపారానికి, సంపదకు కేంద్రంగా ఉండేది.
క్రీ.శ. 1194: మహమ్మద్ ఘోరీ దాడి తర్వాత అగ్రోహా ధామ్ పూర్తిగా పాడైపోయింది.
క్రీ.శ. 1907-1908: అగ్రోహాకు చేరుకున్న సంత్ బ్రహ్మానంద్ బ్రహ్మచారి ప్రేరణతో అగర్వాల్ సమాజం 'అగర్వాల్ దర్బార్'ను స్థాపించి దీని పునర్నిర్మాణాన్ని ప్రారంభించింది.
క్రీ.శ. 1976: అఖిల భారత అగర్వాల్ ప్రతినిధి సమ్మేళనంలో అగ్రోహా పునరుద్ధరణ తీర్మానాన్ని ఆమోదించారు.
ఆలయ సముదాయం ప్రత్యేకతలు
హర్యానాలోని హిసార్లో ఉన్న అగ్రోహా ధామ్ నిర్మాణం 1976లో ప్రారంభమై 1984లో పూర్తయింది. దాదాపు 300 విస్తీర్ణంలో ఉన్న ఈ భవ్య క్షేత్రం దేవి మహాలక్ష్మి, మహారాజ అగ్రసేన్లకు అంకితం చేశారు. ఇది దేశ రాజధాని ఢిల్లీ నుంచి సుమారు 190 కిలోమీటర్ల దూరంలో ఉంది.
త్రికూట మందిరం
అగ్రోహా ధామ్ ప్రాంగణంలో ప్రధాన ఆకర్షణగా మూడు శిఖరాలు కలిగిన త్రికూట మందిరం ఉంది. 180 అడుగుల ఎత్తున్న ఈ ప్రధాన ఆలయంలో మహాలక్ష్మి అమ్మవారి కొలువై ఉన్నారు. సరస్వతి, మహారాజ అగ్రసేన్, వైష్ణో దేవి గుహ, శివాలయాలు ఇక్కడ ఉన్నాయి.
శక్తి సరోవరం
ఆలయ ప్రాంగణం మధ్యలో 300-400 అడుగుల పరిమాణంలో ఒక భారీ 'శక్తి సరోవరం' ఉంది. దీని మధ్యలో క్షీరసాగర మథనాన్ని (సముద్ర మథనం) ప్రతిబింబించే అందమైన దృశ్యరూపం ఏర్పాటు చేశారు.
సామాజిక, వైద్య అభివృద్ధి
ఈ చారిత్రాత్మక నగరంలో సమాజ సేవకు పెద్దపీట వేశారు. ఇక్కడ ఒక పురాతన గోశాల, వైద్య పరిశోధన, విద్యకు ప్రధాన కేంద్రంగా నిలిచిన మహారాజ అగ్రసేన్ మెడికల్ కాలేజ్ ఇక్కడ ఉన్నాయి.
జగన్నాథుని రథోత్సవం.. మీ బంధుమిత్రులకు ఇలా విష్ చేయండి!
Hyderabad, Telangana:వాట్సాప్, ఫేస్బుక్ కోసం బెస్ట్ జగన్నాథుడి రథయాత్ర విషెష్!
Hyderabad, Telangana:Happy Puri Jagannath Rath Yatra 2026: ఆ జగన్నాథుడి రథచక్రాల కదలికలు.. మీ జీవితంలో సరికొత్త వెలుగులను.. అఖండ విజయాలను తీసుకు రావాలని కోరుకుంటూ... ఇలా మీ కుటుంబ సభ్యులకు పూరీ జగన్నాథ రథయాత్ర శుభాకాంక్షలు తెలపండి..
