వాల్టా చట్టం ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలి
Bellampalle, Telangana:మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం పెద్దనపల్లి శివారు పరిధిలో ఒక ధార్మిక సంస్థ ఆధ్వర్యంలో ప్రకృతి సిద్ధంగా ప్రవహిస్తున్న వాగుపై కాంక్రీట్ సహాయంతో పర్మినెంట్ వంతెన నిర్మించడాన్ని నిరసిస్తూ బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు కోడి రమేష్ ఆధ్వర్యంలో శనివారం ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం అధికారుల అనుమతి లేకుండా వాల్టా చట్టం ఉల్లంఘించి వంతెన నిర్మించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆర్డీఓ కు వినతిపత్రం అందజేశారు.हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
Nara Lokesh Resign: నారా లోకేశ్ రాజీనామా కోరుతూ నగరిలో మాజీ మంత్రి రోజా భారీ నిరసన
Nagari, Andhra Pradesh:Former Minister RK Roja Protest In Nagari For Nara Lokesh Resign Watch Her Speechయూట్యూబర్లు, పోశమ్మ తల్లి, జగిత్యాల, గాయనీగాయకులు,
Jagtial, Telangana:Youtubers Offers Bonalu To Goddess Posamma In Jagtial Watch VisualsKhelo India Games 2026: హైదరాబాద్లో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026.. తెలంగాణ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు
Hyderabad, Telangana:Govt of Telangana: దేశీయంగా జరిగే ప్రతిష్టాత్మక క్రీడా పోటీలు ఖేలో ఇండియా యూత్ గేమ్స్-2026కు తెలంగాణ ఆతిథ్యం ఇస్తుండగా.. ఈ క్రీడా పోటీలకు భారీ ఏర్పాట్లు చేయడంలో తెలంగాణ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేయనుంది. తెలంగాణ ప్రభుత్వం ఆతిథ్యం ఇవ్వనున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026 పోటీలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ లోని స్టేడియంలలో ప్రస్తుత పరిస్థితిని పరిశీలించి, క్రీడా పోటీలకు అనుగుణంగా శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు
హైదరాబాద్ ఎంసీఆర్ హెఆర్డీలోని బోధి పెవిలియన్లో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఏర్పాట్లు, నిర్వహణపై క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరితోపాటు క్రీడా శాఖ ఉన్నతాధికారులతో మంగళవారం ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఖేలో ఇండియా జాతీయ స్థాయిలో వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున క్రీడాకారులు ఈ పోటీపడుతుండడంతో వాటికి సంబంధించి మౌలిక వసతులను అభివృద్ధి చేయాలని సీఎం సూచించారు. డిసెంబర్లో ఖేల్ ఇండియా పోటీలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
ఖేలో ఇండియా క్రీడా పోటీల సందర్భంగా హైదరాబాద్లోని స్టేడియంలలో ప్రస్తుత పరిస్థితిని పరిశీలించి క్రీడా పోటీలకు అనుగుణంగా శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికార యంత్రాంగానికి ఆదేశించారు. దీనిక అవసరమైన నిధులను అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు. ఖేలో ఇండియా క్రీడా పోటీల ప్రారంభోత్సవ, ముగింపు వేడుకలకు సంబంధించిన ముఖ్య అతిథులు, ప్రముఖ క్రీడాకారులు, సినీ ప్రముఖులను కార్యక్రమాల్లో భాగస్వాములను చేసేందుకు వెంటనే కసరత్తు ప్రారంభించాలని సూచించారు.
ఈ క్రీడా పోటీల సందర్భంగా మౌలిక వసతులు, క్రీడల నిర్వహణ, అతిథులకు కావాల్సిన సౌకర్యాల ఏర్పాట్లకు సంబంధించి పని విభజన చేసుకుని బాధ్యత తీసుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి తెలిపారు. తెలంగాణకు చెందిన అర్జున అవార్డు గ్రహీతలు, తెలంగాణ స్పోర్ట్స్ హబ్ బోర్డు సభ్యులు, ఒలింపిక్స్ అసోసియేషన్తో పాటు జాతీయస్థాయి క్రీడా ప్రతినిధులను ఈ క్రీడా పోటీల్లో భాగస్వాములను చేయాలని సూచించారు. ఖేలో ఇండియా గేమ్స్ కోసం ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో భాగంగా 20 రకాల క్రీడలకు సంబంధించిన పోటీలు నిర్వహించనున్న నేపథ్యంలో క్రీడా విభాగాల వారీగా పోటీ ప్రదేశాలను గుర్తించి ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. క్రీడా స్ఫూర్తిని చాటేలా నిర్వహణ ఉండాలని అధికార యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలు చేశారు.
Tragedy Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ఆటోను ట్యాంకర్ ఢీకొట్టడంతో ఏడుగురు దుర్మరణం
Mallikarjunpally, Telangana:Sangareddy District Accidents: కూలీలతో వెళ్తున్న ఆటోను ట్యాంకర్ ఢీకొట్టడంతో ఘోర ప్రమాదం సంభవించింది. ఈ రోడ్డు ప్రమాదంలో ఏడుగురు కార్మికులు దుర్మరణం పాలయ్యారు. మరికొందరు క్షతగాత్రులయ్యారు. సంగారెడ్డి జిల్లాలో ఈ సంఘటన తీవ్ర విషాదం అలుముకుంది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం సత్వార్ గ్రామం సమీపంలో యూటర్న్ తీసుకుంటున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతులు కర్ణాటక రాష్ట్రం బీదర్ జిల్లా రాజగిరి గ్రామానికి చెందినవారిగా గుర్తించారు.
ఆటోలో డ్రైవర్ సహా మొత్తం 12 మంది కూలీలు ఉన్నారు. ప్రతి రోజు కూలీ పని కోసం జహీరాబాద్ పరిసర ప్రాంతాలకు వస్తుంటారు. గాయాలపాలైన మిగతా వారిని జహీరాబాద్లోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. వారికి వెంటనే వైద్యులు అత్యవసర వైద్యం అందిస్తున్నారు. ట్యాంకర్ కర్ణాటక రాష్ట్రం హుమనాబాద్ నుంచి జహీరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది.
తెలంగాణ సీఎం సంతాపం
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం సత్వార్ గ్రామ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.
మరో ప్రమాదం
సంగారెడ్డి జిల్లాలో మరో రోడ్డు ప్రమాదం సంభవించి ఇద్దరు మృతిచెందారు. మూడు కార్లు ఢీకొనడంతో ఇద్దరు ప్రాణాలు విడవగా.. మరికొందరు గాయపడ్డారు. కోహీర్ మండలం వెంకటాపూర్ కూడలి సమీపంలో జాతీయ రహదారిపై ఓ కారు అదుపు తప్పి అవతలి రోడ్డుపైకి ఎగిరి పడింది. ఆ రోడ్డుపై వెళ్తున్న కారుతోపాటు మరికొన్ని వాహనాలను ఢీకొట్టింది. దీంతో ఇద్దరు దుర్మరణం చెందగా.. కొందరు గాయపడ్డారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను, క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై కొంత వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
కంపెనీలో ప్రమాదం.. ఒకరు మృతి
పటాన్చెరు మండలం రుద్రారం గ్రామంలోని యంఎస్ఎన్ కంపెనీలో ప్రమాదం చోటుచేసుకుంది. కంపెనీ ప్రమాదంలో వెంకటేశ్వర్లు (45) అనే ఉద్యోగి తీవ్ర గాయాలతో మృతిచెందాడు. కొన్ని సంవత్సరాలుగా ఎంఎస్ఎన్ కంపెనీలో రెగ్యులర్ ఎంప్లాయ్గా వెంకటేశ్వర్లు పనిచేస్తుండేవాడు. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం హైదరాబాద్ కంచన్బాగ్లోని డీఆర్డీఓ అపోలో హాస్పిటల్కు తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. ప్రమాదానికి గల పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Hyderabad Metro: హైదరాబాద్ పాతబస్తీ మెట్రో రైలుపై తెలంగాణ సీఎం కీలక నిర్ణయం
Hyderabad, Telangana:Old City Metro Rail: హైదరాబాద్లోని పాతబస్తీ రూపురేఖలు మార్చే మెట్రో రైలు ప్రాజెక్టుపై తెలంగాణ ముఖ్యమంత్రి కీలక నిర్ణయం తీసుకున్నారు. దశాబ్ద కాలంపైగా పెండింగ్లో ఉన్న పాతబస్తీ మెట్రో రైలు ప్రాజెక్టుపై వెంటనే చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ మెట్రో విస్తరణ రెండో దశలో భాగంగా పాతబస్తీ మెట్రో రైల్ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. 7.5 కిలోమీటర్ల మెట్రో విస్తరణ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (హెచ్ఎంఆర్ఎల్)పై మంగళవారం హైదరాబాద్లో ముఖ్యమంత్రి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. పాతబస్తీ మెట్రో నిర్మాణంపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్న అనంరతం ముఖ్యమంత్రి పలు ఆదేశాలిచ్చారు. ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు 7.5 కిలోమీటర్ల మెట్రో విస్తరణ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని.. ఈ కారిడార్లో పనులకు సంబంధించిన టెండర్ ప్రక్రియను ప్రారంభించాలని ఆదేశించారు. పెండింగ్లో ఉన్న భూ సేకరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. హైదరాబాద్ మెట్రోకు పెరుగుతున్న ప్రయాణికుల రద్దీ తీవ్రమవుతుండడంతో అదనపు కోచ్లను జత చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. దీనికి అవసరమైన కోచ్ల కొనుగోలు ప్రక్రియకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట కారిడార్కు సంబంధించి సాంకేతికతపై ఢిల్లీ మెట్రోను సంప్రదించి, అవసరమైన సలహాలు తీసుకోవాలని సూచించారు.
అనంతరం డిసెంబర్లో నిర్వహించనున్న 'ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్'పై ముఖ్యమంత్రి సమీక్ష చేశారు. తెలంగాణలో పెట్టుబడులను మరింతగా ఆకర్షించేలా ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్నామని.. దానికి అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. వ్యాపార రంగంలోని వివిధ సెక్టార్లలో గుర్తింపు పొందిన ప్రముఖులను సమ్మిట్లో సన్మానించేలా కార్యాచరణ రూపొందించాలని.. తెలంగాణలో పెట్టుబడులను ఆకర్షించేలా అంతర్జాతీయ ప్రమాణాలతో సమ్మిట్ ఏర్పాట్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. గతేడాది నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్తో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు.. వాటి పురోగతికి సంబంధించిన పూర్తి వివరాలను నివేదించాలని చెప్పారు. పెట్టుబడుల్లో మరింత పురోగతి సాధించేందుకు అవసరమైన ప్రణాళికలను తయారు చేయాలని ముఖ్యమంత్రి అధికార యంత్రాంగానికి సూచించారు.
KTR: కొండల్ రెడ్డికి భూమి కేటాయింపు అతిపెద్ద కుంభకోణం.. పోరాటం చేస్తాం: కేటీఆర్
Hyderabad, Telangana:Revanth Reddy Brothers: అధికారం ఉంది కదా అని ఇష్టారీతిన భూకేటాయింపులు చేసుకుంటున్నారని.. అప్పనంగా కోట్ల విలువైన భూములు చవకగా పొందుతున్నారని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు. రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డికి రూ.200 కోట్ల విలువైన భూమి రూ.7 కోట్లకు ఎలా కేటాయించని ప్రశ్నించారు. ఇది అతిపెద్ద కుంభకోణం అని.. అనుముల కొండల్ రెడ్డి వ్యవహారంపై పోరాటం చేస్తామని మాజీ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. త్వరలోనే గవర్నర్ను కలిసి ఫిర్యాదు చేస్తామని తెలిపారు.
హైదరాబాద్లోని బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్లో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియా సమావేశం నిర్వహించి కీలక వ్యాఖ్యలు చేశారు. 'తెలంగాణలో టెసరాక్ట్ అనే కంపెనీకి అప్పనంగా భూమి కేటాయించారు. టెసరాక్ట్ కంపెనీకి రేవంత్ సోదరుడు కొండల్ రెడ్డి చైర్మన్. ఆ విషయాన్ని కొండల్ రెడ్డే లింక్డ్ ఇన్ ప్రొఫైల్లో పెట్టుకున్నారు. టెసరాక్ట్ కంపెనీ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పరికరాలను తయారు చేస్తుందట. అమెరికా ఎంబసీ ప్రతినిధితో హైదరాబాద్లో మీటింగ్ కూడా పెట్టారు. యూఎస్ ఇండియా స్ట్రాటెజిక్ డెవలప్మెంట్ ఫోరంలో ఎగ్జిక్యూటివ్ బోర్డులో కొండల్ రెడ్డికి సభ్యత్వం ఇచ్చారు' అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వివరించారు. కొండల్ రెడ్డి ఏం చదివారో నాకు తెలియదని పేర్కొన్నారు.
🚨🕵️♂️ అనుముల బ్రదర్స్ 200 కోట్ల భారీ భూ స్కాం!
అధికారాన్ని అడ్డం పెట్టుకుని..
సొంత తమ్ముడు కొండల్ రెడ్డికి
అత్యంత విలువైన ప్రభుత్వ భూమిని
కట్టబెట్టిన రేవంత్ రెడ్డి.#SCAMgress #CongressLootingTelangana pic.twitter.com/Q1NmMCs9M2— BRS Party (@BRSparty) August 11, 2026
టెసరాక్ట్ కంపెనీకి కొండల్ రెడ్డి చైర్మన్ అని అమెరికా కాన్సులేట్ కూడా స్టేట్మెంట్ ఇచ్చింది. చదువురాని రేవంత్ బ్రదర్స్ అందరూ సూట్లు కోట్లు వేసుకుని చైర్మన్లు అయిపోతున్నారు. టెసరాక్ట్ కంపెనీ కథ ఏమిటని మేం ఆరా తీశాం. ఆ కంపెనీ ఫోన్ నంబర్ 123456789. ఇలాంటి నంబర్లు ఉంటాయని మాకు తెలియదు. రేవంత్ ఏదైనా కొత్త టెక్నాలజీ కనిపెట్టిండేమో?' అని మాజీ మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. విచిత్రం ఏంటంటే టెసరాక్ట్ కంపెనీలో ఒక్క ఉద్యోగి కూడా లేడని చెప్పారు.
'2025 మార్చి 31 నాడు వాళ్లే ప్రకటన చేశారు. తమ కంపెనీలో ఒక్క ఉద్యోగి కూడా లేడని చెప్పారు. ఊరూ పేరు లేని చోట ఆ కంపెనీ అడ్రస్ ఉంది. టెసరాక్ట్ మూలధనం లక్ష రూపాయలు. ఈ కంపెనీకి రేవంత్ ప్రభుత్వం రూ.200 కోట్ల విలువైన భూమి కట్టబెట్టింది. ఐదెకరాల భూమిని కేటాయించి, అతిపెద్ద కుంభకోణానికి పాల్పడ్డారు. ఇది అనుముల కొండల్ రెడ్డి వ్యవహారం' అని కేటీఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు.
రేవంత్ రెడ్డి కుటుంబం నడుపుతున్న పాలనే ప్రజా పాలనా?
తిరుపతి రెడ్డికి ఏ అధికారం లేకపోయినా.. కలెక్టర్, ఎస్పీల సమక్షంలో కొడంగల్లో ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు.
రేవంత్ అల్లుడి కోసం, ఆయన పార్ట్నర్గా ఉన్న కంపెనీ కోసం, కొడంగల్లోని లగచర్లలో గిరిజనుల భూములను… pic.twitter.com/3j6ZkBYCht
— BRS Party (@BRSparty) August 11, 2026
అనుముల జగదీష్ రెడ్డి అని రేవంత్ రెడ్డికి ఇంకో తమ్ముడు ఉన్నాడు. జగదీష్ రెడ్డి అమెరికాలో ఉంటాడు. రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు పోయినప్పుడు రూ.వెయ్యి కోట్ల డీల్ చేసుకున్నారు. స్వచ్ఛ్ బయో అనే కంపెనీతో ఒక మెమోరాండం సైన్ చేశారు. వాళ్లకు ఎక్కడ భూములు ఇచ్చారో తవ్వి తీస్తాం. రేవంత్ బామ్మర్ది సృజన్ రెడ్డికి రూ.1,137 కోట్ల అమృత్ కాంట్రాక్టు దక్కింది. రేవంత్ రెడ్డి, మోదీ ప్రభుత్వం కలిసి నడుపుతున్న సింగరేణిలో.. సృజన్ రెడ్డి కనుసన్నల్లోనే అంతా నడుస్తోంది. సైట్ విజిటేషన్ సర్టిఫికెట్లు, వేల కోట్ల కుంభకోణాలు అన్నీ బయటపెట్టాం' అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వివరించారు.
'ఈ పరంపరలో మేం బయటపెట్టిన తాజా కుంభకోణమే టెసరాక్ట్. వడ్డించే వాడే మనోడే అన్నట్టు భూములు కొట్టేశారు. రూ.200 కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాన్ని రూ.7 కోట్లకు రాసిచ్చారు. ఇది కుంభకోణం కాదా? పక్క రాష్ట్రం కర్ణాటకలో ఒక న్యాయం, ఇక్కడ ఒక న్యాయమా?' అని మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. టెసరాక్ట్ కథేంటో తేల్చేదాకా వదిలిపెట్టమని స్పష్టం చేశారు. 'ఆ కంపెనీకి, రేవంత్ రెడ్డి సోదరుడికి ఏ సంబంధం లేదని శ్రీధర్ బాబు అంటున్నడు. చైర్మన్ అనుముల కొండల్ రెడ్డి అని వాళ్లే ప్రొఫైల్లో రాసుకున్నారు. కానీ మంత్రి శ్రీధర్ బాబు సిగ్గులేకుండా బుకాయిస్తున్నారు. అసలు ఇవన్నీ మంత్రికి తెలిసి జరుగుతున్నాయా?' అని కేటీఆర్ సందేహం వ్యక్తం చేశారు.
చదువూ సంధ్యా లేని అనుముల అన్నదమ్ములు..
కోట్లు, సూట్లు వేసుకుని కొత్త దందాలకు తెరలేపారు.అనుముల కొండల్ రెడ్డి చైర్మన్గా ఉన్న 'టెసారాక్ట్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్' అనే దొంగ కంపెనీకి,
రూ. 200 కోట్ల విలువైన భూమిని అతి చౌకగా రేవంత్ రెడ్డి దోచిపెట్టాడు.ఆ కంపెనీకి ఊరూ పేరూ లేదు,… pic.twitter.com/d4LkIEn6v1
— BRS Party (@BRSparty) August 11, 2026
మీ శాఖలో ఏం జరుగుతుందో మీకు తెలుస్తుందా శ్రీధర్ బాబు అని మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. ఈ భూకేటాయింపుల కుంభకోణంలో ఎవరినీ వదిలిపెట్టమని హెచ్చరించారు. ముఖ్యమంత్రి సోదరులైతే ఏమైనా చేయొచ్చా? అని రేవంత్ రెడ్డి సోదరులపై మండిపడ్డారు. రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డికి ఏ అధికారిక హోదా ఉందని నిలదీశారు. ఎందుకు అతడికి కలెక్టర్లు, ఎస్పీలు వంగివంగి దండాలు పెడుతున్నారని ప్రశ్నించారు.
Tirumala: తిరుమలలో నిర్మాత నాగవంశీ, దర్శకుడు మురళీ కిశోర్
Dharmavaram, Andhra Pradesh:Film Producer Naga Vamsi And Director Murali Kishore Abburu Visits Tirumala TempleAbishek Porel: ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ క్రికెటర్ అభిషేక్ పరేల్ అరెస్ట్.. ఎందుకో తెలుసా?
Kolkata, West Bengal:Abishek Porel Arrest: పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడనే ఆరోపణలపై ఐపీఎల్ ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ ఆటగాడు అభిషేక్ పరేల్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అత్యాచారం, క్రిమినల్ బెదిరింపులు, దాడి తదితర తీవ్రమైన ఆరోపణలు ఓ యువతి చేయగా.. అతడిపై పోలీసులకు ఓ వైద్య విద్యార్థిని ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. అయితే హైకోర్టులో ఈ కేసుపై విచారణ జరగ్గా అభిషేక్ను అరెస్ట్ చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. న్యాయస్థానం ఆదేశాలతో యువ క్రికెటర్ అభిషేక్ పరేల్ను అరెస్ట్ చేయడం క్రికెట్ రంగంలో కలకలం రేపుతోంది.
ఏం జరిగింది..?
అభిషేక్ పరేల్ తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి లైంగిక సంబంధం ఏర్పరచుకున్నాడని.. తర్వాత బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఓ మెడికల్ విద్యార్థిని డమ్ డమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. జూన్లో వైద్య విద్యార్థిని ఫిర్యాదు మేరకు అభిషేక్పై క్రిమినల్ కేసు నమోదైంది. అత్యాచారం, క్రిమినల్ బెదిరింపులు, దాడి తదితర తీవ్రమైన ఆరోపణలు ఆ యువతి చేసింది. అభిషేక్తో తనకు మూడేళ్లు తాను సంబంధం కొనసాగిస్తున్నట్లు.. గతేడాది నుంచి ఇద్దరి మధ్య విభేదాలు మొదలయ్యాయని ఆ యువతి ఆరోపణలు చేసింది.
Indian cricketer and Delhi Capitals wicketkeeper-batter Abishek Porel arrested on Tuesday in connection with a case involving allegations of sexual relations on the promise of marriage. pic.twitter.com/AJs6qD7KdK
— Taanusree Bose তণুশ্রী বোস (@tanvibose) August 11, 2026
అనంతరం కేసులో పోరెల్ను అరెస్ట్ చేయాలని కోల్కతా హైకోర్టు పోలీసులను ఆదేశించింది. దీంతో ఎమామి సిటీలో పోలీసులు అభిషేక్ను అరెస్టు చేసినట్లు హుగ్లీ రూరల్ పోలీస్ ఎస్పీ కున్వర్ భూషణ్ సింగ్ ప్రకటించారు.
Pawan Kalyan Govinda Namalu: గోవింద నామాలతో వైసీపీ నేతలు పేరడీలు..ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహం!
Nellore, Andhra Pradesh:Pawan Kalyan Govinda Namalu News: తిరుమల శ్రీవారిని భక్తిశ్రద్ధలతో కొలుస్తూ ఆలపించే పవిత్ర దైవ నామాలు, భక్తి గీతాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) నేతలు పేరడీలుగా మలచి ఆలపించడంపై జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్రంగా మండిపడ్డారు. నెల్లూరులో ఇటీవల నిర్వహించిన ఒక నిరసన కార్యక్రమంలో వైకాపా నేతలు వ్యవహరించిన తీరు ధార్మిక విశ్వాసాలను కించపరిచేలా ఉందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ మేరకు జనసేన పార్టీ అధికారిక 'ఎక్స్'(ట్విట్టర్) వేదికగా ఈ విషయాలను వెల్లడించింది. ఈ ఘటనపై తగిన చట్టపరమైన చర్యలతో ముందుకు వెళ్లాలని పార్టీ శ్రేణులకు ఆయన దిశానిర్దేశం చేసినట్లు పార్టీ పేర్కొంది.
భక్తుల మనోభావాలను దెబ్బతీసే కుట్ర: పవన్ కల్యాణ్
ఈ సందర్భంగా వైకాపా నేతల తీరును తప్పుపడుతూ పవన్ కల్యాణ్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కని పార్టీ, కేవలం రాజకీయ లబ్ధి కోసం పవిత్రమైన గోవింద నామాలను పేరడీలుగా మలచడం అత్యంత దురదృష్టకరమని ఆయన పేర్కొన్నారు.
ఇది కోట్ల మంది భక్తుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచేలా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆ కార్యక్రమంలో పాల్గొన్నవారు వ్యవహరించిన తీరు పూర్తిగా మత విద్వేషాలను రెచ్చగొట్టేలా, కుట్రపూరిత ఆలోచనలతో కూడినదిగా ఉందని ఆయన ధ్వజమెత్తారు.
చట్టపరమైన చర్యలకు ఆదేశం
సమాజంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా, ధార్మిక విశ్వాసాలను అపహాస్యం పాలుజేసే సంస్కృతిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించకూడదని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. దైవ నామాలు, భక్తి కీర్తనలను కేవలం రాజకీయ విమర్శల కోసం, అపహాస్యం కోసం వాడుకునే విధానాన్ని ప్రతి ఒక్కరూ విడనాడాలని ఆయన హితవు పలికారు.
ఈ ఘటనకు బాధ్యులైన వారిపై నిబంధనల ప్రకారం చట్టపరంగా తగిన చర్యలు తీసుకోవాలని పార్టీ నేతలను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అప్రమత్తం చేశారు. హిందూ ధర్మం, భక్తుల మనోభావాల పరిరక్షణకు జనసేన పార్టీ ఎప్పుడూ ముందుంటుందని స్పష్టం చేస్తూ, ఈ వివాదం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Also Read: ఏపీ EAPCET 2026 సీట్ అలాట్మెంట్ విడుదల..ఆగస్టు 15లోపు ఈ పని చేయకపోతే సీటు రద్దు!
Also REad: యూపీఐ లావాదేవీలపై భారీగా ఛార్జీలు?! అదనపు ఛార్జీలపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
స్కూల్ ఫీజుల పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. 5శాతం మాత్రమే పెంచేందుకు బిల్లు ఆమోదం..!!
Lakshmapur, Telangana:School Fees: పాఠశాల ఫీజుల పెంపునకు సంబంధించి పంజాబ్ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాల ఫీజులను కేవలం 5శాతం మాత్రమే పెంచడానికి అనుమతించిన బిల్లును రాష్ట్ర అసెంబ్లీ సోమవారం ఏకగ్రీవకంగా ఆమోదించింది. 'పంజాబ్ రెగ్యులేషన్ ఆఫ్ ఫీస్ ఆఫ్ అన్ఎయిడెడ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ (సవరణ) బిల్లు, 2026'కు సోమవారం ఆమోదం తెలిపింది. ఈ బిల్లు ప్రకారం, రాష్ట్రంలోని అన్ఎయిడెడ్ పాఠశాలలు, ఇతర విద్యాసంస్థలు ప్రతి సంవత్సరం ఫీజులను 5శాతం కంటే ఎక్కువగా పెంచకూడదు.
ప్రస్తుతం పంజాబ్ లో వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సందర్బంగా బిల్లును రాష్ట్ర విద్యాశాఖ మంత్రి హర్జోత్ సింగ్ బెయిన్స్ లో సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ఏకగ్రీవకంగా ఆమోదం పొందింది. రాష్ట్రంలోని ప్రైవేట్ పాఠశాలలు ప్రతి ఏడాది 5శాతం మాత్రమే ఫీజులు పెంచాలి. దీంతో ప్రైవేట్ స్కూల్స్ లో చదువుకునే విద్యార్థుల తల్లిదండ్రులకు భారీగా ఉపశమనం లబిస్తుందని ముఖ్యమంత్రి భగవంత్ మన్ అన్నారు. ఈ నిర్ణయం అన్ని రకాల ఫీజులకు వర్తిస్తుంది. ట్యూషన్ ఫీజులు, అభివృద్ధి ఫీజులు, వార్షిక రుసుములు, యాక్టివిటీ ఛార్జీలు, స్మార్ట్ క్లాస్ ఫీజులు, టెక్నాలజీ ఛార్జీలు, రవాణా ఛార్జీలు, ల్యాబ్ ఫీజులు, లైబ్రరీ ఫీజులు, పరీక్షల ఛార్జీలు మొదలైనవాటిని కేవలం ఐదు శాతం మాత్రమే పెంచాలి.
ఇతర ఫీజులు వసూలు చేసినట్లయితే, వాటిని ఐదు శాతానికి మించి పెంచకూడదు. ప్రస్తుతం పంజాబ్లో 7,800 వరకు ప్రైవేట్ పాఠశాలలు ఉండగా, వాటిలో 32 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ప్రతి సంవత్సరం, విద్యా సంస్థలు తమ ఇష్టానుసారం ఫీజులను పెంచుతున్నాయి. దీనివల్ల తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. భారీ ఫీజుల నుంచి తల్లిదండ్రులను విముక్తి చేసేందుకు ఈ బిల్లును ప్రభుత్వం రూపొందించింది. ఒకవేళ అదనపు ఫీజులు వసూలు చేసినా.. వాటిని యాజమాన్యం నుండి తిరిగి రాబట్టడం జరుగుతుంది. ఈ నిర్ణయం ప్రకారం, మూడేళ్ల కాలంలో ఫీజులు 15 శాతానికి మించి పెరగకూడదు.
Also Read:ఎస్బీఐలో 1,538 ఉద్యోగాలు.. డిగ్రీ అర్హతతో భారీ నోటిఫికేషన్.. దరఖాస్తు వివరాలు ఇవే..!!
Also Read:ఏమిటీ 'సావోజీ మటన్'? ఒకే ఒక్క కామెంట్తో రగిలిన వివాదం.. మహారాష్ట్రలో ఎందుకీ తీవ్ర దుమారం..?
Also Read: రోజూ ఈ గింజలు తింటే కిలో మటన్ తినంత బలం..!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Kamakshi Bhaskarla: స్టేజ్పై వెక్కివెక్కి ఏడ్చిన హీరోయిన్ కామాక్షి..
Hyderabad, Telangana:Kamakshi Bhaskarla Graveyard: సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లకు కొరతే లేదు. మరీ ముఖ్యంగా టాలీవుడ్కు వచ్చే హీరోయిన్ల సంఖ్య నానాటికి పెరుగుతోంది. చేసిన సినిమాలు కొన్నే అయినా స్టార్ హీరోయిన్ రేంజ్లో క్రేజ్ తెచ్చుకుంటున్నారు. అలాంటి కోవలోనే ఈ హీరోయిన్ కూడా ఉంది. ఆ హీరోయిన్ పేరు కామాక్షి భాస్కర్ల. ఆమె ప్రధానపాత్రలో నటించిన 'అగథ' చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ ప్రమోషన్ ఈవెంట్లో నటి కామాక్షి కంటతడి పెట్టుకుంది.కేంద్రానికి పసిడి పంట.. బంగారంపై దిగుమతి సుంకం పెంపు.. కేంద్రానికి రూ.10,463 కోట్ల ఆదాయం..!!
Lakshmapur, Telangana:Gold: మన దేశంలో ఏడాది పొడవునా బంగారం కొనుగోళ్లు కొనసాగుతాయి. అయితే, పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా, భారతదేశం తన విదేశీ మారక నిల్వలను గణనీయంగా తగ్గించుకోవలసి వచ్చింది. ఫలితంగా, బంగారం, వెండి కొనుగోళ్లను నియంత్రించేందుకు, భారతదేశం ఈ విలువైన లోహాలపై దిగుమతి సుంకాన్ని గణనీయంగా పెంచింది. ఈ సుంకాల పెంపు ద్వారా కేంద్ర ప్రభుత్వానికి గణనీయమైన ఆదాయం సమకూరింది. మే 13వ తేదీ నుంచి ఆగస్టు 2వ తేదీ మధ్య కాలానికి, బంగారం, వెండి, ప్లాటినం వంటి లోహాలపై కస్టమ్స్ సుంకంగా రూ.10,463 కోట్లు వసూలు అయినట్లు పార్లమెంటుకు తెలియజేశారు. దీనికి సంబంధించిన ఒక ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు.
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు, హోర్ముజ్ జలసంధి మూసివేత కారణంగా ముడి చమురు ధరలు విపరీతంగా పెరిగాయి. ఆహార, ఎరువుల ధరలు కూడా పెరిగాయి. పర్యవసానంగా, విదేశీ మారక నిల్వలను పరిరక్షించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. బంగారం, వెండిపై కస్టమ్స్ సుంకాలను పెంచడం ఈ చర్యలలో ఒకటి. ఈ లోహాలపై దిగుమతి సుంకాలను పెంచడం ద్వారా దిగుమతుల కొనుగోళ్లను తగ్గించడమే ప్రభుత్వ వ్యూహం. దీనిలో భాగంగా, మే 13న, బంగారం, వెండిపై 6శాతంగా ఉన్న కస్టమ్స్ సుంకాన్ని 15శాతానికి పెంచారు. ప్లాటినంపై 6.4శాతంగా ఉన్న సుంకాన్ని 15.4శాతానికి పెంచారు.
బంగారం, వెండి దిగుమతులపై సుంకాలను పెంచడం ద్వారా ప్రభుత్వం గణనీయమైన ఆదాయాన్ని సమకూర్చుకుంది. మే 13 నుంచి ఆగస్టు 2 మధ్య, బంగారంపై సుంకంగా రూ.10,040 కోట్లు, వెండిపై రూ.328 కోట్లు, ప్లాటినంపై రూ.95 కోట్లు వసూలు అయ్యాయి. ఈ మూడు లోహాల ద్వారా వచ్చిన మొత్తం ఆదాయం రూ.10,463 కోట్లు అని కేంద్ర మంత్రి తెలిపారు. అయితే, పెంచిన సుంకం ద్వారా వచ్చిన అదనపు ఆదాయాన్ని మాత్రం వెల్లడించలేదు. మే 13 నుంచి జూన్ 30 మధ్య 161 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. బంగారం, వెండి స్మగ్లింగ్కు పాల్పడినందుకు 116 మందిని అరెస్టు చేసినట్లు ఆయన తెలిపారు. బంగారం, వెండి దిగుమతులను నియంత్రించి, కరెంట్ ఖాతా లోటును సమతుల్యం చేసేందుకే సుంకాలు పెంచినట్లు తెలుస్తోంది. దీని ద్వారా కేంద్ర ప్రభుత్వం గణనీయమైన ఆదాయాన్ని ఆర్జించింది.
ఆగస్టు 10న హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 380 తగ్గి, రూ. 1,51,970కి చేరింది. 22 క్యారెట్ల బంగారం ధర రూ. 350 తగ్గి రూ.1,39,300కి చేరింది.
Also Read:ఎస్బీఐలో 1,538 ఉద్యోగాలు.. డిగ్రీ అర్హతతో భారీ నోటిఫికేషన్.. దరఖాస్తు వివరాలు ఇవే..!!
Also Read:ఏమిటీ 'సావోజీ మటన్'? ఒకే ఒక్క కామెంట్తో రగిలిన వివాదం.. మహారాష్ట్రలో ఎందుకీ తీవ్ర దుమారం..?
Also Read: రోజూ ఈ గింజలు తింటే కిలో మటన్ తినంత బలం..!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Hardik Pandya Trade: ముంబై ఇండియన్స్ కెప్టెన్గా హార్దిక్ పాండ్యా కొనసాగింపు! ఐపీఎల్ ట్రేడింగ్లో షాకింగ్ నిర్ణయం!
Hyderabad, Telangana:Hardik Pandya Trade 2027: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో ముంబై ఇండియన్స్ (MI) కెప్టెన్ హార్దిక్ పాండ్యా భవిష్యత్తుపై గత కొంతకాలంగా గందరగోళం కొనసాగుతోంది. ముంబై ఫ్రాంచైజీని పాండ్యా వీడనున్నాడని సమాచారం అందుతున్న నేపథ్యంలో కోల్కతా నైట్ రైడర్స్ (KKR) లేదా చెన్నై సూపర్ కింగ్స్ (CSK)లోకి మారనున్నాడని ప్రచారం సాగుతోంది. అయితే, 'క్రిక్బజ్' నివేదిక ప్రకారం ముంబై ఇండియన్స్ అతన్ని వేరే జట్టుకు బదిలీ చేసే అవకాశం లేదని తెలుస్తోంది.
కోల్కతా, చెన్నై ఫ్రాంఛైజీలతో చర్చలు!
గత కొన్ని వారాలుగా హార్దిక్ పాండ్యా కోసం కోల్కతా నైట్రైడర్స్, చెన్నై సూపర్కింగ్స్ జట్లు పోటీ పడుతున్నాయని విపరీతంగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో లక్నో సూపర్ జెయింట్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల పేర్లు కూడా ప్రచారంలోకి వచ్చాయి. అయితే ఇవన్నీ కేవలం ఊహాగానాలు మాత్రమేనని తేలింది.
మూడుసార్లు ఛాంపియన్గా నిలిచిన కోల్కతా జట్టు హార్దిక్పై ఆసక్తి చూపుతున్నప్పటికీ, తమ కీలక ఆటగాళ్లను వదులుకోవడానికి సిద్ధంగా లేదు. మరోవైపు, తమ జట్టు కోచ్ నియామకం పూర్తయిన తర్వాతే తదుపరి నిర్ణయాలు తీసుకుంటామని చెన్నై సూపర్కింగ్స్ సీఈఓ కాశీ విశ్వనాథన్ క్లారిటీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో కోల్కతా, చెన్నై టీమ్స్తో జరుగుతున్న ప్రాథమిక దశలోనే ఉన్నట్లు తెలుస్తోంది.
ముంబై ఇండియన్స్ ప్రదర్శన-హార్దిక్ గణాంకాలు
2024లో ముంబై ఇండియన్స్ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన హార్దిక్ కెప్టెన్సీ జట్టుకు పెద్దగా కలిసిరాలేదు. ఐదుసార్లు ఛాంపియన్గా నిలిచిన ముంబై జట్టు, 2024లో చివరి స్థానంలో నిలవగా, 2026 సీజన్లో తొమ్మిదవ స్థానానికి పరిమితమైంది. కేవలం 2025లో మాత్రమే జట్టు 'క్వాలిఫైయర్ 2' వరకు వెళ్లగలిగింది.
ఇక వ్యక్తిగత ప్రదర్శన విషయానికి వస్తే, 2024 నుంచి హార్దిక్ ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేదు. ప్రతి సీజన్లోనూ అతను 25 కంటే తక్కువ సగటుతో 225 పరుగుల కంటే తక్కువే చేశాడు. అలాగే అతని స్ట్రైక్ రేట్ కూడా 150 లోపే ఉంది. బౌలింగ్ పరంగా మాత్రం అతను మొత్తంగా 29 వికెట్లు పడగొట్టగలిగాడు.
ఫిట్నెస్పై దృష్టి
2026 IPL సీజన్ ముగిసిన తర్వాత ఆటకు దూరంగా ఉన్న హార్దిక్ పాండ్యా, ప్రస్తుతం బెంగళూరులోని 'సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్' (CoE)లో శిక్షణ పొందుతున్నాడు. తన పూర్తి ఫిట్నెస్ను సాధించే దిశగా ఆయన వేగంగా అడుగులు వేస్తున్నారు. ఏదేమైనప్పటికీ, రాబోయే సీజన్లో హార్దిక్ ముంబై ఇండియన్స్ జట్టులోనే కొనసాగుతాడా లేదా అన్నదానిపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
Also Read: క్రికెట్ ప్రపంచకప్ 2027 రేసు నుంచి ఆ రెండు టీమ్స్ ఔట్?! టీమ్ఇండియా పరిస్థితి ఏంటంటే?
Also Read: యశస్వి జైస్వాల్తో స్టార్ హీరోయిన్ డేటింగ్ రూమర్స్..స్పందించిన మృణాల్ ఠాకూర్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Telangana SIR Last Date: 80 లక్షల ఓట్లు తొలగింపు..తెలంగాణలో ఆ పార్టీకి కొత్త టెన్షన్!
Hyderabad, Telangana:Telangana SIR Voter List: తెలంగాణలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల సవరణ (SIR) ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఓట్ల తొలగింపు, ముసాయిదా జాబితా విడుదల అంశాలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించని కారణంగా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 74 లక్షల ఓట్లు తొలగిపోయే ప్రమాదం ఏర్పడినట్లు తెలుస్తోంది. ఒక్క హైదరాబాద్ ఉమ్మడి జిల్లా పరిధిలోనే దాదాపు 43 లక్షల వరకు ఓట్లు గల్లంతయ్యే అవకాశం ఉందనే అంచనాలు వెలువడుతున్నాయి.AP EAPCET 2026: ఏపీ EAPCET 2026 సీట్ అలాట్మెంట్ విడుదల..ఆగస్టు 15లోపు ఈ పని చేయకపోతే సీటు రద్దు అవుతుంది!
Vijayawada, Andhra Pradesh:AP EAPCET 2026 Seat Allotment: ఆంధ్రప్రదేశ్లో EAPCET 2026 (ఎంసెట్) కౌన్సెలింగ్కు సంబంధించిన తొలి దశ సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. ఈ మేరకు అధికారులు ఫలితాలను విడుదల చేశారు. కౌన్సెలింగ్లో పాల్గొన్న అభ్యర్థులు అధికారిక AP EAPCET Website ద్వారా తమ అలాట్మెంట్ వివరాలను సులభంగా చెక్ చేసుకోవచ్చు. మెరిట్ ర్యాంక్, వెబ్ ఆప్షన్లు, రిజర్వేషన్ నిబంధనల ఆధారంగా ఈ సీట్లు కేటాయించబడ్డాయి.
సీట్లు పొందిన విద్యార్థులు నిర్దేశిత గడువులోగా తగిన ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులు స్పష్టం చేశారు. విద్యార్థులు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్తో పాటు కేటాయించిన కాలేజీలో నేరుగా ఫిజికల్ రిపోర్టింగ్ చేయడం తప్పనిసరి. ఈ రిపోర్టింగ్ ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలను అభ్యర్థులు AP SCHE Portal ద్వారా తెలుసుకోవచ్చు.
ఫలితాలు చెక్ చేసుకునే విధానం..
1) ముందుగా అధికారిక AP EAPCET Website ఓపెన్ చేయాలి.
2) హోమ్పేజీలో ఉండే 'Candidate Login' ఆప్షన్ను ఎంచుకోవాలి.
3) లాగిన్ వివరాలు నమోదు చేసి సబ్మిట్ చేయాలి.
4) స్క్రీన్పై కనిపించే సీట్ల కేటాయింపు ఫలితాన్ని పరిశీలించి, అలాట్మెంట్ ఆర్డర్ను డౌన్లోడ్ చేసుకోవాలి.
ముఖ్యమైన తేదీలు, నిబంధనలు..
సీటు పొందిన అభ్యర్థులు ఆన్లైన్, ఫిజికల్ రిపోర్టింగ్లను పూర్తి చేయాలి. ఈ ప్రక్రియకు సంబంధించి విద్యార్థులు Andhra Pradesh State Council of Higher Education సూచనలను పాటించవలసి ఉంటుంది. ఒకవేళ గడువులోగా ఈ రెండు విధానాలను పూర్తి చేయకపోతే కేటాయించిన సీటు రద్దు కానుంది. అంతేకాకుండా, తదుపరి విడత కౌన్సెలింగ్లో పాల్గొనే అవకాశం కూడా కోల్పోవాల్సి వస్తుంది.
తొలి దశలో సీట్లు సాధించిన విద్యార్థులకు తరగతులు ప్రారంభమయ్యాయి. కాబట్టి విద్యార్థులు ఎలాంటి ఆలస్యం చేయకుండా వెంటనే రిపోర్టింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులు సూచిస్తున్నారు. పరీక్షల నిర్వహణ, కౌన్సెలింగ్, ఇతర అధికారిక సమాచారం కోసం విద్యార్థులు ఎల్లప్పుడూ AP EAPCET Official Portalను మాత్రమే సందర్శించాలి. సోషల్ మీడియాలో వచ్చే అనధికారిక వదంతులను నమ్మవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.
Also Read: Srisailam Dam Gates: కృష్ణానదికి పోటెత్తిన వరదనీరు..శ్రీశైలం డ్యామ్ గేట్లు ఎత్తివేత!
Also Read: మహిళా ఎస్సైపై దురుసు ప్రవర్తన..ఆముదాలవలస వైసీపీ నేత చింతాడ రవికుమార్ అరెస్ట్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
