వాల్టా చట్టం ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలి
Bellampalle, Telangana:మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం పెద్దనపల్లి శివారు పరిధిలో ఒక ధార్మిక సంస్థ ఆధ్వర్యంలో ప్రకృతి సిద్ధంగా ప్రవహిస్తున్న వాగుపై కాంక్రీట్ సహాయంతో పర్మినెంట్ వంతెన నిర్మించడాన్ని నిరసిస్తూ బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు కోడి రమేష్ ఆధ్వర్యంలో శనివారం ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం అధికారుల అనుమతి లేకుండా వాల్టా చట్టం ఉల్లంఘించి వంతెన నిర్మించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఆర్డీఓ కు వినతిపత్రం అందజేశారు.हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
116 ఏళ్ల బామ్మకు టీటీడీ బంపరాఫర్.. రేపు తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనం
Tirupati Urban, Andhra Pradesh:116 Old Years Devotee In Tirumala: కలియుగ వైకుంఠవాసుడు కొలువుదీరిన ఏడుకొండలను ఎక్కడం అంటే ఆ శ్రీవారి కరుణాకటక్షం ఉంటేనే సాధ్యం. యుక్త వయస్సు వారే అలసి సొలసి తిరుమల మెట్లు ఎక్కుతుంటారు. అలాంటి వందేళ్లు పైబడిన ఓ భక్తురాలు తిరుమల మెట్లు ఎక్కడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఆమె అచంచల భక్తి, దేవుడిపై ఉన్న నమ్మకంతోనే 116 ఏళ్ల బామ్మ తిరుమల మెట్లు ఎక్కారని అందరూ పేర్కొంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న తిరుమల తిరుపతి దేవస్థానం బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఆ పెద్దావిడను రేపు వీఐపీ బ్రేక్ దర్శనం కల్పిస్తామని టీటీడీ ప్రకటించింది.
తిరుమలలో హౌస్ కీపింగ్ సిబ్బంది నిజాయితీ
Dharmavaram, Andhra Pradesh:Gold Ornaments Return To Tirumala Devotee House Keeping Staff Honesty Watch Videoమజ్లిస్ అంటే భయమా? ప్రేమా? రేవంత్ రెడ్డిపై నిప్పులు కక్కిన కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి
Hyderabad, Telangana:Fatima College Building Issue: బరితెగించి మాట్లాడుతున్న మజ్లిస్పై ఎలాంటి చర్యలు తీసుకోరా? అని రేవంత్ రెడ్డిని కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి నిలదీశారు. కాంగ్రెస్ అండతోనే ఒవైసీ బరితెగించి మాట్లాడుతున్నారని ఆరోపించారు. 'హైకోర్టునే బెదిరించేలా ఒవైసీ మాట్లాడుతున్నారు. అడ్డగోలు తప్పులు చేస్తూ హైకోర్టునే ప్రశ్నిస్తారా? కోర్టులు, చట్టాలంటే ఎంఐఎంకు గౌరవం లేదు. ఫాతిమా విద్యా సంస్థలపై ప్రభుత్వం నోరెందుకు మెదపడం లేదు?' అని రేవంత్ రెడ్డిని కేంద్ర మంత్రులు ప్రశ్నించారు.
'హైకోర్టు ప్రశ్నలకు వివరణ ఇవ్వకుండా జాప్యమెందుకు చేస్తున్నారు . చెరువును ఆక్రమించుకుని విద్యా సంస్థలను నిర్మించడమే తప్పు. గండిపేటలో ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న విద్యా సంస్థలను కూల్చేస్తామంటూ నోటీసుల మీద నోటీసులిస్తున్నారు. ఒవైసీ ఆధ్వర్యంలోని ఫాతిమా విద్యా సంస్థల జోలికి ఎందుకు వెళ్లడం లేదు? ఒవైసీకి ఒక న్యాయం... ఇతరులకు ఇంకో న్యాయమా? ఒవైసీ విద్యా సంస్థ మిలిటెంట్లకు షెల్టర్ ఇచ్చింది నిజం కాదా? విద్యార్థులకు చదువు ముసుగులో మిలిటెంట్లను తయారు చేస్తున్నారా?' అని మజ్లిస్తోపాటు రేవంత్ రెడ్డిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర స్థాయిలో ప్రశ్నించారు. 'బీజేపీ అధికారంలోకి వస్తే ఫాతిమా సంస్థలను కూల్చివేస్తాం. అక్రమార్కులకు, అవినీతిపరులకు భయమంటే ఏమిటో చూపిస్తాం. ఆ విద్యా సంస్థల్లో చదువుకుంటున్న విద్యార్థులకు ప్రత్యామ్నాయం చూపిస్తాం' అని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ హెచ్చరించారు.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్
'మజ్లిస్ అంటే భయమా? ప్రేమా? లేక రెండూ ఉన్నాయా? భూములు, రియల్ ఎస్టేట్ వ్యవహారాల్లో కమీషన్ల కోసం ఆరాటపడుతున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. ఇందుకోసం సామాన్య ప్రజల జీవనోపాధిని బలిచేస్తోంది. అదే సమయంలో మజ్లిస్ పార్టీని కాపాడేందుకు ఎంత దూరమైనా వెళ్లేందుకు వెనుకాడటం లేదు' అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. 'రేవంత్ సర్కార్.. సెలక్టివ్ గవర్నెన్స్ (పక్షపాత పాలన)కు హైడ్రా ఓ ఉదాహరణ. సామాన్య ప్రజల విషయంలో మాత్రం వేగంగా నిర్ణయాలు తీసుకుంటూ, కఠినంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వం సల్కం చెరువు ఎఫ్టీఎల్, బఫర్ జోన్లో ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బారిష్టర్ ఫాతిమా ఓవైసీ ఎడ్యుకేషనల్ క్యాంపస్ విషయంలో మాత్రం మౌనంగా ఉంటూ.. మీనమేషాలు లెక్కిస్తోంది' అని రేవంత్ రెడ్డిపై కేంద్ర మంత్రి కిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
'తెలంగాణ హైకోర్టు పలుమార్లు జోక్యం చేసుకుని.. ప్రభుత్వ జాప్యంపై చీవాట్లు పెట్టినా ప్రభుత్వ తీరులో మార్పులేదు. హైడ్రా, విద్యాశాఖ సహా పలు శాఖల నుంచి వివరాలు కోరినా.. సామాన్య ప్రజల విషయంలో చూపే తొందరపాటును.. ఫాతిమా కాలేజ్ వ్యవహారంలో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం చూపించలేదు' అని కాంగ్రెస్ ప్రభుత్వ తీరును కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎండగట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం మజ్లిస్ పార్టీని యావత్ ముస్లిం సమాజానికి ప్రతినిధిగా భావిస్తున్నట్లుగా వ్యవహరిస్తోందని విమర్శించారు. తమ మిత్రుడైన ఒవైసీకి ఇబ్బంది కలగకూడదన్నట్లు.. మజ్లిస్ ప్రయోజనాలకు కాపాడేలా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నాడని కిషన్ రెడ్డి తెలిపారు.
'మతపరమైన, ఓటు బ్యాంకు రాజకీయాలను చేయడం రేవంత్ రెడ్డి మానుకోవాలి. ప్రజలందరికీ ఒకే చట్టం, ఒకే న్యాయం అనే సూత్రాన్ని అమలుచేయాలి' అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఒక్కొక్కరికీ ఒక్కో న్యాయం.. అన్న ప్రభుత్వ తీరుతో.. ప్రజల్లో సర్కారు పట్ల విశ్వాసం తగ్గుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. వీటన్నింటినీ గమనిస్తున్న ప్రజలు త్వరలోనే రేవంత్ రెడ్డికి దిమ్మదిరిగే సమాధానం ఇస్తారని పేర్కొన్నారు.
హైదరాబాద్ మెట్రో రైలుపై మళ్లీ రేవంత్ రెడ్డి ఆందోళన.. కేంద్ర మంత్రి ఖట్టర్కు లేఖ
Hyderabad, Telangana:Revanth Reddy Letter: హైదరాబాద్ మెట్రో రైలుపై కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడంతో తెలంగాణ ముఖ్యమంత్రి అసహనం వ్యక్తం చేశారు. మెట్రో రైలు ఫేజ్-2 నిర్మాణంపై ఢిల్లీ వెళ్లి విజ్ఞప్తులు చేసినా కూడా స్పందన రాకపోవడంతో రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. మెట్రో ఫేజ్-2కు వెంటనే ఆమోదం ఇవ్వాలని కోరుతూ కేంద్ర పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్కు లేఖ రాసి విజ్ఞప్తి చేశారు. వెంటనే మెట్రో రైలుపై ప్రత్యేక చొరవ తీసుకోవాలని కోరారు. ఫేజ్-1ను తెలంగాణకు అప్పగించే ప్రక్రియను వేగవంతం చేయాలని అభ్యర్థించారు. ఇక వాటితోపాటు ఎస్బీఐ క్యాప్స్ను తక్షణమే నియమించాలని.. ఒకవేళ ఆలస్యమైతే ప్రాజెక్టు వ్యయం మరింత పెరిగే ప్రమాదం ఉందని లేఖలో తెలంగాణ సీఎం ఆందోళన వ్యక్తం చేశారు.
మెట్రో రైలు ఫేజ్-2 విస్తరణ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆమోదం తెలపాలని కేంద్ర మంత్రి ఖట్టర్కు రాసిన లేఖలో సీఎం కోరారు. ప్రస్తుతం అమలులో ఉన్న హైదరాబాద్ మెట్రో ఫేజ్-1ను తెలంగాణ ప్రభుత్వానికి బదిలీ చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని లేఖలో రేవంత్ రెడ్డి అభ్యర్థించారు. ఈ రెండు అంశాలు పరస్పరం ముడిపడి ఉండడంతో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి జాప్యం లేకుండా నిర్ణయాలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఏమాత్రం ఆలస్యం చేసినా ప్రాజెక్టు అమలు దెబ్బతింటుందని, వ్యయం కూడా గణనీయంగా పెరిగే ప్రమాదం ఉందని లేఖలో రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. జూన్ 24వ తేదీన కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ను కలిసి హైదరాబాద్ మెట్రో ఫేజ్-1, ఫేజ్-2 అంశాలపై విస్తృతంగా చర్చించిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రత్యేకంగా గుర్తు చేశారు. ఆ సమావేశాల్లో తీసుకున్న కీలక నిర్ణయాలు ఇప్పటికీ అమలులోకి రాకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. జూన్ 24వ తేదీన జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాల ప్రకారం కేంద్ర ప్రభుత్వం గుర్తించిన సంస్థ ఎస్బీఐ క్యాపిటల్ మార్కెట్స్ లిమిటెడ్ (ఎస్బీఐ క్యాప్స్)కు హైదరాబాద్ మెట్రో ఫేజ్-1 విలువ నిర్ధారణ, ఆర్థిక పరిస్థితుల సమీక్ష, తెలంగాణ ప్రభుత్వానికి బదిలీకి అవసరమైన ఆర్థిక పరిశీలన వంటి కీలక బాధ్యతలు అప్పగించాలని అంగీకరించినట్లు లేఖలో రేవంత్ రెడ్డి వివరించారు.
ప్రస్తుతం హైదరాబాద్ మెట్రో రైలు ఫేజ్-1పై ఉన్న అధిక వడ్డీ రుణాలను తక్కువ వడ్డీ రుణాలుగా మార్చే (రిఫైనాన్సింగ్) అవకాశాలను కూడా ఎస్బీఐ క్యాప్స్ పరిశీలించాలని ఈ సమావేశంలో నిర్ణయించినట్లు లేఖలో రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 నిర్మాణానికి భారీ స్థాయిలో నిధులు అవసరమవుతాయని.. దీంతో అదే సంస్థ ఫేజ్-2కు అవసరమైన ఆర్థిక నమూనా, దీర్ఘకాలిక రుణాల సమీకరణ, నిధుల సమీకరణ మార్గాలు, ఆర్థిక వ్యూహం కూడా రూపొందించాలని సమావేశంలో నిర్ణయించినట్లు లేఖలో కేంద్ర మంత్రికి వివరించారు. ఫేజ్-1 ప్రాజెక్టు విలువ నిర్ధారణ, రుణాల పునర్వ్యవస్థీకరణ, ఫేజ్-2 నిధుల సమీకరణ వంటి అంశాలన్నింటినీ సమగ్రంగా పరిశీలించేలా టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ (టీఓఆర్) రూపొందించాలని కేంద్రాన్ని కోరారు. ఈ ప్రక్రియ సమన్వయం కోసం మున్సిపల్ పరిపాలన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని నోడల్ అధికారిగా నియమించినట్లు ప్రస్తావించారు. ఎస్బీఐ క్యాప్స్కు బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించినా ఇప్పటివరకు నియమించలేదని వెల్లడించారు.
టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ను కూడా ఇంకా ఖరారు చేసి తెలంగాణ ప్రభుత్వానికి పంపలేదని లేఖలో రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. దీంతో మెట్రో ఫేజ్-1ను రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేసే ప్రక్రియలో అనిశ్చితి నెలకొనడంతో పాటు రోజువారీ నిర్వహణలో కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయని వివరించారు. ఎస్బీఐ క్యాప్స్ నియామకం ఆలస్యమవడంతో హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 సమగ్ర ప్రాజెక్టు నివేదికలకు (డీపీఆర్లు) కేంద్ర అనుమతులు రావడం మరింత ఆలస్యమవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
Prashna Ravan Arrest: యూట్యూబర్ ప్రశ్న రావణ్పై రాజద్రోహం కేసు..మళ్లీ అరెస్టు చేసిన ఏపీ పోలీసులు!
Nunna, Vijayawada, Andhra Pradesh:Prashna Ravan Arrest News: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఇటీవలే యూట్యూబర్ ప్రశ్న రావణ్ను పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో బెయిల్ కోసం అనేక మార్లు కోర్టుకు వెళ్లి బెయిల్ తెచ్చుకున్నా.. ఏపీ పోలీసులు వరుస అరెస్టులు చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా రాజద్రోహం కేసు నమోదయ్యింది. ఇదే కేసులో మరోసారి అరెస్టు తప్పదంటూ కూటమి ప్రభుత్వ సానుభూతి పరులు చెబుతున్నారు.England Viagra World Cup: వయాగ్రా ట్యాబ్లెట్స్ తీసుకున్న ఇంగ్లాండ్ ఆటగాళ్లు.. ఎందుకంటే?
Mezquitillo, Zacatecas:England Viagra Mexico: ఫీఫా ప్రపంచకప్ 2026 టోర్నమెంట్లో భాగంగా సోమవారం (జూలై 6న) మెక్సికోతో జరగబోయే కీలకమైన 'రౌండ్ ఆఫ్ 16' మ్యాచ్లో గెలవడానికి ఇంగ్లాండ్ జట్టు ఒక వినూత్నమైన మార్గాన్ని ఎంచుకుంది. మెక్సికో సిటీలోని తీవ్రమైన వాతావరణ పరిస్థితులు, ఎత్తైన ప్రదేశాల వల్ల కలిగే శారీరక శ్రమను తట్టుకునేందుకు వీలుగా ఇంగ్లాండ్ జట్టుకు 'వయాగ్రా' మాత్రలను వినియోగించేందుకు అనుమతి లభించింది. ఫీఫా ప్రపంచకప్ చరిత్రలోనే ఇలాంటి విన్నూత్న అనుమతి లభించడం ఇదే తొలిసారి కావడం విశేషం.AP Rain Alert: ఏపీ వాసులకు బిగ్ అలర్ట్..రాబోయే 24 గంటల్లో అల్లకల్లోలం..విపత్తుల నిర్వహణ సంస్థ కీలక సూచనలు!
Vijayawada, Andhra Pradesh:AP Heavy Rain Alert: వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా ఆకాశం మేఘావృతంగా ఉండే అవకాశం ఉంది. అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు, కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా, మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది . ఈ నేపథ్యంలో ప్రజలు చెట్లు, విద్యుత్ స్తంభాలు, హోర్డింగుల వద్ద నిలబడకుండా అప్రమత్తంగా ఉండాలి.
వర్ష సూచన వివరాలు..
రాష్ట్రవ్యాప్తంగా ఒకటి లేదా రెండు ప్రాంతాలలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అటువైపు అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాల్లో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుండి సాధారణ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక..
"వర్షం పడే సమయంలో ప్రయాణికులు, సాధారణ ప్రజలు రోడ్లపై ఉన్న పెద్ద పెద్ద చెట్లు, పాతబడిన హోర్డింగులు (ప్రకటనల బోర్డులు), విద్యుత్ స్తంభాల కింద నిలబడవద్దు" అని రాష్ట్ర విపత్తుల నిర్వాహణ శాఖ తెలియజేసింది.
ఈ అల్పపీడన ప్రభావంతో బలమైన గాలులు వీచే ప్రమాదం ఉన్నందున, హోర్డింగులు లేదా చెట్లు విరిగిపడే అవకాశం ఉందని, ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో ఆశ్రయం పొందాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అత్యవసర సూచనలు జారీ చేసింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని రైతులు, గొర్రెల కాపరులు ఉరుములు పడే సమయంలో బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని హెచ్చరించింది.
Also Read: Bus Accident Gadwal: ట్రావెల్స్ బస్సు బోల్తా.. 10 మందికి గాయాలు.. ఐదుగురి పరిస్థితి
Also Read: "నా కొడుకుని మేకులు కొట్టి చంపారు..బూడిదైనా ఇవ్వండి!" సాయికృష్ణ తల్లి ఆవేదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
హౌస్ కీపింగ్ సిబ్బంది నిజాయితీ.. రూ.5 లక్షల ఆభరణాలు బ్యాగ్ అప్పగింత
Tirupati Urban, Andhra Pradesh:Honesty Of Tirumala House Keeping Staff: కంగారులో రూ.లక్షల విలువైన బంగారు ఆభరణాలు భక్తుడు మరచిపోయి వెళ్లగా.. హోటల్ గది శుభ్రం చేయడానికి వచ్చిన హౌస్ కీపింగ్ సిబ్బంది నిజాయితీని చాటుకున్నారు. బంగారు ఆభరణాలు కనిపించగానే గుట్టుచప్పుడు కాకుండా తీసుకోకుండా నిజాయితీగా పోగొట్టుకున్న బాధిత భక్తుడికి అప్పగించారు. అయితే పోయిన ఆభరణాలు తిరిగి లభించడంతో ఆ భక్తుడు ఆనందం వ్యక్తం చేశాడు. తిరుమల కొండపై ఎవరికీ అన్యాయం జరగదని ఆ భక్తుడి కుటుంబం భావించింది.
తిరుమలలో మరోసారి హౌస్ కీపింగ్ సిబ్బంది నిజాయితీ చాటుకున్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు హైదరాబాద్కు చెందిన భక్తుడు సుధీర్ కుటుంబసభ్యులతో కలిసి తిరుమల వచ్చారు. కొండపైన అన్నమయ్య భవన్లోని రూమ్ నంబర్-3లో జూలై 4వ తేదీన బస చేశారు. స్వామివారి దర్శనం చేసుకుని మొక్కులు తీర్చుకున్న సుధీర్ కుటుంబసభ్యులు జూలై 5వ తేదీ మధ్యాహ్నం 1 గంట 16 నిమిషాలకు గదిని ఖాళీ చేశారు. తమ స్వస్థలం తిరుగుప్రయాణమైన సుధీర్ కుటుంబం గదిలో బంగారు ఆభరణాలు మరచిపోయారు.
గదిని శుభ్రం చేసేందుకు వెళ్లిన హౌస్ కీపింగ్ సిబ్బందికి బంగారు నగలు కనిపించడంతో వెంటనే వారు సంబంధిత అధికారులకు సమాచారం అందించారు. ఆ బంగారు ఆభరణాలను భద్రపరిచిన అధికారులు భక్తుడి వివరాలు తెలుసుకున్నారు. గది బుక్ చేసుకునే సమయంలో ఇచ్చిన వివరాల ఆధారంగా హైదరాబాద్కు చెందిన సుధీర్కు ఫోన్ చేశారు. నగలు మరచిపోయారు వచ్చి తీసుకెళ్లమని చెప్పడంతో ఆ భక్తుడి కుటుంబం షాక్కు గురయ్యింది. పోయిన నగదు తిరిగి రావడంతో ఆ కుటుంబం ఆనందం వ్యక్తం చేసింది.
వెంటనే కొండపైకి వచ్చిన సుధీర్కు టీటీడీ అధికారులు సుమారు రూ.5 లక్షల విలువైన బంగారు ఆభరణాలను సురక్షితంగా అప్పగించారు. హౌస్ కీపింగ్ సిబ్బంది నిజాయితీని కొనియాడుతూ టిటిడి అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఘటనతో తిరుమలలో విధులు నిర్వహిస్తున్న హౌస్ కీపింగ్ సిబ్బంది మరోసారి తమ నిబద్ధత, నిజాయితీని చాటుకున్నారని అధికారులు పేర్కొన్నారు. హౌస్ కీపింగ్ సిబ్బందిని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అభినందించారు. ఈ వార్త వైరల్గా మారింది.
భక్తులు జాగ్రత్తగా ఉండాలి
తిరుమల కొండపై ఎవరికీ అన్యాయం జరగదని.. అంతా శ్రీనివాసుడు చూసుకుంటాడనే అభయం ఈ ఘటనతో భక్తులకు మరోమారు తెలిసింది. అయినా కూడా భక్తులు జాగ్రత్తగా వ్యవహరించాలని టీటీడీ అధికారులు సూచిస్తున్నారు. బంగారు నగలు హౌస్ కీపింగ్ సిబ్బంది కాకుండా మరేఇతర ఎవరైనా చూసి ఉండి ఉంటే వాటిని ఎత్తుకెళ్లేవారని టీటీడీ విజిలెన్స్ అధికారులు చెబుతున్నారు. ఎన్ని జాగ్రత్త చర్యలు.. ఎంత నిఘా ఉంచినా కూడా భక్తుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు తమ వస్తువులకు తామే బాధ్యత వహించాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు. ఇకనైనా భక్తులు తమ వస్తువుల పట్ల జాగ్రత్తగా చూడాలని చెబుతున్నారు.
Karimnagar: కరీంనగర్ కాంగ్రెస్లో నామినేటెడ్ జోష్..
Hyderabad, Telangana:Congress Nominated Posts: తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్కు బూస్ట్ ఇచ్చేలా నామినేటెడ్ పదవుల భర్తీపై దృష్టి సారించిన్నట్లు తెలుస్తోంది.. ఇందులో భాగంగానే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు (PACS) ప్రభుత్వం ఛైర్మన్తో పాటు సభ్యులతో కూడిన నూతన పాలక వర్గాలను నియమించేందుకు రెడీ అయ్యింది. ఈ పదవులను దక్కించుకునేందుకు కాంగ్రెస్ నేతలతో పాటు కార్యకర్తల మధ్య గట్టి పోటీ నెలకొంది.
6 సంఘాల నియామకం పూర్తి..
ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మొత్తం 131 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఉన్నాయి. వీటిలో ఇప్పటివరకు ప్రభుత్వం కేవలం 6 సంఘాలకు మాత్రమే పాలక వర్గాలను నియమించింది. దీంతో మిగిలిన 125 సంఘాల ఛైర్మన్, సభ్యుల పదవుల కోసం స్థానిక కాంగ్రెస్ నాయకులు తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు ప్రారంభించారు. ముందువచ్చిన వారికే పదవులు అనే తరహాలో ఎవరికి వారు తమ ఉన్నంతగా ఉన్న లీడర్స్ ద్వారా ఒత్తిడి తెస్తున్నారు.
బీఆర్ఎస్ నియోజకవర్గాల్లో ముమ్మర ప్రయత్నాలు..
ఉమ్మడి జిల్లా పరిధిలోని 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో.. ప్రస్తుతం 4 చోట్ల BRS ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయా నియోజకవర్గాల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జ్లతో పాటు సీనియర్ నేతలు ఈ ప్యాక్స్ పదవులను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. విపక్ష ఎమ్మెల్యేలు ఉన్న చోట తమ పట్టు నిలుపుకోవడానికి ఈ సహకార సంఘాల పదవులు కీలకమని కాంగ్రెస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.. దీంతో ఆయా పరిధుల్లోని ఛైర్మన్, పాలకవర్గ పదవులను తమ అనుచరులకే దక్కించుకునేలా నాయకులు వ్యూహాలు రచిస్తున్నారని సమాచారం..
మంత్రుల చుట్టూ ప్రదక్షిణలు..
తమకు అనుకూలమైన అభ్యర్థులకు ప్యాక్స్ ఛైర్మన్ పీఠం దక్కేలా ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులతో పాటు రాష్ట్రస్థాయి కీలక నేతల వద్ద కాంగ్రెస్ లీడర్లు ముమ్మరంగా లాబీయింగ్ చేస్తున్నారు. హైదరాబాద్లోని మంత్రుల నివాసాలతో పాటు క్యాంప్ ఆఫీసుల చుట్టూ కరీంనగర్ నేతలు ప్రదక్షిణలు చేస్తున్నారు. అయితే, త్వరలోనే మరికొన్ని సంఘాల పాలకవర్గాల జాబితా విడుదలయ్యే అవకాశం ఉండడంతో.. ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పాలిటిక్స్ ఒక్కసారిగా హీటెక్కాయి. అధిష్టానం ఎవరిని కరుణిస్తుందో.. ఎవరికి ఏ పదవి దక్కుతుందో చూడాలి..
Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
Mcd Test: భారత్లోకి సరికొత్త విప్లవం.. ఒకే రక్త పరీక్షతో 10 క్యాన్సర్ల గుర్తింపు..
Hyderabad, Telangana:MCD Cancer Blood Test: క్యాన్సర్ వ్యాధిని ప్రాథమిక దశలోనే గుర్తిస్తే.. ప్రాణాలను రక్షించుకోవచ్చని వైద్య నిపుణులు ఎప్పుడూ చెబుతూ ఉంటారు. కానీ, చాలా మందిలో కొన్ని సందర్భాల్లో క్యాన్సర్ ముదిరిన తర్వాతే బయటపడుతుంది. అయితే, వైద్య శాస్త్ర రంగంలో ఒక సరికొత్త ఆవిష్కరణ ఇప్పుడు క్యాన్సర్పై పోరాటంలో గేమ్ ఛేంజర్గా మారబోతోంది. శరీరంలో క్యాన్సర్ కణాలు ఇప్పుడిప్పుడే పుడుతున్న దశలోనే వాటిని పసిగట్టే సరికొత్త రక్త పరీక్ష త్వరలోనే భారతదేశంలో అందుబాటులోకి రాబోతోంది.. కేవలం ఒకే ఒక్క బ్లడ్ టెస్ట్ ద్వారా దాదాపు 10 రకాల క్యాన్సర్లను గుర్తించవచ్చని వైద్యులు చెబుతున్నారు. అయితే, ఈ రక్త పరీక్ష పేరేంటి? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
అహ్మదాబాద్కు చెందిన ప్రముఖ ఔషధ, టీకాల తయారీ సంస్థ జైడస్ లైఫ్సైన్సెస్ (Zydus Lifesciences) ఈ అత్యాధునిక పరీక్షా విధానాన్ని దేశంలోకి అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రత్యేకమైన క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షకు షీల్డ్ మల్టీ-క్యాన్సర్ డిటెక్షన్ (MCD) అని పేరు పెట్టారు. అమెరికాకు చెందిన ప్రముఖ పరిశోధనా సంస్థ గార్డెంట్ హెల్త్ (Guardant Health) ఈ సాంకేతికతను అభివృద్ధి చేసింది. ఇప్పుడు జైడస్ సంస్థ అమెరకా సంస్థతో డీల్ కుదుర్చుకుని.. భారతీయ ప్రజల శారీరక స్థితిగతులకు అనుగుణంగా ఈ పరీక్షను దేశంలో ప్రవేశపెట్టబోతున్నట్లు తెలిపింది.
తొలి విడతగా ప్రధాన నగరాల్లో ప్రారంభం..
భారతదేశంలో ఈ పరీక్షను త్వరలోనే ప్రారంభించేందుకు ఏర్పాట్లు కూడా స్పీడ్గా జరుగుతున్నట్లు తెలుస్తోంది.. జైడస్ సంస్థ ఇప్పటికే దేశంలోని పలు ప్రముఖ ప్రైవేట్ ఆసుపత్రులతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు కూడా తెలుస్తోంది.. తొలిత హైదరాబాద్, అహ్మదాబాద్, చెన్నై, డిల్లీ నగరాల్లో ఈ రక్త పరీక్ష అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత దేశంలోని ఇతర నగరాలు, ప్రాంతాలకు విస్తరించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.. అయితే, ఈ పరీక్షకు ఎంత ఖర్చవుతుందనే వివరాలను కంపెనీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.
ఒకే పరీక్షతో 10 రకాల క్యాన్సర్లు ఎలా సాధ్యం?
సాధారణంగా బ్రెస్ట్ క్యాన్సర్తో పాటు లివర్ క్యాన్సర్ లేదా ప్రోస్టేట్ క్యాన్సర్లను గుర్తించడానికి వేర్వేరు పరీక్షలు చేయాల్సి ఉంటుంది. దీనివల్ల రోగులకు శారీరక శ్రమతో పాటు ఆర్థిక భారం కూడా విపరీతంగా పెరగుతుంది.. అయితే, ఈ సరికొత్త విధానంలో కేవలం ఒకే ఒక్కసారి రక్తం నమూనా సేకరించి.. 10 రకాల క్యాన్సర్లను స్క్రీనింగ్ చేయవచ్చు. శరీరంలో క్యాన్సర్ కణాలు పెరుగుతున్నప్పుడు.. వాటిలోని చిన్న చిన్న డీఎన్ఏ (DNA) ముక్కలు రక్త ప్రవాహంలోకి చేరుతాయి. వైద్య పరిభాషలో వీటిని సర్క్యులేటింగ్ సెల్-ఫ్రీ డీఎన్ఏ (ccfDNA) అని పిలుస్తారు. ఈ సరికొత్త బ్లడ్ టెస్ట్ ద్వారా రక్తంలో ఈ క్యాన్సర్ డీఎన్ఏ ఎంత పరిమాణంలో ఉందో.. అందులో ఎలాంటి రసాయన మార్పులు జరుగుతున్నాయో సులభంగా గుర్తించవచ్చు.
ఈ పరీక్ష ద్వారా సులభంగా వీటిని గుర్తించవచ్చు..
✾ రొమ్ము క్యాన్సర్ (Breast Cancer)
✾ కాలేయ క్యాన్సర్ (Liver Cancer)
✾ ప్రోస్టేట్ క్యాన్సర్ (Prostate Cancer)
✾ కోలన్ క్యాన్సర్ (Colon Cancer)
✾ మూత్రపిండాలతో పాటు మూత్రాశయ క్యాన్సర్ (Bladder Cancer)
✾ ఊపిరితిత్తుల క్యాన్సర్ (Lung Cancer)
✾ అన్నవాహిక క్యాన్సర్ (Esophageal Cancer)
✾ కడుపు క్యాన్సర్ (Stomach Cancer)
✾ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ (Pancreatic Cancer)
✾ అండాశయ క్యాన్సర్ (Ovarian Cancer)
Also Read: వంటకు నువ్వుల నూనె మంచిదా? ఆవనూనె మంచిదా? భారతీయ వంటకాల్లో దేనిది పైచేయి?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
కాళేశ్వరం వద్ద ఉగ్రరూపం దాల్చిన గోదావరి.. మేడిగడ్డ 85 గేట్లు ఎత్తివేత!
Hyderabad, Telangana:Kaleshwaram Latest News: తెలంగాణ రాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాతో పాటు పొరుగు రాష్ట్రమైన మహారాష్ట్రలో గత కొద్ది రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు నదులు ఉగ్రరూపం దాల్చాయి. రెండు రాష్ట్రాల మధ్య ప్రవహించే పెన్ గంగాతో పాటు ప్రాణహిత నదులు ప్రస్తుతం ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ప్రాణహిత నది నుంచి వస్తున్న భారీ వరద ప్రవాహంతో కాళేశ్వరం వద్ద గోదావరి నది ఊరకలు వేస్తోంది. ప్రస్తుతం కాళేశ్వరం వద్ద 95 వేల క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతోందని అధికారులు తెలిపారు. దీనితో అప్రమత్తమై మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీకి సంబంధించిన 85 గేట్లను పూర్తిగా పైకి లేపి నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. ఈ ఏడాదిలో గోదావరి నది ఇలా పరవళ్లు తొక్కడం ఇదే మొదటిసారి కావడం విశేషం..
స్థానికంగా లేని వానలు..
వాస్తవానికి తెలంగాణలోని గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో ప్రస్తుతం పెద్దగా వర్షాలు కురవడం లేదు.. అయినప్పటికీ, మహారాష్ట్ర ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న కుంభవృష్టి వల్లే ప్రాణహిత నది ద్వారా కాళేశ్వరం వద్దకు భారీగా నీరు వచ్చి చేరుతోంది.. గోదావరి, ప్రాణహిత నదుల సంగమంతో కాళేశ్వరం క్షేత్రం వద్ద గోదారమ్మ సవ్వడి చేస్తూ.. ప్రకృతి ప్రేమికులను, భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.
కౌటాల వద్ద పుష్కర ఘాట్లను తాకిన నీరు..
మరోవైపు కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సిర్పూర్ నియోజకవర్గంలో వరద భీభత్సం కనిపిస్తోంది. ఇక్కడి ప్రాణహిత.. పెన్ గంగా నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. కౌటాల మండలంలోని ప్రాణహిత నది పుష్కర ఘాట్లను తాకుతూ వరద నీరు ప్రవహిస్తుండగా.. తాటిపెల్లి వద్ద పెన్ గంగా నది ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తోంది.
అధికారుల హెచ్చరిక..
నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నందున సమీప గ్రామాల ప్రజలతో పాటు మత్స్యకారులు ఎవరూ కూడా నదులను దాటే ప్రయత్నం చేయవదని.. ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున అందరూ సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలని కోరుతున్నారు. ఇప్పటికే భారీ వర్షాల ప్రభావం రవాణా వ్యవస్థపై తీవ్రంగా పడింది.. సిర్పూర్ మండలంలోని చీలపల్లి వద్ద వరద నీటి ఉధృతికి ప్రధాన రహదారి పూర్తిగా కొట్టుకుపోయింది. దీంతో ఆ మార్గంలో ప్రయాణించే వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.
New Ration Cards: పేదలకు గుడ్ న్యూస్.. కేవలం 2 రోజుల్లోనే చేతికి రేషన్ కార్డు!
Hyderabad, Telangana:New Ration Cards Telangana: తెలంగాణలో రేషన్ కార్డు లేని అర్హులైన పేదలకు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అత్యంత శుభవార్తను అందించారు. అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకున్న కేవలం 48 గంటల్లోనే కొత్త రేషన్ కార్డును అందిస్తామని ఆయన సంచలన హామీ ఇచ్చారు. ప్రజాపాలనలో భాగంగా అర్హులందరికీ ప్రభుత్వ ఫలాలు వేగంగా అందాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.
హైదరాబాద్లోని నాంపల్లితో పాటు చాంద్రాయణగుట్ట నియోజకవర్గాలకు చెందిన 361 మంది లబ్ధిదారులకు మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదివారం డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అధికారిక కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు..
గత పదేళ్ల పాటు నిర్లక్ష్యం..
ఈ సందర్భంగా.. మంత్రి పొన్నం ప్రభాకర్ గత BRS ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శించారు. గత ప్రభుత్వం పదేళ్ల పాలనలో పేద ప్రజలను ఘోరంగా నిర్లక్ష్యం చేసిందని.. అర్హులైన వారికి రేషన్ కార్డులు ఇవ్వకుండా కాలయాపన చేసిందని మండిపడ్డారు. పదేళ్లుగా పెండింగ్లో ఉన్న సమస్యలను తాము అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే పరిష్కరిస్తున్నామని ఈ అధికారిక కార్యక్రమంలో తెలిపారు.
గత పాలకులు ప్రజల ప్రాథమిక అవసరాలను సైతం పట్టించుకోలేదని.. కానీ వారి ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమని.. అర్హత ఉండి.. దరఖాస్తు చేసుకుంటే చాలని.. కేవలం రెండు రోజుల్లోనే చేతికి కొత్త రేషన్ కార్డు వచ్చేలా పూర్తి పారదర్శకమైన వ్యవస్థను తీసుకువస్తున్నామని మంత్రి లబ్ధిదారులకు భరోసాను అందించారు..
మహిళకు వడ్డీ లేని రుణాలు..
మహిళల ఆర్థికాభివృద్ధి, స్వయం సమృద్ధి కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు త్వరలోనే పెద్ద ఎత్తున వడ్డీ లేని రుణాలను అందిస్తామని ప్రకటించారు. మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకున్నప్పుడే కుటుంబాలు, తద్వారా రాష్ట్రం బాగుపడుతుందని ఆయన ఆకాంక్షించారు.
ఇళ్ల పట్టాల పంపిణీ..
నాంపల్లి, చాంద్రాయణగుట్ట ప్రాంతాల్లోని నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పట్టాలు అందజేయడంపై మంత్రి హర్షం వ్యక్తం చేశారు. నిరుపేదల సొంతింటి కలను నిజం చేయడం కంటే సంతృప్తినిచ్చే అంశం మరొకటి ఉండదని అన్నారు. లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి రాజకీయ జోక్యం లేకుండా.. పూర్తి అర్హత ప్రాతిపదికన.. పారదర్శకంగా ఈ ఇళ్ల పట్టాలను పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు. రాబోయే రోజుల్లో మిగిలిన అర్హులందరికీ కూడా ప్రభుత్వ పథకాలను చేరవేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు.
Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
Rains in Mumbai: ముంబైను ముంచెత్తున్న భారీ వర్షాలు.. పలు ప్రాంతాలకు రెడ్ అలర్ట్..
Hyderabad, Telangana:Heavy rains in mumbai city imd issued red alertAmazon Sale: రూ.20 వేల లోపు బెస్ట్ 5G ఫోన్లు.. భారీ డిస్కౌంట్లు, క్యాష్బ్యాక్ ఆఫర్ల వివరాలు!
Hyderabad, Telangana:Best Smartphones Under Rs 20k: స్మార్ట్ఫోన్ ప్రియులకు అమెజాన్ అదిరిపోయే గుడ్ న్యూస్ అందించింది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అమెజాన్ ప్రైమ్ డే సేల్ (Amazon Prime Day Sale) ఘనంగా మొదలైంది. ఈ ప్రత్యేక సేల్లో భాగంగా స్మార్ట్ఫోన్స్ బంపర్ డిస్కౌంట్లతో పాటు ఆకర్షణీయమైన బ్యాంక్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా రూ.20,000 లోపు బడ్జెట్లో సరికొత్త ఫీచర్లతో కూడిన బ్రాండెడ్ స్మార్ట్ఫోన్లను కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది అద్భుతమైన అవకాశంగా భావించవచ్చు.
బ్యాంక్ ఆఫర్లు, క్యాష్బ్యాక్ ఆఫర్స్ వివరాలు..
ఈ ప్రైమ్ డే సేల్లో యాక్సిస్ బ్యాంక్ (Axis Bank)తో పాటు ఎస్బీఐ (SBI) క్రెడిట్, డెబిట్ కార్డుల వినియోగించి పేమెంట్ చేసేవారికి 10 శాతం ఇన్స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్ అందుబాటులో ఉంటుంది.. అంతేకాకుండా అమెజాన్ పే ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్ వినియోగించే వారికి 5 శాతం అన్లిమిటెడ్ క్యాష్బ్యాక్ కూడా అందుబాటులో ఉంది. అలాగే అమెజాన్ పే లేటర్ (Amazon Pay Later)ను వినియోగించి పేమెంట్ చేసేవారికి 10 శాతం వరకు క్యాష్బ్యాక్ కూడా లభిస్తుంది.
ఇప్పుడు రూ.20 వేల బడ్జెట్లో అందుబాటులో ఉన్న టాప్-5 స్మార్ట్ఫోన్స్ వివరాలు..
ఐకూ Z10 లైట్ 5G (iQOO Z10 Lite 5G)
గేమింగ్తో పాటు పర్ఫార్మెన్స్కు కేరాఫ్ అడ్రస్గా భావించే ఐకూకి సంబంధించిన Z10 లైట్ 5G స్మార్ట్ఫోన్ రూ. 14,999 ధరకే అందుబాటులో ఉంది.. దీనిపై రూ.509 అమెజాన్ పే క్యాష్బ్యాక్ లభిస్తుండటంతో నెట్ ప్రైస్ కేవలం రూ.14,490కే అవుతుంది.. అలాగే ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద గరిష్టంగా రూ.14,249 వరకు తగ్గింపు కూడా పొందవచ్చు..
సాంసంగ్ గెలాక్సీ M36 5G (Samsung Galaxy M36 5G)
ఈ సేల్లో భాగంగా సాంసంగ్ గెలాక్సీ M36 5G స్మార్ట్ఫోన్కి సంబంధించిన 6GBర్యామ్తో పాటు 128GB స్టోరేజ్ వేరియంట్ రూ.18,999 ధరతో లభిస్తోంది.. అమెజాన్ పే బ్యాలెన్స్తో పేమెంట్ చేస్తే.. రూ.569 క్యాష్బ్యాక్ కూడా పొందవచ్చు. దీనితో ఈ ఫోన్ ధర రూ.18,430కి తగ్గుతుంది. ఇక పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ చేస్తే.. రూ. 17,900 వరకు అదనపు డిస్కౌంట్ పొందే అవకాశం ఉంది.
రియల్మి నార్జో 90x 5G (Realme Narzo 90x 5G)
బడ్జెట్ ధరలో మంచి ఫోన్ కోరుకునే వారి కోసం రియల్మి నార్జో 90x 5G మోడల్ చాలా బెస్ట్.. మార్కెట్లో ఇది రూ.16,998కే అందుబాటులో ఉంది. అమెజాన్ పే ద్వారా కొనుగోలు చేస్తే రూ.509 క్యాష్బ్యాక్ కూడా సొంతం చేసుకోవచ్చు. దీంతో ధర రూ.16,489కే పొందవచ్చు.. మీ పాత ఫోన్ను ఎక్స్ఛేంజ్ చేస్తే.. రూ. 16,100 వరకు భారీ తగ్గింపును పొందవచ్చు.
రెడ్మి 15 5G (Redmi 15 5G)
రెడ్మి 15 5G స్మార్ట్ఫోన్ 6G ర్యామ్తో పాటు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి వేరియంట్ ధర రూ.20,498తో అందుబాటులో ఉంది.. అయితే, సేల్ సందర్భంగా లభిస్తున్న ప్రత్యేక కూపన్ ఆఫర్ వినియోగదారులు రూ.1,000 వరకు స్పెషల్ తగ్గింపు పొందవచ్చు.. దీనితో ఈ ఫోన్ను రూ.19,498కే సొంతం చేసుకోవచ్చు. ఐసీఐసీఐ కార్డ్ ద్వారా అదనంగా 5 శాతం క్యాష్బ్యాక్ కూడా అందుబాటులో ఉంది.
లావా బోల్డ్ N2 5G (Lava Bold N2 5G)
దేశీ బ్రాండ్ అయిన లావా నుంచి వచ్చిన బోల్డ్ N2 5G స్మార్ట్ఫోన్ రూ. 11,999కే లభిస్తోంది. దీనిపై రూ.359 వరకు క్యాష్బ్యాక్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. దీంతో ధర రూ.11,640కే పొందవచ్చు. పాత స్మార్ట్ఫోన్ ఎక్స్ఛేంజ్ చేస్తే దాదాపు గరిష్టంగా రూ.11,300 వరకు తగ్గింపును కూడా పొందవచ్చు..
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
8100mAh బ్యాటరీ, 50MP సోనీ కెమెరాతో Vivo Y500 లాంచ్.. ధర ఎంతంటే?
Hyderabad, Telangana:Vivo Y500 Launched: ప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ వివో (Vivo) మార్కెట్లోకి మరో సరికొత్త స్మార్ట్ఫోన్ను విడుదల చేసింది. తన Y సిరీస్లో భాగంగా వివో Y500 (Vivo Y500) మోడల్ను పాకిస్తాన్ మార్కెట్లో అధికారికంగా లాంచ్ చేసింది. మధ్యతరగతి వినియోగదారులను టార్గెట్ చేస్తూ.. ప్రీమియం ఫీచర్లతో ఈ స్మార్ట్ఫోన్ లాంచ్ అయ్యింది.. ముఖ్యంగా ఇందులో 8100mAh భారీ బ్యాటరీతో విడుదల కావడం విశేషం..
కళ్లు చెదిరే డిస్ప్లే, అల్ట్రా స్లిమ్ డిజైన్..
ఈ వివో Y500 స్మార్ట్ఫోన్ డిజైన్ పరంగా ఎంతో ఆకర్షణీయంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.. ఇంత భారీ బ్యాటరీ ఉన్నప్పటికీ, ఈ ఫోన్ కేవలం 8.19 mm మందంతో ఎంతో స్లిమ్గా.. పట్టుకోవడానికి వీలుగా ఉండడం విశేషం.. ఇందులో 6.83 అంగుళాల 1.5K ఐకేర్ (Eyecare) అమోలెడ్ (AMOLED) డిస్ప్లేను కలిగి ఉంటుంది.. ఇది 120Hz రిఫ్రెష్ రేట్తో పాటు ఏకంగా 5000 నిట్స్ పీక్ బ్రైట్నెస్కు సపోర్ట్ చేస్తున్నట్లు కంపెనీ క్లైమ్ చేస్తోంది.. దీనివల్ల ఎండలో కూడా స్క్రీన్ ఎంతో స్పష్టంగా కనిపిస్తోంది..
8100mAh బ్లూవోల్ట్ బ్యాటరీ..
ఈ ఫోన్ ప్రధాన ఆకర్షణ దీని బ్యాటరీ లైఫ్గా భావించవ్చు.. వివో ఇందులో 8100mAh గల బ్లూవోల్ట్ (BlueVolt) బ్యాటరీని అందుబాటులోకి తీసుకు వచ్చింది.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. రోజులకు రోజులు బ్యాటరీ బ్యాకప్ వస్తుందని కంపెనీ క్లైమ్ చేస్తోంది.. ఇందులో 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా అందుబాటులో ఉంది.. అంతేకాకుండా బైపాస్ ఛార్జింగ్ (Bypass Charging) ఫీచర్ ఉండడం వల్ల గేమింగ్ ఆడేటప్పుడు ఫోన్ వేడెక్కకుండా నేరుగా మదర్బోర్డుకు పవర్ అందుతుందని కంపెనీ తెలిపింది. రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండటం వల్ల ఈ ఫోన్ను పవర్బ్యాంక్లా వాడుతూ ఇతర డివైజ్లను కూడా ఛార్జ్ చేసుకోవచ్చు.
50MP సోనీ కెమెరా..
ఫోటోగ్రఫీ ప్రియుల కోసం వివో Y500 (Vivo Y500) వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్ను అందించింది. ఇందులో 50 మెగాపిక్సెల్ (MP) సోనీ మెయిన్ కెమెరాతో పాటు 2MP డెప్త్ సెన్సార్ కెమెరాలు కూడా అందుబాటులో ఉన్నాయి. సెల్ఫీల కోసం ముందు భాగంలో 32 మెగాపిక్సెల్ కెమెరాలను అందుబాటులోకి తీసుకు వచ్చారు.. ఈ ఫోన్కు IP68తో పాటు IP69 రేటింగ్స్ సపోర్ట్లను కలిగి ఉంటుంది.. దీని వల్ల దుమ్ము, నీటి నుంచి పూర్తి రక్షణ లభిస్తుంది.
పవర్ఫుల్ ప్రాసెసర్, లేటెస్ట్ సాఫ్ట్వేర్..
ఈ స్మార్ట్ఫోన్ 6nm ఆర్కిటెక్చర్పై పనిచేసే Unisoc T7300 అక్టా-కోర్ ప్రాసెసర్తో రన్ అవుతుందని కంపెనీ తెలిపింది.. ఇది రోజువారీ పనులతో పాటు మల్టీటాస్కింగ్, గేమింగ్ను సులువుగా హ్యాండిల్ చేస్తుంది. సాఫ్ట్వేర్ విషయానికొస్తే.. ఇది ఆండ్రాయిడ్ 16 ఆధారిత లేటెస్ట్ OriginOS 6 ఆపరేటింగ్ సిస్టమ్పై పనిచేస్తుందని కంపెనీ క్లైమ్ చేస్తుంది. భద్రత కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్ప్రింట్ సెన్సార్ను కూడా అందిస్తోంది..
ధరల వివరాలు..
వివో Y500 స్మార్ట్ఫోన్ మిడ్నైట్ బ్లూ, పెర్ల్ వైట్ అనే రెండు అద్భుతమైన కలర్ ఆప్షన్స్లో అందుబాటులో ఉంది. అయితే, ఇది పాకిస్తాన్ మార్కెట్లో ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది. దీని ధర 8GB రామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ ధరరూ. 99,999 PKRతో, రెండవ వేరియంట్ 8GB రామ్ + 256GB స్టోరేజ్తో ధర 109,999 PKRతో అందుబాటులో ఉంది. ఇది భారీ బ్యాటరీ, అద్భుతమైన డిస్ప్లేతో పాటు అండర్ వాటర్ కెమెరా ఫీచర్లను కోరుకునే వారికి ఈ సరికొత్త వివో Y500 ఒక బెస్ట్ ఆప్షన్గా నిలుస్తుంది.
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
