Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Mancherial504251

కసిరెడ్డిలో ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది

Aug 21, 2024 10:10:44
Bellampalle, Kannal Rural, Telangana

మంచిర్యాల బెల్లంపల్లి మండలం కసిరెడ్డి గ్రామంలో నిన్న రాత్రి ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ నెల 18న కుటుంబ కలహాలతో భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడని, భర్త అంత్యక్రియలు పూర్తయిన తర్వాత మహిళ కూడా ఆత్మహత్యకు పాల్పడిందని స్థానికులు చెబుతున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తాళ్ల గురిజాల పోలీసులు తెలిపారు. గత రెండు రోజులుగా భార్యాభర్తలు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.

0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
RKRavi Kumar Sargam
Jan 28, 2026 11:16:25
Amaravati, Andhra Pradesh:

Big Gift To Employees: దసరా పండుగ నుంచి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం వరాలు కురిపిస్తోంది. ఉద్యోగులు, పింఛన్‌దారులకు సంబంధించిన సమస్యలు, డిమాండ్లు పరిష్కరిస్తోంది. దసరా సమయంలో కరువు భత్యం (డీఏ) ప్రకటించిన ప్రభుత్వం అనంతరం దీపావళి, సంక్రాంతి పండుగకు కూడా గుడ్‌న్యూస్‌ ప్రకటించింది. తాజాగా మరో వరం ప్రకటించింది. ఉద్యోగులు, పింఛన్‌దారులకు సంబంధించి ప్రకటన చేసింది. ప్రభుత్వం ప్రకటించిన తీపి కబురుతో ఉద్యోగ వర్గాలకు భారీ ప్రయోజనం లభించనుంది.

Also Read: School Holiday: విద్యార్థులకు పండుగే.. స్కూళ్లకు నాలుగు రోజులు సెలవు?

​ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు పెండింగ్‌లో ఉన్న వివిధ రకాల బిల్లుల చెల్లింపుల్లో పురోగతి లభించింది. వివిధ రకాల బిల్లులు భారీగా పెండింగ్‌లో ఉండడంతో తాజాగా కొంత ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. విడుదల చేసిన బిల్లుల్లో టీఏ, టీటీఏ బిల్లులు ఉన్నాయి. 1 ఏప్రిల్ 25 నుంచి ఉద్యోగులకు సంబంధించిన టీఏ, టీటీఏ బకాయిల కోసం సుమారు రూ.150 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. ఏపీజీఎల్‌ఐ బిల్లులకు సంబంధించి మెచ్యూర్ అయిన పాలసీలు, లోన్ పేమెంట్లకు సంబంధించిన బిల్లులు ప్రభుత్వం క్లియర్‌ చేసింది. ఉద్యోగులు, పెన్షనర్లకు రావాల్సిన జీపీఎఫ్‌ బకాయిలు కూడా ప్రభుత్వం చెల్లించింది. ఇక రిటైర్డ్ ఉద్యోగుల సరెండర్ లీవ్ చెల్లింపుల ప్రక్రియ కూడా చేయగా.. వాటికి సంబంధించి బిల్లులు ప్రభుత్వం విడుదల చేసింది. వీటి చెల్లింపులతో ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారులకు భారీ ప్రయోజనం లభించనుంది.

Also Read: HIV Injection: బ్రేకప్‌ చెప్పాడని మాజీ ప్రియుడి భార్యకు HIV ఇంజెక్షన్‌ ఇచ్చిన ప్రియురాలు

 

Also Read: Govt Employees: ప్రభుత్వ ఉద్యోగులకు భారీ షాక్‌.. ఇవి ఉల్లంఘిస్తే ఉద్యోగం ఊస్ట్‌!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
RKRavi Kumar Sargam
Jan 28, 2026 11:03:20
Peddapur, Achampet, Telangana:

Love Story Tragedy: అప్పుడప్పుడే సమాజం గురించే తెలుసుకునే వయసు.. ఈ వయసులో కలిగే ఆకర్షణను ప్రేమ అనుకున్న మైనర్లు తమ నిండు జీవితాన్ని నాశనం చేసుకున్నారు. ఆరు నెలల పరిచయాన్ని ప్రేమగా భావించి.. అంతటితో ఆగకుండా పెళ్లి వయసు రాకముందే వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. తమ పెళ్లి పెద్దలు చేయరని భావించి ఇంట్లో నుంచి పారిపోయారు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు బెదిరింపులకు పాల్పడడంతో ఇంటికి వచ్చి ఆ పిల్లలు ప్రాణాలు తీసుకున్నారు. ఈ విషాద సంఘటన తెలంగాణలోని నాగర్‌కర్నూల్‌ జిల్లాలో చోటుచేసుకుంది.

Also Read: School Holiday: విద్యార్థులకు పండుగే.. స్కూళ్లకు నాలుగు రోజులు సెలవు?

నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం బొమ్మనపల్లి గ్రామానికి దాసరి ప్రసాద్ (18)కు చిట్లకుంట గ్రామానికి చెందిన అమ్మాయి  (16 ఏళ్లు) మధ్య పరిచయమైంది. తమ ఆరు నెలల పరిచయాన్ని వారు ప్రేమగా భావించారు. తరచూ వీరిద్దరూ కలుసుకుంటూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే తమ పెళ్లికి పెద్దలు అంగీకరించరని వారిద్దరూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో వారం రోజుల కిందట ఇంట్లో నుంచి పారిపోయారు. వారం నుంచి కనిపించకపోవడంతో కుటుంబసభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read: HIV Injection: బ్రేకప్‌ చెప్పాడని మాజీ ప్రియుడి భార్యకు HIV ఇంజెక్షన్‌ ఇచ్చిన ప్రియురాలు

పారిపోయిన విషయం తెలుసుకున్న అమ్మాయి కుటుంబసభ్యులు ఫోన్‌లో బెదిరించారు. వారి బెదిరింపులతో భయపడిన ప్రసాద్‌, అమ్మాయి మంగళశారం తన సొంత గ్రామం బొమ్మన్‌పల్లికి గ్రామానికి చేరుకున్నారు. తమ పెళ్లికి పెద్దలు ఒప్పుకుంటలేరని నిర్ధారించుకొని ఇంట్లో ఎవరు లేని సమయంలో అమ్మాయి, అబ్బాయి ఒకే చీరతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. నిద్రపోయిన కుటుంబసభ్యులు తెల్లవారు లేచి చూసేసరికి తలుపు గడియ పెట్టి ఉంది. ఫోన్‌ చేసినా.. పిలిచినా పలకకపోవడంతో తలుపు పగులగొట్టారు.

Also Read: Govt Employees: ప్రభుత్వ ఉద్యోగులకు భారీ షాక్‌.. ఇవి ఉల్లంఘిస్తే ఉద్యోగం ఊస్ట్‌!

లోపలికి వెళ్లి చూడగా వారిద్దరూ ఒకే చీరకు ఉరేసుకుని విగతజీవులుగా మారిపోయారు. ఉన్న ఒక కొడుకు చనిపోవడంతో ప్రసాద్‌ కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన చేరుకొని పరిశీలించారు. అబ్బాయి, అమ్మాయి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం అచ్చంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం వారి కుటుంబ సభ్యులకు మృతదేహాలను అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. తమ అబ్బాయి చావు కారణమైన వారిని.. అమ్మాయి మేనమామ ఈదయ్యను కఠినంగా శిక్షించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
HDHarish Darla
Jan 28, 2026 10:37:54
Hyderabad, Telangana:

Telangana PRC News: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న రెండో వేతన సవరణ (PRC) ప్రక్రియ మరింత జాప్యం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. పీఆర్సీ కమిటీ గడువును ప్రభుత్వం మరోసారి పొడిగించే యోచనలో ఉండటమే ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తుంది.

రాష్ట్రంలో పీఆర్సీ గడువు ఈ ఏడాది మార్చితో ముగియనుంది. అయితే, ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే ప్రభుత్వం నాలుగోసారి కూడా కమిటీ కాలపరిమితిని పెంచే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

నివేదిక సిద్ధం..కానీ!
పీఆర్సీ కమిటీ తన నివేదికను ఇప్పటికే సిద్ధం చేసిందని, ప్రభుత్వం పిలిస్తే వెంటనే అందజేయడానికి సిద్ధంగా ఉన్నారని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. అయితే, ప్రభుత్వం నివేదికను స్వీకరించడానికి వెనుకాడుతోందని, కావాలనే ఆలస్యం చేస్తోందని సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు.

కమిటీ నేపథ్యం - కాలక్రమం..
నియామకం: 2023 అక్టోబర్ 2న (శివశంకర్ చైర్మన్‌గా).
తొలి గడువు: 2024 ఏప్రిల్ 2.
పొడిగింపులు: ఇప్పటివరకు మూడుసార్లు గడువు పొడిగించారు. ఇప్పుడు నాలుగోసారి పొడిగింపు దిశగా చర్చలు సాగుతున్నాయి.

ఫిట్‌మెంట్ లెక్కలు..
ఉద్యోగ సంఘాలు 51 శాతం ఫిట్‌మెంట్ కావాలని కోరుతుండగా, ప్రభుత్వంపై పడే ఆర్థిక భారం ఇలా ఉండవచ్చు.

ఫిట్‌మెంట్ శాతం అంచనా వ్యయం (వార్షికంగా)
30% (ప్రభుత్వ అంచనా) సుమారు ₹7,500 కోట్లు
51% (సంఘాల డిమాండ్) సుమారు ₹12,750 కోట్లు

నోట్: ఒక్క శాతం ఫిట్‌మెంట్ పెంచితే నెలకు ₹250–300 కోట్ల అదనపు భారం పడుతుంది.

ఆర్థిక పరిస్థితే అడ్డంకా?
రాష్ట్ర ఆదాయం కంటే వ్యయం ఎక్కువగా ఉండటం, ఇటీవల రెండు డీఏల (DA) ప్రకటించిన నేపథ్యంలో.. పీఆర్సీ అమలు ఆర్థికంగా పెను సవాలుగా మారింది. బడ్జెట్‌లో దీనిపై స్పష్టత రాకపోతే, ఉద్యోగుల నిరీక్షణ మరో ఆరు నెలలు తప్పదని తెలుస్తోంది.

వాస్తవానికి రెండో పీఆర్సీ 2023 జూలై 1 నుంచే అమలులోకి రావాలి. గడువులను పదేపదే పొడిగించడం వల్ల తాము ఆర్థికంగా నష్టపోతున్నామని ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వచ్చే బడ్జెట్ సమావేశాల్లోనైనా దీనిపై కీలక ప్రకటన చేస్తుందో లేదో వేచి చూడాలి.

Also Read: Shambhavi Pathak: అజిత్ పవార్ విమాన ప్రమాదం..కాక్‌పిట్‌లో పైలట్స్ చివరి మాటలు..అసలేం జరిగిందంటే?

Also Read: Pakistan Boycott World Cup: టీ20 వరల్డ్‌కప్‌లో పాకిస్థాన్ టీమ్ బహిష్కరిస్తే..గ్రూప్-ఏ నుంచి సెమీస్‌కు వెళ్లే జట్లు ఇవే?!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
HDHarish Darla
Jan 28, 2026 10:13:28
Baramati, Maharashtra:

Ajit Pawar Pilot Shambhavi Pathak: మహారాష్ట్ర రాజకీయాల్లో పెను విషాదం నింపిన అజిత్ పవార్ విమాన ప్రమాదానికి సంబంధించిన మరిన్ని భయంకరమైన నిజాలు బయటకు వస్తున్నాయి. ప్రమాదం జరగడానికి కొన్ని క్షణాల ముందు విమానంలో అసలేం జరిగింది? పైలట్లు చివరి నిమిషంలో ఎందుకు మేడే (Mayday) కాల్ చేయలేకపోయారు? అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

బారామతి విమానాశ్రయం రన్‌వేకు కేవలం 100 మీటర్ల దూరంలో చార్టర్డ్ విమానం కుప్పకూలిన ఘటనలో అజిత్ పవార్‌తో సహా ఐదుగురు మరణించారు.

మృత్యుఘోష.."ఓహ్ షిట్... ఓహ్ షిట్"
విమాన ప్రమాదాల్లో అత్యవసర సమయంలో పైలట్లు చేసే 'మేడే' (Mayday) కాల్‌ను కెప్టెన్ సుమిత్ కపూర్ చేయలేకపోయారు. అయితే, ఆయనతో ఉన్న కో-పైలట్ కెప్టెన్ శంభవి పాఠక్ చివరి క్షణంలో "ఓహ్ షిట్... ఓహ్ షిట్" అని అరిచినట్లు రికార్డింగ్స్ ద్వారా తెలుస్తోంది. అంటే, ప్రమాదం జరగబోతుందని వారికి ముందే అర్థమైనా, ప్రాణాలు కాపాడుకునే సమయం దొరకలేదని స్పష్టమవుతోంది.

ల్యాండింగ్ ప్రయత్నాలు విఫలం..
తొలి ప్రయత్నం: ఉదయం పూట దట్టమైన పొగమంచు వల్ల రన్‌వే 11 సరిగ్గా కనిపించలేదు. దీంతో పైలట్లు విమానాన్ని ల్యాండ్ చేయలేక మళ్లీ పైకి తీసుకెళ్లారు.

రెండో ప్రయత్నం: కొద్దిసేపటి తర్వాత మళ్లీ ల్యాండింగ్‌కు ప్రయత్నించినప్పుడు, విమానం వేగంగా రన్‌వే వైపు దూసుకొచ్చింది. కానీ నేలను తాకే ముందే విమానం అదుపు తప్పి బోల్తా పడి కుప్పకూలింది.

ప్రత్యక్ష సాక్షుల కథనం..
విమానం నేలను ఢీకొట్టగానే భారీ పేలుడు సంభవించింది. ఆ తర్వాత మరో 4 నుండి 5 సార్లు పేలుళ్లు జరగడంతో విమానం తునకలైంది. "విమానం మా గ్రామంపై నుండే ఎగిరింది. కూలిన తర్వాత పేలుడు ధాటికి విమానం భాగాలు ఎగిరి మా ఇళ్లపై పడ్డాయి" అని గ్రామస్తులు తెలిపారు. మంటలు ఎగసిపడుతుండటంతో ప్రాణాలు కాపాడేందుకు గ్రామస్తులు చేసిన ప్రయత్నం విఫలమైంది.

అజిత్ పవార్ చివరి కాల్..
విమానం ఎక్కే ముందు అజిత్ పవార్ తన మేనల్లుడు రంజాగ్జిత్ సింగ్ పాటిల్‌కు ఫోన్ చేశారు. "ల్యాండింగ్ అయ్యాక మళ్ళీ మాట్లాడతాను" అని చెప్పిన అజిత్ పవార్ మాటలు చివరికి ఆఖరి మాటలుగా మిగిలిపోయాయి. బుధవారం ఉదయం 8:45 గంటలకు ఈ ఘోరం జరిగింది.

దర్యాప్తు ప్రారంభం..
ప్రస్తుతం ఎయిర్‌క్రాఫ్ట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) ఈ ప్రమాదంపై సమగ్ర విచారణ చేపట్టింది. ఢిల్లీలోని విమాన ఆపరేటర్ VSR వెంచర్స్ కార్యాలయంలో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. పొగమంచు కారణమా? లేక సాంకేతిక లోపమా? అన్న కోణంలో దర్యాప్తు సాగుతోంది.

Also Read: Ajit Pawar Plane Crash: మహారాష్ట్ర రాజకీయాల్లో అజిత్ పవార్.."దాదా" ప్రస్థానం, ఆరుసార్లు ఉపముఖ్యమంత్రి రికార్డు!

ALso Read: Ajit Pawar Net Worth: అజిత్ పవార్ ఆస్తుల చిట్టా..రూ.124 కోట్ల సామ్రాజ్యం..భార్య వద్ద 28 క్యారెట్ల వజ్రం!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
HDHarish Darla
Jan 28, 2026 07:05:02
Hyderabad, Telangana:

Pakistan Boycott T20 World Cup 2026: ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026కు సంబంధించి ఒక ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. బంగ్లాదేశ్ ఈ టోర్నీ నుంచి తప్పుకున్న నేపథ్యంలో, ఇప్పుడు పాకిస్థాన్ కూడా భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరిస్తామంటూ హెచ్చరికలు జారీ చేస్తోంది. ఒకవేళ పాక్ గనుక భారత్‌తో మ్యాచ్ ఆడకపోతే పాయింట్ల పట్టికపై ఎలాంటి ప్రభావం పడుతుంది? సెమీస్ సమీకరణాలు ఎలా మారతాయనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

గ్రూప్-ఏలో భారత్, పాకిస్థాన్‌లతో పాటు నమీబియా, నెదర్లాండ్స్, అమెరికా (USA) జట్లు ఉన్నాయి. ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా జరగాల్సిన భారత్-పాక్ మ్యాచ్‌పై ఇప్పుడు నీలి నీడలు కమ్ముకున్నాయి.

పాక్ బహిష్కరిస్తే భారత్‌కు లాభమేంటి?
ఒకవేళ పాకిస్థాన్ కేవలం భారత్‌తో మ్యాచ్ ఆడేందుకు నిరాకరిస్తే, ఐసీసీ నిబంధనల ప్రకారం దానిని 'వాకోవర్' (Walkover) గా పరిగణిస్తారు. దీంతో టీమ్ఇండియాకు ఆటోమేటిక్‌గా 2 పాయింట్లు లభిస్తాయి. దీనివల్ల భారత్ సూపర్-8 దశకు చేరుకోవడం చాలా సులభమవుతుంది.

అదే విధంగా పాకిస్థాన్‌కు సున్నా పాయింట్లు లభిస్తాయి. గ్రూప్ దశలో ఒక్క మ్యాచ్ పాయింట్లు కోల్పోయినా, సూపర్-8 రేసు నుంచి పాక్ తప్పుకోవాల్సి వస్తుంది. మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో (నమీబియా, నెదర్లాండ్స్, USA) పాక్ ఖచ్చితంగా గెలవాల్సి ఉంటుంది.

పాక్ పూర్తిగా తప్పుకుంటే?
ఒకవేళ పాకిస్థాన్ ఈ టోర్నీ నుంచి పూర్తిగా వైదొలిగితే, ఐసీసీ ఖాళీ అయిన ఆ స్థానాన్ని భర్తీ చేస్తుంది. ర్యాంకింగ్స్ ఆధారంగా తదుపరి అత్యున్నత ర్యాంకు ఉన్న ఉగాండా జట్టుకు అవకాశం దక్కవచ్చు. ఇప్పటికే టోర్నీ నుంచి తప్పుకున్న బంగ్లాదేశ్, పాక్ స్థానంలో మళ్ళీ వచ్చేందుకు ఐసీసీని ఒప్పించే అవకాశం ఉంది.

పాకిస్థాన్‌పై ఐసీసీ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది?
భారత్‌తో మ్యాచ్ ఆడకపోయినా లేదా టోర్నీ నుంచి తప్పుకున్నా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఐసీసీ గ్లోబల్ టోర్నీల నుంచి పాకిస్థాన్‌ను కొంతకాలం నిషేధించే అవకాశం ఉంది. పీఎస్ఎల్ (PSL) ఆడే అంతర్జాతీయ ఆటగాళ్లకు ఎన్ఓసీలు నిరాకరించడం వంటి ఆర్థిక పరమైన ఆంక్షలు విధించవచ్చు. ప్రసారకర్తలు, స్పాన్సర్ల నుంచి వచ్చే ఆదాయంలో పాకిస్థాన్‌కు కోత పడుతుంది.

సెమీస్ చేరే జట్లు ఏవి?
ప్రస్తుత ఫామ్, సమీకరణాలను బట్టి గ్రూప్-ఏ నుంచి భారత్ అగ్రస్థానంలో నిలిచి సూపర్-8కు చేరడం దాదాపు ఖాయం. పాకిస్థాన్ ఆడితే రెండో జట్టుగా వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ పాక్ తప్పుకుంటే, అమెరికా (USA) లేదా నెదర్లాండ్స్ జట్ల మధ్య రెండో స్థానం కోసం గట్టి పోటీ నెలకొంటుంది.

పాకిస్థాన్ ప్రభుత్వం, పీసీబీ తీసుకునే నిర్ణయంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రాజకీయ కారణాలతో క్రికెట్‌ను బహిష్కరిస్తే అది పాక్ జట్టు భవిష్యత్తుకే ముప్పుగా మారే ప్రమాదం ఉంది.

Also Read: Ajit Pawar Net Worth: అజిత్ పవార్ ఆస్తుల చిట్టా..రూ.124 కోట్ల సామ్రాజ్యం..భార్య వద్ద 28 క్యారెట్ల వజ్రం!

Also Read: Ajit Pawar Plane Crash: మహారాష్ట్ర రాజకీయాల్లో అజిత్ పవార్.."దాదా" ప్రస్థానం, ఆరుసార్లు ఉపముఖ్యమంత్రి రికార్డు!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
AMAruna Maharaju
Jan 28, 2026 06:30:11
Balapur, Telangana:

Key Update On Rythu Bharosa Scheme: రాష్ట్రంలోని రైతులు 'రైతు భరోసా' పథకం కింద ప్రభుత్వం అందజేసే యాసంగి పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తున్నారు. దీంతో ఫిబ్రవరి మొదటి వారంలో రైతు భరోసా నిధులు అర్హులైన రైతుల ఖాతాల్లో జమ చేస్తామని ప్రభుత్వ వర్గాలు ఇటీవల పేర్కొన్నాయి. అయితే, రాష్ట్రంలో తాజా పరిణామాల నేపథ్యంలో రైతు భరోసాకు ఇంకా సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

రైతు భరోసా సాయం కోసం రైతులకు నిరీక్షణ తప్పేలా లేదు. మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ జారీ నేపథ్యంలో రాష్ట్రంలో ఈ పథకం మరి కొంత కాలం జాప్యం కానుంది. రైతు భరోసా నిధుల జమ ప్రక్రియ ఫిబ్రవరి చివరి వారం లేదా మార్చి మొదటి వారంలో జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.

ఆర్థిక శాఖ ఇప్పటికే రూ. 8 వేల కోట్ల నిధుల సమీకరణలో ఉంది. అయితే బడ్జెట్ కసరత్తు , కేంద్ర సాయాలు, రాష్ట్ర తాజా ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఆర్థిక పరిస్థితులు పెద్దగా ఆశాజనకంగా లేవు. అయినప్పటికీ ప్రభుత్వం ఈ పథకం అమలు చేయాలని భావిస్తుంది. అర్హులకే లబ్ధి చేకూర్చాలనే యోచన కారణంగా స్వల్ప ఆటంకాలు ఎదురవుతున్నాయని అధికారులు చెబుతున్నారు.

సాగులో ఉన్న భూములను పక్కాగా గుర్తించేందుకు ప్రభుత్వం చేపట్టిన శాటిలైట్ సర్వే కారణంగా ఈ ఆలస్యం జరుగుతోంది. అగ్రికల్చర్ యూనివర్శిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సర్వే నివేదిక అందాక.. కేవలం పంట సాగు చేస్తున్న రైతులకు మాత్రమే రైతు భరోసా నిధులు అందనున్నాయి. సాగు చేయని భూములకు ఈసారి నిధులు జమ నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పారదర్శకత కోసమే ఈ నిబంధనలు అమలు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు.

Also Read: Medaram Jatara: నేటి నుంచి 4 రోజుల పాటు మేడారం మహాజాతర.. అత్యంత కీలక ఘట్టం ఏంటో తెలుసా..?

Also Read: Arijit Singh: ఫుల్ ఫామ్‌లో ఉండగానే రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ సింగర్.. షాక్‌లో ఫ్యాన్స్..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
HDHarish Darla
Jan 28, 2026 06:27:38
Badapur, Maharashtra:

Ajit Pawar Net Worth 2026: మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన వార్త విషాదంలోకి నెట్టివేసింది. మరాఠా రాజకీయాల్లో పరిపాలనా దక్షుడిగా పేరుగాంచిన ఆయన.. ఎన్నో రకాలుగా వార్తల్లో నిలిచారు. అయితే అజిత్ పవార్ జీవితాంతం సంపాదించిన  ఆస్తుల వివరాలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. 

ఎన్నికల అఫిడవిట్ల ప్రకారం, గత ఐదేళ్లలో ఆయన సంపద గణనీయంగా పెరగడం గమనార్హం. రాజకీయాల్లోనే కాకుండా వ్యాపారం, వ్యవసాయ రంగాల్లోనూ అజిత్ పవార్ కుటుంబం బలమైన ఆర్థిక పునాదులు కలిగి ఉంది.

5 ఏళ్లలో రూ.50 కోట్ల పెరుగుదల
ఎన్నికల సంఘానికి సమర్పించిన తాజా గణాంకాల ప్రకారం, అజిత్ పవార్ సంపద వేగంగా వృద్ధి చెందింది. 2019 నాటికి దాదాపు రూ.75 కోట్లుగా ఉన్న ఆస్తి.. 2024-25 నాటికి రూ.124.55 కోట్లు దాటింది.

ఆయన సంపద ప్రధానంగా స్థిరాస్తుల రూపంలో ఉంది. స్థిరాస్తులు (భూమి, ఇళ్లు) సుమారు రూ.97.94 కోట్లు ఉండగా..  చరాస్తులు (నగదు, పెట్టుబడులు) రూ.26.60 కోట్లు ఉన్నట్లు సమాచారం. బ్యాంక్ నిల్వల్లో వివిధ ఖాతాలలో రూ.6.81 కోట్లకు పైగా డిపాజిట్లు ఉన్నాయి.

భార్య సునేత్రా పవార్ ఆస్తులే ఎక్కువ!
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, అజిత్ పవార్ కంటే ఆయన భార్య సునేత్రా పవార్ పేరు మీద ఎక్కువ ఆస్తులు ఉన్నాయి. మొత్తం ఆస్తి సుమారు రూ.127.6 కోట్లు ఉండగా.. ఆమె వద్ద 28 క్యారెట్ల వజ్రంతో సహా రూ.1.19 కోట్ల విలువైన బంగారం, వెండి, వజ్రాభరణాలు ఉన్నాయి. ఆమె పేరు మీద రూ.58 కోట్ల విలువైన భూములు, భవనాలు ఉన్నాయి.

పెట్టుబడులు, వాహనాలు
అపారమైన సంపద ఉన్నప్పటికీ, అజిత్ పవార్ పేరిట ఎటువంటి ఎల్ఐసీ (LIC) లేదా లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు లేకపోవడం గమనార్హం. ఆయనకు వివిధ కంపెనీల షేర్లు, బాండ్లు, మ్యూచువల్ ఫండ్లలో భారీ పెట్టుబడులు ఉన్నాయి. అజిత్ పవార్ వద్ద టయోటా కామ్రీ, హోండా CRV, హోండా అకార్డ్ వంటి లగ్జరీ కార్లతో పాటు.. తన వ్యవసాయ నేపథ్యానికి తగ్గట్లుగా ట్రాక్టర్, మూడు ట్రైలర్లు కూడా కలిగి ఉన్నారు.

అప్పులు, ఆదాయ వనరులు
ఆస్తులతో పాటు పవార్ కుటుంబానికి సుమారు రూ.21.39 కోట్ల రుణాలు (Loans) ఉన్నాయి. వీరికి ప్రధానంగా వ్యవసాయం, రియల్ ఎస్టేట్ మరియు వివిధ వ్యాపారాల ద్వారా ఆదాయం సమకూరుతోంది. బారామతి, పూణే ప్రాంతాల్లో వీరికి కోట్లాది రూపాయల విలువైన వ్యవసాయ భూములు ఉన్నాయి.

Also Read: Ajit Pawar Plane Crash: మహారాష్ట్ర రాజకీయాల్లో అజిత్ పవార్.."దాదా" ప్రస్థానం, ఆరుసార్లు ఉపముఖ్యమంత్రి రికార్డు!

ALso Read: Padma Awards Benefits: పద్మ అవార్డుల పవర్ ఇదే! పురస్కార గ్రహీతలకు లభించే రాచమర్యాదలు ఇవే!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
HDHarish Darla
Jan 28, 2026 06:14:45
Hyderabad, Telangana:

Sideways Market Strategy: షేర్ మార్కెట్ ఎప్పుడూ ఒకేలా ఉండదు. భారీ పెరుగుదల లేదా ఒడిదుడుకుల తర్వాత, మార్కెట్ సాధారణంగా ఒక సమీకరణ దశ (Consolidation Phase) లోకి ప్రవేశిస్తుంది. 2025 ముగింపులో భారతీయ మార్కెట్లు సరిగ్గా ఇటువంటి దశలోనే ఉన్నాయి. ఇక్కడ మార్కెట్ దిశ కంటే మీ పెట్టుబడి వ్యూహమే కీలకం. బజాజ్ ఫిన్‌సర్వ్ అసెట్ మేనేజ్‌మెంట్ హెడ్ (ఈక్విటీ) సొర్భ్ గుప్తా విశ్లేషణ ప్రకారం.. మార్కెట్లు ఒకే పరిమితిలో కదులుతున్నప్పుడు పెట్టుబడిదారులు అనుసరించాల్సిన వ్యూహాలపై వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

సైడ్‌వేస్ మార్కెట్ అంటే ఏమిటి?
మార్కెట్ సూచీలు (Nifty/Sensex) పెద్దగా పెరగకుండా లేదా తగ్గకుండా ఒకే రేంజ్ లో కదలడాన్ని సైడ్‌వేస్ మార్కెట్ అంటారు.
అపోహ: మార్కెట్ పెరగడం లేదు కాబట్టి అవకాశాలు లేవని చాలామంది భావిస్తారు.
వాస్తవం: సూచీలు స్థిరంగా ఉన్నా, లోలోపల వివిధ రంగాలు, స్టాక్స్ మధ్య పనితీరులో చాలా వ్యత్యాసం (Dispersion) ఉంటుంది. కొన్ని రంగాలు పుంజుకుంటే, మరికొన్ని క్షీణిస్తాయి.

ఫ్లెక్సీ క్యాప్ (Flexi Cap) ప్రయోజనం
మార్కెట్ ఒకే పరిమితిలో ఉన్నప్పుడు, కఠినమైన నియమాలు ఉన్న ఫండ్స్ కంటే ఫ్లెక్సీ క్యాప్ వ్యూహాలు మెరుగ్గా పనిచేస్తాయి. దీనికి కారణాలు..

పరిమితులు లేవు: లార్జ్, మిడ్, స్మాల్ క్యాప్ కంపెనీల మధ్య ఎక్కడ అవకాశాలు ఉంటే అక్కడ పెట్టుబడి పెట్టే స్వేచ్ఛ ఫండ్ మేనేజర్‌కు ఉంటుంది.

వేగవంతమైన మార్పు: పరిస్థితులు మారినప్పుడు, స్థిరమైన ఆదాయం ఉన్న కంపెనీల నుండి అధిక వృద్ధి ఉన్న సంస్థల వైపు పెట్టుబడులను సులభంగా మళ్లించవచ్చు.

భారత ఆర్థిక వ్యవస్థలో మెగాట్రెండ్లు
మార్కెట్ సమీకరణ దశలో ఉన్నప్పటికీ, భారతదేశ దీర్ఘకాలిక వృద్ధికి పునాదులైన కొన్ని మెగాట్రెండ్లు బలంగా ఉన్నాయి:

1) డిజిటల్ స్వీకరణ, ఎనర్జీ ట్రాన్సిషన్.

2) మాన్యుఫాక్చరింగ్, ఫైనాన్షలైజేషన్.

3) ఆరోగ్యం, వెల్నెస్, ఫార్మలైజేషన్.

ఈ ట్రెండ్లు అన్ని రంగాలపై ఒకేలా ప్రభావం చూపవు. అందుకే, బలమైన వ్యాపార నమూనాలు కలిగిన సంస్థలను ఎంచుకోవడం (Bottom-up selection) ఈ దశలో అత్యంత ముఖ్యం.

డైవర్సిఫికేషన్: కేవలం రిస్క్ మేనేజ్‌మెంట్ మాత్రమే కాదు
సమీకరణ దశలు తరచుగా భవిష్యత్తులో వచ్చే భారీ ర్యాలీలకు పునాది వేస్తాయి. ఈ సమయంలో వైవిధ్యభరితమైన (Diversified) పోర్ట్‌ఫోలియోను కలిగి ఉండటం వల్ల ఒకే థీమ్ లేదా రంగంపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు.

అధిక విలువ నిర్ణయాలు (High Valuations) లేని మంచి నాణ్యమైన కంపెనీలను తక్కువ ధరకే కొనుగోలు చేసే అవకాశం లభిస్తుంది.

మార్కెట్లు స్తబ్దుగా ఉన్నప్పుడు నెమ్మదితనం కంటే, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మారే ఫ్లెక్సిబిలిటీ (అనుకూలత) నిజమైన వ్యత్యాసాన్ని సృష్టిస్తుంది. ఇది కేవలం స్వల్పకాలిక వ్యూహం కాదు, దీర్ఘకాలంలో సంపద సృష్టించడానికి ఒక అనివార్యమైన మార్గం.

(గమనిక: పైన పేర్కొన్న సమాచారం కేవలం కొన్ని నివేదికల ఆధారంగా రూపొందించింది మాత్రమే. దీన్ని పాటించే ముందు సంబంధిత నిపుణుడి సలహా తీసుకోవడం ఉత్తమం. దీన్ని జీ తెలుగు న్యూస్ ధ్రువీకరించడం లేదు.)

Also Read: Ajit Pawar Plane Crash: మహారాష్ట్ర రాజకీయాల్లో అజిత్ పవార్.."దాదా" ప్రస్థానం, ఆరుసార్లు ఉపముఖ్యమంత్రి రికార్డు!

Also Read: Anti Aging Superfoods: వయసు పెరిగినా యవ్వనంగా ఉండాలంటే..మీ డైట్‌లో ఈ సూపర్ ఫుడ్స్ ఉండేలా చూసుకోండి!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
HDHarish Darla
Jan 28, 2026 05:43:13
Badapur, Maharashtra:

Ajit Pawar Political Career: మహారాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేసి, పరిపాలనలో "దాదా" (పెద్దన్న) అని పిలుచుకునే అజిత్ పవార్ ఇకలేరు. ఈరోజు ఉదయం జరిగిన విమాన ప్రమాదంలో ఆయన మృతి చెందినట్లు జాతీయ మీడియా వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలో అజిత్ పవార్ రాజకీయ ప్రస్థానం అత్యంత ఆసక్తికరం. దశాబ్దాల కాలం పాటు బారామతి కోటను కాపాడుకుంటూ, రాష్ట్ర రాజకీయాల్లో కింగ్ మేకర్‌గా ఆయన ఎదిగిన తీరు అసాధారణం.

అజిత్ పవార్ రాజకీయ జీవిత విశేషాలు..
6 సార్లు ఉపముఖ్యమంత్రిగా..

మహారాష్ట్ర రాజకీయ చరిత్రలో వరుసగా కాకపోయినా అత్యధిక కాలం, అత్యధిక సార్లు (6 పర్యాయాలు) ఉపముఖ్యమంత్రిగా పనిచేసిన ఏకైక నాయకుడు అజిత్ పవార్. ఆయన విభిన్న సిద్ధాంతాలు కలిగిన ముఖ్యమంత్రుల వద్ద పనిచేశారు. పృథ్వీరాజ్ చవాన్ (కాంగ్రెస్), దేవేంద్ర ఫడ్నవీస్ (బిజెపి), ఉద్ధవ్ ఠాక్రే (శివసేన - MVA), ఏక్‌నాథ్ షిండే (శివసేన - మహాయుతి) వంటి నేతలు ముఖ్యమంత్రులుగా ఉన్న క్రమంలో అజిత్ పవార్ ఉపముఖ్యమంత్రిగా పనిచేశారు.

బారామతి వారసుడిగా..
1982లో ఒక సహకార చక్కెర కర్మాగారం బోర్డు సభ్యుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. అలాగే 1991లో పూణే జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టి, గ్రామీణ స్థాయిలో పట్టు సాధించారు. అదే ఏడాది 1991లో బారామతి పార్లమెంటరీ నియోజకవర్గం నుండి లోక్‌సభకు ఎన్నికైనప్పటికీ, తన మామ శరద్ పవార్ కోసం ఆ స్థానాన్ని త్యాగం చేశారు.

తిరుగులేని శాసనసభ్యుడు
బారామతి అసెంబ్లీ నియోజకవర్గం అంటే అజిత్ పవార్, అజిత్ పవార్ అంటే బారామతి అన్నట్లుగా ఆయన పట్టు సాధించారు. 1991 నుండి వరుసగా 7 సార్లు శాసనసభకు ఎన్నికయ్యారు (1995, 1999, 2004, 2009, 2014, 2019). నియోజకవర్గ అభివృద్ధిపై ఆయనకు ఉన్న కమాండ్, కార్యకర్తలతో ఉన్న అనుబంధమే ఆయనను "దాదా"గా మార్చింది.

పార్టీలో చీలిక, సరికొత్త మలుపు
2019లో దేవేంద్ర ఫడ్నవీస్‌తో కలిసి తెల్లవారుజామున ప్రమాణ స్వీకారం చేయడం ద్వారా రాజకీయ సంచలనం సృష్టించారు. అనంతరం 2023లో ఎన్‌సిపి (NCP) లో చీలిక తీసుకువచ్చి, మెజారిటీ ఎమ్మెల్యేలతో కలిసి షిండే ప్రభుత్వంలో చేరారు. ఫిబ్రవరి 2024లో కేంద్ర ఎన్నికల సంఘం అజిత్ పవార్ వర్గాన్నే అసలైన ఎన్‌సిపిగా గుర్తించి, 'గడియారం' గుర్తును కేటాయించింది.

వ్యక్తిగత జీవితం
జననం: జూలై 22, 1959. అహ్మద్‌నగర్‌లోని దేవ్‌లాలీ ప్రవరలో పాఠశాల విద్యను పూర్తి చేశారు.
విద్య: తండ్రి మరణంతో కుటుంబాన్ని ఆదుకోవాల్సి రావడంతో తన డిగ్రీని పూర్తి చేయలేకపోయారు.
కుటుంబం: భార్య సునేత్ర పవార్, కుమారులు జయ్, పార్థ్ పవార్.

పాలనా దక్షత, కఠినమైన క్రమశిక్షణ, సమయపాలనకు అజిత్ పవార్ పెట్టింది పేరు. రాజకీయాల్లో ఎన్ని మలుపులు వచ్చినా, మహారాష్ట్ర అధికార కేంద్రంలో తన స్థానాన్ని పదిలపరుచుకుంటూ ఆయన సాగిస్తున్న ప్రయాణం అద్భుతం.

Also REad: Padma Awards Benefits: పద్మ అవార్డుల పవర్ ఇదే! పురస్కార గ్రహీతలకు లభించే రాచమర్యాదలు ఇవే!

Also Read: Kavya Maran Celebration: స్టేడియంలో డ్యాన్స్ చేసిన కావ్య పాప..ఫైనల్లో సన్‌రైజర్స్ ఘనవిజయం..మూడోసారి ట్రోఫీ కైవసం!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
AMAruna Maharaju
Jan 28, 2026 04:22:18
Medaram, Telangana:

Medaram Maha Jatara Begins Today: దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం. రెండేళ్లకోసారి ఎంతో అట్టహాసంగా జరిగే ఈ మహా జాతరకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ జాతర ఇవాళ్టి నుంచి అనగా బుధవారం నుంచి ప్రారంభం కానుంది. జనవరి 28, 29, 30, 31 తేదీల్లో నాలుగు రోజుల పాటు ఈ మేడారం మహాజాతర జరగనుంది. ఈరోజు సాయంత్రం గద్దెలపైకి సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు రానున్నారు. 

బుధవారం సాయత్రం 6 గంటల సమయంలో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆ తరువాత కన్నెపల్లి నుంచి పూజారులు, జిల్లా అధికారులు సారలమ్మను తీసుకొస్తారు. సారలమ్మ గద్దెపైకి వచ్చేలోపు ఏటూరునాగారం కొండాయిలో కొలువైన గోవిందరాజులు.. మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్లలో కొలువైన పగిడిగద్దరాజును మేడారం గద్దెలపైకి తీసుకొస్తారు. ఇప్పటికే కొండాయి నుండి గోవిందరాజు, పూనుగొండ్ల నుండి పగిడిద్దరాజు ప్రతిరూపాలతో ఆదివాసీ పూజారులు కాలి నడకన బయలుదేరారు. పూనుగొండ్ల నుండి 65 కిలోమీటర్లు నడుచుకుంటూ పగిడిద్దరాజుతో పూజారులు మేడారంకు వస్తారు. ఈరోజు సాయంత్రం అధికారిక లాంఛనాలతో మంత్రులు సీతక్క, కొండా సురేఖ, జిల్లా కలెక్టర్ స్వాగతం పలకనున్నారు.

మేడారం మహా జాతరలో అత్యంత కీలక ఘట్టం సమ్మక్క ఆగమనం. ఆ వనదేవతను గురువారం (జనవరి 29) కొక్కెర కృష్ణయ్య నేతృత్వంలో మేడారం సమీపంలోని చిలుకల గుట్టపై నుంచి తీసుకొస్తారు. కుంకుమభరిణ రూపంలోని సమ్మక్కను తీసుకొచ్చే క్రమంలో ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ గౌరవ సూచకంగా గాల్లోకి కాల్పులు జరుపుతారు. అనంతరం సమ్మక్కను గద్దెపై ప్రతిష్టిస్తారు. శుక్రవారం (జనవరి 30) భక్తులు దర్శించుకొని ఎత్తు బంగారాలను సమర్పించడం ఆనవాయితీ. శనివారం (జనవరి 31) దేవతల వన ప్రవేశంతో మేడారం మహా జాతర ముగుస్తుంది.

తెలంగాణ కుంభమేళగా, ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా ఖ్యాతిగాంచిన మేడారం మహాజాతరను.. నాలుగు రోజులపాటు ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆత్మగౌరవానికి ప్రతీకలుగా కొలిచే సమ్మక్క–సారలమ్మ జాతరను వైభవంగా జరుపుకోవాలని పిలుపునిస్తూ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఇక మేడారం మహా జాతరకు పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. కోటిన్నర మందికిపైగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో 13వేల మంది పోలీసులతో జాతర భద్రత ఏర్పాట్లను జిల్లా ఎస్పీ పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే మేడారాన్ని సుమారు 45 లక్షల మందికి పైగా దర్శించుకున్నట్లు అధికారులు తెలిపారు. వచ్చే నాలుగు రోజులు భారీ సంఖ్యలో భక్తులు మేడారం మహా జాతరకు తరలిరానున్నారు.

Also Read: Arijit Singh: ఫుల్ ఫామ్‌లో ఉండగానే రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ సింగర్.. షాక్‌లో ఫ్యాన్స్..!

Also Read: AP Cabinet: నేడు ఏపీ క్యాబినేట్ సమావేశం.. చర్చించే కీలక అంశాలు ఇవే..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
TKTA Kiran Kumar
Jan 28, 2026 03:59:33
Hyderabad, Telangana:

Barabar Premistha Romantic Song:యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్‌ కథానాయకుడిగా యాక్ట్ చేస్తోన్న చిత్రం ‘బరాబర్ ప్రేమిస్తా’. సంపత్ రుద్ర డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న  ఈ చిత్రాన్ని కాకర్ల సత్యనారాయణ సమర్పణలో సిసి క్రియేషన్స్, ఎవిఆర్ మూవీ వండర్స్ బ్యానర్లపై గెడా చందు, గాయత్రి చిన్ని, ఎవిఆర్ ఎక్కడా కాంప్రమై్ కాకుండా తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో మిస్ ఇండియా ఫైనలిస్ట్ మేఘన ముఖర్జీ కథానాయికగా తెలుగు తెరకు పరిచయం కాబోతుంది. అర్జున్ మహీ ("ఇష్టంగా" ఫేమ్) ప్రతినాయకుడిగా యాక్ట్ చేశాడు.  ఇప్పటి వరకు ‘బరాబర్ ప్రేమిస్తా’ నుంచి వచ్చిన పోస్టర్లు, టీజర్, పాటలు ఇలా అన్నీ కూడా యువతను ఆకట్టుకున్నాయి.  తాజాగాఈ చిత్రాన్ని ఫిబ్రవరి 6న విడుదల చేయడానికి రెడీ అవుతున్నారు.  

ఈ క్రమంలో తాజాగా ఈ సినిమాను నుంచి ‘మళ్లీ మళ్లీ’ పాటను రిలీజ్ చేశారు  ప్రముఖ దర్శకుడు జయంత్ సి పరాన్జి.  ఈ రొమాంటిక్ మెలోడియస్‌ పాటలో చంద్రహాస్, మేఘన కెమిస్ట్రీ హైలెట్‌గా ఉండనుంది. ఇక ఇందులో ఆర్ఆర్ ధ్రువన్ ఇచ్చిన బాణీ ఎంతో  మధురంగా వినసొంపుగా ఉంది. ఆర్ఆర్ ధ్రువన్ అందించిన సాహిత్యం, మహమ్మద్ ఇర్ఫాన్ ఇచ్చిన గాత్రం మైమరిపిస్తోంది. ఈ పాటను చూస్తే ఇట్టే ఆకట్టుకునే డ్యూయట్ గా కనిపిస్తోంది.

Read more:​ సమంత కంటే ముందు రెండో పెళ్లి చేసుకున్న హీరోయిన్స్ వీళ్లే..! పూర్తి లిస్ట్ ఇదే..!

Read more:​  సమంత బాటలో దర్శకులను పెళ్లి చేసుకున్న హీరోయిన్స్ వీళ్లే..

జయంత్ సి పరాన్జి పాటను విడుదల చేసిన అనంతరం మాట్లాడుతూ.. ''మళ్ళీ మళ్ళీ అంటూ సాగే ఈ సాంగ్  బాగుంది. ఫిబ్రవరి 6న ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. అందరూ చిత్రాన్ని చూసి ఆదరించండని చెప్పుకొచ్చారు. అంతేకాదు మూవీ టీంకి ఆల్ ది బెస్ట్ చెప్పారు. 

ఈ చిత్రానికి వైఆర్ శేఖర్ కెమెరామెన్‌గా పనిచేశారు.  బొంతల నాగేశ్వర్ రెడ్డి ఎడిటర్‌గా వర్క్ చేశారు. ఈ చిత్రంలో ఆటిట్యూడ్ స్టార్ చంద్రహాస్, మేఘన ముఖర్జీ హీరో, హీరోయిన్లుగా నటించారు.  అర్జున్ మహి, మురళీధర్ గౌడ్, లక్ష్మణ్ మీసాల, మధునందన్, అభయ్ నవీన్, రాజశేఖర్ అనింగి, డాక్టర్ భతిని, కీర్తిలతా గౌడ్, సునీత మనోహర్ వంటి వారు కీలకపాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 6న రిలీజ్ చేస్తుండటంతో ప్రమోషన్ కార్యక్రమాల్ని కూడా వినూత్నంగా చేపట్డడం విశేషం. 

Also Read: వెయ్యి కోట్ల దర్శకులు.. ‘దురంధర్’తో ఈ క్లబ్బులో ఎంట్రీ ఇచ్చిన ఆదిత్యధర్..

Also Read: ఒకప్పుడు తెలుగు సహా అన్ని భాషల్లో సత్తా చాటిన హీరోయిన్.. నేడు రూ.2 వేల కోట్లకు యజమాని.. 5 కంపెనీలకు బాస్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. 

0
comment0
Report
TKTA Kiran Kumar
Jan 28, 2026 03:59:08
Hyderabad, Telangana:

Mohan Babu West Bengal Governor Excellence Award: నట ప్రపూర్ణ.. కలెక్షన్ కింగ్.. తెలుగు సినీ పరిశ్రమలో మోహన్ బాబు రూటే సెపరేటు అనే చెప్పాలి. కేవలం హీరోగానే కాకుండా.. విలన్ గా.. కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించారు. రీసెంట్ గా నటుడిగా 50 యేళ్ల నట ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న ఈయన కీర్తి కిరీటంలో మరో అవార్డు వచ్చి చేరింది. రిపబ్లిక డే సందర్భంగా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నుంచి గవర్నర్ ఎక్స్‌లెన్స్ అవార్డుని అందుకున్నారు మంచు మోహన్ బాబు. 

గణతంత్ర దినోత్సవం సందర్భంగా కోల్‌కత్తాలోని లోక్ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నుండి ప్రతిష్టాత్మక గవర్నర్ అవార్డు ఆఫ్ ఎక్సలెన్స్‌ను  డాక్టర్  ఎం. మోహన్ బాబు అందుకున్నారు. పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఈ అవార్డును విశిష్ట అతిథుల మధ్య ఆయనకు ప్రధానం చేయడం జరిగింది. ఆ తరువాత సాంప్రదాయ ఎట్ హోమ్ రిసెప్షన్ జరిగింది. ఈ కార్యక్రమంలో మోహన్ బాబు కుమారుడు, మా అధ్యక్షుడు విష్ణు మంచు, మా కోశాధికారి శివ బాలాజీ పాల్గొన్నారు.  

Read more:​ సమంత కంటే ముందు రెండో పెళ్లి చేసుకున్న హీరోయిన్స్ వీళ్లే..! పూర్తి లిస్ట్ ఇదే..!

Read more:​  సమంత బాటలో దర్శకులను పెళ్లి చేసుకున్న హీరోయిన్స్ వీళ్లే..

ప్రస్తుతం భారతదేశం అంతటా తెలుగు సినిమా ఎఫెక్ట్ కనబడుతుంది. ఈ క్రమంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఒక తెలుగు నటుడికి ఇటువంటి గౌరవాన్ని ప్రదానం చేయడం  ఇదే తొలిసారి అని చెప్పాలి.  మోహన్ బాబు 50 యేళ్ల  సినీ జీవితంలో కళామతల్లికి చేసిన సేవ, అట్టడుగు స్థాయి నుండి భారతదేశం గర్వించదగ్గ నటుడిగా ఎదిగారు.  విద్య, దాతృత్వంలో సమాజంపై చెరగని ముద్ర వేసారు. ఆయన సినీ, వ్యక్తిగత జీవితం, పాటించే క్రమశిక్షణ లక్షలాది మందికి స్ఫూర్తినిస్తుంది. గతంలో 2007లో భారత ప్రభుత్వం ఆయన్ని పద్మశ్రీ  అవార్డుతో గౌరవించింది. 

కళకు, కళాకారులకు హద్దులు ఉండవని, భాషా సరిహద్దులు ఉండవని మోహన్ బాబుకు వచ్చిన అవార్డుతో మరోసారి ప్రూవ్ అయింది.  అంతా ఒక్కటే అనే గణతంత్ర దినోత్సవ సారాంశాన్ని ఈ కార్యక్రమం ప్రతిబింబించింది.  మోహన్ బాబు ఈ అవార్డుని అందుకోవడంతో టాలీవుడ్ సెలెబ్రిటీలు, ఆయన అభిమానులు అభినందనలు తెలుపుతున్నారు. తెలుగు సినీ ఇండస్ట్రీలో  హీరోగా ఎంట్రీ ఇచ్చి విలన్ గా  ఆపై ఆపై క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా.. కమెడియన్ గా అలరించి.. మళ్లీ కథానాయకుడిగా రాణించిన నటుడు బహుశా తెలుగు సినీ చరిత్రలోనే కాదు.. ప్రపంచ సినీ చరిత్రలో ఎవరు లేరనే చెప్పాలి.  కేవలం హీరోగానే కాకుండా.. నిర్మాతగా పలు చిత్రాలు నిర్మించారు. అంతేకాదు హీరోగా ఉంటూ అత్యధిక చిత్రాలను నిర్మించిన నిర్మాతగా మన దేశంలోనే మోహన్ బాబు రికార్డు క్రియేట్ చేశారు.   

Also Read: వెయ్యి కోట్ల దర్శకులు.. ‘దురంధర్’తో ఈ క్లబ్బులో ఎంట్రీ ఇచ్చిన ఆదిత్యధర్..

Also Read: ఒకప్పుడు తెలుగు సహా అన్ని భాషల్లో సత్తా చాటిన హీరోయిన్.. నేడు రూ.2 వేల కోట్లకు యజమాని.. 5 కంపెనీలకు బాస్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. 

0
comment0
Report
TKTA Kiran Kumar
Jan 28, 2026 03:58:41
Hyderabad, Telangana:

BRS Leader Santosh Special Investigation Team : తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ మాజీ రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ రావును సిట్ విచారించింది. జూబ్లీహిల్స్‌లోని ఏసీపీ కార్యాలయంలో జరిగిన ఈ విచారణ సుమారు 5 నుంచి 7 గంటల పాటు కొనసాగింది. ఈ సందర్భంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సంతోష్ రావు పాత్ర ఏమిటి, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావును ఆ పదవిలో నియమించిన నిర్ణయం ఎవరిదనే దానిపై ఆయన పై ప్రశ్నల వర్షం కురిపించింది. 

ఆ నిర్ణయంలో సంతోష్ రావు పాత్ర ఎంతవరకు ఉందన్న అంశాలపై సిట్ అధికారులు లోతుగా ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించిన సాంకేతిక ఆధారాలు, పలు డాక్యుమెంట్లు చూపిస్తూ ప్రశ్నలు అడిగి ఆయన వాంగ్మూలాన్ని నమోదు చేశారు. విచారణ అనంతరం సంతోష్ రావు బయటికి వచ్చారు. అవసరమైతే మళ్లీ విచారణకు పిలవవచ్చని సమాచారం.

Read more:​ సమంత కంటే ముందు రెండో పెళ్లి చేసుకున్న హీరోయిన్స్ వీళ్లే..! పూర్తి లిస్ట్ ఇదే..!

Read more:​  సమంత బాటలో దర్శకులను పెళ్లి చేసుకున్న హీరోయిన్స్ వీళ్లే..

ఈ కేసులో ఇప్పటికే మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులను సిట్ ప్రశ్నించగా, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు సహా పలువురు పోలీసు అధికారులు అరెస్ట్ అయ్యారు. బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలోనే ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్న ఆరోపణలతో సిట్ దర్యాప్తు వేగంగా సాగుతుండగా, ఈ విచారణ తర్వాత కేసులో మరిన్ని కీలక మలుపులు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.

Also Read: వెయ్యి కోట్ల దర్శకులు.. ‘దురంధర్’తో ఈ క్లబ్బులో ఎంట్రీ ఇచ్చిన ఆదిత్యధర్..

Also Read: ఒకప్పుడు తెలుగు సహా అన్ని భాషల్లో సత్తా చాటిన హీరోయిన్.. నేడు రూ.2 వేల కోట్లకు యజమాని.. 5 కంపెనీలకు బాస్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. 

0
comment0
Report
TKTA Kiran Kumar
Jan 28, 2026 03:58:18
Hyderabad, Telangana:

Andhra Pradesh Cabinet Meet: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం బడ్జెట్ కు ముందు తన క్యాబినేట్ సమావేశం ఏర్పాటు చేయనుంది. చంద్రబాబు నాయుడు నేతృత్వంలో జరిగే ఈ సమావేశంలో పవన్ కళ్యాణ్, లోకేష్ సహా ఇతర మంత్రులు క్యాబినేట్ లో పలు తీర్మానాలు ప్రవేశపెట్టబోతున్నట్టు సమాచారం. అంతేకాదు ఈ భేటీలో పలు సంస్థలకు భూకేటాయింపులు చేసే అవకాశం ఉంది. దానికి క్యాబినేట్ ఆమోద ముద్ర వేయనున్నారు. 

అటు క్యాబినేట్ ఎజెండా అంశాలు పూర్తయ్యాక ఆంధ్ర ప్రదేశ్  బడ్జెట్ సెషన్ పై చర్చ జరగనుంది.ఈ క్యాబినేట్ సమావేశంలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.  అమరావతి గ్రామాల్లో అనాథలైన పిల్లలకు పెన్షన్ పథకం, రివర్ ఫ్రంట్ లో మెరీనా అభివృద్ధికి ఆమోదం తెలపనుంది కేబినెట్.

Read more:​ సమంత కంటే ముందు రెండో పెళ్లి చేసుకున్న హీరోయిన్స్ వీళ్లే..! పూర్తి లిస్ట్ ఇదే..!

Read more:​  సమంత బాటలో దర్శకులను పెళ్లి చేసుకున్న హీరోయిన్స్ వీళ్లే..

రాజధానిలో వీధిపోటు ప్లాట్లు 112 వేరే చోట ఇచ్చేందుకు అనుమతులు ఇవ్వనున్నారు. అటు హడ్కో నుంచి రూ. 4వేల 450 కోట్ల రుణానికి అనుమతివ్వనుంది కేబినెట్. అంతేకాదు ప్రతిపక్షం వైయస్ఆర్సీ నేతల విమర్శలు తిప్పికొట్టాలని మంత్రులకు చంద్రబాబు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది.  దావోస్ పర్యటనపైనా ఏపీ కేబినెట్ భేటీలో చర్చించే అవకాశం ఉంది. అంతేకాదు దావోస్ సమావేశంలో పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలతో ఎంవోయు కుదుర్చుకుంది. అంతేకాదు అమరావతిలో పెట్టుబడుల పెట్టడానికి వచ్చే వాళ్లకు సింగిల్ విండో పథకంలో అన్ని అనుమతులు మంజూరు చేయనున్నారు. 

Also Read: వెయ్యి కోట్ల దర్శకులు.. ‘దురంధర్’తో ఈ క్లబ్బులో ఎంట్రీ ఇచ్చిన ఆదిత్యధర్..

Also Read: ఒకప్పుడు తెలుగు సహా అన్ని భాషల్లో సత్తా చాటిన హీరోయిన్.. నేడు రూ.2 వేల కోట్లకు యజమాని.. 5 కంపెనీలకు బాస్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. 

0
comment0
Report
TKTA Kiran Kumar
Jan 28, 2026 03:57:59
Hyderabad, Telangana:

Perni Nani Case Filed: ఆంధ్ర ప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కక్షసాధింపు చర్యలు ఎక్కువయ్యాయని ప్రతిపక్ష  వైసీపీ ఆరోపణలు గుప్పిస్తోంది. అంతేకాదు గత ప్రభుత్వ హయాములో చంద్ర బాబు నాయుడుతో పాటు పవన్ కళ్యాణ్ పై రాజకీయంగా దాడి చేసిన వారిని ఒక్కొక్కరిగా టార్గెట్ చేస్తున్నట్టు ఆ పార్టీ నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఇప్పటికే పలువురు వైసీపీ నేతలను  ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వారిని టార్గెట్ చేస్తోంది. ముఖ్యంగా రాజకీయంగా, ఆర్ధికంగా వారిని దెబ్బే కొట్టే ప్రయత్నం చేస్తోంది. అలా వారిని మానసికంగా కృంగిపోయేలా చేస్తున్నారు. 

అయితే గత ప్రభుత్వ హయాములో వైసీపీలో కీలక నేతగా వ్యహరించిన మాజీ మంత్రి పేర్ని నాని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పై వీలునపుడల్లా రాజకీయంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో పేర్నినానిపై ఏపీ ప్రభుత్వం కేసులు పెట్టింది. నానిపై 196(1), 353(2), 351(2), 352 BNS సెక్షన్ల కింద కేసు పెట్టారు. 

Read more:​ సమంత కంటే ముందు రెండో పెళ్లి చేసుకున్న హీరోయిన్స్ వీళ్లే..! పూర్తి లిస్ట్ ఇదే..!

Read more:​  సమంత బాటలో దర్శకులను పెళ్లి చేసుకున్న హీరోయిన్స్ వీళ్లే..

రెండు రోజుల క్రితం ఏలూరు జిల్లా చాట్రాయిలో జరిగిన ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమత్రి వైఎస్ రాజశేఖర్  విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పేర్ని నాని రెచ్చిపోయి మాట్లాడారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై మండిపడిన టీడీపీ శ్రేణులు.. మచిలీపట్నంలోని ఇనగుదురుపేట పీఎస్‌లో నానిపై ఫిర్యాదు చేశారు. ఈ కంప్లైంట్ ఆధారంగా పేర్ని నానిపై కేసు నమోదు చేశారు. అయితే వైసీపీ వర్గాలు మాత్రం .. తమపై కక్ష సాధింపు చర్యలో భాగంగా ఈ కేసు నమోదు చేసినట్టు చెబుతున్నారు. 

Also Read: వెయ్యి కోట్ల దర్శకులు.. ‘దురంధర్’తో ఈ క్లబ్బులో ఎంట్రీ ఇచ్చిన ఆదిత్యధర్..

Also Read: ఒకప్పుడు తెలుగు సహా అన్ని భాషల్లో సత్తా చాటిన హీరోయిన్.. నేడు రూ.2 వేల కోట్లకు యజమాని.. 5 కంపెనీలకు బాస్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. 

0
comment0
Report
Advertisement
Back to top