icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Pinewz
504251
KASARLA RAMESHKASARLA RAMESHFollow3 Sept 2024, 09:40 am
0
0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

'ఈ ఏడాది సంతోషంగా రాలేదు.. క్రోధంతో వచ్చా..!' కుంభవృష్టి వర్షాలు: భవిష్యవాణిలో స్వర్ణలత

Hyderabad, Telangana:

Bhavishyavani Rangam 2026: ఆషాడమాస బోనాలు అంటే ఉజ్జయిని లష్కర్ బోనాలే. ఇందులో మొదటి రోజు ఆదివారం బోనాలు నిర్వహించిన మరుసటి రోజే రంగం నిర్వహిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా ఉజ్జయిని మహంకాళి సికింద్రాబాద్ రంగం కోసం భక్తులు ఎంతో ఎదురుచూస్తుంటారు. అమ్మవారు ఏం పలుకుతారో తెలుసుకోవడానికి పెద్ద సంఖ్యలో తరలివస్తారు. సికింద్రాబాద్ బోనాల మొదటి రోజు అంగరంగ వైభవంగా ముగిసిన తర్వాత, రెండో రోజు సోమవారం రంగం ద్వారా భవిష్యవాణి వినిపిస్తారు. అదే రోజున అంబారి ఊరేగింపు కూడా ఉంటుంది. ఈరోజు సికింద్రాబాద్ బోనాల రెండో రోజు సందర్భంగా, 2026కి సంబంధించిన రంగం భవిష్యవాణిని స్వర్ణలత వినిపించారు.

పచ్చి కుండపై నిలబడి ఆ ఏడాది ఎలా ఉండబోతుందో ఆమె భవిష్యవాణిని వినిపిస్తారు. ప్రభుత్వాలతో సహా కోట్లాది మంది భక్తులు అమ్మవారు ఏం పలుకుతారో అని ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ప్రతిసారి రాష్ట్రంలోని వర్షాలు, జాతర లోటుపాట్లపై ఆమె వివరిస్తూ ఉంటారు. నిన్న ఆలయం బయట జరిగిన జోగిల ఆందోళనలు, భక్తులు ఎదుర్కొన్న ఇబ్బందులపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఈ ఏడాది ఎలా ఉంటుందంటే?
ఈరోజు మాతంగి స్వర్ణలత భవిష్యవాణిలో ఈ ఏడాది కుంభవృష్టి కురుస్తుందని చెప్పారు. అలాగే అగ్ని ప్రమాదాలు కూడా ఎక్కువగా జరిగే అవకాశం ఉన్నందున, ప్రాణనష్టం జరగకుండా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. జనాలు వర్షాల ధాటికి కొట్టుకుపోయే ప్రమాదం కూడా ఉందని హెచ్చరించారు. తాను సంతోషంగా కాకుండా క్రోధంతో వచ్చానని, విగ్రహ ప్రతిష్టను తాను చెప్పినట్లు చేయలేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరు నెలల్లోనే ఈ ప్రక్రియ పూర్తి చేయాలని, లేదంటే ప్రాణనష్టం జరుగుతుందని ఆమె హెచ్చరించారు.   దీనిపై ఆలయ ప్రధాన పూజారి స్పందిస్తూ, ఆరు నెలల గడువు కాదని, ఏడాదిలోపు విగ్రహ ప్రతిష్ఠ చేస్తామని హామీ ఇచ్చారు.

అంబారీ ఊరేగింపు..
భక్తుల విశ్వాసం మేరకు అమ్మవారి ఘట్టాన్ని అనంతరం ఏనుగు అంబారిపై ఊరేగిస్తారు. దీనితో లష్కర్ బోనాల ఉత్సవాలు ఘనంగా ముగుస్తాయి. ఈరోజు ఉదయం 8 గంటల వరకు ఉజ్జయిని మహంకాళి ఆలయంలో సాంప్రదాయబద్ధంగా రంగం భవిష్యవాణి నిర్వహించి అనంతరం ఉదయం 10:30 గంటల నుంచి అంబారీ ఊరేగింపు నిర్వహిస్తున్నారు.

Also Read: Secunderabad Bonalu: సికింద్రాబాద్‌ బోనాల్లో అపచారం.. రోడ్డుపై పడిపోయిన బోనాలు

Also Read: లష్కర్ బోనాలు ధూంధాం.. అమ్మవారికి సాంప్రదాయబద్ధంగా బోనాలు ఎత్తిన సజ్జనర్, మల్లారెడ్డి ఫ్యామిలీ!

లష్కర్ అంబారి ఊరేగింపు..
లష్కర్‌లో బోనాల తర్వాత రంగం నిర్వహిస్తారు.. ఆ వెంటనే మరో ప్రధాన ఘట్టమైన అంబారి ఊరేగింపు ప్రారంభమవుతుంది. దీనినే 'గజ వాహన సేవ' అని కూడా పిలుస్తారు. మైసూర్ నుండి వచ్చిన ప్రత్యేకమైన ఏనుగును అందంగా అలంకరించి, అమ్మవారి భవ్య మూర్తికి ఉదయం 10:30 గంటలకు ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆలయం నుండి పరిసర గ్రామ దేవతల ఆలయాల మీదుగా ఊరేగింపు సాగుతుంది. ఈ క్రమంలో భక్తులు అమ్మవారికి అడుగడుగునా హారతులు, పూలవర్షంతో నీరాజనాలు అర్పిస్తారు.

 

అంబారి ఊరేగింపు మార్గం:
ఈరోజు ఉదయం 10:30 గంటల నుండి సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఊరేగింపు జరగనుంది. ఇది జనరల్ బజార్, ఎంజీ రోడ్డు, రాణిగంజ్, ఆర్పి రోడ్డు , ఓల్డ్ రాంగోపాల్‌పేట పిఎస్ మీదుగా సాగుతుంది. ఈ మార్గంలో ప్రయాణించేవారు ముందుగానే ప్రణాళిక చేసుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.

 

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report

మద్యం ప్రియులకు భారీ షాక్..రాయల్ ఛాలెంజ్, యాంటిక్విటీ విస్కీ అమ్మకాలపై నిషేధం!

BBhoomi1h ago
Secunderabad, Telangana:

Royal Challenge Whisky: ఫ్లేవరింగ్ నిబంధనలను ఉల్లంఘించినందుకు పలు మద్యం కంపెనీలపై భారత ఆహార భద్రత, ప్రమాణాల అథారిటీ (FSSAI) చర్యలను ముమ్మరం చేసింది. యునైటెడ్ స్పిరిట్స్ (USL) ఇన్‌బ్రూ బెవరేజెస్ సహా పలు కంపెనీల యూనిట్లకు నోటీసులు జారీ చేసింది. కొంతమంది తయారీదారులు.. ఉత్పత్తి   సహజ రుచి,  సువాసనను పోలి ఉండేలా రమ్‌కు రమ్ ఫ్లేవరింగ్, విస్కీకి విస్కీ ఫ్లేవరింగ్ వంటి ఫ్లేవర్లను కలుపుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఇది నిబంధనలను నేరుగా ఉల్లంఘించడమేనని FSSAI పేర్కొంది. ఫ్లేవరింగ్ పదార్థాల వాడకంపై తాము ఎలాంటి ఆంక్షలు విధించలేదని FSSAI ఒక అధికారిక ప్రకటనలో స్పష్టం చేసింది. కొన్ని తయారీ సంస్థలు ప్రామాణిక ఆల్కహాల్ పానీయాలకు ఫ్లేవర్లను కలుపుతున్నందున ఈ చర్య తీసుకున్నట్లు నియంత్రణ సంస్థ తెలిపింది. ఉదాహరణకు, రమ్‌లో రమ్ ఫ్లేవర్లను, విస్కీలో విస్కీ ఫ్లేవర్లను వాడుతున్నారు, ఇది నిబంధనలకు అనుగుణంగా లేదని పేర్కొంది. 

ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ (ఆల్కహాలిక్ బెవరేజెస్) రెగ్యులేషన్స్, 2018ను ఉల్లంఘించారనే ఆరోపణలపై జూలై 10న పలు మద్యం తయారీ కంపెనీలకు నోటీసులు జారీ చేసినట్లు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ తెలిపింది. ఆ సమయంలో, నియంత్రణ సంస్థ ఆ కంపెనీల పేర్లను, వాటి ప్లాంట్ల వివరాలను వెల్లడించలేదు. మధ్యప్రదేశ్ లో యునైటెడ్ స్పిరిట్స్ తయారు చేస్తున్న యాంటిక్విడీ బ్లూ విస్కీ, రాయల్ ఛాలెంజ్ విస్కీతోపాటు ఇన్ బ్రూ బేవరేజేస్ ఉత్పత్తి చేస్తున్న బ్యాగ్ పైపర్ డీలక్స్ విస్కీ, ఓల్డ్ కాస్క్ డీలక్స్ ట్రిపుల్ ఎక్స్ రమ్ ల అమ్మకాలను నిలిపివేయాలని ఎఫ్ఎస్ఎస్ఏఐ ఆదేశాలు జారీ చేసింది. కొన్ని కంపెనీలు విస్కీ, రమ్ తయారీలో ముడిసరుకులు, నిల్వ ప్రక్రియ ద్వారా సహజంగా రుచి, సువాసన వచ్చే విధంగా చేయడానికి బదులుగా బయటి నుంచి ఫ్లేవర్లను వాడుతున్నట్లు తమ తనిఖీల్లో తేలిందని వివరించింది. ఇది వినియోగదారులను ఉత్పత్తి నాణ్యత విషయంలో మోసగించినట్లేనని పేర్కొంది. 

అయితే ఈ నిషేధాన్ని సవాలు చేసిన రెండు తయారీ సంస్థలకు ఎఫ్ఎస్ఎస్ఏఐ పాక్షిక ఉపశమనాన్ని కల్పించింది. ఇప్పటికే మార్కెట్లో ఉన్న స్టాక్ అమ్ముకునేందుకు షరతులతో కూడిన పర్మిషన్ ఇచ్చింది. అయితే బాటిళ్ల ముందు భాగంలో వినియోగదారులకు స్పష్టంగా తెలియజేసేలా సవరించిన లేబుల్స్ అతికించాలని స్పష్టం చేసింది. కాగా యునైటెడ్ స్పిరిట్స్ దేశంలోనే అతిపెద్ద మద్యం తయారీ సంస్థ.. ఇన్ బ్రూ బేవరేజెస్ కూడా అగ్రగామి కంపెనీల్లో ఒకటిగా ఉంది. ఆహార, పానీయాల ప్రమాణాల విషయంలో ఎఫ్ఎస్ఎస్ఏఐ తన పర్యవేక్షణ కఠినతరం చేస్తోందని ఈ తాజా చర్యలు స్పష్టం చేస్తున్నాయి. 

Also Read: బంగారం కొనొద్దన్న మోదీ... ఆగిన కొనుగోళ్లు.. WGC లెక్కలు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

Also Read: కేంద్ర ప్రభుత్వం సంచలన ప్రాజెక్ట్.. రూ. 84,000 కోట్ల సముద్ర మంథన్.. ఏంటీ సముద్ర మంథన్?

Also Read: తెలంగాణ ఉద్యోగులు, పెన్షనర్లకు బిగ్ అలర్ట్..హెల్త్ కార్డ్ వివరాల

Also Read: EPF పెన్షనర్లకు షాక్.. నిలిచిపోయిన పింఛన్లు

 

 

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

0
0
Report

ఆగస్టు 1న శుక్రుడి సంచారం.. ఈ 3 రాశుల వారికి రాజయోగం, లక్ష్మీదేవి అనుగ్రహం!

PPINEWZ2h ago
Hyderabad, Telangana:

Venus Transit In Virgo Effect: జ్యోతిష్య శాస్త్రంలో సంపద, సౌందర్యం, ఆనందంతో పాటు విలాసాలకు కారకుడైన  శుక్ర గ్రహం తన స్థానాన్ని మార్చుకుంది.. ఆగస్టు 1న శుక్రుడు కన్యా రాశిలోకి సంచారం చేసింది.. రాబోయే 30 రోజుల పాటు శుక్రుడు ఇదే రాశిలో సంచార దశలో ఉంటాడు.. జ్యోతిష్య నిపుణుల ప్రకారం.. ఈ గ్రహ సంచారం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుందని జ్యోతిష్యలు తెలుపుతున్నారు.. శుక్రుడి రాశి సంచార ప్రభావం మొత్తం 12 రాశులపై పడినప్పటికీ.. ప్రత్యేకం‌గా 3 రాశుల వారికి మాత్రం ఈ సమయం అత్యంత అదృష్టదాయకంగా మారబోతోంది.

ఫ్యాషన్, మీడియాతో పాటు ఆర్ట్, బ్యాంకింగ్, బిజినెస్ రంగాల్లో ఉన్నవారికి ఈ 30 రోజుల కాలం గోల్డెన్ పీరియడ్‌గా మారబోతోందని జ్యోతిష్యలు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ సమయంలో కొన్ని రాశులవారికి అద్భుతమైన ధన లాభాలు కలిగే ఛాన్స్‌లు కూడా కనిపిస్తున్నాయి. అయితే, ఈ సమయంలో ఏయే రాశులవారికి అదృష్టం కలుగుతుందో? అదృష్టం పొందే రాశులేవో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ఆగస్టులో అదృష్టం పొందే రాశులవారు..
వృషభ రాశి (Taurus)
వృషభ రాశి అధిపతి స్వయంగా శుక్రుడే కావడంతో ఈ సంచారం వీరికి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఆగిపోయిన పనులు వేగవంతమవుతాయి. కొత్త ఆదాయ మార్గాలు సుగమమవుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి లేదా వ్యాపారాన్ని విస్తరించడానికి ఇది అనుకూలమైన సమయంగా చెప్పొచ్చు. భాగస్వామితో సంబంధాలు మరింత బలపడతాయి. ప్రేమ జీవితంలో శుభవార్తలు తప్పకుండా వింటారు.

సింహ రాశి (Leo)
సింహ రాశి వారికి రాబోయే కొన్ని వారాలు ఆర్థికంగా ఊహించని శుభవార్తలు కలుగుతాయి. వ్యాపారంలో భారీ లాభాలు లేదా అనుకోకుండా నిలిచిపోయిన డబ్బు చేతికి అందే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు ఆఫీసులో కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. ప్రమోషన్ లేదా జీతం పెరిగే సూచనలు స్పష్టంగా ఉన్నాయి. కుటుంబంలో ఏదైనా శుభకార్యం జరిగే అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ సమయంలో పెట్టుబడులు పెట్టడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయి. అలాగే దీర్ఘకాలిక సమస్యల నుంచి కూడా విముక్తి లభిస్తుంది.

ధనుస్సు రాశి (Sagittarius)
ధనుస్సు రాశి వారికి సంచారం వల్ల వ్యాపార, ఉద్యోగ రంగాలలో కొత్త శిఖరాలను తాకే ఛాన్స్‌లు కూడా కనిపిస్తున్నాయి. పెండింగ్‌లో ఉన్న డీల్స్ ఓకే అవుతాయి. పెద్ద కాంట్రాక్టులు లభించి భారీ ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు గణనీయంగా పెరుగుతాయి. రాబోయే రోజుల్లో ఉన్నత స్థాయికి చేరుకోవడానికి లభించే అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం మంచిది. అంతేకాకుండా అనుకున్న పనులు కూడా సులభంగా విజయవంతమవుతాయి. ముఖ్యంగా అనుకుంటున్న పనుల్లో విజయాలు సాధిస్తారు.

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

గమనిక.. 

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..

0
0
Report
Advertisement
Advertisement

MLA Virupakshi: ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్‌.. 'నారాసుర పాలనలో పరాకాష్టకు అరాచకం' వైఎస్‌ జగన్‌

Tadepalli, Andhra Pradesh:

MLA Virupakshi Arrest: 'నారాసుర పాలనలో పరాకాష్టకు అరాచకం! దాడి చేసినవారికి రక్షణ. బాధితులపై కేసులతో రాజకీయ కక్ష! రాష్ట్రంలో ఏం జరుగుతోంది చంద్రబాబు?' అని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రశ్నించారు. 'దాడి చేసినవారు అధికారపార్టీ వాళ్లయితే వారికి రక్షణ.. దాడికి గురైనవారు వైఎస్సార్‌సీపీ వాళ్లయితే వారిపైనే కేసులు. బాధితులకు అండగా నిలబడితే ప్రజాప్రతినిధులపై కేసులు! ప్రశ్నిస్తే అరెస్టులు ! నిలదీస్తే అర్ధరాత్రి తలుపులు బద్దలుకొట్టడం! ఇదేనా ప్రజాస్వామ్యం?ఇదేనా న్యాయం? ఇదేనా చట్టం?' అని చంద్రబాబును మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ ప్రశ్నలు సంధించారు.

ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్‌ సందర్భంగా 'ఎక్స్‌' వేదికగా వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ స్పందించారు. 'నేను సూటిగా అడుగుతున్నా. ఆలూరు బీసీ ఎమ్మెల్యే విరూపాక్షి ఏమైనా ఉగ్రవాదా? ప్రజల చేత ఎన్నుకోబడిన ఒక ఎమ్మెల్యే ఇంటిపై అర్ధరాత్రి 2.45 గంటలకు భారీ పోలీసు బలగాలతో దాడి చేయాల్సిన అవసరం ఏమొచ్చింది?' అని ప్రశ్నించారు. ఇంటి తలుపులు బద్దలుకొట్టి, ఎమ్మెల్యే విరూపాక్షిని, ఆయన కుమారుడు చంద్రశేఖర్‌ను అరెస్టు చేసిన తీరు చూస్తే రాష్ట్రంలో అసలు రూల్‌ ఆఫ్‌ లా అనేది ఉందా? అని మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ సందేహం వ్యక్తం చేశారు.

'చిప్పగిరి మండలం నేమకళ్లులో వైఎస్సార్‌సీపీ నాయకుడి ఇంటిపై టీడీపీవాళ్లు దాడి చేస్తే.. తన ప్రాణాలకు ప్రమాదం ఉందని, తన కుటుంబాన్ని కాపాడాలని ఆ నాయకుడు ఎమ్మెల్యే విరూపాక్షికి  కాల్‌ చేశాడు. ఒక కార్యకర్త ప్రాణభయంతో సహాయం కోరితే స్పందించడం ఎమ్మెల్యే చేసిన నేరమా? బాధిత కుటుంబానికి అండగా నిలబడటం తప్పా?' అని కూటమి ప్రభుత్వాన్ని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ ప్రశ్నించారు. చివరకు పరామర్శించేందుకు వెళ్లిన విరూపాక్షిపైనే టీడీపీ శ్రేణులు రాళ్లతో దాడి చేశాయని.. ఆ దాడిలో ఆయన సోదరుడు శ్రీరాముడు గాయపడ్డారని వివరించారు.

'నిజంగా చట్టం పనిచేస్తే ఎవరిని అరెస్టు చేయాలి? దాడి చేసినవారిని అరెస్టు చేయాలా? దాడికి గురైన ఎమ్మెల్యేను అరెస్టు చేయాలా? కానీ ఈ ప్రభుత్వంలో దాడి చేసినవారికి రక్షణ లభిస్తోంది. దాడికి గురైన ఎమ్మెల్యేనే నిందితుడిగా మార్చి ఆయనపైన, కార్యకర్తలపైన హత్యాయత్నం కేసులు బనాయిస్తున్నారు' అని చంద్రబాబు ప్రభుత్వంపై వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే ఇంట్లోని సీసీటీవీ హార్డ్‌డిస్కులను పోలీసులు ఎందుకు తీసుకెళ్లారు? అని ప్రశ్నించారు.

'అర్ధరాత్రి పోలీసులు చేసిన దౌర్జన్యానికి సంబంధించిన దృశ్యాలు బయటకు వస్తాయనే భయమా? తలుపులు ఎలా బద్దలుకొట్టారో.. కుటుంబ సభ్యులను ఎలా భయపెట్టారో.. ఎమ్మెల్యేను ఎలా అరెస్టు చేశారో... ప్రజలకు తెలియకూడదనే హార్డ్‌డిస్కులను తీసుకెళ్లారా? సాక్ష్యాలను కాపాడాల్సిన పోలీసులతోనే సాక్ష్యాలను మాయం చేయించే ప్రయత్నం చేస్తున్నారా చంద్రబాబు?' అని మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రశ్నలు సంధించారు.

'శ్రీకాకుళం జిల్లాలోనూ ఇదేరకంగా అరాచకం చేస్తున్నారు. ఒక రోడ్డు ప్రమాదాన్ని రాజకీయ కక్షతో హత్య కేసుగా మార్చారు. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును అరెస్టు చేశారు. చింతాడ రవికుమార్‌పై తీవ్రమైన సెక్షన్లతో కేసులు పెట్టారు. అనేకమంది నాయకులపై అక్రమ కేసులు నమోదు చేశారు. నాయకులు ప్రజల మధ్యకు వెళ్తే కేసులు. ప్రజలు నాయకులను కలిస్తే కేసులు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు. ప్రతిపక్షానికి మద్దతు పలికితే కేసులు. ఇది ప్రజాస్వామ్యమా? లేక మీ పోలీసు రాజ్యమా? లేక జంగిల్ రాజ్యమా?' అని చంద్రబాబు ప్రభుత్వంపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గుంటూరు ఈస్ట్‌ మాజీ ఎమ్మెల్యే షేక్‌ మొహ్మద్‌ ముస్తఫా, ఆయన కుమారుడిపైన ఇదే రాజకీయ కక్షసాధింపు అని పేర్కొన్నారు.

'రాష్ట్రంలోని జెన్‌జీ తరం ఇవాళ ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నిస్తూ పోరాటాలు చేస్తోంది. డీఎస్సీ–2025 అక్రమాలపై సీబీఐ విచారణ ఎందుకు జరపడం లేదు? అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి లోకేష్‌ ఎందుకు రాజీనామా చేయడం లేదు?' అని యువత ప్రశ్నిస్తోందని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ గుర్తుచేశారు. 'విద్యార్థులకు చెల్లించాల్సిన రూ.9,500 కోట్ల విద్యాదీవెన, వసతి దీవెన బకాయిలు ఎందుకు చెల్లించడం లేదు? నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి ఎందుకు మోసం చేశారు? మూడేళ్లకు ఒక్కో నిరుద్యోగికి బకాయిపడ్డ రూ.1.08 లక్షలు ఎప్పుడు చెల్లిస్తారు? అని అడిగితే నారా లోకేశ్‌ దగ్గర సమాధానం లేదు' అని వివరించారు. అందుకే ప్రజల దృష్టిని మళ్లించేందుకు అక్రమ కేసులు పెడుతున్నారని.. అర్ధరాత్రి అరెస్టులు చేస్తున్నారని.. పోలీసు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ విమర్శించారు.

'అధికారం శాశ్వతం కాదు. పోలీసు బలం శాశ్వతం కాదు. అక్రమ కేసులు శాశ్వతం కాదు. చంద్రబాబు గుర్తుపెట్టుకో' అని మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ హెచ్చరించారు. 'ఎన్ని కేసులు పెట్టినా.. ఎన్ని అర్ధరాత్రి అరెస్టులు చేసినా.. ఎన్ని తలుపులు బద్దలుకొట్టినా.. ఎన్ని పోలీసు బలగాలను దించినా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ వెనక్కి తగ్గదు' అని స్పష్టం చేశారు. అన్యాయాన్ని నిలదీస్తామని.. అరాచక పాలనపై పోరాడుతామని ప్రకటించారు.

 

 

0
0
Report
Advertisement

Secunderabad Bonalu: సికింద్రాబాద్‌ బోనాల్లో అపచారం.. రోడ్డుపై పడిపోయిన బోనాలు

Secunderabad, Telangana:

Secunderabad Bonalu: ఆషాఢ మాసంలో ప్రతిష్టాత్మకంగా హైదరాబాద్‌లోని సికింద్రాబాద్‌లో జరిగే ఉజ్జయిని మహంకాళి బోనాలు ఉద్రిక్తతకు దారి తీశాయి. ఏర్పాట్లలో కాంగ్రెస్‌ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహించడంతో భక్తులతోపాటు జోగినిలు, శివసత్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తీవ్ర తోపులాటతో భక్తులు అస్వస్థతకు గురయ్యారు. ఇక బోనాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచే శివసత్తులు, జోగినిలు క్యూలైన్‌లలో నిలబడలేక నీరసించిపోయి కిందపడిపోయారు. తోపులాట కారణంగా వారు ఎంతో భక్తిశ్రద్ధలతో తీసుకువచ్చిన బోనాలు రోడ్డుపై పడ్డాయి.

అధికారులు, ప్రభుత్వ తీరుతో జోగినిలు, శివసత్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీంతో సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి దేవాలయం వద్ద జోగిని శ్యామలతోపాటు ఇతర జోగినిలు, శివసత్తులు అందోళన చేశారు. ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాల భక్తులకు, ముఖ్యంగా బోనం ఎత్తుకొని వచ్చే మహిళలకు తగిన సౌకర్యాలు కల్పించలేదని జోగిని శ్యామల అవేదన వ్యక్తం చేశారు. భక్తులకు సరైన ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేస్తూ ఆలయం ముఖద్వారం ఎదుట జోగినిలు బైఠాయించి ఆందోళన చేశారు. తోపులాటలో సొమ్మసిల్లి రోడ్డుపై పడిపోయిన జోగినిలు, శివసత్తులు రేవంత్‌ రెడ్డి ప్రభుత్వంపై శాపనార్థాలు పెట్టారు. ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ జోగిని శ్యామల కన్నీటిపర్యంతమయ్యారు. తమకు అన్యాయం చేయడం తెలంగాణ రాష్ట్రానికి అరిష్టం అని జోగినిలు శాపనార్థాలు పెట్టారు.

భారీ భద్రతా ఏర్పాట్లు
చారిత్రాత్మక ఉజ్జయిని మహంకాళి బోనాల జాతరకు లక్షలాది మంది భక్తులు తరలివస్తుండటంతో హైదరాబాద్ పోలీసులు అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తున్నారు. తొలిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీని ప్రవేశపెట్టారు. భక్తుల భద్రతతో పాటు నేరస్థులు, సంఘ విద్రోహ శక్తులను గుర్తించే ఏర్పాట్లు చేశారు. మహంకాళి పోలీస్ స్టేషన్‌లో ప్రత్యేక కమాండ్ సెంటర్‌ను ఏర్పాటు చేసి.. దర్శనానికి వచ్చే భక్తుల ముఖచిత్రాలను ఏఐ ద్వారా విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే నేరచరిత్ర కలిగిన వ్యక్తులు లేదా సంఘ విద్రోహ కార్యకలాపాలకు పాల్పడే వారిని వెంటనే గుర్తించేలా ఈ వ్యవస్థ పనిచేస్తోంది. 15 మంది సిబ్బంది 20 సీసీ కెమెరాల ద్వారా నిరంతరం 48 గంటల పాటు పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. ప్రతి కదలికపై నిఘా ఉంచుతూ అనుమానాస్పద వ్యక్తులు గుర్తించిన వెంటనే సంబంధిత పోలీసు బృందాలకు సమాచారం అందించేలా ఏర్పాట్లు చేశారు.

0
0
Report
Advertisement

సీఎం పదవికి రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి: పాలమూరు ఎంపీ డీకే అరుణ డిమాండ్

Mahbubnagar, Telangana:

Revanth Reddy Apology: ‘రేవంత్ రెడ్డి హోదా మరచి మాట్లాడుతున్నారు. పేద విద్యార్థుల, తల్లిదండ్రులు అనేక ఇబ్బందులు ఎదుర్కొని, కూలీ పనులు చేస్తూ కష్టాలు పడి పిల్లలను చదివిస్తున్నారు. తమ పిల్లలు ఉన్నత విద్యవంతులు కావాలని కాలేజీలకు పంపిస్తే.. క్రిమినల్ వెస్ట్ అనడం సమంజసం కాదు‘ అని ఎంపీ డీకే అరుణ ప్రకటించారు. ‘విద్య శాఖ ఎవరి చేతుల్లో ఉంది.? విద్య శాఖ మంత్రి ఎవరు..? క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎందుకు ఇవ్వడం లేదు..? మూడు ఏళ్లలో విద్య రంగానికి మీరు చేసింది ఏంటి..?‘ అని డీకే అరుణ ప్రశ్నించారు. విద్యార్థులను అగౌరవపరిచేలా మాట్లాడం సమంజసం కాదని స్పష్టం చేశారు. విద్యార్థులు ప్రశ్నిస్తే.. లాఠీ ఛార్జ్ చేయిస్తూ.. కేసులు పెట్టడం బాధాకరమని తెలిపారు.  ఫీజు రీయింబర్స్ మెంట్ చేయలేక అడ్డమైన మాటలతో, అగౌరవపరిచేలా మాట్లాడటం ఏంటి.? అని రేవంత్ రెడ్డిని ఎంపీ డీకే అరుణ నిలదీశారు.

విద్యార్థులకు రేవంత్ రెడ్డి క్షమాపణలు కోరాలని ఎంపీ డీకే అరుణ డిమాండ్ చేశారు. విద్యా శాఖ మంత్రిగా ఆ కుర్చీలో కూర్చునే అర్హత రేవంత్ రెడ్డికి  లేదు. విద్యార్థులను గౌరవించలేనే వారు విద్య శాఖ మంత్రి, రాష్ట్ర సీఎం అంటే విద్య వ్యవస్థ ఎటు వెళ్తుంది. విద్య శాఖ దగ్గర పెట్టుకొని, విద్య రంగం బలోపేతం చేయలేకపోవడంతో అసమర్థులని నిరూపించుకున్నారు. బాధ్యత వహించి విద్య శాఖ కు రాజీనామా చేయాలి‘ బీజేపీ ఎంపీ డీకే అరుణ డిమాండ్ చేశారు.

‘విద్యార్థులపై లాఠీ ఛార్జ్ చేసే పోలీసులు.. కాంగ్రెస్ ప్రభుత్వానికి వినయం ప్రకటించుకోకండి. గత ప్రభుత్వం ఏం అయ్యిందో తెలుసు. విద్యార్థులు శాంతియుత నిరసన వ్యక్తం చేస్తే లాఠీఛార్జ్ చేయాల్సిన అవసరం ఏం వచ్చింది‘ అని ప్రశ్నించారు. విద్యార్థులపై పోలీసులు జరిపిన లాఠీఛార్జ్ ను ఈ సందర్భంగా డీకే అరుణ తీవ్రంగా ఖండించారు. ‘విద్యార్థుల పై ఎటువంటి కేసులు నమోదు చేయవద్దు. హార్వర్డ్ యూనివర్సిటీలో వీకెండ్ క్లాసులకు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లి, రెండు మాటలు నేర్చుకొని విద్యార్థులను అవమానించాల్సిన అవసరం లేదు.  విద్యార్థులందరికీ హార్వర్డ్ వెళ్లే అవకాశం రాదు. చేతనైతే విద్యార్థులకు అటువంటి అవకాశాలు కల్పించాలి‘ అని రేవంత్ రెడ్డికి మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ హితవు పలికారు.

0
0
Report

YSRCP: అబద్దాల్లో చంద్రబాబుకు గిన్నీస్ బుక్ రికార్డ్ ఇవ్వాలి: గుడివాడ అమర్‌నాథ్‌

Visakhapatnam, Andhra Pradesh:

Boghapuram Airport: ‘అబద్దాల విషయంలో చంద్రబాబుకు గిన్నీస్ బుక్ రికార్డ్ ఇవ్వాలి. కొబ్బరికాయ కొట్టింది.. గుమ్మడికాయ కొట్టింది నేనే అనే చంద్రబాబు మాటలు నిజమే‘ అని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఎద్దేవా చేశారు. ‘ప్రధానమంత్రి పాల్గొన్న వేదికపై జగన్ మోహన్ రెడ్డి విమర్శకు మాత్రమే కూటమి నేతలు దృష్టి పెట్టారు. భోగాపురం ఎయిర్ పోర్ట్ కట్టింది జగన్ మోహన్ రెడ్డి అన్నది ప్రజలు గుర్తించారు‘ అని గుడివాడ అమర్ నాథ్ తెలిపారు.

‘ఎయిర్‌పోర్ట్‌కు అవసరమైన భూమి లేకుండానే 2014లో చంద్రబాబు శంఖుస్థాపన చేశారు. ఎన్నికల ముందు ఎన్నో శిలాఫలకాలు చంద్రబాబు వేశారు. మే 19 2020లో భోగాపురం జిఎంఆర్ సర్టిఫికెట్ ఇన్కార్పొరేషన్  జరిగింది. నాలుగు గ్రామాలతో పాటు 2500 ఎకరాల భూ సేకరణ చేసి వెయ్యి కోట్లు పరిహారం జగన్ ప్రభుత్వం ముందు చేసింది. 2023 మే నెలలోనే అన్ని క్లియరెన్స్ తీసుకువచ్చి జగన్ మోహన్ రెడ్డి భోగాపురం ఎయిర్పోర్ట్ పనులకు శంకుస్థాపన చేశారు.2026 కల్లా పూర్తి చేస్తామని అప్పుడే సీఎంగా జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు' అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు గుడివాడ అమర్ నాథ్ వివరించారు.

‘భోగాపురం ఎయిర్ పోర్ట్ ప్రారంభోత్సవం స్వాగతిస్తున్నాం. సంతోషం. జీఎంఆర్ అధినేత మల్లికార్జునరావుకు ధన్యవాదాలు. భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవ వేదికపై ఎందుకు జీఎంఆర్‌తో మాట్లాడించలేదు?' అని అమర్ నాథ్ ప్రశ్నించారు. వాస్తవాలు చెబుతారనే జీఎంఆర్‌తో మాట్లాడించలేదని చెప్పారు. ‘రాష్ట్ర ప్రయోజనాలు మాత్రమే వైసీపీ ముఖ్యం. భోగాపురంలో యువతి మాటలను జగన్ మాటలుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు.నిన్న జరిగిన ప్రారంభోత్సవం కేవలం కూటమి ఈవెంట్ మేనేజ్ మెంట్ మాత్రమే' అని గుడివాడ అమర్ నాథ్ స్పష్టం చేశారు. కుప్పం ఎయిర్‌పోర్ట్ ఎక్కడ ఉందో చంద్రబాబు సమాధానం చెప్పాలని సవాల్ చేశారు. 2019 లో వేసిన కుప్పం శిలాఫలకం ఎక్కడ ఉందో చెప్పగలరా అని ప్రశ్నించారు.

‘మళ్లీ 2029లో శిలాఫలకాలు వేసే పనులు చంద్రబాబు నాయుడు మొదలు పెడతారు. ఉత్తరాంధ్రకు ఏం చేశారో బాబు చెప్పాలి. ఉత్తరాంధ్రను ఓటు బ్యాంక్ గా ఉత్తరాంధ్రను వాడుతున్నారు‘ అని కూటమి ప్రభుత్వంపై గుడివాడ అమర్ నాథ్ విమర్శలు చేశారు. 13 వేల మంది గిరిజనులతో థింసా డాన్స్ రికార్డు మినహా బాబు ప్రభుత్వం ఏం చెయ్యలేదని స్పష్టం చేశారు.

0
0
Report

ప్రైవేటు ఉద్యోగులకు EPFO గుడ్ న్యూస్...కష్ట సమయాల్లో పీఎఫ్ డబ్బులు ఇకపై UPI ద్వారా విత్ డ్రా చేసుకునే ఛాన్స్..!!

Lakshmapur, Telangana:

EPFO New Updates: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) పీఎఫ్ క్లెయిమ్ పనితీరును వేగంగా మార్చేందుకు, అనేక మార్పులు చేసేందుకు ముందుకు వచ్చింది. ఈ ప్రక్రియ వల్ల ఉద్యోగులకు ఎంతగానో లబ్ధి చేకూరాలని ఉంది. ముఖ్యంగా ఉద్యోగులు పిఎఫ్ డబ్బులను బయటకు తీసేందుకు ఈపీఎఫ్ఓ తీసుకున్నటువంటి నిర్ణయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. . తద్వారా అత్యవసర సమయాల్లో మీరు డబ్బులను విత్ డ్రా చేసుకోవడం చాలా సులభతరం అవుతుంది. 

 గతంలో పిఎఫ్ డబ్బులను బయటకు తీయాలి అంటే కనీసం 7 నుంచి 10  రోజుల వరకు సమయం పట్టేది కానీ ఇప్పుడు ఈపీఎఫ్ఓ పలు విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకుంది వీటి ద్వారా మీకు కేవలం 24 గంటల నుంచి 48 గంటల్లోగా డబ్బులు పడే అవకాశం ఉంటుంది.  ఈ కొత్త విధానం ద్వారా త్వరగా సెటిల్మెంట్లు పూర్తవుతున్నాయి తద్వారా ఉద్యోగులకు అత్యవసర సమయాల్లో ఆ డబ్బు ఎంతగానో ఉపయోగపడుతుంది అని చెప్పవచ్చు. 

 తాజాగా న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో EPFO సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ (CPFC) రమేష్ కృష్ణమూర్తి  పలు కీలకమైన విషయాలను ప్రకటించారు. ఇందులో అత్యంత కీలకమైనది ప్రావిడెంట్ ఫండ్ డబ్బులను మీ ఖాతా నుంచి బయటకు తీయడం ఎలాగో ఆయన పూర్తిస్థాయిలో వివరించారు. ప్రస్తుతం ఈపీఎఫ్వో ద్వారా ఉద్యోగులు తాము చేసే విత్ డ్రా క్లైములు అన్ని కూడా ఆటోమేటిక్ ప్రాసెస్ ద్వారానే జరుగుతున్నాయి. ఈ ఆటో సెటిల్మెంట్ విధానం ద్వారా ఎలాంటి మానవ జోక్యం తగ్గింది. ఫలితంగా క్లెయిములను ఆమోదించడామికి వేగం పెరుగుతోంది. తద్వారా ఉద్యోగులు త్వరగా తమ డబ్బులు తీసుకునేందుకు వీలు కలుగుతోంది. 

త్వరలో EPFO UPI ఆధారిత చెల్లింపు వ్యవస్థ ప్రారంభం: 
 ఇకపై క్లెయిమ్ ను మరింత వేగంగా చేసేందుకు కూడా ఈపీఎఫ్ఓ కొన్ని విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటోంది. తద్వారా మీరు పీఎఫ్ క్లెయింలను అత్యంత వేగంగా పరిష్కారం అయ్యేందుకు యూపీఐ లింక్ ఉన్న బ్యాంకు ఖాతా ద్వారా పూర్తి చేసేందకు ఈపీఎఫ్ఓ వ్యవస్థను ఏర్పాటు చేస్తోంది. ఇందులో భాగంగా మీ పీఎఫ్ క్లెయిమ్ ఆమోదం పొందిన అనంతరం కొద్ది సమయంలోనే UPI లింక్ ఉన్న బ్యాంకు ఖాతాలో నేరుగా మీ పీఎఫ్ డబ్బులు జమ అవుతాయి. 

అయితే ఈ యూపీఐ సేవలు మరికొన్ని నెలల్లో అమల్లోకి తెచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. అయితే దీనిని దశలవారీగా అమలు చేసేందుకు సిద్ధం చేస్తున్నారు. ఒకవేళ ఇది కనుక అమల్లోకి వచ్చినట్లయితే ఉద్యోగులు అత్యంత సులభంగా డబ్బులను బయటకు తీసుకొని తమ అత్యవసర ఖర్చులకోసం వినియోగించుకోవచ్చు. ఇది ఒక రకంగా ఉద్యోగులకు ఎంతో సులువైన ప్రక్రియగా చెప్పవచ్చు. 

 ఇక ఈపీఎఫ్  ఉద్యోగులకు అత్యంత ముఖ్యమైనది ఆటో సెటిల్మెంట్ దీని పరిమితిని ఒక లక్ష రూపాయల నుంచి 5 లక్షల రూపాయలకు పెంచుతూ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఢిల్లీలో జరిగిన సమావేశంలో EPFO సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ (CPFC) రమేష్ కృష్ణమూర్తి పేర్కొన్నారు. దీని ద్వారా అనారోగ్యంతో పాటు పెళ్లి ఇల్లు నిర్మాణం విద్యావంటి అత్యవసర సమయాల్లో పీఎఫ్ డబ్బులు సులభంగా పొందేందుకు అవకాశం ఏర్పడుతుంది.EPFO 3.0లో భాగంగా డాక్యుమెంటేషన్ ప్రక్రియ సైతం చాలా సులభంగా ఉండేలా చేశారు. అంతే కాదు రిజెక్షన్ అయ్యే అవకాశాలను కూడా తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

Also Read: బంగారం కొనొద్దన్న మోదీ... ఆగిన కొనుగోళ్లు.. WGC లెక్కలు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

Also Read: కేంద్ర ప్రభుత్వం సంచలన ప్రాజెక్ట్.. రూ. 84,000 కోట్ల సముద్ర మంథన్.. ఏంటీ సముద్ర మంథన్?

Also Read: తెలంగాణ ఉద్యోగులు, పెన్షనర్లకు బిగ్ అలర్ట్..హెల్త్ కార్డ్ వివరాల

Also Read: EPF పెన్షనర్లకు షాక్.. నిలిచిపోయిన పింఛన్లు

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

0
0
Report
Advertisement
Advertisement
Back to top