icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Pinewz
504251
KASARLA RAMESHKASARLA RAMESHFollow3 Sept 2024, 09:40 am
0
0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

Sircilla: 20 ఏళ్లలో ఇలాంటి దిగజారుడుతనం చూడలేదు..: కాంగ్రెస్‌పై KTR ఫైర్

Hyderabad, Telangana:

 Sircilla News: తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో గత 20 సంవత్సరాలుగా ఎప్పుడు లేని విధంగా అత్యంత దిగజారుడు రాజకీయాలు నడుస్తున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇటీవల దారుణ హత్యకు గురైన నేత కార్మికుడు వెంగళ వెంకటేశం కుటుంబాన్ని ఆయన స్వయంగా పరామర్శించారు. బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చి.. వారికి కొండంత అండగా ఉంటామని భరోసా కల్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ..  అధికార కాంగ్రెస్ పార్టీ నాయకుల తీరుపై KTR నిప్పులు చెరిగారు.

రాజకీయ లబ్ధి కోసం హత్యల పర్వమా..
కేవలం రాజకీయ లబ్ధి పొందడానికి ఒక సామాన్యుడిని అత్యంత దారుణంగా హత్య చేసి.. దానిని ఆత్మహత్యగా చిత్రీకరించే.. ప్రయత్నం చేయడం బాధాకరమని KTR విమర్శించారు. కాంగ్రెస్ నాయకులు చేస్తున్న..  ఈ అకృత్యాలను సభ్య సమాజం ఎప్పటికీ హర్షించదని.. వారిని క్షమించదని హెచ్చరించారు. BRS పార్టీని రాజకీయంగా ఎదుర్కోవాలనుకుంటే నేరుగా ఎన్నికల మైదానంలో తలపడొచ్చు.. మాపై కేసులు పెట్టొచ్చు, రాజకీయంగా వేధించవచ్చు. కానీ.. ఈ రాజకీయంలో ఏ పాపం తెలియని అమాయకులను, సామాన్యులను బలి చేయడం ఏంటని.. ఆయన సూటిగా ప్రశ్నించారు.

వెంగళ వెంకటేశం హత్య కేసులో పోలీసులు కేవలం కింది స్థాయి నాయకులను మాత్రమే అరెస్టు చేసి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారని KTR ఆరోపించారు. ఈ దారుణం వెనుక ఇంకా పెద్ద నాయకుల హస్తం ఉందని.. ఆ అసలు సూత్రధారులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని ఆయన స్పష్టం చేశారు. అమాయకుడి ప్రాణం తీసిన వారికి చట్టపరంగా కఠిన శిక్ష పడేలా పార్టీ పక్షాన న్యాయపోరాటం చేస్తామన్నారు.

వెంగళ వెంకటేశం తన ఇంటి సమస్య పరిష్కారం కోసం నెల రోజుల పాటు అధికారుల చుట్టూ తిరిగినా న్యాయం జరగలేదని KTR ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై తాను ఇప్పటికే జిల్లా కలెక్టర్‌తో స్వయంగా మాట్లాడానని తెలిపారు. ప్రభుత్వమే వెంకటేశం కుటుంబానికి ఇంటి నిర్మాణం చేపట్టి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఒకవేళ ప్రభుత్వం స్పందించకపోతే.. BRS పార్టీ పక్షాన సొంత ఖర్చులతో ఆ బాధిత కుటుంబానికి ఇల్లు కట్టించి ఇస్తామని హామీ ఇచ్చారు.

బాధిత కుటుంబానికి అండగా నిలుస్తూ.. తక్షణ ఆర్థిక సాయంగా కింద రూ.3 లక్షలు అందిస్తున్నట్లు KTR ప్రకటించారు. అలాగే, వెంకటేశం కూతురి చదువుకయ్యే పూర్తి ఖర్చును BRS పార్టీ తరఫున తామే భరిస్తామని.. ఆ బిడ్డ భవిష్యత్తుకు ఎలాంటి ఢోకా లేకుండా చూసుకుంటామని కేటీఆర్ భరోసా ఇచ్చారు.

Also Read: బంగాళాఖాతంలో వేగంగా మారుతున్న వాతావరణం..తెలుగు రాష్ట్రాలకు తుఫాన్ ముప్పు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

మెట్రోలో స్టేషన్‌లో టికెట్ తీసుకోకుండా గేట్ల కింద నుంచి పాకిన మహిళలు.. వీడియో!

Hyderabad, Telangana:

Women Crawling Metro Gate Video Watch: రైళ్లతో పాటు బస్సులు, మెట్రోల్లో ప్రయాణించేటప్పుడు కనీసం తప్పకుండా కొన్ని రకాల నియమాలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా తప్పకుండా టికెట్ కొనుగోలు చేయడం ప్రతి పౌరుడి బాధ్యతగా భావిస్తూ ఉంటారు.. కానీ, కొంతమంది చేసే పనులు మాత్రం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి.. కొద్దిరోజులుగా ఢిల్లీ మెట్రో రకరకాల వింత ఘటనలకు కేరఫ్ అడ్రస్‌గా మారుతూ వస్తున్న విషయం తెలిసిందే.. చాలా మంది మెట్రోలో వింత వింత డ్యాన్సులు చేయడంతో పాటు రీల్స్ చేయడం, తోటి ప్రయాణికులతో గొడవలు పడటం వంటి వీడియోలు మనం నిత్యం ఏన్నో సోషల్ మీడియాల్లో చూస్తూ ఉంటాం.. కానీ తాజాగా ఢిల్లీ మెట్రోలో జరిగిన ఒక ఘటన సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతూ వస్తోంది. అయితే, ఈ వీడియో ఏంటి? ఇంతలా వైరల్ కావడానికి గల కారణాలేంటి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..

టికెట్ డబ్బులు ఆదా చేయడం కోసం కొందరు మహిళలు చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఢిల్లీ మెట్రో అనగానే మనందరికీ భద్రతతో పాటు మంచి ప్రయాణం గుర్తుకొస్తూ ఉంటాయి. ప్రస్తుతం ఎక్స్‌లో వైరల్ అవుతున్న ఈ వీడియోలో.. కొందరు మహిళలు చీరలు కట్టుకుని ఉండడం మీరు చూడొచ్చు.. ఏమాత్రం భయం లేకుండా వారు ఆటోమేటెడ్ టికెట్ గేట్ల కింద నుంచి దూరుతూ లోపలికి వెళ్లడం స్పష్టంగా మీరు ఈ వీడియోలో చూడొచ్చు.. 

సాధారణంగా ఎవరైనా ప్రయాణికులు కార్డ్ స్వైప్ చేయడం లేదా.. క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే గేట్లు తెరుచుకుంటూ ఉంటాయి.. కానీ.. ఈ మహిళలు టికెట్ కోసం డబ్బులు ఖర్చు చేయడానికి ఇష్టం లేకనో.. లేక మరే కారణమో కానీ.. గేట్ల కింద ఉన్న కొద్దిపాటి ఖాళీ స్థలంలో నుంచి వంగి.. పాకుతూ మెట్రో లోకి ఎంట్రీ ఇవ్వడం మీరు క్లియర్‌గా ఈ వీడియోలో చూడొచ్చు.

Meanwhile Indian people civic sense: pic.twitter.com/OYlm9siNrO

ఈ వైరల్‌ వీడియోలో అందరినీ ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే.. ఆ మహిళలతో పాటు ఉన్న చిన్న పిల్లలు కూడా పెద్దలను చూసి అదే తరహాలో అక్కడే గేట్ల కింది భాగంలో దూరుతూ వెళ్లిపోవడం మీరు గమనించవచ్చు.. పిల్లలు ఎప్పుడు తమ పెద్దల చేసే పనులు చూసి మాత్రమే.. వారు చేస్తూ ఉంటారు. పిల్లలకు ఇలాంటి తప్పుడు పనులు నేర్పిస్తూ.. ఇలా చేయడం అస్సలు మంచిది కాదని నెటిజన్స్‌ మండిపడుతున్నారు. అంతేకాకుండా కొంతమంది మెట్రో సిబ్బందిపై కూడా విరుచుకు పడుతున్నారు. ఏది ఏమైన ఇప్పుడు మాత్రం సోషల్ మీడియాలో ఈ వీడియో విపరీతంగా వైరల్‌గా మారింది.

Also Read: పోలీస్ వ్యాన్‌ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

 

0
0
Report

Inmates SSC Pass: జైళ్ల చరిత్రలో తొలిసారి.. తెలంగాణలో 78 మంది ఖైదీలు పదో తరగతి పాస్‌

Baddipadaga, Telangana:

Telangana Prisoners SSC Pass: తెలంగాణ జైళ్ల చరిత్రలో తొలిసారి ఖైదీలు అత్యధికంగా పదో తరగతి ఉత్తీర్ణత సాధించారు. ఖైదీల విద్య, పునరావాసం , సమాజంలో తిరిగి గౌరవప్రదంగా జీవించేలా చేయడంలో భాగంగా తెలంగాణ జైళ్ల శాఖ చేపడుతున్న నిరంతర కార్యక్రమాల్లో మరో కీలక అడుగు వేసింది. ఖైదీలు తమ విద్యను కొనసాగించి పదో తరగతి పూర్తి చేసుకునే అవకాశం కల్పించింది. తెలంగాణ జైళ్ల శాఖ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ (ఎన్‌ఐఓఎస్‌) తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.

ఈ ఒప్పందం అనంతరం సెంట్రల్ ప్రిజన్, చర్లపల్లి; సెంట్రల్ ప్రిజన్, నిజామాబాద్; స్పెషల్ ప్రిజన్ ఫర్ ఉమెన్, హైదరాబాద్ నుంచి మొత్తం 108 మంది ఖైదీలు SSC (10వ తరగతి) కార్యక్రమంలో నమోదు చేసుకున్నారు. ఖైదీల చదువుకు అవసరమైన సహకారం అందించేందుకు ప్రభుత్వ ఉపాధ్యాయులను కేటాయించడంతో పాటు, అవసరమైన చోట అదనంగా ప్రైవేట్ ఉపాధ్యాయులను కూడా నియమించారు. వీరి వేతనాలను తెలంగాణ జైళ్ల శాఖ భరించింది.
 

0
0
Report
Advertisement

PM E-Drive Scheme: ఈవీ వాహనాలు కొనుగోలు చేసేవారికి గుడ్‌న్యూస్..పీఎం ఈ-డ్రైవ్ పథకంతో రూ.5,000 డిస్కౌంట్!

Hyderabad, Telangana:

PM E-Drive Scheme Subsidy: ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాన్ని (EV) కొనుగోలు చేయాలనుకునే వారికి కేంద్ర ప్రభుత్వం మిశ్రమ స్పందనతో కూడిన నిర్ణయాన్ని వెల్లడించింది. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వాడకం విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వం 'పీఎం ఇ-డ్రైవ్' (PM E-DRIVE) పథకంలో కీలక మార్పులు చేసింది. ఈ పథకం కింద టూ-వీలర్లపై ఇచ్చే సబ్సిడీ మొత్తాన్ని తగ్గించినప్పటికీ, పథకం గడువును మాత్రం 2028 మార్చి 31 వరకు పొడిగించింది.

సబ్సిడీ వివరాలు, మార్పులు
1) ద్విచక్ర వాహనాల కేటగిరీకి గతంలో కేటాయించిన రూ.1,772 కోట్ల బడ్జెట్‌ను రూ.2,767 కోట్లకు పెంచారు. దీనివల్ల దేశవ్యాప్తంగా దాదాపు 46 లక్షల ఎలక్ట్రిక్ టూ-వీలర్లకు సబ్సిడీ ప్రయోజనం దక్కనుంది.

2) ఏప్రిల్ 1, 2025 నుంచి రిజిస్టర్ అయ్యే ఈవీలకు బ్యాటరీ సామర్థ్యం ప్రతి కిలోవాట్-గంటకు (kWh) రూ.2,500 చొప్పున సబ్సిడీ లభిస్తుంది (గతంలో ఇది రూ.5,000 ఉండేది).

3) గరిష్ట పరిమితి కింద ఒక వాహనానికి గరిష్ట సబ్సిడీ పరిమితిని రూ.5,000 (గతంలో రూ.10,000)గా నిర్ణయించారు.

అర్హత: ఎక్స్-షోరూమ్ ధర రూ.1.5 లక్షల వరకు ఉన్న ఎలక్ట్రిక్ టూ-వీలర్లు మాత్రమే ఈ పథకానికి అర్హత పొందుతాయి. సబ్సిడీ మొత్తం ఎక్స్-షోరూమ్ ధరలో 15% లేదా రూ.5,000 (ఏది తక్కువైతే అది) వర్తిస్తుంది.

పథకం ముఖ్యమైన గడువులు
అమలు కాలం: ఏప్రిల్ 1, 2025 నుంచి మార్చి 31, 2028 మధ్య రిజిస్టర్ అయ్యే వాహనాలకు వర్తిస్తుంది.

క్లెయిమ్‌ల గడువు: సబ్సిడీ క్లెయిమ్‌లను సమర్పించడానికి చివరి తేదీ డిసెంబర్ 31, 2027. మార్చి 31, 2028 తర్వాత ఎలాంటి చెల్లింపులు ఉండవు. ఒకవేళ కేటాయించిన నిధులు గడువు కంటే ముందే అయిపోతే ఈ పథకం ముగుస్తుంది.

ఈవీల వృద్ధి, ఇతర కేటగిరీలు
భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు భారీగా పెరుగుతున్నాయి. 'వాహన్' పోర్టల్ డేటా ప్రకారం, 2022 ఆర్థిక సంవత్సరంలో కేవలం 2,52,787 ఈవీలు అమ్ముడవ్వగా.. 2026 నాటికి ఆ సంఖ్య 14.6 లక్షలకు పెరిగింది.

ఈ పథకం కేవలం ద్విచక్ర వాహనాలకే కాకుండా.. ఎలక్ట్రిక్ త్రిచక్ర వాహనాలు, బస్సులు, ట్రక్కులు, అంబులెన్సులు, ఛార్జింగ్ మౌలిక సదుపాయాల అభివృద్ధికి కూడా వర్తిస్తుంది. మీరు సమీప భవిష్యత్తులో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా బైక్ కొనుగోలు చేయాలని భావిస్తుంటే, మార్చి 31, 2028 వరకు ఈ ప్రభుత్వ సబ్సిడీని సద్వినియోగం చేసుకోవచ్చు.

Also REad; రూ.35,999 విలువైన శాంసంగ్ గెలాక్సీ 5జీ మొబైల్ ఇప్పుడు కేవలం రూ.26,999లకే!

Also Read: భారీగా తగ్గిన క్రూడ్ ఆయిల్ ధరలు..భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయంటే?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

చంద్రబాబుతో కలిసి రేవంత్‌ రెడ్డి తెలంగాణకు తీరని అన్యాయం: జగదీశ్‌ రెడ్డి

Hyderabad, Telangana:

Jagadish Reddy vs Revanth Reddy: 'చంద్రబాబు నాయుడు కోసమే కాళేశ్వరం ప్రాజెక్టును రేవంత్ రెడ్డి ఎండబెట్టాడు. చంద్ర బాబు నాయుడు దగ్గర రేవంత్ రెడ్డి లొంగిపోయి కుక్కలా బతుకుతున్నాడు' అని బీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు జగదీశ్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నాగార్జున సాగర్ దగ్గర వరుణ యాగం చేయడం కాదు దమ్ముంటే పోతిరెడ్డిపాడు గేట్లు బంద్ చేయాలని డిమాండ్ చేశారు. నాగార్జున సాగర్‌కు ఇంతవరకు ఒక్క చుక్క నీరు రాలేదు ఎడమ కాలువ కింద రైతులు పరిస్థితి దారుణంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. నీళ్ల విషయంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతులకు ద్రోహం, మోసం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

హైదరాబాద్‌లోని బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్‌లో నీటి విడుదలపై మాజీ మంత్రి జగదీశ్‌ రెడ్డి నల్లగొండ జిల్లా నాయకులతో కలిసి కీలక మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫ్యాలు ఎండగట్టారు. 'రెండు నెలలుగా గోదావరి పై బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంటే కాంగ్రెస్‌ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. కృష్ణా జలాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరలించుకునిపోతుంటే రేవంత్ రెడ్డి మౌనంగా ఉంటున్నాడు. కేసీఆర్ హయాంలో ఆనాడు శ్రీశైలం ఎగువన 10 నుంచి 12 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చాడు. కాంగ్రెస్‌  ప్రభుత్వంలో ఒక్క ఎకరాకు నీళ్లు ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది' అని మాజీ మంత్రి జగదీశ్‌ రెడ్డి వివరించారు.

'ఎగువ నుంచి కృష్ణాకు బ్రహ్మాండంగా నీళ్లు వస్తుంటే కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉంటుంది. పాలమూరు బిడ్డనని చెప్పుకునే రేవంత్ రెడ్డి కన్న తల్లికి ద్రోహం చేస్తున్నాడు. నాగార్జున సాగర్‌లో నీళ్లు ఉన్నా రైతులకు నీళ్లు ఇవ్వలేమని జిల్లా మంత్రి వాటర్‌లో నీళ్లు కలిపి తాగి మాట్లాడుతున్నాడు. ఇప్పటికే పాలమూరుకు  మొదటి పంట పండించుకునే అవకాశం ఉంది. రేవంత్‌ ప్రభుత్వ దుర్మార్గానికి ఇంతవరకు ఒక్క ఎకరానికి నీళ్లు ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది' అని సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

'నాగార్జున సాగర్‌కు చుక్క నీరు రాకుండా పోతిరెడ్డిపాడుకు నీళ్లు తరలిస్తున్నారు. 25 వేల క్యూసెక్కుల నీళ్లు పోతిరెడ్డిపాడు నుంచి తరలిస్తుంటే నాగార్జున సాగర్ చుక్క నీరు వచ్చే పరిస్థితి లేదు. ఏపీ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు నీళ్లు ఇవ్వకుండా పెద్ద కుట్ర చేస్తోంది. రైతులు ఆరుతడి పంటలు వేసుకోండని అంటున్నారు. ఆరుతడి పంటలకైన నీళ్లే కావాలి కదా! పోతిరెడ్డిపాడుకు నీళ్లు ఇవ్వొద్దని డిమాండ్ చేసే దమ్ముందా!' అని కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని మాజీ మంత్రి జగదీశ్‌ రెడ్డి సవాల్‌ చేశారు.

'తెలంగాణ రాష్ట్రానికి చెందిన 7 ప్రాజెక్టుల పై రివ్యూ చేయాలని జీఆర్‌ఎంబీ ఎజెండాలో పొందుపరిచారు. బీఆర్ఎస్ పార్టీ మాట్లాడిన తరువాత ఎజెండా అంశాలపై లేఖ రాశారు. జీఆర్‌ఎంబీ సమావేశాన్ని బహిష్కరించాలి' అని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి డిమాండ్‌ చేశారు. 'నాగార్జున సాగర్ నిండేంత వరకు పోతిరెడ్డిపాడు నీళ్లు తీసుకొని పోవడానికి వీల్లేదు. ఎవరి ఆదేశాలతో పోతిరెడ్డిపాడు నుంచి నీళ్లు తరలిస్తున్నారు? అని ప్రశ్నించారు.

'రేవంత్‌ రెడ్డి ప్రభుత్వానికి రైతుల పట్ల సోయి ఉంటే రెండు పంటలకు నీళ్లు ఇవ్వొచ్చు. మంత్రి శ్రీధర్ బాబుకు చీము రక్తం ఉంటే సిగ్గుతప్పిన మాటలు మాట్లాడకూడదు. చంద్రబాబు నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ ఎందుకు లాగులు తడుపుకుంటున్నారు? అని మాజీ మంత్రి జగదీశ్‌ రెడ్డి ప్రశ్నించారు. 'నా ముందు మాట్లాడే దైర్యం తెలంగాణ ప్రభుత్వానికి లేదనే జీఆర్‌ఎంబీ ఎజెండా చంద్రబాబు పొందుపరిచాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి బుర్ర మోకాళ్లో ఉంది. తెలంగాణలో 7 ప్రాజెక్టులకు టీఏసీ అనుమతులు పొందినట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డికి తెలియదా?' అని నిలదీశారు.

'ఆరుతడి పంటలకు అర్ధం తెలియని వెధవలు ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్నారు. ఇది మన దురదృష్టం. అడ్డగోలుగా భూ దందాలతో రేవంత్‌ రెడ్డి, మంత్రులు బిజీగా ఉంటే అధికారులు రైతులకు దగ్గరకు వెళ్తున్నారు' అని బీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ ఎమ్మెల్యే జగదీశ్‌ రెడ్డి తెలిపారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ హక్కుల కోసం పోరాడుతూనే ఉంటామని ప్రకటించారు. ఎల్ నినో ప్రభావంతో తాగునీటి సమస్య ఉంటే పోతిరెడ్డిపాడుకు నీళ్లు ఎలా పోతున్నాయని ప్రశ్నించారు. రైతులకు నీళ్లు ఇవ్వకుండా వరుణ యాగాలు చేస్తా. క్షుద్ర పూజలు  చేస్తా అంటే ఎలా అని రేవంత్‌ రెడ్డి ప్రభుత్వంపై మండిపడ్డారు.

మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు గాదరి కిషోర్ కుమార్, కంచర్ల భూపాల్ రెడ్డి, నోముల భగత్, నల్లమోతు భాస్కర్ రావు, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, మాజీ కార్పొరేషన్ చైర్మన్ పల్లె రవి కుమార్, బిఆర్ఎస్ నేతలు వంటెద్దు నరసింహారెడ్డి, కడారి అంజయ్య పాల్గొన్నారు.

0
0
Report

AP Assembly Sessions: అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ అధినేత జగన్? ఆగస్టు 17న అసెంబ్లీలో అడుగుపెడతారా?

Vijayawada, Andhra Pradesh:

YS Jagan AP Assembly Sessions: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 17 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయాలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. సమావేశాల వ్యూహం, పార్టీ ఎమ్మెల్యేల హాజరు, శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ నియామకంపై జగన్ పార్టీ నేతలతో ప్రత్యేకంగా చర్చించి స్పష్టతనిచ్చారు.

అసెంబ్లీ సమావేశాలు - జగన్ వ్యూహం
ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడం వల్ల తమ గొంతు నొక్కుతున్నారని, సభలో మాట్లాడే అవకాశం లేకుండా చేస్తున్నారని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశాలకు వెళ్లాలనుకునే ఎమ్మెల్యేలు హాజరుకావచ్చని ఆయన సూచించారు.

ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేసే క్రమంలో.. శాసనమండలిలో డీఎస్‌పీ (DSC) నియామకాలు, రాష్ట్రంలో శాంతిభద్రతల (Law & Order) తీరుపై తీవ్రంగా చర్చించాలని ఎమ్మెల్సీలను జగన్ ఆదేశించారు.

అయితే సభకు హాజరు కాని ఎమ్మెల్యేలపై ప్రభుత్వం వేటు వేస్తుందనే ప్రచారంపై స్పందిస్తూ.. ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తాము ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని జగన్ స్పష్టం చేసినట్లు సమాచారం.

శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్‌గా తూమాటి మాధవరావు
శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించిన జకియా ఖానం పదవీకాలం ముగియడంతో, ఆ స్థానానికి కొత్త అభ్యర్థి ఎంపిక అనివార్యమైంది. సీనియారిటీ, సామాజిక సమీకరణాలను బేరీజు వేసుకున్న వైఎస్ జగన్.. ఈ పదవికి తూమాటి మాధవరావు పేరును ఖరారు చేశారు. శాసనమండలిలో వైఎస్సార్‌సీపీకి స్పష్టమైన మెజారిటీ ఉండటంతో తూమాటి మాధవరావు ఎన్నిక ఏకగ్రీవంగా లాంఛనప్రాయం కానుంది.

మండలిలో పార్టీ తరఫున గట్టిగా గళం వినిపించే నేతగా గుర్తింపు ఉండటంతో ఆయనకు ఈ అవకాశం లభించింది. మరోవైపు, బీసీ వర్గానికి చెందిన మహిళా నేత వరుదు కల్యాణి పేరు కూడా పరిశీలనకు వచ్చినప్పటికీ, ఆమెను పార్టీ బాధ్యతల్లోనే కొనసాగించడం మంచిదని జగన్ భావించినట్లు తెలుస్తోంది.

Also Read: గోవింద నామాలతో వైసీపీ నేతలు పేరడీలు..ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహం!

Also REad: ఏపీ EAPCET 2026 సీట్ అలాట్‌మెంట్ విడుదల..ఆగస్టు 15లోపు ఈ పని చేయకపోతే సీటు రద్దు!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement

IND Vs SL Test Series: భారత్ Vs శ్రీలంక టెస్ట్ సిరీస్..మ్యాచ్ షెడ్యూల్ టైమింగ్స్, లైవ్ టెలికాస్ట్ ఎందులో?

Hyderabad, Telangana:

IND Vs SL Test Series: టీ20 ప్రపంచకప్ 2026 ముగిసిన తర్వాత, భారత క్రికెట్ జట్టు పూర్తిగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) 2025-27 పై దృష్టి సారించింది. శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని టీమిండియా.. ఆగస్టు 15 నుంచి శ్రీలంకతో రెండు మ్యాచ్‌ల ప్రతిష్టాత్మక టెస్ట్ సిరీస్‌లో తలపడనుంది. WTC పాయింట్ల పట్టికలో అగ్రస్థానం దిశగా దూసుకెళ్లేందుకు భారత్‌కు ఈ సిరీస్ ఎంతో కీలకం కానుంది.

భారత్ - శ్రీలంక టెస్ట్ సిరీస్ షెడ్యూల్
ఈ సిరీస్‌లో భాగంగా రెండు టెస్ట్ మ్యాచ్‌లు శ్రీలంకలోని ప్రముఖ వేదికల్లో జరగనున్నాయి. అన్ని మ్యాచ్‌లు భారత కాలమానం ప్రకారం ఉదయం 10:00 గంటలకు ప్రారంభమవుతాయి.

భారత్, శ్రీలంక టెస్ట్‌ సిరీస్‌లో భాగంగా రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. గాలే ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా తొలి టెస్ట్ మ్యాచ్ ఆగస్టు 15 నుంచి 19 వరకు జరగనుంది. అలాగే రాజధాని కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ వేదికగా ఆగస్టు 23 నుంచి ఆగస్టు 27 రెండో టెస్ట్ మ్యాచ్ జరగనుంది. 

WTC పాయింట్ల పట్టిక దృష్ట్యా ప్రాధాన్యత
ఈ సిరీస్ WTC 2025-27 సైకిల్‌లో భాగం కావడంతో, రెండు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించడం భారత్‌కు అత్యవసరం. శ్రీలంక పిచ్‌లు సాధారణంగా స్పిన్ బౌలింగ్‌కు ఎక్కువగా సహకరిస్తాయి. కాబట్టి, భారత బ్యాటర్లకు లంక స్పిన్నర్ల నుంచి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది. విదేశీ గడ్డపై మెరుగైన ప్రదర్శన కనబర్చి, పాయింట్ల పట్టికలో తమ స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకోవాలని టీమిండియా భావిస్తోంది.

లైవ్ టెలికాస్ట్, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు
క్రికెట్ అభిమానులు ఈ సిరీస్‌ను ప్రత్యక్షంగా వీక్షించడానికి కింద పేర్కొన్న ప్లాట్‌ఫామ్‌లను ఉపయోగించవచ్చు. ఈ క్రికెట్ మ్యాచ్‌లను బుల్లితెరలో సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ఛానల్స్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. అలాగే ఓటీటీ ప్రేక్షకుల కోసం సోనీలివ్ యాప్ లేదా వెబ్‌సైట్‌లో డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది.

Also Read: ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా కొనసాగింపు! ఐపీఎల్ ట్రేడింగ్‌లో షాకింగ్

Also REad; క్రికెట్ ప్రపంచకప్ 2027 రేసు నుంచి ఆ రెండు టీమ్స్ ఔట్?! టీమ్ఇండియా పరిస్థితి ఏంటంటే?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Best Independence Day Songs: స్వాతంత్ర్య దినోత్సవం ఎవర్ గ్రీన్‌ టాప్‌ 5 సాంగ్స్‌..

Hyderabad, Telangana:

Independence Day Songs: స్వాతంత్ర్య దినోత్సవాన్ని భారతదేశ వ్యాప్తంగా ఎంతో ఘనంగా జరుపుకుంటారు. అంతేకాకుండా ఈ రోజు ప్రతి ఒక్కరి గుండెల్లో దేశభక్తి ఉప్పొంగుతుంది. దేశ వ్యాప్తంగా ఉన్న ప్రతి గల్లీలో త్రివర్ణ పతాకాన్ని ఎగరేస్తూ ఉంటారు. అంతేకాకుండా ఈ సమయంలో చాలా మంది ప్రజల్లో దేశభక్తిని నింపేందుకు దేశభక్తి గీతాలను స్పీకర్స్‌లో పెడుతూ ఉంటారు.. ప్రతి భారతీయుడి రోమాలు నిక్కబొడుచుకునేలా చేసి.. దేశభక్తిని పెంచే ఎవర్ గ్రీన్ టాప్ 5 తెలుగు పాటల క్రియాశీలక పాత్ర పోషిస్తూ ఉంటాయి. ఏ గల్లీకి వెళ్లిన ఈ పాటలు వినిపిస్తునే ఉంటాయి. అయితే, ఈ టాప్ 5 పాటలేంటో వాటికి సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

టాప్ 5 సాంగ్స్‌ ఇవే..
పుణ్యభూమి నా దేశం (మేజర్ చంద్రకాంత్)..
Punyabhumi Nadesam అంటూ ప్రారంభమయ్యే.. ఈ సాంగ్‌ దేశభక్తి గీతాల్లో అగ్రస్థానంలో ఉంటుంది.. నందమూరి తారక రామారావు అద్భుత నటనతో పాటు SP బాలసుబ్రహ్మణ్యం పాడిన ఈ పాట.. భారతీయ చరిత్రను, ఎందరో వీరుల త్యాగాలను కళ్లకు కట్టినట్లు చూపించేలా చేస్తుంది.. అంతేకాకుండా గుండెల్లో దేశభక్తిని కూడా నింపుతుంది..

భారత మాతకు జేజేలు (బడి పంతులు)
Bharatha Maathaku Jejelu అనే ఈ పాట దశాబ్దాలు గడుస్తున్నా చెరగని ముద్ర వేసిందిగా భావించవచ్చు. స్వాతంత్ర్య దినోత్సవ ఉత్సవాల్లో ఎక్కువగా వినిపించే గీతాల్లో కూడా ఇది ఒకటి.. మన దేశ పవిత్రతను స్మరించుకుంటూ ప్రతి పాఠశాల వేడుకల్లో ఈ పాట నేటికీ మారుమోగుతూనే ఉంటుంది.

వందేమాతరం (వందేమాతరం)
ప్రముఖ యాక్టర్‌ డాక్టర్ రాజశేఖర్ నటించిన..  ఈ Vande Mataram సినిమాలోని టైటిల్ సాంగ్ యువతలో అంతులేని ఆవేశాన్ని నింపడమే కాకుండా.. సమాజం పట్ల బాధ్యతను పెంచేందుకు ఎంతగానో సహాయపడుతుంది.. చాలా చోట్ల కూడా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో యువతలో దేశభక్తి నింపేందుకు ఈ పాటను పెడుతూ ఉంటారు..

నేను సైతం ప్రపంచాగ్నికి (ఠాగూర్)
మహాకవి శ్రీశ్రీ రాసిన మహా ప్రస్థానంలోని కవితా పాదాల నుంచి సేకరించి.. చిరంజీవి ఠాగూర్ సినిమాలో వినిపించిన అద్భుతమైన పాట.. సామాన్యుడిలో సైతం సామాజిక బాధ్యతను తట్టిలేపేందుకు ఈ పాట ఎంతగానో సహాయపడుతుంది.. దేశం కోసం మనవంతు పాత్ర పోషించాలనే స్ఫూర్తిని ఈ గీతం నింపుతుంది. ఇప్పటికీ ఈ పాటను చాలా చోట్ల వేడుకల్లో పెడుతూ ఉంటారు..

Vande Mataram
ప్రముఖ మ్యూజిక్‌ డైరెక్టర్  A. R. రెహమాన్ ఆల్బమ్స్‌లో Vande Mataram సాంగ్‌ కూడా ఇప్పటికీ స్కూల్స్‌లో ఈ స్వతంత్ర దినోత్సవం వేడుకల్లో వినిపిస్తునే ఉంటుంది. సోనీకి సంబంధించిన మ్యూజిక్‌ నాన్-ఫిల్మ్ ఆల్బమ్‌లో ఇది ఎక్కువగా అమ్ముడైన్నట్లు కూడా రికార్డ్‌ ఉంది. ఇది 12 ఆగస్టు 1997న విడుదలైంది. ఈ పాట కూడా భారత ప్రజల్లో దేశభక్తి నింపుతుంది. 

 

Also Read: బంగాళాఖాతంలో వేగంగా మారుతున్న వాతావరణం..తెలుగు రాష్ట్రాలకు తుఫాన్ ముప్పు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement

Khelo India Games 2026: హైదరాబాద్‌లో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026.. తెలంగాణ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు

Hyderabad, Telangana:

Govt of Telangana: దేశీయంగా జరిగే ప్రతిష్టాత్మక క్రీడా పోటీలు ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌-2026కు తెలంగాణ ఆతిథ్యం ఇస్తుండగా.. ఈ క్రీడా పోటీలకు భారీ ఏర్పాట్లు చేయడంలో తెలంగాణ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేయనుంది. తెలంగాణ ప్రభుత్వం ఆతిథ్యం ఇవ్వనున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026 పోటీలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ లోని స్టేడియంలలో ప్రస్తుత పరిస్థితిని పరిశీలించి, క్రీడా పోటీలకు అనుగుణంగా శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు

హైదరాబాద్‌ ఎంసీఆర్ హెఆర్డీలోని బోధి పెవిలియన్‌లో ఖేలో ఇండియా  యూత్‌ గేమ్స్ ఏర్పాట్లు, నిర్వహణపై క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరితోపాటు క్రీడా శాఖ ఉన్నతాధికారులతో మంగళవారం ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఖేలో ఇండియా జాతీయ స్థాయిలో వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున క్రీడాకారులు ఈ పోటీపడుతుండడంతో వాటికి సంబంధించి మౌలిక వసతులను అభివృద్ధి చేయాలని సీఎం సూచించారు. డిసెంబర్‌లో ఖేల్‌ ఇండియా పోటీలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. 

ఖేలో ఇండియా క్రీడా పోటీల సందర్భంగా హైదరాబాద్‌లోని స్టేడియంలలో ప్రస్తుత పరిస్థితిని పరిశీలించి క్రీడా పోటీలకు అనుగుణంగా శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికార యంత్రాంగానికి ఆదేశించారు. దీనిక అవసరమైన నిధులను అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు. ఖేలో ఇండియా క్రీడా పోటీల ప్రారంభోత్సవ, ముగింపు వేడుకలకు  సంబంధించిన ముఖ్య అతిథులు, ప్రముఖ క్రీడాకారులు, సినీ ప్రముఖులను కార్యక్రమాల్లో భాగస్వాములను చేసేందుకు వెంటనే కసరత్తు ప్రారంభించాలని సూచించారు.

ఈ క్రీడా పోటీల సందర్భంగా మౌలిక వసతులు, క్రీడల నిర్వహణ, అతిథులకు కావాల్సిన సౌకర్యాల ఏర్పాట్లకు సంబంధించి పని విభజన చేసుకుని బాధ్యత తీసుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి తెలిపారు. తెలంగాణకు చెందిన అర్జున అవార్డు గ్రహీతలు, తెలంగాణ స్పోర్ట్స్ హబ్ బోర్డు సభ్యులు, ఒలింపిక్స్ అసోసియేషన్‌తో పాటు జాతీయస్థాయి క్రీడా ప్రతినిధులను ఈ క్రీడా పోటీల్లో భాగస్వాములను చేయాలని సూచించారు. ఖేలో ఇండియా గేమ్స్‌ కోసం ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో భాగంగా 20 రకాల క్రీడలకు సంబంధించిన పోటీలు నిర్వహించనున్న నేపథ్యంలో క్రీడా విభాగాల వారీగా పోటీ ప్రదేశాలను గుర్తించి ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. క్రీడా స్ఫూర్తిని చాటేలా నిర్వహణ ఉండాలని అధికార యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలు చేశారు.

0
0
Report
Advertisement

Tragedy Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ఆటోను ట్యాంకర్‌ ఢీకొట్టడంతో ఏడుగురు దుర్మరణం

Mallikarjunpally, Telangana:

Sangareddy District Accidents: కూలీలతో వెళ్తున్న ఆటోను ట్యాంకర్‌ ఢీకొట్టడంతో ఘోర ప్రమాదం సంభవించింది. ఈ రోడ్డు ప్రమాదంలో ఏడుగురు కార్మికులు దుర్మరణం పాలయ్యారు. మరికొందరు క్షతగాత్రులయ్యారు. సంగారెడ్డి జిల్లాలో ఈ సంఘటన తీవ్ర విషాదం అలుముకుంది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం సత్వార్ గ్రామం సమీపంలో యూటర్న్ తీసుకుంటున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతులు కర్ణాటక రాష్ట్రం బీదర్‌ జిల్లా రాజగిరి గ్రామానికి చెందినవారిగా గుర్తించారు. 

ఆటోలో డ్రైవర్‌ సహా మొత్తం 12 మంది కూలీలు ఉన్నారు. ప్రతి రోజు కూలీ పని కోసం జహీరాబాద్‌ పరిసర ప్రాంతాలకు వస్తుంటారు. గాయాలపాలైన మిగతా వారిని జహీరాబాద్‌లోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. వారికి వెంటనే వైద్యులు అత్యవసర వైద్యం అందిస్తున్నారు. ట్యాంకర్ కర్ణాటక రాష్ట్రం హుమనాబాద్ నుంచి జహీరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. 

తెలంగాణ సీఎం సంతాపం
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం సత్వార్ గ్రామ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.

మరో ప్రమాదం
సంగారెడ్డి జిల్లాలో మరో రోడ్డు ప్రమాదం సంభవించి ఇద్దరు మృతిచెందారు. మూడు కార్లు ఢీకొనడంతో ఇద్దరు ప్రాణాలు విడవగా.. మరికొందరు గాయపడ్డారు. కోహీర్‌ మండలం వెంకటాపూర్‌ కూడలి సమీపంలో జాతీయ రహదారిపై ఓ కారు అదుపు తప్పి అవతలి రోడ్డుపైకి ఎగిరి పడింది. ఆ రోడ్డుపై వెళ్తున్న కారుతోపాటు మరికొన్ని వాహనాలను ఢీకొట్టింది. దీంతో ఇద్దరు దుర్మరణం చెందగా.. కొందరు గాయపడ్డారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను, క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై కొంత వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

కంపెనీలో ప్రమాదం.. ఒకరు మృతి
పటాన్‌చెరు మండలం రుద్రారం గ్రామంలోని యంఎస్ఎన్ కంపెనీలో ప్రమాదం చోటుచేసుకుంది. ​కంపెనీ ప్రమాదంలో వెంకటేశ్వర్లు (45) అనే ఉద్యోగి తీవ్ర గాయాలతో మృతిచెందాడు. కొన్ని సంవత్సరాలుగా ఎంఎస్‌ఎన్‌ కంపెనీలో రెగ్యులర్ ఎంప్లాయ్‌గా వెంకటేశ్వర్లు పనిచేస్తుండేవాడు. ​క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం హైదరాబాద్‌ కంచన్‌బాగ్‌లోని డీఆర్‌డీఓ అపోలో హాస్పిటల్‌కు తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. ​ప్రమాదానికి గల పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

0
0
Report

Hyderabad Metro: హైదరాబాద్‌ పాతబస్తీ మెట్రో రైలుపై తెలంగాణ సీఎం కీలక నిర్ణయం

Hyderabad, Telangana:

Old City Metro Rail: హైదరాబాద్‌లోని పాతబస్తీ రూపురేఖలు మార్చే మెట్రో రైలు ప్రాజెక్టుపై తెలంగాణ ముఖ్యమంత్రి కీలక నిర్ణయం తీసుకున్నారు. దశాబ్ద కాలంపైగా పెండింగ్‌లో ఉన్న పాతబస్తీ మెట్రో రైలు ప్రాజెక్టుపై వెంటనే చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ మెట్రో విస్తరణ రెండో దశలో భాగంగా పాతబస్తీ మెట్రో రైల్ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.  7.5 కిలోమీటర్ల మెట్రో విస్తరణ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు.

హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (హెచ్‌ఎంఆర్‌ఎల్‌)పై మంగళవారం హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. పాతబస్తీ మెట్రో నిర్మాణంపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్న అనంరతం ముఖ్యమంత్రి పలు ఆదేశాలిచ్చారు. ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు 7.5 కిలోమీటర్ల మెట్రో విస్తరణ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని.. ఈ కారిడార్‌లో పనులకు సంబంధించిన టెండర్ ప్రక్రియను ప్రారంభించాలని ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న భూ సేకరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. హైదరాబాద్ మెట్రోకు పెరుగుతున్న ప్రయాణికుల రద్దీ తీవ్రమవుతుండడంతో అదనపు కోచ్‌లను జత చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. దీనికి అవసరమైన కోచ్‌ల కొనుగోలు ప్రక్రియకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట కారిడార్‌కు సంబంధించి సాంకేతికతపై ఢిల్లీ మెట్రోను సంప్రదించి, అవసరమైన సలహాలు తీసుకోవాలని సూచించారు.

అనంతరం డిసెంబర్‌లో నిర్వహించనున్న 'ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌'పై ముఖ్యమంత్రి సమీక్ష చేశారు. తెలంగాణలో పెట్టుబడులను మరింతగా ఆకర్షించేలా ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌ నిర్వహిస్తున్నామని.. దానికి అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. వ్యాపార రంగంలోని వివిధ సెక్టార్లలో గుర్తింపు పొందిన ప్రముఖులను సమ్మిట్‌లో సన్మానించేలా కార్యాచరణ రూపొందించాలని.. తెలంగాణలో పెట్టుబడులను ఆకర్షించేలా అంతర్జాతీయ ప్రమాణాలతో సమ్మిట్ ఏర్పాట్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. గతేడాది నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్‌తో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు.. వాటి పురోగతికి సంబంధించిన పూర్తి వివరాలను నివేదించాలని చెప్పారు. పెట్టుబడుల్లో మరింత పురోగతి సాధించేందుకు అవసరమైన ప్రణాళికలను తయారు చేయాలని ముఖ్యమంత్రి అధికార యంత్రాంగానికి సూచించారు.

0
0
Report

KTR: కొండల్‌ రెడ్డికి భూమి కేటాయింపు అతిపెద్ద కుంభకోణం.. పోరాటం చేస్తాం: కేటీఆర్‌

Hyderabad, Telangana:

Revanth Reddy Brothers: అధికారం ఉంది కదా అని ఇష్టారీతిన భూకేటాయింపులు చేసుకుంటున్నారని.. అప్పనంగా కోట్ల విలువైన భూములు చవకగా పొందుతున్నారని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తీవ్ర ఆరోపణలు చేశారు. రేవంత్‌ రెడ్డి సోదరుడు కొండల్‌ రెడ్డికి రూ.200 కోట్ల విలువైన భూమి రూ.7 కోట్లకు ఎలా కేటాయించని ప్రశ్నించారు. ఇది అతిపెద్ద కుంభకోణం అని.. అనుముల కొండల్ రెడ్డి వ్యవహారంపై పోరాటం చేస్తామని మాజీ మంత్రి కేటీఆర్‌ ప్రకటించారు. త్వరలోనే గవర్నర్‌ను కలిసి ఫిర్యాదు చేస్తామని తెలిపారు.

హైదరాబాద్‌లోని బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్‌లో ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మీడియా సమావేశం నిర్వహించి కీలక వ్యాఖ్యలు చేశారు. 'తెలంగాణలో టెసరాక్ట్ అనే కంపెనీకి అప్పనంగా భూమి కేటాయించారు. టెసరాక్ట్ కంపెనీకి రేవంత్ సోదరుడు కొండల్ రెడ్డి చైర్మన్. ఆ విషయాన్ని కొండల్ రెడ్డే లింక్డ్ ఇన్ ప్రొఫైల్లో పెట్టుకున్నారు. టెసరాక్ట్ కంపెనీ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పరికరాలను తయారు చేస్తుందట. అమెరికా ఎంబసీ ప్రతినిధితో హైదరాబాద్‌లో మీటింగ్ కూడా పెట్టారు. యూఎస్ ఇండియా స్ట్రాటెజిక్ డెవలప్‌మెంట్ ఫోరంలో ఎగ్జిక్యూటివ్ బోర్డులో కొండల్ రెడ్డికి సభ్యత్వం ఇచ్చారు' అని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ వివరించారు. కొండల్ రెడ్డి ఏం చదివారో నాకు తెలియదని పేర్కొన్నారు.

టెసరాక్ట్ కంపెనీకి కొండల్ రెడ్డి చైర్మన్ అని అమెరికా కాన్సులేట్ కూడా స్టేట్‌మెంట్ ఇచ్చింది. చదువురాని రేవంత్ బ్రదర్స్ అందరూ సూట్లు కోట్లు వేసుకుని చైర్మన్లు అయిపోతున్నారు. టెసరాక్ట్ కంపెనీ కథ ఏమిటని మేం ఆరా తీశాం. ఆ కంపెనీ ఫోన్ నంబర్ 123456789. ఇలాంటి నంబర్లు ఉంటాయని మాకు తెలియదు. రేవంత్ ఏదైనా కొత్త టెక్నాలజీ కనిపెట్టిండేమో?' అని మాజీ మంత్రి కేటీఆర్‌ ఎద్దేవా చేశారు. విచిత్రం ఏంటంటే టెసరాక్ట్ కంపెనీలో ఒక్క ఉద్యోగి కూడా లేడని చెప్పారు.

'2025 మార్చి 31 నాడు వాళ్లే ప్రకటన చేశారు. తమ కంపెనీలో ఒక్క ఉద్యోగి కూడా లేడని చెప్పారు. ఊరూ పేరు లేని చోట ఆ కంపెనీ అడ్రస్ ఉంది. టెసరాక్ట్ మూలధనం లక్ష రూపాయలు. ఈ కంపెనీకి రేవంత్ ప్రభుత్వం రూ.200 కోట్ల విలువైన భూమి కట్టబెట్టింది. ఐదెకరాల భూమిని కేటాయించి, అతిపెద్ద కుంభకోణానికి పాల్పడ్డారు. ఇది అనుముల కొండల్ రెడ్డి వ్యవహారం' అని కేటీఆర్‌ తీవ్ర ఆరోపణలు చేశారు.

అనుముల జగదీష్ రెడ్డి అని రేవంత్‌ రెడ్డికి ఇంకో తమ్ముడు ఉన్నాడు. జగదీష్ రెడ్డి అమెరికాలో ఉంటాడు. రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు పోయినప్పుడు రూ.వెయ్యి కోట్ల డీల్ చేసుకున్నారు. స్వచ్ఛ్ బయో అనే కంపెనీతో ఒక మెమోరాండం సైన్ చేశారు. వాళ్లకు ఎక్కడ భూములు ఇచ్చారో తవ్వి తీస్తాం. రేవంత్ బామ్మర్ది సృజన్ రెడ్డికి రూ.1,137 కోట్ల అమృత్ కాంట్రాక్టు దక్కింది. రేవంత్ రెడ్డి, మోదీ ప్రభుత్వం కలిసి నడుపుతున్న సింగరేణిలో.. సృజన్ రెడ్డి కనుసన్నల్లోనే అంతా నడుస్తోంది. సైట్ విజిటేషన్ సర్టిఫికెట్లు, వేల కోట్ల కుంభకోణాలు అన్నీ బయటపెట్టాం' అని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ వివరించారు.

'ఈ పరంపరలో మేం బయటపెట్టిన తాజా కుంభకోణమే టెసరాక్ట్. వడ్డించే వాడే మనోడే అన్నట్టు భూములు కొట్టేశారు. రూ.200 కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాన్ని రూ.7 కోట్లకు రాసిచ్చారు. ఇది కుంభకోణం కాదా? పక్క రాష్ట్రం కర్ణాటకలో ఒక న్యాయం, ఇక్కడ ఒక న్యాయమా?' అని మాజీ మంత్రి కేటీఆర్‌ ప్రశ్నించారు. టెసరాక్ట్ కథేంటో తేల్చేదాకా వదిలిపెట్టమని స్పష్టం చేశారు. 'ఆ కంపెనీకి, రేవంత్‌ రెడ్డి సోదరుడికి ఏ సంబంధం లేదని శ్రీధర్ బాబు అంటున్నడు. చైర్మన్ అనుముల కొండల్ రెడ్డి అని వాళ్లే ప్రొఫైల్లో రాసుకున్నారు. కానీ మంత్రి శ్రీధర్ బాబు సిగ్గులేకుండా బుకాయిస్తున్నారు. అసలు ఇవన్నీ మంత్రికి తెలిసి జరుగుతున్నాయా?' అని కేటీఆర్‌ సందేహం వ్యక్తం చేశారు.

 

మీ శాఖలో ఏం జరుగుతుందో మీకు తెలుస్తుందా శ్రీధర్ బాబు అని మాజీ మంత్రి కేటీఆర్‌ ప్రశ్నించారు. ఈ భూకేటాయింపుల కుంభకోణంలో ఎవరినీ వదిలిపెట్టమని హెచ్చరించారు. ముఖ్యమంత్రి సోదరులైతే ఏమైనా చేయొచ్చా? అని రేవంత్‌ రెడ్డి సోదరులపై మండిపడ్డారు. రేవంత్‌ రెడ్డి అన్న తిరుపతి రెడ్డికి ఏ అధికారిక హోదా ఉందని నిలదీశారు. ఎందుకు అతడికి కలెక్టర్లు, ఎస్పీలు వంగివంగి దండాలు పెడుతున్నారని ప్రశ్నించారు.

0
0
Report
Advertisement
Advertisement
Back to top