గుండా మల్లేష్ పేరు మార్కెట్ కు పెట్టుకుంటే ఆమరణ నిరాహార దీక్ష
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Irrigation Projects: వ్యవసాయానికి జీవనాధరమైన సాగునీటి ప్రాజెక్టులు పెండింగ్లు ఉంటే ఆ ప్రాజెక్టులు వెంటనే పూర్తి చేద్దామని.. పడగొట్టినవి నిలబెడదామని సీఎం చంద్రబాబు అధికారులకు చెప్పారు. 10 జిల్లాల్లో 20కు పైగా ఇరిగేషన్ ప్రాజెక్టుల పూర్తికి ప్రతిపాదనలు చేయాలని.. పూర్వోదయ నిధులతో సమగ్రాభివృద్ధి చేయాలని ఆదేశించారు. గ్లోబల్ మార్కెట్లో డిమాండ్కు అనుగుణంగా ఉద్యాన ఉత్పత్తులు పండించాలని అధికారులకు సూచించారు. దానికి అనుగుణంగా అభివృద్ధికి ప్రణాళికలు చేపట్టాలని ఆదేశించారు. రాయలసీమ, ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లో 500 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పతులను పండించడమే లక్ష్యంగా కార్యాచరణ సిద్దం చేయాలని సీఎం సూచించారు.
Also Read: Municipal Elections: మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారా? ఇవి తెలుసుకోండి
10 జిల్లాలను ఉద్యాన రంగానికి కేంద్ర బిందువుగా చేపట్టే సమీకృత అభివృద్ధి ప్రణాళికలపై మంగళవారం సీఎం క్యాంప్ కార్యాలయంలో వివిధ శాఖల మంత్రులు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష చేశారు. 'పూర్వోదయ, సాస్కీ, రాష్ట్ర ప్రభుత్వ నిధుల వినియోగంలో సమన్వయం చేసుకుంటూ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి. ఇదే సమయంలో సీమ, ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లోని ఇరిగేషన్ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేయాలి' అని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
Also Read: Traffic Challan: ట్రాఫిక్ చలాన్లపై ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఐదు చలాన్లు దాటితే లైసెన్స్ రద్దు
'పది జిల్లాల పరిధిలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాలని.. తక్కువ నిధులు కేటాయిస్తే త్వరగా పూర్తయ్యే ప్రాజెక్టులను తొలుత చేపట్టాలి. వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణాన్ని ఈ ఏడాదిలో పూర్తి చేయాలి. అన్నమయ్య ప్రాజెక్ట్ నిర్మాణానికి ప్రణాళికలు సిద్దం చేయాలి. గాలేరు-నగరి ప్రాజెక్టు ద్వారా కృష్ణా జలాలను కడప వరకు తీసుకెళ్లే అంశాన్ని పరిశీలించాలి' అని సీఎం చంద్రబాబు అధికార యంత్రాంగానికి ఆదేశాలు ఇచ్చారు. ఇలా సుమారు 20కు పైగా ప్రాజెక్టులను అభివృద్ధి చేయాల్సి ఉంటుందని సీఎం చంద్రబాబుకు అధికారులు వివరించారు. మొత్తంగా ఈ ప్రాజెక్టుల ద్వారా కొత్తగా 8.87 లక్షల ఎకరాల ఆయకట్టు, 4.30 లక్షల ఎకరాల స్థిరీకరణకు నీళ్లు అందించవచ్చని అధికారులు వెల్లడించారు.
Also Read: School Holiday: విద్యార్థులకు పండుగే.. స్కూళ్లకు నాలుగు రోజులు సెలవు?
సీమ ప్రాజెక్టులతో పాటు... ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా ప్రాజెక్టులను చేపట్టేలా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. పోలవరం ఎడమ కాల్వ పనులు పూర్తయితే గోదావరి జలాలను ఉత్తరాంధ్ర వరకు తీసుకెళ్లవచ్చని.. పోలవరం-వంశధార నదుల అనుసంధానం ప్రాజెక్టు చేపట్టవచ్చని అధికారులకు చెప్పారు. ఉత్తరాంధ్ర ప్రాంతంలోని ప్రాధాన్యతల వారీగా నిర్మాణం చేపట్టేలా ప్రణాళికలు సిద్దం చేసుకోవాలని సూచించారు.
పెండింగ్ ప్రాజెక్టులు పూర్తయితే రాయలసీమ, ప్రకాశం, మార్కాపురం జిల్లాల్లో ఉద్యాన పంటల సాగు అపారంగా పెరిగే అవకాశం ఉందని సీఎం చంద్రబాబుకు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఉద్యాన సాగు విస్తీర్ణాన్ని మూడేళ్లల్లో 8.41 లక్షల హెక్టార్ల నుంచి 14.41 లక్షల హెక్టార్లకు విస్తరించేలా ప్రణాళికలు చేపట్టినట్టు వివరించారు. రాయలసీమ ప్రాంతం ఉద్యాన ఉత్పత్తుల విషయంలో దేశంలోనే అగ్రస్థానంలో ఉందని.. ప్రపంచంలోనే అతిపెద్ద క్లస్టర్ గా రాయలసీమ, ప్రకాశం, మార్కాపురం జిల్లాలను అభివృద్ధి చేయాలని ఈ సందర్భంగా అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Municipal Elections: తెలంగాణలో పంచాయతీ ఎన్నికల తర్వాత మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ విడుదలైంది. పట్టణ ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులుగా పని చేయాలనుకునే వారిక ఈ ఎన్నికలు సదావకాశం కల్పిస్తున్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న వారు కొన్ని విషయాలు తప్పక తెలుసుకోవాల్సి ఉంది. లేదంటే ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. మున్సిపల్తోపాటు మున్సిపల్ కార్పొరేషన్కు సంబంధించిన నియమ నిబంధనలు ఇలా ఉన్నాయి.
Also Read: Traffic Challan: ట్రాఫిక్ చలాన్లపై ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఐదు చలాన్లు దాటితే లైసెన్స్ రద్దు
మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది నామినేషన్ ఎలా వేయాలి? అనేది. రాజకీయ పార్టీ నుంచి పోటీ చేస్తుంటే బీఫామ్ అవసరం. పార్టీ అభ్యర్థికి ఒక ప్రతిపాదకుడు సరిపోతాడు. అదే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలనుకుంటే మాత్రం పది మంది ప్రతిపాదన చేయాల్సి ఉంది. ఎన్నికలలో ప్రభుత్వంపై వ్యతిరేకతతో ఆషామాషీగా వేయకుండా ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది.
Also Read: School Holiday: విద్యార్థులకు పండుగే.. స్కూళ్లకు నాలుగు రోజులు సెలవు?
గతంలో మున్సిపల్ ఎన్నికల్లో ఒక స్థానానికి 200 మందికి పైగా నామినేషన్ వేసి పోటీలో నిలబడ్డారు. కొన్ని చోట్ల నామినేషన్ వేసి బేరసారాలతో ఉపసంహరించుకున్నారు కూడా. అయితే ఇప్పుడు మాత్రం అలా పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేయకుండా.. ప్రభుత్వంపై ఆగ్రహంతో పెద్ద ఎత్తున పోటీలో నిలబడకుండా ఓ నిబంధన తీసుకువచ్చారని తెలుస్తోంది. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలనుకుంటే పది మంది ప్రతిపాదించాల్సి ఉంది. కుటుంబసభ్యులు కానీ బంధుమిత్రులు ఇలా ఎవరైనా ప్రతిపాదించవచ్చు.
Also Read: HIV Injection: బ్రేకప్ చెప్పాడని మాజీ ప్రియుడి భార్యకు HIV ఇంజెక్షన్ ఇచ్చిన ప్రియురాలు
రూ.50 వేల కంటే ఎక్కువ తీసుకెళ్తే..
మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయడంతో తక్షణమే ఎన్నికల నియమ నిబంధనావళి (కోడ్) అమల్లోకి వచ్చింది. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో వ్యక్తులు గరిష్ఠంగా రూ.50 వేల వరకు మాత్రమే నగదు తీసుకెళ్లాల్సి ఉంది. రూ.50 వేల కంటే ఎక్కువ నగదు, విలువైన వస్తువులు (బంగారం, వెండి) తీసుకెళ్తుంటే మాత్రం వాటికి సంబంధించిన సరైన ఆధారాలు చూపించాల్సి ఉంది. ఎందుకు, ఎక్కడికి తీసుకెళ్తున్నారో వాటి ఆధారాలు ఎన్నికల అధికారులకు చూపాలి. లేదంటే నగదు, బంగారం, వెండిని సీజ్ చేసే అవకాశం ఉంది. ఎన్నికలు ముగిసే వరకు పెద్ద ఎత్తున నగదు విత్ డ్రా ఆపాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Traffic Challans Driving License Cancel: ట్రాఫిక్ నిబంధనలు.. చలాన్ల అంశంపై దేశంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. వాహనదారులకు సంబంధించి ట్రాఫిక్ చలాన్లపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంచలన నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమయ్యాయి. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ట్రాఫిక్ చలాన్లు పెండింగ్ ఉంటే ఆటో డెబిట్ను అమలు చేయాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ఆటోమేటిక్ డెబిట్ నిబంధన అమలు చేయడంపై ఇంకా నిర్ణయం తీసుకోకపోగా.. ఇతర రాష్ట్రాల్లో మాత్రం ట్రాఫిక్ చలాన్లపై ఆయా ప్రభుత్వాలు కీలక నిర్ణయం తీసుకుంటున్నాయి. కేరళలో ఐదు చలాన్లు పెండింగ్లో ఉంటే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తామని అక్కడి ప్రభుత్వం చెబుతోంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Also Read: School Holiday: విద్యార్థులకు పండుగే.. స్కూళ్లకు నాలుగు రోజులు సెలవు?
కేరళ రాష్ట్రంలో మోటారు వాహన చట్టాలను కఠినతరం చేయడానికి అక్కడ ప్రభుత్వం సిద్ధమైంది. సంవత్సరంలో ఐదు చలాన్లు వస్తే మాత్రం డ్రైవింగ్ లైసెన్స్లను రద్దు చేసేందుకు అక్కడి ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతుందని సమాచారం. ట్రాఫిక్ చలాన్ల అంశంపై కేరళ రాష్ట్ర ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకోబోతుందని సమాచారం. ట్రాఫిక్ నిబంధనల విషయమై ప్రభుత్వం త్వరలో ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది.
Also Read: Govt Employees: ప్రభుత్వ ఉద్యోగులకు భారీ షాక్.. ఇవి ఉల్లంఘిస్తే ఉద్యోగం ఊస్ట్!
ట్రాఫిక్ చలాన్లకు సంబంధించి జరిమానాలు చెల్లించడానికి 45 రోజుల గ్రేస్ పీరియడ్ ఉంది. ఈ జరిమానాలు చెల్లించని వాహనాలను ట్రాఫిక్ పోలీసులు బ్లాక్ లిస్ట్ చేస్తారు. బ్లాక్ లిస్ట్లో నమోదైన వాహనాలకు యాజమాన్య బదిలీ, ఫిట్నెస్ వంటి సేవలు బ్లాక్ చేస్తారు. వాహనంపై ఎవరిపై రిజస్టర్ (ఆర్సీ) అయ్యిందో ఆ వాహన యజమానిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారు. వారి వాహనాన్ని ఒకవేళ ఇతరులు నడిపితే నడిపితే వారిని నిరూపించాల్సిన బాధ్యత యజమానిపై ఉంటుందని కొత్త నిబంధనల్లో ఉంది.
Also Read: Municipal Elections: తెలంగాణలో మోగిన మున్సిపల్ ఎన్నికలు.. రేపటి నుంచే నామినేషన్లు షురూ
ట్రాఫిక్ నిబంధనలు, చట్టాన్ని ఉల్లంఘించిన వాహనదారుడిపై మూడు రోజుల్లోపు ఆన్లైన్ రూపంలో.. లేదా 15 రోజుల్లోపు స్వయంగా చలాన్లను చెల్లించాలి. ట్రాఫిక్ పోలీసులు విధించిన జరిమానాను 45 రోజుల్లోపు చెల్లించాలి. ఆ సమయంలో రోడ్డు నిబంధనలు ఉల్లంఘన చేయలేదని చెబితే దానికి సంబంధించి సాక్ష్యం అందించాలి. అలా చేయకపోతే లైసెన్స్ రద్దవడం, రిజిస్ట్రేషన్తో సహా అన్నీ కఠిన చర్యలు తీసుకుంటారు. రోడ్డు నిబంధనలు ఉల్లంఘించి మూడు నెలల వరకు జరిమానాలు చెల్లించని డ్రైవర్ల లైసెన్స్లను రద్దు చేయాలనే కేరళ రోడ్డు రవాణా అధికారులు ప్రతిపాదన చేశారు. రెడ్ సిగ్నల్ దాటడం, ప్రమాదకరమైన డ్రైవింగ్ వంటి ఉల్లంఘనలకు సంబంధించి మూడుసార్లు కంటే ఎక్కువ చలాన్లు పడితే మాత్రం అలాంటి వాహనదారుల డ్రైవింగ్ లైసెన్స్లను మూడు నెలల వరకు రద్దు చేసే అవకాశం ఉంది. ఉల్లంఘించినవారు, వాహనాల గురించి సమాచారం వాహన్ సారథి పోర్టల్కు బదిలీ చేస్తారు.
Also Read: Municipal Elections: తెలంగాణలో మోగిన మున్సిపల్ ఎన్నికలు.. రేపటి నుంచే నామినేషన్లు షురూ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
School Holidays From Tomorrow: విద్యార్థులకు భారీ గుడ్ న్యూస్. మళ్లీ వరుసగా భారీగా సెలవులు రానున్నాయి. వరుసగా నాలుగు రోజులు సెలవులు వస్తుండడంతో విద్యార్థులు పండుగ చేసుకోవచ్చు. ప్రభుత్వం నాలుగు రోజుల సెలవులు ప్రకటించే అవకాశం ఉంది. సంక్రాంతి పండుగ సెలవుల తర్వాత మళ్లీ వరుసగా నాలుగు రోజులు సెలవులు రానుండడం గమనార్హం. అన్ని చోట్ల స్కూల్స్, కాలేజీలకు సెలవు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
Also Read: HIV Injection: బ్రేకప్ చెప్పాడని మాజీ ప్రియుడి భార్యకు HIV ఇంజెక్షన్ ఇచ్చిన ప్రియురాలు
సంక్రాంతి పండుగకు ఆంధ్రప్రదేశ్తోపాటు తెలంగాణలో భారీగా స్కూళ్లు, కాలేజ్లకు సెలవులు వచ్చాయి. ఇక గణతంత్ర దినోత్సవం రావడంతో ఆది, సోమవారం కలిపి రెండు సెలవులు వచ్చాయి. ఈ సెలవులు ముగియగానే బుధవారం నుంచి పాఠశాలలు, కళాశాలలకు సెలవులు వచ్చే అవకాశం ఉంది. అయితే ఏపీలో కాకుండా తెలంగాణలో ఈ సెలవులు ఉండనున్నాయి. అదీ కూడా ఒక్క రెండు, మూడు జిల్లాల్లో మాత్రమే ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే తెలంగాణ కుంభమేళా మేడారం జాతర ఉంది.
Also Read: Govt Employees: ప్రభుత్వ ఉద్యోగులకు భారీ షాక్.. ఇవి ఉల్లంఘిస్తే ఉద్యోగం ఊస్ట్!
తెలంగాణలోనే కాదు ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క సారక్క. ఈ జాతర రాష్ట్ర పండుగగా కేసీఆర్ ప్రభుత్వం గుర్తించిన విషయం తెలిసిందే. మేడారం సమ్మక్క సారక్క జాతర జనవరి 28 నుంచి 31వ తేదీ వరకు అత్యంత వైభవంగా జరుగనుంది. నాలుగు రోజుల పాటు జరగనున్న సమ్మక్క సారక్క జాతరకు భారీ స్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ములుగు జిల్లాలో కొలువైన అడవి తల్లులను దర్శించుకునేందుకు దాదాపు కోటి మందికి పైగా భక్తులు వస్తుంటారు.
Also Read: Municipal Elections: తెలంగాణలో మోగిన మున్సిపల్ ఎన్నికలు.. రేపటి నుంచే నామినేషన్లు షురూ
సమ్మక్క సారక్క దేవతలను ఒక్క తెలంగాణ కాదు మహారాష్ట్ర, చత్తీస్గడ్, కర్ణాటకతోపాటు ఆంధ్రప్రదేశ్ నుంచి భక్తులు దర్శించుకుంటారు. ఈ జాతర సందర్భంగా ములుగు జిల్లాలో కోలాహలం ఉంటుంది. దారులన్నీ మేడారం అన్నట్టు పరిస్థితి ఉంటుండడంతో ఈ సమయంలో స్థానికంగా విద్యా సంస్థలకు సెలవు ఇవ్వాలనే డిమాండ్ వినిపిస్తోంది. ఇప్పటికే ములుగు జిల్లాతోపాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో పాఠశాలలకు సెలవులు ప్రకటించాలని ఉపాధ్యాయ సంఘం పీఆర్ర్టీయూ ప్రభుత్వాన్ని ఇప్పటికే డిమాండ్ చేసింది.
Also Read: Municipal Elections: తెలంగాణలో మోగిన మున్సిపల్ ఎన్నికలు.. రేపటి నుంచే నామినేషన్లు షురూ
ఉపాధ్యాయులు, విద్యార్థులు తమ కుటుంబాలతో కలిసి జాతరకు వెళ్లే అవకాశం ఉండడంతో ఈ సెలవులు ఇవ్వాలని పీఆర్టీయూ నాయకులు విజ్ఞప్తి చేస్తున్నారు. అదే కాకుండా మేడారం జాతర సందర్భంగా ములుగు జిల్లాలో అధికార యంత్రాంగం మొత్తం మేడారంలోనే ఉంటుంది. బస్సులన్నీ అటు వైపే వెళ్తుంటాయి. దీంతో ములుగు జిల్లా వరకైనా పాఠశాలలు, కళాశాలలకు సెలవు ఇవ్వాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు. మేడారం జాతర ఉమ్మడి వరంగల్ జిల్లాలో జరుగుతుండడంతో ఈ జిల్లా పరిధిలోని విద్యా సంస్థలకు సెలవులు ఇచ్చే అవకాశాన్ని పరిశీలించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పటికే మేడారం జాతర రాష్ట్ర పండుగ. మరి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని వేచి చూడాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Motorola Edge 50 Fusion Offer Price News: మోటరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ (Motorola Edge 50 Fusion) స్మార్ట్ఫోన్కు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. అతి తక్కువ ధరలోనే ఎన్నో రకాల ప్రత్యేకమైన ఫీచర్లతో అందుబాటులోకి రావడం వల్ల జనాలు ఈ మొబైల్ ను ఎగబడి మరికొంటున్నారు. మీరు కూడా ఈ స్మార్ట్ఫోన్ను ఎప్పటినుంచో అతి తక్కువ ధరకే కొనుగోలు చేయాలనుకుంటే.. ఇది అద్భుతమైన సమయంగా భావించవచ్చు.. ఎందుకంటే ఈ మొబైల్పై ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. ఫ్లిప్కార్ట్లో అదనంగా ఎక్స్చేంజ్ బోనస్ కూడా లభిస్తుంది. ముఖ్యంగా మోటరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ స్మార్ట్ఫోన్ ఫీచర్స్ వివరాల్లోకి వెళితే.. ఇది చాలా ప్రత్యేకమైన 6.67-అంగుళాల Full HD+ pOLED 3D కర్వ్డ్ డిస్ప్లే కలిగి ఉంటుంది. అంతేకాకుండా 144Hz రిఫ్రెష్ రేట్, 1,600 నిట్స్ పీక్ బ్రైట్నెస్ను సపోర్టుతో లభిస్తోంది. అలాగే ఇది ప్రత్యేకమైన కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 సపోర్టును కూడా కలిగి ఉంటుంది.
ఈ స్మార్ట్ఫోన్ ఎంతో శక్తివంతమైన క్వాల్కమ్ Snapdragon 7s Gen 2 (4nm) చిప్సెట్ ప్రాసెసర్తో అందుబాటులోకి వచ్చింది. ఇది ఇప్పుడు మార్కెట్లో రెండు స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. మొదటి స్టోరేజ్ వేరియంట్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ను కలిగి ఉంటుంది. ఇక రెండవ స్టోరేజ్ వేరియంట్ 256 జిబి ఇంటర్నల్ స్టోరేజ్ తో వచ్చింది. ఇక వెనక భాగంలో ఇది డ్యూయల్ కెమెరా మాడ్యూల్తో అందుబాటులోకి వచ్చింది. బ్యాక్ సెటప్లో Sony LYTIA 700C సెన్సార్, OIS సపోర్ట్ 50MP మెయిన్ కెమెరాను కలిగి ఉంటుంది. అంతేకాకుండా 13MP అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరాతో లభిస్తోంది. ఇక ఫ్రంట్ భాగంలో 32MP సెల్ఫీ కెమెరా కూడా అందుబాటులో ఉంది.
ఈ మోటరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ స్మార్ట్ఫోన్ ఎంతో శక్తివంతమైన 5,000mAh బ్యాటరీతో పాటు 68W టర్బో ఛార్జింగ్ సపోర్ట్తో వచ్చింది. ఇది చాలా ప్రత్యేకమైన ఆండ్రాయిడ్ 14 ఆధారిత Hello UI ఆపరేటింగ్ సిస్టం కలిగి ఉంటుంది. ఇందులో మోటరోలా కంపెనీ నాలుగేళ్ల వరకు ఆండ్రాయిడ్ అప్డేట్స్ను కూడా అందిస్తోంది. దీంతోపాటు ఎన్నో రకాల ప్రత్యేకమైన కనెక్టివిటీ ఫీచర్లను కలిగి ఉంది. తప్రస్తుతం మార్కెట్లో బేస్ వేరియంట్ 128GBs ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన మొబైల్ ధర MRP రూ.25,999 కాగా.. ఇప్పుడే కొనుగోలు చేసే వారికి ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్ లో భాగంగా 27 శాతం తగ్గింపుతో రూ.18, 999కే అందుబాటులో ఉంది. అంతేకాకుండా దీనిపై స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి.
Also Read: Redmi 14C 5G Offer: రెడ్మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్ఫోన్..అదిరిపోయే ఆఫర్!
ముఖ్యంగా ఈ మోటరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ మొబైల్ను ఫ్లిప్కార్ట్ అనుసంధానం యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, ఎస్బిఐ బ్యాంకు క్రెడిట్ కార్డులను వినియోగించి పేమెంట్ చేసే వారికి ఏకంగా రూ.1000 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో ఈ మొబైల్ కేవలం రూ.17,999కే అందుబాటులో ఉంది. దీంతోపాటు ఏదైనా మొబైల్ ఎక్స్చేంజ్ చేస్తే అదనంగా రూ.17 వేల వరకు బోనస్ లభిస్తుంది. దీంతో ఈ స్మార్ట్ఫోన్ను కేవలం రూ. 999కే పొందవచ్చు.
Also Read: Redmi 14C 5G Offer: రెడ్మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్ఫోన్..అదిరిపోయే ఆఫర్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Giant 12-foot Python Viral Video Watch Here: అమెరికాలోని ఫ్లోరిడా చిత్తడి నేలలకు ప్రసిద్ధి.. ఇక్కడ వివిధ రకాల వన్యప్రాణులు జీవిస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఇది అత్యంత ప్రమాదకరమైన కొండచిలువలకు ఒక ప్రత్యేకమైన స్థలం. ఇక్కడ ఎన్నో రకాల జాతులకు సంబంధించిన పాములు వాటి జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటాయి. తాజాగా ఈ చిత్తడి నేలల్లో వన్య ప్రాణి సంరక్షకుడు చేసిన సాహసం ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ గా మారింది. ఈ వీడియోలో పర్యావరణానికి ఎంతో ముప్పుగా మారిన బర్మీస్ కొండచిలువను పట్టుకుంటున్న క్రమంలో.. అతడు పడ్డ కష్టం సోషల్ మీడియా వినియోగదారులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
ఇక ఈ వీడియో వివరాల్లోకి వెళ్తే.. ఓ వన్యప్రాణి సంరక్షకుడు.. ఇటీవల బర్మీస్ కొండచిలువ చేస్తున్న ప్రకృతి ముక్కు చెక్ పెట్టేందుకు ఆయన ప్రత్యేకమైన కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగానే కనిపించిన ఈ పాములన్నింటినీ పట్టుకొని ఓ చోట బంధిస్తున్నారు. అయితే ఈ వైరల్ అవుతున్న వీడియోలు అతను రాత్రి సమయంలో ఓ బర్మీస్ కొండచిలువను పట్టుకుంటున్న దృశ్యాలు మీరు చూడొచ్చు. ఈ వీడియోలో ఆ కొండచిలువ పరిమాణం చూస్తుంటేనే ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆ పాము దాదాపు 12 అడుగుల పొడవు ఉన్నట్లు కనిపిస్తోంది.
ఈ వీడియోలో గారెట్ అనే వన్యప్రాణి సంరక్షకుడు ఆ బర్మీస్ కొండచిలువ సమీపంలోకి చాలా నెమ్మదిగా వెళ్లడం మీరు చూడొచ్చు. ఆ పాము కూడా అతనిని చూసి ఒక్కసారిగా తన మీదకు దాడి చేయడానికి ప్రయత్నించినప్పటికీ... అతను మాత్రం బెదరకుండా పాము తలభాగాన్ని ఎంతో చాకచక్యంగా పట్టుకోవడానికి ప్రయత్నించడం మీరు చూడొచ్చు. అతను చాలా నెమ్మదిగా ఆ పాము వైపుకు జరుగుతూ.. పాము ధనభాగాన్ని గట్టిగా పట్టుకున్నాడు. ఈ సమయంలో ఆ పాము తన నోటి భాగాన్ని తెరిచి చూడడం మీరు వీడియోలో గమనించవచ్చు.
Also Read: Giant Cobra Video: కిచెన్లో ఫ్రిజ్ వెనుక భారీ నాగుపాము.. సంచలనం సృష్టిస్తున్న వీడియో..
11 సెకండ్లు కలిగిన ఈ వీడియోను ఇప్పుడు సోషల్ మీడియా వినియోగదారులు విచ్చలవిడిగా వీక్షిస్తున్నారు. అయితే, ఈ వీడియో పై కొంతమంది వారి అభిప్రాయాలను కూడా వ్యక్తం చేస్తున్నారు. ఈ పామును చూస్తుంటేనే ఒళ్లంతా ఎలాగో ఉందని.. అలాగే చాలా భయమేస్తోందని కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు కామెంట్లలో రాసుకొచ్చారు. ఇక మరి కొంతమంది మాత్రం నిజంగా ఇది ప్రాణాలతో చెలగాటమే అని ఆ వన్యప్రాణి సంరక్షకుడి పై కామెంట్లు చేస్తున్నారు. ఇలా సోషల్ మీడియా వినియోగదారులు ఎవరికి నచ్చినట్లు వారు అభిప్రాయాలను కామెంట్ల రూపంలో వ్యక్తపరిస్తున్నారు.
Also Read: Giant Cobra Video: కిచెన్లో ఫ్రిజ్ వెనుక భారీ నాగుపాము.. సంచలనం సృష్టిస్తున్న వీడియో..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Giant Anaconda Video Watch Here: ప్రకృతి ఒడిలో దాగివున్న ప్రమాదకరమైన జీవులు కూడా కొన్ని సందర్భాల్లో అనేక సమస్యలకు గురవుతూ ఉంటాయి. ముఖ్యంగా అప్పుడప్పుడు అనారోగ్య సమస్యల బారిన పడుతూ ఉంటాయి. అలాగే కదలకుండా ఒక్కచోటే ఉండిపోయి తీవ్ర సమస్యలను ఎదుర్కొట్టాయి. ఇలాంటి సమయంలోనే కొంతమంది వన్యప్రాణి సంరక్షకులు వాటిపై ఉన్న ప్రేమతో వాటిని రక్షించేందుకు అష్ట కష్టాలు పడుతూ ఉంటారు. తాజాగా ఓ ప్రకృతిని ప్రేమించే యువకుడు గరెట్ కొలంబియా అడవుల్లో సాహసం చేసి అత్యంత ప్రమాదకరమైన భారీ అనకొండ పామును పట్టుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
సాధారణంగా అన్ని పాములు ప్రమాదకరమని తెలుసు.. కానీ కొన్ని పాములు మాత్రం చూడడానికి భయంకరంగా ఉన్నప్పటికీ.. విషపూరితమైనవి కావు.. అందులో మొదటి స్థానంలో అనకొండ పాములు ఉంటాయి. ఇవి చూడడానికి భారీ శరీరాన్ని కలిగి ఉన్నప్పటికీ.. ఎలాంటి విషం కలిగి ఉండవు.. కానీ విషం కలిగిన పాముల కంటే చాలా డేంజర్.. వీటి కండరాలు అత్యంత దృఢంగా ఉంటాయి. ఎలాంటి జంతువులనైన ఎంతో సులభంగా దాడి చేసి ఎముకలను పిప్పి చేయగలుగుతాయి. అందుకే వీటిని పట్టుకునేందుకు ఎవరు పెద్దగా ప్రయత్నించారు. కానీ ఓ వన్యప్రాణి సంరక్షకుడు మాత్రం చిత్తడి నేలల్లో ఉన్న ఈ పామును పట్టుకోవడానికి ప్రయత్నించాడు.
వీడియో వివరాల్లోకి వెళ్తే... ఆ వన్యప్రాణి సంరక్షకుడు బురద నీటిలో సరదాగా సేద తీరుతున్న అత్యంత ప్రమాదకరమైన అనకొండ పామును చూసి అందులోకి దిగుతాడు. గుట్టు చప్పుడు కాకుండా నెమ్మదిగా అతను ఆ పాము సమీపంలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తాడు. ఇలా అతను ఆ పాముకు చాలా దగ్గరగా వెళ్లి దానిని ఎంతో నెమ్మదిగా పట్టుకోవడానికి చూస్తాడు. అతడు నెమ్మదిగా ఆ పాము తలభాగాన్ని పట్టుకుంటాడు. అయితే దాని శరీర భాగం మాత్రం అతని కాళ్లకు చుట్టుకోవడం మీరు గమనించవచ్చు. ఈ సమయంలో అతను వీడియోలు ఇది నా కాళ్లకు చుట్టుకుంది.. కానీ ఏమీ పరవాలేదని అనడం మీరు గమనించవచ్చు.
Also Read: Giant Cobra Video: కిచెన్లో ఫ్రిజ్ వెనుక భారీ నాగుపాము.. సంచలనం సృష్టిస్తున్న వీడియో..
అతడు వీడియోలో మాట్లాడుకుంటూ ఆ పాముకు సంబంధించిన తలభాగాన్ని పట్టుకోవడానికి అటు ఇటు వెతకడం మీరు చూడొచ్చు. అయితే, ఆ బురద నీలలు పాము ఎంతో శక్తివంతంగా అనిపించడంతో అతను తన రెండు చేతులను బలాన్ని వినియోగించి, దానిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. అంతేకాకుండా ఆ కొండచిలువ అతన్ని బలంగా చుట్టేసినప్పటికీ.. ఏమాత్రం భయపడకుండా పామును పట్టుకోవడం మీరు వీడియోలో క్లియర్గా చూడొచ్చు. అలాగే ఈ వీడియోలో కనిపిస్తున్న పాము దాదాపు 12 నుంచి 15 అడుగుల పొడవు ఉంటుంది. ఈ దృశ్యాలను అక్కడున్న కొంతమంది వన్యప్రాణి సంరక్షకులు కెమెరాలు చిత్రీకరించి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్లు తెలుస్తోంది.
Also Read: Giant Cobra Video: కిచెన్లో ఫ్రిజ్ వెనుక భారీ నాగుపాము.. సంచలనం సృష్టిస్తున్న వీడియో..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Phone Tapping Case Latest News: గత కొద్దిరోజుల నుంచి తెలంగాణ రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ ప్రకంపనలు సృష్టిస్తూ వస్తోంది. నిన్న మొన్నటి వరకు కొంతమంది అధికారుల చుట్టూ తిరిగిన ఈ కేసు.. ప్రస్తుతం గులాబీ పార్టీలోని అగ్రనేతల ఇంటి గడప తొక్కుతోంది.. ఇప్పటికే మాజీ మంత్రి హరీష్ రావు తో పాటు, కేటీఆర్, జోగినపల్లి సంతోష్ రావులకు నోటీసులు అందగా.. ఇప్పుడు అందరి దృష్టి మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై పడింది.. మరో రెండు రోజుల్లో కవితకు సిట్ (SIT) నోటీసులు అందే చాన్స్ ఉందన్న వార్త రాజకీయ వర్గాల్లో పెను దుమారం రేపుతూ వస్తోంది. ఒకవేళ ఇదే జరిగితే.. విచారణలో భాగంగా అసలు కవిత ఏం చెప్పబోతున్నారు? సొంత సోదరుడిపై ఆమె చేసిన ఆరోపణల అంతరార్థం ఏమిటి? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం..
గత కొన్ని రోజుల నుంచి ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దర్యాప్తు వేగవంతమైంది. బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నేతలతో పాటు.. సొంత పార్టీ నేతల ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయన్నది ప్రధాన ఆరోపణ.. ఈ క్రమంలోనే కవిత భర్త అనిల్ కుమార్ ఫోన్ కూడా టాపింగ్కు గురైనట్లు.. స్వయంగా కవిత గతంలోనే బాంబు పేల్చిన సంగతి తెలిసిందే.. "నా భర్త ఫోను కూడా వదలట్లేదు" అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు అప్పట్లో బిఆర్ఎస్ పార్టీలో కొంత చర్చకు దారి తీసిన సంగతి తెలిసిందే..
ఇది ఇలా ఉంటే ఈ ట్యాపింగ్ వ్యవహారం వెనుక గులాబీ ప్రధాన లీడర్ కేటీఆర్ హస్తం ఉందన్న కోణంలో కవిత చేస్తున్న పరోక్ష విమర్శలు ఇప్పుడు సిట్ అధికారులకు కీలకంగా మారినట్లు తెలుస్తోంది. బాధితురాలిగా కవిత ఇచ్చే స్టేట్మెంట్ ఈ కేసులో ఎవరి మేడకు చుట్టుకుంటుందో అని బీఆర్ఎస్ శ్రేణుల్లో తీవ్ర వుడ్ కంట నెలకొన్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. మున్సిపల్ ఎన్నికలవేళ ఈ కేసు మళ్లీ తెరపైకి రావడం వెనక రాజకీయ కుట్ర ఉందని కవిత ఆరోపిస్తున్నారు.. ఇదంతా సీఎం రేవంత్ రెడ్డి తో పాటు హరీష్ రావు కలిసి ఆడుతున్న డ్రామా అని ఆమె ఘాటుగా విమర్శిస్తున్నారు.
ఇక సిట్ అధికారులు మాత్రం అరిష్టైన పోలీస్ అధికారుల వాంగ్మూలం ఆధారంగానే నోటీసులు జారీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ కవిత విచారణకు హాజరైతే.. ఆమె తన భర్త ఫోన్ ట్యాపింగ్పై ఇచ్చే ఆధారాలు పార్టీలో అంతర్గత పోరును మరింత బయటపెట్టే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. SIT నోటీసులు అందితే కవిత విచారణకు వెళ్తారా? లేక దీనిపై న్యాయపోరాటం చేస్తారా? అనేది వేచి చూడాల్సిందే. ఏది ఏమైనా.. ఈ ఫోన్ ట్యాపింగ్ భూతం తెలంగాణ రాజకీయాలను ఎటువైపు తీసుకెళ్తుందో చూడాల్సిందే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Mercury Retrograde 2026 Effect On Zodiac Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధుడిని జ్ఞానంతో పాటు తెలివితేటలు తీర్పుకు చిహ్నంగా చెప్పుకుంటారు. ఇలాంటి గ్రహం తిరోగమనంలోకి మారినప్పుడు అన్ని రాశుల వారిపై ఎంతో కొంత ప్రభావం పడుతుంది. ముఖ్యంగా కొన్ని రాశుల వారు పాత నిర్ణయాలను పునరాలోచించే అవకాశాలు కూడా ఉంటాయి. అంతేకాకుండా డబ్బు పరంగా కొన్ని ప్రత్యేకమైన నిర్ణయాలు కూడా తీసుకుంటారు. బుధ గ్రహం తిరోగమన ప్రభావంతో ఈ సమయంలో ఊహించని స్థాయిలో శక్తి పెరుగుతుంది. ముఖ్యంగా ఫిబ్రవరి 26వ తేదీ నుంచి బుధుడు తిరోగమన స్థితిలోకి మారబోతున్నాడు. అప్పటినుంచి రాబోయే నెల మార్చి వరకు కొన్ని రాశుల వారికి ఆర్థిక ఇబ్బందులు పూర్తిగా తొలగిపోతాయి. అంతేకాకుండా ఆందోళన కూడా తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే, ఈ తిరోగమన ప్రభావంతో అత్యధిక లాభాలు పొందబోయే రాశులేవో తెలుసుకోండి.
ఈ రాశులవారికి బంపర్ జాక్ఫాట్!
వృషభ రాశి
వృషభ రాశి వారికి ఈ సమయంలో అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి. ముఖ్యంగా జీవితంలో వీరు ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకుంటారు. బుధుడి ప్రభావంతో పాత వ్యాపారాలనుంచి డబ్బులు కూడా పొందగలుగుతారు. దీంతోపాటు కొత్త ఆదాయ మార్గాలు కూడా తెరుచుకుంటాయి. అనుకున్న పనుల్లో అద్భుతమైన విజయాలు సాధించే సూచనలు కనిపిస్తున్నాయి.
మిథున రాశి
మిథున రాశి వారికి చాలాకాలంగా నిలిచిపోయిన పనులు కూడా ఎంతో సులభంగా పూర్తవుతాయి. కొత్త వరంగల్ కొత్త కొత్త అవకాశాలు కూడా లభిస్తాయి. డబ్బు మీ చేతుల్లోకి వస్తుంది. ముఖ్యంగా ఖర్చులు కూడా ఊహించని స్థాయిలో తగ్గిపోతాయి. ఆర్థిక సమస్యలు చాలావరకు పరిష్కారం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
కన్యరాశి
కన్యరాశిలో జన్మించిన వ్యక్తులకు జీవితంలో అద్భుతమైన మార్పులు సంభవిస్తాయి. విద్యతోపాటు తెలివితేటలు కూడా విపరీతంగా పెరుగుతాయి. ఎలాంటి పనులు చేసిన కొత్త ఆదాయ వనరులు లభిస్తాయి. ఆందోళన కూడా పూర్తిగా తగ్గిపోయి.. మానసికంగా మెరుగుపడే అవకాశాలున్నాయి. జీవితంలో ఊహించని స్థాయికి ఎదుగుతారు.
తులారాశి
తులారాశి వారికి ఆలోచన స్థాయి కూడా పెరుగుతుంది. అంతేకాకుండా మరిచిపోయిన పనులు తిరిగి మళ్లీ చేయగలుగుతారు. కొంత మొత్తంలో డబ్బు కూడా లభించే అవకాశాలున్నాయి. దీనివల్ల కొన్ని రకాల ఆర్థిక సమస్యలు పూర్తిగా పరిష్కారం అవుతాయి. ముఖ్యంగా ఎన్నో దీర్ఘకాలిక సమస్యలు ఉన్న వ్యక్తులకు కాస్త పరిష్కారం లభిస్తుంది.
కుంభరాశి
కుంభరాశిలో జన్మించిన వ్యక్తులు ఈ సమయంలో అద్భుతమైన నిర్ణయాలు తీసుకుంటారు. కెరీర్ పరంగా మంచి ప్రణాళికలు కూడా పొందుతారు. ఐటి డేటా రంగాల్లో పనులు చేస్తున్న వ్యక్తులకు మంచి ఫలితాలు లభిస్తాయి. ముఖ్యంగా వ్యాపారాలు చేస్తున్న వ్యక్తులకు దిగుమతులు క్రమంగా పెరిగి.. డబ్బు సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. అలాగే ఎన్నో రకాల సమస్యలు తొలగిపోతాయి.
Also Read: Mercury Transit 2026: మకరంలో తిష్ట వేసిన బుధుడు.. ఈ రాశుల వారికి కోటీశ్వరులయ్యే యోగం ప్రారంభం!

Also Read: Mercury Transit 2026: మకరంలో తిష్ట వేసిన బుధుడు.. ఈ రాశుల వారికి కోటీశ్వరులయ్యే యోగం ప్రారంభం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Rahu And Mercury Conjunction Effect On Zodiac News: ప్రతి గ్రహం ఒక నిర్దిష్ట సమయంలో తప్పకుండా రాశి మారుతూ ఉంటుంది. ముఖ్యంగా ఇలాంటి సందర్భాల్లోనే మొత్తం 12 రాశుల వారిపై తీవ్ర ప్రభావం పడుతూ ఉంటుంది. కొన్ని అరుదైన గ్రహాలు సంచారం చేసినప్పుడు అనేక రాశుల వారి జీవితాల్లో ఊహించని మార్పులు సంభవిస్తాయి. ఇదిలా ఉంటే దాదాపు 18 సంవత్సరాల తర్వాత రాహువు బుధుల మహా సంయోగం ఏర్పడబోతోంది.. కుంభ రాశిలో ఈ రెండు గ్రహాల కలయిక జరగబోతోంది. దీనికి కారణంగా కొన్ని రాశుల వారు గొప్ప సమయాన్ని అనుభవించబోతున్నారని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఈ సమయంలో అద్భుతమైన ధన లాభాలు కూడా పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఇంట్లో సంపాదన కూడా పెరుగుతుంది. అనుకున్న ప్రయోజనాలు కూడా పొందగలుగుతారని వారు అంటున్నారు నిజానికి ఈ సమయంలో అత్యంత లాభాలు పొందబోయే రాశులేవో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఈ రాశులవారికి ఊహించని జాక్పాట్:
మిథున రాశి
రాహువు, బుధ గ్రహాల కలయిక కారణంగా మిథున రాశి వారి పరిస్థితులు గతంలో కంటే ఇప్పుడు మరింత మారే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా వీరికి భారీ మొత్తంలో డబ్బు లభిస్తుంది. అలాగే ఎప్పుడు పొందనంత డబ్బును కూడా పొంది.. అద్భుతమైన సంపాదన సొంతం చేసుకుంటారు. పెట్టుబడిదారుల నుంచి ప్రత్యేకమైన లాభాలు కూడా పొందుతారు. ఈ సమయంలో వ్యాపారాలతో పాటు పెద్దపెద్ద వాణిజ్య ఒప్పందాలు కూడా కుదుర్చుకుంటారు.. ముఖ్యంగా స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్న వ్యక్తులకు ఈ సమయం ఎంతో అద్భుతంగా ఉంటుంది.
కుంభరాశి
కుంభ రాశిలో జన్మించిన వ్యక్తులకు రాహువు, బుధుడి కలయిక కారణంగా ఈ సమయంలో ఇష్టమైన వారితో అద్భుతమైన క్షణాలు గడిపే అవకాశాలున్నాయి. ముఖ్యంగా ఊహించని డబ్బు పొందడమే కాకుండా.. గతంలో నిలిచిపోయిన పనులు కూడా కాస్త ప్రారంభమై.. భారీ మొత్తంలో డబ్బులు లభిస్తాయి. అంతేకాకుండా వ్యక్తులు ఈ సమయంలో పొదుపు చేసే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితులు బాగా మెరుగుపడి.. భారీ మొత్తంలో ఖర్చు కూడా పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఈ సమయంలో ఆనందం కూడా విపరీతంగా పెరుగుతుంది. దీని కారణంగా ఊహించని స్థాయిలో అనుకున్న పనులు చేయగలుగుతారు.
మేషరాశి
మేష రాశి వారికి ఈ సమయంలో అద్భుతమైన క్షణాలు రాబోతున్నాయి. వ్యాపారాలు లాభసాటిగా మారడమే కాకుండా ఊహించని స్థాయిలో డబ్బు లభిస్తుంది. దీంతోపాటు ఆర్థిక పరిస్థితులు మునుపాటి కంటే ఇప్పుడు మరింత మెరుగుపడతాయి. ఈసారి వ్యాపారాల్లో కూడా భారీ మొత్తంలో లాభాలు పొందగలుగుతారు. గతంలో చిక్కుకుపోయిన డబ్బులు కూడా తిరిగి పొందుతారు. అలాగే భాగస్వామ్య జీవితం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. పెద్ద పెద్ద ధన లాభాలు పొందడమే కాకుండా అనుకున్న స్థాయిలో డబ్బు కూడా సొంతం చేసుకోగలుగుతారు. ముఖ్యంగా వీరికి సమాజంలో అనుకున్నంత స్థాయిలో గౌరవం పెరుగుతుంది..
Also Read: Mercury Transit 2026: మకరంలో తిష్ట వేసిన బుధుడు.. ఈ రాశుల వారికి కోటీశ్వరులయ్యే యోగం ప్రారంభం!

Also Read: Mercury Transit 2026: మకరంలో తిష్ట వేసిన బుధుడు.. ఈ రాశుల వారికి కోటీశ్వరులయ్యే యోగం ప్రారంభం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Anti Aging Superfood Diet: వయసు పెరిగినా చర్మం ముడతలు పడకుండా, ముఖంపై సహజమైన కాంతి తగ్గకుండా ఉండాలంటే మనం తీసుకునే ఆహారమే అత్యంత కీలకం. కొన్ని రకాల 'సూపర్ ఫుడ్స్' వృద్ధాప్య ప్రక్రియను (Aging process) నెమ్మదింపజేసి, మిమ్మల్ని మీ వయసు కంటే యవ్వనంగా కనిపించేలా చేస్తాయి. చిన్న వయసులోనే వృద్ధాప్య ఛాయలు రాకుండా ఉండటానికి ఖరీదైన క్రీముల కంటే, సరైన పోషకాహారం తీసుకోవడమే ఉత్తమ మార్గమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
బెర్రీలు (బ్రైట్ స్కిన్ & షార్ప్ బ్రెయిన్)
స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీలు, రాస్ప్బెర్రీలలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మ కణాలను దెబ్బతినకుండా కాపాడి, సహజమైన కాంతిని ఇస్తాయి. మెదడు పనితీరును మెరుగుపరచడమే కాకుండా గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. వీటిని సలాడ్స్ రూపంలో లేదా నేరుగా తీసుకోవచ్చు.
నట్స్, డ్రై ఫ్రూట్స్ (గుండె ఆరోగ్యం)
వయసు పెరిగే కొద్దీ వచ్చే ప్రధాన సమస్య గుండె జబ్బులు. బాదం, వాల్నట్స్ వంటివి శరీరానికి మేలు చేసే ఆరోగ్యకరమైన కొవ్వులను (Healthy fats) అందిస్తాయి. ఇవి రక్త నాళాలను దృఢంగా ఉంచి.. కొలెస్ట్రాల్, చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి. తద్వారా మీరు రోజంతా ఉత్సాహంగా ఉండటమే కాకుండా యవ్వనంగా కనిపిస్తారు.
చేపలు (ఒమేగా-3 పవర్)
వృద్ధాప్యాన్ని అడ్డుకోవడంలో చేపల పాత్ర అమోఘం. ముఖ్యంగా సాల్మన్, మాకేరెల్ వంటి చేపలలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరంలో మంటను (Inflammation) తగ్గించి కీళ్ల నొప్పులను నివారిస్తాయి. చర్మం మృదువుగా ఉండేలా చేస్తాయి. రక్త ప్రసరణను మెరుగుపరిచి అవయవాలు సక్రమంగా పనిచేయడానికి తోడ్పడతాయి.
యవ్వనంగా కనిపించడం అంటే కేవలం బాహ్య సౌందర్యం మాత్రమే కాదు, లోపలి నుండి ఆరోగ్యంగా ఉండటం కూడా. పైన పేర్కొన్న ఆహార పదార్థాలతో పాటు తగినంత నీరు తాగడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల మీరు మీ వయసు కంటే చిన్నవారుగా కనిపిస్తారు.
Also Read: Padma Awards Benefits: పద్మ అవార్డుల పవర్ ఇదే! పురస్కార గ్రహీతలకు లభించే రాచమర్యాదలు ఇవే!
Also Read: Redmi 14C 5G Offer: రెడ్మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్ఫోన్..అదిరిపోయే ఆఫర్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Telangana Municipal Elections: 'మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టాలి. ఈ రాష్ట్రంలో పేద ప్రజలకు న్యాయం జరగాలంటే కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలి. రెండోసారి మోసపోతే మనం తప్పు చేసిన వాళ్లం అవుతాం. అమెరికాలాంటి దేశంలో ఇప్పటికి అనేక సమస్యలు ఉన్నాయి. ఈసారి కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే తెలంగాణలో ఉన్నటువంటి మిగిలిన సమస్యలు పరిష్కారమవుతాయి' అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు.
Also Read: Govt Employees: ప్రభుత్వ ఉద్యోగులకు భారీ షాక్.. ఇవి ఉల్లంఘిస్తే ఉద్యోగం ఊస్ట్!
చేవెళ్ల నియోజకవర్గానికి చెందిన బీజేపీ నాయకులు హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారిని ఆహ్వానించిన అనంతరం మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడారు. 'చేవెళ్లలో కాలె యాదయ్య కేసీఆర్ మనిషి అనుకుని గెలిపస్తే కాంగ్రెస్ గూటికి వెళ్లాడు. ఆయన పార్టీ మారినట్లు ఆధారాలు ఉన్నాయి వేటు వెయ్యమంటే స్పీకర్ మాత్రం బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని చెబుతున్నారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కాలె యాదయ్య చిన్ననాటి దోస్తులు. ఇద్దరు కలిసి ఒకే బండిపై తిరిగేవారు. మహా భారతంలో ధృతరాష్ట్రుడు ఏం కనపడనట్లు నటించినట్లు.. పార్టీ మారిన ఎమ్మెల్యేలు విషయంలో స్పీకర్ అలానే ఉంటున్నాడు' అని సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ తప్పుబట్టారు.
Also Read: HIV Injection: బ్రేకప్ చెప్పాడని మాజీ ప్రియుడి భార్యకు HIV ఇంజెక్షన్ ఇచ్చిన ప్రియురాలు
'చేవెళ్లలో ఐదేళ్ల అబ్బాయిని అడిగినా కాలె యాదయ్య పార్టీ మారాడని చెబుతాడు. కానీ స్పీకర్ మాత్రం కాలె యాదయ్య బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాడు అంటున్నాడు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు, మేము పార్టీ మారామని చెప్పే దమ్ము లేదు' అని మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. 'ఎన్నికల సమయంలో మల్లికార్జున్ ఖర్గే చేవెళ్లలో దళితులకు అనేక హామీలు ఇచ్చాడు. ప్రతి దళిత కుటుంబానికి రూ.12 లక్షలు కాదు కదా 12 పైసలు ఇవ్వలేదు. వృద్ధులకు పింఛన్లు పెంచుతామని చెప్పి మోసం చేశారు' అని కేటీఆర్ గుర్తుచేశారు.
Also Read: Pamda Awards 2026: పద్మవిభూషణ్, పద్మభూషణ్ అవార్డులు ఎవరెవరికి ఇచ్చారంటే..?
'మోసగాడి చేతిలో తెలంగాణ బందీ అయిందని. సబితా ఇంద్రారెడ్డి రోజు బాధ పడుతున్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు అందరినీ కడుపులో పెట్టుకొని చూసేవాడు. నాట్లు వేసే సమయంలో టింగ్ టింగ్ మని రైతుల అకౌంట్లో రైతు బంధు పడేది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల పై నిలదీస్తుంటే మా పై కేసులు, బూతులు. బూతులు మాకు వచ్చు కానీ మాకు సంస్కారం అడ్డొస్తుంది' అని రేవంత్ రెడ్డి తీరుపై మాజీ మంత్రి కేటీఆర్ అసహనం వ్యక్తం చేశారు. ఆడ బిడ్డలు, ప్రజలు బాగుపడాలంటే మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని ప్రకటించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Padma Awards 2026 Benefits: గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించే పద్మ పురస్కారాలు దేశంలో అత్యంత గౌరవప్రదమైనవి. భారతరత్న తర్వాత అంతటి ప్రాధాన్యత కలిగిన ఈ అవార్డుల వెనుక ఉన్న పవర్ ఏంటి? గ్రహీతలకు ప్రభుత్వం కల్పించే మర్యాదలు ఏమిటో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం. 1954లో ప్రారంభమైన ఈ పురస్కారాలు, వివిధ రంగాల్లో నిరుపమాన సేవలు అందించిన వ్యక్తులకు దేశం ఇచ్చే అత్యున్నత గుర్తింపు ఈ పురస్కారాలు.
మూడు విభాగాలు - మూడు మెట్లు
పద్మ అవార్డులను ప్రభుత్వం మూడు కేటగిరీలుగా విభజించింది:
పద్మ విభూషణ్: దేశంలో రెండవ అత్యున్నత పౌర పురస్కారం. అసాధారణ, విశిష్ట సేవలకు దీనిని ఇస్తారు.
పద్మ భూషణ్: మూడవ అత్యున్నత పురస్కారం. ఉన్నత స్థాయి విశిష్ట సేవలకు గుర్తింపు.
పద్మశ్రీ: నాల్గవ అత్యున్నత పురస్కారం. ఏ రంగంలోనైనా ప్రతిభ చాటిన వారికి, ముఖ్యంగా సామాన్యులకు ఇచ్చే గౌరవం.
ఎంపిక ప్రక్రియ
గతంలో ప్రభుత్వమే పేర్లను సూచించేది, కానీ ఇప్పుడు ప్రక్రియ పూర్తిగా మారింది. సామాన్య ప్రజలు కూడా తమకు తెలిసిన అర్హులను నామినేట్ చేయవచ్చు. చివరికి ఎవరికి వారు 'సెల్ఫ్ నామినేషన్' చేసుకునే అవకాశం కూడా ఉంది. ప్రతి ఏటా ప్రధానమంత్రి ఏర్పాటు చేసే ఈ కమిటీ, వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి రాష్ట్రపతి ఆమోదానికి పంపిస్తుంది.
చాలామంది ఈ అవార్డుతో పాటు డబ్బు వస్తుందని అనుకుంటారు. కానీ, పద్మ అవార్డులతో ఎటువంటి నగదు బహుమతి లేదా నెలవారీ భత్యాలు ఉండవు. వీరికి లభించే మర్యాదలు ఇవే.
సనద్ & మెడల్: రాష్ట్రపతి సంతకంతో కూడిన ప్రశంసా పత్రం (సనద్), ఒక పతకం ఇస్తారు.
ప్రభుత్వ అతిథులు: వీరు ఇతర రాష్ట్రాలకు వెళ్లినప్పుడు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వీరిని 'స్టేట్ గెస్ట్స్'గా పరిగణించి వసతి, రక్షణ కల్పిస్తాయి.
రైల్వే పాస్లు: నిబంధనల మేరకు భారతీయ రైల్వేలో ఉచిత ప్రయాణ సౌకర్యం లభిస్తుంది.
ముఖ్య వేడుకలు: గణతంత్ర, స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు ప్రత్యేక ఆహ్వానాలు అందుతాయి.
ముఖ్యమైన నిబంధన..
పద్మ అవార్డు అనేది ఒక గుర్తింపు మాత్రమే, అది బిరుదు (Title) కాదు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 18(1) ప్రకారం.. గ్రహీతలు తమ పేరుకు ముందు లేదా వెనుక (ఉదాహరణకు: పద్మశ్రీ రాము) అని వాడుకోకూడదు.
విజిటింగ్ కార్డులు లేదా లెటర్ హెడ్లపై దీనిని ముద్రించుకోవడం నిబంధనలకు విరుద్ధం. దుర్వినియోగం చేస్తే అవార్డును వెనక్కి తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది.
'అన్సంగ్ హీరోస్'కు అరుదైన గౌరవం
ప్రస్తుతం ఈ అవార్డుల విధానంలో గొప్ప మార్పు వచ్చింది. ఎక్కడో మారుమూల గ్రామాల్లో ఉండి నిస్వార్థంగా సేవ చేస్తున్న 'అన్సంగ్ హీరోస్' (గుర్తింపు లేని వీరులు) ను వెతికి పట్టుకుని ప్రభుత్వం గౌరవిస్తోంది. ఇది కేవలం ఒక పతకం కాదు, భారత గడ్డపై ఆ వ్యక్తి ముద్రించిన అంకితభావానికి నిదర్శనం.
Also Read: Redmi 14C 5G Offer: రెడ్మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్ఫోన్..అదిరిపోయే ఆఫర్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook