గుండా మల్లేష్ పేరు మార్కెట్ కు పెట్టుకుంటే ఆమరణ నిరాహార దీక్ష
Bellampalle, Kannal Rural, Telangana:మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణ నూతన కూరగాయల మార్కెట్ భవనానికి మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేష్ పేరు పెట్టాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ మల్లేష్ పేరు పెట్టని పక్షంలో పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకోలు, ధర్నాలు, కార్యాలయాల ముట్టడి అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తామన్నారు.हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
Peddapalli: రబీ సీజన్లో రికార్డు సృష్టించిన పెద్దపల్లి.. 4.29 లక్షల మెట్రిక్ టన్ల ధాన్యం సేకరణ..
Hyderabad, Telangana:Peddapalli Paddy Procurement: పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా.. రికార్డు స్థాయిలో ధాన్యంతో పాటు మొక్కజొన్న కొనుగోళ్లను పూర్తి చేసిందని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు తెలిపారు.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందనడానికి.. ఈ రికార్డు స్థాయి కొనుగోళ్లే నిదర్శనమన్నారు. జిల్లా కేంద్రంలోని ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
రికార్డు స్థాయిలో సేకరణ..
ఈ రబీ సీజన్లో పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా మొత్తం 334 కొనుగోలు కేంద్రాల ద్వారా రికార్డు స్థాయిలో 4 లక్షల 29 వేల 921 మెట్రిక్ టన్ల వరి ధాన్యాన్ని విజయవంతంగా సేకరించారని ఎమ్మెల్యే తెలిపారు. రైతులకు ఎలాంటి ఆలస్యం లేకుండా.. దళారీల ప్రమేయం లేకుండా దాదాపు 1,018 కోట్ల 65 లక్షల రూపాయలను నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే జమ చేశామని వెల్లడించారు. గత ఏడాదితో పోలిస్తే.. ఈసారి సుమారు 29 వేల మెట్రిక్ టన్ల ధాన్యం అదనంగా సేకరించామని తెలిపారు.. దీనికి తోడు మార్కెట్ యార్డుల ద్వారా మరో 25 వేల మెట్రిక్ టన్ల మొక్కజొన్నను కూడా కొనుగోలు చేసి రైతులకు అండగా నిలిచామన్నారు. ఇటీవలే కురిసిన అకాల వర్షాల వల్ల ధాన్యం తడిసినా.. రంగు మారినా ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకుని.. చివరి గింజ వరకు కొనుగోలు చేసిందని ఆయన వెల్లడించారు..
రైతుల నిల్వ అవసరాల కోసం.. పెద్దపల్లి నియోజకవర్గంలో 1.70 లక్షల మెట్రిక్ టన్ల సామర్థ్యం గల గోదాముల నిర్మించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికలు సిద్ధం చేశామని విజయరమణారావు తెలిపారు. ఇందులో భాగంగా ఎలిగేడు మండలం లాలపల్లిలో 20 వేల మెట్రిక్ టన్ల గోదాము పనులు ఇప్పటికే మొదలయ్యాయని... రాబోయే రోజుల్లో ఓదెల, శ్రీరాంపూర్, పెద్దపల్లి మండలాల్లో టెండర్లు పూర్తి చేసి పనులు మొదలుపెట్టబోతున్నట్లు స్పష్టం చేశారు.
Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!
బీఆర్ఎస్, బీజేపీలపై ఆగ్రహం..
ఇదే సమయంలో విపక్షాల తీరుపై ప్రభుత్వ విప్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.. పెద్దపల్లికి కాలేశ్వరం.. నీటి వల్ల పంటలు పండలేదని.. నెహ్రూ, ఇందిరా గాంధీల కాలం నాటి ఎస్ఆర్ఎస్పీ (SRSP) కెనాల్ నీటి వల్లే ఇక్కడి రైతులకు సాగునీరు అందిందని వివరించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల నిర్మాణంలో తీవ్ర లోపాలతో కట్టి.. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందని... అందుకే ఆ బ్యారేజీలు కుంగిపోయాయని ఆరోపించారు. ప్రాజెక్టులపై అవగాహనతో మాట్లాడాలని.. సలహాలు ఇచ్చేందుకు మాజీ సీఎం కేసీఆర్ను అసెంబ్లీకి రావాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించినా ప్రతిపక్షాలు భయపడి ముందుకు రావడం లేదని ఆయన తీవ్రంగా విమర్శించారు.
Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
Pawan Kalyan Allu Arjun: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్తో అల్లు అర్జున్ సీక్రెట్ మీటింగ్..ఏం జరిగిదంటే?
Hyderabad, Telangana:Pawan Kalyan Allu Arjun Meeting: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కలిశారు. బుధవారం (జూన్ 10) రాత్రి పవన్ కల్యాణ్ నివాసానికి వెళ్లిన బన్నీ, ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నట్లు తెలుస్తోంది.
ఇటీవలే పవన్ కల్యాణ్కు సర్జరీ జరిగిన సంగతి తెలిసిందే. వైద్యుల సూచన మేరకు సర్జరీ తర్వాత రెండు వారాల పాటు ఆయన విశ్రాంతి తీసుకున్న సంగతి తెలిసిందే. అత్యంత ప్రాధాన్యత కలిగిన కార్యక్రమాలకు తప్ప ఆయన బయటకు రావడం లేదు. పవన్ కల్యాణ్ క్రమంగా కోలుకుంటున్న నేపథ్యంలో, పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనను పరామర్శిస్తున్నారు. ఇందులో భాగంగానే అల్లు అర్జున్ స్వయంగా పవన్ ఇంటికి వెళ్లి, ఆయన హెల్త్ కండిషన్తో పాటు కుటుంబ విషయాలను కూడా ఆప్యాయంగా అడిగి తెలుసుకున్నారు.
ఫ్యాన్ వార్స్కు చెక్ పడినట్లేనా?
గత కొంతకాలంగా సోషల్ మీడియాలో 'మెగా వర్సెస్ అల్లు' అభిమానుల మధ్య తీవ్రమైన వార్ నడుస్తోంది. రెండు కుటుంబాల మధ్య విభేదాలు ఉన్నాయంటూ నెట్టింట ప్రచారం జరుగుతున్న తరుణంలో, అల్లు అర్జున్ తాజా భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఇరు కుటుంబాల మధ్య ఎలాంటి కోల్డ్ వార్ లేదని, ఇవన్నీ కేవలం పుకార్లేనని సన్నిహితులు స్పష్టం చేస్తున్నారు.
మెగా, అల్లు హీరోలు ఇప్పటికీ ఎంతో సన్నిహితంగా ఉంటున్నారు. ఒకరి సినిమాలను మరొకరు సోషల్ మీడియా ద్వారా సపోర్ట్ చేసుకుంటున్నారు. అల్లు అర్జున్ స్వయంగా పవన్ను కలవడంతో.. ఇప్పటికైనా ఈ సోషల్ మీడియా ఫ్యాన్ వార్స్కు ఎండ్ కార్డ్ పడుతుందని పరిశ్రమ వర్గాలు ఆశిస్తున్నాయి.
ప్రస్తుతం ఈ ఇద్దరు స్టార్స్ తమ తమ రంగాల్లో బిజీగా గడుపుతున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. హీరోగా తన సినిమాలకు తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చి.. పూర్తిస్థాయిలో రాష్ట్ర పరిపాలనపై దృష్టి పెట్టారు. మరోవైపు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. అట్లీ కుమార్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న భారీ బడ్జెట్ (సుమారు రూ. 800 కోట్లు) చిత్రం 'రాకా' షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఇందులో దీపికా పదుకొణె హీరోయిన్గా నటిస్తోంది. దీనితో పాటు లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేయనున్నారు.
Also Read: మెగాస్టార్ సినిమాలో కన్నడ బ్యూటీకి ఛాన్స్..బాలయ్య హీరోయిన్ను పక్కకి నెట్టిన బ్యూటీ!
Also Read: బిగ్బాస్ సీజన్ 10 ప్రోమో వచ్చేసింది! ఈసారి 'దశావతారమే' అంటూ నాగ్ వీడియో రిలీజ్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Venomous Snake Video: బాబోయ్.. షూలో ప్రమాదకరమైన కాలనాగు.. వీడియో ఇదే..
Hyderabad, Telangana:Venomous Snake Video Watch Now: ప్రకృతిలో జీవించే వన్యప్రాణులు, ముఖ్యంగా పాములు మన నివాస ప్రాంతాల్లోకి సంచారం చేసినప్పుడు ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయో.. ఊహించుకుంటేనే కొంత భయం కలుగుతుంది. ప్రస్తుతం సోషల్ మీడియా వినియోగదారులను ఆశ్చర్యానికి గురిచేసే ఒక అత్యంత అరుదైన వీడియో వైరల్ అవుతోంది. మనం నిత్యం ధరించే బూట్లలో పాములు దూరి కూర్చుంటే ఎలా ఉంటుందో కళ్లకు కట్టినట్లు చూపిస్తోంది.. ఈ వీడియో.. ఒక నల్లటి షూలో నక్కి ఉన్న అత్యంత ప్రమాదకరమైన పాము.. నెమ్మదిగా బయటకు వచ్చి.. పడగవిప్పిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. అయితే, ఈ షాకింగ్కి ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఇంటర్నెట్లో రోజుకు లక్షలాది వీడియోలు అప్లోడ్ అవుతూ ఉంటాయి.. వాటిలో కొన్ని మాత్రమే నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తాయి. తాజాగా వైరల్ అవుతున్న ఈ వీడియో కేవలం ఆకర్షించడమే కాదు.. చూసే ప్రతి ఒక్కరి గుండెల్లో రైళ్లు పరిగెత్తించేలా చేస్తోంది.. ఈ వీడియోలో ఒక నల్లటి షూ కనిపిస్తుంది. మొదటి చూపులో అందులో ఏముందో ఎవరికీ అర్థం కాదు.. కానీ, కొద్ది సెకన్ల వ్యవధిలోనే ఆ షూ లోపలి భాగం నుంచి ఒక నల్లటి ఆకారం కదలడం మొదలవుతుంది. దీనిని క్లియర్గా గమనిస్తే.. అది ఒక అత్యంత విషపూరితమైన పాము అని స్పష్టమవుతుంది. షూ లోపల చాలా హాయిగా.. ఎవరికీ కనిపించకుండా చుట్టలు చుట్టుకుని కూర్చున్న ఆ పాము, బయట జరుగుతున్న కదలికలను గమనించి నెమ్మదిగా తన తలను పైకి లేపింది.
షూ నుంచి బయటకు వచ్చి..
అయితే, షూ లోపల ఉన్న పాము కేవలం తల అటుఇటు కదిలించడమే కాకుండా.. నెమ్మదిగా తన శరీరాన్ని బయటకు లాగడం ప్రారంభించింది. సగం శరీరాన్ని పైకి లేపి.. తన పడగను విప్పి భీకరంగా బుసలు కొట్టడం మొదలు పెట్టింది.. ఆ సమయంలో అక్కడ ఉన్నవారు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. లేదా ఆ షూలో కాలు పెట్టేందుకు ప్రయత్నించి ఉన్నా.. తప్పకుండా కాటేసి ఉండేది.. అయితే, పాము పడగవిప్పి కెమెరా వైపు చూస్తున్న దృశ్యం నెటిజన్ల మైండ్ బ్లాక్ చేస్తోంది.
Also Read: Video Viral: సాయం ముసుగులో అరాచకం.. యువతి ప్రైవేటు పార్ట్ మీద చెయ్యి వేసి మరీ.!. వీడియోపై దుమారం..
ఊహించని స్థాయిలో వైరల్..
ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ రీల్కు ఇన్స్టాగ్రామ్, ఎక్స్, ఫేస్బుక్లలో ఊహించని స్పందన లభిస్తోంది. ఈ వీడియో చూసిన చాలా మంది ఇకపై నేను షూస్ వేసుకునే ముందు వందసార్లు చెక్ చేసుకుంటాను బాబోయ్.. అని ఒక నెటిజన్ కామెంట్ చేశారు. ఇది కేవలం వీడియో కాదు.. మన ప్రాణాలను కాపాడుకోవడానికి ఒక హెచ్చరిక.. అని మరొకరు కామెంట్లు చేస్తున్నారు. ఇలా చాలా మంది సోషల్ మీడియా వినియోగదారలు కామెంట్స్ చేస్తూ వస్తున్నారు.
Also Read: Video Viral: సాయం ముసుగులో అరాచకం.. యువతి ప్రైవేటు పార్ట్ మీద చెయ్యి వేసి మరీ.!. వీడియోపై దుమారం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్.. - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..Twitter, Facebook
Indian Sailors Died: భారత నౌకపై అమెరికా సైన్యం దాడి..ముగ్గురు భారతీయులు దుర్మరణం..ఏం జరుగుతోంది?
Dibab, Muscat Governorate:Indian Sailors Died In Oman: ఒమన్ తీరంలోని భారత నౌకపై అమెరికా దాడి చేసింది. ఈ దాడిపో ముగ్గురు భారతీయ నావికులు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఇరాన్ చమురుపై కొనసాగుతున్న దిగ్బంధనాన్ని ఉల్లంఘించిందనే ఆరోపణలతో, ఒమన్ తీరంలో పలావు జెండా కలిగిన చమురు ట్యాంకర్పై అమెరికా సెంట్రల్ కమాండ్ అత్యంత కచ్చితమైన ఆయుధాలతో దాడి చేయడంతో ఈ ప్రాణనష్టం జరిగింది.
ఈ వారం ప్రారంభంలో ఒమన్ తీరంలో అమెరికా దళాలు ఒక నౌకపై దాడి చేయడంతో, మొదట గల్లంతైనట్లుగా భావించిన ముగ్గురు భారతీయ నావికులు మరణించారని షిప్పింగ్ మంత్రి సర్బానంద సోనోవాల్ తెలిపారు. దీనిని ఒక "విషాదకరమైన" నష్టంగా అభివర్ణిస్తూ, గల్లంతైన ముగ్గురు నావికుల మృతదేహాలను వెలికితీసినట్లు మంత్రి చెప్పారు.
ఒమన్ గల్ఫ్లో అమెరికా సైన్యం దాడికి గురైనప్పుడు, పలావు జెండా కలిగిన 'సెట్టెబెల్లో' అనే చమురు ట్యాంకర్లో 24 మంది భారతీయులు, నలుగురు విదేశీయులతో సహా మొత్తం 28 మంది సిబ్బంది ఉన్నారు. వీరిలో ఇద్దరు పాకిస్థానీలు, ఒక ఉక్రేనియన్, ఒక రష్యన్ ఉన్నారు. తమ ఆదేశాలను పాటించడంలో విఫలమైందని, ఇరాన్ నుండి చమురును తీసుకువస్తోందని ఆరోపిస్తూ ఆ నౌకపై దాడి చేసినట్లు అమెరికా సైన్యం తెలిపింది.
ఓడ నుంచి 21 మంది భారతీయ నావికులను రక్షించినప్పటికీ.. డెక్ క్యాడెట్ ఆదిత్య శర్మ, ఇంజన్ ఫిట్టర్ శివానంద్ చౌరాసియా, చీఫ్ ఇంజనీర్ పట్నాల సురేష్ అనే ముగ్గురు నావికులు గల్లంతయ్యారని తొలుత వార్తలు వచ్చాయి.
"ఇది మన సముద్రయాన కుటుంబానికి తీరని లోటు. ఈ కష్ట సమయంలో మోదీ ప్రభుత్వం మృతుల కుటుంబాలకు అండగా నిలుస్తుంది. వారి కుటుంబ సభ్యులకు మద్దతు ఇవ్వడానికి పూర్తిగా కట్టుబడి ఉంది. దాడి నుంచి బయటపడిన సిబ్బందితో పాటు మృతదేహాలను వెంటనే స్వదేశానికి రప్పించాలని.. మృతుల పార్థివ దేహాలను అంత్యక్రియల కోసం త్వరతగతిన తీసుకురావాలని అధికారులను ఆదేశించాను" అని షిప్పింగ్ మంత్రి సరస్బానంద సోనోవాల్ తెలిపారు.
దాడిపై భారత్ ఖండన..
నౌకలోని మిగిలిన నావికులతో స్థిరమైన నెట్వర్క్ కనెక్షన్ను ఏర్పాటు చేయడంలో నౌక యాజమాన్య సంస్థ ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇరాన్ చమురుపై కొనసాగుతున్న దిగ్బంధనాన్ని ఉల్లంఘించిందనే ఆరోపణలతో, ఒమన్ తీరంలో ఒక చమురు ట్యాంకర్పై అమెరికా సెంట్రల్ కమాండ్ దళాలు అత్యంత కచ్చితమైన క్షిపణులతో దాడి చేయడంతో ఈ ప్రాణనష్టం జరిగింది. హోర్ముజ్ను దాటేందుకు ఆ నౌక ప్రయత్నించగా, అమెరికా నౌకాదళం జరిపిన దాడిలో 24 మంది భారతీయులు మరణించారని భారత్ ఈ ఘటనను ఖండించింది.
భారత్ నిరసన..
ఈ దాడిపై "తీవ్ర నిరసన" తెలియజేయడానికి భారత్, న్యూఢిల్లీలోని వాషింగ్టన్ రాయబార కార్యాలయ అధికారుల్ని పిలిపించిందని ఒక సీనియర్ భారత ప్రభుత్వ అధికారి ఏఎఫ్పీ వార్తా సంస్థకు తెలిపారు. ప్రపంచ ఇంధన సరఫరాలకు కీలకమైన జలమార్గమైన గల్ఫ్లోని హోర్ముజ్ జలసంధి, ఫిబ్రవరి చివరిలో ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ దాడులతో ప్రారంభమైన మధ్యప్రాచ్య యుద్ధం మొదలైనప్పటి నుండి దాదాపు పూర్తిగా దిగ్బంధించారు.
ఇటీవలి వారాలుగా అమల్లో ఉన్న కాల్పుల విరమణ సమయంలో జరిగిన చర్చలు, ఈ జలసంధిని తిరిగి తెరిచే ఒప్పందాన్ని కుదర్చడంలో విఫలమయ్యాయి. యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి ఇరాన్ ఈ నౌకా రవాణా మార్గాన్ని దిగ్బంధించగా, ఏప్రిల్ నుండి అమెరికా కూడా దానికి పోటీగా తనదైన దిగ్బంధనాన్ని అమలు చేస్తోంది.
Also Read: మొసలి కడుపులో బంగారపు ఉంగరాలు, 6 జతల
ALso Read: మరికొద్ది రోజుల్లో ప్రపంచంలో ప్రళయం..ఒడ్డుకు చేరిన 'దేవుని
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Python Kiss Video: పాము ముక్కును కరిచేస్తే ఎలా ఉంటుందో ఈ వీడియో చూడండి!
Hyderabad, Telangana:Python Kiss Gone Wrong Viral Video Watch Now: నేటి డిజిటల్ యుగంలో లైకులతో పాటు వ్యూస్ కోసం యువత ఎలాంటి సాహసాలకైనా వెనక అడుగు వేయడం లేదు.. కొంతమంది కొన్ని సందర్భాల్లో పిచ్చి చేష్టలు చేస్తూ.. ప్రాణాల మీదకు తెస్తున్నాయి. తాజాగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న ఒక వీడియో నెటిజన్లను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. ఒక యువతి అత్యంత ప్రమాదకరమైన పాముతో పరాచకాలు ఆడబోయి.. తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. అయితే, దీనికి సంబంధించిన అన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
అసలేం జరిగిందంటే..?
వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. ఒక యువతి చేతిలో అత్యంత పొడవైన ప్రమాదకరమైన పామును పట్టుకుని కనిపిస్తుంది. సాధారణంగా పాములను చూస్తేనే ఆమడదూరం పరుగెత్తే.. ఈ రోజుల్లో.. ఆమె మాత్రం దాన్ని చాలా సాధారణంగా చేతితో పట్టుకుని ఉండడం మీరు చూడొచ్చు. అంతటితో ఆగకుండా.. కెమెరా వైపు చూస్తూ.. ఆ పాముకు ముద్దు పెట్టేందుకు ప్రయత్నించింది. ఆమె తన ముఖాన్ని పాము నోటి దగ్గరకు తీసుకుని రావడంతో.. ఆ మరుక్షణమే ఊహించని ప్రమాదం జరిగింది.
యువతి ప్రవర్తనతో తీవ్ర ఆగ్రహానికి గురైన ఆ పాము.. క్షణాల వ్యవధిలో మెరుపు వేగంతో ఆమె ముఖంపై దాడి చేసింది.. నేరుగా ఆమె ముక్కు భాగాన్ని నోటితో గట్టిగా కరిచేసింది.. ఊహించని ఈ దాడితో సదరు యువతి త్రీవ భయాందోళనకు గురైనట్లు తెలుస్తోంది. నొప్పితో విలవిలలాడుతూ.. ఆ పామును అక్కడే విసిరేసి.. ముక్కు పట్టుకుని అక్కడి నుంచి పరుగులు తీయడం మీరు క్లియర్గా వీడియోలో చూడొచ్చు.
Also Read: Video Viral: సాయం ముసుగులో అరాచకం.. యువతి ప్రైవేటు పార్ట్ మీద చెయ్యి వేసి మరీ.!. వీడియోపై దుమారం..
నెటిజన్ల ఆగ్రహం..
ఈ వీడియోను సోషల్ మీడియా ప్లాట్ఫారమ్స్లో అప్లోడ్ అయిన కొద్ధిరోజులకే లక్షలాది వ్యూస్తో పాటు వేలాది కామెంట్లతో విపరీతంగా వైరల్ అవుతోంది. దీనిపై సోషల్ మీడియా వినియోగదారులు రకరకాలుగా స్పందిస్తూ వస్తున్నారు. ఇది కేవలం పిచ్చితనమే.. ప్రమాదకరమైన పాములతో ఇలాంటి ఆటలు అస్సలు ఆడొద్దని.. కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు కామెంట్స్ చేస్తూ వస్తున్నాయి. అలాగే లైకుల కోసం ప్రాణాలను పణంగా పెట్టకండి.. అని మరికొందరు హెచ్చరిస్తున్నారు. అదృష్టవశాత్తూ ఆ పాము విషపూరితమైనది కాకపోవడం వల్లే ఆమె బతికిపోయి ఉంటుందని.. లేకపోతే.. ప్రాణాలు పోయేవని నిపుణులు చెబుతున్నారు. అయితే, ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలిదు కానీ.. ఇప్పుడు సోషల్ మీడియాలో మాత్రం వైరల్గా మారింది.
Also Read: Video Viral: సాయం ముసుగులో అరాచకం.. యువతి ప్రైవేటు పార్ట్ మీద చెయ్యి వేసి మరీ.!. వీడియోపై దుమారం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్.. - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..
Honor X80 Pro Max: మొబైల్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ సంచలనం.. 11,000mAh బ్యాటరీతో Honor X80 Pro Max లాంచ్?
Hyderabad, Telangana:Honor X80 Pro Max with 11,000mAh Battery: ప్రస్తుతం వస్తున్న అన్ని బ్రాండ్లకు సంబంధించిన స్మార్ట్ఫోన్స్లో బ్యాటరీ లైఫ్ అనేది ఒక పెద్ద సవాలుగా మారింది. రోజుకు రెండుసార్లు ఛార్జింగ్ పెట్టుకునే రోజులకు చెక్ పెడుతూ.. ప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీ కంపెనీ Honor సరికొత్త సంచలనానికి తెరలేపబోతున్నట్లు తెలుస్తోంది. చైనాకు చెందిన ప్రముఖ టిప్స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ లీక్ చేసిన సమాచారం ప్రకారం.. హానర్ సంస్థ తన పాపులర్ ఎక్స్-సిరీస్లో అత్యంత పవర్ఫుల్ మోడల్ Honor X80 Pro Maxను మార్కెట్లోకి విడుదల చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇందులో కంపెనీ ఏకంగా 11,000mAh సామర్థ్యం గల భారీ బ్యాటరీని అందించబోతున్నట్లు తెలుస్తోంది.
ఒకసారి ఛార్జ్ చేస్తే మూడు రోజులు ఫిక్స్..
ప్రస్తుతం మార్కెట్లో ఉన్న రెడ్మీతో పాటు షియోమి, హువావే వంటి దిగ్గజ బ్రాండ్ల స్మార్ట్ఫోన్లలో గరిష్టంగా 5,000mAh నుంచి 6,000mAh బ్యాటరీలతో మాత్రమే విడుదల చేశాయి. కానీ హానర్ X80 ప్రో మాక్స్ వీటన్నింటికీ రెట్టింపు పవర్తో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే లీక్ అయిన వివరాల ప్రకారం, ఈ స్మార్ట్ఫోన్ను సాధారణగా వినియోగిస్తే దాదాపు 4 నుంచి 5 రోజుల పాటు నాన్స్టాప్గా పనిచేస్తుంది. అలాగే ఇంత పెద్ద బ్యాటరీని సులభంగా ఛార్జ్ చేసేందుకు ఎంతో అద్భుతమైన 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ను కూడా అందిస్తోంది. ఈ అద్భుతమైన బ్యాటరీ కేవలం గంటన్నర లోపే ఫుల్ ఛార్జ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు లీక్ అయిన వివరాలు చెబుతున్నాయి..
అద్భుతమైన డిస్ప్లే..
కేవలం బ్యాటరీ మాత్రమే కాకుండా... ఈ స్మార్ట్ఫోన్ డిస్ల్పే కూడా నెక్స్ట్ లెవెల్లో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో కంపెనీ హానర్ X80 ప్రో మాక్స్ స్మార్ట్ఫోన్ 6.8 ఇంచుల ఫ్లాట్ అమోలెడ్ (AMOLED) డిస్ప్లేను అందించబోతున్నట్లు తెలుస్తోంది. ఇది అద్భుతమైన ఇది 2788×1280 పిక్సెల్స్ (1.5K) రిజల్యూషన్తో పాటు 120Hz రీఫ్రెష్ రేట్ను కలిగి ఉంటుందని లీక్ అయిన వివరాలు క్లియర్గా చెబుతున్నాయి. ఇది చాలా తక్కువ బెజెల్స్ (Narrow Bezels)తో పాటు గుండ్రటి మూలలతో (Rounded Corners) ఈ ఫోన్ ప్రీమియం ల్యాండ్స్కేప్ లుక్ను కలిగి ఉండబోతున్నట్లు లీక్ అయిన ఫోటోలు చెబుతున్నాయి.
పవర్ఫుల్ ప్రాసెసర్..
ఈ మొబైల్ పర్ఫార్మెన్స్ వేగంగా ఉండేందుకు కంపెనీ ఇందులో ఎంతో శక్తివంతమైన క్వాల్కమ్ సంస్థకు చెందిన సరికొత్త స్నాప్డ్రాగన్ 6 జెన్ 5 (Snapdragon 6 Gen 5) ప్రాసెసర్ను వినియోగించిన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇది 4nm ఆర్కిటెక్చర్పై పని చేస్తుంది. కాబట్టి గేమింగ్కు, మల్టీటాస్కింగ్కు అద్భుతంగా సూట్ అవుతుందని టెక్ నిపుణులు చెబుతున్నారు. అలాగే వాటర్ రెసిస్టెన్స్, కింద పడినా పగలకుండా ఉండేందుకు ఇందులో కంపెనీ.. కంపెనీ డ్రాప్-రెసిస్టెంట్ సపోర్ట్ కూడా అందుబాటులో ఉంది. ఇందులో చాలా అద్బుతమైన ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ ఫీచర్ కూడా ఉంది.
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
మార్కెట్లోకి విడుదల అప్పుడే?
ఈ హానర్కు సంబంధించిన బేస్ వేరియంట్ హానర్ X80 స్మార్ట్ఫోన్ 10,000mAh బ్యాటరీతో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా దీనిని కంపెనీ జూన్ చివరి వారంలో లాంచ్ చేసే అవకాశం ఉందని లీక్ అయిన వివరాలు తెలుపుతున్నాయి. ఈ మొబైల్ సిరీస్కి సంబంధించిన ప్రో మాక్స్ మోడల్ ప్రస్తుతం డెవలప్మెంట్ స్టేజ్లో ఉందని.. దీనిని త్వరలోనే కంపెనీ గ్లోబల్ మార్కెట్లోకి విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్ఫోన్ మార్కెట్లోకి లాంచ్ అయితే, మొబైల్ మార్కెట్లో సరికొత్త రికార్డులను సృష్టించే అవకాశాలు ఉన్నాయి.
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Hyderabad Real Estate: కుత్బుల్లాపూర్, మేడ్చల్, శామీర్పేటలో ఇళ్ల స్థలాల రేట్లకు రెక్కలు.. ఇన్వెస్టర్లకు కోట్లు కురిపిస్తున్న భూములు..!!
Secunderabad, Telangana:Hyderabad Real Estate: హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ రంగం మూడు పువ్వులు ఆరు కాయలుగా విలసిల్లుతోంది. గతంలో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ చుట్టూ తిరిగినటువంటి రియల్ ఎస్టేట్ మార్కెట్ ఇప్పుడు క్రమంగా హైదరాబాద్లోని తూర్పు ప్రాంతాల్లో కూడా విస్తరించి ఇన్వెస్టర్లకు బంగారం లాంటి లాభాలను అందిస్తోంది. హైదరాబాద్ నగరానికి తూర్పు ప్రాంతంలో ఉన్నటువంటి మేడ్చల్ రంగారెడ్డి జిల్లా ప్రాంతం ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగానికి ఒక బెస్ట్ డెస్టినేషన్ గా మారింది అని చెప్పవచ్చు. హైదరాబాద్ నగరానికి పడమర వైపు ఉన్నటువంటి కోకాపేట గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి ప్రాంతాలు ఇప్పటికే దాదాపు పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందిన నేపథ్యంలో, ఇప్పుడు విస్తరణ మొత్తం కూడా హైదరాబాద్ నగరానికి తూర్పు వైపు ఉన్నటువంటి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కేంద్రంగా అభివృద్ధి జరుగుతుంది అని చెప్పవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాను అభివృద్ధి చేసేందుకు అనేక పారిశ్రామిక క్లస్టర్లను ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయడంతో పాటు భవిష్యత్తులో రాబోతున్న రీజినల్ రింగ్ రోడ్డు, రీజినల్ రింగ్ రైలు ప్రాజెక్టుల ద్వారా ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తోంది.
తాజాగా రాష్ట్ర ప్రభుత్వం భూముల ధరలను పెంచుతూ తీసుకున్న నిర్ణయం ద్వారా మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో భూముల ధరలు అమాంతం పెరిగాయి. ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్) కనెక్టివిటీ, వేగంగా అభివృద్ధి చెందుతున్న మౌలిక సదుపాయాల కారణంగా ఈ ప్రాంతం రియల్ ఎస్టేట్ పెట్టుబడిదారులకు ఒక చక్కటి డెస్టినేషన్ గా మారింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం భూముల మార్కెట్ విలువలను భారీగా సవరించి అమల్లోకి తీసుకురావడంతో రిజిస్ట్రేషన్ ఖర్చులు గణనీయంగా పెరుగుతున్నాయి.
క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవ ధరలకు ప్రభుత్వ మార్కెట్ విలువలను దగ్గర చేయాలనే ఉద్దేశంతో రిజిస్ట్రేషన్ శాఖ 25%, 50%, 75%, 100% శ్లాబుల ప్రకారం కొత్త ధరలను నిర్ణయించింది. రిజిస్ట్రేషన్ ఫీజుల శాతంలో మార్పులు లేకపోయినా, భూముల విలువలు పెరగడంతో, కస్టమర్లు చెల్లించాల్సిన మొత్తం భారీగా పెరగనుంది.
కుత్బుల్లాపూర్, మేడ్చల్, శామీర్పేటలో భారీ పెంపు
మేడ్చల్ జిల్లాలో అత్యధిక డిమాండ్ ఉన్న కుత్బుల్లాపూర్, మేడ్చల్, శామీర్పేట సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో భూముల ధరలు అత్యధికంగా పెరిగాయి. కుత్బుల్లాపూర్ పరిధిలోని చింతల్, గాజులరామారం, సూరారం, కొంపల్లి ప్రాంతాల్లో మార్కెట్ విలువలు 50 శాతం నుంచి 100 శాతం వరకు పెరిగాయి. కొంపల్లి పరిసరాల్లో చదరపు గజం విలువ రూ.20,000 నుంచి రూ.25,000 వరకు చేరగా, చింతల్, గాజులరామారం ప్రాంతాల్లో రూ.15,000 నుంచి రూ.18,000 వరకు నమోదైంది.
మేడ్చల్ ఎస్ఆర్వో పరిధిలోని మేడ్చల్ టౌన్, అత్వెల్లి, గుండ్లపోచంపల్లి ప్రాంతాల్లో 75 శాతం నుంచి 100 శాతం వరకు పెంపు జరిగింది. జాతీయ రహదారి-44, ఓఆర్ఆర్ వెంబడి ఉన్న కమర్షియల్ స్థలాల ధరలు దాదాపు రెట్టింపు కాగా, ప్లాట్ల ధరలు చదరపు గజానికి రూ.18,000 నుంచి రూ.22,000కు పైగా నిర్ణయించారు.
శామీర్పేటలో రియల్ మార్కెట్ జోరు
ఓఆర్ఆర్ కనెక్టివిటీ, కొత్త విల్లా ప్రాజెక్టుల ప్రభావంతో శామీర్పేట, తూంకుంట, అలియాబాద్ ప్రాంతాల్లో వ్యవసాయ, నివాస భూముల విలువలు 75 శాతం నుంచి 100 శాతం వరకు పెరిగాయి. హెచ్ఎండీఏ పరిధిలోని వ్యవసాయ భూముల కనీస విలువను ఎకరాకు రూ.10 లక్షలుగా ప్రభుత్వం ఖరారు చేసింది. అభివృద్ధి, డిమాండ్ను దృష్టిలో ఉంచుకుంటే మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా రాష్ట్రంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న రియల్ ఎస్టేట్ హబ్గా కొనసాగుతుందని నిపుణులు చెబుతున్నారు.
Also Read: ఉద్యోగులకు అలర్ట్.. మీ అకౌంట్లో PF Interest ఇంకా పడలేదా? అసలు కారణం ఇదే..!!
Also Read: LPG Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. మళ్లీ పెరిగిన వంటగ్యాస్
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. దయచేసి దీన్ని పెట్టుబడి, ఆర్థిక లేదా వ్యాపార సలహాగా భావించవద్దు. గుర్తుంచుకోండి స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టోకరెన్సీలు, రియల్ ఎస్టేట్, విలువైన లోహాలు వంటి అన్ని రకాల పెట్టుబడులు మార్కెట్ ఆటు పోటులు రిస్కులకు లోబడి ఉంటాయి. దీని అర్థం, మీరు లాభపడవచ్చు లేదా నష్టపోవచ్చు. మీరు తీసుకునే ఎలాంటి పెట్టుబడి నిర్ణయాలు లేదా వ్యాపార కార్యకలాపాల వల్ల కలిగే నష్టాలు లేదా లాభాలకు మా సంస్థ జీ తెలుగు వెబ్ పోర్టల్ ఎట్టి పరిస్థితుల్లోనూ బాధ్యత వహించదు. ఏదైనా ఆర్థిక నిర్ణయం తీసుకునే ముందు, తప్పకుండా ఒక రిజిస్టర్డ్ లేదా సర్టిఫైడ్ ఆర్థిక నిపుణుడిని సంప్రదించి, వారి సలహా తీసుకోమని పాఠకులకు సిఫార్సు చేస్తున్నాము.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Karimnagar: కరీంనగర్ ప్రగతిపై బురదజల్లొద్దు.. విమర్శలు ఆపండి: మంత్రి పొన్నం సీరియస్!
Hyderabad, Telangana:Minister Ponnam Prabhakar Latest News: కరీంనగర్ నగరానికి సంబంధించిన అభివృద్ధిపై ప్రతిపక్షాలు చేస్తున్న రాజకీయ ఆరోపణలు ఎంతమాత్రం తగవని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. నగరానికి సంబంధించిన ప్రగతిపై బురదజల్లే ప్రయత్నాలను ఆపాలని ఆయన అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కరీంనగర్ నగర రూపురేఖలను మార్చే ప్రతిష్టాత్మక మానేరు రివర్ ఫ్రంట్ (MRF) ప్రాజెక్టుపై కీలక వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా నగరానికి సంబంధించిన వివిధ అంశాలపై కూడా చర్చించిన్నట్లు తెలుస్తోంది.
మానేరు రివర్ ఫ్రంట్ రెండో విడుత పనులు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే మంజూరయ్యాయని మంత్రి పొన్నం ప్రభాకర్.. ఈ సందర్భంగా ఆధారాలతో సహా స్పష్టం చేశారు. గత ప్రభుత్వ పాలకులు చేసిన అనాలోచిత నిర్ణయాల వల్ల ప్రాజెక్టులు ఆగిపోయాయని.. వారు గతంలో పెట్టిన పెండింగ్ బకాయిలను కూడా ప్రస్తుత కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వమే చెల్లిస్తూ.. ప్రాజెక్ట్కు సంబంధించిన పనులను ముందుకు తీసుకెళ్తోందని ఆయన వెల్లడించారు. జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకుంటూ.. అనవసర విమర్శలు చేయడం రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనమని ఆయన మండిపడ్డారు.
డంప్ యార్డ్ తరలింపునకు కేంద్రం సహకరించాలి...
కరీంనగర్ ప్రజల ఆరోగ్యంతో పాటు పర్యావరణ పరిరక్షణే తమ ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యతని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. నగర అభివృద్ధికి, ప్రజల ఆరోగ్యానికి పెద్ద సమస్యగా ఉన్న స్థానిక డంప్ యార్డ్ తరిలింపుపై ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ విషయంపై తప్పకుండా కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని.. నిధుల మంజూరుతో పాటు తరలింపు ప్రక్రియకు అవసరమైన చర్యలు తీసుకోవాలని మంత్రి కోరారు.
Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!
కరీంనగర్ సమగ్ర శ్రేయస్సు కోసం రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి రావాలని.. నగర అభివృద్ధిని కాంగ్రెస్ ప్రభుత్వం పరుగులెత్తిస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ ధీమా వ్యక్తం చేశారు. విమర్శలు పక్కన పెట్టి.. కేంద్రం నుంచి రావాల్సిన నిధుల సాధన కోసం స్థానిక ప్రజాప్రతినిధులు కృషి చేయాలని ఆయన సూచించారు. అంతేకాకుండా పార్టీల తేడా లేకుండా ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి కరీంనగర్ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు..
Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
Best Fuel Cards: IndianOil, BPCL, HPC..పెట్రోల్ కొడితే భారీ క్యాష్బ్యాక్.. ఫ్రీగా సినిమా టికెట్లు, ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్.. క్రేజీ కార్డ్ ఇదిగో..!!
Secunderabad, Telangana:Best Fuel Cards: పెరుగుతున్న పెట్రోల్, డీజీల్ ధరల నేపథ్యంలో డబ్బు సేవ్ చేసుకునేందుకు ఫ్యూయల్ క్రెడిట్ కార్డులు బెస్ట్ ఆప్షన్ గా నిలుస్తున్నాయి. ఇండియన్ ఆయిల్, బీపీసీఎల్, హెచ్ పీసీఎల్ వంటి కార్డులతో సహా 7 ప్రధాన ఫ్యూయల్ క్రెడిట్ కార్డులు క్యాష్ బ్యాక్ తోపాటు పలు డిస్కౌంట్స్ అందిస్తున్నాయి. మీరు కూడా ఈ ద్రవ్యోల్బణంతో ఇబ్బంది పడుతుంటే ఫ్యూయల్ క్రెడిట్ కార్డ్స్ మీకు ఎంతో సహాయపడతాయి. చాలా ఫ్యూయల్ కార్డులు రెండు ప్రధాన ప్రయోజనాలను అందిస్తాయి. రివార్డ్ పాయింట్లు లేదా క్యాష్బ్యాక్, 1శాతం ఫ్యూయల్ సర్చార్జ్ మినహాయింపును అందిస్తాయి. అయితే కొన్ని ఫ్యూయల్ కార్డులు క్యాష్బ్యాక్, రివార్డులతో పాటు, అనేక ఇతర ప్రయోజనాలను కూడా అందిస్తాయి. ఇప్పుడు మీరు ఇంధనం నింపుకున్నప్పుడు మీకు బెనిఫిట్స్ అందించే కార్డుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1. BPCL SBI కార్డ్ ఆక్టేన్:
-BPCL పంపుల వద్ద ఫ్యూయల్ రీఫిల్స్పై 3.75శాతం వరకు ఆదా చేసుకోవచ్చు.
-రెస్టారెంట్లు, కిరాణా సామాగ్రినపై కూడా 1.25శాతం క్యాష్ బ్యాక్ ఫ్రీ
-గోల్ఫ్ కోర్సు, ఎయిర్ పోర్టు లాంజ్ ఎంట్రీ వంటి ప్రీమియం బెనిఫిట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
-నెలకు రూ. 4000 వరకు ఇంధన ఖర్చులపై పూర్తి ప్రయోజన ఉంటుంది.
-వార్షిక రుసుము రూ. 1,499 + GST (సంవత్సరానికి రూ.2 లక్షలు ఖర్చు చేస్తే ఈ ఫీజు మాఫీ అవుతుంది).
-చమురుపై అధికంగా ఖర్చు చేసేవారికి ఇది బెస్ట్. సర్చార్జ్ మినహాయింపులు, ప్రీమియం ఫీచర్లు.
-దీని పూర్తి ప్రయోజనం కేవలం బీపీసీఎల్ పంపుల వద్ద మాత్రమే లభిస్తుంది.
2. ఇండియన్ ఆయిల్ ఆర్బిఎల్ బ్యాంక్ ఎక్స్ట్రా క్రెడిట్ కార్డ్:
-ఇండియన్ఆయిల్ పంపుల వద్ద 8.5శాతం వరకు భారీ ఆదా. ప్రతి రూ 100 ఖర్చుపై 15 ఫ్యూయల్ పాయింట్లు (7.5% విలువ) + 1% సర్చార్జ్ మినహాయింపు పొందండి.
-నెలకు 2000 పాయింట్ల పరిమితి ఉంది.
-ఇతర ఖర్చులపై రివార్డులు కొద్దిగా తక్కువగా ఉంటాయి. కానీ ఇంధనం విషయంలో ఇది బెస్ట్.
-అత్యధిక రాబడులు, దేశవ్యాప్తంగా 20,000కు పైగా ఇండియన్ఆయిల్ పంపుల వద్ద చెల్లుబాటు అవుతుంది.
-దీని ప్రయోజనాలు కూడా ఇండియన్ఆయిల్ అవుట్లెట్లకు మాత్రమే పరిమితం.
3. హెచ్పిసిఎల్ ఎనర్జీ బూబ్ క్రెడిట్ కార్డ్:
HPCL పంపుల వద్ద మీరు 6.5% వరకు ప్రత్యక్ష పొదుపును పొందుతారు.
ఇది చాలా సులభమైన, సరళమైన కార్డ్, ఇది ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచి క్యాష్బ్యాక్ను అందిస్తుంది.
ఈ కార్డు వార్షిక రుసుము ₹499+పన్ను.
ఈ కార్డు సంవత్సరానికి 4 ఉచిత లాంజ్ ప్రవేశాలను కూడా అందిస్తుంది.
4. ఐసిఐసిఐ బ్యాంక్ హెచ్పిసిఎల్ కోరల్ క్రెడిట్ కార్డ్:
HPCL పై 3.5% ఆదా చేసుకోండి (2.5% రివార్డులు + 1% సర్చార్జ్ మినహాయింపు).
హీన్లో ₹200 వరకు ఫ్యూయల్ రివార్డ్ (నెలకు సుమారు ₹8,000 ఇంధన ఖర్చులకు ఉత్తమమైనది).
దీని వార్షిక రుసుము కేవలం ₹199 మాత్రమే, దీనిని చాలా తక్కువ ఖర్చుతో సులభంగా మాఫీ చేయించుకోవచ్చు.
5. ఇండియన్ ఆయిల్ హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్:
ఇండియన్ఆయిల్, కిరాణా, యుటిలిటీ బిల్లుల చెల్లింపులపై 5% ఇంధన పాయింట్లు.
వార్షిక రుసుము ₹500, అయితే మీరు సంవత్సరానికి ₹50,000 ఖర్చు చేస్తే ఈ రుసుము మాఫీ అవుతుంది.
ఈ కార్డుతో ఇంధనం నింపడంపై 6% వరకు ఆదా లభిస్తుంది.
6. ఇండియన్ ఆయిల్ కోటక్ క్రెడిట్ కార్డ్:
ఇండియన్ఆయిల్పై 5% వరకు ఆదా చేసుకోండి (4% పాయింట్లు + 1% మినహాయింపు).
మీరు దీని RuPay వెర్షన్ తీసుకుంటే, దానిని UPIకి లింక్ చేయడం ద్వారా రివార్డ్ పాయింట్లను కూడా సంపాదించవచ్చు.
భోజనం, కిరాణా కొనుగోళ్లపై కూడా మంచి పాయింట్లు లభిస్తాయి. రుసుము ₹500, దీనిని సులభంగా మాఫీ చేయించుకోవచ్చు.
7. యాక్సిస్ బ్యాంక్ ఇండియన్ ఆయిల్ క్రెడిట్ కార్డ్:
ఇండియన్ఆయిల్లో మొత్తం 5% ఆదా (4% + 1% సర్చార్జ్ మినహాయింపు).
ఈ కార్డుతో, మీరు BookMyShow నుండి సినిమా టిక్కెట్లు బుక్ చేసుకుంటే 15% తగ్గింపు, అలాగే భాగస్వామ్య రెస్టారెంట్లలో భోజనంపై కూడా తగ్గింపు పొందుతారు.
Also Read: ఉద్యోగులకు అలర్ట్.. మీ అకౌంట్లో PF Interest ఇంకా పడలేదా? అసలు కారణం ఇదే..!!
Also Read: LPG Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. మళ్లీ పెరిగిన వంటగ్యాస్
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. దయచేసి దీన్ని పెట్టుబడి, ఆర్థిక లేదా వ్యాపార సలహాగా భావించవద్దు. గుర్తుంచుకోండి స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టోకరెన్సీలు, రియల్ ఎస్టేట్, విలువైన లోహాలు వంటి అన్ని రకాల పెట్టుబడులు మార్కెట్ ఆటు పోటులు రిస్కులకు లోబడి ఉంటాయి. దీని అర్థం, మీరు లాభపడవచ్చు లేదా నష్టపోవచ్చు. మీరు తీసుకునే ఎలాంటి పెట్టుబడి నిర్ణయాలు లేదా వ్యాపార కార్యకలాపాల వల్ల కలిగే నష్టాలు లేదా లాభాలకు మా సంస్థ జీ తెలుగు వెబ్ పోర్టల్ ఎట్టి పరిస్థితుల్లోనూ బాధ్యత వహించదు. ఏదైనా ఆర్థిక నిర్ణయం తీసుకునే ముందు, తప్పకుండా ఒక రిజిస్టర్డ్ లేదా సర్టిఫైడ్ ఆర్థిక నిపుణుడిని సంప్రదించి, వారి సలహా తీసుకోమని పాఠకులకు సిఫార్సు చేస్తున్నాము.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Chandrababu: ఎన్డీయే సమావేశంలో కీలక ప్రసంగం.. ప్రధాని మోదీపై చంద్రబాబు ప్రశంసల వర్షం
New Delhi, Delhi:NDA Conclave: 'ప్రపంచంలోని ఏ నాయకుడితోనైనా ప్రధాని మోదీ సమానంగా నిలబడగలరు. ఇది నేను ఎంతో స్పష్టంగా చెప్పగలను. ఇది దేశానికే గర్వకారణం' అని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. సాధారణంగా రాజకీయ కూటములు ఎన్నికల కోసం ఏర్పడతాయి... కానీ ఎన్డీఏ కూటమి ఎన్నికల కోసం కాదు దేశం కోసం ఏర్పడిందని తెలిపారు. అధికారం కోసం కాదు దేశ ప్రయోజనాల కోసం ఎన్డీయే ప్రయాణం సాగిస్తోందని చెప్పుకొచ్చారు. దీనికి రాష్ట్రాల్లో వరుసగా ఎన్డీఏ సాధిస్తోన్న విజయాలే సాక్ష్యమని వివరించారు.
చంద్రబాబు ప్రశంసలు
నరేంద్ర మోదీ 12 సంవత్సరాల పాలన, దేశ చరిత్రలో అత్యంత సుదీర్ఘ కాలం పాటు ప్రధానిగా సేవలందించడంపై చంద్రబాబు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ప్రధానమంత్రి నాయకత్వ ప్రతిభ, పరిపాలనా సామర్ధ్యం, ప్రపంచస్థాయిలో దేశానికి తెచ్చిన పేరు ప్రఖ్యాతలపై చంద్రబాబు ప్రశంసలు కురిపించారు. దేశాభివృద్ధికి నిరంతరం శ్రమిస్తూనే రాష్ట్రాల అభ్యున్నతికి, ముఖ్యంగా ఏపీ అభివృద్ధికి మద్దతుగా నిలుస్తున్నందుకు సీఎం చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు.
మోదీకి కృతజ్ఞతా తీర్మానం
నరేంద్ర మోదీకి కృతజ్ఞతా తీర్మానాన్ని గౌరవ సభలో ప్రవేశపెట్టిన అనంతరం సీఎం చంద్రబాబు కీలక ప్రసంగం చేశారు. 'సరైన సమయంలో, సరైన స్థానంలో, సరైన నాయకుడిగా దేశానికి ప్రధానిగా మోదీ ఉన్నారు. ఒకవైపు దేశానికి స్థిరత్వాన్ని ఇచ్చే మార్గదర్శిగా.. కొత్త ఆలోచనలకు, నవ కల్పనలకు ప్రేరణనిచ్చే నాయకుడిగా పనిచేయడం మోదీ గొప్పతనం' అని ప్రశంసించారు. మోదీ ఎప్పుడూ ‘నేషన్ ఫస్ట్’ అనే అజెండాతో పనిచేస్తారని చెప్పారు.
ముఖ్యమంత్రి నుంచి ప్రధాని వరకు
'2001లో ముఖ్యమంత్రిగా ఎన్నికైన నాటి నుంచి నేటి ప్రధాని పదవి వరకు 25 ఏళ్లుగా మోదీ ప్రజా జీవితంలో విశేషంగా సేవలు అందించారు. ప్రజల అంచనాలకు తగ్గట్టుగా నిలబడటం మోదీ నాయకత్వానికి ఉన్న ప్రత్యేకత. నేడు ప్రపంచం అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. యుద్ధాలు, సరఫరా వ్యవస్థల అంతరాయాలు, ఇంధన మార్కెట్ల అస్థిరత, ప్రధాన ఆర్థిక వ్యవస్థల మందగమనం, నెలకొన్న అనిశ్చితి ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్నాయి' అని టీడీపీ అధినేత చంద్రబాబు వివరించారు.
విజయవంతమైన పాలన
'మోదీ సమర్ధవంతమైన పాలనతో భారతదేశంలో ద్రవ్యోల్బణం సుమారు 3.5 శాతం వద్దే కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల మధ్య భారత ఆర్థిక వ్యవస్థకు స్థిరత్వాన్ని తెచ్చారు. సీఎంగా విజయవంతమైన పాలన అందించిన మోదీ ప్రధానమంత్రిగా కూడా అదే స్ఫూర్తి, సృజనాత్మకత, నూతనత్వాన్ని అనుసరించడం విశేషం' అని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. 'మోదీ ఎప్పుడూ అలిసిపోరు... నిత్యం ఉత్సాహంగా ఉంటారు. మిగిలిన వారిని ఉత్సాహపరుస్తారు' అని పేర్కొన్నారు.
'బీహార్లో 243 స్థానాల్లో 202 స్థానాల్లో గెలుపు ఎన్డీయేపై ప్రజల విశ్వాసానికి నిదర్శనం. అసోంలో, పుదుచ్చేరిలో వరుస గెలుపుల ద్వారా ప్రజల ఆదరణను చాటుకుంది. ఇవి కేవలం ఎన్నికల ఫలితాలు కావు... సుపరిపాలనకు ప్రజలు ఇచ్చిన తీర్పు' అని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. భారతీయత పునరుజ్జీవం పొందడం పన్నెండేళ్లలో మోదీ నాయకత్వంలో వచ్చిన అతిపెద్ద మార్పు అని చెప్పారు. వికాస్ బీ... విరాసత్ బీ నూతన భారత నిర్మాణానికి మార్గదర్శకమని పేర్కొన్నారు.
భారత్ బలం అదే
ప్రాచీన జ్ఞానం, డిజిటల్ పరిపాలన, ఆవిష్కరణల సమన్వయమే నూతన భారత్ బలం అని టీడీపీ అధినేత చంద్రబాబు వివరించారు. ప్రధాని మోదీ దేశానికి ఉన్న అడ్డంకులు తొలగించి, స్పష్టమైన విధానాలతో, లక్ష్యాలతో ముందుకు తీసుకెళ్తున్నారని చెప్పారు. వ్యవస్థను పారదర్శకంగా, అందరికీ అందుబాటులో ఉండేలా తీర్చిదిద్దుతున్నారని అభినందించారు. 'ప్రతీ భారతీయుడి మనోభావాలను అర్థం చేసుకున్న నాయకుడు ప్రధాని మోదీ. మన కాలంలో అత్యుత్తమ రాజకీయవేత్తల్లో ప్రధాని మోదీ ఒకరు' అని ప్రశంసించారు.
భారత ఆత్మవిశ్వాసానికి ప్రతిబింబం
ప్రధానిగా మోదీ పన్నెండేళ్ల ప్రయాణం భారత ఆత్మవిశ్వాసానికి ప్రతిబింబం అని ఏపీ సీఎం చంద్రబాబు కొనియాడారు. ప్రతీ అంతర్జాతీయ సర్వే మోదీని అత్యంత ప్రజాదరణ కలిగిన ప్రపంచ నాయకుడిగా గుర్తిస్తోందని.. ఇది దేశ ప్రజలందరికీ గర్వకారణం అని ప్రకటించారు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా భారతీయులకు, భారతదేశానికి గౌరవం లభిస్తోందంటే దానికి కారణం మోదీ నాయకత్వం అని వివరించారు. ప్రపంచంలోనే నంబర్ వన్ ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదగాలన్నది మన లక్ష్యమని.. అది మోదీ నాయకత్వంతోనే సాకారం అని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. మోదీ నాయకత్వంలో దేశం మరిన్ని విజయాలు సాధిస్తుందని.. 2047 నాటికి వికసిత్ భారత్ నిర్మాణం సాధించాలన్న అందరి సంకల్పం నెరవేరుతుందని చంద్రబాబు అభిలషించారు.
TMC Merge In Congress: మమతా బెనర్జీ సంచలన నిర్ణయం.. కాంగ్రెస్ పార్టీలో తృణమూల్ విలీనం?
New Delhi, Delhi:TMC Merge In Congress: అధికారం కోల్పోయిన అనంతరం మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నారు. దాదాపుగా రెండున్నర దశాబ్దాలు పార్టీని నడుపుతూ తిరుగులేని నాయకురాలిగా నిలిచిన మమతా బెనర్జీకి ఇప్పుడు కష్టాలు ఎదురవుతున్నాయి. గ్రూపు రాజకీయాలు ఒక్కసారిగా భగ్గుమనడంతోపాటు గ్రూపుల చొప్పున పార్టీ నిలువునా చీలిపోయింది. అసెంబ్లీలో, లోక్సభ, రాజ్యసభ ఇలా పార్టీ మూడు ముక్కలైంది. ఈ నేపథ్యంలో మమతా బెనర్జీ ఏం చేయాలో తెలియక గందరగోళంలో పడ్డారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, ఎంపీ సోనియా గాంధీతో మమతా బెనర్జీ సమావేశమయ్యారు. ఈ భేటీలో తృణమూల్ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయాలనే ప్రతిపాదన వచ్చినట్లు తెలుసతోంది.
కొన్ని నిమిషాల పాటు చర్చలు
న్యూఢిల్లీలోని కాంగ్రెస్ ఎంపీ సోనియాతో మమతా బెనర్జీ సమావేశమై కొన్ని నిమిషాల పాటు చర్చలు జరిపారు. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీ భవిష్యత్తుపై సమాలోచనలు జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. రాజకీయంగా ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటున్న మమతా బెనర్జీ తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు చర్చ జరుగుతోంది. సోనియా గాంధీతో జరిగిన వ్యక్తిగత సమావేశంలో మమతా బెనర్జీ కీలక విషయాలు మాట్లాడినట్లు సమాచారం. తృణమూల్ కాంగ్రెస్లో విలీనం చేసే అంశాన్ని పరిశీలించాలని సూచించినట్టు వార్తలు వస్తున్నాయి.
విలీనం ప్రతిపాదన
తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో కుమ్ములాట.. గ్రూపు రాజకీయాలు.. పార్టీ చేజారిపోయే అవకాశం ఉండడంతో కాంగ్రెస్లో విలీనం అనే ప్రతిపాదన వచ్చినట్లు తెలుస్తోంది. తృణమూల్ పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మారిన పరిస్థతుల్లో విలీనం ప్రతిపాదన వచ్చినట్టు సమాచారం. తిరిగి కాంగ్రెస్లోకి రావాలని సోనియా గాంధీ ఆహ్వానించినట్లు జాతీయా మీడియా చెబుతోంది. బీజేపీ చేస్తున్న రాజకీయంతో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ విచ్ఛిన్నమవుతోంది.
ఒంటరిగా ఉంటే మరిన్ని వేధింపులు తప్పవని.. అసలు ఉనికి ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉండడంతో బీజేపీకి ఆ అవకాశం ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీలో తృణమూల్ విలీనం చేయాలనే ప్రతిపాదన వచ్చింది. తృణమూల్ విలీనం అయితే ప్రతిపక్ష బలం పెరుగుతుందని.. అందరూ కలిసికట్టుగా ఉంటే బీజేపీతో పోరాడే శక్తి వస్తుందని సోనియా గాంధీ చెప్పినట్లు తెలుస్తోంది. భవిష్యత్ సవాళ్లను దృష్టిలో పెట్టుకుని విలీనంపై ఆలోచన చేయాలని కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదన చేసినట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్ లో గౌరవం ఎలా?
కాంగ్రెస్ పార్టీ చేసిన విలీన ప్రతిపాదనపై మమతా బెనర్జీ అప్పటికప్పుడు ఏం చెప్పలేకపోయారు. విలీనంపై వెంటనే నిర్ణయం తీసుకోలేమని.. ఈ ప్రతిపాదనను పరిశీలించేందుకు కొన్ని రోజుల సమయం అడిగినట్లు తెలుస్తోంది. ఒకవేళ తృణమూల్ విలీనమైతే మమతా బెనర్జీకి కాంగ్రెస్ పార్టీలో ఎలా గౌరవించాలి? ఏ పదవి ఇవ్వాలనేది? కూడా ఇప్పటికే హస్తం పార్టీ సమాలోచనలు చేస్తున్నాయని జాతీయ మీడియా చెబుతోంది. కాంగ్రెస్ పార్టీలో జాతీయ ఉపాధ్యక్షురాలి పదవి మమతకు ఇవ్వవచ్చని తెలుస్తోంది. ఇక ఆమె మేనల్లుడు, తృణమూల్ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీకి ప్రధాన కార్యదర్శి బాధ్యతలు అప్పగించవచ్చనే వార్తలు వస్తున్నాయి.
అభిషేక్ బెనర్జీ- రాహుల్ గాంధీ భేటీ
పరిస్థితి ఇలా ఉంటే మమత మేనల్లుడు అభిషేక్ బెనర్జీ, సోనియా గాంధీ కుమారుడు రాహుల్ గాంధీ సమావేశమయ్యారు. అభిషేక్, రాహుల్ భేటీలో కూడా పార్టీ విలీనంపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుత రాజకీయ పరిణామాలు, పశ్చిమ బెంగాల్లో పరిస్థితులు ఇలా అన్నింటినీ వీరిద్దరూ కొన్ని నిమిషాలు చర్చించినట్లు సమాచారం.
YS Jagan: స్టీల్ ప్లాంట్ బాధితులకు చంద్రబాబు ఇచ్చేది ఏంది బోడి? వైఎస్ జగన్
Visakhapatnam, Andhra Pradesh:Vizag Steel Plant Accident: 'వైజాగ్ స్టీల్ ప్లాంట్ బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా పరిహారం రావడం లేదు' అని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు. బాధితులకు న్యాయబద్దంగా రావాల్సినవే ఇస్తున్నారు తప్ప రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీరు ఇచ్చేది ఏంది బోడి? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. '2025 ఏప్రిల్ నెలలో ఓ వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మికుడు చనిపోతే కూటమి ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి పరిహారం ఇవ్వలేదు. చనిపోయిన కార్మికుడి పిల్లలకు ఒక్క నెలలోనే ఉద్యోగాలు ఇస్తామని చెప్పి, ఇప్పుడు అడిగితే ఫైల్ పోయిందని చెబుతున్నారు' అని వివరించారు. 'చంద్రబాబు కొడుకు మాటలు వింటే ఇలాంటి మానవత్వం లేని మనుషులు కూడా ఉంటారా అనిపించింది' అని మాజీ సీఎం వైఎస్ జగన్ తెలిపారు.
పరామర్శ
స్టీల్ ప్లాంట్ బాధితులను విశాఖపట్టణంలోని సెవెన్ హిల్స్ ఆస్పత్రిలో వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పరామర్శించారు. చికిత్స పొందుతున్న కార్మికుల ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్న అనంతరం బాధితులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. చనిపోయిన కార్మిక కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.
జీతాలు లేవు
'స్టీల్ ప్లాంట్ కార్మికులు బతుకులు రోడ్ల మీద పెట్టేశారు. తప్పుడు మాటలతో నమ్మించి చివరకు కార్మికులు మృత్యువాత పడుతున్నారు. ప్రధానమంత్రి సభ సమక్షంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని నేరుగా సభలోనే కోరాను. స్టీల్ ప్లాంట్లో 28 వేల మంది కార్మికులు పనిచేస్తుంటే.. 10,500 మంది కార్మికులను తీసేశారు. ఇప్పుడు కార్మికుల సంఖ్య 16 వేల మందికి పడిపోయింది. కార్మికులకు నాలుగున్నర నెలల జీతాలు లేవు' అని మాజీ సీఎం వైఎస్ జగన్ వివరించారు.
మీరు ఇచ్చింది ఏంటి బోడి?
'ఈ ప్రమాదం జరగడం చాలా బాధాకరం. లిక్విడ్ బకెట్లలో పోసింది పొంగి బ్లాస్ట్ అయింది.. ఇందులో కార్మికుల తప్పులేదు. ఇలాంటి ఘటనలో మానవత్వం చూపించాల్సిన సమయంలో రాజకీయ చేయడం దురదృష్టకరం' అని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తెలిపారు. 'చనిపోయిన మృతుల కుటుంబాలకు ఇవ్వాల్సిన పరిహారంలో పెద్ద డ్రామా. స్టీల్ ప్లాంట్ కర్మాగారం నుంచే రూ.25 లక్షలు ఇస్తారు.. ఇంకా మీరు ఇచ్చింది ఏంటి బోడి?' అని చంద్రబాబుపై వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఉపేక్షించేది లేదు..
'నా ప్రభుత్వం ఉన్నప్పుడు ఎల్జీ పాలిమర్స్ ఘటనలో బాధితులకు రూ.కోటి పరిహారం ఇచ్చా. స్టీల్ ప్లాంట్ ఘటనలో బాధితులకు రావాల్సిన డబ్బులు వస్తున్నాయి అంతే. చంద్రబాబు చేసింది ఏమి లేదు' అని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. బాధితులకు చంద్రబాబు న్యాయం చేయకపోతే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. చంద్రబాబు ఇవ్వకపోతే మళ్లీ వైఎస్సార్ ప్రభుత్వం వస్తే తప్పకుండా మీకు కోటి రూపాయలు ఇస్తానని మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు.
అసెంబ్లీలో తీర్మానం చేయాలి
'విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడేందుకు అన్ని విధాలా మేం కృషి చేశాం. అందుకే ఆ 5 ఏళ్లలో ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిపోయింది. రెండుసార్లు ప్రధానమంత్రికి లేఖ రాశాం. ప్రత్యక్షంగా విజ్ఞప్తి చేశాం. అసెంబ్లీలో తీర్మానం కూడా చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాం' అని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ గుర్తుచేశారు. స్టీల్ ప్లాంట్పై చంద్రబాబు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందా? అని ప్రశ్నించారు. చిత్తశుద్ధి ఉంటే వెంటనే అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని డిమాండ్ చేశారు.
ప్యాకేజీ పక్కదారి
విశాఖ స్టీల్ ప్లాంట్కు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్యాకేజీపై మాజీ సీఎం వైఎస్ జగన్ కీలక విషయాలు వెల్లడించారు. 'స్టీల్ ప్లాంట్కు కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.11,440 కోట్ల ప్యాకేజీ సాధించామని చంద్రబాబు, మంత్రులు గొప్పగా చెప్పుకున్నారు. నిజానికి ఆ ప్యాకేజీ ఇక్కడ నిర్వహణ కోసమో.. భద్రత మెరుగపర్చడం కోసమో.. సామర్థ్యం పెంచడం కోసమో వాడలేదు. ఉద్యోగులకు వీఆర్ఎస్ అమలు, జీఎస్టీ బకాయిల చెల్లింపు, ఇంకా బ్యాంక్ రుణాలు కొంత తీర్చడం కోసం వాడారు' అని చంద్రబాబు మోసాన్ని బయటపెట్టారు.
Cobra Video: స్నానం చేసి ప్యాంట్ వేసుకున్నాడు.. కట్ చేస్తే జేబులో కింగ్ కోబ్రా.. వీడియో..
Hyderabad, Telangana:Baby King Cobra In Pocket Viral Video Watch: మనం రోజు వేసుకునే దుస్తుల్లోకి పాము దూరితే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకుంటూనే ఎంతో భయం కలుగుతుంది.. సరిగ్గా అలాంటి ఘటనే ఒక యువకుడికి ఎదురైంది.. స్నానం ముగించుకొని ప్యాంట్ వేసుకున్న ఒక యువకుడి జేబులో ఏకంగా ప్రమాదకరమైన కింగ్ కోబ్రా పిల్ల దర్శనం ఇచ్చింది. దీనికి సంబంధించిన ఒళ్లు గగుర్పొడిచే వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే, ఆ పాము అతడు జేబులోకి ఎలా వచ్చింది? అతను ఎలా గుర్తించాడు? దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
అసలు ఏం జరిగిందో తెలుసా?
వైరల్ అవుతున్న వీడియో వివరాల ప్రకారం.. ఒక యువకుడు ఉదయాన్నే స్నానం పూర్తిచేసుకుని.. పక్కన ఉన్న ప్యాంటును తీసుకొని వేసుకున్నాడు. అయితే ప్యాంటు వేసుకున్న కొద్దిసేపటికే జేబు భాగంలో ఏదో కదులుతున్నట్టు అతడికి అనిపించింది.. అనుమానంతో ప్యాంటు ప్యాకెట్ సైడ్ పరిశీలించగా.. అందులో ఒక చిన్న నాగుపాము పిల్ల నక్కి ఉండటం చూసి అతడు ఒక్కసారిగా షాక్ గురయ్యాడు.. భయంతో వణికి పోతున్నప్పటికీ.. సదర్ యువకుడు ఏమాత్రం కంగారు పడకుండా.. చాకచక్యంగా వ్యవహరించాడు.. వెంటనే స్నేక్ క్యాచర్స్కి సమాచారం అందించారు..
సురక్షితంగా బయటకు తీసిన స్నేక్ క్యాచర్..
సమాచారం అందుకున్న వెంటనే స్నేక్ క్యాచర్ అక్కడికి చేరుకొని.. ఆ యువకుడి ప్యాంటులో ఉన్న నాగుపాముని పరిశీలించి చూసాడు. అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తూ.. ప్యాంట్ జేబును ఒక చిన్న కర్ర సహాయంతో తెరిచి.. అందులో ఉన్న చిన్న నాగుపాము పిల్లను బయటికి ఎలా తీసుకురావాలని పరిశీలించి చూసాడు.. వెంటనే ఆ స్నేక్ క్యాచర్.. జేబుపై భాగం కదిలించగానే అందులో నుంచి నాగుపాము పిల్ల బయటికి వచ్చేసింది.. వెంటనే అతను దాని తలభాగాన్ని పట్టుకొని.. జేబులో నుంచి బయటికి తీసేసాడు.
Also Read: Video Viral: సాయం ముసుగులో అరాచకం.. యువతి ప్రైవేటు పార్ట్ మీద చెయ్యి వేసి మరీ.!. వీడియోపై దుమారం..
నెటిజన్లు హడల్..
ఈ షాకింగ్ వీడియో చూసిన సోషల్ మీడియా వినియోగదారులు భయాందోళనలు వ్యక్తం చేస్తూ వస్తున్నారు.. ఇకపై బట్టలు వేసుకునే ముందు 100 సార్లు చెక్ చేసుకోవాలి.. అంటూ కొంతమంది కామెంట్ పెడుతున్నారు. ముఖ్యంగా వర్షాకాలంతో పాటు ఎండాకాలం ఎక్కువగా ఉన్న రోజుల్లో చల్లదనం కోసం పాములు ఇళ్లలోకి, ఆరుబయట ఆరేసిన బట్టల్లోకి, బూట్లలోకి నక్కుతాయని.. కాబట్టి ప్రజలు వీటిని ధరించే క్రమంలో తప్పకుండా ఒకటికి రెండుసార్లు దులపడం మంచిదని.. దులిపిన తర్వాత చెక్ చేసుకోవడం మరింత మంచిదని వన్యప్రాణి సంరక్షకులు సూచిస్తూ ఉన్నారు.
Also Read: Video Viral: సాయం ముసుగులో అరాచకం.. యువతి ప్రైవేటు పార్ట్ మీద చెయ్యి వేసి మరీ.!. వీడియోపై దుమారం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్.. - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..Twitter, Facebook
Nagamani Video: వామ్మె.. నాగమణికి నాలుగు నాగుపాముల పహారా.. వీడియో ఇదే..
Hyderabad, Telangana:Nagamani Viral Video Watch: పురాణాలతో పాటు జానపద కథల్లో మనం ఎంతో ఆసక్తిగా విన్న నాగమణి గురించి చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో మళ్లీ ఊపందుకుంది. అత్యంత అరుదైన, పవిత్రమైన నాగమణిని పోలిన ఒక వస్తువుకు.. నాలుగు ప్రమాదకరమైన నాగుపాములు చుట్టూ ముట్టి రక్షణగా నిలిచినట్లు ఉన్న దృశ్యాలు సోషల్ మీడియాలో నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తూ వస్తున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ వింత దృశ్యం చూసి చాలామంది ఆశ్చర్యపోతూ ఉన్నారు. కొంతమంది అయితే ఈ వీడియో చూసి ఆ నాలుగు పాములు నిజమైన నాగమణికి కాపలాక ఉన్నాయా.? లేదా ఇది ఫేక్ వీడియోనా అని కామెంట్లు చేస్తూ వస్తున్నారు..
పురాణాల్లో నాగమణి విశిష్టత..
మన పురాణాల ప్రకారం.. నాగమణి అనేది కేవలం కొన్ని వందల ఏళ్ల వయస్సున్న విశిష్టమైన సర్పాల తల భాగంలో మాత్రమే పెరుగుతుందని నమ్ముతూ ఉంటారు.. పూర్వకాలంలో ఈ మనీని కేవలం చక్రవర్తులతో పాటు రాజులు మాత్రమే ధరించే వారని కథలు ఉన్నాయి.. నాగమణి ధరించిన వారికి ఊహించని విజయాలు దక్కుతాయని.. సకల ఐశ్వర్యాలు కలుగుతాయని.. ఎలాంటి ప్రాణాపాయం జరగదని నాటి ప్రజల బలమైన నమ్మకం.. ఈ నేపథ్యంలోనే తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో వెలుగులు చిమ్ముతున్న ఒక మని చుట్టూ నాలుగు నాగు పాములు పడగవిప్పి పహార కాస్తున్నట్లు కనిపించడం తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది.
3D గ్రాఫిక్స్?
ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియో పై సోషల్ మీడియా వినియోగదారులు భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు దీనిని దైవిక శక్తులకు నిదర్శనం అని నమ్ముతుండగా.. మెజారిటీ సోషల్ మీడియా వినియోగదారులు మాత్రం ఇదంతా ఫేక్ అని కొట్టి పారేస్తున్నారు.. ప్రస్తుతం అందుబాటులో ఉన్న అధునాతన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ టూల్స్ లేదా 3dడీ గ్రాఫిక్స్ సహాయంతో ఈ వీడియోను తయారు చేశారని సాధారణ పాముల వీడియోలకు డిజిటల్ లైటింగ్ తో కూడిన మణిని జోడించి.. ప్రజలను భ్రమల్లోకి నెడుతున్నారని కొంతమంది టెక్నాలజీ తెలిసిన నిపుణులు చెబుతున్నారు..
Also Read: Video Viral: సాయం ముసుగులో అరాచకం.. యువతి ప్రైవేటు పార్ట్ మీద చెయ్యి వేసి మరీ.!. వీడియోపై దుమారం..
సైన్స్ చెబుతుంది ఇదే..
జీవశాస్త్ర నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. పాములు తలపై ఎలాంటి మణులు లేదా రత్నాలు పెరగవని.. పాము తలభాగం పై ఉండే చర్మం లేదా ఎముకల నిర్మాణం సాధారణ జంతువుల లాగే ఉంటుందని.. కేవలం సోషల్ మీడియాలో వ్యూస్తో పాటు లైకుల కోసం కొందరు ఇలాంటి గ్రాఫిక్స్ వీడియోలను సృష్టించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెబుతున్నారు. కాబట్టి ఇలాంటి మూఢనమ్మకాలను నమ్మి ప్రజలు మోసపోవద్దని నిపుణులు హెచ్చరిస్తూ వస్తున్నారు.. సాధారణంగా ఆర్టిఫిషియన్ ఇంటిలిజెన్సీ వచ్చిన తర్వాత ఇలాంటి వీడియోల సంఖ్య పెరుగుతూ వస్తోందని వారు చెబుతూ ఉన్నారు..
Also Read: Video Viral: సాయం ముసుగులో అరాచకం.. యువతి ప్రైవేటు పార్ట్ మీద చెయ్యి వేసి మరీ.!. వీడియోపై దుమారం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్.. - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..Twitter, Facebook
Cobra Selfie Video: చావుతో చెలగాటం.. నాగుపాముతో సెల్ఫీ.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో వైరల్!
Hyderabad, Telangana:Vava Suresh Cobra Selfie Video Watch Now: సోషల్ మీడియాలో లైకులతో పాటు వ్యూస్ కోసం సోషల్ మీడియా వినియోగదారులు రకరకాల విన్యాసాలు చేయడం చూస్తూ ఉంటాం. కానీ ఏకంగా చావుతో చెలగాటమాడుతూ ఒక భయంకరమైన నాగుపాముతో సెల్ఫీ దిగితే ఎలా ఉంటుందో ఊహించడానికే భయం వేస్తుంది కదా.. గతంలో కేరళకు చెందిన ప్రముఖ స్నేక్ క్యాచర్ వావ సురేష్ అత్యంత ప్రమాదకరమైన పాముతో సెల్ఫీ దిగిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఈ వీడియోను చూసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు.
ఒళ్ళు గగుర్పొడిచే దృశ్యం..
వైరల్ అవుతున్న ఈ వీడియోలో.. వావ సురేష్ ఒక పెద్ద నాగుపామును రక్షించి చేత్తో పట్టుకొని ఉండటం మీరు క్లియర్ గా చూడొచ్చు. అయితే ఎవరు ఊహించని విధంగా ఆయన ఒక చేతితో విషాదం నడుము భాగాన్ని పట్టుకొని.. మరో చేతితో తన మొబైల్ ఫోన్ను పట్టుకొని ఉన్నారు.. అంతటితో ఆగకుండా.. ఆ పామును నెమ్మదిగా తన ముఖం దగ్గరకు.. తలభాగం వైపుకు తీసుకువచ్చారు.. ఆ పాము ఎప్పుడు కాటేస్తుందో తెలియని అత్యంత ప్రమాదకరమైన స్థితిలో ఆయన ఎంతో కూల్ గా నాగుపాముతో సెల్ఫీ దిగాడు.. ఈ ఊహించని దృశ్యాన్ని చూసి సోషల్ మీడియా వినియోగదారులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు..
ఇదే సమయంలో అక్కడున్న కొంతమంది ఈ దృశ్యాన్ని తమ స్మార్ట్ ఫోన్స్ లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతే అప్పటినుంచి వైరల్ అవుతూ వస్తోంది. అయితే ఈ వీడియో పాతదే అయినప్పటికీ తాజాగా సోషల్ మీడియాలో మాత్రం రీ పోస్ట్ చేయడంతో విపరీతంగా వైరల్ అవుతుంది. షేర్ చేసిన కొద్ది రోజుల్లోనే లక్షలాది వ్యూస్ ను సంపాదించింది. సురేష్ ధైర్యాన్ని చూసి కొందరు సోషల్ మీడియా వినియోగదారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తుండగా.. వన్యప్రాణి ప్రేమికులతో పాటు నెటిజన్లలోని మెజారిటీ వర్గం మాత్రం ఆయన తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
వావ సురేష్ గతంలో ఎన్నోసార్లు పాముకాటుకు గురై ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న సంగతి అందరికీ తెలిసిందే. అంతేకాకుండా అతను పాముకాటుకు గురైన సందర్భానికి సంబంధించిన వీడియోలు కూడా అప్పట్లో సోషల్ మీడియాలో సంచలనంగా మారిన సంగతి మనందరికీ తెలుసు. అంత అనుభవం ఉండి కూడా.. కేవలం సోషల్ మీడియాలో పబ్లిసిటీ కోసం ఇలాంటి ప్రాణాంతక విన్యాసాలు చేయడం అస్సలు మంచిది కాదని.. ఇది చూసి వేరే వాళ్ళు కూడా ఇలాగే ప్రయత్నించి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని పలువురు సోషల్ మీడియా వినియోగదారులు హెచ్చరిస్తూ వస్తున్నారు.
Also Read: Video Viral: సాయం ముసుగులో అరాచకం.. యువతి ప్రైవేటు పార్ట్ మీద చెయ్యి వేసి మరీ.!. వీడియోపై దుమారం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్.. - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..
