icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

Vizag Steel Plant Accident: వైజాగ్ స్టీల్ ప్లాంట్‌లో మరో ఘోర ప్రమాదం..ఒక కాంట్రాక్ట్ కార్మికుడు మృతి!

Nadupuru, Andhra Pradesh:

Vizag Steel Plant Accident News: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లో మరోసారి తీవ్ర ప్రమాదం చోటుచేసుకుంది. ప్లాంట్‌లోని కోక్ ఓవెన్ విభాగంలో జరిగిన ఈ ఘటనలో అనంత్ అనే కాంట్రాక్ట్ కార్మికుడు ప్రాణాలు కోల్పోయారు. గతంలో జరిగిన భారీ అగ్నిప్రమాద ఘటన మరవకముందే మరో కార్మికుడు మృతి చెందడంతో ప్లాంట్ కార్మికుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.

ప్రమాదం జరిగిన తీరు
స్టీల్ ప్లాంట్‌లోని కోక్ ఓవెన్-1 విభాగంలో అనంత్ విధుల్లో ఉండగా, పైనుంచి ఐరన్ ముక్క (ఇనుప ముక్క) ఆయనపై పడింది. ఈ ఘటనలో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స అందించేలోపే ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు ధృవీకరించారు. సమాచారం అందుకున్న స్టీల్ ప్లాంట్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. భద్రతా నిబంధనల లోపాలపై విచారణ జరుపుతున్నారు.

ప్రశ్నార్థకంగా మారుతున్న భద్రతా ప్రమాణాలు
ప్లాంట్‌లో వరుసగా చోటుచేసుకుంటున్న ప్రమాదాలు కార్మికుల భద్రతపై తీవ్ర ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. ఇటీవలే జూన్ నెలలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 10 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఆ విషాదం నుంచి కోలుకోకముందే ఇప్పుడు మరో కార్మికుడు బలికావడం భద్రతా పర్యవేక్షణ లోపాలను ఎత్తిచూపుతోంది.

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో వరుస ప్రమాదాలు కొత్తేమీ కాదని, గత కొన్ని దశాబ్దాలుగా గ్యాస్ లీకేజీలు, పేలుళ్లు, ద్రవ లోహం లీకేజీలు, యంత్రాల వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని కార్మిక సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.

కార్మిక సంఘాల ప్రధాన డిమాండ్లు
ప్లాంట్‌లో భద్రతా ప్రమాణాలను వెంటనే మరింత పెంచాలి. ముఖ్యంగా కాంట్రాక్ట్ కార్మికులకు నాణ్యమైన భద్రతా పరికరాలు, తగిన శిక్షణ, పర్యవేక్షణ అందించాలి. ప్రమాదాలకు కారణమవుతున్న సాంకేతిక, నిర్వహణ లోపాలను గుర్తించి వెంటనే పరిష్కరించాలి. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి.

Also Read: "ఢిల్లీలో అరాచక శక్తులు విద్యార్థులను రెచ్చగొడుతున్నాయి" బండి సంజయ్ కామెంట్స్!

Also REad: భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభోత్సవ వేళ బంపరాఫర్..చిన్న పనికి లక్ష రూపాయలు!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

అయ్యే.. టీచర్ మెడలోని బంగారు గొలుసు కొట్టేసిన దొంగలు..

Hyderabad, Telangana:

Bhadradri Kothagudem Theft: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం అనంతారం గ్రామంలో అర్ధరాత్రి వేళ దొంగలు తీవ్ర కలకలం సృష్టించారు. సాధారణంగా రోడ్లపై ఒంటరిగా వెళ్లే.. మహిళల మెడల నుంచి గొలుసులు తెంచుకెళ్లడం లాంటి రొటీన్ నేరాలకు భిన్నంగా.. ఈసారి ఏకంగా ఇళ్లల్లోకే దూరి తమ చేతివాటాన్ని ప్రదర్శించారు. నిద్రపోతున్న మహిళ మెడలోని బంగారు పుస్తెల తాడును కత్తిరించి.. పరారైన ఈ ఘటన స్థానికంగా ఇప్పుడు తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది..

అనంతారం గ్రామానికి చెందిన బచ్చల సుకన్య ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పని చేస్తోంది.. రోజూలాగే ఆమె తన భర్తతో కలిసి ఇంట్లో నిద్రపోతోంది.. అయితే, ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న వారి ఇంటి కిటికీలకు ఇంకా గ్రిల్స్ అమర్చకపోవడమే దొంగలకు శాపంగా మారకుండా పోయింది.. అర్ధరాత్రి సుమారు 2:30 గంటల ప్రాంతంలో కిటికీని ఆసరాగా చేసుకున్న ఒక దొంగ గ్రిల్స్ లేని అందులో నుంచి ఇంట్లోకి దూరిపోయాడు.

గాఢ నిద్రలో ఉన్న సుకన్య మెడలో ఉన్న బంగారు పుస్తెల తాడును అత్యంత చాకచక్యంగా కత్తిరించాడు. మెడలో ఏదో కదులుతున్నట్లు అనిపించి బాధితులు తేరుకుని లేచే లోపే.. ఆ దొంగ క్షణాల్లో బయటకు వెళ్లిపోయాడు.. బయట అప్పటికే సిద్ధంగా ఉన్న మరో దొంగతో కలిసి బైక్‌పై చీకట్లోకి పరారయ్యాడు.

పోలీసుల రంగ ప్రవేశం..
బాధితులు తేరుకుని దొంగ దొంగ అని కేకలు వేస్తూ.. దుండగుల వెంట పడినప్పటికీ.. వేగంగా బైక్‌పై వెళ్లిన కేటుగాళ్లు దొరకకుండా ఉడాయించారు. బాధితులు లబోదిబోమంటూ వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న జూలూరుపాడు పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. 

ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టారు. సీసీటీవీ ఫుటేజీలు, పాత నేరస్థుల కదలికలపై దృష్టి సారించి దొంగల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. నిర్మాణాలు జరుగుతున్న ఇళ్ల భద్రత విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా పోలీసులు సూచించారు.

Also Read: సెకండ్ హ్యాండ్ ధరకే కొత్త కార్లు.. అన్‌రిజిస్టర్డ్ డెమో వాహనాలపై అదిరిపోయే ఆఫర్లు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report

బరువు తగ్గడానికి తేనె, గోరువెచ్చని నీరు నిజంగా పనిచేస్తుందా?

Hyderabad, Telangana:

Warm Honey Water: ప్రతిరోజూ ఉదయం పరగడుపున ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో స్పూన్ తేనె కలుపుకుని తాగడం చాలా మంది భారతీయులకు అలవాటుగా ఉంటుంది. ఇటీవల సోషల్ మీడియాతో కొందమంది స్టార్స్‌ కూడా ఈ నీటినితాగడం వల్ల ఈ అలవాటు మరింత పెరిగింది. ఉదయాన్నే ఈ నీటిని తాగితే శరీరంలో కొవ్వు కరిగిపోయి.. వేగంగా బరువు తగ్గుతారని చాలామంది నమ్ముతున్నారు. అయితే, ఈ పాపులర్  మార్నింగ్ డ్రింక్‌ వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటో? నిజంగానే తేనె నీరు బరువును తగ్గిస్తుందా? అనే అంశంపై ఆరోగ్య నిపుణులు సంచలన విషయాలు వెల్లడించారు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

కొవ్వును నేరుగా కరిగిస్తుందా?
గోరువెచ్చని నీటిలో తేనె కలుపుకుని తాగడం వల్ల నేరుగా బరువు తగ్గుతారనడానికి లేదా శరీరంలోని బ్యాడ్‌ కొలెస్ట్రాల్‌ను స్పీడ్‌ కరిగిపోతుందనడానికి స్పష్టమైన ఆధారాలు లేవుట.. తేనె అనేది ఒక సహజసిద్ధమైన తీపి పదార్థం.. చక్కెరకు ప్రత్యామ్నాయంగా ఉన్నప్పటికీ.. తేనెలోనూ క్యాలరీలు ఉంటాయి. కాబట్టి దీనిని పరిమితికి మించి తీసుకుంటే.. శరీరంలో క్యాలరీల సంఖ్య పెరుగుతుంది. అలాగే, తేనె నీరు జీవక్రియను (Metabolism) పెంచి క్యాలరీలను కరిగిస్తుందనే..  ప్రచారం కూడా నిజం కాదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

అయితే, ఈ అలవాటు పూర్తిగా వ్యర్థమని నిపుణులు చెప్పకపోయినప్పటికీ.. దీనివల్ల కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వారు తెలుపుతున్నారు. ఉదయాన్నే ఎక్కువ క్యాలరీలు, అధిక చక్కెర ఉండే టీ, కాఫీ లేదా ప్రాసెస్ చేసిన జ్యూసులకు బదులుగా గోరువెచ్చని తేనె నీరు తాగడం వల్ల రోజూ తీసుకునే రిఫైన్డ్ షుగర్ పరిమాణం తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.. రోజూ ఉదయాన్నే ఈ నీటిని తీసుకోవడం వల్ల శరీరం రీహైడ్రేట్‌గా మారుతుంది.. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడానికి కూడా ఎంతగానో సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ప్రాసెస్ చేయని (Raw Honey) లేదా కోల్డ్-ఎక్స్‌ట్రాక్టెడ్ తేనెను వాడితే అందులోని సహజమైన ఎంజైమ్‌లు, యాంటీఆక్సిడెంట్లు శరీరానికి మంచి పోషకాలను కూడా అందిస్తాయి.

Also Read:  కొత్తిమీర కాడలు పారేస్తున్నారా? వంటల్లో ఈ 5 అద్భుతమైన మార్గాల్లో వాడేయండి!

శరీర బరువు తగ్గడం అనేది ఏ ఒక్క డ్రింక్‌తోనో సాధ్యమయ్యేది కాదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. సమతుల్యమైన పోషకాహారం, వ్యాయామాలు, తగినంత నిద్ర, ఆరోగ్యకరమైన జీవనశైలి పాటించడం వల్లే శాశ్వత బరువు సులభంగా తగ్గుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. గోరువెచ్చని తేనె నీరు అనేది ఆరోగ్యకరమైన జీవనశైలిలో ఒక భాగం (Complementary Practice) మాత్రమే తప్ప.. అదే పూర్తి పరిష్కారం కాదని నిపుణుల సూచిస్తున్నారు.

Also Read:  కొత్తిమీర కాడలు పారేస్తున్నారా? వంటల్లో ఈ 5 అద్భుతమైన మార్గాల్లో వాడేయండి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report
Advertisement

Bandi Sanjay On NEET: "ఢిల్లీలో అరాచక శక్తులు విద్యార్థులను రెచ్చగొడుతున్నాయి" కేంద్రమంత్రి బండి సంజయ్ కామెంట్స్!

Hyderabad, Telangana:

Bandi Sanjay On NEET Protest: నీట్ పేపర్ లీక్ వ్యవహారం లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో, వారి తల్లిదండ్రుల భావోద్వేగాలతో ముడిపడి ఉన్న అంశమని కేంద్ర మంత్రి బండి సంజయ్ పేర్కొన్నారు. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ అందరికంటే ఎక్కువగా బాధపడుతున్నారని ఆయన తెలిపారు. దీంతో పాటు నీట్ (NEET) పేపర్ లీకేజీ వివాదం, ఢిల్లీ ఆందోళనలపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో ఈ విధంగా స్పందించారు.

ఇటీవలే నీట్ పేపర్ లీక్ కేసులో సీబీఐ వేగంగా స్పందించి, ఇప్పటివరకు 11 మంది ఫ్యాకల్టీ సహా మొత్తం 17 మంది నిందితులను అరెస్ట్ చేసిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రంగా బాధపడుతున్నారని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. దోషులకు త్వరితగతిన కఠిన శిక్ష పడేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేశామని ఆయన స్పష్టం చేశారు.

విద్యార్థుల విద్యా సంవత్సరం నష్టపోకూడదనే ఉద్దేశంతో విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ క్షమాపణలు చెప్పడమే కాకుండా, కేవలం 40 రోజుల్లోనే తిరిగీ పరీక్షలు నిర్వహించి ఫలితాలు కూడా ప్రకటించామని వివరించారు.

ఆందోళనల వెనుక కుట్రలు
విద్యార్థుల ఆందోళనల ముసుగులో కమ్యూనిస్టు, కమ్యూనల్ శక్తులు ఢిల్లీలో తీవ్ర అరాచకాలను సృష్టించాయని కేంద్రమంత్రి బండి సంజయ్ ఆరోపించారు. నిరసనల పేరుతో పార్లమెంట్‌పై దాడికి కుట్ర పన్నుతూ, దేశ వ్యతిరేక నినాదాలు చేశారని మండిపడ్డారు. అలాగే ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద పోలీసులు, మహిళా జర్నలిస్టులపై దాడులు చేస్తూ అసభ్యంగా ప్రవర్తించారని ఆవేదన వ్యక్తం చేశారు.

"నీట్ ప్రశ్నాపత్రం లీకేజీకి ఆర్టికల్ 370 రద్దుకు, ఆజాద్ కాశ్మీర్ నినాదాలకు, బంగ్లాదేశ్-పాకిస్తాన్ రాజకీయాలకు ఏం సంబంధం? చివరికి సనాతన ధర్మానికి, రాముడికి, సీతమ్మకు నీట్ వివాదానికి లింక్ ఏంటి?" అని ఆయన ప్రశ్నించారు.

పాకిస్తాన్ సోషల్ మీడియా కుట్ర
ఆందోళనకారులు జరిపిన హింసలో 118 మంది పోలీసుల తలలు పగిలినా, వారు ఎంతో నిగ్రహంతో వ్యవహరించి తుపాకీ కాల్పులు జరపలేదని గుర్తుచేశారు. అయితే పరిస్థితి చెయ్యి దాటిపోయే క్రమంలోనే అరాచక శక్తులపై తప్పనిసరి పరిస్థితుల్లో లాఠీఛార్జ్ చేయాల్సి వచ్చిందన్నారు.

ఈ ఆందోళనలకు పాకిస్తాన్ నుండి సోషల్ మీడియా ద్వారా విషప్రచారం చేస్తూ ఉద్రిక్తతలు సృష్టిస్తున్నారని తెలిపారు. దీనిని అరికట్టేందుకు పాకిస్తాన్‌కు చెందిన 480 సోషల్ మీడియా ఖాతాలను కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే బ్లాక్ చేసిందని వివరించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ కుట్రలను అర్థం చేసుకోవాలని ఆయన కోరారు.

Also Read: పేపర్ లీక్ చేస్తే రూ.10 కోట్ల జరిమానా, పదేళ్ల జైలు శిక్ష..బిల్లుకు క్యాబినేట్ ఆమోదం?

Also Read: పోలీస్ వ్యాన్‌ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

లింక్ క్లిక్ చేయక్కర్లేదు.. జీరో-క్లిక్‌తో ఫోన్లు హ్యాక్ చేస్తున్న ఇజ్రాయెల్‌!

Hyderabad, Telangana:

Graphite Spyware Telugu Latest News: సైబర్ నేరగాళ్లు మన ఫోన్‌ను హ్యాక్ చేయాలంటే.. ఏదో ఒక లింక్‌ను క్లిక్ చేయడమో.. లేదా ఒక తెలియని ఫైల్‌ను డౌన్‌లోడ్ చేయడం వల్ల జరిగి ఉంటుందని అనుకుంటూ ఉంటాము.. కానీ, ఇప్పుడు ఆ అవసరం లేకుండానే మీ స్మార్ట్‌ఫోన్ ఇతరుల అధీనంలోకి వెళ్ళిపోయే ప్రమాదం వచ్చేసింది.. ఇజ్రాయెల్‌కు చెందిన ప్రముఖ సైబర్ ఇంటిలిజెన్స్ సంస్థ పరాగన్ సొల్యూషన్స్ (Paragon Solutions) తయారు చేసిన  గ్రాఫైట్ (Graphite) అనే అత్యంత శక్తివంతమైన స్పైవేర్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది.. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ఏంటి ఈ జీరో-క్లిక్ ఎటాక్?
సాధారణంగా వచ్చే సైబర్ దాడులకు భిన్నంగా.. గ్రాఫైట్ స్పైవేర్ జీరో-క్లిక్ (Zero-Click) సాంకేతికతతో పనిచేస్తుందని సమాచారం. అంటే స్మార్ట్‌ఫోన్స్‌ను వినియోగించేవారు ఏ రకమైన నోటిఫికేషన్‌పై క్లిక్ చేయకపోయినా.. ఎలాంటి ఫైల్ డౌన్‌లోడ్ చేయకపోయినా ఈ స్పైవేర్ సైలెంట్‌గా ఫోన్‌లోకి ప్రవేశిస్తుందట.. ఆపరేటింగ్ సిస్టమ్‌లోని లొసుగులను (Vulnerabilities) ఆసరాగా చేసుకుని.. వినియోగదారుడికి కనీసం అనుమానం కూడా రాకుండా ఇన్‌స్టాల్ అయిపోతుంది. ఒక్కసారి ఇది ఫోన్‌లోకి ప్రవేశించిందంటే.. ఇక ఆ ఫోన్ మీ నియంత్రణలో లేనట్లే..

హ్యాకర్ల చేతుల్లోకి డేటా ..
గ్రాఫైట్ స్పైవేర్ ఒకసారి డివైజ్‌లోకి ప్రవేశించిన తర్వాత ఫోన్‌లోని దాదాపు ప్రతి విభాగాన్నీ యాక్సెస్ చేసే సామర్థ్యం కలిగి ఉంటుందని కంపెనీ తెలిపిన్నట్లు సమాచారం.. ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఉన్న యాప్‌ల మెసేజ్‌లను కూడా ఇది ఎంతో సులభంగా సేకరించే అవకాశాలు కూడా ఉన్నాయి. గ్యాలరీలో ఉన్న వ్యక్తిగత డేటాను కూడా ఎంతో సులభంగా సేకరిస్తుంది.. మీ ఫోన్ నెట్‌వర్క్, మీరు మాట్లాడే వ్యక్తుల వివరాలను నిఘా వర్గాలకు చేరవేస్తుందని కంపెనీ తెలిపిన్నట్లు సమాచారం.. మీరు ఎక్కడున్నారో నిమిషాల వ్యవధిలో జీపీఎస్ ద్వారా ట్రాక్ చేస్తుంది.

ఎవరిని లక్ష్యంగా చేసుకుంటున్నారు?
తాజా సమాచారం ప్రకారం.. ఈ స్పైవేర్‌ను ప్రధానంగా రాజకీయ నాయకులతో పాటు మానవ హక్కుల కార్యకర్తలు, విలేకరులు, ఉన్నతాధికారులు, ప్రముఖ వ్యాపారవేత్తలను లక్ష్యంగా చేసుకుని ఉపయోగిస్తున్నట్లు ఆరోపణలు కూడా విపరీతంగా వస్తున్నాయి. ప్రభుత్వాలు లేదా నిఘా సంస్థలు తమ ప్రత్యర్థులపై లేదా అనుమానితులపై నిఘా పెట్టేందుకు ఇటువంటి సాధనాలను ఉపయోగిస్తున్నాయని డిజిటల్ హక్కుల సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తూ వస్తున్నాయి..

Also Read: సెకండ్ హ్యాండ్ ధరకే కొత్త కార్లు.. అన్‌రిజిస్టర్డ్ డెమో వాహనాలపై అదిరిపోయే ఆఫర్లు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report
Advertisement

Barley Water Benefits: షుగర్, హై-బీపీ చిటికెలో తగ్గే ఇంటి చిట్కా..ఈ నీళ్లు తాగితే కిడ్నీలు కూడా సేఫ్!

Hyderabad, Telangana:

Barley Water Health Benefits: ప్రాచీన కాలం నుండి వస్తున్న సాంప్రదాయ ఆరోగ్య పానీయాలలో బార్లీ నీళ్లు చాలా ముఖ్యమైనవి. బార్లీ గింజల్లో పుష్కలమైన పోషకాలు, మూలికా/ఔషధ గుణాలు ఉండటం వల్ల ఇవి అనేక ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడం దగ్గర నుంచి కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడటం వరకు బార్లీ నీళ్లు చేసే మేలు అంతా ఇంతా కాదు.

బార్లీ నీటిని ఎలా తయారు చేసుకోవాలి?
గుప్పెడు బార్లీ గింజలను నీటిలో వేసి బాగా మరిగించాలి. ఆ నీటిని వడకట్టి, గోరువెచ్చగా ఉన్నప్పుడు అందులో కొద్దిగా తేనె, నిమ్మరసం కలిపి తాగిస్తే మంచి ఫలితాలు ఉంటాయి.

బార్లీలో ఉండే పోషకాలు
బార్లీలో విటమిన్ బి-కాంప్లెక్స్, ఇనుము (ఐరన్), కాల్షియం, మెగ్నీషియం, మాంగనీస్, సెలీనియం, జింక్, ప్రోటీన్, అమైనో ఆమ్లాలు, పీచు పదార్థం (ఫైబర్), బీటా-గ్లూకాన్, శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి.

బార్లీ నీటి వల్ల కలిగే ముఖ్య ప్రయోజనాలు
షుగర్, బీపీ కంట్రోల్.. గుండె ఆరోగ్యం
బార్లీలోని బీటా-గ్లూకాన్ రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరగకుండా అడ్డుకుంటుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచడం ద్వారా రక్తనాళాల్లో అడ్డంకులు కలగకుండా చూస్తుంది. ఫలితంగా బీపీ అదుపులో ఉండి, గుండెపోటు (హార్ట్ ఎటాక్) ప్రమాదం తగ్గుతుంది.

కిడ్నీలు సురక్షితం
బార్లీ నీటికి శరీరంలోని విషపదార్థాలను (టాక్సిన్స్) బయటకు పంపే అద్భుతమైన గుణం (డిటాక్సిఫైయింగ్) ఉంది. ఇది కిడ్నీల పనితీరును మెరుగుపరుస్తుంది. కిడ్నీ స్టోన్లను కరిగించడంలో సహాయపడుతుంది.

మెరుగైన జీర్ణ వ్యవస్థ.. బరువు తగ్గుదల
బార్లీలోని ఫైబర్ 'ప్రీ బయోటిక్'గా పనిచేసి జీర్ణవ్యవస్థలో మంచి బ్యాక్టీరియాను పెంచుతుంది. దీనివల్ల అజీర్తి, గ్యాస్, కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలు తగ్గుతాయి. బాడీ మెటబాలిజాన్ని పెంచి, క్యాలరీలను వేగంగా కరిగిస్తుంది. అధిక బరువు తగ్గానికి, అతిగా తినే అలవాటును అదుపు చేయడానికి ఇది బాగా తోడ్పడుతుంది.

రోగనిరోధక శక్తి
శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలను అందించి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. వేసవిలో లేదా అలసటగా ఉన్నప్పుడు ఇది సహజసిద్ధమైన 'రిఫ్రెషింగ్ డ్రింక్'లా పనిచేసి, శరీరం కోల్పోయిన ద్రవాలు, ఎలక్ట్రోలైట్లను తక్షణమే భర్తీ చేస్తుంది.

గమనిక: ఇది కేవలం సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి ఆహారంలో మార్పులు చేసుకునే ముందు వైద్యులను లేదా పోషకాహార నిపుణులను సంప్రదించడం మంచిది.

Also Read: ఈ స్పెషల్ రైస్ రోజూ తింటే షుగర్ కంట్రోల్ అవుతుంది! ఇది ఎంత తిన్నా మధుమేహం దరిచేరదు!

Also Read: Chicken Cancer Risk: చికెన్ అతిగా తింటే క్యాన్సర్ వస్తుందా?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Indiramma Indlu: ఇందిరమ్మ ఇళ్లపై హైదరాబాద్‌ ప్రజలకు భారీ శుభవార్త.. ఏమిటో తెలుసా?

Hyderabad, Telangana:

Hyderabad Indiramma Indlu: గ్రామీణ ప్రాంతాల తర్వాత తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ల ఇందిరమ్మ ఇళ్లపై దృష్టి సారించింది. ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తులు ప్రారంభమవగా దీనిపై తాజాగా ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. జనావాసాల పరిధిలోనే ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇస్తామని ప్రకటించింది. హైదరాబాద్‌లో 7680 ఇందిరమ్మ ఇళ్ల ప్లాట్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ముఖ్యమంత్రి నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇందిరమ్మ ఇండ్లు జనావాసాల పరిధిలోనే ఉండేలా చూడాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. 

హైదరాబాద్‌లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై ముఖ్యమంత్రి శుక్రవారం ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఔటర్ రింగ్ రోడ్డు లోపల వివిధ శాఖలకు  సంబంధించి నిరుపయోగంగా ఉన్న స్థలాలను గుర్తించాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో గుర్తించిన స్థలాల వివరాలను అధికారులు సీఎం  దృష్టికి తీసుకెళ్లారు. పోలీస్, రెవెన్యూ, రవాణా శాఖలకు సంబంధించి ఇప్పటికే గుర్తించిన నిరుపయోగ స్థలాలను తీసుకుని.. వేరేచోట సంబంధిత శాఖలకు స్థలాన్ని కేటాయించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

జనావాసాలకు దూరంగా ఇందిరమ్మ ఇండ్లను కేటాయిస్తే ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు ఇబ్బందులు తలెత్తడంతో పాటు అవి నిరుపయోగంగా మారే అవకాశం ఉందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. దూరప్రాంతాలు కాకుండా పని ప్రదేశాలకు దగ్గరగా.. జనావాసాల పరిధిలోనే ఇందిరమ్మ ఇండ్లు నిర్మించేలా చూడాలని సూచించారు. దీంతో నిరుపేదలు జీవనోపాధి కోల్పోకుండా ఉంటారని తెలిపారు. హైదరాబాద్‌లోని పలు నియోజకవర్గాల పరిధిలో పేదలకు  ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇస్తామని ప్రభుత్వం పునరుద్ఘాటించింది. సంబంధిత నియోజకవర్గాల పరిధిలో నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ స్థలాలను గుర్తించే ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, ఆర్ అండ్ బీ  స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్, డీజీపీ సీవీ ఆనంద్, ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీలు శ్రీధర్, శేషాద్రి, రెవెన్యూ కార్యదర్శి లోకేష్ కుమార్, హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, హౌజింగ్ స్పెషల్ సెక్రెటరీ గౌతమ్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆల పాల్గొన్నారు.

ఇందిరమ్మ ప్లాట్ల స్వరూపం
ఒక్కో ఫ్లాట్ దాదాపు 528 చదరపు అడుగుల విస్తీర్ణం
400 చదరపు అడుగుల కార్పెట్ ఏరియా
నిర్మాణ వ్యయం: దాదాపు kp.11 లక్షలు
సబ్సిడీ: రూ.5 లక్షలు
లబ్ధిదారుడు చెల్లించిన రుసుము: రూ.6 లక్షలు

ఇందిరమ్మ ఇళ్ల తొలి దశ
హైదరాబాద్‌లో నిర్మించాలనుకున్న ఇందిరమ్మ ఇళ్ల తొలి దశ త్వరలో ప్రారంభం కానుంది. నగరంలోని 17 నియోజకవర్గాల్లో 7,680 ఫ్లాట్లు నిర్మించి ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.  రాజేంద్రనగర్, మహేశ్వరం, శేరిలింగంపల్లి, ఇబ్రహీంపట్నం, మల్కాజ్‌గిరి, నాంపల్లి, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, కార్వాన్, బహదూర్‌పురా, అంబర్‌పేట్, కూకట్‌పల్లి, మేడ్చల్, కుత్బుల్లాపూర్, సనత్ నగర్, సికింద్రాబాద్ కంటోన్మెంట్, మలక్‌పేట్ నియోజకవర్గాల్లో ప్రభుత్వం తొలి విడతలో ఇందిరమ్మ ఇండ్లను నిర్మించనుంది.

0
0
Report

మౌస్ కింద రెడ్ లైట్ ఎందుకు ఉంటుందో తెలుసా?

Hyderabad, Telangana:

Red Light In Mouse News: మనం ప్రతిరోజూ ఆఫీసుల్లో లేదా ఇళ్లలో కంప్యూటర్, ల్యాప్‌టాప్‌లు ఉపయోగిస్తున్నప్పుడు మౌస్ (Computer Mouse) వాడటం సర్వ సాధారణం.. మౌస్‌ను పైకి లేపి చూసినప్పుడు.. దాని అడుగు భాగంలో ఎర్రటి లైట్‌(Red Light) వెలుగుతూ మనకు కనిపిస్తుంది. అయితే, ఎప్పుడు దీనిని చూసినప్పుడు చాలామందికి ఎన్నో సందేహాలు కలుగుతూ ఉంటాయి. అసలు అక్కడ లైట్ ఎందుకు ఉంటుందని.? అది కూడా ఎరుపు రంగులోనే ఎందుకు వెలుగుతుందని?.. పచ్చ, నీలం లేదా ఇతర రంగులు ఎందుకు వాడరని? దీని వెనుక ఉన్న కొన్ని ఆసక్తికరమైన సాంకేతిక కారణాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఆప్టికల్ టెక్నాలజీ?
పూర్వ కాలంలో వాడిన మౌస్‌ల అడుగున ఒక చిన్న రబ్బర్ బాల్ (Trackball) ఉండేది.. కానీ ఆధునిక మౌస్‌లు ఆప్టికల్ టెక్నాలజీ (Optical Technology)పై పనిచేస్తాయని టెక్ నిపుణులు చెబుతున్నారు. ఈ ఆప్టికల్ మౌస్‌లలో ఒక చిన్న LED (Light Emitting Diode), ఒక కాంతి సెన్సార్ (CMOS Sensor)లు ఉంటాయి.

మౌస్ అడుగున ఉండే LED లైట్ సర్ఫేస్‌పై లైట్‌ను వెలిగించేందుకు క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. సెన్సార్ క్షణానికి వేలాది చిత్రాలను (Microscopic Images) తీసి.. మౌస్ ఏ దిశలో ఎంత వేగంగా కదులుతుందో లెక్కిస్తుంది. ఆ సమాచారం ఆధారంగానే కంప్యూటర్ స్క్రీన్‌పై ఉన్న కర్సర్ (Cursor) కదులుతుందని నిపుణులు తెలుపుతున్నారు.

ప్రత్యేకంగా ఎరుపు రంగునే ఎందుకు వాడుతూ ఉంటారు?
మౌస్‌లలో ఎరుపు రంగు LED ఉపయోగించడానికి ప్రధానంగా మూడు కారణాలు ఉన్నాయి.. ఆప్టికల్ మౌస్‌లను అభివృద్ధి చేసిన ప్రారంభ రోజుల్లో రెడ్ ఎల్‌ఈడీలు మిగతా రంగుల ఎల్‌ఈడీలతో పోలిస్తే.. చాలా చౌకగా, సులభంగా లభించేవి.. దీనివల్ల మౌస్ తయారీ ఖర్చు తగ్గిందని సమాచారం.

తక్కువ విద్యుత్ వినియోగం..
రెడ్‌ కలర్ LEDలు పనిచేయడానికి తక్కువ విద్యుత్ (Low Voltage) అవసరమవుతుంది. వైర్డ్ మౌస్‌లలో ఇది కంప్యూటర్ నుంచి తక్కువ పవర్‌ను గ్రహిస్తుందని సమాచారం. వైర్‌లెస్ మౌస్‌లలో అయితే బ్యాటరీ సుదీర్ఘకాలం పనిచేయడానికి ఎంతగానో సహాయపడతాయి. ఆప్టికల్ మౌస్‌లలోని లైట్‌ సెన్సార్లు (Photodiodes) ఎరుపు రంగు లైట్‌కు(Red Wavelength) చాలా సున్నితంగా స్పందిస్తాయి. 

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

రెడ్ లైట్‌ వివిధ రకాల చోట్ల పడినప్పుడు స్పష్టంగా వెలుగుతుంది.. దీనివల్ల కర్సర్ మూవ్‌మెంట్ చాలా ఖచ్చితంగా (Accurate) ఉంటుందని సమాచారం. ప్రస్తుతం సాంకేతికత పెరిగిన తర్వాత మార్కెట్లో ఎటువంటి లైట్‌ కనిపించని (Invisible Light/Infrared) లేజర్ మౌస్‌లు, అలాగే గ్లాస్ పైన కూడా పనిచేసే బ్లూట్రాక్ (Blue Light) మౌస్‌లు అందుబాటులోకి వచ్చాయి. అయినప్పటికీ.. తక్కువ ధరలో లభించే ఆప్టికల్ మౌస్‌లలో ఇప్పటికీ ఎరుపు రంగు లైట్‌నే వినియోగిస్తున్నారు. 

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report
Advertisement

మోదీపై కొట్లాడితే రేవంత్‌ రెడ్డికి ఎందుకు కోపం? నీట్‌ విద్యార్థుల మహాధర్నాలో కేటీఆర్‌

Hyderabad, Telangana:

NEET Students Protest: 'మోదీపైన నేను కొట్లాడితే రేవంత్ రెడ్డి అనే కేడీకి ఎందుకు కోపం వచ్చింది? మోడీ తప్పు చేసిండు అంటే రేవంత్ రెడ్డికి ఎందుకు కోపం?' అని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ప్రశ్నించారు.  మోదీని ప్రశ్నిస్తే యూత్ కాంగ్రెస్‌ని ఎందుకు పంపించి నన్ను అడ్డుకుంటున్నాడు రేవంత్ రెడ్డి చెప్పాలని నిలదీశారు. 'రాహుల్ గాంధీ ఢిల్లీలో కొట్లాడితే కొడంగల్‌లో పోయి రేవంత్ రెడ్డి దాక్కున్నాడు. నల్లమల్ల పిల్లి వోయి కొడంగల్‌లో దాక్కున్నది' అని విమర్శించారు. రేవంత్ రెడ్డి కూతురునో, మనవడినో ఢిల్లీలో పిల్లల్ని కొట్టినట్లు కొడితే రేవంత్ రెడ్డి ఊరుకుంటాడా? అని ప్రశ్నించారు.

'ఢిల్లీ దాకా వెళ్లి మీ నాయకుడితో కూర్చుండి నిరసన తెలిపే ధైర్యం కూడా రేవంత్ రెడ్డికి లేదు. దేశమంతా నరేంద్ర మోదీని, ధర్మేంద్ర ప్రధాన్‌ని ప్రశ్నిస్తుంటే రేవంత్ రెడ్డి మాత్రం కేసీఆర్, కేటీఆర్‌ని విమర్శిస్తున్నాడు. మేము మాట్లాడుతుంటే మమ్మల్ని ఎందుకు అడ్డుకుంటున్నాడు రేవంత్ రెడ్డి చెప్పాలి' అని మరోసారి మాజీ మంత్రి కేటీఆర్‌ ప్రశ్నించారు. 'ఢిల్లీని వణకించి తెలంగాణ తెచ్చిన పార్టీ మాది. అవసరమైతే ఢిల్లీకి వెళ్లి గడగడలాడించి అయినా విద్యార్థుల వెంట నిలబడతాం' అని ప్రకటించారు.

'నీకు ఎలాగూ ఢిల్లీని ప్రశ్నించే ధైర్యం లేదు రేవంత్ రెడ్డి. మమ్మల్ని ఎందుకు ఆపుతున్నాడో రేవంత్ రెడ్డి చెప్పాలి' అని మాజీ మంత్రి కేటీఆర్‌ సవాల్‌ చేశారు. 'విద్యార్థులు, యువతరం స్వతంత్రంగానే కొట్లాడాలి. రాజకీయ పార్టీల అజెండాను మీ ఉద్యమంలో చూపించకుండా చూసే ప్రయత్నాన్ని ఆపండి. మీ అజెండాను హైజాక్ చేసే ప్రయత్నం చేస్తున్నారు జాగ్రత్తగా ఉండండి. స్వతంత్రంగానే మీ అజెండా మేరకు మీ ఉద్యమాన్ని కొనసాగించండి' అని సూచనలు చేశారు. మీకు బీఆర్‌ఎస్‌ పార్టీ సంపూర్ణ సంఘీభావం మద్దతు ఉంటుందని ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ప్రకటించారు.

పార్టీలతో కలిసి మీరు కొట్లాడితే మిమ్మల్ని ఆయా పార్టీల ఏజెంట్లు అని మీ ఉద్యమాన్ని, మీ డిమాండ్లను బలహీనపరిచే ప్రమాదం ఉన్నదని విద్యార్థి లోకానికి మాజీ మంత్రి కేటీఆర్‌ హెచ్చరించారు. అవసరమైతే గల్లా పట్టి బయటకి గుంజవలసిన, బజార్ jకు గుంజవలసిన పరిస్థితి కూడా వస్తదని పేర్కొన్నారు. ఇద్దరు ఎంపీలతో ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ తెచ్చిన కేసీఆర్ స్ఫూర్తితో ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. విద్యార్థులు, యువతకు అండగా నిలబడదామని చెప్పారు.

'సమాజంలో జరుగుతున్న ప్రతి కష్టాన్ని, ప్రతి వర్గం ఆకాంక్షల్ని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పటికప్పుడు గమనిస్తున్నారు. విద్యార్థుల కోసం.. యువత కోసం కేసీఆర్ సందర్భంలో వచ్చి మీ వెంట నిలుస్తారు. కేసీఆర్ గతంలోనే చెప్పారు దేశానికి అవసరం పడ్డ రోజు ప్రతి ఒక్కరు స్పందిస్తారు. దేశాన్ని కాపాడుకుంటారు అని. ఆనాడే 'ఇండియా రియాక్ట్స్' అని కేసీఆర్‌ స్పష్టంగా చెప్పారు' అని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ గుర్తుచేశారు.

నీట్‌ అంశంలో విద్యార్థుల పోరాటానికి సమాధానం చెప్పే సత్తా ఉందా కేంద్ర ప్రభుత్వానికి? మాజీ మంత్రి కేటీఆర్‌ ప్రశ్నించారు. సమాధానం చెప్పే ధైర్యం ఉందా ఈ నాయకత్వానికి? అని నిలదీశారు. గొంతు విప్పితే మీకు వ్యతిరేకంగా గళం విప్పితే ఇవాళ ఇష్టం వచ్చినట్టు గొంతు నొక్కే ప్రయత్నం చేస్తా ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియాతో అజెండా సెట్ చేసే రాజకీయం నడవదని స్పష్టం చేశారు. మీడియాను అడ్డం పెట్టుకొని వ్యక్తిత్వ హననాలు చేసే రాజకీయం నడవదు అని ప్రకటించారు.

0
0
Report

KTR: జెన్ జీ యువతరంతో పెట్టుకోవద్దు.. ప్రధాని మోదీని హెచ్చరించిన కేటీఆర్‌

Hyderabad, Telangana:

NEET Paper Leak Row: 'మోదీ మీరు పెట్టుకోకూడని వారితో పెట్టుకున్నారు, యువతరంతో పెట్టుకున్నారు. జాగ్రత్త పడండి. స్వరం మారుతున్నది స్వరం మారుతున్నది రాజ్యం ఉలికి పడు' అని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ గర్జించారు. స్వరం మారుతున్నది, నవతరం మారుతున్నది అని కేంద్రం తెలుసుకోవాలని హితవు పలికారు. 'శ్రీలంకలో ఈ యువతరం ఉరికించి ప్రభుత్వాలను పాతరేసింది. అలాంటి యువతరంతో పెట్టుకోవద్దు' అని మోదీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

ఢిల్లీలో విద్యార్థుల పోరాటానికి సంఘీభావంగా భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) పార్టీ విద్యార్థి విభాగం ఇందిరా పార్కులో భారీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరైన యువతను ఉద్దేశించి బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కీలక ప్రసంగం చేశారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేయడమే కాకుండా రేవంత్‌ రెడ్డి ప్రభుత్వంపై విమర్శలు చేశారు. 

'తమ హక్కుల కోసం పోరాడుతున్న యువతరాన్ని తీవ్రవాదులు, దేశద్రోహులు, పాకిస్తానీలు అంటూ అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. కేంద్రానికి బాధ్యత ఉంటే విద్యార్థుల వద్దకు వెళ్లి ఇప్పటికే అనేకసార్లు చర్చలు చేసి సమస్యలు పరిష్కరించాల్సి ఉండే. ఈ యువతరం సీబీఐ, ఈడీ, ఐటీలకు భయపడేది కాదు అని మోడీ తెలుసుకోవాలి' అని మాజీ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. తెలంగాణ యువతతో పాటు దేశం యువత ఆగ్రహంతో ఉన్నారని.. పొట్టు పొట్టు కోపంగా ఉన్నారని తెలిపారు. 'నిన్ను నీ ప్రభుత్వాన్ని మెట్టు మెట్టు ఎక్కి తొక్కుతారు. ఈ విషయాన్ని మోడీ ప్రభుత్వం గుర్తుంచుకోవాలి' అని కేటీఆర్‌ సూచించారు.

'యువతరానికి ఏ రాజకీయ నాయకుడి అండ లేదు. దేశవ్యాప్తంగా అన్ని నగరాల్లో వేలాదిమంది తరలి  వస్తున్నారు. యువతరం ఆందోళన ఆగ్రహం కేవలం పేపర్ లీక్ కి సంబంధించిందే కాదు. 12 ఏళ్లుగా కేంద్రం చేస్తున్న మోసాలు, ద్రోహాలపైన ఆగ్రహం. అసలు పని చేయకుండా కేవలం మతం పేరుతో తప్పించుకుంటున్న తీరుని యువతరం అర్థం చేసుకున్నది. సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్న మోడీ 24 కోట్ల ఉద్యోగాలు ఇయ్యలేనందుకే యువతరం ఈరోజు బయటకు వచ్చింది' అని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తెలిపారు.

'మేకిన్ ఇండియా అడిగితే లీకిన్ ఇండియా బీజేపీ ఇచ్చింది. విద్యార్థులు యువతరం కేంద్రం నుంచి జవాబుదారితనాన్ని అడుగుతున్నది. కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే తప్పైందా అని యువతరం అడుగుతున్నది, నిలదీస్తున్నది. ఈరోజు చేపట్టిన నిరసనలో ఎలాంటి రాజకీయాలు లేవు. విద్యార్థులకు జరుగుతున్న నష్టాన్ని చూడలేకనే ప్రజాప్రతినిధులుగా, నాయకులుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం' అని మాజీ మంత్రి కేటీఆర్‌ ప్రకటించారు.

అంబేద్కర్ స్ఫూర్తితో పోరాటం చేసి తెలంగాణ సాధించిన ఉద్యమ పార్టీగా విద్యార్థుల ఉద్యమానికి అండగా ఉండాలనుకున్నామని మాజీ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. పార్టీల జెండాలు, ఎజెండాలతో వారి ఉద్యమానికి కలుషితం చేయవద్దని హితవు పలికారు. 'కానీ వారికి అండగా ఉండాల్సిన అవసరం ఉన్నది. విద్యార్థులు ఒక్కరే కాదు వారందరికీ మనమంతా అండగా ఉన్నామని చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన దాష్టికాన్ని అణచివేతను చూస్తే ఎవరి మనసైనా కరగాల్సిందే' అని పేర్కొన్నారు. 

'విద్యార్థులు అడిగిన దాంట్లో అన్యాయం ఏమున్నది? వాళ్లు అడిగింది కేవలం తమకు న్యాయం చేయమని తమ భవిష్యత్తును కాపాడమని. యువతరం ప్రధానమంత్రి కుర్చీ అడిగిందా? కేంద్రమంత్రి కుర్చీ అడిగిందా?' కేంద్ర ప్రభుత్వాన్ని బీఆర్ఎస్‌ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ప్రశ్నించారు. నీట్ పరీక్షా పత్రం పేపర్ లీక్‌తో పాటు విద్యారంగంలో సంస్కరణ రావాలని సోనమ్ వాంగ్చుక్ నిరసనకు కూర్చున్నారని తెలిపారు. మీడియా మద్దతు లేకున్నా సోషల్ మీడియాతోనే జెన్ జీ యువతరం దేశం మొత్తాన్ని కదిలించిందని చెప్పారు.

'ఇదే తెలంగాణ గడ్డ నుంచి 50 ఏళ్ల కింద జీనా హై తో మర్నాసికో కదం కదం పర్ లడ్నాసికో అని ఒక యువకుడు పిలుపునిచ్చాడు. ఆ స్ఫూర్తితో తెలంగాణ యువత, దేశ యువత గట్టిగా కొట్లాడుతున్నది. దేశంలోని ఆడబిడ్డలను పోలీసులు తీవ్రంగా దాడి చేస్తున్నారు. కొట్టకూడని చోట కొడుతున్నారు' అని ఢిల్లీ పోలీసుల దాష్టీకంపై మాజీ మంత్రి కేటీఆర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులకు యువతకు సంఘీభావంగా రాజకీయాలతో సంబంధం లేకుండా బీఆర్‌ఎస్‌ పార్టీ ధర్నా చేపట్టిందని వివరించారు.

'విద్యార్థులు కోరుతున్నట్లుగా ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయాలి. విద్యార్థులపై పెట్టిన పోలీసు కేసులను బేషరతుగా వెనక్కి తీసుకోవాలి. విద్యార్థులపై చేసిన దాష్టికానికి అక్రమ కేసుల నమోదుకు క్షమాపణ చెప్పాలి' అని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. దేశంలో కేంద్ర మంత్రుల కొడుకులు రేపులు చేస్తే వెంటనే బెయిల్ వస్తున్నాయి కానీ పేపర్ లీకుల పైన ఎంత అడిగినా సమాధానం మాత్రం ఎందుకు రావడం లేదని పరోక్షంగా బండి భగీరథ్‌ కేసు అంశాన్ని మాజీ మంత్రి కేటీఆర్‌ గుర్తుచేశారు.

'ఏ దేశం కోసం? ఏ ధర్మం కోసం? పేపర్ లీకులపైన సమాధానం చెప్పడం లేదు. భారతీయ జనతా పార్టీ నాయకులు చెప్పాలి. అడగవలసిన అవసరం ఉన్నది, నిలదీయాల్సిన అవసరం ఉన్నది' అని విద్యార్థి లోకానికి మాజీ మంత్రి కేటీఆర్‌ సూచించారు. చేసిన విద్యార్థుల నిరసన కార్యక్రమంలో రాజకీయాలకు చోటు లేదు, పార్టీల జెండాలు లేవు.. నాయకత్వాలు లేవు, రాజకీయ అజెండా లేదని ప్రకటించారు.

 

'కాక్రోచ్ ల మాదిరిగా భారతదేశ రాజధాని ఢిల్లీకి వెళ్లి కాక్రోచ్‌లను అవమానిస్తే.. అవే కాక్చ్‌ లు ఢిల్లీ మీద దండయాత్ర చేస్తున్నాయి. వారికి రాజకీయం లేదు. వాళ్లు కోరుతున్నది ఒకటే ప్రధానమంత్రి ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. దేవుడి ముందు ప్రార్థన చేస్తున్న ప్రధానమంత్రి , పరీక్షా పే చర్చా కర్నేవాలే ప్రధానమంత్రి జీ, పరీక్షా పే చర్చ ఎందుకు చేయట్లేవు? పరీక్షా లీక్ మీద ఎందుకు మాట్లాడవు? పరీక్ష మీద చర్చ అంటావు, పరీక్షా పే చర్చ అంటావు, పరీక్షా లీక్ మీద ఎందుకు మాట్లాడవు?' అని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ప్రశ్నించారు.

0
0
Report

కేవలం రూ.1కే Jiohotstar ప్రీమియం సబ్‌స్క్రిప్షన్.. ఎలా పొందాలి?

Hyderabad, Telangana:

Jiohotstar Dhamaka Offer: టెలికాం, డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలో ఎప్పటికప్పుడు మంచి ఆఫర్లతో ఆకట్టుకునే రిలయన్స్ జియో.. తాజాగా ఓటీటీ ప్రియుల కోసం ఒక అద్భుతమైన ప్రమోషనల్ ఆఫర్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చింది. కేవలం రూ.1 చెల్లించి.. ఏకంగా 30 రోజుల పాటు జియో హాట్‌స్టార్ ప్రీమియం (JioHotstar Premium) సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చని ప్రకటించింది. ప్రస్తుతం డిజిటల్ సబ్‌స్క్రిప్షన్ ధ‌ర‌లు రోజురోజుకూ పెరుగుతున్న సమయంలో రూపాయికే ఇలాంటి ఆఫర్‌ను అందించడం యూజ‌ర్ల‌కు అద్భుతమైన సంతోషాన్ని కలిగిస్తున్నట్ల భావించవచ్చు.. అయితే, ఈ స్పెషల్ ఆఫర్‌ను ఎలా పొందాలో? దీనికి సంబంధించిన పూర్తి ఆఫర్స్‌ వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఎవరికి ఈ ఆఫర్ వర్తిస్తుంది?
ఈ స్పెషల్ ఆఫర్ వినియోగదారులందరికీ అందుబాటులో లేదని కంపెనీ తెలిపింది.. దీనిని లిమిటెడ్ యూజర్లకు మాత్రమే ఆఫర్ రూపంలో అందుబాటులోకి తీసుకు వచ్చిన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా దీనిని ఎప్పుడు వినియోగించే చాలా మంది యూజర్స్‌కి అందిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ నిబంధనలు తప్పనిసరి..
యూజర్ తప్పనిసరిగా జియో (Jio) మొబైల్ నంబర్‌తోనే హాట్‌స్టార్ యాప్‌లో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది..అలాగే జియో నంబర్‌పై ఇదివరకు ఎలాంటి యాక్టివ్ హాట్‌స్టార్ ప్లాన్‌తో పాటు సబ్‌స్క్రిప్షన్ ఉండకూడదనే కండీషన్‌ కూడా ఉంది.. ఒకవేళ మీ హాట్‌స్టార్ యాప్‌లోని బ్యానర్‌లో రూ.1 ఆఫర్ కనిపిస్తేనే మీరు దీనికి అర్హులని భావించవచ్చు.. లేనివారికి ఈ ఆఫర్‌ లేనట్లేని సమాచారం..

రెండు డివైజ్‌లలో ఒకేసారి స్ట్రీమింగ్ సదుపాయం..
సాధారణంగా బడ్జెట్ ఆఫర్లలో అనేక పరిమితులు ఉంటూ ఉంటాయి.. కానీ ఈ రూ.1 ప్రమోషనల్ ప్లాన్‌లో వినియోగదారులు ఒకేసారి రెండు డివైజ్‌లలో స్ట్రీమింగ్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది.. అంటే మొబైల్ ఫోన్‌తో పాటు ల్యాప్‌టాప్‌తో పాటు స్మార్ట్ టీవీ లేదా టాబ్లెట్‌లో ఒకే ఖాతా ద్వారా సినిమాలు, వెబ్ సిరీస్‌లు, స్పోర్ట్స్ మ్యాచ్‌లను ఎలాంటి అదనపు డబ్బులు చెల్లించ లేకుండా సులభంగా వీక్షించవచ్చు..

ఆటో-రిన్యూవల్ జాగ్రత్త..
ఈ ఆఫర్‌ను ఉపయోగించుకునే క్రమంలో ఒక ముఖ్యమైన విషయాన్ని తప్పకుండా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. రూ. 1 చెల్లించి సబ్‌స్క్రిప్షన్ యాక్టివేట్ చేసుకున్నప్పుడు ఆటో రిన్యూవల్ (Auto-Renewal) ఆప్షన్ యాక్టివేట్ అయ్యే అవకాశం ఉంటుంది. 30 రోజుల ఉచిత, ప్రమోషనల్ గడువు ముగిసిన తర్వాత, మీ ఖాతా నుంచి రెగ్యులర్ ప్రీమియం ప్లాన్ చార్జీలు ఆటోమేటిక్‌గా డిడక్ట్ అవుతాయి.. దీంతో ఒక నెల తర్వాత ఈ సబ్‌స్క్రిప్షన్‌ను వద్దనుకుంటే.. ముందుగానే యాప్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి ఆటో-రిన్యూవల్‌ను క్యాన్సిల్ (Cancel Auto-Renewal) చేసుకోవాల్సి ఉంటుంది. 

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report
Advertisement

తగ్గేదేలే అంటున్న కాక్రోచ్‌ పార్టీ.. ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామాకు రేపు మధ్యాహ్నం డెడ్‌లైన్‌

New Delhi, Delhi:

Dharmendra Pradhan Resign: నీట్‌ పేపర్‌ లీక్‌ అంశం యావత్‌ భారతదేశాన్ని పాకింది. ప్రజాస్వామ్యబద్దంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు అమానుషంగా లాఠీచార్జ్‌ చేయడంతో నీట్‌ ఉద్యమం తార స్థాయికి చేరింది. దీంతో కాక్రోచ్‌ పార్టీ ధర్మేంద్ర ప్రదాన్‌ రాజీనామాపై వెనక్కి తగ్గడం లేదు. రేపటి మధ్యాహ్నం వరకు కాక్రోచ్‌ జనతా పార్టీ డెడ్‌లైన్‌ విధించింది. రాజీనామా చేయకపోతే ఉద్యమం తీవ్రస్థాయికి చేరుకుంటుందని హెచ్చరించింది.

కొన్ని నెలలుగా సాగుతున్న నీట్‌ విద్యార్థుల పోరాటానికి కేంద్ర ప్రభుత్వం తలొగ్గిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కాక్రోచ్‌ పార్టీ ప్రతినిధులతో కేంద్ర ప్రభుత్వం చర్చలు చేసింది. కొన్ని నిమిషాల పాటు సాగిన చర్చలు ముగిశాయి. కేంద్ర మంత్రులు నడ్డా, జితేంద్ర, కాక్రోచ్‌ పార్టీ తరఫున సౌరవ్ దాస్, అశుతోష్ పలు అంశాలపై గంటన్నరకు పైగా చర్చించారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, నీట్ లీకేజీతో ఆత్మహత్య చేసుకున్న వారి కుటుంబాలకు రూ.కోటి పరిహారం డిమాండ్ చేసినట్లు కాక్రోచ్‌ పార్టీ ప్రతినిధులు వెల్లడించారు. ఆందోళనకారులపై కేసులు కొట్టేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపారు. వీటిపై రేపు మధ్యాహ్నం వరకు కేంద్ర ప్రభుత్వానికి సమయం ఇచ్చినట్లు పేర్కొన్నారు.

చర్చల అనంతరం కేంద్ర మంత్రి జేపీ నడ్డా కీలక ప్రకటన చేశారు. కాక్రోచ్‌ జనతా పార్టీ ప్రతినిధులతో రెండు గంటల పాటు చర్చలు జరిపినట్లు జేపీ నడ్డా తెలిపారు. చర్చలు సానుకూల వాతావరణంలో జరిగాయని.. రేపు మధ్యాహ్నం చర్చలు తిరిగి కొనసాగుతాయని చెప్పారు. విద్యార్థుల ఆందోళనను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకుంటుందని జేపీ నడ్డా ప్రకటించారు.

కేంద్ర ప్రభుత్వం ముందు కాక్రోచ్‌ పార్టీ ప్రధాన డిమాండ్లు ఇవే

==> కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే.

==> ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం ఇవ్వాలి.

==> విద్యార్థులపై నమోదైన కేసులు కొట్టివేయాలని కోరాం.

దేశవ్యాప్తంగా ఉద్యమం తీవ్రం
కాగా దేశవ్యాప్తంగా నీట్‌ విద్యార్థులకు మద్దతుగా ఆందోళనలు, నిరసనలు కొనసాగుతున్నాయి. తెలంగాణలోని ప్రధాన నగరాలతోపాటు ఏపీతో సహా అన్ని రాష్ట్రాల రాజధానులు, ప్రధాన నగరాల్లో నీట్‌ విద్యార్థుల కోసం పోరాటం కొనసాగుతోంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో నీట్‌ విద్యార్థులకు మద్దతుగా విద్యా సంస్థల బంద్‌ విజయవంతంగా కొనసాగింది. ప్రభుత్వ, ప్రైవేటు విద్యాలయాలన్నీ మూసివేశారు. కేంద్ర ప్రభుత్వం దిగిరాకపోతే భవిష్యత్‌లో ఉద్యమం మరింత ఉధృతమయ్యేలా పరిస్థితులు ఉన్నాయి.

0
0
Report

Paper Leak 10 Crore: పేపర్ లీక్ చేస్తే రూ.10 కోట్ల జరిమానా, పదేళ్ల జైలు శిక్ష.. బిల్లుకు క్యాబినేట్ ఆమోదం?!

Hyderabad, Telangana:

Paper Leak Law 10 Crore: దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్న నీట్ ప్రశ్నపత్రాల లీకేజీ (Paper Leak) వ్యవహారాలపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పేపర్ లీకులకు పాల్పడే దోషులను అత్యంత కఠినంగా శిక్షించేందుకు చట్టంలో భారీ మార్పులకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందుకు తగ్గట్టుగా తాజాగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన జరిగిన క్యాబినేట్ భేటీలో దీనికి సంబంధించిన ముసాయిదా బిల్లుకు మంత్రుల బృందం ఆమోదం తెలిపినట్లు సమాచారం అందుతోంది. 

ప్రతిపాదిత కొత్త శిక్షలు, జరిమానాలు
2024 నాటి ప్రవేశ పరీక్షల (అక్రమ పద్ధతుల నివారణ) చట్టానికి సవరణలు చేస్తూ ఈ కొత్త బిల్లును రూపొందించారు. పాత చట్టంతో పోలిస్తే శిక్షలు, జరిమానాలు భారీగా పెరిగాయి. ఈ కేసులో పట్టుబడిన వ్యక్తులను కనీసం పదేళ్లు జైలు శిక్ష విధించేందుకు ముసాయిదా సిద్ధం చేసినట్లు అధికార వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. అలాగే పదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.10 కోట్ల జరిమానా విధించేలా చట్టంలో భారీ మార్పులు చేయబోతున్నట్లు తెలుస్తోంది.

పాత చట్టం వర్సెస్ కొత్త సవరణలు..
గతంలో వ్యక్తిగత లీకేజీ కేసులకు 3-5 ఏళ్ల జైలు, రూ.10 లక్షల జరిమానా విధించేవారు. వ్యవస్థీకృత నేరాలకు 5-10 ఏళ్ల జైలు, రూ.1 కోటి వరకు జరిమానా ఉండేది. ఇప్పుడు ఈ శిక్షల తీవ్రతను జరిమానా మొత్తాన్ని కేంద్రం గణనీయంగా పెంచింది.

3 నెలల్లో విచారణ పూర్తే లక్ష్యం.. ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు
పేపర్ లీక్ కేసుల విచారణను వేగవంతం చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఈ కేసుల విచారణకు ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే ఢిల్లీలో మొదటి ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ప్రారంభమవ్వగా, త్వరలోనే మరో నాలుగు కోర్టులను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఈ కోర్టుల ద్వారా లీకేజీ కేసుల విచారణను మూడు నెలల వ్యవధిలోనే పూర్తి చేసి దోషులకు త్వరితగతిన శిక్ష పడేలా ప్రతిపాదనలు చేశారు.

ప్రధాని మోదీ హామీ, తదుపరి చర్యలు
'నీట్' పేపర్ లీక్ ఘటనలకు నిరసనగా కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన ఆందోళన తీవ్రరూపం దాల్చిన నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. లీకేజీలకు పాల్పడే వారిని ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని, కఠినంగా శిక్షిస్తామని ప్రధాని మోదీ ప్రత్యేక వీడియో ద్వారా స్పష్టం చేశారు. ఈ సవరణ బిల్లును వచ్చే వారమే లోక్‌సభ ముందుకు తీసుకువచ్చి, వీలైనంత త్వరగా ఆమోదింపజేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.

(గమనిక: క్యాబినెట్ ఆమోదం తెలిపిన ఈ బిల్లుకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడాల్సి ఉంది.)

Also Read: పోలీస్ వ్యాన్‌ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!

Also REad: 'ఓం భీమ్ బుష్' హీరోయిన్ ఆయేషా ఖాన్ అరెస్ట్..నడిరోడ్డుపై ఈడ్చుకెళ్లిన ముంబై పోలీసులు!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

రూ.1.49 లక్షలకే 7 సీటర్ కారు.. రూ. 1.85 లక్షలకే SUV.. ఎక్కడో తెలుసా?

Hyderabad, Telangana:

Second-hand Cars In Delhi: సొంతంగా ఒక కారు కొనుగోలు చేసి.. కుటుంబంతో కలిసి హాయిగా ప్రయాణించాలని ప్రతి ఒక్కరూ తప్పకుండా కలలుకంటారు. కానీ.. ప్రస్తుతం మార్కెట్‌లో కొత్త కార్ల ధరలు ఆకాశాన్నంటుతుండటంతో చాలామంది తమ కల నెరవేర్చుకోవడానికి సెకండ్ హ్యాండ్ కార్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇటువంటి వారికి ఒక అద్భుతమైన సువర్ణావకాశం అందుబాటులోకి వచ్చింది. ముఖ్యంగా అత్యంత చీప్‌ ధరకే మంచి కారు కొనుగోలు చేయాలనువారికి ఇది మంచి ఛాన్స్‌ భావించవచ్చు..

ఢిల్లీలోని రోహిణి (సెక్టర్ 16, G2-124)లో ఉన్న ప్రముఖ యూజ్డ్ కార్లకు సంబంధించిన షోరూమ్స్‌లో బడ్జెట్ ధరల్లోనే విభిన్న రకాల కార్లను అందుబాటులో ఉన్నాయి.. ఇక్కడ ప్రీమియం, మోడిఫైడ్, ఫ్యామిలీ ఎస్‌యూవీ కార్లు అత్యంత తక్కువ ధరలకే లభిస్తున్నాయి. ముఖ్యంగా మిని SUVలు చాలా చీప్‌ ధరల్లో అందుబాటులో ఉండడం విశేషం.. 

ఇక్కడ పెద్ద కుటుంబాలకు అనుకూలంగా ఉండే 7-సీటర్ ఫ్యామిలీ కార్లు కేవలం రూ.1,49,000కే అందుబాటులో ఉన్నాయి. అయితే, ఇవి ఆన్ పేపర్ సీఎన్‌జీ (CNG) సౌకర్యంతో లభిస్తున్నాయి. సాధారణంగా ఎస్‌యూవీ అంటే లక్షల రూపాయల ఖర్చుతో కూడుకుని ఉంటుంది.. కానీ, ఇక్కడ 2015 మోడల్ పెట్రోల్ రెనాల్ట్ డస్టర్ (SUV) కారును కేవలం రూ.1,85,000కే సొంతం చేసుకోవచ్చు.

Also Read: సెకండ్ హ్యాండ్ ధరకే కొత్త కార్లు.. అన్‌రిజిస్టర్డ్ డెమో వాహనాలపై అదిరిపోయే ఆఫర్లు!

18 ఇంచుల స్టైలిష్ అల్లాయ్ వీల్స్‌తో అందుబాటులోకి వచ్చిన 2015 మోడల్ మోడిఫైడ్ కారు కేవలం రూ.1,25,000 లకే లభించడం విశేషం.. సీఎన్‌జీ సౌకర్యంతో ఉన్న 2019 కొత్త షేప్ ఈకోస్పోర్ట్ కారు రూ.4,25,000కే అందుబాటులో ఉండగా.. 2018 ఒరిజినల్ పెయింట్ డిజైన్ బ్లాక్ కలర్ మోడల్ రూ.4,00,000కే లభించడం విశేషం..

అదేవిధంగా 2022 BS6 అప్‌డేటెడ్ మోడల్ హ్యుందాయ్ వెన్యూ (Venue) కారు రూ.5,50,000 లకే అందుబాటులో ఉంది. సీఎన్‌జీతో కూడిన 2013 ఫస్ట్ ఓనర్ హ్యుందాయ్ వెర్నా (Verna) కారు రూ. 2,40,000కే సొంతం చేసుకోవచ్చు. దీంతో పాటు 2020 డీజిల్ టాప్ మోడల్ హ్యుందాయ్ i20 కారు కేవలం రూ. 3,50,000 కే అందుబాటులో ఉంది. ఇక 2035 వరకు వ్యాలిడిటీ ఉన్న 2020 BS6 సింగిల్ ఓనర్ రెనాల్ట్ క్విడ్ (Kwid) కారును కేవలం రూ.2,05,000కే విక్రయిస్తున్నారు.

Also Read: సెకండ్ హ్యాండ్ ధరకే కొత్త కార్లు.. అన్‌రిజిస్టర్డ్ డెమో వాహనాలపై అదిరిపోయే ఆఫర్లు!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

 

0
0
Report
Advertisement
Advertisement
Back to top