ఖమ్మంలో తెలంగాణ ఉద్యమకారుల ర్యాలీ, హామీల అమలుకు డిమాండ్
Mahabubabad, Telangana:ఖమ్మంలో తెలంగాణ ఉద్యమకారులు ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. మయూరి సెంటర్ నుండి అంబేద్కర్ సెంటర్ వరకు ర్యాలీ జరిగింది. అనంతరం రాస్తారోకో చేశారు. ఇంటి స్థలం, నిర్మాణానికి పది లక్షల రూపాయలు ఇవ్వాలని కోరారు. ఎన్నికల హామీలో ఈ అంశం ఉండటంతో ఉద్యమకారులు ఆశాభావంతో ఉన్నారని తెలిపారు.
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
Peddi Trailer Launch: మెగా ఫ్యాన్స్కు గుడ్న్యూస్..'పెద్ది' సినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ వచ్చేసింది! ఎప్పుడంటే?
Hyderabad, Telangana:Peddi Trailer Release Date: మెగా ఫ్యాన్స్ ఎప్పుడా అని ఎదురుచూస్తున్న రోజు దగ్గర పడుతోంది. ఎన్నో వాయిదాల తర్వాత 'పెద్ది' సినిమా గ్రాండ్ రిలీజ్కు ముస్తాబవుతోంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బాలీవుడ్ ముద్దుగుమ్మ హీరోయిన్గా నటించిన 'పెద్ది' చిత్ర ట్రైలర్ విడుదలకు రంగం సిద్ధమైంది. ఈ సినిమా ట్రైలర్ను మే 18న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తాజాగా అధికారికంగా ప్రకటించింది.
ఈ చిత్రం పాన్-ఇండియా స్థాయిలో భారీ ఆదరణ పొందాలని లక్ష్యంగా పెట్టుకోవడంతో, చిత్ర బృందం ఉత్తర భారతదేశం, ఇతర కీలక మార్కెట్లలో విస్తృత ప్రమోషన్స్ కార్యక్రమాలను ప్లాన్ చేస్తోంది. ప్రాంతీయ, భాషా అడ్డంకులను అధిగమించి ప్రేక్షకులతో కనెక్ట్ అయ్యి, దేశవ్యాప్తంగా బ్లాక్బస్టర్గా నిలిచే సత్తా 'పెద్ది'కి ఉందని చిత్ర బృందం బలంగా విశ్వసిస్తోంది.
బుచ్చి బాబు సానా దర్శకత్వం వహించిన ఈ గ్రామీణ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా జూన్ 4న థియేటర్లలోకి రానుంది. విడుదలకు కేవలం 23 రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో, ట్రైలర్ విడుదల కార్యక్రమంతో ప్రచార కార్యక్రమాలు ఊపందుకోనున్నాయి. ట్రైలర్ విడుదల తర్వాత హీరో రామ్ చరణ్ పూర్తిగా ప్రమోషన్స్ కోసం దేశవ్యాప్తంగా పర్యటన చేయనున్నారని తెలుస్తోంది. 
'పెద్ది' సినిమా కోసం నార్త్ ఇండియన్ ఫ్యాన్స్ను టార్గెట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాకు సంబంధించిన కొన్ని బిగ్ ఈవెంట్స్ను కూడా నార్త్ ఇండియాలోనే ప్లాన్ చేసే అవకాశం కనిపిస్తోంది. 'పెద్ది' చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా..ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.
ఈ చిత్రాన్ని వెంకట సతీష్ కిలారు, వృద్ధి సినిమాస్ బ్యానర్పై మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ భాగస్వామ్యంతో నిర్మించారు. ఈ సినిమాలో కన్నడ సూపర్ స్టార్ రాజ్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా క్రికెట్, కుస్తీ ఆటపై ప్రధానంగా కథ అలుముకోని ఉంటుందని తెలుస్తోంది. మరికొందరు కోడి రామమూర్తి బయోపిక్ అని అంటున్నారు. అయితే దీనిపై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు వేచి చూడక తప్పదు.
ఇప్పటికే 'పెద్ది' సినిమా నుంచి వచ్చిన రెండు పాటలు శ్రోతలను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. యూట్యూబ్లో 'చికిరీ' పాట 100 మిలియన్లకు పైగా వ్యూస్ దక్కించుకోగా.. అదే బాటలో రెండో సాంగ్ 'రయ్ రయ్ రారా' దూసుకుపోతుంది. అదే విధంగా ఈ సినిమాలో మరో ఐటెమ్ సాంగ్ ఉందని సమాచారం. ఇందులో తమిళ నటి శ్రుతి హాసన్ ఆడిపాడినట్లు తెలుస్తోంది.
Also Read: మహేష్ బాబు మేనకోడలిని చూశారా? హీరోయిన్లనే మించిన అందం..క్యూట్లో క్వీన్!
Also Read: Malavika Mohanan Photos: పొట్టిపొట్టి బట్టల్లో సెగ పుట్టిస్తున్న బ్యూటీ..అందంలో గత్తరలేపేస్తుంది!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Bandi Bageerath POCSO: బండి భగీరథను దేశం దాటించొద్దు.. లుకౌట్ నోటీస్ ఇవ్వాలి: మాజీ ఐపీఎస్
Kagaznagar, Telangana:Bandi Sai Bageerath POCSO Case: బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కొడుకుపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేయాలని, అవసరమైతే అన్ని విమానాశ్రయాలు, నౌకాశ్రయాలకు నోటీసులు పంపాలని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఐపీఎస్ అధికారి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. సాయి భగీరథ్ ఎక్కడ కనిపించినా అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకోవాలని కోరారు. సాయి భగీరథ్ ఆచూకీ తెలిపిన వారికి బహుమతి ఇస్తామని తెలుపుతూ సైబరాబాద్ పోలీసులు రివార్డు ప్రకటించాలని కోరారు. బండి భగీరథ్పై కేసు నమోదై మూడు రోజులు గడుస్తున్నా ఇంకా ఎందుకు అరెస్ట్ చేయలేదని నిలదీశారు.
Also Read: Dowry Death: 45 రోజులకే నవ వధువు ఆత్మహత్య.. బైక్ అంటే బైక్, పొలం అంటే పొలం ఇచ్చినా భర్త వేధింపులు
బండి భగీరథ్ పోక్సో కేసుపై కాగజ్నగర్లోని తమ నివాసంలో సోమవారం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. 'బాధిత కుటుంబాన్ని బెదిరించి, కేసు వాపస్ తీసుకోవాలని భయపెట్టడానికి పోలీసులే కావాలని అరెస్ట్ చేయడం లేదు. నిందితుడికే పోలీసులు సహకరిస్తున్నారు' అని మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. 'బాధిత అమ్మాయి తల్లి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడానికి వెళ్తే పేట్ బషీరాబాద్ పోలీసులు 5 గంటల పాటు ఎందుకు పట్టించుకోలేదు? బండి సాయి భగీరథ్ అమ్మాయిపై ఫిర్యాదు చేసిన 2 నిమిషాల్లోనే ఎలా ఎఫ్ఐఆర్ చేశారో పోలీసులు సమాధానం చెప్పాలి' అని డిమాండ్ చేశారు.
Also Read: Hyderabad Public: ఇంట్లో పనివారుగా నేపాలీలు వద్దు.. ప్రజలకు పోలీస్ కమిషనర్ సూచన
నిర్లక్ష్యం వహించిన ఇన్స్పెపెక్టర్, ఏసీపీలను బాధ్యులైన పోలీసు అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని రాష్ట్ర డీజీపీని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కోరారు. పోలీసులు సాయి భగీరథ్పై ఉద్దేశ్యపూర్వకంగా సెక్షన్ 11, 12 ప్రకారం చిన్న చిన్న కేసులు నమోదు చేశారు. వాస్తవానికి సెక్షన్ 7, 8 ప్రకారం నిందితుడు బండి భగీరథ్పై కనీసం 20 ఏళ్ల జైలు శిక్ష పడేలా కేసులు పెట్టాలి. నిందితుడిపై సెక్షన్ 6 ప్రకారం కూడా కేసు పెట్టాలి' అని మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కోరారు. సైబరాబాద్ పరిధిలో ఉన్న ఎస్ఓటీ, టాస్క్ఫోర్స్ పోలీసులు ఏం చేస్తున్నారు? నిందితుడిని ఎందుకు పట్టుకోవడంలేదని ప్రశ్నించారు.
హైదరాబాద్లో మాజీ డీజీపీ భార్యను హత్య చేసినా అడిగే నాథుడే లేడని.. తెలంగాణలో శాంతి భద్రతలు ప్రమాదంలో ఉన్నాయని మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి హోం శాఖ మంత్రిగా, ముఖ్యమంత్రిగా విఫలమయ్యారని మండిపడ్డారు. 'లక్ష మంది పోలీసులు, క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ వంటివి ఉన్నాయి. ఘటన జరిగినప్పటి నుండి ఇప్పటివరకు ఎందుకు ఆధారాలు సేకరించలేదు. అత్యాచారానికి పాల్పడిన ప్రాంతాలను ఎందుకు సందర్శించలేదు' అని ప్రశ్నించారు.
'బండి సంజయ్ కొడుకును కాపాడడం కోసం రేవంత్ రెడ్డి అటెన్షన్ డైవర్షన్లో భాగంగా ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా ఈ రేస్ కేసులు బయటకు తీయాలని చూస్తున్నారు. రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై ఈడీ కేసులు, సీబీఐ కేసులు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వానికి భయపడి ఒక మైనర్ అమ్మాయికి అన్యాయం చేయాలని చూస్తున్నారు' అని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుఆర్ ఆరోపించారు. 'కాంగ్రెస్ నాయకులు మైనర్ అమ్మాయికి ఎందుకు న్యాయం చేయడం లేదు. కాంగ్రెస్ మంత్రులు, మహిళా నాయకురాలు ఎందుకు పోక్సో కేసు గురించి మాట్లాడడం లేదు' అని ప్రశ్నించారు.
'బీజేపీ అగ్రనాయకత్వం బేటీ బచావో అని చెబుతుంటే.. బండి సంజయ్ బేటా బచావో అమలు చేస్తోంది. మైనర్ అమ్మాయిని వేధించిన మంత్రిని ప్రధాని మోదీ తన పక్కన కూర్చోబెట్టుకున్నందుకు దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. మహిళలకు మోడీ ఇచ్చే గౌరవం ఇదేనా?' అని మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు. 'బండి సంజయ్ తన కుమారుడు ఎలాంటి తప్పు చేయకపోతే పోలీసులకు అప్పగించి విచారణకు సహకరించాలి' అని కోరారు. మూడు రోజులుగా పోలీసుల మౌనం అనేక అనుమానాలు కలిగిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్లు
==> బాలల హక్కుల కమిషన్, మానవ హక్కుల సంస్థలు స్పందించి రాష్ట్ర ఛీఫ్ సెక్రటరీ, డీజీపీకు లేఖలు రాసి నిందితుడిని అరెస్ట్ చేయించాలి
==> బాధిత కుటుంబాన్ని బెదిరించిన బండి సంజయ్ను కేంద్ర మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలి.
==> బాధితులను బెదిరించిన వీ6 మాజీ రిపోర్టర్, బీజేపీ అధికార ప్రతినిధి సంగప్పతోపాటు బండి సంజయ్ను ఏ2, సంగప్ప ఏ3గా ఎఫ్ఐఆర్లో చేర్చాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.
Srisailam Booking Scam: శ్రీశైల మల్లన్న భక్తులకు అలర్ట్..రూమ్ బుకింగ్ పేరుతో యాత్రికులకు టోకరా..తస్మాత్ జాగ్రత్త!
Srisailam, Andhra Pradesh:Srisailam Room Booking Scam: నంద్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలని భావించే భక్తులే లక్ష్యంగా సైబర్ నేరగాళ్లు సరికొత్త మోసాలకు తెరలేపారు. ఆధ్యాత్మిక యాత్రలకు వెళ్లే భక్తుల భక్తిని ఆసరాగా చేసుకుని, "నకిలీ వెబ్సైట్ల" ద్వారా నిలువు దోపిడీకి పాల్పడుతున్నారు. పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ఈ వెబ్సైట్లు ఇప్పుడు జిల్లాలో కలకలం సృష్టిస్తున్నాయి.
ఇటీవల కాలంలో మంత్రాలయం, అహోబిలం క్షేత్రాలలో వరుసగా సైబర్ మోసాలు వెలుగు చూశాయి. తాజాగా, ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైలం మల్లన్న భక్తులు కూడా ఈ కేటుగాళ్ల వలలో చిక్కుకున్నారు. సేవలు, ప్రత్యేక దర్శనాలు, ఏసీ గదుల బుకింగ్ పేరుతో నకిలీ వెబ్సైట్లు సృష్టించి, భక్తుల నుంచి భారీగా నగదు వసూలు చేస్తున్నారు. తీరా ఆలయానికి చేరుకున్నాక గానీ, తాము బుక్ చేసుకున్న టిక్కెట్లు చెల్లవని భక్తులు తెలుసుకోలేకపోతున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించడమే లక్ష్యంగా సైబర్ కేటుగాళ్లు ఈ తరహా మోసాలకు పాల్పడుతున్నారు.
అధికారుల హెచ్చరిక..
ఈ ఘటనలపై స్పందించిన దేవస్థాన అధికారులు, ఆలయ ఈవో, భక్తులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గదులు లేదా దర్శన టిక్కెట్ల కోసం కేవలం ప్రభుత్వ, దేవస్థానం అధికారిక వెబ్సైట్లను మాత్రమే సంప్రదించాలని స్పష్టం చేశారు. గుర్తుతెలియని లింకులను క్లిక్ చేయవద్దని, సెర్చ్ ఇంజన్లలో కనిపించే ప్రతి వెబ్సైట్ను గుడ్డిగా నమ్మవద్దని హెచ్చరించారు.
సైబర్ మోసాల బారిన పడకుండా ఉండాలంటే.. ఆలయ అధికారిక వెబ్సైట్ అడ్రస్ను క్షుణ్ణంగా పరిశీలించండి (ముఖ్యంగా .gov.in లేదా అధికారిక డొమైన్లను గమనించాలి). టిక్కెట్ బుక్ చేసే ముందు దేవస్థాన హెల్ప్లైన్ నంబర్లకు ఫోన్ చేసి నిర్ధారించుకోండి. అనుమానాస్పద వెబ్సైట్లలో మీ వ్యక్తిగత లేదా బ్యాంకు వివరాలను నమోదు చేయకండి.
ముఖ్యంగా మారుమూల ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఈ నకిలీ వెబ్సైట్ల వల్ల తీవ్రంగా నష్టపోతున్నారు. నకిలీ వెబ్సైట్తో మోసపోయామని ఆలయ అధికారుల వద్ద భక్తులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భక్తి పేరుతో జరుగుతున్న ఈ సైబర్ దోపిడీని అరికట్టేందుకు పోలీసులు కూడా నిఘా పెంచారు. యాత్రికులు అప్రమత్తంగా ఉండి, అధికారిక మార్గాల ద్వారానే సేవలను వినియోగించుకోవాలని కోరుతున్నారు. అయితే ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా ఉండాలంటే భక్తులకు సరైన అవగాహన పెంచడం సహా నకిలీ వెబ్సైట్లను నిర్మూలించడంలో ప్రభుత్వం చాకచక్యంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
Also Read: ప్రజలకు ముఖ్య గమనిక..ఈ వారంలో రెండు రోజులు బ్యాంకులకు సెలవు..ఎప్పుడంటే?
Also Read: ప్రభుత్వ ఉద్యోగుల ఎగిరి గంతేసే వార్త..డీఏతో పాటు HRA పెంపునకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Garlic In Ghee Benefits: వెల్లుల్లిని నెయ్యిలో వేయించి తింటే..? ఎన్నో రకాల వ్యాధులకు అమృతంలా పనిచేస్తుంది!
Hyderabad, Telangana:Fry Garlic In Ghee: నెయ్యి, వెల్లుల్లి.. ఈ రెండు భారతీయ వంటగదిలో విడదీయలేని భాగాలు. కేవలం రుచి కోసం మాత్రమే కాకుండా, ఆయుర్వేదంలో వీటి కలయికను ఒక శక్తివంతమైన ఔషధంగా పరిగణిస్తారు. నెయ్యిలో వేయించిన వెల్లుల్లిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కలిగే అద్భుత ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
వెల్లుల్లిలో ఉండే అల్లిసిన్ అనే సమ్మేళనానికి యాంటీ బాక్టీరియల్, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. దీనిని నెయ్యిలో వేయించినప్పుడు ఆ పోషకాలను శరీరం త్వరగా గ్రహిస్తుంది. వెల్లుల్లి, నెయ్యి కలయిక సహజ రోగనిరోధక శక్తిని (రోగనిరోధక శక్తి) పెంచుతుంది. ముఖ్యంగా జలుబు, దగ్గు, వైరల్ ఇన్ఫెక్షన్ల బారి నుండి ఇది మనల్ని కాపాడుతుంది.
అలాగే నెయ్యిలోని బ్యూట్రిక్ యాసిడ్ జీర్ణవ్యవస్థను శుభ్రపరుస్తుంది. గ్యాస్, కడుపు ఉబ్బరం, అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలతో బాధపడేవారికి ఇది అద్భుతమైన ఇంటి చిట్కాగా మారుతుంది. వెల్లుల్లి శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి, రక్తపోటును (బ్లడ్ ప్రెజర్) నియంత్రణలో ఉంచుతుంది. నెయ్యిలోని మంచి కొవ్వులు గుండె పనితీరును మెరుగుపరుస్తాయి. అదే విధంగా శరీరంలోని అంతర్గత వాపులను తగ్గించి, ఊపిరితిత్తుల నివారణలో ఈ మిశ్రమం కీలక పాత్ర పోషిస్తుంది.
ఎలా తీసుకోవాలి?
వెల్లుల్లి రెబ్బలను తొక్క తీసి, కొద్దిగా నెయ్యిలో దొరగా వేయించాలి. వీటిని ఉదయాన్నే పరగడుపున లేదా రాత్రి పడుకునే ముందు తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఏదైనా సరే సాధారణంగా తీసుకుంటేనే అమృతం. నెయ్యి, వెల్లుల్లి మిశ్రమాన్ని అతిగా తీసుకుంటే అజీర్ణం లేదా ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు.
(గమనిక: ఇప్పటికే ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు లేదా మందులు వాడుతున్న వారు, ఈ చిట్కాను పాటించే ముందు సంబంధిత వైద్య నిపుణుడ్ని సంప్రదించడం మేలు. దీన్ని జీ తెలుగు న్యూస్ ధ్రువీకరించడం లేదు.)
Also Read: ఒకే ఇంట్లో ఇద్దరికి రైతు భరోసా ఇస్తారా? ఏడాది రూ.12,000 పొందాలంటే ఏం చేయాలి?
Also Read: రిషబ్ పంత్కు బీసీసీఐ షాక్..వన్డే ప్రపంచకప్ టీమ్ నుంచి పంత్ ఔట్! అతని స్థానంలో..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Crime News: విశాఖలో ఘోరం..లేడీస్ హాస్టల్ నిర్వాహకుడి రాసలీలలు..పెళ్లైన 45 రోజులకే నవవధువు బలి!
Visakhapatnam, Andhra Pradesh:Visakhapatnam Crime News: కాళ్ళకు పారాణి ఆరకముందే, నూరేళ్ల జీవితాన్ని పంచుకోవాల్సిన భర్త కాలయముడయ్యాడు. పెళ్లైన కేవలం 45 రోజులకే ఓ నవవధువు అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోవడం విశాఖపట్నంలోని రేసపువానిపాలెంలో తీవ్ర కలకలం రేపింది. భర్త పరాయి స్త్రీలతో పెట్టుకున్న సంబంధాలే ఈ మరణానికి కారణమని తెలుస్తోంది.
అసలేం జరిగింది?
శ్రీకాకుళం జిల్లాకు చెందిన సోమేశ్వరరావు, తేజశ్రీకి నెల రోజుల క్రితం వివాహం జరిగింది. సోమేశ్వరరావు విశాఖపట్నంలో ఒక లేడీస్ హాస్టల్ నడుపుతున్నాడు. పెళ్లైన కొద్దిరోజులకే భర్త అసలు స్వరూపం తేజశ్రీకి అర్థమైంది. హాస్టల్లో ఉండే కొందరు అమ్మాయిలతో సోమేశ్వరరావుకు అక్రమ సంబంధాలు ఉన్నాయని ఆమె గుర్తించింది.
భర్తను తేజశ్రీ నిలదీయడంతో, సోమేశ్వరరావు ఆమెపై వేధింపులకు దిగాడు. మానసికంగా, శారీరకంగా చిత్రహింసలు పెట్టడం మొదలుపెట్టాడు. ఈ పరిశీలన తేజశ్రీ తన తల్లిదండ్రులకు చెప్పుకుని ఏడ్చింది. అయితే, "కొత్త కాపురంలో సర్దుకుపోవాలి" అని వారు సర్దిచెప్పారు. కానీ, రోజురోజుకూ భర్త టార్చర్ మితిమీరిపోవడంతో, సున్నిత మనస్కురాలైన తేజశ్రీ తీవ్ర నిర్ణయం తీసుకుంది.
రేసపువానిపాలెం నివాసంలో తేజశ్రీ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు రంగంలోకి దిగారు. అయితే, ఇది ఆత్మహత్య కాదని.. భర్త సోమేశ్వరరావే ఆమెను చంపి, ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నాడని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. త్రీ టౌన్ పోలీసులు ఘటనను పరిశీలించి కేసు నమోదు చేశారు. ప్రాథమిక ఆధారాల మేరకు భర్త సోమేశ్వరరావును అదుపులోకి తీసుకుని రిమాండ్కు చేరుకున్నారు.
Also Read: త్వరలోనే హీరో విజయ్-త్రిషల పెళ్లి?! వీళ్లిద్దరి మధ్య వయసు గ్యాప్ ఎంత ఉందంటే?
ALso Read: బ్యాంకులకు వరుసగా 4 రోజులు సెలవులు..ఈ పనులు వెంటనే పూర్తి చేసుకోండి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Dowry Death: 45 రోజులకే నవ వధువు ఆత్మహత్య.. బైక్ అంటే బైక్, పొలం అంటే పొలం ఇచ్చినా భర్త వేధింపులు
Visakhapatnam, Andhra Pradesh:Husband Harassed For Additional Dowry: విశాఖపట్టణంలో అమానుష సంఘటన చోటుచేసుకుంది. ఎంతో ఘనంగా తల్లిదండ్రులు పెళ్లి చేయగా.. అత్తారింటికి కొత్త ఆశలతో ఆ యువతి కొత్త జీవితాన్ని ప్రారంభించింది. అత్తారింటికి వచ్చిన తర్వాత ఆమెకు వేధింపులు మొదలయ్యాయి. ఇతర అమ్మాయిలతో సంబంధాలు నడిపిస్తున్న భర్త నిజస్వరూపం తెలుసుకున్న భార్య నివ్వెరపోయింది. ఇదేమిటని నిలదీయగా.. భర్త ఎదురుదాడి చేసి వరకట్నం వేధింపులు ప్రారంభించాడు. ఇక కోరికల చిట్టా విప్పాడు. అడిగిన ఖరీదైన బైక్.. పొలం ఇచ్చినా కూడా అతడి వేధింపులు ఆగలేదు. దీంతో ఆమె మనస్తాపం చెంది ప్రాణాలు తీసుకున్నారు.
Also Read: Banks Strike: బ్యాంకు ఉద్యోగుల సంచలన నిర్ణయం.. 2 వీకాఫ్ల కోసం రెండు రోజుల సమ్మె!
విశాఖపట్టణం గార మండలం శిమ్మపేటకు చెందిన శిమ్మ లక్ష్మీ నారాయణ, శారద దంపతులు వ్యవసాయ కూలీలు. డిగ్రీ చదివిన కుమార్తె తేజశ్రీ (22)ని శ్రీకాకుళం మండలం రాగోలు సమీప గూడెం గ్రామానికి చెందిన రుప్ప మల్లేషు కుమారుడు రొప్ప సోమేశ్వరరావుకు ఇచ్చి ఈ ఏడాది మార్చి 6వ తేదీన వివాహం చేశారు. కట్నం కింద రూ.20 లక్షల నగదు, 20 తులాల బంగారం ఇచ్చుకున్నారు. విశాఖపట్నం ఎల్అండ్టీ కంపెనీలో ఇంజినీర్గా సోమేష్ నావల్ డాక్యార్డ్లో ప్రాజెక్టు డిజైనర్గా పనిచేస్తున్నాడు.
Also Read: Hyderabad Public: ఇంట్లో పనివారుగా నేపాలీలు వద్దు.. ప్రజలకు పోలీస్ కమిషనర్ సూచన
పెళ్లయిన అనంతరం సోమేశ్, తేజశ్రీ విశాఖపట్టణంలోని రామా టాకీస్ సమీపంలో అద్దె ఇంట్లో కాపురం పెట్టారు. కొంతకాలంగా విశాఖపట్టణంలో సోమేశ్వర రావు లేడీస్ హాస్టల్ నడుపుతుండగా.. అమ్మాయిలతో సంబంధాలు పెట్టుకున్నాడు. ఇది తెలుసుకున్న అనంతరం ఇటీవల ఓ యువతిని సోమేష్ ఇంటికి తీసుకురావడంతో భార్య తేజశ్రీ నిలదీసింది. అది సహించని సోమేష్ రూ.3 లక్షల విలువైన బైక్ కావాలని వేధించడంతో ఆ యువతి తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో అత్తామామలు నాలుగైదు రోజుల్లోనే అతడికి బండి కొనిచ్చేశారు. వారం రోజుల తర్వాత పది సెంట్లు భూమి రాయాలని, తులం నల్లపూసలు చేయించాలని మళ్లీ వేధించడంతో పాటు ఆమె తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పింది. పెళ్లి ఆల్బమ్లో సగం మొత్తం రూ.1.50 లక్షలు అడగడంతో రూ.50 వేలు కూడా ఇచ్చారు.
గొడవ.. బలవన్మరణం
ఈనెల 7వ తేదీన ఉదయం 8 నుంచి 9 గంటల మధ్య సోమేష్, తేజశ్రీ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఇద్దరూ తమకు ఫోన్ చేశారని, గొడవ మామూలేనని తేజశ్రీ తమతో చెప్పిందని, ఆ తర్వాత పలు దఫాలు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదని ఆమె తల్లిదండ్రులు చెబుతున్నారు. ఉదయం 9.30 గంటలకు ఉరివేసుకుని మీ పాప చనిపోయిందని తన ఫ్రెండ్తో సోమేష్ ఫోన్ చేయించడంతో ఒక్కసారి హతాశులయ్యామని మృతురాలి తల్లిదండ్రులు వివరించారు. హుటాహుటినా విశాఖపట్టణం బయల్దేరి వెళ్లి చూడగా కుమార్తె బెడ్ మీద విగతజీవిగా ఉంది. అయితే మెడ, కాళ్లపై వాతలు ఉన్నాయని, సోమేష్ స్నేహితులు ముగ్గురు అక్కడే ఉండడంతో ఆమెను చంపేసి ఉంటారని మృతురాలి తల్లిదండ్రులు అనుమానించారు. ఇదే విషయమై విశాఖపట్నం త్రీటౌన్లో కేసు పెట్టామని, సోమేష్ను అదే రోజు పోలీసులు అరెస్టు చేశారని తెలిపారు. తమ కుమార్తెకు తీరని అన్యాయం జరిగిందని.. అదనపు వరకట్నం కోసం వేధించడమే కాక హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని తల్లిదండ్రులు వాపోయారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.
PBKS Vs DC Preview: పంజాబ్ కింగ్స్ పతనం ఆగిపోతుందా? ఢిల్లీ క్యాపిటల్స్ టోర్నీ నుంచి వైదొలగుతుందా?
Jhikli Barol, Himachal Pradesh:PBKS Vs DC Preview 2026: ఐపీఎల్ 2026 సీజన్ క్లైమాక్స్ దశకు చేరుకుంటున్న వేళ ధర్మశాల వేదికగా జరగనున్న పంజాబ్ కింగ్స్ (PBKS), ఢిల్లీ క్యాపిటల్స్ (DC) పోరు ఆసక్తికరంగా మారింది. ఒకవైపు ప్లేఆఫ్ రేసులో నిలవాలని పంజాబ్, మరోవైపు పరువు కాపాడుకోవాలని ఢిల్లీ తహతహలాడుతున్నాయి.
శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో పంజాబ్ కింగ్స్ ఈ సీజన్లో వరుస విజయాలతో దూసుకెళ్లగా.. గత మూడు మ్యాచ్లలో మాత్రం చతికిలపడింది. ఆరంభ 7 మ్యాచ్లలో 6 గెలిచిన పంజాబ్, ఇప్పుడు వరుస ఓటములతో ఆత్మరక్షణలో పడింది. ధర్మశాలలోని పిచ్ పంజాబ్ కింగ్స్ జట్టుకు విజయాన్ని ఇస్తుందా లేదా? అనేది తెలియాల్సి ఉంది.
మరోవైపు, అక్షర్ పటేల్ సారథ్యం ఢిల్లీలోని క్యాపిటల్స్ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. 11 మ్యాచ్లలో కేవలం 4 విజయాలతో ఇప్పటికే టాప్-4 రేసు నుంచి దాదాపు నిష్క్రమించింది. ఇప్పుడు ఆ జట్టు లక్ష్యం కేవలం పంజాబ్ విజయావకాశాలను దెబ్బతీసి, పరువు నిలబెట్టుకోవడం కోసమే మ్యాచ్ ఆడే అవకాశం కనిపిస్తుంది.
ఐపీఎల్ చరిత్రలో ఈ రెండు జట్ల మధ్య సమరం ఎప్పుడూ నువ్వా-నేనా అన్నట్లుగానే సాగుతోంది. పంజాబ్ కింగ్స్ (కింగ్స్ లెవెన్ పంజాబ్), ఢిల్లీ క్యాపిటల్స్ (ఢిల్లీ డేర్ డెవిల్స్) మధ్య మొత్తంగా 36 మ్యాచ్లు జరిగాయి. వాటిలో పంజాబ్ 18 మ్యాచ్ల్లో గెలుపొందగా.. ఢిల్లీ 17 మ్యాచ్ల్లో విజయం సాధించింది. ఈ సీజన్ మొదటి మ్యాచ్లో ఢిల్లీ నిర్దేశించిన 264 పరుగుల భారీ లక్ష్యాన్ని పంజాబ్ ఛేదించడం విశేషం.
పంజాబ్ కింగ్స్ గత మ్యాచ్లలో క్యాచ్లు వదిలేసి భారీ మూల్యాన్ని చెల్లించింది. సహాయ కోచ్ జేమ్స్ హూప్స్ అన్నట్లుగా, క్యాచ్లు పట్టి ఉంటే ఫలితాలు మరోలా ఉండేవి. సముద్ర మట్టానికి 1,457 మీటర్ల ఎత్తులో ఉంటే ఈ మైదానంలో గాలి పల్చగా ఉంటుంది. ఫలితంగా బంతి వేగంగా సీమ్ అవుతుందని పిచ్ క్యూరేటర్లు అంచనా వేస్తున్నారు. ఇది బ్యాటర్లకు అనుకూలించినా, అర్ష్దీప్ సింగ్, మిచెల్ స్టార్క్ వంటి బౌలర్లు స్వింగ్తో మాయ చేయగలరు. పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నుంచి ఒక భారీ ఇన్నింగ్స్ రావాల్సి ఉంది. అలాగే ఢిల్లీకి కేఎల్ రాహుల్ ఫామ్ ఆ జట్టుకు ఆందోళన కలిగిస్తోంది. ధర్మశాల పిచ్ సాధారణంగా పేస్, బౌన్స్కు సహకరిస్తుంది. బ్యాటర్లకు కూడా ఇది స్వర్గధామంగా మారనుంది.
పంజాబ్ కింగ్స్ (PBKS) తుదిజట్టు అంచనా
శ్రేయస్ అయ్యర్ (సి), ప్రభ్సిమ్రన్ సింగ్, ప్రియాన్ష్ ఆర్య, సూర్యాంశ్ షెగ్డే, మార్కస్ స్టోయినిస్, శశాంక్ సింగ్, అజ్మతుల్లా ఒమర్జాయ్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్దీప్ సింగ్, మార్కో జాన్సెన్. (ఇంపాక్ట్ ప్లేయర్: హర్ప్రీత్ బ్రార్)
ఢిల్లీ క్యాపిటల్స్ (DC) తుదిజట్టు అంచనా..
కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), అభిషేక్ పోరెల్, నితీష్ రాణా, ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్ (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, అశుతోష్ శర్మ, అఖీబ్ నబీ, లుంగి ఎంగిడి, మిచెల్ స్టార్క్, ముఖేష్ కుమార్. (ఇంపాక్ట్ ప్లేయర్: సమీర్ రిజ్వీ)
Also Read: మహేష్ బాబు మేనకోడలిని చూశారా? హీరోయిన్లనే మించిన అందం..క్యూట్లో క్వీన్!
Also Read: ప్రభుత్వ ఉద్యోగుల ఎగిరి గంతేసే వార్త..డీఏతో పాటు HRA పెంపునకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
YS Jagan Padayatra 2.0: ఆంధ్రప్రదేశ్లో మారుతున్న రాజకీయ సమీకరణాలు..జగన్ పాదయాత్ర ఖరారు..ప్రకటన అప్పుడే!
Tadepalli, Andhra Pradesh:YS Jagan Padayatra 2.0 News: విదేశీ పర్యటన ముగించుకుని రాష్ట్రానికి తిరిగి వచ్చిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హీట్ పెంచేలా అడుగులు వేస్తున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకుంటున్న వేళ, అటు అధికార పక్షం.. ఇటు ప్రతిపక్షం వ్యూహప్రతివ్యూహాలతో సిద్ధమవుతున్నాయి.
లండన్ టూర్ ముగించుకుని బెంగళూరు చేరుకున్న జగన్, మంగళవారం తాడేపల్లికి రానున్నారు. 2024 ఎన్నికల ఓటమి తర్వాత పార్టీ సంస్థాగత బలోపేతంపై ఇప్పటివరకు పెద్దగా దృష్టి సారించని ఆయన, ఇకపై పూర్తిస్థాయిలో రంగంలోకి దిగాలని నిర్ణయించుకున్నారు.
మే 13న ఉన్నత స్థాయి సమావేశంలో పార్టీ ముఖ్య నేతలతో జగన్ భేటీ కానున్నారు. రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లే విధానంపై చర్చించనున్నారు. వైఎస్సార్ జయంతి సందర్భంగా జూలై 8, 9 తేదీల్లో రాష్ట్ర స్థాయి ప్లీనరీని నిర్వహించాలని కేడర్ నుంచి ఒత్తిడి వస్తోంది.
దీనిపై ఈ సమావేశంలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. గతేడాది వాయిదా పడుతూ వస్తున్న జిల్లాల పర్యటనలు, కార్యకర్తల సమావేశాలను తక్షణమే ప్రారంభించే దిశగా జగన్ మొగ్గు చూపుతున్నారు. పెండింగ్లో ఉన్న నియోజకవర్గాల సమన్వయకర్తల జాబితాను ఖరారు చేసి, ఎన్నికల మూడ్లోకి పార్టీని తీసుకెళ్లడం జగన్ ప్రధాన లక్ష్యం.
ఒకవైపు జగన్ వ్యూహాలు సిద్ధం చేసుకుంటుంటే, మరోవైపు రాష్ట్ర రాజకీయాల్లో కొన్ని కీలక మార్పులు కనిపిస్తున్నాయి. హైదరాబాద్లో ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నివాసాలకు ప్రధాని వెళ్లడం కూటమి బలాన్ని చాటుతోంది.
అదే విధంగా ఈ నెలాఖరులో నెల్లూరు వేదికగా మహానాడు నిర్వహించేందుకు టీడీపీ సిద్ధమైంది. దీని ద్వారా రెండేళ్ల పాలన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు. వచ్చే ఏడాది నుంచి జగన్ మళ్లీ పాదయాత్ర చేపట్టే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. దానికి ముందుగా పార్టీ కేడర్లో జోష్ నింపడం ఇప్పుడు అనివార్యంగా మారింది.
రెండేళ్ల కూటమి పాలన పూర్తవుతున్న తరుణంలో, విమర్శలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయి పోరాటాలకు జగన్ సిద్ధమవుతున్నారు. ప్లీనరీ ద్వారా కొత్త ఉత్సాహాన్ని నింపి, వచ్చే ఏడాది పాదయాత్రకు పునాది వేయడమే జగన్ తదుపరి వ్యూహంగా కనిపిస్తోంది.
Also Read: అనసూయపై అసభ్యకర కామెంట్స్..మరో నిందితుడు అరెస్ట్..ఏం జరిగిందంటే?
Also Read: Rukmini Vasanth Photos: కాటేసే కళ్లతో కొంటెగా చూస్తోంది కన్నడ భామ..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
PM Modi Public Call: బంగారంతో సహా ప్రజలకు ప్రధాని మోదీ 6 విజ్ఞప్తులు.. అవేమిటంటే?
Baddipadaga, Telangana:Gold Price: తెలంగాణ పర్యటనకు వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు కొన్ని కీలక సూచనలు చేశారు. వాటిలో బంగారంతోపాటు విదేశీ ప్రయాణం, ఎరువుల వినియోగం తదితర అంశాలపై ప్రధాని విజ్ఞప్తులు చేశారు. దేశం కోసం కొన్ని తగ్గించుకోవాలని సూచనలు చేశారు. విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయడం కూడా దేశభక్తిలో భాగమని గుర్తుచేశారు. ప్రస్తుతం కరోనా వంటి సమయంలో ఎదుర్కొన్న పరిస్థితులు ఎదుర్కోవాలని హెచ్చరించారు.
Also Read: Narendra Modi: 'అబద్ధపు హామీలు ఇచ్చి మర్చిపోవడమే కాంగ్రెస్ మోడల్': ప్రధాని మోదీ
ప్రజలకు సూచనలు
==> మెట్రో సేవలను ఎక్కువగా వినియోగించాలి. కార్పూలింగ్ను ప్రోత్సహించాలి. సాధ్యమైనంత వరకు రైల్వే సరుకు రవాణాను వినియోగించాలి. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచాలి.
==> కనీసం ఏడాది పాటు విదేశీ పర్యటనలు తగ్గించుకోవాలి. విదేశీ వస్తువుల కొనుగోళ్లు తగ్గించాలి. దేశీయ ఉత్పత్తులను ప్రోత్సహించాల. వోకల్ ఫర్ లోకల్ను బలంగా అమలు చేయాలి. రోజువారీ జీవితంలో విదేశీ ఉత్పత్తుల స్థానంలో స్వదేశీ ఉత్పత్తులను ఉపయోగించాలి.
==> విదేశీ మారక ద్రవ్యాన్ని కాపాడుకోవాలి
==> ఏడాదిపాటు బంగారం కొనడం తగ్గించుకోవాలి
==> వంట నూనెల వినియోగాన్ని తగ్గించుకోవాలి
==> రైతులు రసాయన ఎరువులను తగ్గించుకోవాలి. రసాయన ఎరువుల వినియోగాన్ని 25 శాతం నుంచి 50 శాతం వరకు తగ్గించి సహజ వ్యవసాయం వైపు అడుగులు వేయాలి.
==> డీజిల్ పంపుల స్థానంలో సౌరశక్తి పంపులను ఉపయోగించాలి.
Also Read: Narendra Modi: తెలంగాణలో మార్పు అనివార్యం.. అబ్కీ బార్ బీజేపీ సర్కార్: ప్రధాని మోదీ
కరోనా కాలంలో అలవాటైన వర్క్ ఫ్రం హోమ్, ఆన్లైన్ సమావేశాలను మళ్లీ ప్రాధాన్యం ఇవ్వాలని ప్రధాని మోదీ సూచించారు. విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయడం కూడా దేశభక్తిలో భాగమని గుర్తుచేశారు. రసాయన ఎరువుల అధిక వినియోగంతో భూమి నాశనం అవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచ సంక్షోభాల సమయంలో ప్రతి పౌరుడు దేశహితం కోసం కట్టుబడి పనిచేయాలని పిలుపునిచ్చారు. ఇది ఒక్క ప్రభుత్వానికి.. ఒక్క పార్టీకి సంబంధించిన అంశం కాదని, దేశానికి సంబంధించిన బాధ్యత అని ప్రధాని మోదీ గుర్తుచేశారు. ప్రతి పౌరుడు, ప్రతి రాజకీయ పార్టీ, ప్రతి సంస్థ దేశ ప్రయోజనాల కోసం ఏకమై పనిచేస్తే దేశం ప్రతి సంక్షోభాన్ని జయిస్తుందని తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Narendra Modi: 'అబద్ధపు హామీలు ఇచ్చి మర్చిపోవడమే కాంగ్రెస్ మోడల్': ప్రధాని మోదీ
Hyderabad, Telangana:PM Modi Speech: బీజేపీ అభివృద్ధి, ఉపాధి సృష్టిపై దృష్టి సారిస్తుంటే కాంగ్రెస్ పార్టీ మాత్రం ప్రజలను మోసం చేసే రాజకీయాలు చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విమర్శలు చేశారు. దేశంలో మూడు రాష్ట్రాల్లోనే కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఉన్నారని, ఎక్కడ ఉన్నా కాంగ్రెస్ మోడల్ ఒకటే. ముందుగా అబద్ధపు హామీలు ఇవ్వడం.. తర్వాత వాటిని మర్చిపోవడమే. హిమాచల్, కర్ణాటకలో కాంగ్రెస్ తన హామీలను అమలు చేయకుండా ప్రజలను ఇబ్బందులకు గురి చేసింది. తెలంగాణలో కూడా అదే జరుగుతోంది' అని రేవంత్ రెడ్డిపై ప్రధాని మండిపడ్డారు.
Also Read: Narendra Modi: తెలంగాణలో మార్పు అనివార్యం.. అబ్కీ బార్ బీజేపీ సర్కార్: ప్రధాని మోదీ
తెలంగాణ పర్యటనకు వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేసిన అనంతరం హైదరాబాద్లోని సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో జరిగిన బీజేపీ భారీ బహిరంగ సభలో పాల్గొని కీలక ప్రసంగం చేశారు. తెలంగాణలో పాలన సాగిస్తున్న కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. అయితే రేవంత్ రెడ్డి పేరు ప్రస్తావించకుండా ప్రసంగం చేయడం గమనార్హం. 'కాంగ్రెస్ ఇప్పుడు దేశాన్ని విభజించే రాజకీయాలకు కేంద్రంగా మారింది. మావోయిస్టు భావజాలాన్ని ప్రోత్సహించేలా కాంగ్రెస్ వ్యవహరిస్తోంది. ముస్లిం లీగ్ కంటే కూడా కఠిన వైఖరితో ముందుకెళ్తోంది. అందుకే ప్రజలు కాంగ్రెస్ను ముస్లిం లీగ్ మావోయిస్టు కాంగ్రెస్గా అభివర్ణిస్తున్నారు' అని ప్రధాని మోదీ విమర్శించారు. మావోయిస్టు ఉగ్రవాదం కారణంగా దేశం ఎన్నో నష్టాలు చవిచూసిందని, తెలంగాణ కూడా దశాబ్దాల పాటు బాధలు అనుభవించిందని ప్రధాని గుర్తుచేశారు.
Also Read: Telangana CM: 'తెలంగాణపై ప్రధాని మోదీ పెద్ద మనసు చూపాలి: రేవంత్ రెడ్డ
కాంగ్రెస్, వామపక్షాలు మావోయిస్టులకు భావజాల పరంగా మద్దతు ఇవ్వడంతోనే ఈ సమస్య ఇంతకాలం కొనసాగింది. తెలంగాణ పోలీసులకు పూర్తిస్థాయి స్వేచ్ఛ ఇచ్చి ఉంటే మావోయిస్టు ఉగ్రవాదాన్ని చాలా కాలం కిందటే అంతం చేసేవారు. ఎన్డీఏ ప్రభుత్వ కృషితో ఇప్పుడు తెలంగాణ మావోయిస్టుల నుంచి విముక్తి దిశగా వెళ్తోంది' అని ప్రధాని మోదీ తెలిపారు. ప్రస్తుతం భారత్ అభివృద్ధి దిశగా వేగంగా పయనిస్తున్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సంక్షోభాలను ఎదుర్కొంటోందని వివరించారు.
Also Read: Bandi Bageerath POCSO: రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నావు? బండి సంజయ్ కొడుకు కేసుపై హరీశ్ రావు నిలదీత
'కరోనా తర్వాత సరఫరా వ్యవస్థలు దెబ్బతిన్నాయి. ఉక్రెయిన్ యుద్ధంతో ఆహారం, ఇంధనం, ఎరువుల ధరలు ప్రపంచవ్యాప్తంగా పెరిగాయి. అయినప్పటికీ భారత ప్రభుత్వం ప్రజలపై భారం పడకుండా రైతులకు భారీ సబ్సిడీతో ఎరువులను అందిస్తున్నాం. ప్రపంచ మార్కెట్లో రూ..3000 ఉన్న ఎరువుల సంచిని భారత రైతులకు రూ.300 లోపే అందిస్తున్నాం' అని ప్రధాని మోదీ వివరించారు. దేశ ప్రయోజనాల కోసం ప్రజలు కొన్ని సంకల్పాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.
కార్యకర్తల్లో జోష్
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో జరిగిన సభలో ప్రధాని మోదీ కార్యకర్తలను ఉత్సాహపరిచారు. సభా ప్రారంభానికి ముందు తన కోసం కార్యకర్తలు, చిన్నారులు తీసుకొచ్చిన పెయింటింగ్స్ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించి తన భద్రతా సిబ్బందితో తీసుకున్నారు. ఆ చిత్రాలను సేకరించాలని ఎస్పీజీ అధికారులను ఆదేశించిన అనంతరం సేకరించిన పెయింటింగ్స్పై చిత్రకారుల అడ్రస్లు ఉంటే వారికి స్వయంగా లేఖలు రాస్తానని చెప్పడంతో కార్యకర్తల్లో జోష్ వచ్చింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Narendra Modi: తెలంగాణలో మార్పు అనివార్యం.. అబ్కీ బార్ బీజేపీ సర్కార్: ప్రధాని మోదీ
Baddipadaga, Telangana:PM Modi Full Speech: 'తెలంగాణ రాజకీయాల్లో మార్పు అనివార్యం. అబ్కీ బార్ తెలంగాణాలో కూడా బీజేపీ ప్రభుత్వం అనే నినాదం ఇప్పుడు ప్రజల సంకల్పంగా మారింది' అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. పశ్చిమ బెంగాల్లో బీజేపీ చారిత్రాత్మక విజయాన్ని సాధించినట్టు తెలంగాణలో కూడా కుటుంబ, అవినీతి రాజకీయాలకు ముగింపు పలకాలని నిర్ణయించుకున్నారని చెప్పారు. కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందని.. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని స్పష్టం చేశారు.
Also Read: Telangana CM: 'తెలంగాణపై ప్రధాని మోదీ పెద్ద మనసు చూపాలి: రేవంత్ రెడ్డి
హైదరాబాద్లోని సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో జరిగిన బీజేపీ బహిరంగ సభలో ప్రధాని మోదీ కీలక ప్రసంగం చేశారు. జాతీయ, తెలంగాణ రాష్ట్ర రాజకీయాలతోపాటు ప్రపంచ పరిణామాలపై ప్రధాని స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. 'పశ్చిమ బెంగాల్లో తొలిసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. అక్కడి చారిత్రాత్మక విజయోత్సాహం ఇప్పుడు తెలంగాణలో కూడా కనిపిస్తోంది. తెలంగాణ బీజేపీ కార్యకర్తల్లో అపారమైన జోష్ కనిపిస్తోంది' అని ప్రధాని తెలిపారు.
Also Read: Bandi Bageerath POCSO: రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నావు? బండి సంజయ్ కొడుకు కేసుపై హరీశ్ రావు నిలదీత
'దేశవ్యాప్తంగా బీజేపీ అభివృద్ధి మోడల్, సుపరిపాలనపై ప్రజలు మళ్లీ మళ్లీ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు' అని ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను ప్రధాని మోదీ ప్రస్తావించారు. ఇప్పుడు తెలంగాణలో అబ్కీ బార్ బీజేపీ సర్కార్ అని ప్రజలు స్పష్టంగా చెబుతున్నారని పేర్కొన్నారు. 'పశ్చిమ బెంగాల్లో బీజేపీ విజయం కేవలం రాజకీయ గెలుపు మాత్రమే కాదు. ప్రజలను సంవత్సరాల పాటు బంధించిన కుటుంబ, నియంతృత్వ రాజకీయాలపై ప్రజలు ఇచ్చిన తీర్పు' అని తెలిపారు. 'కాంగ్రెస్ అవినీతి, కుటుంబవాదం, రాజ్యాంగ సంస్థలను బలహీనపరిచే రాజకీయాలకు మారుపేరుగా మారింది. అదే మార్గంలో తృణమూల్ కాంగ్రెస్ కూడా నడిచింది. ఇప్పుడు ప్రజలు అలాంటి రాజకీయాలను తిరస్కరిస్తున్నారు' అని ప్రధాని మోదీ వివరించారు.
'దక్షిణాది నుంచి ఈశాన్య రాష్ట్రాల వరకు బీజేపీని చిన్న పార్టీగా చూసేవారు. కానీ నేడు దేశవ్యాప్తంగా బీజేపీపై ప్రజల్లో అపారమైన విశ్వాసం పెరిగింది. తెలంగాణకు బీజేపీ చరిత్రలో ప్రత్యేక స్థానం ఉంది. దేశంలో బీజేపీకి కేవలం ఇద్దరు ఎంపీలు ఉన్న సమయంలో తెలంగాణ నుంచే ఒక ఎంపీ గెలిచారు' అని ప్రధాని మోదీ గుర్తుచేశారు. దేశంలో మద్దతు లేకపోయినా తెలంగాణ ప్రజలు బీజేపీకి అండగా నిలిచారని చెప్పారు. ఇప్పుడు తెలంగాణ నుంచి దాదాపు సగం మంది ఎంపీలు బీజేపీ తరఫున గెలిచారని.. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో కూడా బీజేపీ ఘన విజయం సాధిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పార్టీ వాగ్దానాల మోసం, కుటుంబ రాజకీయాలతో తెలంగాణ ప్రజలు విసిగిపోయారు. అందుకే రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. రాష్ట్ర అభివృద్ధే దేశ అభివృద్ధి అనే సిద్ధాంతంతో కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోంది. అభివృద్ధి చెందిన భారత నిర్మాణంలో తెలంగాణ, హైదరాబాద్ కీలక పాత్ర పోషించాలని కేంద్రం కట్టుబడి ఉంది' అని ప్రధాని మోదీ వివరించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
PM Modi Visit Hyderabad: డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్కు ప్రధాని మోదీ పరామర్శ..సీఎం చంద్రబాబు ఇంట్లో గంటకు పైగా భేటీ!
Hyderabad, Telangana:PM Modi Visit CBN Residence: హైదరాబాద్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ బిజీ షెడ్యూల్ మధ్య ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నివాసాలను సందర్శించారు. జూబ్లీహిల్స్ పరిసరాల్లోని కూటమి నేతల ఇంటికి వెళ్లి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేశారు. రాజకీయ ప్రాధాన్యతతో పాటు వ్యక్తిగత అనుబంధాన్ని చాటుతూ ఈ పర్యటన సాగింది.
ప్రధాని మోదీ తొలుత డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నివాసానికి వెళ్లారు. ఇటీవల పవన్ కల్యాణ్కు సైనస్ సమస్య కారణంగా శస్త్రచికిత్స జరిగింది. ప్రస్తుతం ఆయన తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ క్రమంలో పవన్ ఇంటికి వెళ్లిన మోదీ, ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
పవన్ నివాసం నుంచి ప్రధాని నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్లారు. ప్రధానికి చంద్రబాబుతో పాటు మంత్రి నారా లోకేశ్ ఘనస్వాగతం పలికారు. దాదాపు గంటకు పైగా చంద్రబాబు నివాసంలో గడిపిన మోదీ, బాబుతో కలిసి వివిధ రాజకీయ, అభివృద్ధి అంశాలపై కీలక చర్చలు జరిపారు.
ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ప్రధాని స్పందన
చంద్రబాబు కుటుంబ సభ్యులతో దిగిన ఫొటోలను ప్రధాని మోదీ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. "చంద్రబాబు నాయుడు గారి నివాసానికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను కలవడం ఎంతో సంతోషాన్నిచ్చింది. ఎన్నో విభిన్నమైన అంశాలపై అభిప్రాయాలను పంచుకోవడం చాలా బాగుంది" అని మోదీ పేర్కొన్నారు.
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, హైదరాబాద్ వేదికగా ప్రధాని మోదీ స్వయంగా వీరి ఇళ్లకు వెళ్లి కలవడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ఇది ఇరు పార్టీల మధ్య ఉన్న బలమైన బంధానికి నిదర్శనమని విశ్లేషకులు భావిస్తున్నారు.
Also Read: "చచ్చేంత వరకు నా మాజీ లవర్స్ను ప్రేమిస్తూనే ఉంటా" విష్ణుప్రియ సంచలన వ్యాఖ్యలు
Also Read; కృనాల్ పాండ్యా చొక్కా పట్టుకున్న పూరన్..LSG Vs RCB మ్యాచ్ తర్వాత మైదానంలో డిష్యుం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
CM Vijay Trisha: తమిళనాడు రాజకీయాల్లో నటి త్రిష జోక్యం..ఒక్కమాటతో సీఎం విజయ్ క్లారిటీ!
Tamil Nadu:CM Vijay On Trisha: తమిళనాట కొత్త ప్రభుత్వం ఏర్పడింది. సీఎంగా టీవీకే అధినేత విజయ్ ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే. అయితే గత కొన్ని రోజులుగా విజయ్ సీఎం అయ్యాక నటి త్రిష పరిపాలనలో జోక్యం చేసుకుంటుందని.. మంత్రి పదవిని ఆమెకు ఇవ్వనున్నారని వార్తలు వచ్చాయి. అయితే వాటిపై సీఎం విజయ్ పరోక్షంగా స్పందించారు.PM Modi Speech: ప్రధానమంత్రి మోదీ మాటకు గొల్లున నవ్విన సీఎం రేవంత్ రెడ్డి, బండి సంజయ్..
Hyderabad, Telangana:PM Modi Offers CM Revanth Reddy: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్తుతం తెలంగాణ పర్యటనలో ఉన్నారు. తాజాగా హెచ్ఐసీసీలో జరిగిన సభలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన ప్రధాని మోదీ.. సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి చేసిన ఓ వ్యాఖ్యతో సభ మొత్తం గొల్లున నవ్వింది. అందుకుక సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.Explosives in Modi Tour: ప్రధాని మోదీ పర్యటనలో బాంబు కలకలం..నగరం మొత్తం టెన్షన్ టెన్షన్!
Agara, Karnataka:Explosives Found in Modi Tour: బెంగళూరులో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన వేళ పేలుడు పదార్థాల లభ్యం కావడం తీవ్ర సంచలనం సృష్టించింది. కర్ణాటక పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ కార్యక్రమ వేదికకు కూతవేటు దూరంలో పేలుడు పదార్థాలు బయటపడటం భద్రతా వర్గాలను ఉలిక్కిపడేలా చేసింది. బెంగళూరు శివార్లలోని ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆశ్రమంలో జరిగే వేడుకకు ప్రధాని హాజరుకావాల్సి ఉండగా, ఈ ఘటన వెలుగు చూసింది.
ఏం జరిగింది?
ఆదివారం నాడు ప్రధాని మోదీ ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ 45 ఏళ్ల ఉత్సవాల్లో పాల్గొనేందుకు షెడ్యూల్ ఖరారైంది. ఈ నేపథ్యంలో పోలీసులు ముందస్తు తనిఖీల్లో ప్రధాన వేదికకు కేవలం 3 దూరంలో ఉన్న కాగలిపుర సమీపంలోని ఫుట్పాత్ పక్కన రెండు జిలాటిన్ స్టిక్లు లభ్యమయ్యాయి. సమాచారం అందిన వెంటనే బాంబు నిర్వీర్య దళం (BDDS), ఫోరెన్సిక్ నిపుణులు అక్కడికి చేరుకుని ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు.
ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ జిలాటిన్ స్టిక్స్ అక్కడికి ఎలా వచ్చాయనే దానిపై పోలీసులు రెండు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. సమీపంలోని క్వారీ పనుల కోసం తెచ్చినవి పొరపాటున అక్కడ పడిపోయాయా? లేదా ప్రధాని పర్యటనను టార్గెట్ చేస్తూ ఎవరైనా ఉద్దేశపూర్వకంగా అక్కడ ఉంచారా? అనే కోణంలో విచారణ సాగుతోంది.
ఆశ్రమంలో ప్రధాని ప్రసంగం
భద్రతా ముప్పు పొంచి పర్యటన, కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య ప్రధాని మోదీ తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఆర్ట్ ఆఫ్ లింగ్ వ్యవస్థాపకుడు శ్రీ శ్రీ రవిశంకర్ సామాజిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలను ఆయన కొనియాడారు. ఆశ్రమ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన ధ్యాన మందిరాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. బెంగళూరు కేవలం టెక్నాలజీకే పరిమితం కాకుండా, ఆధ్యాత్మిక చైతన్యానికి కేంద్రంగా మారిందని ప్రధాని ప్రశంసించారు. ప్రకృతి వ్యవసాయం, పర్యావరణ పరిరక్షణలో వాలంటీర్లు కావాలని కోరుతున్నారు.
ALso Read: ఉద్యోగులకు ఊరట! ఏటీఎం నుంచి PF డబ్బులు విత్డ్రా..తాజాగా అప్డేట్ ఇదే..
Also Read: Pooja Hegde Photos: జిమ్ డ్రస్సులో సెగలు పుట్టిస్తున్న పూజా హెగ్డే..కెవ్వుకేక అంతే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
