Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Mahabubabad506105

సీతరామ ప్రాజెక్ట్ పనులను పరిశీలించిన మంత్రి పొంగులేటి

Aug 09, 2024 10:30:47
Kamepally, Telangana
సీతారామ సాగునీటి ప్రాజెక్టు పనులను ఖమ్మం జిల్లా ఏన్కూర్ వద్ద రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు. ఈ క్రమంలో ఆయన మొదటగా ట్రాక్టర్ పై ప్రాజెక్ట్ కాలువలను సందర్శించారు. అనంతరం కాలినడకన తిరుగుతూ పనుల పరిస్థితిని తెలుసుకున్నారు. ఈక్రమంలో మంత్రి అధికారులకు పలు సూచనలు సలహాలు చేసారు. ఈనెల 15న సీఎం రేవంత్ రెడ్డి ప్రాజెక్ట్ ను ప్రారంభించనున్నారు.
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
RKRavi Kumar Sargam
Jan 06, 2026 11:04:09
Jangaon, Telangana:

KTR Speech: 'తెలంగాణను 60 సంవత్సరాల పాటు రాచిరంపాన పెట్టిన కాంగ్రెస్ పార్టీ అనే విషయం మర్చిపోయి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. 60 ఏళ్ల కాంగ్రెస్ దుర్మార్గాన్ని, తెలంగాణకు చేసిన ద్రోహాన్ని తన దీక్షతో ప్రాణాలకు తెగించి కొట్లాడి తెలంగాణ సాధించిన కేసీఆర్‌పైన అడ్డగోలుగా మాట్లాడుతున్నాడు. నదులు, తెలంగాణపై కనీస అవగాహన లేని హౌలా గాడు రేవంత్ రెడ్డి' అని మాజీ మంత్రి కేటీఆర్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Also Read: Ponnala Laxmaiah: సాగునీటిపై రేవంత్ రెడ్డి చేసిన మోసాలను ప్రజలు క్షమించరు: పొన్నాల లక్ష్మయ్య

జనగామ జిల్లాలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లు, వార్డు సభ్యుల అభినందన సభ నిర్వహించగా.. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక ప్రసంగం చేశారు. 'ఇంటింటికి నీళ్లు ఇచ్చినందుకు, అమ్మలక్కలకు ఆసరా పెన్షన్లు ఇచ్చినందుకు, ముసలివారికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పెన్షన్‌ను 10 రెట్లు పెంచినందుకు, రైతన్నలకు రైతుబంధు ఇచ్చినందుకు, రైతు భీమా ఇచ్చినందుకు, సాగునీటి ప్రాజెక్టులు కట్టి దేశంలోనే పంటల ఉత్పత్తిలో అగ్రస్థానంలో నిలిపినందుకు, తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసినందుకు కేసీఆర్‌ను శిక్షించాలా?' అని రేవంత్ రెడ్డిని కేటీఆర్ ప్రశ్నించారు.

Also Read: Polavaram Project: ఏపీ చేపట్టిన పోలవరం-నల్లమల్ల ప్రాజెక్టును అడ్డుకుంటాం: తెలంగాణ నీళ్ల మంత్రి

మూటలు మోసుడు తప్ప రేవంత్ రెడ్డికి ఏం తెలవదు. కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి నీళ్ల గురించి పాఠాలు చెప్తాడు. గోదావరి ఎక్కడుందో రేవంత్‌కు తెలియదు. భాక్రా నంగల్ ప్రాజెక్టు తెలంగాణలో ఉందని చెబుతున్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండేళ్లు అయిపోయింది.. ఎలా ప్రజలను మోసం చేశారో ఆలోచించాలి' అని ప్రజలకు మాజీ మంత్రి కేటీఆర్‌ సూచించారు. రైతుల పరిస్థితులు ఎలా తయారయ్యాయో ఆలోచించాలని చెప్పారు. 'యూరియా కోసం చలిలో ఎదురు చూస్తున్నారు. ఎనకటి రోజులు తెస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు.. అదే రాబందుల కాలం రేవంత్ రెడ్డి తెచ్చాడు. గ్రామాల్లో రేవంత్ రెడ్డిని నోటికొచ్చినట్లు తిడుతున్నారు' అని కేటీఆర్‌ వివరించారు.

Also Read: Retirement Age: ఉద్యోగుల రిటైర్మెంట్‌ వయస్సు 62 ఏళ్లకు పెంపు.. త్వరలో ఉత్తర్వులు

'వరంగల్ రైతు డిక్లరేషన్‌లో అడ్డగోలుగా హామీలు ఇచ్చి తెలంగాణ ప్రజలను రాహుల్ గాంధీ మోసం చేశాడు. ఎకరానికి రైతుబంధు రూ.15,000 ఇస్తా. రైతులతో పాటు కౌలుదారులకు రైతుబంధు ఇస్తా. ప్రతి పంటకు రూ.500 అదనపు బోనస్ చెల్లిస్తానని చెప్పి కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది' అని మాజీ మంత్రి కేటీఆర్‌ వివరించారు. మరి రాహుల్ గాంధీ అనే హౌలాగాడిని నడిబజార్‌లో ఉరి తీయాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. 

'2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన రాహుల్ గాంధీ అనే హౌలాగాడి మాటలు విని ప్రతి ఒక్క విద్యార్థి ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయించారు. విద్యార్థులను, నిరుద్యోగులను మోసగారి మాటలతో రెచ్చగొట్టిన రాహుల్ గాంధీ అనే హౌలాగాడిని ఉరితీయాలి. ఆడబిడ్డలకు బతుకమ్మ చీర పెట్టే ముఖం లేని రేవంత్ రెడ్డి, ఆడబిడ్డలకు నెలకు రూ.2,500 ఇవ్వలేని రేవంత్ రెడ్డి కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేస్తానంటున్నాడు. కనీసం తులం బంగారం అయినా ఆడబిడ్డలకు ఇచ్చారా?' అని మాజీ మంత్రి కేటీఆర్‌ ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పాలనలో ఆడబిడ్డలు పుస్తెలతాడు తాకట్టు పెట్టి బతికే పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు.

'ఎందుకు రేవంత్‌ రెడ్డి అంత పిచ్చిగా మాట్లాడుతున్నాడో ఎవరికీ అర్థం కావడం లేదు. రేవంత్ రెడ్డి తన సొంత సెక్యూరిటీ సిబ్బందిని కూడా ప్రజల ముందే కొడుతున్నాడు. అడ్డగోలుగా కోరుతున్నాడు, త్వరలో కరుస్తాడు కాబట్టి కట్టివేయమని రేవంత్ రెడ్డి భార్య గీతకు చెప్పినం' అని మాజీ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. 'అధికారం వచ్చిన తర్వాత కూడా రేవంత్ రెడ్డికి ఇంకా ఏడుపు ఎందుకు? తల్లిదండ్రులు చదువుకోమని పంపిస్తే రేవంత్‌ రెడ్డి లంగా పనులు చేసుకుంటూ.. పెయింటింగులు వేసుకుంటూ చదువుకోలేదు. దానికి నేనేం చేయాలి?' అని కేటీఆర్‌ ప్రశ్నించారు.

'కేసీఆర్ చెప్పు ధూళికి రేవంత్ రెడ్డి సరిపోడు. కేసీఆర్ ఒక్క ప్రెస్‌మీట్‌కే ఆగమాగం అవుతున్నాడు. అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే అసెంబ్లీలోనే గుండె ఆగి సస్తాడు' అని మాజీ మంత్రి కేటీఆర్‌ ఎద్దేవా చేశారు. కారు గుర్తు కనిపిస్తే కేసీఆర్‌ను మరోసారి ముఖ్యమంత్రి చేయాలనే ఆలోచనతోనే ఓటు వేసి గెలిపించుకుందామని ప్రజలకు పిలుపునిచ్చారు. కేసీఆర్ ఎప్పుడు ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కసితో ఎదురుచూస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, తాటికొండ రాజయ్య, నన్నపనేని నరేందర్, బీఆర్ఎస్ పార్టీ నాయకుడు రాకేష్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
RKRavi Kumar Sargam
Jan 06, 2026 10:39:55
Hyderabad, Telangana:

Polavaram Nallamala Sagar Project: 'ప్రభుత్వాలు ఏవైనా వివాదాలేవైనా రాజ్యాంగం ఒక్కటే. రాజ్యాంగపరంగా ఏ పరిష్కారానికైనా సంస్థలను ఏర్పాటు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగపరంగా ఏర్టైన సంస్థలను, చట్టాలను నిర్వీర్యం చేస్తున్నాయి. చట్టాలకతీతంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పని చేస్తున్నాయి' అని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టులో పోలవరం నల్లమల్ల సాగర్‌పై తెలంగాణ వేసిన పిటిషన్‌పై ఏపీ వాదనలు విచిత్రంగా ఉన్నాయని చెప్పారు. 'హైదరాబాద్ తెలంగాణకు ఉంది కదా? ఏపీ సాగునీటి ప్రాజెక్టులు కట్టుకోకూడదా? అని ఏపీ తరఫు అడ్వకేట్ ఎలా వాదిస్తారు? హైదరాబాద్ తెలంగాణలో ఉంటే ఏపీ ఏమైనా చేసుకోవచ్చా?' అని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ప్రశ్నించారు. సాగునీటి ప్రాజెక్టులపై ఏం చేయాలో విభజన చట్టంలో ఉందని గుర్తుచేశారు.

Also Read: Polavaram Project: ఏపీ చేపట్టిన పోలవరం-నల్లమల్ల ప్రాజెక్టును అడ్డుకుంటాం: తెలంగాణ నీళ్ల మంత్రి

హైదరాబాద్‌లోని బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య కీలక ప్రసంగం చేశారు. 'ఏపీ చేపడుతున్న పోలవరం-నల్లమల సాగర్ విభజన చట్టంలో ఎక్కడ ఉంది? అని బీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు పొన్నాల లక్ష్మయ్య నిలదీశారు.'కేంద్ర ప్రభుత్వం ఎలా కమిటీలు వేస్తుంది? పోలవరం నల్లమల సాగర్‌కు ఏ కేంద్ర ప్రభుత్వ సంస్థ అనుమతి లేనప్పుడు కమిటీలు ఎలా వేస్తారు? మీటింగ్‌కే వెళ్లబోమని చెప్పిన వారు కమిటీకి ఎలా అంగీకరిస్తారు? సుప్రీంకోర్టులో కేసు వేసిన తర్వాత కమిటీకి తెలంగాణ సభ్యుల పేర్లు ఎందుకు పంపింది? కమిటీ వేసుకున్నారు కోర్టుకు వచ్చారు అని నిన్న సుప్రీంకోర్టు తెలంగాణను ప్రశ్నించింది. ప్రజలు అవకాశం ఇచ్చారు. దానిని ప్రభుత్వాలు ఉపయోగించుకోవాలి. రాజ్యంగపరమైన ఇరిగేషన్ సంస్థలు ఉన్నాయి' అని వివరించారు.

Also Read: Harish Rao: ఫోన్‌ ట్యాపింగ్‌పై రేవంత్ రెడ్డికి బలమైన చెంపదెబ్బ: హరీశ్ రావు

'తెలంగాణ కృష్ణా, గోదావరి నదుల మధ్యలో ఉంది. తెలంగాణకు ఎత్తిపోతల పథకాలే శరణ్యం. సీమాంధ్ర పాలనలో తెలంగాణకు రావాల్సిన నీళ్లు రాలేవు. నీరు రాకుండా కుట్రలు చేశారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును నిర్లక్ష్యం చేస్తున్నారు. ఈ ప్రభుత్వం ప్రాజెక్టులపై చిల్లర రాజకీయం చేస్తోంది. ఒకవైపు నదీజలాల పంపిణీ కమిటీల ఏర్పాటు చేసుకొని.. మరో వైపు తెలంగాణ ప్రాజెక్టుల పనులు ఆపడం దౌర్భాగ్యం' అని ఆవేదన వ్యక్తం చేశారు. 'కేంద్రం ఒత్తిడిలకు రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం వంగుతోంది. ప్రభుత్వం క్షుణ్నంగా చట్టాలను చదివి ప్రాజెక్టులపై నిర్ణయం తీసుకోవాలి' అని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య సూచించారు.

'పాలమూరు ప్రాజెక్టుపై ప్రభుత్వ వైఖరిని ఖండిస్తున్నా. అవగాహన లేకుండా పీపీటీ అసెంబ్లీలో పెట్టారు. కేసీఆర్ మాట్లాడిన ప్రశ్నలకు సమాధానం చెప్పారా? అసెంబ్లీకి కేసీఆర్ రావడం లేదని చిల్లరగా మాటాడుతున్నారు. ప్రాజెక్టులపై రేవంత్ రెడ్డి డాక్యుమెంట్లలోని పేరాగ్రాఫ్ విడిచిపెట్టి తనకు అనుకూలంగా ఉన్న వాటినే చదవడం దారుణం ఇదే నా సీఎం సంస్కారం?' అని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య తెలిపారు. కేటీఆర్, హరీశ్‌ రావు ప్రశ్నలకు సమాధానం చెప్పాలని సవాల్‌ చేశారు. కేసీఆర్ రాజకీయ జీవితం ముందు రేవంత్ రెడ్డి ఎంత అని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌పై అవాకులు చవాకులు మాట్లాడటం సిగ్గుచేటు అని మండిపడ్డారు. సాగునీటిపై ప్రభుత్వం తీరు చాలా బాధిస్తుంది. చట్టసభలు చట్టాలు చేయడానికి ఉన్నాయి. కానీ పంచాయతీలు పెట్టడానికి కాదు. రేవంత్ రెడ్డి రాజీనామా చేసినా సాగునీటిపై ఆయన చేసిన మోసాలను ప్రజలు క్షమించరు. అసెంబ్లీని అసెంబ్లీలాగా నడపడం లేదు' అని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Jan 06, 2026 09:07:19
Hyderabad, Telangana:

Samsung 236 Ltr Refrigerator Price Drop: ఎప్పటి నుంచో సాంసంగ్ రిఫ్రిజిరేటర్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఇదే అద్భుతమైన అవకాశంగా భావించవచ్చు.. సాంసంగ్ 236 L ఫ్రాస్ట్ ఫ్రీ కన్వర్టబుల్ రిఫ్రిజిరేటర్ ఫ్లిప్‌కార్ట్‌ ఆఫర్స్‌లో చాలా తక్కువ ధరకే అందుబాటులో ఉంది. దీనిపై ఎన్నో రకాల స్పెషల్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా బిగ్ బచాట్ డేస్ సేల్‌లో భాగంగా దీనిని కొనుగోలు చేసేవారికి భారీ తగ్గింపు లభిస్తోంది. అయితే, ఈ ఆఫర్స్‌కి సంబంధించిన అన్ని రకాల వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో సాంసంగ్ 236 L ఫ్రాస్ట్ ఫ్రీ కన్వర్టబుల్ రిఫ్రిజిరేటర్ RT28C3733S8/HL మోడల్ నెంబర్‌తో అందుబాటులోకి వచ్చింది. ఇక ఇది చాలా ప్రీమియం ఫీచర్స్‌తో లభిస్తోంది. దీనికి సంబంధించిన ఫీచర్స్‌ వివరాల్లోకి వెళితే.. ఈ ఫ్రిజ్‌కు చాలా ప్లస్ పాయింట్ ఏంటంటే.. 3-ఇన్-1 కన్వర్టిబుల్ సపోర్ట్‌ లభిస్తోంది. దీని వల్ల అవసరానికి తగినట్లుగా ఫ్రీజర్‌ను కూడా ఫ్రిజ్‌గా మార్చుకోవచ్చు. అంతేకాకుండా ఇందులో చాలా ప్రత్యేకమైన డిజిటల్ ఇన్వర్టర్ టెక్నాలజీ కూడా అందుబాటులో ఉంది. సాంసంగ్‌ కంపెనీ దీని కంప్రెషర్‌పై 20 ఏళ్ల వారంటీని కూడా అందిస్తోంది. ఇందులో చాలా ప్రత్యేకమైన డిజిటల్ డిస్ప్లే ఫీచర్‌ కూడా లభిస్తోంది. దీని వల్ల మీరు టెంపరేచర్ సెట్టింగ్‌లను కూడా సులభంగా మార్చుకోవచ్చు. 

అలాగే ఈ ఫ్రిజ్ చాలా రకాల ప్రత్యేకమైన ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది. ఇందులో చాలా అద్భుతమైన పవర్‌ టెక్నాలజీ ఉంటుంది. దీని వల్ల  100V నుంచి 300V వోల్టేజ్ హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ తట్టుకోగలుగుతున్నట్లు కంపెనీ క్లైమ్‌ చేస్తోంది. దీంతో పాటు ఇందులో డోర్ అలారం ఫీచర్‌ కూడా ఉంది. దీని వల్ల ఫ్రిజ్ డోర్ సరిగ్గా వేయకపోయినా అలారం ద్వారా అలర్ట్‌ చేస్తుందని కంపెనీ తెలిపింది. ఇవేకాకుండా ఇందులో చాలా రకాల స్పెషల్‌ ఫీచర్స్‌ అందుబాటులో ఉన్నాయి. అయితే, ఇప్పుడు ఈ స్మార్ట్‌ ఫ్రిజ్‌పై ఫ్లిప్‌కార్ట్‌లో స్పెషల్‌ ఆఫర్స్‌ అందుబాటులో ఉన్నాయి. వీటన్నింటి వినియోగించి పేమెంట్ చేసేవారికి భారీ డిస్కౌంట్‌ లభిస్తుంది..

Also Read: Rahu Effect: ఏప్రిల్‌ వరకు రాహువు పవర్‌ఫుల్‌ ఎఫెక్ట్‌.. ఈ రాశులవారికి లక్కీ జాక్‌పాట్!

ఫ్లిప్‌కార్ట్‌ బిగ్ బచాట్ డేస్ సేల్‌ (Flipkart Big Bachat Sale Offers) ఆఫర్స్‌ వివరాల్లోకి వెళితే..ఈ ఫ్రిజ్ అసలు ధర (MRP) దాదాపు రూ.40,990 ఉండగా.. ఇప్పుడే ఈ సేల్‌లో భాగంగా కొనుగోలు చేసేవారికి రూ.25,490తో లభిస్తోంది. ఇక ఈ ఫ్రిజ్‌పై ఉన్న బ్యాంక్‌ ఆఫర్స్‌ వివరాల్లోకి వెళితే.. ఫ్లిప్‌కార్ట్‌ యాక్సిస్‌ బ్యాంక్‌, SBI క్రెడిట్‌ కార్డ్‌ను వినియోగించి పేమెంట్‌ చేసేవారికి దాదాపు రూ.2 వేల వరకు డిస్కౌంట్‌ లభిస్తుంది. ఇక HDFC, Axis, లేదా ICICI బ్యాంక్‌ క్రెడిట్ కార్డ్‌లను వినియోగించి పేమెంట్‌ చేసేవారికి రూ.1 వేయి వరకు డిస్కౌంట్‌ లభిస్తుంది. అలాగే ఎక్చేంజ్‌ ఆఫర్‌ వినియోగించే వారికి రూ.10 వేల వరకు బోనస్‌ కూడా లభిస్తుంది. దీంతో ఈ ఆఫర్స్‌ అన్ని పోనూ ఈ ఫ్రిజ్‌ కేవలం రూ. 17,200కే పొందవచ్చు. అయితే, ఈ బోనస్‌ అనేది పాత రిఫ్రిజిరేట్‌ కండీషన్‌ బట్టి ఆధారపడి ఉంటుంది. 

Also Read: Rahu Effect: ఏప్రిల్‌ వరకు రాహువు పవర్‌ఫుల్‌ ఎఫెక్ట్‌.. ఈ రాశులవారికి లక్కీ జాక్‌పాట్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Jan 06, 2026 05:11:53
Hyderabad, Telangana:

Lakshmi Narayana Yogam In Telugu: జనవరి నెలలోని కొనసాగుతున్న ఈ వారం చాలా శుభప్రదమైనదిగా భావించవచ్చు. ఎందుకంటే ధనుస్సు రాశిలో బుధుడితో పాటు శుక్రుడి కలయిక జరగబోతోంది. దీని కారణంగానే ఎంతో శక్తివంతమైన లక్ష్మీ నారాయణ యోగం ఏర్పడింది. అలాగే మరికొన్ని రాజయోగాలు కూడా ఏర్పడబోతున్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ సమయంలో కొన్ని రాశులవారికి వ్యాపారాల పరంగా మెరుగుదల కనిపిస్తుంది. అంతేకాకుండా బాకీ ఉన్న డబ్బులు కూడా తిరిగి పొందుతారు. అలాగే ఉద్యోగాలు చేసేవారికి పదోన్నతులు లభించి.. కొత్త ఆదాయం వనరులు కూడా లభిస్తాయి. దీంతో పాటు పెట్టుబడులు పెట్టడం కూడా చాలా అనుకూలమని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఈ సమయంలో బుధుడితో పాటు శుక్రుడి సంయోగం కారణంగా ఈ కింది నాలుగు రాశులవారికి చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే, ఈ సమయంలో అత్యంత శుభప్రభావం పొందే రాశులేవో ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ రాశులవారికి బంపర్‌ జాక్‌పాట్:
మకర రాశి

లక్ష్మీ నారాయణ యోగంతో మకర రాశివారికి గణనీయమైన లాభాలు కలుగుతాయి. వీరికి ఆరోగ్యపరంగా అద్భుతమైన లాభాలు కలుగుతాయి. దీంతో పాటు  కొత్త ఆరోగ్యకరమైన రోజులు ప్రారంభమవుతాయి. ఈ సమయంలో ఎలాంటి ప్రయాణాలు చేసిన సానుకూల ఫలితాలు పొందుతారు. వీరు అద్భుతమైన విజయాలు సాధిస్తారు. ఈ సమయంలో పనుల్లో రిస్క్ తీసుకోవడం చాలా మంచిది. దీంతో పాటు కోరుకున్న ఆర్థిక ప్రయోజనాలు కూడా పొందుతారు. అలాగే ఆర్థిక పరిస్థితుల కాస్త మెరుగుపడినప్పటికీ.. ఖర్చులు విపరీతంగా పెరిగే ఛాన్స్‌లు ఉన్నాయి. అలాగే కుటుంబ సభ్యులతో ఆనందంగా కూడా ఉంటారు. ప్రయాణాలు చేసేవారు అద్భుతమైన లాభాలు పొందుతారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న వ్యక్తులకు అద్భుతమైన లాభాలు కలుగుతాయి. 

మేష రాశి
మేష రాశివారికి నిలిపోయిన పనులు ఈ వారం ప్రారంభమవుతుతాయి. అంతేకాకుండా కెరీర్‌ పరంగా అద్భుతమైన లాభాలు కలుగుతాయి. అలాగే కోర్టు సంబంధిత కేసులు కూడా చాలా వరకు పరిష్కారమవుతాయి. ఈ వారం పెట్టుబడులు పెట్టడం వల్ల భారీ ప్రయోజనాలు కూడా పొందుతారు. అలాగే ఆర్థిక లాభాల కోసం ఈ సమయంలో ఎక్కువగా కష్టపడే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం పరంగా కూడా బోలెడు లాభాలు కలుగుతాయి. దీంతో పాటు కుటుంబంలో ఘర్షణలు కూడా పెరుగుతాయి. దీంతో పాటు ఒంటరిగా ఉన్న వ్యక్తులకు అద్భుతమైన ప్రయోజనాలు కలుగొచ్చు. అలాగే వీరు ఈ సమయంలో తప్పకుండా కొన్ని రకాల శుభవార్తలు వింటారు. వీరు ఆనందంగా ఉండడమే కాకుండా శ్రేయస్సు కూడా పొందుతారు. 

Also Read: Rahu Effect: ఏప్రిల్‌ వరకు రాహువు పవర్‌ఫుల్‌ ఎఫెక్ట్‌.. ఈ రాశులవారికి లక్కీ జాక్‌పాట్!

కుంభ రాశి
ఎంతో శక్తివంతమైన లక్ష్మీ నారాయణ యోగం ప్రభావంతో ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడతాయి. ప్రేమ జీవితం ఈ సమయంలో శృంగారభరితంగా ఉంటుంది. అలాగే వివాహాలు కానివారికి ఈ సమయంలో వివాహాలు కూడా జరుగుతాయి. అంతేకాకుండా తీవ్ర సమస్యలు కూడా చాలా వరకు పరిష్కారమవుతాయి. అలాగే కొత్త ప్రాజెక్టుల్లో పనులు చాలా సులభంగా జరిగిపోతాయి. దీర్ఘకాలిక సమస్యలు కూడా దూరమవుతాయి. ఎప్పటి నుంచో అనుకుంటున్న పనులు ఈ సమయంలో చేసి.. అద్భుతమైన లాభాలు పొందుతారు. కెరీర్‌ పరంగా కూడా చాలా లాభాలు కలుగుతాయి. ఈ వారం చివరిలో మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది. కుటుంబంతో కలిసి టూర్స్‌కి వెళ్తారు. 

Also Read: Rahu Effect: ఏప్రిల్‌ వరకు రాహువు పవర్‌ఫుల్‌ ఎఫెక్ట్‌.. ఈ రాశులవారికి లక్కీ జాక్‌పాట్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Jan 06, 2026 05:10:41
Hyderabad, Telangana:

Rare Yellow Python Video Watch: నివాస ప్రాంతాల్లో తరచుగా పాముల సంచారం సాధారణ ప్రజలను ఎంతగానో భయాందోళనకు గురి చేస్తూ ఉంటుంది. గత కొన్ని ఏళ్ల నుంచి అడవుల్లో వివిధ కారణాలవల్ల వనరుల కోరత ఏర్పడడం వల్ల చాలా ప్రాణులు అడవుల నుంచి బయటికి వచ్చి జనాలు నివసించే ప్రాంతాల్లో సంచారం చేస్తున్నాయి. ఇందులో భాగంగానే పాములు కూడా జనాలు తిరిగే ప్రాంతాల్లో కనిపిస్తూ ఉన్నాయి. వీటిని పట్టుకోవడానికి కొంతమంది స్నేక్ క్యాచర్స్ క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. ఇలా పట్టుకుంటున్న సందర్భంలో వీడియోను తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. తాజాగా పాత ఇంటి పైకప్పు కింద భాగంలో సంచారం చేస్తున్న భారీ కొండచిలువను పట్టుకునే క్రమంలో చోటు చేసుకున్న ఉత్కంఠ భరితమైన ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. 

ఈ వీడియోకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఓ గ్రామంలో నివాస ప్రాంతంలో గత కొద్ది రోజులుగా పెంపుడు కోళ్లతో పాటు, కుక్కలు, దూడలు మాయమవడం ప్రారంభమయ్యాయి. అయితే స్థానికులు దీనిని చూసి అడవి నుంచి గ్రామంలో పెద్ద అడవి జంతువు ఏదైనా సంచారం చేస్తూ.. చంపి ఆహారంగా తింటున్నావని అనుకున్నారు. కానీ పాత రేకుల షెడ్డు పైకప్పు పై భారీ కొండచిలువ కనిపించడంతో అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు. ఆశ్చర్యపోయి స్నేక్ క్యాచర్స్ కి సమాచారం అందించారు. వెంటనే వారు రంగంలోకి దిగి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు.

అయితే, ఆ గ్రామంలో సంచారం చేసిన పాము దాదాపు 9 మీటర్ల పొడవు ఉండడం.. పసుపు రంగులో ఉండడం మీరు ఈ వీడియోలో  కనిపించడం మీరు చూడొచ్చు. అంతేకాకుండా అరుదైన కొండచిలువ ఎంతో భయానకంగా కనిపిస్తోంది. ఇది మనిషి అంత లావుగా ఉండడం కూడా మీరు చూడొచ్చు. అయితే, పైకప్పుకు దగ్గరగా ఉన్న ప్రాంతంలో ఈ కొండచిలువ ఉండడంతో దానిని అక్కడి నుంచి బయటికి తీసుకువచ్చేందుకు చాలామంది శ్రమ పడటం మీరు ఈ వీడియోలో క్లియర్‌గా చూడొచ్చు. ఎంతో శ్రమపడి ఆ ప్రమాదకరమైన పాములు పైనుంచి కిందికి తీసుకువచ్చారు.

Also Read: King Cobra Video: ఏంగుండెరా వాడిది.. 20 అడుగుల కింగ్ కోబ్రాతో ఏంచేస్తున్నాడో తెలిస్తే షాక్.. వీడియో మీకోసం..

ఈ సమయంలో పాము తనని తాను రక్షించుకోవడానికి.. పై కప్పు కింద ఉన్న ఇనుప చట్కాలను చుట్టుకొని ఉండిపోయింది..  దీని కారణంగా వారు దానిని బయటికి తీసుకువచ్చేందుకు శ్రమ పడాల్సి వచ్చింది. అయితే, అతి కష్టం మీద దాని తోక పట్టుకొని లాగే ప్రయత్నాన్ని చేశారు. ఇలా నెమ్మదిగా ఆ పామును కిందికి తీసుకు వచ్చిన తర్వాత ఒక పెద్ద సంచిలో ఈ భారీ పామును బంధించడం మీరు చూడొచ్చు. ఇలా బంధించిన పామును సురక్షితమైన ప్రదేశానికి తీసుకువెళ్లి వదిలిపెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియోనే సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

Also Read: King Cobra Video: ఏంగుండెరా వాడిది.. 20 అడుగుల కింగ్ కోబ్రాతో ఏంచేస్తున్నాడో తెలిస్తే షాక్.. వీడియో మీకోసం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
HDHarish Darla
Jan 05, 2026 17:04:17
Hyderabad, Telangana:

Sankranti 2026 Holidays In Telangana: తెలంగాణలోని స్కూళ్లకు సంక్రాంతి సెలవులపై విద్యాశాఖ కీలక ప్రకటన చేసింది. జనవరి 10 నుంచి జనవరి 16 వరకు సంక్రాంతి సెలవులను ప్రకటిస్తూ..సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఆప్షన్ హాలీడే వినియోగించుకుంటే ఏకంగా 9 రోజుల పాటు సంక్రాంతి సెలవులను విద్యార్థులు ఎంజాయ్ చేయోచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం. 

9 రోజులు సంక్రాంతి సెలవులు..
జనవరి 10న రెండో శనివారంతో పాటు ఆ తర్వాత జనవరి 11న ఆదివారం కారణంగా సెలవు ఉండడం వల్ల సెలవులను జనవరి 10 నుంచే ప్రారంభం అయ్యేలా ప్రభుత్వం ప్రకటన చేసింది. దీంతో జనవరి 10 నుంచి జనవరి 16 సంక్రాంతి సెలవులను ప్రకటించింది. 

అయితే జనవరి 17న శనివారం రోజున ఆప్షన్ హాలీడే ఇస్తే.. జనవరి 18న ఆదివారం కావడం వల్ల మరో సెలవులు కలిసి వస్తుంది. దీంతో శనివారం ఆప్షన్ హాలీడే వినియోగిస్తే.. ఏకంగా 9 రోజుల పాటు స్కూళ్లకు సెలవులు రానున్నాయి. అయితే ఆప్షన్ హాలీడే అనేది ఆయా పాఠశాల యాజమాన్య నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. 

స్కూల్స్ రీ-ఓపెన్..
కానీ, తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ జారీ చేసిన ఉత్తర్వుల ద్వారా అధికారికంగా జనవరి 17న పాఠశాలలు తెరవాల్సి ఉంది. అయితే జనవరి 17న శనివారం ఆ తర్వాత ఆదివారం కారణంగా సెలవు కలిసి వస్తుండడం వల్ల శనివారం ఆప్షన్ హాలీడే గురించి ఎక్కువగా ఆలోచించే అవకాశం ఉంది. ఒకవేళ శనివారం (జనవరి 17) వ్యక్తిగతంగా సెలవు తీసుకుంటే విద్యార్థులకు 9 రోజుల పాటు సెలవు వచ్చినట్లు ఉంటుంది.

జనవరి అంటేనే సెలవుల మాసం!
ఈ ఏడాది జనవరి నెల విద్యార్థులకు అసలైన పండుగను తీసుకువచ్చింది. జనవరి 1 (న్యూ ఇయిర్), సంక్రాంతికి 9 రోజులు, జనవరి 26 (గణతంత్ర దినోత్సవం)తో పాటు నెలలో 4 ఆదివారాలు, ఒక రెండో శనివారం వంటి వాటితో కలుపుకొని జనవరి నెలలో ఏకంగా 16 రోజులు పాఠశాలలు మూతపడే అవకాశం ఉంది. అంటే సగానికి పైగా రోజులు విద్యార్థులు ఇంటి వద్దే గడపవచ్చు.

ప్రయాణాలు - జాగ్రత్తలు
సెలవులు భారీగా ఉండటంతో హైదరాబాద్ నగరం నుంచి స్వగ్రామాలకు వెళ్లే వారి సంఖ్య పెరిగింది. ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతాలు, జాతీయ రహదారులపై ట్రాఫిక్ విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. ప్రయాణికుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు, రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను నడుపుతున్నాయి.

విద్యార్థులకు సూచనలు..
పండుగ అంటే కేవలం ఆటలే కాదు, ప్రాణ రక్షణ కూడా ముఖ్యం. గాలిపటాలు ఎగురవేసేటప్పుడు మేడల మీద, రోడ్ల మీద అప్రమత్తంగా ఉండాలి. విద్యుత్ తీగలకు దూరంగా ఉండాలి. నదులు లేదా చెరువుల్లో స్నానాలకు వెళ్లేటప్పుడు పెద్దల పర్యవేక్షణ తప్పనిసరి. సెలవుల ఎంజాయ్‌మెంట్‌తో పాటు అకడమిక్ క్యాలెండర్ దెబ్బతినకుండా ఉపాధ్యాయులు ఇచ్చిన హోం వర్క్ పూర్తి చేయాలి.

Also Read: School Holiday: రేపు సోమవారం స్కూళ్లకు సెలవు..ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం..విద్యార్థులు ఫుల్ ఖుషీ!

Also Read: Mana Shankara Vara Prasad Trailer: 'మన శంకరవరప్రసాద్' ట్రైలర్ వచ్చేసింది! సంక్రాంతి మెగా ధమాకా..బాక్సాఫీస్ కుమ్ముడే!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
RKRavi Kumar Sargam
Jan 05, 2026 17:03:00
Hyderabad, Telangana:

Polavaram Nallamala Sagar: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించనున్న పోలవరం-నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టు నిర్మాణాన్ని అంగీకరించే ప్రసక్తేలేదని.. కచ్ఛితంగా అడ్డుకుని తీరుతామని తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. ఏపీ ప్రభుత్వం  ప్రతిపాదనలు ముమ్మాటికి గోదావరి జల వివాద ట్రిబ్యునల్ 1980 అవార్డుతో పాటు అంతరాష్ట్ర జల నిబంధనలు ఉల్లంఘించడమేనని స్పష్టం చేశారు.

Also Read: Schools Holiday: రేపు స్కూళ్లకు సెలవు.. ఎక్కడ? ఎందుకో తెలుసా?

రాష్ట్ర శాసనసభలో జరిగిన మీడియా చిట్-చాట్‌లో ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి కీలక ప్రకటన చేశారు. మాజీ మంత్రి హరీశ్‌ రావు చూపిస్తున్న లేఖ సీడబ్ల్యూసీ అంతర్గత సమాచారం కోసం పంపిన లేఖ మాత్రమేనని.. ఎంతమాత్రం సీడబ్ల్యూసీ ఆమోదించినట్లు కాదని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర జల హక్కులపై ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకు బీఆర్ఎస్ పార్టీ పూనుకుందని.. ఆ పార్టీ నాయకులు చేస్తున్న ఆరోపణలు అర్ధరహితమని కొట్టి పారేశారు.

Also Read: Kavitha Drama: 'కేసీఆర్ లేకపోతే కవిత ఎవరు? కేసీఆర్‌ను తిడితే లీడర్‌ అవుతావా?': బీఆర్‌ఎస్‌ పార్టీ

పోలవరం-నల్లమల ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీఆర్ఎంబీ, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీలతో పాటు కేంద్ర జల కమిషన్, కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ, కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖలకు లేఖలు రాసిన విషయాన్ని ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి గుర్తు చేశారు. తెలంగాణా ప్రభుత్వ అభిప్రాయంతొవీపైన పేర్కొన్న సంస్థలన్నీ ఏకీభవించాయని తెలిపారు. డిసెంబర్ 4వ తేదీన కేంద్ర జల సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖనే దీనికి నిదర్శనమని చెప్పారు. సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తున్నామని పేర్కొన్నారు.

Also Read: BRS Party: ఎవరి చేతిలో కవిత కీలుబొమ్మ.. ఆమె తీరుతో కేసీఆర్‌ కంటతడి

పోలవరం-నల్లమల ప్రాజెక్టును ఒక్క తెలంగాణా రాష్ట్రం మాత్రమే కాకుండా మహారాష్ట్ర,కర్ణాటక రాష్ట్రాలు కుడా ఆక్షేపిస్తున్నాయని ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి తెలిపారు. ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో పోరాటం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణా ప్రాంత ప్రయోజనాలను కాపాడడంతో పాటు గట్టి వాదనలు వినిపించేందుకు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీని నియమించిందని వివరించారు. రానున్న రెండు రోజుల్లో న్యాయవాదులతో ప్రత్యేకంగా మరో సమావేశం నిర్వహించి రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణకు అనుసరించాల్సిన వ్యూహాన్ని రూపొందిస్తామని వెల్లడించారు.

తెలంగాణా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మీదటనే రాయలసీమ ఎత్తిపోతల పథకానికి బ్రేక్ పడిన విషయాన్ని తెలంగాణా సమాజం గుర్తించుకోవాలని ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి తెలిపారు. కొత్తగా ఏర్పడినడ్డ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ పాలకులు జల వనరుల నిర్వహణలో ఘోరంగా విఫల మయ్యారని విమర్శించారు. కేసీఆర్‌ పాలనలో మాటలకు చేతలకు ఎక్కడ పొంతన లేదని విమర్శించారు. జూరాల నుంచి పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని శ్రీశైలం ప్రాజెక్టుకు, తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు కాళేశ్వరం ఎత్తిపోతల పథకం కింద తుమ్మిడిహట్టి ప్రాజెక్టును రీ డిజైన్ చేయడం వంటి నిర్ణయాలు మోయలేని భారాన్ని ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి వివరించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
RKRavi Kumar Sargam
Jan 05, 2026 13:13:14
Hyderabad, Telangana:

Kavitha Politics: 'తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ వెంట అందరూ అడుగులో అడుగు వేసి పని చేశారు. ఉద్యమం ప్రారంభమైన ఆరేళ్లకు కవిత వచ్చారు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిన పడుతున్న సమయంలో అందరూ కలిసి వచ్చారు. అలానే కవిత వచ్చారు. అందరిలా ఆమె కూడా పని చేయడంతో కేసీఆర్‌ ఆమెకు ఎంపీగా, ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. కవిత ఇప్పుడు మాట్లాడుతున్న మాటలు బాధేస్తున్నాయి. ఆరోజుల్లో మీరు ఎంత మందికి పదవులు ఇచ్చారు? ఎంత మంది బీసీలకు మీరు పదవులు ఇప్పించారు?' అని ప్రశ్నించారు.

Also Read: BRS Party: ఎవరి చేతిలో కవిత కీలుబొమ్మ.. ఆమె తీరుతో కేసీఆర్‌ కంటతడి

హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతతో కలిసి మాజీ జెడ్పీ చైర్‌పర్సన్‌ తుల ఉమ కీలక వ్యాఖ్యలు చేశారు. 'కవిత జైలుకు వెళ్లినప్పుడు పార్టీకి ఎంత నష్టం జరిగిందో అందరికీ తెలుసు. జైలులో ఉన్నప్పుడు మిమ్ములను మీ కోసం ఎంత కష్టపడి అక్కడే ఉన్నారో అందరికీ తెలుసు. జైలులో ఉన్నప్పుడు బీజేపీ మెప్పు కోసం మాట్లాడారో తెల్వదా? బీజేపీకి మద్దతునిస్తూ పోస్టులు పెట్టిన సంగతి మర్చిపోతే ఎలా? అయోధ్య రాముడి గురించి పోస్టులు పెట్టి పొద్దున్నే డిలీట్ చేసింది మీరు కాదా?' అని తుల ఉమ నిలదీశారు.

Also Read: Luxury Bikes: లగ్జరీ బైక్‌ దొంగల ముఠా అరెస్ట్‌.. కేటీఎం, బుల్లెట్‌లే వారి లక్ష్యం

'జాగృతి జాగృతి అంటున్నారు మీరు చేసే జాగృతి కార్యక్రమాలకు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పని చేయలేదా? బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు లేనిదే మీరు ఊర్లలో మీ జాగృతి కార్యక్రమాలు చేశారా? తెలంగాణ ప్రజలు తెలంగాణ కోసం అన్ని వదులుకొని పని చేశారు. నీలాగా ఎలాంటిది ఆశించలేదు? అనేక మంది ఉద్యమకారులకు ఉద్యోగాలు వచ్చాయి. అనేక కార్యక్రమాలు తెలంగాణ ప్రభుత్వం ఆనాడు చేసింది. 
మీకు ఏదో నష్టం జరిగినట్లు చెబుతున్నారు. శాసనమండలిలో మీ వ్యక్తిగత విషయాలు చెప్పడానికా? ప్రజా సమస్యలు కదా శాసన మండలిలో చెప్పాల్సినవి. శాసన మండలిలో మాట్లాడిన మాటలు ఎవరికి లాభం జరుగుతుంది' అని తుల ఉమ వివరించారు.

Also Read: NRI Nikitha: ఎన్నారై యువతి హత్యకేసులో భారీ ట్విస్ట్‌.. బాయ్‌ఫ్రెండ్‌ కాదు అతడు ఎవరంటే?

'కేసీఆర్‌పై రోజు తిట్టే వారికి లాభం జరుగుతుందా? మీరు బీఆర్ఎస్ పార్టీని రోజు విమర్శిస్తే మర్చిపోతే ఎలా? మద్యం కుంభకోణం సమయంలో ప్రధాన పత్రికలను ఉద్దేశించి తప్పుడు వార్తలు రాస్తే కేసులు పెడతా అన్నారు పెట్టరా? ఇవాళ తను కన్నీళ్లు పెట్టుకున్న పద్దతి పాలన వారికి నష్టం జరిగింది. ఈ వర్గాలకు నష్టం జరిగిందో అని కన్నీళ్లు పెట్టుకుంటే బాగుంటుంది. ఆమె వ్యక్తిగత విషయాలు కోసం ఆమె కన్నీళ్లు పెట్టుకున్నది. ఆమె ఆవేదనతో బీఆర్‌ఎస్‌ పార్టీకి, కేసీఆర్‌కు నష్టం చేసే పని చేస్తోంది' అని మాజీ జెడ్పీ చైర్‌పర్సన్‌ తుల ఉమ తెలిపారు.

'లిక్కర్ స్కాంలో నీ పాత్ర లేదని ఇదే లక్ష్మీనరసింహ స్వామి మీద ప్రమాణం చేస్తారా?' అని కవితకు మాజీ జెడ్పీ చైర్‌పర్సన్‌ తుల ఉమ సవాల్‌ చేశారు. లిక్కర్ స్కాంతో కేజ్రీవాల్ అంతకు దిగజారి పోయారని తెలిపారు. ఆమె మాట్లాడే మాటలు తెలంగాణ ప్రజలు, పేదలకు బడుగు బలహీన వర్గాలకు లాభం చేకూర్చే విధంగా ఉండాలి. మీరు పార్టీ పెట్టుకోండి ఎవరికి అభ్యంతరం లేదు. అధికార పార్టీకి అండగా వారికి లాభం చేకూరే విధంగా మాట్లాడుతున్నారు. రోజు మీడియా ముందుకు వచ్చి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు అందరికీ తెలుసు. కేసీఆర్ లేకపోతే కవిత ఎవరు?' అని తుల ఉమ ప్రశ్నించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
Advertisement
Back to top