icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Pinewz
507002
Kotha YakeshKotha YakeshFollow22 Jul 2024, 07:28 am
0
0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

గృహజ్యోతి లబ్ధిదారులకు షాక్.. 4 లక్షల మందికి ఫ్రీ కరెంట్ కట్!

Hyderabad, Telangana:

Telangana Gruha Jyothi Latest News: తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గృహజ్యోతి పథకం కింద అర్హులైన ప్రతి కుటుంబానికి నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అందిస్తున్న సంగతి తెలిసిందే.. అయితే, NPDCL పరిధిలోని 18 జిల్లాల్లో గత జూన్ నెలలో ఎండల తీవ్రత లేదా ఇతర కారణాల వల్ల విద్యుత్ వినియోగం పెరిగిన్నట్లు తెలుస్తోంది.. 200 యూనిట్ల పరిమితి కంటే ఎక్కువ విద్యుత్‌ను వాడిన కారణంగా.. దాదాపు 4 లక్షల మంది వినియోగదారులు ఈ సారి గృహజ్యోతి పథకం లబ్ధిని కోల్పోయారు. వీరందరికీ జూన్ నెలలో సాధారణ బిల్లులు వచ్చాయని తెలుస్తోంది.

22.59 లక్షల మందికి జీరో బిల్లులు..
మరోవైపు.. నిబంధనల ప్రకారం, విద్యుత్ వినియోగించిన మెజారిటీ వినియోగదారులకు ప్రభుత్వం ఊరటనిచ్చిన సంగతి తెలిసిందే.. NPDCL పరిధిలో మొత్తం 26,54,851 మంది అర్హులైన లబ్ధిదారులు ఉండగా.. అందులో 22,59,602 మందికి జూన్ నెలలో 200 యూనిట్ల లోపే విద్యుత్ వినియోగం నమోదైన్నట్లు తెలుస్తోంది. దీంతో వారందరికీ యథావిధిగా జీరో బిల్లులు వచ్చాయి. ఈ 22.59 లక్షల మంది వినియోగదారులకు సంబంధించి రూ.99.18 కోట్ల సబ్సిడీ భారాన్ని తెలంగాణ ప్రభుత్వం భరించి.. డిస్కామ్‌లకు చెల్లించిన్నట్లు తెలుస్తోంది.

మూడు నెలల్లో రూ.2,354 కోట్ల సబ్సిడీ..
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం ప్రారంభమైన నాటి నుంచి ప్రజలకు లభించిన లబ్ధిపై అధికారులు గణాంకాలను విడుదల చేశారు. మార్చి నెల నుంచి జూన్ నెల వరకు గడిచిన కాలంలో NPDCL పరిధిలో మొత్తం 6,48,95,429 మందికి జీరో బిల్లులు అందాయి. ఈ మూడు, నాలుగు నెలల కాలంలో ప్రజలపై పైసా భారం పడకుండా ప్రభుత్వం ఏకంగా రూ.2354.77 కోట్ల భారీ సబ్సిడీని భరించింది.

ఇందులో భాగంగా వినియోగదారులు మొత్తం 5,384.04 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను వినియోగించుకున్నట్లు అధికారులు వెల్లడించారు. అంతేకాకుండా కోట్ల రూపాయలను ప్రభుత్వం చెల్లించింది. ఇదిలా ఉంటే.. గృహజ్యోతి పథకం నిరుపేద, మధ్యతరగతి కుటుంబాలకు పెద్ద ఆర్థిక వెసులుబాటు కల్పిస్తున్నప్పటికీ.. 200 యూనిట్ల పరిమితిని దాటకుండా జాగ్రత్తపడాలని.. అప్పుడే జీరో బిల్లుల ప్రయోజనం నిరంతరాయంగా అందుతుందని విద్యుత్ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే ఈ జీరో బిల్లుల కోల్పోయిన వారు మళ్లీ పొందుతారో? పొందరో? తెలంగాణ ప్రభుత్వమే వెల్లడించాల్సి ఉంటుంది. 

Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

0
0
Report

దిమ్మతిరిగే బ్యాటరీ.. Realme కొత్త 5G ఫోన్.. ఒక్క చార్జ్‌తో 3 రోజులు పక్కా!

Hyderabad, Telangana:

Realme Narzo 100x 5g: ప్రముఖ చైనీ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ Realme భారత మార్కెట్లోకి మరో సరికొత్త పవర్‌ఫుల్ మొబైల్‌ను విడుదల చేసింది. నార్జో సిరీస్‌లో భాగంగా అత్యంత భారీ బ్యాటరీతో కూడిన Realme Narzo 100x 5G స్మార్ట్‌ఫోన్‌ అధికారికంగా లాంచ్‌ అయ్యింది. ఇది అద్భుతమైన ఫీచర్లతో పాటు దిమ్మతిరిగే బ్యాటరీని కలిగి ఉంటుంది. బడ్జెట్ ధరలో లభించే ఈ ఫోన్ ప్రత్యేకతలు, ధర వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..

అదిరిపోయే డిస్‌ప్లే.. 
ఈ స్మార్ట్‌ఫోన్ 6.6 అంగుళాల హెచ్‌డీ ప్లస్ (HD+) LCD డిస్‌ప్లేను కలిగి ఉంటుంది.. ఇది 1570×720 పిక్సెల్స్ రెజల్యూషన్‌తో పాటు అత్యంత వేగవంతమైన 144Hz రిఫ్రెష్ రేట్, 1200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉందని కంపెనీ తెలిపింది.. దీనివల్ల ఎండలో కూడా స్క్రీన్ చాలా అద్భుతంగా కనిపిస్తుంది.. ఇక పర్ఫార్మెన్స్ విషయానికొస్తే.. ఇందులో పవర్‌ఫుల్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 5జీ (MediaTek Dimensity 6300 5G) చిప్‌సెట్‌ను కలిగి ఉంటుంది.. ఇది ఆండ్రాయిడ్ 16 ఆధారిత రియల్‌మి యూఐ 7.0 (Realme UI 7.0) ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుందని కంపెనీ తెలిపింది..

పవర్‌ఫుల్ బ్యాటరీ..
ఈ  Realme Narzo 100x 5G ఫోన్ ప్రధాన ఆకర్షణ దీని భారీ బ్యాటరీగా భావించవచ్చు. మార్కెట్లో మరే బడ్జెట్ ఫోన్‌లోనూ లేని విధంగా ఇందులో కంపెనీ ఎంతో శక్తివంతమైన 8,000mAh బ్యాటరీని అందించారు. దీనికి తోడు 45W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌ను కూడా అందిస్తోంది. ఒక్కసారి చార్జ్ చేస్తే రెండు నుంచి మూడు రోజుల పాటు బ్యాటరీ బ్యాకప్ అందిస్తుందని కంపునీ తెలిపింది..

అద్భుతమైన కెమెరా..
ఫొటోగ్రఫీ కోసం.. రియల్‌మి నార్జో 100ఎక్స్ 5జీ వెనుక భాగంలో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను కలిగి ఉంటుందని కంపెనీ తెలిపింది.. దీని ద్వారా అద్భుతమైన ఫొటోలు, వీడియోలు తీసుకునే అవకాశాన్ని అందిస్తోంది. అలాగే సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ కెమెరాను కూడా అందిస్తోంది.. భద్రత కోసం ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లో ప్రొటక్షన్‌ కోసం IP65 రేటింగ్‌తో వస్తుంది. 

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

ధరలు, వేరియంట్ల వివరాలు..
భారతదేశంలో ఈ ఫోన్ మూడు వేరియంట్లలో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులోని మొదటి స్టోరేజ్ వేరియంట్ 4GB రామ్‌తో పాటు 128GB స్టోరేజ్ ధర రూ.20,999లోపే లభిస్తోంది. ఇక రెండవది 6GB రామ్‌తో పాటు 128GB స్టోరేజ్‌తో ధర రూ.22,999, మూడవ వేరియంట్ 6GB రామ్‌తో పాటు 256GB స్టోరేజ్‌తో ధర రూ.24,999తో అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఫ్లాష్ ఆరెంజ్ (Flash Orange), మిడ్‌నైట్ బ్లాక్ (Midnight Black) అనే రెండు రంగులలో అందుబాటులోకి వచ్చింది. జూలై 22 నుంచి రియల్‌మి అధికారిక వెబ్‌సైట్‌, ప్రముఖ ఈ-కామర్స్ సైట్ అమెజాన్ (Amazon)లో కొనుగోలు చేయవచ్చు. లాంచ్ ఆఫర్స్‌లో భాగంగా కొనుగోలు చేస్తే..రూ.2,000 ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్, రూ.500 కూపన్ డిస్కౌంట్ లభించనున్నాయి. 

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report

9,000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో Redmi K100 సిరీస్.. ఫీచర్స్ లీక్!

Hyderabad, Telangana:

Redmi K100 Series: స్మార్ట్‌ఫోన్ ప్రియులకు అదిరిపోయే వార్త.. ప్రముఖ చైనీస్ బ్రాండ్ Redmi మార్కెట్లోకి అద్బుతమైన ఫీచర్లతో కొత్త మొబైల్ సిరీస్‌ను విడుదల చేసేందుకు సిద్ధమైంది.. టెక్ ప్రపంచంలో సంచలనం సృష్టించేందుకు కంపెనీ రెడ్‌మి K100 (Redmi K100) సిరీస్‌ను లాంచ్‌ చేసేందుకు రెడీ అయ్యింది. అంతేకాకుండా ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన లీక్స్‌ కూడా ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సిరీస్‌లోని హై-ఎండ్ మోడల్‌లో ఏకంగా 9,000mAh భారీ బ్యాటరీతో పాటు 200 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను అందిస్తున్నట్లు తెలుస్తోంది.. ప్రముఖ మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ వేబో (Weibo)లో టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ ఈ వివరాలను వెల్లడించారు. ప్రస్తుతం ఈ సిరీస్‌కు సంబంధించిన ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..

అద్భుతమైన డిస్‌ప్లే.. 
ఈ రెడ్‌మి K100 ప్రో లేదా K100 ప్రో మాక్స్ మోడల్‌లో డిస్‌ప్లే పరంగా భారీ మార్పులు చేయబోతున్నట్లు తెలుస్తోంది.. లీకైన వివరాల ప్రకారం.. ఈ స్మార్ట్‌ఫోన్ ఫ్లాట్ డిస్‌ప్లేతో పాటు రౌండెడ్ కార్నర్స్‌ను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది.. విజువల్స్ అత్యంత స్పష్టంగా.. స్మూత్‌గా ఉండటం కోసం దీనికి ఏకంగా 185 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌ను అందిస్తున్నట్లు సమాచారం. గేమ్స్ ఆడేటప్పుడు, వీడియోలు చూసేటప్పుడు వినియోగదారులకు సరికొత్త అనుభూతిని ఇచ్చేందుకు ఈ డిస్‌ప్లేలో అత్యాధునిక టెక్నాలజీని కూడా వినియోగించిన్నట్లు తెలుస్తోంది..

200MP కెమెరా వివరాలు..
ఫోటోగ్రఫీ ప్రియులను ఆకట్టుకునేలా ఈ ఫోన్ వెనుక భాగంలో భారీ కెమెరా సెటప్‌ను అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో 200 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో పాటు 50 మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా (Periscope Telephoto Camera) కూడా అందించబోతున్నట్లు తెలుస్తోంది. గత మోడల్ అయిన రెడ్‌మి K90 ప్రో మాక్స్‌లో కేవలం 50MP ప్రధాన కెమెరాతో పాటు 50MP కెమెరాలను అందించగా.. త్వరలో రాబోయే కొత్త మోడల్‌లో 200MP కెమెరాను అందుబాటులో ఉంచడం విశేషం.. 

సూపర్‌సోనిక్ ప్రాసెసర్..
ఇక ఈ స్మార్ట్‌ఫోన్‌ ప్రాసెసర్‌ విషయానికి వస్తే.. ఈ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ క్వాల్కమ్ కంపెనీకి చెందిన అత్యంత శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 (Snapdragon 8 Elite Gen 5)పై రన్‌ అవుతుంది.. గేమింగ్ సమయంలో అద్భుతమైన గ్రాఫిక్స్, అద్బుతమైన పర్ఫార్మెన్స్ అందించడానికి ప్రత్యేకంగా ఒక  డిస్‌ప్లే చిప్ (Dedicated Display Chip)ను కూడా ఇందులో అందుబాటులోకి తీసుకు వచ్చింది. భద్రత కోసం ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను కూడా అందుబాటులోకి తీసుకు వచ్చింది..

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

9,000mAh మెగా బ్యాటరీ.. 
ఈ స్మార్ట్‌ఫోన్‌ అద్భుతమైన బ్యాటరీని కలిగి ఉంటుంది.. ఈ స్మార్ట్‌ఫోన్ ఎంతో శక్తివంతమైన 9,000mAh మెగా బ్యాటరీని కలిగి ఉంటుంది.. దీనివల్ల ఫోన్ ఛార్జింగ్ ఒక్కసారి పెడితే రోజుల తరబడి వినియోగించవచ్చు. ఇంత పెద్ద బ్యాటరీని వేగంగా ఛార్జ్ చేయడానికి ఎంతో శక్తివంతమైన 100W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కూడా అందిస్తోంది.. ఇక ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన విడుదల వివరాలను కంపెనీ త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. 

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report
Advertisement

8000mAh భారీ బ్యాటరీతో OnePlus N6x లాంచ్.. బడ్జెట్ ధరలోనే ప్రీమియం ఫీచర్స్!

Hyderabad, Telangana:

OnePlus N6x Price Cut: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వన్‌ప్లస్ (OnePlus) మొబైల్ ప్రియులకు మరో అదిరిపోయే గుడ్‌న్యూస్‌ను అందించింది. తక్కువ బడ్జెట్‌లో ప్రీమియం ఫీచర్లు కలిగిన స్మార్ట్‌ఫోన్‌ను అంఅందించే లక్ష్యంతో సరికొత్త N సిరీస్‌ నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసేందుకు సిద్ధమైంది.. గత నెలలోనే మార్కెట్లోకి లాంచ్‌ అయిన వన్‌ప్లస్ N6 విజయవంతం కాగా.. ఇప్పుడు ఈ సిరీస్ నుంచి వన్‌ప్లస్ N6x (OnePlus N6x) అనే అద్భుతమైన మోడల్‌ను భారత మార్కెట్లో లాంచ్ చేయడానికి కంపెనీ సర్వం సిద్ధం చేసింది. ఈ ఫోన్ కి సంబంధించిన మైక్రోసైట్ ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ అమెజాన్ (Amazon)లో ఇప్పటికే లైవ్ అవుతుంది. అయితే, దీనికి సంబంధించిన ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

మూడు రోజుల పాటు నాన్‌స్టాప్ బ్యాటరీ లైఫ్..
ఈ సరికొత్త వన్‌ప్లస్ N6x స్మార్ట్‌ఫోన్ ప్రధానంగా ఎంతో శక్తివంతమైన బ్యాటరీ సామర్థ్యంతో మార్కెట్‌లోకి విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఇందులో కంపెనీ ఏకంగా 8,000 mAh సామర్థ్యం గల భారీ బ్యాటరీని అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది.. ఇది 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో పాటు 5W రివర్స్ వైరల్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఫీచర్‌ను కూడా అందిస్తోంది.. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే ఏకంగా మూడు రోజుల పాటు ఎలాంటి ఆటంకం లేకుండా పనిచేస్తుందని కంపెనీ ధీమా వ్యక్తం చేస్తోంది. అంతేకాకుండా అదనంగా ఫోన్ వేడెక్కకుండా ఉండేందుకు ఇందులో ప్రత్యేకమైన వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్‌ను కూడా పొందుపరిచారు.

అద్భుతమైన ఫీచర్లు, డిస్‌ప్లే..
వన్‌ప్లస్ తన వినియోగదారులకు బడ్జెట్ ధరలోనే చాలా ప్రత్యేకమైన డిస్‌ప్లేను అందిస్తోంది. ఈ సిరీస్‌లో రాబోయే ఫోన్ ఆండ్రాయిడ్ 16 (Android 16) ఆధారిత ఆక్సిజన్ ఓఎస్ 16 (OxygenOS 16)ఆపరేటింగ్‌ సిస్టమ్‌పై రన్‌ అవుతుంది. ఇందులో 6.75-ఇంచుల HD+ LCD డిస్‌ప్లేను కంపెనీ అందిస్తోంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో పాటు 1,200 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్ కలిగి ఉంటుంది. దీనివల్ల ఎండలో కూడా స్క్రీన్ చాలా స్పష్టంగా కనిపిస్తుందని కంపెనీ తెలిపింది.. అలాగే, ఇందులో శక్తివంతమైన మీడియాటెక్ డైమెన్సిటీ 6360 అపెక్స్ (MediaTek Dimensity 6360 Apex) ప్రాసెసర్‌తో పాటు ARM Mali-G57 MC2 GPU గ్రాఫిక్స్ కార్డును వినియోగించిన్నట్లు తెలుస్తోంది..

కెమెరా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)..
ఫోటోల ప్రియుల కోసం ఈ స్మార్ట్‌ఫోన్‌ వెనుక భాగంలో 10x డిజిటల్ జూమ్‌తో కూడిన 50 మెగాపిక్సెల్ సింగిల్ కెమెరాను అందుబాటులోకి తీసుకు వచ్చింది.. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ కెమెరాలు కూడా అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది.. అంతేకాకుండా నేటి ట్రెండ్‌కు అనుగుణంగా ఇందులో కొన్ని ప్రత్యేకమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఫీచర్లను కూడా అందుబాటులో ఉంచింది.

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

ధర వివరాలు..
వన్‌ప్లస్ సంస్థ ఈ N సిరీస్‌ను తన పాపులర్ Nord సిరీస్ కంటే తక్కువ ధరలోనే.. అంటే అఫోర్డబుల్ బడ్జెట్ సెగ్మెంట్‌లోనే విడుదల చేసేందుకు సిద్ధమైన్నట్లు తెలుస్తోంది.. నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. దీనికంటే ముందు వచ్చిన వన్‌ప్లస్ N6 (4GB + 128GB) వేరియంట్ ధర రూ.22,999 కాగా ఉండగా.. (6GB + 128GB) వేరియంట్ ధర రూ.24,999గా ఉంది.. ఈ కొత్త వన్‌ప్లస్ N6x మోడల్ ధర కూడా ఇంచుమించు ఇదే బడ్జెట్‌లో అందుబాటులోకి రాబోతున్నట్లు సమాచారం.. అంతేకాకుండా ఇందులో ఫ్రెష్ మింట్, మిడ్‌నైట్ బ్లాక్ రంగుల్లో లభించే అవకాశం ఉంది. 

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report

రెండో తరగతి విద్యార్థికి కల్మా హోంవర్క్.. స్కూల్ ముందు హైడ్రామా..

Hyderabad, Telangana:

Kalma Homework Controversy: సైదాబాద్‌లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఊహించని ఘనట వెలుగు చూసింది.. 2వ తరగతి చదువుతున్న ఒక విద్యార్థి హోమ్‌వర్క్ డైరీని పాఠశాల ముగిసిన తర్వాత తల్లిదండ్రులు గమనించారు. అందులో హోమ్‌వర్క్‌గా కల్మా, సూరహ్ ఫాతిహా రాయాలని.. అలాగే వాటిని చదవాలని ఉపాధ్యాయులు రాసి పంపినట్లు తల్లిదండ్రులు గుర్తించారు. ఇంత చిన్న వయసులోనే ఒక వర్గానికి సంబంధించిన మతపరమైన అంశాలను హోమ్‌వర్క్‌గా ఇవ్వడంపై వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అసలు టీచర్స్‌ ఇలాంటి అంశాలను హోమ్‌వర్క్‌గా ఇవ్వడానికి కారణాలేంటి? పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..

పాఠశాల ప్రాంగణంలో హైడ్రామా..
ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన విద్యార్థి తల్లిదండ్రులు, బంధువులతో కలిసి పాఠశాల యాజమాన్యాన్ని నిలదీసేందుకు స్కూల్‌కు వెళ్లారు. పాఠశాల నిర్వాహకులతో పాటు ప్రిన్సిపాల్‌ను ఈ హోమ్‌వర్క్‌పై వారు గట్టిగా ప్రశ్నించారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.

అంతేకాకుండా పాఠశాల ప్రాంగణంలో తల్లిదండ్రులు, యాజమాన్యం మధ్య జరిగిన ఈ ఘర్షణకు సంబంధించిన దృశ్యాలను కొందరు మొబైల్ ఫోన్లలో చిత్రీకరించారు. ఈ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ అంశంపై నెటిజన్లు దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తుడడం విశేషం.

కఠిన చర్యలకు డిమాండ్..
చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన పాఠశాలల్లో ఇలాంటి మతపరమైన అంశాలను రుద్దడం ఏంటని విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై విద్యాశాఖ అధికారులతో పాటు పోలీసులు తక్షణమే స్పందించి పూర్తిస్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థుల డైరీలో ఆ విధమైన హోమ్‌వర్క్ రాసిన సదరు ఉపాధ్యాయునిపై.. అందుకు బాధ్యులైన స్కూల్ మేనేజ్‌మెంట్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

యాజమాన్యం స్పందన ఏంటి?
ఈ వివాదం స్థానికంగా పెద్ద ఎత్తున సంచలనం సృష్టించినప్పటికీ.. పాఠశాల యాజమాన్యం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన లేదా వివరణ కానీ రాకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.. ఇది పొరపాటున జరిగిందా? లేక ఉద్దేశపూర్వకంగానే ఇచ్చారా? అనే కోణంలో స్పష్టత రావాల్సి ఉంది. స్కూల్ యాజమాన్యం స్పందిస్తేనే.. ఈ వివాదానికి సంబంధించిన పూర్తి నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఈ ఘటన సైదాబాద్ ప్రాంతంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

0
0
Report

శ్రావణ మాసంలో అరుదైన గ్రహాల కదలిక.. ఈ 3 రాశుల వారికి ఇక తిరుగుండదు, డబ్బే డబ్బు!

Hyderabad, Telangana:

Shravana Masam 2026 Effect On Zodiac: పరమశివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన పవిత్ర శ్రావణ మాసం త్వరలోనే మొదలు కాబోతోంది.. ఈ ఏడాది జూలై 30 నుంచి ఆగస్టు 28 వరకు శ్రావణ మాసం కొనసాగుతుంది. అయితే, ఈ శ్రావణ మాసంలో జరగబోయే ఒక అరుదైన గ్రహాల కదలిక జ్యోతిష్య శాస్త్రంలో అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంటుందని జ్యోతిష్యలు తెలుపుతున్నారు. 

సంవత్సరం పొడవునా చాలా అరుదుగా కదలికలు జరిపే శని, గురు గ్రహాలు ఈ పవిత్ర మాసంలో కూడా ప్రత్యేక కదలికలను జరుపుతాడని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. జూలై 27న శని దేవుడు వక్రగతిలోకి వెళ్లడంతో ఆ తర్వాత  కొద్ది రోజులకే, అంటే ఆగస్టు 12న దేవగురువు బృహస్పతి గ్రహం కూడా అస్తమించబోతోంది. అంతేకాకుండా ఆగస్టు 19న గురు గ్రహం ఆశ్లేష నక్షత్రంలోకి సంచారం చేస్తుంది. దీని కారణంగా ఈ కింది రాశులవారి జీవితాల్లో ఊహించని మార్పులు వస్తాయి. 

సింహ రాశి (Leo) 
సింహ రాశి వారికి ఈ సమయంలో జీవితంలో సానుకూల మార్పులు వస్తాయి.. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు వేగంగా పూర్తవుతాయి. మానసిక ఒత్తిడి నుండి ఉపశమనం లభించడమే కాకుండా.. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు సులభంగా తొలగిపోతాయి.. కార్యాలయంలో మీ నాయకత్వ నైపుణ్యాలకు (Leadership Skills) అద్భుతమైన ప్రశంసలు దక్కుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.. దీనివల్ల సమాజంలో మీ గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు విపరీతంగా పెరుగుతాయి.

మేష రాశి (Aries) 
శ్రావణ మాసంలో జరిగే గ్రహాల మార్పుల కారణంగా ఈ మేష రాశివారి జీవితంలో ఆర్థికంగా, వృత్తిపరంగా అత్యంత లాభదాయకంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అంతేకాకుండా వీరి ఆదాయంలో భారీ మార్పులు కూడా వచ్చే ఛాన్స్‌లు ఉన్నాయి. ఇక చాలా కాలంగా నిలిపోయిన డబ్బులు కూడా ఆకస్మాత్తుగా చేతికి కూడా అందుతాయి. అంతేకాకుండా ఉద్యోగాలు చేసేవారికి ఈ సమయంలో ప్రమోషన్స్‌ కూడా లభిస్తాయి. వ్యాపారాలు చేసేవారికి భారీ మొత్తంలో డీల్స్‌ కూడా లభిస్తాయి. 

ధనుస్సు రాశి (Sagittarius) 
ధనుస్సు రాశి వారికి ఈ శ్రావణ మాసంలో అద్భుతమైన అవకాశాలు కూడా కలుగుతాయి. వీరు ఆదాయం పొందడానికి కొత్త మార్గాలు సుగమమవుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అంతేకాకుండా పూర్వీకుల ఆస్తి కలిసిరావడం వల్ల అనుకున్న కోరికలు కూడా సులభంగా నెరవేరే ఛాన్స్‌లు కూడా కనిపిస్తున్నాయి. ధనుస్సు రాశి ఈ సమయంలో ఆర్థికంగా సువర్ణ కాలంగా భావించవచ్చు. భారీ మొత్తంలో డబ్బును కూడా సులభంగా పొందుతారు. అంతేకాకుండా వీరికి వైవాహిక, కుటుంబ జీవితంలో సంతోషకరమైన మార్పులు కూడా సులభంగా లభిస్తాయి. కోరుకున్న కోరికలు కూడా సులభంగా నెరవేరుతాయి. అలాగే ఆరోగ్యం కూడా సులభంగా మెరుగుపడుతుంది. 

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

గమనిక.. 

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..

0
0
Report
Advertisement

జూలై 18 వరకు ఈ 4 రాశుల వారికి గండం.. రాహు-కేతువుల మధ్య అన్ని గ్రహాలు బందీ..

Hyderabad, Telangana:

Rahu Ketu Effect On Zodiac Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. జూలై నెల మధ్యలో ఒక అత్యంత అరుదైన, ప్రమాదకరమైన గ్రహాల కూటమి ఏర్పడుతోంది. ప్రధాన గ్రహాలుగా పరిగణించే సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడితో పాటు గురుడు, శుక్రుడు, శని.. ఇలా అన్ని శక్తివంతమైన గ్రహాలు రాహు-కేతువుల మధ్య చిక్కుకోబోతున్నాయి. జ్యోతిష్య నిపుణుల తెలిపిన వివరాల ప్రకారం.. ఏర్పడిన ఈ గ్రహాల ప్రభావం వల్ల జూలై 18 వరకు కొన్ని రాశుల వారికి తీవ్రమైన నష్టాలతో పాటు ఊహించని ప్రమాదాలు ఎదురయ్యే అవకాశం ఉందని జ్యోతిష్యుతు తెలుపుతున్నారు. 

రాహు-కేతువుల మాయాజాలం.. 
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. రాహువు, కేతువు ఎల్లప్పుడూ ఒకరికొకరు 180 డిగ్రీల కోణంలో సంచారం చేస్తూ ఉంటాయి. ప్రస్తుతం రాహువు కుంభ రాశిలో.. కేతువు సింహ రాశిలో సంచార దశలో కొనసాగుతున్నాయి. ఈ రెండు గ్రహాల మధ్యలో అన్ని గ్రహాలు ఒకే వైపున కేంద్రీకృతమవ్వడం వల్ల ఒక వింతైన బంధనం ఏర్పడిందని జ్యోతిష్యుతు తెలుపుతున్నారు. ప్రస్తుతం సూర్యుడు, బుధుడు మిథునంలో, చంద్రుడితో పాటు గురుడు కర్కాటకంలో, కుజుడు వృషభంలో.. శుక్రుడు సింహంతో పాటు శని మీన రాశిలో సంచార దశలో కొనసాగుతున్నాయి.

ఇలా అన్ని గ్రహాలు రాహు-కేతువుల మధ్య చిక్కుకోవడం వల్ల వాటి శుభ ప్రభావం తగ్గి.. ప్రతికూల శక్తులు బలపడే అవకాశాలు ఉన్నట్లు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అయితే, ఈ గ్రహాల అశుభప్రభావం జూలై 19న ముగుస్తుంది. జూలై 19న చంద్రుడు కన్యా రాశిలోకి ప్రవేశించిన వెంటనే.. ఈ రాహు-కేతువుల బంధం తెగిపోతుందని జ్యోతిష్యుతు తెలుపుతున్నారు.. కానీ ఆలోగా.. అంటే జూలై 18 వరకు కింది 4 రాశుల వారు చాలా అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. లేకపోతే అనేక సమస్యలు రావచ్చని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.

ఈ రాశులవారు తీవ్ర సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి..
సింహ రాశి (Leo)
ప్రస్తుతం కేతువు సింహ రాశిలోనే సంచరించబోతున్నాడు.. దీనితో పాటు శుక్రుడు కూడా ఇదే రాశిలో ఉండడం వల్ల ఈ రాశి వారి ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. మీ ఆత్మవిశ్వాసం దెబ్బతినే ఛాన్స్‌లు ఉన్నాయి. తప్పుడు నిర్ణయాలు తీసుకునే ప్రమాదం ఉంది. వివాహ జీవితంలో లేదా ప్రేమ వ్యవహారాల్లో తీవ్రమైన మనస్పర్థలు.. అవగాహనా లోపం ఏర్పడవచ్చని జ్యోతిష్యులు చెబుతున్నారు. భాగస్వామితో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించడం ఎంతో మంచిది..

కర్కాటక రాశి (Cancer)
కర్కాటక రాశి వారు జూలై 19 వరకు చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఈ రాశిలో సూర్యుడితో పాటు బృహస్పతి ఇద్దరూ కలిసి ఉన్నారు. అయితే, ప్రస్తుతం గురుడు తిరోగమనంలో ఉండడం వల్ల ఆయన ఇచ్చే శుభ ఫలితాలు బలహీనపడతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. దీనివల్ల కుటుంబ బాధ్యతలు ఒక్కసారిగా పెరిగిపోతాయి. మానసిక ఒత్తిడి తీవ్రమవుతుంది. భావోద్వేగాలకు లోనై ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదు.

మిథున రాశి (Gemini)
ఈ గ్రహాల కూటమి మిథున రాశి వారిపై కూడా గట్టి ప్రభావం చూపుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా మీ మాటతీరు, కమ్యూనికేషన్‌, నిర్ణయాత్మక శక్తి దెబ్బతినే అవకాశం ఉంది. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోలేక సతమతమవుతారు. కార్యాలయంలో లేదా అత్యంత ఆప్తులతో అనవసరమైన గొడవలు.. అపార్థాలు ఏర్పడే ఛాన్స్‌ కూడా ఉంది.. మాట్లాడే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవడం మంచిది.

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

గమనిక.. 

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..

0
0
Report

జగన్నాథుడికి ఇష్టమైన రాశులు ఇవే.. ఈ 3 రాశుల వారికి ఇక తిరుగుండదు..

Hyderabad, Telangana:

Lord Jagannath's Favorite Zodiac Signs Telugu: హిందూ సంప్రదాయంలో జగన్నాథ రథయాత్రకు అత్యంత ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది.. ఆషాఢ మాస శుక్ల పక్షమి విదియ తిథి రోజున దేశవ్యాప్తంగా రథయాత్రను అత్యంత వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు. ఈ ఏడాది జూలై 16వ తేదీ గురువారం రోజున జగన్నాథుని రథయాత్ర అంగరంగ వైభవంగా జరగబోతోంది. ఒడిశాలోని పూరీతో పాటు తెలుగు రాష్ట్రాల్లో, దేశంలోని పలు ప్రాంతాలలో ఈ ఉత్సవాన్ని ఎంతో ఘనంగా జరుపుకుంటారు. అయితే, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. జగన్నాథ మహాప్రభువు భక్తులందరికీ సమానంగా అనుగ్రహం అందించినప్పటికీ.. కొన్ని ప్రత్యేక రాశులపై ఎల్లప్పుడు ఆయన ఆనుగ్రహంతో ఆశీస్సులు ఎల్లప్పుడు ఉంటాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఈ రాశుల వారు జీవితంలో ఎలాంటి కష్టాలు ఎదురైనా మహాప్రభువు అనుగ్రహంతో వాటి నుంచి సులభంగా బయటపడతారని జ్యోతిష్యులు చెబుతున్నారు. అయితే, ఆయన ఆనుగ్రహంతో ఏయే రాశులవారికి ఎల్లప్పుడు మేలు జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ రాశులవారికి జగన్నాథుడి అనుగ్రహం..
సింహ రాశి (Leo)
జగన్నాథుడి అనుగ్రహం సింహ రాశివారికి ఎల్లప్పుడు ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. వీరికి ఎల్లప్పుడు ఆత్మవిశ్వాసంతో, ధైర్యసాహసాలతో ఉంటారు.. జగన్నాథ మహాప్రభువు వీరికి నాయకత్వ లక్షణాలను మరింత బలోపేతం చేస్తారు. స్వామివారి ప్రత్యేక కృప వల్ల వీరు తమ కెరీర్‌లో సరికొత్త ప్రయోజనాలు పొందుతారు. సమాజంలో తమకంటూ ఒక ప్రత్యేక ముద్రను వేయడానికి విజయం సాధిస్తారు. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను సైతం వీరు అవకాశాలుగా మార్చుకుంటారు. ప్రతి పరిస్థితిని సానుకూల (Positive) దృక్పథంతో ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి.. వీరి మానవ సంబంధాలపై కూడా జగన్నాథుని కరుణాకటాక్షాలు ఎల్లప్పుడూ ఉంటాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.

వృషభ రాశి (Taurus)
వృషభ రాశి వారికి కూడా జగన్నాథుని ఆశీస్సులు మెండుగా ఉంటాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఈ రాశి వారు చాలా కష్టపడే తత్వం కలిగి ఉండి.. నిజాయితీగా జీవించేందుకు ఇష్టపడతారు.. జగన్నాథుని అనుగ్రహం వల్ల వీరి కష్టానికి తగిన అద్భుతమైన ప్రతిఫలం లభిస్తుంది. వీరి ఆర్థిక స్థితి బలపడటంతో పాటు కుటుంబంలో శాంతితో పాటు సంతోషం కూడా రెట్టింపు అవుతుంది. సమాజంలో, కుటుంబంలో వీరి సంబంధాలు ఎంతో మధురంగా, బలంగా మారుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. వృషభ రాశి వారికి దేవునిపై ఉన్న అచంచలమైన భక్తి, జీవితంలోని ప్రతి కష్టాన్ని అధిగమించే శక్తి లభిస్తుంది.. వీరు తమ ఓర్పు, పట్టుదలతో విజయాలు సాధిస్తారు.

కర్కాటక రాశి (Cancer)
జగన్నాథుడికి అత్యంత ప్రియమైన రాశులలో కర్కాటక రాశి ఒకటి.. ఈ రాశి వారు స్వభావరీత్యా చాలా సున్నితంగా.. భావోద్వేగాలతో నిండి ఉంటారు. జగన్నాథుని ప్రత్యేక అనుగ్రహం వల్ల వీరి మనస్సులోని గందరగోళం తొలగిపోయి.. మానసిక ప్రశాంతత లభిస్తుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. మహాప్రభువు కృపతో వీరి జీవితంలో ఆర్థిక సమస్యలు సులభంగా తగ్గిపోతాయి.. కుటుంబ జీవితం ఎంతో సంతోషంగా సాగుతుంది. ఎలాంటి కష్టాలు వచ్చినా వీరు ధైర్యంగా ఎదుర్కొంటారని జ్యోతిష్యులు చెబుతున్నారు. స్వామివారి ఆశీస్సులు వీరి మనోధైర్యాన్ని ఎంతగానో పెంచుతాయి..

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

గమనిక.. 

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..

0
0
Report

కేంద్ర మంత్రికి కేటీఆర్‌, బీఆర్‌ఎస్‌ పార్టీ విజ్ఞప్తి.. ఆదిలాబాద్ సీసీఐని వెంటనే తెరిపించాలి

New Delhi, Delhi:

Adilabad CCI Factory: ఆదిలాబాద్‌ ప్రాంతానికి ఊపిరి పోసే సీసీఐ పరిశ్రమను పునరుద్ధరణ చేయాలని బీఆర్‌ఎస్‌ పార్టీ డిమాండ్ చేసింది. సీసీఐ తెరిపించేదాకా బీఆర్‌ఎస్ పోరాటం కొనసాగుతుందని ప్రకటించింది. ఆదిలాబాద్ సీసీఐకి కేంద్రం సానుకూలంగా ఉన్నదని మంత్రి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం పదేళ్లుగా బీఆర్‌ఎస్‌ పార్టీ అనేక సందర్భాల్లో చేసిన ఒత్తిడి ఫలితంగా సీసీఐ ఆదిలాబాద్ పునరుద్ధరణపై సానుకూలంగా ఉన్నట్టు ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ తెలిపారు.

ఆదిలాబాద్‌లోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ప్లాంట్‌ను వెంటనే తెరిపించాలని డిమాండ్ చేస్తూ కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్‌డీ కుమారస్వామితో బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ముఖ్య నాయకుల బృందం సమావేశమైంది. సీసీఐ ప్లాంట్‌ను పునరుద్ధరించాలని కోరుతూ మాజీ మంత్రి జోగురామన్న, బీఆర్‌ఎస్ పార్టీ రాజ్యసభ ఫ్లోర్ లీడర్ వద్దిరాజు రవిచంద్ర నేతృత్వంలో సీసీఐ సాధన సమితి సభ్యుల బృందం కేంద్ర మంత్రి కుమారస్వామిని కలిసి వినతిపత్రం సమర్పించింది. దాదాపు అరగంట సేపు సాగిన ఈ సమావేశంలో ప్లాంట్ పునరుద్ధరణకు ఉన్న అవకాశాలు, ఎదురవుతున్న ఆటంకాలపై బీఆర్‌ఎస్‌ పార్టీ బృందం క్షుణ్ణంగా చర్చించింది.

ఈ సమావేశంలో సీసీఐ పునరుద్ధరణకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా ఉందని మంత్రి స్పష్టం చేశారని బీఆర్‌ఎస్‌ పార్టీ బృందం వెల్లడించింది. సీసీఐ ప్లాంట్ పునఃప్రారంభం కావడానికి ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ ప్రోత్సాహం, చిత్తశుద్ది ఎంతో అవసరమని మాజీ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. కేంద్రం అడిగిన వివరాలపై స్పందిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్లాంట్ కోసం ఎలాంటి ప్రతిపాదనలు చేస్తుందో, ఎంత పెట్టుబడి పెడుతుందో వెంటనే బహిరంగంగా ప్రకటించాలని బీఆర్‌ఎస్‌ పార్టీ బృందం డిమాండ్ చేసింది. మారుమూల ప్రాంతానికి చెందిన వేలాదిమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే ఈ సీసీఐ ప్లాంట్‌ను తిరిగి తెరిపించే వరకు బీఆర్‌ఎస్ పార్టీ తన పోరాటాన్ని నిరంతరం కొనసాగిస్తుందని ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌, బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు కేంద్ర మంత్రికి వివరిస్తూ.. 1980వ దశకంలో ఏర్పాటైన ఆదిలాబాద్ సీసీఐ ప్లాంట్ ఒకప్పుడు 6 వేల మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి కల్పించి ఆ ప్రాంతానికి జీవనాధారంగా నిలిచిందని గుర్తుచేశారు. వందేళ్లకు సరిపడా సున్నపురాయి నిల్వలు అక్కడ పుష్కలంగా అందుబాటులో ఉన్నాయని, 4 లక్షల మెట్రిక్ టన్నుల కెపాసిటీ కలిగిన ఈ ప్లాంట్‌ను తిరిగి విజయవంతంగా నడపడానికి అన్ని రకాల అవకాశాలు సంపూర్ణంగా ఉన్నాయనే విషయాన్ని కేంద్ర మంత్రికి బీఆర్‌ఎస్‌ పార్టీ బృందం వివరించింది.

2019 పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో అప్పటి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, సహాయ మంత్రి హన్సరాజ్ గంగారామ్ ఆదిలాబాద్‌ సీసీఐ ప్లాంట్‌ను తప్పకుండా తెరిపిస్తామని హామీ ఇచ్చినట్లు బీఆర్‌ఎస్‌ పార్టీ బృందం గుర్తుచేసింది. నేడు క్షేత్రస్థాయిలో దీన్ని తెరిపించాల్సింది పోయి తుక్కు (స్క్రాప్) కింద మార్చి విక్రయిస్తున్నారని మాజీ మంత్రి కేటీఆర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌ పార్టీ విజ్ఞప్తిపై కేంద్ర మంత్రి కుమారస్వామి సానుకూలంగా స్పందించినట్లు వెల్లడించారు.

కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ప్లాంట్‌ను మళ్లీ నడపాలనే బలమైన కోరికతోనే ఉందని, దీనికోసం కచ్చితంగా ప్రయత్నం చేస్తామని బీఆర్‌ఎస్‌ పార్టీ బృందానికి కేంద్ర మంత్రి కుమార స్వామి హామీ ఇచ్చారు. అక్కడ 2,300 ఎకరాల భూమి అందుబాటులో ఉందని.. దీనిలో 770 ఎకరాలు కంపెనీకి చెందిన పట్టా భూమి కాగా.. 1,500 పైచిలుకు ఎకరాలు లీజ్ ల్యాండ్ రూపంలో ఉందని వివరించారు. ఇక్కడ రూ.2 వేల కోట్ల పెట్టుబడితో సరికొత్త ఫ్యాక్టరీని పెట్టినట్టయితే చాలా బాగుంటుందని కేంద్ర మంత్రి వివరించారు.

0
0
Report
Advertisement

తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు తరగతి గదుల్లోనే ఉంది.. చదువే ఆత్మగౌరవాన్ని పెంచుతుంది: రేవంత్‌ రెడ్డి

Kothakota, Telangana:

Kothakota Girls High School: కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో అమరుల ఆశయాలకు, త్యాగాలకు గత ప్రభుత్వం గుర్తింపు ఇవ్వలేదని బీఆర్‌ఎస్‌ పార్టీపై రేవంత్‌ రెడ్డి విమర్శలు చేశారు. తెలంగాణ పునర్నిర్మాణంలో మీరంతా భాగస్వాములు కావాలన్న అమరుల ఆశయాన్ని కాంగ్రెస్‌ ప్రభుత్వం ముందుకు తీసుకెళుతోందని చెప్పారు. మౌలిక వసతులు లేకపోవడంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిందని తెలిపారు. ఇంటి పేర్లు నీళ్లు అని పెట్టుకున్నోల్లు కూడా ఈ పాఠశాల గురించి ఆలోచన చేయలేదని మాజీ మంత్రి నిరంజన్‌ రెడ్డిని విమర్శించారు. కానీ ఇక్కడి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఈ పాఠశాల భవనాలు నిర్మించి సౌకర్యాలు కల్పించారని కొనియాడారు.

వనపర్తి జిల్లా కొత్తకోట బాలికల ఉన్నత పాఠశాల నూతన భవన  ప్రారంభోత్సవ కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి కీలక ప్రసంగం చేశారు. 'చదువొక్కటే మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది.. మన జీవితాల్లో వెలుగులు నింపుతుంది. చదువే మన ఆత్మగౌరవాన్ని పెంచుతుంది.. తల్లిదండ్రుల కళ్లల్లో ఆనందం నింపుతుంది' అని తెలంగాణ ముఖ్యమంత్రి పేర్కొన్నారు. గత ప్రభుత్వం విద్యాశాఖపై నిర్లక్ష్యం వహించిందని బీఆర్‌ఎస్‌ పార్టీపై రేవంత్‌ రెడ్డి విమర్శలు చేశారు. ప్రజా ప్రభుత్వం (కాంగ్రెస్‌) అధికారంలోకి రాగానే విద్యాశాఖకు సీనియర్ అధికారులను నియమించామని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు తరగతి గదుల్లోనే ఉందని తాను సంపూర్ణంగా నమ్ముతున్నట్లు తెలంగాణ సీఎం ప్రకటించారు. అందుకే విద్యాశాఖను తన దగ్గరే పెట్టుకున్నట్లు పేర్కొన్నారు.

'ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయకపోతే వందేళ్లయినా సమస్య పరిష్కారమా కాదు. ప్రజా ప్రభుత్వంలో ప్రభుత్వ పాఠశాలలపై ప్రత్యేక దృష్టి పెట్టాం. మొదట ఉపాధ్యాయుల ప్రమోషన్లు, బదిలీలు పూర్తి చేసి సమస్యను పరిష్కరించాం' అని రేవంత్ రెడ్డి వివరించారు. విద్యలో దేశంలో తెలంగాణ 18వ స్థానం పొందిందని.. విద్యలో తెలంగాణను దేశంలోనే మొదటి రెండు స్థానాల్లో నిలబెట్టాల్సిన బాధ్యత అందరిపై ఉందని గుర్తుచేశారు.

విద్యార్థులకు, యువతకు సాంకేతిక నైపుణ్యం అందిచే చర్యలు చేపట్టామని.. ఐటీఐలను బలోపేతం ఏటీసీలుగా అప్‌గ్రేడ్ చేసినట్లు రేవంత్ రెడ్డి వెల్లడించారు. 'జర్మనీ, జపాన్ లో బ్లూ కాలర్ జాబ్స్ కు మెరుగైన అవకాశాలు ఉన్నాయి. 27, 50,000 మందికి పంద్రాగస్టులోగా యంగ్ ఇండియా కిట్స్ పంపిణీ పూర్తి చేస్తాం. ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటే ఏమవుతారని మిమ్మల్ని అడిగితే మీ రేవంతన్నను చూపించండి' అని తెలంగాణ సీఎం తెలిపారు.  

'ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే నేను ముఖ్యమంత్రి స్థాయికి చేరా. ప్రభుత్వ పాఠశాలలే తెలంగాణ పునర్నిర్మాణంలో కీలక పాత్ర పోషించాలి. కలం పట్టి తెలంగాణ భవిష్యత్తును తీర్చిదిద్దాలి' అని విద్యార్థులకు తెలంగాణ సీఎం సూచించారు. చదువుతోపాటు మైదానాల్లో పోటీపడాలని చెప్పారు. మట్టిలో మాణిక్యాలను వెలికితీయాలని.. క్రీడల్లో రాణించిన  మీ భవిష్యత్తును తీర్చిదిద్దే బాధ్యత తనదని రేవంత్‌ రెడ్డి ప్రకటించారు. 'రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో విద్యార్థిపై ఏడాదికి రూ.లక్షా 8 వేలు ఖర్చు చేస్తుంది. బాగా చదువుకోండి.. జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకోండి' అని తెలంగాణ సీఎం సూచించారు.

0
0
Report

ఒళ్లంతా కారం నీళ్లతో అభిషేకం.. వైరల్ అవుతున్న భక్తుడి వింత మొక్కు!

Hyderabad, Telangana:

  Thaipusam Festival Viral Video: భక్తికి హద్దులు లేవని.. నమ్మకం ముందు ఎలాంటి శారీరక శ్రమ అయినా తలవంచాల్సిందేనని తమిళనాడులో జరిగిన ఒక వింత ఆచారానికి సంబంధించిన ఘటన మరోసారి నిరూపించింది. తమిళనాడులోని విళ్లుపురం జిల్లా, సిద్ధాత్తూరు గ్రామంలో ప్రతి ఏటా ఎంతో వైభవంగా జరిగే తైపూసం ఉత్సవాలు ఈసారి తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. అంతేకాకుండా వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.. మురుగన్ స్వామి భక్తుడు ఒకరు పెట్టుకున్న వింత మొక్కుబడి.. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ మొక్కుబడి ఏంటి? అసలు వైరల్ అవుతున్న వీడియో ఏంటి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.. 

కారం నీళ్లతో అభిషేకం..
సాధారణంగా దేవుళ్లకు పాలు, పెరుగుతో పాటు పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లతో అభిషేకాలు చేయడం మనం చూస్తుంటాం. కానీ.. సిద్ధాత్తూరులో జరిగిన తైపూసం ఉత్సవాల్లో మాత్రం ఇందుకు భిన్నంగా ఒళ్లు గగుర్పొడిచే దృశ్యం ఆవిష్కృతమైంది. మురుగన్ స్వామిపై ఉన్న అమితమైన భక్తితో ఒక భక్తుడు తన శరీరంపై మిరపపొడి కలిపిన నీటితో అభిషేకం చేయించుకున్నాడు.

స్వామివారికి మొక్కుకున్న మొక్కు తీర్చుకునే.. క్రమంలో భాగంగానే ఈ కఠినమైన ఆచారాన్ని నిర్వహించినట్లు తెలుస్తోంది. సదరు భక్తుడు నిలబడి ఉండగా.. ఇతర భక్తులు, పూజారులు పెద్ద ఎత్తున మిరపపొడి కలిపిన ఎర్రటి నీటిని అతడి తలపై.. శరీరంపై కుమ్మరించారు. కంటికి కారం తగిలితేనే.. తట్టుకోలేని ఈ రోజుల్లో.. ఒళ్లంతా కారం నీళ్లతో అభిషేకం చేయించుకుంటూ.. సదరు భక్తుడు చూపిన నిబ్బరం అందరినీ ఆశ్చర్యపరిచింది.

 
 
 
 
 
 

సోషల్ మీడియాను ఊపేస్తున్న వీడియో..
ఈ వింత ఆచారానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో క్షణాల్లో వైరల్‌గా మారింది. నెటిజన్లు ఈ దృశ్యాలను చూసి రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇది భక్తి ప్రపత్తులా? లేక మూఢనమ్మకమా? అంటూ సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. మరికొందరు ఇలాంటి శరీరానికి హాని కలిగించే పద్ధతులు అవసరమా? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా సోషల్ మీడియాలో వీడియో విపరీతంగా వైరల్ అవుతూ వస్తోంది.

Read more: Nepal Elephant Attack: పగబట్టిన ఏనుగు.. 14 ఏళ్ల తర్వాత వెతుక్కుంటూ వచ్చి మరీ దాడి.. మ్యాటర్ ఏమిటంటే..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

  

  

0
0
Report
Advertisement

క్లాస్‌రూమ్‌లోనే ఉపాధ్యాయుల రాసలీలలు.. రొమాన్స్‌ వీడియో వైరల్‌..

Hyderabad, Telangana:

Teachers Romancing Video: అక్షరాలు నేర్పి.. పిల్లలను ఉన్నత విలువలతో తీర్చిదిద్దాల్సిన గురువులు ఈ బడిలో దారి తప్పి.. సమాజం ముక్కున వేలేసుకునేలా.. తోటి ఉపాధ్యాయులు తలదించుకునేలా ప్రవర్తించారు.. పవిత్రమైన దేవాలయం లాంటి పాఠశాల గదిని.. తమ కామక్రీడలకు వేదికగా మార్చుకున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్ జిల్లాలో ఒక ప్రభుత్వ పాఠశాల క్లాస్‌రూమ్‌లో ఒక ఉపాధ్యాయుడు, ఉపాధ్యాయురాలు రొమాన్స్‌ చేసుకుంటున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతోంది.. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..

సోషల్ మీడియాను ఊపేస్తోన్న వైరల్ వీడియో..
వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం.. సదరు పాఠశాలలో అసిస్టెంట్ టీచర్లుగా పనిచేస్తున్న ఒక ఉపాధ్యాయుడు, ఉపాధ్యాయురాలు క్లాస్‌రూమ్‌లోనే ఒకరినొకరు రొమాస్స్‌ చేసుకుంటూ.. ముద్దులు పెట్టుకుంటూ.. కెమెరాకు చిక్కారు. ఈ దృశ్యాలను ఎవరో మొబైల్ ఫోన్‌లో రికార్డ్ చేసి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది.

విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన క్లాస్‌రూమ్‌లో ఇలాంటి అశ్లీల పనులకు చేయడంతో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన వారే ఇలా ప్రవర్తిస్తే ఇక సమాజానికి ఏం సందేశం ఇస్తారు? అంటూ విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

రంగంలోకి విద్యాశాఖ.. 
ఈ వ్యవహారం కాస్తా కాస్తా ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో విద్యాశాఖ అలర్ట్ అయిన్నట్లు తెలస్తోంది. కన్నౌజ్ జిల్లా బేసిక్ శిక్షా అధికారి (BSA) ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన్నట్లు సమాచారం. బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ (BEO)ను ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు చేసి.. తక్షణమే నివేదిక సమర్పించాల్సిందిగా ఆదేశించారు. వైరల్ వీడియోలోని ఉపాధ్యాయులు ఎవరు? అది ఏ పాఠశాలలో జరిగింది? అనే విషయాలపై విచారణ జరుపుతున్నారు. 

విద్యావ్యవస్థకే మచ్చ..
సాధారణంగా పాఠశాలల్లో ఉపాధ్యాయులను దైవంతో సమానంగా చూస్తూ ఉంటారు.. కానీ, ఇలాంటి ఘటనలు ఉపాధ్యాయ వృత్తికే మచ్చ తెస్తున్నాయని విద్యావేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తూ వస్తున్నారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా.. భవిష్యత్తులో ప్రభుత్వ పాఠశాలల్లో ఇలాంటి అసాంఘిక పనులు జరగకుండా కఠినమైన నిబంధనలు అమలు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ కేసులో విచారణ ముగిసిన తర్వాత మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

Read more: Nepal Elephant Attack: పగబట్టిన ఏనుగు.. 14 ఏళ్ల తర్వాత వెతుక్కుంటూ వచ్చి మరీ దాడి.. మ్యాటర్ ఏమిటంటే..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

0
0
Report
Advertisement
Advertisement
Back to top