icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Pinewz
507002
Kotha YakeshKotha YakeshFollow22 Jul 2024, 07:28 am
0
0
Report

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

Uppal Stadium: ఉప్పల్‌ స్టేడియంలో అధ్వానం.. ఖర్చీఫ్‌లతో తుడుచుకున్న ప్రేక్షకులు

Hyderabad, Telangana:

Fans Wipe Chairs: ఐపీఎల్‌ 2026 సీజన్‌ ప్రారంభమై ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తుండగా.. హైదరాబాద్‌లో తొలి మ్యాచ్‌ జరిగింది. సొంత జట్టు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మ్యాచ్‌ జరగడంతో పెద్ద ఎత్తున ప్రేక్షకులు ఉప్పల్‌ స్టేడియానికి వచ్చారు. జరిగిన తొలి మ్యాచ్‌కు ఏర్పాట్లు చేయడంలో హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘంతోపాటు తెలంగాణ కాంగ్రెస్‌ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహించింది. ఎంతలా అంటే కుర్చీలు కూడా తుడవలేనంతా అధ్వానంగా ఏర్పాట్లు ఉన్నాయి. దీంతో ప్రేక్షకులు తమ కుర్చీలను ఖర్చీఫ్‌లతో తుడుచుకోవాల్సి వచ్చింది.

Also Read: Sunrisers: నరాలు తెగే ఉత్కంఠలో లక్నో విజయం.. సొంతగడ్డపై పోరాడి ఓడిన సన్‌రైజర్స్‌

క్రికెట్‌ అంటే క్రేజీ ఉండే హైదరాబాద్‌లో ఐపీఎల్‌ పుణ్యాన ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్‌లు ఉన్నాయి. సన్‌రైజర్స్‌ సొంత జట్టు కావడంతో హైదరాబాద్‌లో మ్యాచ్‌లు జరుగుతున్నాయి. లేదంటే ప్రభుత్వం, హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం వ్యవహార శైలికి ఒక్క మ్యాచ్‌ కూడా జరగదు. తాజాగా జరిగిన తొలి మ్యాచ్‌కు కూడా సక్రమంగా ఏర్పాట్లు చేయలేదు. హెచ్‌సీఏ, కాంగ్రెస్‌ ప్రభుత్వం మ్యాచ్‌కు చేయాల్సిన ఏర్పాట్లు పూర్తి నిర్లక్ష్యం వహించింది.

Also Read: Gajwel Bandh: తెలంగాణ తొలి సీఎం కేసీఆర్‌ ఆఫీస్‌పై కాంగ్రెస్‌ గూండాల దాడి.. రేపు గజ్వేల్‌ బంద్‌

అతికష్టంగా టికెట్లు పొందిన క్రికెట్‌ అభిమానులు స్టేడియంలో లోపలకు వెళ్లాక అక్కడ ఉన్న పరిస్థితి చూసి ఓరినాయనో అని అనుకోవాల్సిన పరిస్థితి. కుర్చీలన్నీ దుమ్ముతో నిండిపోయి ఉన్నాయి. ఎలా కూర్చోవాలి అని సంశయం వ్యక్తం చేశారు. మ్యాచ్‌ చూడాలనే ఇష్టంతో వచ్చిన ప్రేక్షకులు ప్రభుత్వాన్ని.. హెచ్‌సీఏను తిట్టేసుకుని తమ కుర్చీలు తుడుచుకుని కూర్చున్నారు. ఖర్చీఫ్‌లు.. టిష్యూలతో సీట్లు తుడుచుకుని మ్యాచ్‌ను వీక్షించారు. ఇక స్టేడియంలోకి సన్ గ్లాసెస్ అనుమతించకపోవడంతో ప్రేక్షకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందే ఎండాకాలం.. పైగా మధ్యాహ్నం సమయంలో మ్యాచ్‌ ఉండడంతో సన్‌గ్లాసెస్‌కు అనుమతించాలని విజ్ఞప్తి చేసినా భద్రతా సిబ్బంది అనుమతించలేదు. ఇక చేసేదేమి లేక సన్ గ్లాసెస్ బయటే పడేసి క్రికెట్‌ అభిమానులు స్టేడియం లోపలకు వెళ్లారు. ఇక స్టేడియం లోపలికి వెళ్లడం.. పార్కింగ్‌ వంటి వాటితో ప్రేక్షకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

Also Read: Klassen Innings: సన్‌రైజర్స్‌ హైదరాబాద్ 156/9.. ఉప్పల్‌ స్టేడియంలో క్లాసెన్‌, నితీశ్‌ రికార్డ్‌ ఇన్నింగ్స్‌

ఐపీఎల్‌ మ్యాచ్‌లకు ముందే ఏర్పాట్లు చేయాల్సి ఉండగా హెచ్‌సీఏతోపాటు రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహించడాన్ని క్రికెట్‌ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం కుర్చీలు కూడా తుడవలేరా? అని ప్రశ్నించారు. ప్రేక్షకులు ఖర్చీఫ్‌లతో కుర్చీలు తుడుచుకుంటున్న వీడియోలు వైరల్‌గా మారాయి. వేల రూపాయలు ఖర్చు పెట్టి టికెట్‌ కొన్నా తమ సీట్లు తామే తుడుచుకోవాల్సిన పరిస్థితి అని ప్రేక్షకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా విలువైన సన్‌గ్లాసెస్‌ వృథాగా బయట పడేయాల్సి వచ్చిందని వాపోతున్నారు. తొలి మ్యాచ్‌ లోపాలు సరిచేసుకుని మిగతా మ్యాచ్‌లకు అయినా సరైన ఏర్పాట్లు చేయాలని క్రికెట్‌ ప్రేమికులు కోరుతున్నారు. ఉప్పల్‌ స్టేడియంలో మళ్లీ ఏప్రిల్‌ 13వ తేదీన మ్యాచ్‌ ఉంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report

Gajwel Bandh: తెలంగాణ తొలి సీఎం కేసీఆర్‌ ఆఫీస్‌పై కాంగ్రెస్‌ గూండాల దాడి.. రేపు గజ్వేల్‌ బంద్‌

Gajwel, Telangana:

KCR Camp Vandalise By Congress Goons: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు దాడి చేయడం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసిన విషయం తెలిసిందే. గజ్వేల్‌ ఎమ్మెల్యేగా ఉన్న కేసీఆర్‌ క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్‌ శ్రేణులు బీభత్సం సృష్టించి అద్దాలు పగలగొట్టి.. ఫర్నీచర్‌ను ధ్వంసం చేయడానికి నిరసనగా బీఆర్‌ఎస్‌ పార్టీ భారీ నిరసన కార్యక్రమం చేపట్టింది. ఈ సందర్భంగా రేపు గజ్వేల్‌ బంద్‌కు పిలుపునిచ్చింది.

Also Read: Sunrisers: నరాలు తెగే ఉత్కంఠలో లక్నో విజయం.. సొంతగడ్డపై పోరాడి ఓడిన సన్‌రైజర్స్‌

ఈ బంద్‌కు సంబంధించిన వివరాలను మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, గజ్వేల్ నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ పార్టీ ఇన్‌చార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి వెల్లడించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి ఫొటో పెట్టాలని ఎక్కడా లేదని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ ఇంట్లో నరేంద్ర మోదీ ఫొటో ఉందా? అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ఇంట్లో ప్రధాని మోదీ ఫొటో ఉందా? అని నిలదీశారు.

Also Read: Klassen Innings: సన్‌రైజర్స్‌ హైదరాబాద్ 156/9.. ఉప్పల్‌ స్టేడియంలో క్లాసెన్‌, నితీశ్‌ రికార్డ్‌ ఇన్నింగ్స్‌

'గజ్వేల్ క్యాంప్ కార్యాలయంలోకి రావడానికి వారికి ఏమి హక్కు ఉంది. గజ్వేల్ 50 సంవత్సరాల ముందుకు కేసీఆర్‌ అభివృద్ధి చేశారు. కాంగ్రెస్ వచ్చాక గజ్వేల్‌లో ఒక్క నిధులు మంజూరు కాలేదు. రౌడీ రాజకీయాలు చేస్తున్నారు. గజ్వేల్ పోలీస్ స్టేషన్‌కు 200 మీటర్ల దూరంలోనే క్యాంప్ కార్యాలయంపై దాడి జరిగితే పోలీస్ వ్యవస్థ ఏం చేస్తోంది' అని బీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు వంటేరు ప్రతాప్ రెడ్డి ప్రశ్నించారు. సిద్దిపేటలో జరిగిన ముఖ్యమంత్రి కార్యక్రమం లో హరీష్ రావు ఫొటో పెట్టలేదు. ప్రజా పాలన అంటున్నారు కానీ చేసేది గుండాల పాలన' అని విమర్శించారు. కేసీఆర్‌ క్యాంపు కార్యాలయంపై దాడికి నిరసనగా ఏప్రిల్‌ 6వ తేదీ సోమవారం గజ్వేల్ బంద్‌కు పిలుపునిస్తున్నట్లు ,డ. పార్టీ గజ్వేల్‌ నియోజకవర్గ ఇన్‌చార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి ప్రకటించారు.

Also Read: Salary Hike: ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలో శుభవార్త.. ఇదే జరిగితే పర్స్‌ ఫుల్‌

అనంతరం మెదక్‌ మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ.. 'గజ్వేల్ నియోజకవర్గాన్ని కేసీఆర్‌ ఆదర్శంగా నిలిపారు. మూడు పర్యాయాలు ఇక్కడి నుండి గెలవడం మామూలు కాదు. భగవాన్ స్వరూపం లాంటి వ్యక్తిపై చిటికెలు వేయడం సరికాదు' అని కాంగ్రెస్‌ శ్రేణుల తీరును ఖండించారు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ కంటే ఎక్కువ అభివృద్ధి చేసి చూపియాలని కాంగ్రెస్‌ గూండాలకు సవాల్‌ చేశారు. ప్రజల గుండెల్లో నిలిచిపోయిన వ్యక్తి కేసీఆర్ అని ప్రశంసించారు. క్యాంప్ కార్యాలయంలో రేవంత్‌ ఫొటో పెట్టాలని జీవో ఉందా అని ప్రశ్నించారు. ఫొటోలు పెడితే అభిమానం ఉండదు ప్రజలకు అభివృద్ధి చేస్తే అభిమానం వస్తదని కాంగ్రెస్‌ నాయకులకు మాజీ ఎమ్మెల్యే పద్మ హితవు పలికారు.

'ప్రజాస్వామ్యం పేరెత్తితే కేసులు పెట్టే పరిస్థితి. తెలంగాణలో కాళేశ్వరం లాంటి ఎన్నో ప్రాజెక్టులను కేసీఆర్‌ నిర్మించారు. ప్రతిపక్షాల మీద ఉన్న శ్రద్ధ ప్రజలపై ఉంటే ఎంతో అభివృద్ధి చేసేవాళ్లు. రాబోయే రోజుల్లో మళ్లీ వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే' అని బీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నాయకురాలు పద్మా దేవేందర్‌ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్‌ను ఒక్క మాట అంటే ప్రజలు మిమ్మల్ని చెదరించుకుంటారని తెలిపారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report
Advertisement

Traffic Challan: ట్రాఫిక్‌ చలాన్‌పై బిగ్‌ అలర్ట్‌.. పెండింగ్‌ చలాన్‌ ఉంటే మీకు చుక్కలే

Hyderabad, Telangana:

Pending Traffic Challan Risks: వాహనదారులకు ట్రాఫిక్‌ చలాన్‌పై బిగ్‌ అలర్ట్‌. చలాన్‌ చెల్లించకపోతే ఏమీ కాదని భారీగా పెండింగ్‌ చలాన్లు ఉంచితే మాత్రం చిక్కులు ఎదుర్కొనవలసిందే. వాహనదారులు ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘిస్తే భారీగా చలాన్లు పడుతుంటాయి. ఆ చలాన్లు చెల్లించకుండా నిర్లక్ష్యం వహిస్తే భవిష్యత్‌లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోనాల్సి ఉంటుంది. ముఖ్యంగా మీ వాహనం విక్రయించాలనుకున్న సమయంలో చలాన్‌ కారణంగా విక్రయించలేకపోవచ్చు.

Also Read: Sunrisers Hyderabad: సన్ రైజర్స్‌కు సొంత గడ్డపై భారీ షాక్.. ఆఫీస్ ముందు తెలంగాణ క్రికెటర్ల ధర్నా

ప్రస్తుతం దేశంలో అత్యాధునిక ట్రాఫిక్‌ నియంత్రణ వ్యవస్థలు వచ్చాయి. వాహనాల రాకపోకలు సక్రమంగా చేయడమే కాకుండా ప్రమాదాలు నివారించడానికి ట్రాఫిక్‌ పోలీస్‌ వ్యవస్థ పని చేస్తుంది. అంతేకాకుండా వాహనదారుల ప్రాణాలు కూడా ఎంతో విలువైనవిగా భావించి సేఫ్టీ చర్యలు చేపడుతోంది. వాటిలో భాగంగా హెల్మెట్‌ తప్పనిసరిగా వినియోగించాలి.. సీట్‌ బెల్ట్‌ పెట్టుకోవాలి. అంతేకాకుండా సిగ్నళ్ల వద్ద తప్పనిసరిగా నిబంధనలు పాటించాలి.. ఫోన్‌ మాట్లాడుతూ డ్రైవింగ్‌, త్రిబుల్‌ రైడింగ్‌, రాంగ్‌ రూట్‌, సిగ్నల్‌ జంపింగ్‌, మద్యం సేవించి వాహనం నడపడం వంటి జాగ్రత్త చర్యలు ట్రాఫిక్‌ పోలీస్‌ పాటిస్తోంది. వీటిని ఉల్లంఘించిన వారిపై చలాన్లు వేస్తూ వారి నుంచి జరిమానా వసూలు చేస్తోంది. బాధ్యతగా ఉండాల్సిన వాహనదారులు నిబంధనలు ఉల్లంఘించడంతో చలాన్‌తో జరిమానా వేస్తున్నారు. అయితే ఈ చలాన్‌ను వాహనదారులు పట్టించుకోవడం లేదు. 

Also Read: Salary Hike: ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలో శుభవార్త.. ఇదే జరిగితే పర్స్‌ ఫుల్‌

ట్రాఫిక్‌ చలాన్లు ఒక్కో వాహనంపై దాదాపు ఐదుకు మించి ఎక్కువ ఉన్నాయని అర్థమవుతోంది. ముఖ్యంగా ఏపీతోపాటు తెలంగాణలో భారీగా వాహనదారుల చలాన్లు పెండింగ్‌లో ఉన్నాయి. తాము ఉల్లంఘించిన ట్రాఫిక్‌ నిబంధనలపై విధించిన చలాన్‌ను వాహనదారులు చెల్లించడం లేదు. దీంతో భారీగా పెండింగ్‌ చలాన్లు పేరుకుపోతున్నాయి. ఈ పెండింగ్‌ చలాన్లపై పోలీసులు స్పెషల్‌ డ్రైవ్‌ పెట్టి చర్యలు తీసుకుంటున్నారు.

అయితే ట్రాఫిక్‌ చలాన్‌ పెండింగ్‌లో ఉంటే ఏం జరుగుతుంది? ఎవరు అడుగుతారులే అని నిర్లక్ష్యం వహిస్తుంటారు. పెండింగ్‌ చలాన్లు ఉండడం ఎప్పటికైనా వాహనదారుడికి ఇబ్బందే. ట్రాఫిక్‌ పోలీస్‌పరంగా పెండింగ్‌ చలాన్‌ తప్పించుకున్నా వేరే విధంగా చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. అవసరం ఉండి మీ వాహనాన్ని ఇతరులకు విక్రయించాలనుకుంటే పెండింగ్‌ చలాన్లు చూస్తున్నారు. పెండింగ్‌ చలాన్‌ అధికంగా ఉంటే కొనాలనుకునేవారు మీ వాహనాన్ని కొనలేరు. అంతేకాకుండా ఇన్స్‌రెన్స్‌ పొందాలనుకున్నా.. రెన్యువల్‌ చేసుకోవాలన్నా పెండింగ్‌ చలాన్లు ఇన్సురెన్స్‌ సంస్థలు చూస్తున్నాయి.

Also Read: CSK vs PBKS: చెన్నై వరుసగా రెండో ఓటమి.. అద్భుత ప్రదర్శనతో పంజాబ్‌ కింగ్స్‌ రెండో విజయం

వాహనంపై వెళ్తున్న సమయంలో పొరపాటున ట్రాఫిక్‌ పోలీసులకు చిక్కారంటే ఇక మీ వాహనం సీజ్‌ అవుతుంది. న్యాయస్థానం ద్వారా తిరిగి వాహనం పొందాల్సి ఉంటుంది. పెండింగ్‌ చలాన్లు కట్టడమే కాకుండా న్యాయస్థానం చుట్టూ తిరగాల్సి ఉంటుంది. చలాన్‌ పడిన వెంటనే చెల్లిస్తే చిన్న మొత్తంలో అవుతుంది. అదే భారీగా పేరుకుపోయిన చలాన్లు ఉంటే తర్వాత పోలీసుల ద్వారా చెల్లించాల్సి వస్తే అది భారీగా ఉంటుంది. అందుకే ఎప్పటి సమస్యను అప్పుడే పరిష్కరించుకోవాలని అంటారు. సమస్య చిన్నగా ఉన్నప్పుడే పరిష్కరించుకోవాలి. ఈరోజు తక్కువలో ఉన్నప్పుడే చలాన్లు చెల్లిస్తే భవిష్యత్‌లో భారీగా ఉండవు. అన్నింటికన్నా ముఖ్యమైనది అసలు ట్రాఫిక్‌ నిబంధనలు పాటిస్తే ఎలాంటి గొడవ ఉండదు. సురక్షితంగా ప్రయాణం చేయడంతోపాటు చలాన్ల బాధ కూడా ఉండదు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report

Sunrisers: నరాలు తెగే ఉత్కంఠలో లక్నో విజయం.. సొంతగడ్డపై పోరాడి ఓడిన సన్‌రైజర్స్‌

Hyderabad, Telangana:

Sunrisers Hyderabad: సొంత గడ్డ ఉప్పల్‌ స్టేడియంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు తీవ్ర నిరాశ ఎదురైంది. నరాలు తెగే ఉత్కంఠ పోరులో ప్రత్యర్థి లక్నో సూపర్‌ జియాంట్స్‌ పోరాడి విజయం సాధించింది. బంతి బంతికి ఫలితం తారుమారు అవుతున్న వేళ ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి.  గట్టి పోటీ ఇచ్చిన లక్నో సూపర్‌ జియాంట్స్‌కు ఆఖరి రెండో బంతికి గెలిచింది. తక్కువ స్కోర్‌ అయినా కూడా సన్‌రైజర్స్‌ గొప్ప పోరాట పటిమ కనబర్చింది.

Also Read: Klassen Innings: సన్‌రైజర్స్‌ హైదరాబాద్ 156/9.. ఉప్పల్‌ స్టేడియంలో క్లాసెన్‌, నితీశ్‌ రికార్డ్‌ ఇన్నింగ్స్‌

ఉప్పల్‌ స్టేడియంలో వేదికగా టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ నిర్ణీత 20 ఓవర్లకు 7 వికెట్లు కోల్పోయి 160 పరుగులు చేసింది. సొంత గడ్డపై 300 పరుగులు చేద్దామని భారీ ప్రణాళికతో బరిలోకి దిగగా లక్నో బౌలర్లు ఆ అవకాశం కల్పించలేదు. తొలి ఓవర్‌ నుంచి బౌలర్లు ప్రతాపం చూపించడంతో సన్‌రైజర్స్‌ టాపార్డర్‌ కుప్పకూలింది. అభిషేక్‌ శర్మ, ట్రావిస్‌ హెడ్‌, ఇషాన్‌ కిషన్‌ వరుసగా ఔటయిన వేళ హెన్రిచ్‌ క్లాసెన్‌, నితీశ్ కుమార్‌ రెడ్డి గొప్పగా ఆడారు. వందలోపే స్కోర్‌ ముగించాలని లక్నో వేసిన వ్యూహాన్ని తమ బ్యాట్‌తో వీరిద్దరూ ఛేదించారు.

Also Read: Salary Hike: ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలో శుభవార్త.. ఇదే జరిగితే పర్స్‌ ఫుల్‌

ఓపెనర్లుగా దిగిన ట్రావిస్‌ హెడ్‌ ఏడు పరుగులకు ఔటవగా.. అభిషేక్‌ శర్మ డకౌట్‌తో నిరాశపర్చాడు. షమీ వేసిన బంతికి ఇద్దరూ చిక్కడంతో భారీ షాక్‌ తగిలింది. అనంతరం కెప్టెన్‌ ఇషాన్‌ కిషన్‌ భారీ స్కోర్‌ చేస్తాడనుకున్న వేళ ఒక్క పరుగుకే ఔటవడంతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కష్టాల్లో పడింది. తొలిసారి సన్‌రైజర్స్‌ తరఫున బరిలోకి దిగిన లియాన్‌ లివింగ్‌స్టోన్‌ 14 పరుగులు మాత్రమే చేసి ఔటయిన వేళ హెన్రిచ్‌ క్లాసెన్‌, నితీశ్‌ కుమార్‌ రెడ్డి గ్రౌండ్‌లోకి దిగారు.

Also Read: Sunrisers Hyderabad: సన్ రైజర్స్‌కు సొంత గడ్డపై భారీ షాక్.. ఆఫీస్ ముందు తెలంగాణ క్రికెటర్ల ధర్నా

వరుస వికెట్లతో జోష్‌ మీదున్న లక్నో బౌలర్లకు ఏమాత్రం అవకాశం ఇవ్వరాదని భావించిన ఈ ఇద్దరూ బ్యాటర్లు స్ట్రైక్‌ మారుస్తూ పరుగులు తీశారు. గ్రౌండ్‌లో పాతుకుపోయిన కొన్ని నిమిషాల తర్వాత అసలైన ఆట మొదలుపెట్టారు. పరస్పరం సహకరించుకుంటూ క్లాసెన్‌, నితీశ్‌ స్కోర్‌ను పెంచారు. అనంతరం ఫోర్లు, సిక్సర్లతో చెలరేగుతూ ఆడిన క్లాసెన్‌ 41 బంతుల్లో 62 పరుగులు చేశారు. వాటిలో ఐదు ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. అదే స్థాయిలో నితీశ్ కుమార్‌ రెడ్డి దుమ్మరేపి 33 బంతుల్లో 56 పరుగులు చేసి అర్ధ సెంచరీ చేశాడు. తగ్గేదేలా అని ప్రత్యర్థికి బ్యాట్‌తో సవాల్‌ చేయగా.. ప్రిన్స్‌ యాదవ్‌ ఔట్‌ చేశాడు. కొద్దిసేపు క్లాసెన్‌ గ్రౌండ్‌లో నిలిచి ఉన్నా అవేశ్‌ ఖాన్‌కు దొరికిపోయి మైదానం వీడాడు. ఆ తర్వాత వచ్చిన హర్ష్‌ దుబే (0), శివాంగ్‌ కుమార్‌ (5), హర్షల్‌ పటేల్‌ (4) వరుసగా ఔటవగా.. అనికేత్‌ వర్మ (2) నాటౌట్‌గా నిలిచాడు. 

బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండే ఉప్పల్‌ స్టేడియంలో లక్నో బౌలర్లు చెలరేగడం ఆసక్తికరంగా మారింది. గత సీజన్‌లో అత్యధిక స్కోర్లతో తమ రికార్డులను తామే తిరగరాసుకున్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ సొంత గడ్డలో 300 పరుగులు సాధించాలని లక్ష్యం పెట్టుకోగా.. లక్నో బౌలర్లు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. వాటిలో సగం కూడా అతికష్టంగా చేయనిచ్చారంటే లక్నో బౌలర్లు ఎ స్థాయిలో ప్రతాపం చూపారో అర్థమవుతోంది. ముఖ్యంగా షమీ బౌలింగ్‌ గురించి చెప్పుకోవాలి. దూకుడు మీద ఉన్న బ్యాటర్లను తొలి ఓవర్‌.. ఆ తర్వాత మూడో ఓవర్‌లో ఔట్‌ చేసి సన్‌రైజర్స్‌ అభిమానులను దిగ్భ్రాంతికి గురి చేశాడు. అంతేకాకుండా చాలా పొదుపుగా 4 ఓవర్లు వేసిన షమీ 9 పరుగులు మాత్రమే ఇచ్చాడంటే బ్యాటర్లను ఎలా చెడుగుడు ఆడాడో అర్థమవుతోంది. ఇక ప్రిన్స్‌ యాదవ్‌, అవేశ్‌ ఖాన్‌ అదే స్థాయిలో బౌలింగ్‌ వేసి తలా రెండేసి వికెట్లు తీశారు. సిద్దార్థ్‌, దిగ్బేశ్‌ రాఠి ఒక్కో వికెట్‌ తీసి స్కోర్‌ బోర్డును నియంత్రించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report

Fuel Crisis Holidays: స్కూళ్లు, ఆఫీసులకు వారానికి 2 సెలవులు..ఇకపై శని, ఆదివారాలు అన్నీ బంద్..యుద్ధం వల్ల దేశంలో తీవ్ర ప్రభావం!

Namarjung, Gandaki Province:

Nepal 2 Weekend Holidays: పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా కొద్దిమేర ఇంధన కొరత ఏర్పడిన సంగతి తెలిసిందే. ఇరాన్-ఇజ్రాయెల్ సంఘర్షణల కారణంగా హోర్మూజ్ జలసంధి మూతపడిన కారణంగా ప్రపంచ ఇంధన వాణిజ్యానికి తీవ్ర అంతరాయం ఏర్పడింది.  ఇలాంటి కఠిన పరిస్థితుల్లో నేపాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై శని, ఆదివారాలను రెండు రోజులు సెలువులుగా ప్రకటిస్తున్నట్లు ప్రభుత్వ యంత్రాంగం తెలిపింది. 

తాజాగా నేపాల్‌లోని కాఠ్మండులోని ప్రధానమంత్రి కార్యాలయంలో జరిగిన క్యాబినేట్ మీటింగ్‌లో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇంధన కొరత నేపథ్యంలో సరఫరాను సులభతరం చేయడం సహా  ప్రభుత్వ కార్యాలయాలతో పాటు దేశ వ్యాప్తంగా అన్ని విద్యాసంస్థలను ఏప్రిల్ 6 నుంచి కొత్త వారాంతపు సెలవులను పాటించాల్సిన పరిస్థితి వచ్చిందని ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది.  

పెట్రోలియం సరఫరాలో కొనసాగుతున్న అంతరాయాల కారణంగా దేశవ్యాప్తంగా శని, ఆదివారాల్లో ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలను మూసివేయాలని నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ ప్రతినిధి సస్మిత్ పోఖరేల్ తెలిపారు. విద్యాసంస్థలు మినహా ప్రభుత్వ కార్యాలయాలు ఇకపై పనిదినాల్లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పనిచేస్తాయని ఆయన అన్నారు.

ఇంధన కొరత నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ ఆధారిత వాహనాలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చేందుకు అవసరమైన చట్టపరమైన ఫ్రేమ్‌వర్క్‌ను సిద్ధం చేయాలని కూడా క్యాబినెట్ నిర్ణయించింది. పశ్చిమాసియాలో ఘర్షణలు తీవ్రతరం కావడం వల్ల ఇంధన సరఫరాలో అనిశ్చితి నెలకొనడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రతినిధి తెలిపారు. సంప్రదాయ ఇంధన వాహనాలను బదులుగా విద్యుత్ వాహనాలుగా మార్చడాన్ని ప్రోత్సహించడం వల్ల ఇంధన పొదుపు చేయోచ్చని నేపాల్ ప్రభుత్వం యోచిస్తుంది. 

ఇరాన్, ఇజ్రాయెల్ మరియు అమెరికా దేశాల మధ్య కొనసాగుతున్న యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరా నిలిచిపోయిన క్రమంలో తీరప్రాంతం లేని నేపాల్ దేశానికి ఇంధన కొరత తీవ్రత మరింత పెరిగింది. ప్రభుత్వ రంగ సంస్థ అయిన నేపాల్ ఆయిల్ కార్పొరేషన్ (ఎన్‌ఓసి) చేసిన తాజా సవరణతో.. కాఠ్మండు లోయలో పెట్రోల్ ధర లీటరుకు 202 నేపాలీ రూపియా చేరడంతో నేపాల్‌లో పెట్రోలియం ధరలు సర్వకాలీన గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. మరోవైపు డీజిల్, కిరోసిన్ ధరలు కూడా లీటరుకు 182 నేపాలీ రుపియాకు పెరిగాయి. 

Also Read: AP Telangana Inter Results 2026: ఇంటర్ విద్యార్థులకు అలర్ట్..పరీక్షల ఫలితాల విడుదలకు ముహూర్తం ఖరారు..ఏపీ, తెలంగాణ రిజల్ట్ ఎక్కడ చూడాలంటే?

Also Read: DA Hike Update 2026: ఉద్యోగులకు తీపికబురు..డీఏ (DA) భారీగా పెంచిన మోదీ సర్కార్..అకౌంట్లోకి జమ అప్పుడే?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement

Klassen Innings: సన్‌రైజర్స్‌ హైదరాబాద్ 156/9.. ఉప్పల్‌ స్టేడియంలో క్లాసెన్‌, నితీశ్‌ రికార్డ్‌ ఇన్నింగ్స్‌

Hyderabad, Telangana:

Uppal Stadium: కలకత్తా నైట్‌రైడర్స్‌ను భారీ తేడాతో ఓడించి విజయోత్సాహంతో సొంత గడ్డపై ఆడుతున్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు లక్నో సూపర్‌జియాంట్స్‌ భారీ షాక్‌ ఇచ్చింది. 300కు పైగా పరుగులు చేయాలని లక్ష్యం విధించుకున్న సన్‌రైజర్స్‌ను లక్నో బౌలర్లు భారీ దెబ్బ తీశారు. బ్యాటింగ్‌కు అనుకూలమైన స్టేడియంలో లక్నో బౌలర్లు చెలరేగిపోయారు. అయినా కూడా సన్‌రైజర్స్‌ బ్యాటర్లు తగ్గేది లేదు అంటూ వీరోచితంగా పోరాడి 9 వికెట్లకు 160 పరుగులు సాధించారు. తక్కువ స్కోర్‌ వచ్చినా కూడా క్లాసెన్‌, నితీశ్‌ కుమార్‌ రెడ్డి ఆడిన ఆట వినోదం పంచింది.

ఉప్పల్‌ స్టేడియంలో వేదికగా టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ నిర్ణీత 20 ఓవర్లకు 7 వికెట్లు కోల్పోయి 160 పరుగులు చేసింది. సొంత గడ్డపై 300 పరుగులు చేద్దామని భారీ ప్రణాళికతో బరిలోకి దిగగా లక్నో బౌలర్లు ఆ అవకాశం కల్పించలేదు. తొలి ఓవర్‌ నుంచి బౌలర్లు ప్రతాపం చూపించడంతో సన్‌రైజర్స్‌ టాపార్డర్‌ కుప్పకూలింది. అభిషేక్‌ శర్మ, ట్రావిస్‌ హెడ్‌, ఇషాన్‌ కిషన్‌ వరుసగా ఔటయిన వేళ హెన్రిచ్‌ క్లాసెన్‌, నితీశ్ కుమార్‌ రెడ్డి గొప్పగా ఆడారు. వందలోపే స్కోర్‌ ముగించాలని లక్నో వేసిన వ్యూహాన్ని తమ బ్యాట్‌తో వీరిద్దరూ ఛేదించారు.

0
0
Report

Karimnagar: యూనివర్సిటీలో దేశ వ్యతిరేక భావజాలం? ప్రొఫెసర్‌పై కేంద్ర మంత్రికి ఫిర్యాదు..

Karimnagar, Telangana:

Karimnagar Latest News: కరీంనగర్‌లోని శాతవాహన విశ్వవిద్యాలయం మరోసారి చర్చనీయాంశంగా మారింది.. విద్యాలయాల్లో విద్యా బోధన కంటే మావోయిస్టు భావజాల వ్యాప్తి ఎక్కువ జరుగుతుందని తద్వారా యూనివర్సిటీలో ప్రశాంతత వాతావరణం దెబ్బతింటుందని పరిశోధక విద్యార్థి నైతం మహేష్ తీవ్ర ఆరోపణ చేశారు.. ఈ మేరకు  ఆదివారం ఆయన కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. 

విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ సుజాతతో విద్యార్థి కరికి మహేష్ కలిసి విద్యార్థులను మావోయిస్టుల వైపు మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. వారు విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తూ.. యూనివర్సిటీ వాతావరణాన్ని అశాంతిమయం చేస్తున్నారని మహేష్ ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కూడా వీరిపై పాలు వివాదాలతో పాటు అభియోగాలు ఉన్నాయని.. అయినప్పటికీ వారి ధోరణలో మార్పు రాలేదని బండి సంజయ్ దృష్టికి తీసుకెళ్లారు. 

సదర్ ప్రొఫెసర్, విద్యార్థి వల్ల తనకు ప్రాణహాని ఉందని నైతం మహేష్ ఆందోళన వ్యక్తం చేశారు. వర్సిటీలో జరుగుతున్న అక్రమాలను ప్రశ్నించినందుకు తనను లక్ష్యంగా చేసుకున్నారని.. భవిష్యత్తులో తనకు ఏదైనా జరిగితే  వారే బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. విద్యార్థులు చదువుకోవాల్సిన చోట ఇలాంటి దేశ వ్యతిరేక భావాజాలం నూరి పోయడం వల్ల యువత భవిష్యత్తు నాశనమవుతుందని ఆయన పేర్కొన్నారు.

విద్యార్థి ఫిర్యాదు పై కేంద్రమంత్రి బండి సంజయ్ సానుకూలంగా స్పందించారు. విద్యాసంస్థలను అసాంఘిక కార్యకలాపాలకు వేదికగా మార్చుకోవాలని చూస్తే సహించేది లేదని హెచ్చరించారు.. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి.. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశిస్తామని హామీ ఇచ్చారు. విద్యార్థులు భయం లేకుండా చదువుకునే వాతావరణాన్ని కల్పిస్తామని బండి సంజయ్ భరోసా ఇచ్చారు. ఈ ఫిర్యాదుతో శాతవాహన విశ్వవిద్యాలయంలో ఒక్కసారిగా అనేక మార్పులు వచ్చినట్లు తెలుస్తోంది. విద్యార్థి సంఘాల నేతలు ఈ అంశంపై భిన్నభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే ఉన్నత అధికారులు స్పందించి వర్సిటీలో నెలకొన్న అనిచ్చితిని తొలగించాలని విద్యార్థులు కూడా కోరుతున్నారు.

Read more: Automatic Aarti Video: ఇక ఆటోమేటిక్ మిషన్‌తోనే దేవుడికి హారతి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report

Infinix GT 50 Pro: గేమర్స్‌కు పండగే.. రూ.25 వేలకే ప్రీమియం గేమింగ్ ఇన్ఫినిక్స్ GT 50 ప్రో ఫోన్!

Hyderabad, Telangana:

Infinix GT 50 Pro Price: బడ్జెట్ ధరల్లో శక్తివంతమైన గేమ్స్ స్మార్ట్‌ఫోన్స్‌ అంటే మనందరికీ గుర్తుకొచ్చేది ఒకటే అదే ఇన్ఫినిక్స్ బ్రాండ్ అత్యంత తక్కువ ధరల్లోనే మంచి మంచి మొబైల్స్ ను విడుదల చేస్తూ వస్తుంది.. అయితే, ఈ ఇన్ఫినిక్స్ సంస్థ అతి త్వరలోనే మరో శక్తివంతమైన మొబైల్ విడుదల చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.. ఇది Infinix GT 50 Pro పేరుతో విడుదల కాబోతున్నట్లు సమాచారం. గత వెర్షన్ల కంటే ఎంతో వినూత్నంగా.. ప్రత్యేకమైన డిజైన్‌తో..అద్భుతమైన ఫీచర్స్‌తో ఈ మొబైల్‌ను అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన అన్ని రకాల వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ స్మార్ట్‌ఫోన్‌ వెనక భాగంలో అద్భుతమైన ట్రాన్స్పరెంట్ విండోను కూడా ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. దీని ద్వారా ఫోన్లో ఉండే కూలింగ్ సిస్టం కనిపిస్తుంది అంతేకాకుండా ఫోన్ పని చేసినప్పుడు లోపల కదలికలు కూడా కనిపించేలా.. ఈ స్మార్ట్‌ఫోన్‌ను డిజైన్ చేసినట్లు సమాచారం. కేవ్లార్ టెక్స్చర్, షార్ప్ లైన్లతో ఇది ప్రీమియం గేమింగ్ లుక్‌ను ఇస్తోంది. ఇది చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. అంతేకాకుండా ప్రీమియం లుక్‌ను కలిగి ఉంటుంది. ఇక ఇందులో గేమింగ్ కోసం మరెన్నో ప్రత్యేకమైన ఫీచర్లు అందుబాటులో ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

Infinix GT 50 Pro స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన ఫీచర్స్ వివరాల్లోకి వెళ్తే.. ఇది 6.78 అంగుళాల 1.5K అమోలెడ్ (AMOLED) డిస్‌ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తోంది. అంతేకాకుండా ఇందులో కంపెనీ అత్యంత వేగవంతమైన మీడియాటెక్ డైమెన్సిటీ 8400 అల్టిమేట్ (MediaTek Dimensity 8400 Ultimate) చిప్‌సెట్‌ను వాడినట్లు సమాచారం. అలాగే వెనక భాగంలో అద్భుతమైన 50MP ప్రధాన కెమెరాతో పాటు 8MP అల్ట్రా వైడ్ లెన్స్ ఉంటుంది. దీంతోపాటు సెల్ఫీల కోసం 13MP కెమెరాను అమర్చారు. ఇందులో భారీ 6,500mAh బ్యాటరీ  ఉండబోతున్నట్లు తెలుస్తోంది. దీనికి 45W వైర్డ్ ఛార్జింగ్, 15W వైర్‌లెస్ మ్యాగ్‌ఛార్జ్ 2.0 సపోర్ట్ ఉంటుంది. గేమింగ్ సమయంలో ఫోన్ వేడెక్కకుండా ఇందులో ప్రత్యేకమైన మైక్రో పంప్ లిక్విడ్ కూలింగ్ సిస్టం కూడా అందిస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది.

Read more: Scorpio, Ertiga సగం ధరకే.. ఢిల్లీ కార్ బజార్‌లో రూ.30 వేలకే కారు మీ సొంతం!

ఇక గేమింగ్ ప్రియుల కోసం ఎందులో ఇన్ఫినిక్స్ కంపెనీ ప్రత్యేకమైన ఫీచర్లను కూడా అందిస్తోంది. వీటికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..గేమింగ్ కంట్రోల్స్ సులభతరం చేసేందుకు ఈ ఫోన్‌లో డ్యూయల్ ప్రెజర్ షోల్డర్ ట్రిగ్గర్స్ (Shoulder Triggers) ఇచ్చారు. ఇవి 30 లక్షల సార్లు నొక్కిన తట్టుకునేలా.. కేవలం 20 మిల్లీ సెకండ్‌ల రెస్పాన్స్ టైమ్‌తో పనిచేస్తాయని లీకైన వివరాలు చెబుతున్నాయి. అంతేకాకుండా దీనిని భారత మార్కెట్లో వచ్చే నెలలో అధికారికంగా విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, ఈ ఏడాది చివరి వారాల్లో ఈ మొబైల్ కు సంబంధించిన ఫీచర్స్ ను అధికారికంగా వెల్లడించే అవకాశాలున్నాయి. ఇది భారత మార్కెట్‌లో రూ.25 వేల నుంచి ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది.

Read more: Scorpio, Ertiga సగం ధరకే.. ఢిల్లీ కార్ బజార్‌లో రూ.30 వేలకే కారు మీ సొంతం!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report
Advertisement

Oppo: ఒప్పో సంచలనం.. ఏప్రిల్ 21న 200MP కెమెరాతో Oppo Find X9s Pro లాంచ్!

Hyderabad, Telangana:

Oppo Find X9s Pro Price: ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం ఒప్పో తన ఫ్లాట్ షిప్ సిరీస్‌లో మరో సంచలనానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. టేక్ ప్రియులకు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న Oppo Find X9s pro స్మార్ట్‌ఫోన్‌ను ఏప్రిల్ 21వ తేదీన విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ గత మోడల్స్‌తో పోలిస్తే ఎన్నో రకాల అద్భుతమైన ఫీచర్స్‌ను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా అద్భుతమైన కెమెరా మాధురిని కూడా కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన అన్ని రకాల వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. 

Oppo Find X9s pro స్మార్ట్‌ఫోన్‌ ప్రధాన ఆకర్షణ ఏంటంటే దీనికి కెమెరా.. ఇందులో కంపెనీ ఎంతో శక్తివంతమైన 200 మెగాపిక్సెల్ కెమెరాను అందించబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా అదనంగా మరో ఇలాంటి కెమెరానే ఉంటుందని లీకైన వివరాలు చెబుతున్నాయి. స్పష్టమైన వీడియోలతో పాటు ఫోటోలు తీసుకునేందుకు వీలుగా ఈ కెమెరాలను రూపొందించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా చీకటిలోనూ అద్భుతమైన క్వాలిటీ ఇచ్చేలా.. దీనిని రూపొందించినట్లు తెలుస్తోంది. అలాగే హ్యాసెల్‌బ్లాడ్ బ్రాండింగ్ తో వచ్చే ఈ కెమెరాలు మొబైల్ ఫోటోగ్రఫీని ఊహించని స్థాయికి తీసుకెళ్తాయని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు..

ప్రస్తుతం ఇదే మోడల్స్‌లో విడుదలైన స్మార్ట్‌ఫోన్స్‌ను ఎదుర్కొంటున్న సమస్య బ్యాటరీ.. దీనిని దృష్టిలో పెట్టుకున్న ఒప్పో కంపెనీ ఈ మోడల్‌లో ఏకంగా ఎంతో శక్తివంతమైన 7025mAh భారీ బ్యాటరీతో అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు ఇందులో కంపెనీ 80W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్టు ఫీచర్లను కూడా అందిస్తోంది. అలాగే ఈ మొబైల్ బ్యాటరీని ఒక్కసారి ఫుల్ చాట్ చేస్తే.. రోజంతా బ్యాటరీ లైఫ్ని అందించడమే కాకుండా.. మరుసటి రోజు కూడా బ్యాటరీ యాక్టివ్‌గా ఉంటుందని లీకైన వివరాలు చెబుతున్నాయి.

Read more: Scorpio, Ertiga సగం ధరకే.. ఢిల్లీ కార్ బజార్‌లో రూ.30 వేలకే కారు మీ సొంతం!

ఇక ఈ స్మార్ట్‌ఫోన్ ఎంతో శక్తివంతమైన MediaTek Dimensity 9500 చిప్‌సెట్‌ ప్రాసెసర్‌పై రన్ అవుతుంది. ఇది 16GB వరకు ర్యామ్‌తో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా గేమింగ్ ప్రియులకు ఈ మొబైల్ ఎంతగానో సహాయపడుతుంది. ఎందుకంటే ఇందులో వారికోసం హై-రిఫ్రెష్ రేట్ కలిగిన అమోలెడ్ (AMOLED) డిస్‌ప్లేను అందించారు. అలాగే ఇందులో ముఖ్యమైన ఫీచర్స్ వివరాల్లోకి వెళితే.. ఈ మొబైల్ 6.78 అంగుళాల LTPO అమోలెడ్ డిస్ప్లేను కలిగి ఉంటుంది. అలాగే 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్టుతో వస్తోంది. ఇది ఆండ్రాయిడ్ 16 (ColorOS 16) ఆపరేటింగ్ సిస్టంతో రన్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ ఏప్రిల్ 21న చైనాలో జరిగే మెగా ఈవెంట్లో విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వివరాలను త్వరలోనే కంపెనీ అధికారికంగా విడుదల చేయబోతోంది.

Read more: Scorpio, Ertiga సగం ధరకే.. ఢిల్లీ కార్ బజార్‌లో రూ.30 వేలకే కారు మీ సొంతం!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report

Video viral: వామ్మో.. 15 సెకండ్లలో నలుగురిని కసితీరా కొరికిన వీధి కుక్క.. వీడియో వైరల్..

Hyderabad, Telangana:

Stray dog attacks on bites four people video viral: ఇటీవల  వీధి శునకాలకు చెందినదాడుల ఘటనలు ఎక్కువగా వార్తలలో ఉంటున్నాయి. కుక్కలు చిన్నపిల్లల నుంచి పెద్ద వారి వరకు ఎవర్ని వదలడంలేదు.  ఏమాత్రం నెగ్లీజెన్సీగా ఉన్న పిక్కలు పట్టేసి లాగేస్తున్నాయి. ఇంటి ముందు చిన్న పిల్లలు  ఆడుకునేటప్పుడు , వాహనాల మీద పెద్దవారు వెళ్తున్నప్పుడు వెంబట పడి మరీ కుక్కలు దాడులు చేస్తున్నాయి. అందిర పార్ట్ ను కసితీరా  కొరికిపాడేస్తున్నాయి.

 

ఇలాంటి ఘటనలు ఇటీవల మరీ ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. వీధి శునకాల కేసు ఏకంగా సుప్రీంకోర్టు వరకు వెళ్లిన విషయం తెలిసిందే. అన్ని కుక్కలు చెడ్డవి కాదు.. కానీ కొన్నిసార్లు వాటిని వెర్రి లేచినప్పుడు అవి దాడులు చేస్తాయి . వెర్రిలేచిన కుక్కలు ఇతరు కుక్కల్ని లేదా కన్పించిన మనుషుల్ని ఇష్టమున్నట్లు  కొరుకుతాయి. ఈ కోవకు చెందిన ఒక వీడియో నెట్టింట వైరల్గా మారింది.

 మధ్య ప్రదేశ్ లోని ఇండోర్ లో స్థానికంగా నలుగురు కుర్రాళ్లు తమ మానన వారు కుర్చీల్లో కూర్చుని బాతఖానీలో ఉన్నారు. ఇంతలో ఎక్కడి నుంచి వచ్చిందో కానీ ఒక కుక్క అక్కడకు వచ్చి ఒక వ్యక్తిపై దాడి చేసింది. అతను తెరుకునే లోపు మరో యువకుడ్ని కోరింది. వారు కొట్టేందుకు ప్రయత్నించగా అక్కడి నుంచి పారిపోతు మధ్యలో మరో వ్యక్తి కన్పిస్తే ఎగిరి మరీ అతడ్ని కాటు వేసింది. ఇలా నలుగురిపై 15 సెకన్లలో పలుమార్లు కాటు వేసింది.

Read more:King Cobra Video: వామ్మో.. బ్యాంక్ సమీపంలో భారీ కింగ్ కోబ్రా హల్ చల్.. పరుగులు పెట్టిన కస్టమర్లు.. వీడియో ..

చివరకు వారు కర్రలు, రాళ్లతో దాని మీదకు దాడికి ప్రయత్నించడంతో అది వారి నుంచి తప్పించుని పారిపోయింది. పాపం.. వారు బతుకు జీవుడా అంటూ వెంటనే దగ్గరలోని ఆస్పత్రికి వెళ్లి ట్రీట్మెంట్ ఇప్పించుకున్నారు. మరీ ఆ కుక్క ఎందుకు దాడి చేసిందొ తెలీదు. ఈ ఘటన అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది.  అది కాస్త వైరల్గా మారింది. ఆ శునకంకు వెర్రి లేచిందని  స్థానికులు చెబుతున్నారు. ఈ వీడియోపై నెటిజన్ లు తీవ్ర భయాందోళనలకు గురౌతున్నారు.

0
0
Report

AP Telangana Inter Results 2026: ఇంటర్ విద్యార్థులకు అలర్ట్..పరీక్షల ఫలితాల విడుదలకు ముహూర్తం ఖరారు..ఏపీ, తెలంగాణ రిజల్ట్ ఎక్కడ చూడాలంటే?

Hyderabad, Telangana:

AP Telangana Inter Results 2026 News: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు విడుదల చేసేందుకు రంగం సిద్ధమైంది. ఇరు తెలుగు రాష్ట్రాల ఇంటర్ పరీక్షల (ఫస్ట్, సెకండ్ ఇయర్) ఫలితాలను ఏప్రిల్ రెండో వారంలో ప్రకటించేందుకు ఇరు రాష్ట్రాల విద్యాశాఖలు కృషి చేస్తున్నాయి. ఆన్‌లైన్ ద్వారా పరీక్షల ఫలితాలను వెలువరించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. అయితే ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలను ఎక్కడ చెక్ చేసుకోవాలని అనే విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఇంటర్ ఫలితాలను  bie.ap.gov.in వెబ్‌సైట్‌లో చూడవచ్చు. అలాగే తెలంగాణ విద్యార్థులు ఇంటర్ ఫలితాల కోసం TSBIE అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి. అదే విధంగా ఇరు తెలుగు రాష్ట్రాల ఇంటర్ పరీక్ష ఫలితాలను మనబడి (Manabadi.co.in) సైట్‌లో చెక్ చేయవచ్చు. విద్యాశాఖ ఫలితాలు ప్రకటించిన తర్వాత.. విద్యార్థులు తమ తమ పోర్టల్స్‌లో లాగిన్ అయ్యి హాల్ టికెట్ నమోదు చేయడం ద్వారా మీరు ఫలితాలను రాబట్టవచ్చు. 

టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం.. తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు 2026 ఏప్రిల్ 12న విడుదల చేయనున్నారని సమాచారం. గత ఏడాది ట్రెండ్స్ ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ ఇంటర్ 2026 ఫలితాలు మనబడి పోర్టల్‌లో ఏప్రిల్ రెండో వారంలో విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే ఏ తేదీ అనేది ఇంకా స్పష్టత రాలేదు. 

ఇంటర్ ఫలితాలను అధికారిక ప్రకటన తర్వాత.. Manabadi.co.in లో ఫలితాల లింకులు వెంటనే యాక్టివేట్ అవుతాయి. విద్యార్థులు తమ ఫలితాలను డౌన్‌లోడ్ చేసుకునేందుకు ఈ కింద దశలను ఫాలో అవ్వాల్సి ఉంటుంది. 

1) అధికారిక వెబ్‌సైట్ manabadi.co.in లేదా bie.ap.gov.in ను సందర్శించండి.

2) “AP Inter Results 2026” అనే లింక్‌పై క్లిక్ చేయండి

3) ఫస్ట్ ఇయర్ లేదా సెకండ్ ఇయర్ ఫలితాల లింక్‌ను ఎంచుకోండి.

4) మీ హాల్ టికెట్ నంబర్‌ను నమోదు చేయండి.

5) సబ్మిట్ / గెట్ రిజల్ట్స్ పై క్లిక్ చేయండి.

6) మీ ఏపీ ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో 2026 స్క్రీన్‌పై కనిపిస్తుంది.

7) భవిష్యత్ అవసరాల కోసం డౌన్‌లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకుంటే ఉత్తమం. 

సిస్టమ్‌లోకి లాగిన్ అవ్వడానికి అడ్మిట్ కార్డుపై వ్రాసిన రోల్ నంబర్ అవసరం కాబట్టి.. విద్యార్థులు తమ హాల్ టికెట్లను అందుబాటులో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. ఫలితాలు అధికారిక వెబ్‌సైట్‌లో మాత్రమే కాకుండా SMS, డిజిలాకర్ సౌకర్యం ద్వారా కూడా అందుబాటులో ఉంచుతారు.

Also Read: DA Hike Update 2026: ఉద్యోగులకు తీపికబురు..డీఏ (DA) భారీగా పెంచిన మోదీ సర్కార్..అకౌంట్లోకి జమ అప్పుడే?

Also Read: Thalliki Vandanam 2026: తల్లికి వందనంపై సీఎం చంద్రబాబు తీపికబురు..అకౌంట్లోకి రూ.15 వేలు జమ చేసేది అప్పుడే?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement

DA Hike Update 2026: ఉద్యోగులకు తీపికబురు..డీఏ (DA) భారీగా పెంచిన మోదీ సర్కార్..అకౌంట్లోకి జమ అప్పుడే?

Hyderabad, Telangana:

DA Hike Update 2026 News: ఒకవైపు యుద్ధం.. మరోవైపు భారీగా పెరిగిన ధరలు.. అంచెలంచెలుగా పెరుగుతున్న ద్రవ్యోల్బణం నేపథ్యంలో జీతాల పెంపు కోసం లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎదురుచూస్తున్నారు. ఏప్రిల్ రెండో వారంలో వీరందరికి తీపికబురు అందించే అవకాశం ఉందని తెలుస్తోంది.

జాతీయ మీడియా నివేదికల ప్రకారం.. ఏప్రిల్ రెండో వారంలో జరగనున్న క్యాబినేట్ సమావేశంలో కరవు భత్యం (డీఏ) పెంపుపై ప్రతిపాదన వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే దీనిపై డీఏ పెంపు పర్సెంటేజ్ ఖరారు అయ్యిందని.. త్వరలోనే ఆమోదం పొందే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ పెరిగిన డీఏను 2026 జనవరి 1 నుంచి అమల్లోకి తెచ్చే అవకాశం ఉందట. 

అయితే దేశవ్యాప్తంగా ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ప్రస్తుతం తమ మూల వేతనంలో 58 శాతం డీఏను పొందుతున్నారు. అయితే ఈ సారి ఆ కరవు భత్యాన్ని 60 శాతానికి పెంచే అవకాశం ఉంది. అది కేవలం 2 శాతంగా అనిపించినా.. ప్రస్తుత పరిస్థితుల్లో ఇదో గణనీయమైన పెరుగుదలను సూచిస్తుంది.

అయితే ఈ డీఏ పెంపుపై ప్రకటన ఆలస్యం అవ్వడానికి కారణంగా విధాన పరమైన మార్పు. 7వ వేతన సంఘం పదవీకాలం అధికారికంగా డిసెంబర్ 31, 2025న ముగిసింది. అదే విధంగా గతేడాది 8వ వేతన సంఘాన్ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది.  

అనగా 2026 జనవరి 1 నుండి ఉద్యోగుల జీతభత్యాల విధానం సిద్ధాంతపరంగా 8వ వేతన సంఘం పరిధిలోకి రావాల్సి ఉంది. ఈ కీలకమైన మార్పు, కొత్త లెక్కింపు నిబంధనలపై ప్రభుత్వంలో తీవ్రమైన చర్చకు దారితీసింది. ఇప్పటికే కొత్త వేతన సంఘం ఏర్పాటైన.. వారి సిఫార్సులను అమలు చేసేందుకు కనీసం 18 నెలల సమయం పట్టే అవకాశం ఉంది. 

ఇలా కొత్తగా 60 శాతం పెరగనున్న కరవు భత్యం (డీఏ) తమ సాధారణ మందులు, రోజువారీ ఖర్చుల కోసం ఈ అదనపు ఆదాయం అత్యవసరంగా అవసరమైన వృద్ధ పెన్షనర్లకు ఇది మరింత సాయపడనుంది.

(గమనిక: ఈ కథనం కేవలం సమాచార చేరవేత కోసం మాత్రమే. దీన్ని పాటించే ముందు సంబంధిత విషయంపై అధికారిక వెబ్‌సైట్ సందర్శించాల్సిన అవసరం ఉంది. దీన్ని జీ తెలుగు న్యూస్ ధ్రువీకరించడం లేదు.)

Also Read: Thalliki Vandanam 2026: తల్లికి వందనంపై సీఎం చంద్రబాబు తీపికబురు..అకౌంట్లోకి రూ.15 వేలు జమ చేసేది అప్పుడే?

Also Read: Akshaya Tritiya 2026: అక్షయ తృతీయ 2026 స్పెషల్..బంగారం ఎప్పుడు, ఏ సమయంలో కొంటే మంచిదో తెలుసా?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Vaibhava Lakshmi Rajayoga 2026: వైభవలక్ష్మి రాజయోగం ఎఫెక్ట్‌.. ఈ 3 రాశుల వారికి ఇక తిరుగుండదు.. అదృష్టం మామూలుగా లేదుగా!

Hyderabad, Telangana:

Vaibhava Lakshmi Rajayoga 2026 Effect On Zodiac Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఒక గ్రహం ఒకచోటి నుంచి మరొక చోటికి కదలిక జరిగినప్పుడు మొత్తం మానవ జీవితంపై తీవ్ర ప్రభావం పడుతూ ఉంటుంది. అలాంటిది 2026 సంవత్సరంలో అనేక ప్రధాన గ్రహాలు ఒకచోటు నుంచి మరొక చోటికి ప్రవేశించబోతున్నాయి. ముఖ్యంగా ఏప్రిల్ నెల ఈ గ్రహ గమనాలకు చాలా ప్రత్యేకమైనదిగా భావించవచ్చు. అలాగే కొన్ని గ్రహాలు ఒకే చోట కలిసినప్పుడు కూడా అరుదైన యోగాలు ఏర్పడుతూ ఉంటాయి. ముఖ్యంగా ఏప్రిల్ నెలలో ఎంతో శక్తివంతమైన వైభవలక్ష్మి రాజయోగం ఏర్పడబోతోంది. సంపదకు కారకుడైన శుక్రుడితోపాటు మానసిక స్థితికి కారకుడైన చంద్రుడు ఒకే రాశిలో కలవడం కారణంగా ఈ ఎంతో శక్తివంతమైన రాజయోగం ఏర్పడుతుంది. దీనివల్ల మూడు రాశుల వారికి ఆర్థికంగా ఊహించని మార్పులు కలుగుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. అంతేకాకుండా ఈ శక్తివంతమైన రాజయోగ ప్రభావంతో ఆర్థికంగా కూడా భారీ మొత్తంలో డబ్బులు పొందబోతున్నారు.

వైభవలక్ష్మి రాజయోగం వల్ల సమాజంలో గౌరవం మర్యాదలు పెరగడమే కాకుండా.. ఇతరులు మీపై ప్రేమ చూపించే అవకాశాలు కనిపిస్తాయి. అంతేకాకుండా పెండింగ్‌లో ఉన్న ప్రతి పని వేగంగా సులభంగా పూర్తవుతుంది. జ్యోతిష్య శాస్త్ర విశ్లేషకులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ వైభవలక్ష్మి రాజయోగం ప్రభావం క్రింది మూడు రాశుల వారికి ఎన్నో రకాల ప్రయోజనాలను తెచ్చి పెట్టబోతోంది.

వృషభ రాశి
వృషభ రాశిలో జన్మించిన వ్యక్తులకు వైభవలక్ష్మి రాజయోగం ప్రభావంతో ఊహించని ధన లాభాలు కలుగుతాయి. వృషభ రాశి వారికి శుక్రుడు అధిపతి కావడం వల్ల ఆర్థికంగా భారీగా పురోగతి లభించే అవకాశాలున్నాయి. గతంలో నిలిచిపోయిన డబ్బులు కూడా భారీ మొత్తంలో తిరిగి పొందగలుగుతారు. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది అత్యంత అనుకూలమైన సమయంగా జ్యోతిష్యులు చెబుతున్నారు. దీంతోపాటు విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

కర్కాటక రాశి
చంద్రుడు కర్కాటక రాశికి అధిపతిగా వ్యవహరిస్తాడు. కాబట్టి శుక్రుడుతో కలయిక జరపడం వల్ల ఏర్పడిన ఈ శక్తివంతమైన యోగ ప్రభావంతో కర్కాటక రాశి వారికి మానసిక ప్రశాంతత విపరీతంగా పెరుగుతుంది. ఆర్థిక స్థిరత్వం లభించి.. విశేషమైన ప్రయోజనాలు కలగబోతున్నాయి. ఉద్యోగం చేస్తున్న వారికి ప్రమోషన్స్ కూడా లభిస్తాయి. అంతేకాకుండా జీతాలు కూడా విపరీతంగా పెరగవచ్చు. రియల్ ఎస్టేట్ రంగాల్లో పెట్టుబడులు పెట్టిన వ్యక్తులకు ఈ సమయం చాలా లాభసాటిగా మారుతుంది.

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

తులారాశి
తులా రాశిలో జన్మించిన వ్యక్తులకు వైభవలక్ష్మి రాజయోగ ప్రభావంతో అదృష్టం తలుపుతట్టబోతోంది. ముఖ్యంగా వీరికి ఎలాంటి పనులు చేపట్టిన విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా కళాకారులతో పాటు మీడియా రంగాల్లో పనులు చేస్తున్న వ్యక్తులకు భవిష్యత్తు బంగారు బాట పట్టిస్తుంది. అంతేకాకుండా కుటుంబంలో అనేక శుభకార్యాలు జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దీంతోపాటు అనుకున్న పనుల్లో భారీ మొత్తంలో లాభాలు పొందగలుగుతారని జ్యోతిష్యులు చెబుతున్నారు.

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report

Iran Hell Gates Warning: నరకపు ద్వారాలు తెరుస్తాం..ట్రంప్ డెడ్ లైన్‌కు ఇరాన్ స్ట్రాంగ్ కౌంటర్..!!

BBhoomi15h ago
Lakshmapur, Telangana:

Donald Trump Iran Ultimatum: మధ్య ఆసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన 48 గంటల అల్టిమేటం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ప్రకంపనలకు కారణం అవుతోంది. ఇరాన్ వెంటనే శాంతి ఒప్పందం చేసుకోనట్లయితే.. ఆ దేశంలోని కీలక మౌలిక సదుపాయాలను నాశనం చేస్తామని ట్రంప్ వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ బెదిరింపులకు తాము లొంగే ప్రసక్తే లేదంటూ ఇరాన్ సెంట్రల్ మిలిటరీ కమాండ్ స్పష్టం చేసింది. ట్రంప్ వ్యాఖ్యలు కేవలం ఒక అవివేక చర్య మాత్రమే అంటూ కొట్టిపారేసింది. 

ఇరాన్‌కు చెందిన  ఖతమ్ అల్-అన్బియా  సెంట్రల్ హెడ్ క్వార్టర్స్ నుండి వెలువడిన ప్రకటన ఇప్పుడు అగ్రరాజ్యాన్ని ఆలోచనలో పడేసింది. ఇరాన్ సైనిక జనరల్ అలీ అబ్దుల్లాహి అలియాబాది నేరుగా ట్రంప్‌ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ ఇస్తున్న ఈ బెదిరింపులు ఆయన నిస్సహాయతకు, భయాందోళనలకు నిదర్శనం. ఆయన తీసుకుంటున్న ఈ అసమతుల్య నిర్ణయాలు అమెరికా పతనానికి దారి తీస్తాయి. ఈ సందేశానికి సరళమైన అర్థం ఒక్కటే.. మీ కోసం నరక ద్వారాలు తెరుచుకోబోతున్నాయి అంటూ ఆయన యుద్ధ గర్జన చేశారు.

అమెరికా విధించిన ఏప్రిల్ 6వ తేదీ గడువుకు సమయం దగ్గరపడుతుండటంతో హోర్ముజ్ జలసంధి వద్ద యుద్ధ వాతావరణం నెలకొంది. ఇరాన్ తన క్షిపణి వ్యవస్థలను సిద్ధం చేయడమే కాకుండా, అమెరికా యుద్ధ విమానాలను కూల్చివేస్తూ తన పట్టును నిరూపించుకుంటోంది. ట్రంప్ షరతులకు తలవంచడం కంటే యుద్ధం చేయడమే మేలని ఇరాన్ సైన్యం భావిస్తోంది. ఒకవేళ ట్రంప్ అన్నట్లుగా 48 గంటల తర్వాత దాడులు మొదలైతే, ఇరాన్ కూడా అమెరికా స్థావరాలపై విరుచుకుపడేందుకు సర్వసన్నద్ధమైంది.

Also Read: Donald Trump Warning: సమయం లేదు మిత్రమా.. విధ్వంసానికి 48గంటలే మిగిలింది.. ఇరాన్‎కు ట్రంప్ వార్నింగ్..!!  

ట్రంప్ , ఇరాన్ మధ్య జరుగుతున్న ఈ మాటల యుద్ధం ఎప్పుడు భౌతిక యుద్ధంగా మారుతుందోనని ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. ముఖ్యంగా చమురు రవాణాకు కీలకమైన హోర్ముజ్ జలసంధి మూతపడితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉంది. ట్రంప్ ఇచ్చిన గడువు ముగియడానికి కేవలం గంటల సమయం మాత్రమే ఉండటంతో, ఏప్రిల్ 6వ తేదీ తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.  నిజంగానే నరక ద్వారాలు తెరుచుకుంటాయా? లేక చివరి నిమిషంలో ఏదైనా దౌత్యపరమైన మలుపు తిరుగుతుందా? అనేది వేచి చూడాలి.

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

0
0
Report
Advertisement
Advertisement
Back to top