ఖమ్మం: రైతు కుటుంబానికి న్యాయం చేయాలి
చింతకాని మండలం పొద్దుటూరుకు చెందిన రైతు ప్రభాకర్ ఆత్మహత్యకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని ఖమ్మం బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో జిల్లా పాలనాధికారి ముజమ్మిల్ఖాన్, ఎమ్మెల్సీ మధు, జి ల్లా అధ్యక్షుడు కమల్రాజ్, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట్ వీరయ్య తదితరులను కలిసిన నాయకులు వినతిపత్రం అందించారు. రైతు ఆత్మహత్యలకు కారణమైన వారు స్వేచ్ఛగా తిరుగుతున్నారని ఆరోపించారు. రైతు కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. అనంతరం కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన ముజమ్మిల్ ఖాన్ ను సన్మానించారు.
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Archana Ravichandran Tiruvannamalai News: తమిళ బుల్లితెర నటి అర్చనా రవిచంద్రన్ చేసిన పని ఇప్పుడు పెను వివాదానికి దారితీసింది. పవిత్రమైన అరుణాచల క్షేత్రంలో నిబంధనలను ఉల్లంఘించినందుకు గానూ అటవీశాఖ అధికారులు ఆమెకు గట్టి షాక్ ఇచ్చారు. పరమశివుని స్వరూపంగా భావించే అరుణాచలంలోని 'అన్నామలై గిరి' చుట్టూ ప్రదక్షిణ చేయడానికి అనుమతి ఉంటుంది కానీ, కొండపైకి ఎక్కడం మాత్రం కఠినంగా నిషేధించారు.
ఏం జరిగింది?
తమిళ టీవీ నటి అర్చనా రవిచంద్రన్ తన సహ నటుడు అరుణ్తో కలిసి అరుణాచలం సందర్శనకు వెళ్లారు. అయితే, భక్తులు పవిత్రంగా భావించే 2,668 అడుగుల ఎత్తైన అన్నామలై గిరిపైకి వీరిద్దరూ ఎక్కారు. అటవీశాఖ నిబంధనలను బేఖాతరు చేస్తూ కొండపైకి వెళ్లడమే కాకుండా, అక్కడ దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
అటవీశాఖ అధికారుల కొరడా
నిషేధిత ప్రాంతంలోకి ప్రవేశించి ఫోటోలు దిగడంపై అటవీశాఖ అధికారులు తీవ్రంగా స్పందించారు. నిబంధనలను ఉల్లంఘించినందుకు అర్చన మరియు అరుణ్లకు తలా రూ.5,000 చొప్పున జరిమానా విధించారు. భవిష్యత్తులో ఇలాంటి పనులు పునరావృతమైతే కఠిన చర్యలు తీసుకుంటామని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.
భక్తుల ఆగ్రహం..
అరుణాచలం కొండను భక్తులు శివుని రూపంగా ఆరాధిస్తారు. కాబట్టి గిరిపైకి ఎక్కడం అంటే దైవత్వాన్ని అవమానించడమేనని స్థానిక భక్తులు మండిపడుతున్నారు. "నిబంధనలు అందరికీ ఒకటే, సెలబ్రిటీ అయితే రూల్స్ వర్తించవా?" అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. "ఎంత ధైర్యం ఉంటే దైవ స్వరూపంగా భావించే కొండపైకి ఎక్కుతావు?" అంటూ ఆమె పోస్ట్లపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అరుణాచల గిరి ప్రత్యేకత
అరుణాచలంలో ఉన్న ఆలయం చుట్టూ ఉన్న 14 కిలోమీటర్ల మార్గంలో లక్షలాది మంది భక్తులు గిరి ప్రదక్షిణ చేస్తారు. పర్యావరణ పరిరక్షణ, ఆధ్యాత్మిక విలువల దృష్ట్యా సామాన్యులెవరూ కొండపైకి వెళ్లకూడదని అటవీశాఖ ఎప్పటి నుంచో నిబంధనలు పెట్టింది. అయినా ఈ రూల్ బేఖాతరు చేసి వాళ్లిద్దరూ కొండపైకి ఎక్కడాన్ని భక్తులు తప్పుబడుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Pawan Kalyan: జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పార్టీలో కీలక మార్పు తీసుకురాబోతున్నారు. జనసేనలో ప్రజాస్వామ్యం బలపడేలా చర్యలు తీసుకుంటున్నారు. సీల్డ్ కవర్లో పేరు ఇచ్చి మిగిలిన రాజకీయ పార్టీల తరహాలో గ్రామ, వార్డు, మండల కమిటీలను ఎంచుకునే విధానం కాకుండా పూర్తిగా ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. ప్రత్యక్ష ఎన్నిక విధానంతో ప్రజాస్వామ్యానికి మారుపేరుగా నిలుస్తుందని ఆ పార్టీ భావిస్తోంది.
Also Read: Medaram Jatara 2026: మేడారం జాతరకు చారిత్రక ఏర్పాట్లు చేశాం: కేంద్ర, రాష్ట్ర మంత్రులు
ఈ విధానాన్ని తొలుత తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కాకినాడ జిల్లా పిఠాపురంలో అమలుచేసి అనంతరం రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని పవన్ నిర్ణయించారు. ఇందులో భాగంగా రెండు రోజుల నుంచి పిఠాపురం నియోజవర్గం చేబ్రోలులోని జనసేన కార్యాలయంలో పార్టీ ప్రధాన కార్యదర్శి తాళ్లూరి రామ్ ఆధ్వర్యంలో ఈ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. జనసేన సభ్యత్వం ఉన్నవారితో ఎవరైతే పోటీ పడుతున్నారో వారికి ఓటు వేసే విధంగా తీసుకున్న చర్యలతో మరో ఎన్నికల సంగ్రామం ఉత్కంఠంగా కొనసాగుతోంది.
Also Read: Medaram Jatara: మేడారం జన జాతర.. 2 రోజుల్లో 80 లక్షల మంది భక్తుల రాక
పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే, ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కల్యాణ్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాళ్లూరి రామ్ మీడియాతో మాట్లాడుతూ.. 'క్షేత్రస్థాయిలో జనసేన పార్టీని బలోపేతం చేసేందుకు గత నెలలో 52 గ్రామాలకు ఇన్చార్జిలు, బూత్ కన్వీనర్ని ఎన్నుకున్నాం. గొల్లప్రోలు పట్టణం, పిఠాపురం పట్టణానికి వార్డు ఇన్చార్జిలు, ఎన్నికల బూత్ కన్వీనర్లను ఎన్నుకునేలా ప్రజాస్వామ్యబద్ధంగా సీక్రెట్ ఓటింగ్ చేస్తున్నాం. ఈ ప్రక్రియ జరుగుతుందని.. 30వ తేదీన మూడు మండలాలకు, గొల్లప్రోలు పట్టణ, పిఠాపురం పట్టణ అధ్యక్షులు, ఉపాధ్యక్షులను ఓటింగ్ ద్వారా ఎన్నుకుంటాం' అని వివరించారు. ఎన్నికలతో సుమారు 5,867 మంది నాయకులు ఏర్పడతారని.. దీంతో జనసేన పార్టీని బరిష్టంగా ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈసారి జనసేన సభ్యత్వం ఉన్నవారిని మాత్రమే పరిగణనలోకి తీసుకున్నామని.. జనసేన సభ్యత్వం లేని వారికి దానిపై వివరణ ఇస్తామని తాళ్లూరి రామ్ తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Royal Enfield Hunter 350 Price: రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ కొనాలనేది చాలా మంది యువత కల. ముఖ్యంగా రద్దీగా ఉండే నగరాల్లో సులభంగా నడపడానికి, స్టైలిష్గా కనిపించడానికి రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350 (Hunter 350) ఒక అద్భుతమైన ఆప్షన్. మీరు ఈ బైక్ను ఫైనాన్స్లో తీసుకోవాలనుకుంటే, నెలవారీ EMI, వడ్డీ లెక్కలు ఎలా ఉంటాయో ఇక్కడ చూడవచ్చు. హంటర్ 350 బైక్ కేవలం లుక్స్ పరంగానే కాకుండా, రాయల్ ఎన్ఫీల్డ్ శ్రేణిలోనే అత్యంత సరసమైన (Affordable) బైక్గా గుర్తింపు పొందింది.
ధర వివరాలు
హంటర్ 350 వివిధ వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఎక్స్-షోరూమ్ ధర రూ.1,37,640 నుండి రూ.1,66,883 వరకు (వేరియంట్ను బట్టి మారుతుంది). టాప్ వేరియంట్ ధర సుమారు రూ.1,66,883గా ఉంటుంది.
లోన్, EMI లెక్కలు (టాప్ వేరియంట్పై)
ఒకవేళ మీరు రూ.1,66,883 మొత్తాన్ని 8.5% వడ్డీ రేటుతో లోన్ తీసుకుంటే, మీ చెల్లింపులు ఇలా ఉండవచ్చు.
| రుణ కాలపరిమితి | నెలవారీ EMI | మొత్తం వడ్డీ |
| 12 నెలలు (1 సంవత్సరం) | ₹14,556 | ₹7,783 |
| 24 నెలలు (2 ఏళ్లు) | ₹7,586 | ₹15,176 |
పైన పేర్కొన్న లెక్కలు ఎక్స్-షోరూమ్ ధరపై ఆధారపడి ఉన్నాయి. ఆన్-రోడ్ ధర (రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్ కలిపి) మీరు చెల్లించే డౌన్ పేమెంట్ బట్టి EMI మారుతుంది.
హంటర్ 350 ప్రత్యేకతలు
ఆధునిక రెట్రో లుక్, యువతను ఆకట్టుకునే కలర్ ఆప్షన్లు. 350cc పవర్ఫుల్ జే-సిరీస్ ఇంజిన్, ఇది నగర వీధుల్లో మంచి టార్క్ను అందిస్తుంది. తక్కువ సీటు ఎత్తు, తక్కువ బరువు ఉండటం వల్ల రద్దీగా ఉండే ట్రాఫిక్లోనూ సులభంగా హ్యాండిల్ చేయవచ్చు. డిజిటల్-అనలాగ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్ వంటి ఆధునిక ఫీచర్లు ఉన్నాయి.
మీరు తక్కువ వడ్డీతో రాయల్ ఎన్ఫీల్డ్ అనుభూతిని పొందాలనుకుంటే హంటర్ 350 సరైన ఎంపిక. లోన్ తీసుకునే ముందు వివిధ బ్యాంకుల వడ్డీ రేట్లను పోల్చి చూసుకోవడం మంచిది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Gajakesari Raja Yoga Effect On Zodiac Telugu: చాలా రోజుల తర్వాత బృహస్పతి, చంద్రగ్రహాల కలయిక జరిగింది. జ్యోతిష్య శాస్త్రంలో ఈ రెండు గ్రహాల కలయిక చాలా శుభప్రదమైనదిగా భావిస్తారు. ముఖ్యంగా బృహస్పతిని జ్ఞానం, మతం, డబ్బు విస్తరణకు సూచికగా భావిస్తారు. ఇక చంద్రుడిని మనస్సు, భావన, మానసిక స్థితి, ప్రశాంతతకు సూచికగా చెప్పుకుంటారు. అయితే ఈ రెండు గ్రహాల కలయిక కారణంగా ఏర్పడిందే గజకేసరి రాజయోగం.. ఈ యోగం జాతకంలో శుభస్థానంలో ఉన్న రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది.
ప్రస్తుతం మిథున రాశిలో బృహస్పతి సంచార దశలో ఉన్నాడు. అయితే, జూన్ రెండవ తేదీ వరకు ఈ గ్రహం అక్కడే ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఇది ఇలా ఉంటే బుధవారం జనవరి 29వ తేదీన సాయంత్రం మిధున రాశిలోకి చంద్రుడు ప్రవేశించాడు. దీని కారణంగానే ఈ రెండు గ్రహాల సంయోగం జరిగి గజకేసరి రాజయోగం ఏర్పడింది. దాదాపు ఈ యోగం 54 గంటల పాటు ఎంతో యాక్టివ్గా ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. అప్పటివరకు ఆయా రాశుల వారికి ఎంతో మేలు జరుగుతుంది.
గజకేసరి రాజయోగ ప్రభావం:
మకర రాశి
బృహస్పతి చంద్ర సంయోగాల కారణంగా మకర రాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ సమయంలో ఏర్పడిన గజకేసరి యోగ ప్రభావంతో చాలాకాలంగా పనుల్లో తలెత్తుతున్న సమస్యలు అనేక రకాల అడ్డంకులు ఈ యోగ ప్రభావంతో పరిష్కారం అవుతాయి. అంతే కాకుండా శత్రువులు కూడా చాలావరకు బలహీనంగా మారే అవకాశాలున్నాయి. పోటీ పరీక్షలు రాసేవారికి ఈ సమయం అద్భుతమైన ఫలితాలని అందిస్తుంది. చట్టపరమైన కేసులతో పాటు న్యాయ రంగాల్లో విశేషమైన అనుభవం ఉన్నవారికి బోలెడు ప్రయోజనాలు కలుగుతాయి. ఉద్యోగాలు చేస్తున్న వ్యక్తులు కార్యాలయాల్లో గౌరవం కూడా సంపాదిస్తారు. అంతేకాకుండా ఆరోగ్య సంబంధిత సమస్యలకు కాస్త ఉపశమనం కూడా కలుగుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు..
కన్యా రాశి
కన్యా రాశి వారికి గజకేసరి రాజయోగం ప్రభావంతో కెరీర్ పరంగా విశేషమైన లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా వృత్తి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. కొత్త బాధ్యతలు లభించడమే కాకుండా.. వీరు కొత్త ఉద్యోగాల్లో మార్పులు కూడా పొందుతారు. వ్యాపారాలు చేసే వారికి ఈ సమయం విశేషమైన ఫలితాలను అందిస్తుంది. అంతేకాకుండా కష్టపడి పనులు చేసే వ్యక్తులు ఈ సమయంలో భారీ మొత్తంలో లాభాలు పొందగలుగుతారు. ఆశించిన వాటికంటే ఎక్కువ మోతాదులు ధన లాభాలు కూడా పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగం చేస్తున్న కన్యారాశి వారికి కార్యాలయాల్లో అద్భుతమైన గుర్తింపు లభిస్తుంది. అంతేకాకుండా ఎన్నో సమస్యలు పరిష్కారం అవుతాయి.
ధనస్సు రాశి
ధనస్సు రాశిలో జన్మించిన వ్యక్తులకు కూడా ఈ అద్భుతమైన సంయోగంతో వైవాహిక జీవితం చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా భాగస్వామ్యం పరంగా విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే వివాహాల గురించి ఆలోచిస్తున్న వ్యక్తులకు ఈ సమయంలో అద్భుతమైన ప్రతిపాదనలు కూడా రావచ్చు. వ్యాపార భాగస్వాముల నుంచి భారీ మొత్తంలో లాభాలు కూడా సంపాదిస్తారు. అంతేకాకుండా చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న పనులు కూడా సులభంగా పూర్తవుతాయి. ఈ సమయంలో ఒప్పందాలతో పాటు వ్యాపార భాగస్వాములతో అద్భుతమైన నిర్ణయాలు తీసుకుంటారు. దీని కారణంగా సమాజంలో మంచి గౌరవం కూడా పెరుగుతుంది.
Also Read: Mercury Transit 2026: మకరంలో తిష్ట వేసిన బుధుడు.. ఈ రాశుల వారికి కోటీశ్వరులయ్యే యోగం ప్రారంభం!

Also Read: Mercury Transit 2026: మకరంలో తిష్ట వేసిన బుధుడు.. ఈ రాశుల వారికి కోటీశ్వరులయ్యే యోగం ప్రారంభం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Aadhaar App Launched Services List: ఆధార్ కార్డుదారులకు ఏవైనా మార్పులు చేసుకోవాలంటే ఆధార్ కేంద్రాలకు ముందుగానే తమ పేరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఉద్యోగానికి ఒకరోజు సెలవు పెట్టి మరి ఆధార్ కేంద్రాల వద్ద పడిగాపులు కాయల్చి వచ్చేది. అయితే విధానానికి చెక్ పెట్టింది యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా. కొత్తగా ఆధార్ యాప్ ద్వారా ఇంటి నుంచే సులభంగా అప్డేట్ చేసుకోవచ్చు. మన దేశంలో మొత్తం 143 కోట్ల మంది ఆధార్ కార్డు కలిగి ఉన్నారు. ఈ ఆధార్ కార్డు ద్వారానే డిజిటల్ సేవలు జరుగుతున్నాయి. అయితే ఆధార్ పై ఏవైనా మార్పులు చేసుకోవాలంటే మాత్రం ఇకపై ఇంట్లో నుంచే మొబైల్ సులభంగా చేసుకోవచ్చు. ఆధార్ కార్డు పై ఫోన్ నెంబర్, అడ్రస్ వివిధ సేవలు సులభంగా పొందవచ్చు.
కేవలం ఈ యాప్ ఉపయోగించి ఎవరైనా ఆధార్ కార్డులో సులభంగా ఉపయోగించవచ్చు. ఆధార్ అనేది మన దేశంలో ఎంత ముఖ్యమైంది. స్కూల్ అడ్మిషన్ నుంచి ఇంటి రిజిస్ట్రేషన్ చేయాలన్న ఆధార్ కార్డు కలిగి ఉండాలి. ఈ ఆధార్ కొత్త యాప్ ద్వారా సులభంగా పని ఇంట్లోనే పూర్తి చేసుకోవచ్చు ఎక్స్ వేదికగా కొత్త ఆధార్ యాప్ ప్రకటించారు.
కొత్త ఆధార్ యాప్ ద్వారా మీరు సులభంగా మొబైల్ నెంబరు, ఇంటి అడ్రస్ మార్చుకోవచ్చు. దీంతో పాటు మీ పేరు, ఇమెయిల్ ఐడీ కూడా అప్డేట్ చేసుకోవచ్చు. మీ ఫోన్లో కేవలం ఆధార్ యాప్ ఉంటే చాలు ఎక్కడికైనా వెళ్తే మీరు ఫిజికల్ ఆధార్ కార్డును తీసుకు వెళ్లాల్సిన పని కూడా లేదు. దీన్ని మీరు ఒక ప్రూఫ్ గా చూపించవచ్చు. హోటల్ లేదా ఇతర ప్రాంతాలను సందర్శిస్తే ఈ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఓకే యాప్ లో సులభంగా మీరు బహుళ ప్రయోజనాలు పొందుతారు.
కొత్త ఆధార్ యాప్ తో మీరు సులభంగా ఫోన్ నెంబర్ కూడా మార్పు చేసుకోవచ్చు. దీనికి మీ ఫోన్ నుంచి ఆధార్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. అక్కడ మీ మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవాలి. ఆధార్ యాప్ ఓపెన్ చేసి మీరు హోం స్క్రీన్ లో ఉన్న ఆధార్ వివరాలు అప్ డేట్ ఎంపిక చేయాలి. అక్కడ ఫోన్ నెంబర్ అప్డేట్ అనే ఆప్షన్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. అక్కడ మీకు కావాల్సిన ఫోన్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత అప్డేట్ అనే ఆప్షన్ ఎంచుకోండి. ఇక్కడ మీ వివరాలు కూడా ధ్రువీకరించాల్సి ఉంటుంది. ఆ ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత సులభంగా మీ ఆధార్ కార్డుపై ఫోన్ నెంబర్ అప్డేట్ అయిపోతుంది. నిర్ణీత సమయంలో మీరు ఆధార్ కార్డును సులభంగా అప్డేట్ చేసుకోవచ్చు. అయితే గూగుల్ ప్లే స్టోర్ నుంచి మీరు ముందుగా ఆధార్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మీకు నచ్చిన భాషను ఎంచుకొని ధ్రువీకరిస్తే సులభంగా ఆధార్ యాప్ ఉపయోగించుకోవచ్చు.
Also Read: 'అన్న వచ్చేశాడోచ్'..! విరాట్ కోహ్లి ఇన్స్టాగ్రామ్ మళ్లీ యాక్టివేట్, సస్పెన్షన్కు కారణం ఏంటంటే?
Also Read: ఫిబ్రవరి 1 అలెర్ట్..! మీ ఖర్చులపై ప్రభావం చూపే 5 కీలక మార్పులు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
AP Assembly Budget Session: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను ఈసారి ముందెన్నడూ లేని విధంగా అత్యంత సుదీర్ఘంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఫిబ్రవరి 12న ప్రారంభించి, మార్చి 12 వరకు నెల రోజుల పాటు సభను నడపాలని నిర్ణయించడం వెనుక బలమైన రాజకీయ వ్యూహం కనిపిస్తోంది. ముఖ్యంగా, సభకు వరుసగా గైర్హాజరవుతున్న వైసీపీ ఎమ్మెల్యేల సభ్యత్వంపై వేటు వేసేందుకు అవసరమైన అర్హత సాధించడమే ఈ సుదీర్ఘ షెడ్యూల్ వెనుక ఉన్న అసలు టార్గెట్ అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
Also Read: Snake Dog Video: పాము, కుక్క వైరం.. గంటపాటు జరిగిన యుద్ధంలో ఏం జరిగిందో తెలుసా?
60 రోజుల అనర్హత
రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఒక సభ్యుడు వరుసగా 60 పని దినాల పాటు సభకు హాజరు కాకపోతే వారిపై అనర్హత వేటు వేసే అవకాశం ఉంటుంది. ఇప్పటికే సభ ఏర్పడినప్పటి నుంచి సమావేశాలకు దూరంగా ఉన్న వైసీపీ సభ్యులను.. ఈసారి కూడా రాకుండా ఉంటే ఆ నిబంధన పరిధిలోకి తీసుకురావాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. అయితే కేవలం ఒక రోజు హాజరై సంతకం చేసి వెళ్లడం ద్వారా ఈ గండం నుంచి గట్టెక్కవచ్చని వైసీపీ ఎమ్మెల్యేలు భావిస్తున్నట్లు సమాచారం. దీనిని అడ్డుకునేందుకు ప్రభుత్వం నైతికత అనే అస్త్రాన్ని తెరపైకి తెస్తోంది.
Also Read: YS Sharmila: మళ్లీ జగనన్నపై వైఎస్ షర్మిల ఘాటు విమర్శలు.. పాదయాత్రపై సంచలన వ్యాఖ్యలు
ఎథిక్స్ కమిటీ సిఫారసులు
అసెంబ్లీ సమావేశాలకు రాకుండా.. చర్చల్లో పాల్గొనకుండా కేవలం సంతకాలు పెట్టి జీతభత్యాలు తీసుకోవడం ప్రజలను వంచించడమేనని కూటమి ప్రభుత్వం వాదిస్తోంది. ప్రజా సమస్యలపై గళం విప్పాల్సిన బాధ్యతను విస్మరించి.. సాంకేతిక కారణాలతో సభ్యత్వాన్ని కాపాడుకోవాలని చూడడం వారి నైతిక పతనానికి నిదర్శనమని విమర్శలు గుప్పిస్తోంది. రాబోయే సమావేశాల్లో రాజ్యాంగ స్ఫూర్తిని, అసెంబ్లీ నియమావళిని గౌరవించని వారికి గట్టి గుణపాఠం చెప్పే దిశగా స్పీకర్ నిర్ణయం ఉండబోతోందని సమాచారం. ఎథిక్స్ కమిటీ ఇప్పటికే విచారణ జరుపుతోంది. చర్యలకు సిఫారసు చేస్తూ నివేదిక సమర్పిస్తే.. అసెంబ్లీ నిర్ణయం తీసుకుంటుంది.
Also Read: Traffic Challan: ట్రాఫిక్ చలాన్లపై ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఐదు చలాన్లు దాటితే లైసెన్స్ రద్దు
వైసీపీ ఎమ్మెల్యేలకు గడ్డు పరిస్థితి
వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ఈసారి కూడా సభకు గైర్హాజరైతే చట్టపరమైన చిక్కులు తప్పవనే పరిస్థితి కనిపిస్తున్నాయి. అటు ప్రజల్లోనూ దీనిపై వ్యతిరేకత వచ్చే అవకాశం ఉండడంతో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ఇప్పుడు సంకటంలో పడ్డారు. పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆదేశాలు పాటించాలా? లేక సభ్యత్వాన్ని కాపాడుకునేందుకు సభకు వెళ్లాలా? అనేది తేల్చుకోలేకపోతున్నారు. మొత్తానికి ఫిబ్రవరి 12 నుంచి ప్రారంభం కానున్న ఈ సమావేశాలు ఏపీ రాజకీయాల్లో పెను మార్పులకు వేదిక కానున్నాయి.
Also Read: Prices Decrease: భారత్ చారిత్రక ఒప్పందం.. లిక్కర్, నూనెల ధరలు అమాంతం తగ్గుముఖం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
QR Code Rist Band: తెలంగాణ కుంభమేళా మేడారం సమ్మక్క-సారక్క మహాజాతర-2026 అంగరంగ వైభవంగా సాగుతోంది. లక్షలాది సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. దారులన్నీ మేడారం వైపు అన్నట్టు ఉంది. జాతరలో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తుండడంతో ఈక్రమంలో పిల్లలు తప్పిపోతున్నారు. పిల్లలు అదృశ్యమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉండడంతో పోలీసులు పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే తప్పిపోయిన పిల్లలను రెండు గంటల్లోనే ఆచూకీ కనిపెట్టి అప్పగిస్తున్నారు. క్యూఆర్ కోడ్ రిస్ట్ బ్యాండ్ సత్ఫలితాలను ఇస్తోంది. దానికి సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.
Also Read: Mamnoor Airport: వరంగల్ ఎయిర్పోర్టులో కీలక ముందడుగు.. త్వరలోనే ఎగరనున్న విమానాలు
మేడారం జాతర రద్దీలో చిన్నారులు తప్పిపోయే ప్రమాదం ఉండడంతో వారి రక్షణ కోసం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన ‘క్యూఆర్ కోడ్ రిస్ట్ బ్యాండ్’ వ్యవస్థను భక్తులు సద్వినియోగం చేసుకుంటున్నారు. క్యూఆర్ కోడ్ రిస్ట్ బ్యాండ్ వ్యవస్థపై మల్టీ జోన్ -2 ఐజీపీ ఎస్ చంద్రశేఖర్ రెడ్డి వివరాలు వెల్లడించారు. తెలంగాణ ఆర్టీసీ సహకారంతో భక్తులు వచ్చే ప్రధాన మార్గాల్లో 11 ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసి చిన్న పిల్లలకు ఈ బ్యాండ్లను ఉచితంగా అందిస్తున్నట్లు చెప్పారు.
Also Read: Govt Employees: ప్రభుత్వ ఉద్యోగుల కీలక నిర్ణయం.. పీఆర్సీ, ఈపీఎఫ్, డీఏ కోసం పోరాటం
హన్మకొండ హయగ్రీవాచారి గ్రౌండ్, హైదరాబాద్లోని ఉప్పల్, ఎంజీబీఎస్ బస్స్టేషన్లలో, కరీంనగర్, పరకాల, పెద్దపల్లి, మంథని, ఏటూరునాగారం, కాటారం బస్ స్టేషన్లతో పాటు.. వరంగల్ రైల్వే స్టేషన్, కాజిపేట్ రైల్వే స్టేషన్లలో రిస్ట్ బ్యాండ్లను అందజేసే కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఐజీపీ ఎస్ చంద్రశేఖర్ రెడ్డి వివరించారు. జాతరలో ఎవరైనా చిన్నారి తప్పిపోయినట్లు కనిపిస్తే వారి చేతికి ఉన్న రిస్ట్ బ్యాండ్పై ఉన్న క్యూఆర్ కోడ్ను స్మార్ట్ఫోన్ ద్వారా స్కాన్ చేయాలని సూచించారు. స్కాన్ చేసిన వెంటనే లభించే ఫోన్ నంబర్ ద్వారా సదరు బాధితుల బంధువులకు లేదా పోలీసులకు సమాచారం అందించి చిన్నారులను క్షేమంగా వారి కుటుంబ సభ్యుల వద్దకు చేర్చవచ్చని వివరించారు.
Also Read: Snake Dog Video: పాము, కుక్క వైరం.. గంటపాటు జరిగిన యుద్ధంలో ఏం జరిగిందో తెలుసా?
ఎస్ఐబీ, ఐజీపీ సుమతి ఈ వినూత్న సాంకేతిక ప్రక్రియను రూపొందించారని ఐజీపీ ఎస్ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ఈ నూతన ప్రక్రియను విజయవంతం చేసేందుకు ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు పోలీసులకు పూర్తి సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ క్యూఆర్ రిస్ట్ బ్యాండ్లు జాతరలో ఇప్పటికే సత్ఫలితాలను ఇస్తున్నాయని చెప్పారు. తప్పిపోయిన ఇద్దరు చిన్నారులను కేవలం గంటల వ్యవధిలోనే గుర్తించి వారి తల్లిదండ్రుల వద్దకు సురక్షితంగా చేర్చినట్లు తెలిపారు. కరీంనగర్ బస్టాండ్లో రిస్ట్ బ్యాండ్ వేయించుకున్న మురళీకృష్ణ కుమారుడు అరియాన్ష్ (4) అనే బాలుడు జాతరలో తప్పిపోగా ఈ సాంకేతికత ఆధారంగానే అతడిని త్వరగా గుర్తించగలిగినట్లు వెల్లడించారు. హనుమకొండ హయగ్రీవచారి గ్రౌండ్స్లో రిస్ట్ బ్యాండ్ ధరించిన గోవిందరావుపేట గ్రామానికి చెందిన మిల్కీ అనే బాలిక కూడా తప్పిపోయిన కొద్దిసేపటికే తన తండ్రి గుంజ నాగరాజు చెంతకు చేరిందని తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Warangal Mamnoor Airport: తెలంగాణ రాష్ట్రంలో మరో ఎయిర్పోర్టు ఏర్పాటు కాబోతున్నది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కృషితో వరంగల్ మామునూరు ఏర్పాటులో కీలక ముందడుగు పడింది. ఈ ఎయిర్పోర్టు నిర్మాణానికి సంబంధించిన భూమి సేకరణ పూర్తయ్యింది. ఆ భూమిని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. ఈ భూమి అప్పగింత కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
Also Read: Prices Decrease: భారత్ చారిత్రక ఒప్పందం.. లిక్కర్, నూనెల ధరలు అమాంతం తగ్గుముఖం
హైదరాబాద్లోని బేగంపేట విమానాశ్రయంలో మామునూరు ఎయిర్పోర్టుకు భూమి అప్పగింత కార్యక్రమం జరిగింది. వరంగల్ జిల్లాలోని మామునూరు ఎయిర్పోర్ట్కు అవసరమైన 300 ఎకరాల భూమిని కేంద్ర వైమానిక శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుకు అప్పగించారు. అనంతరం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు మాట్లాడుతూ.. మామునూరు ఎయిర్పోర్టుకు అవసరమైన భూమిని సేకరించి ఈరోజు కేంద్ర విమానయాన శాఖకు అప్పగించడం చరిత్రలో నిలిచిపోయే రోజు అని ప్రకటించారు.
Also Read: Gold Prices: బడ్జెట్లో కేంద్రం సంచలన నిర్ణయం? రూ.లక్షలోపు దిగిరానున్న బంగారం ధర
మామునూరు తరహాలోనే ఆదిలాబాద్, కొత్తగూడెం పట్టణాల్లో ఏర్పాటు చేయాలనుకున్న ఎయిర్పోర్టుల నిర్మాణం పనిని వేగవంతం చేయాలని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విజ్ఞప్తి చేశారు. తెలుగు గడ్డపై పుట్టిన వ్యక్తి కేంద్రంలో వైమానిక శాఖ మంత్రిగా ఉండడం అభినందనీయమని అభినందించారు. తెలంగాణ రాష్ట్ర అవసరాలను గుర్తిస్తూ సహకారం అందించాలని డిప్యూటీ సీఎం కోరారు. 2007లోనే ఎయిర్పోర్ట్ అథారిటీతో మామునూరు ఎయిర్పోర్ట్ నిర్మాణానికి ఒప్పందం చేసుకున్నప్పటికీ పట్టించుకోకపోవడంతో వరంగల్ ఎయిర్పోర్ట్ నిర్మాణం ఆలస్యమైందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.
Also Read: Govt Employees: ప్రభుత్వ ఉద్యోగుల కీలక నిర్ణయం.. పీఆర్సీ, ఈపీఎఫ్, డీఏ కోసం పోరాటం
హైదరాబాద్ కాకుండా తెలంగాణ రాష్ట్రంలోని టూ టైర్ సిటీలు అయినా కొత్తగూడెం, ఆదిలాబాద్లో ఎయిర్పోర్ట్ నిర్మాణం చేయాలని కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టగానే రామ్మోహన్ నాయుడును రాష్ట్ర మంత్రివర్గం కోరిందని వివరించారు. కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ముందుకు వెళ్లడం శుభసూచకం అని తెలిపారు. మామునూరు ఎయిర్పోర్ట్ 1930లో నిజాం కాలంలోనే పనులు మొదలుపెట్టారని.. ఇది ఆనాడు దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద ఎయిర్పోర్ట్ అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గుర్తుచేశారు. మామునూరు ఎయిర్పోర్ట్ భూ సేకరణకు 300 కోట్లు అవసరమని గుర్తించి వాటిని వెంటనే విడుదల చేసి వడివడిగా అడుగులు వేసి భూసేకరణ ప్రక్రియను పూర్తి చేసినట్లు వెల్లడించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Medaram Jatara 2026: దేశంలోనే అతిపెద్ద గిరిజన పండుగ మేడారం సమ్మక్క-సారక్క మహాజాతరను భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. లక్షలాది మంది భక్తులు తరలివచ్చే ఈ మహాజాతరలో కనీస వసతుల్లో ఎలాంటి లోటుపాట్లు లేవని స్పష్టం చేశారు. భక్తుల సౌకర్యార్థం తాగునీరు, వైద్య సేవలు, పారిశుద్ధ్యం, విద్యుత్ సరఫరా, రహదారులు, రవాణా, భద్రత, సమాచార వ్యవస్థ వంటి మౌలిక వసతులన్నింటినీ శాఖల మధ్య సమన్వయంతో అందిస్తున్నట్లు చెప్పారు.
Also Read: Medaram Jatara: మేడారం జన జాతర.. 2 రోజుల్లో 80 లక్షల మంది భక్తుల రాక
మేడారంలో సమ్మక్క, సారక్కను కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి జువల్ ఓరం, కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. మేడారం సమ్మక్క, సారక్కలను దర్శించుకున్న అనంతరం కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి జువల్ ఓరం మాట్లాడుతూ.. 'సమ్మక్క–సారక్క జాతర దేశంలోనే అతిపెద్ద గిరిజన పండుగ. ఇది గిరిజనుల మహాకుంభంగా నిలుస్తోంది. ఈ ప్రాంత అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో నిధులు అందిస్తోంది. భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక రైళ్లను కూడా ఏర్పాటు చేశాం' అని వివరించారు. 'కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న గిరిజన సంక్షేమ పథకాలపై వివరాలు వెల్లడించారు. ధర్తీ ఆబా గిరిజన గ్రామ ఉత్కర్ష్ అభియాన్ కింద రూ.లక్ష కోట్లు, పీఎం జన్మన్ యోజన కింద రూ.24 వేల కోట్లు కేటాయించినట్లు తెలిపారు. తెలంగాణకు 23 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలు మంజూరు చేసినట్లు చెప్పారు.
Also Read: Gold Prices: బడ్జెట్లో కేంద్రం సంచలన నిర్ణయం? రూ.లక్షలోపు దిగిరానున్న బంగారం ధర
కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. 'సమ్మక్క–సారక్క జాతర గిరిజన ప్రజల అతిపెద్ద పండుగ. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి లక్షలాది భక్తులు మేడారానికి తరలివస్తారు. ములుగు, లక్నవరం, మేడవరం, తాడ్వాయి, బొగత జలపాతం ప్రాంతాల పర్యాటకాభివృద్ధికి రూ.80 కోట్లు, రామప్ప దేవాలయ అభివృద్ధికి రూ.140 కోట్లు, ఈ ఏడాది జాతర నిర్వహణకు రూ.3.70 కోట్లు మంజూరు చేశాం' అని వివరించారు. రూ.890 కోట్లతో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు పనులు ప్రారంభమయ్యాయని.. త్వరలో ప్రధానమంత్రి చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు ప్రకటించారు.
Also Read: Prices Decrease: భారత్ చారిత్రక ఒప్పందం.. లిక్కర్, నూనెల ధరలు అమాంతం తగ్గుముఖం
భక్తుల విశ్వాసాలకు భంగం కలగకుండా.. గిరిజన సంప్రదాయాలు, ఆచారాలకు సంపూర్ణ గౌరవం ఇస్తూ జాతర నిర్వహణ జరుగుతోందని రాష్ట్ర మంత్రి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. 'ఈ మహాజాతర భక్తులకు సేవ చేయడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. ఎండ, వర్షం, రద్దీ అన్న తేడా లేకుండా పని చేస్తున్న అధికారుల అంకితభావమే ఈ జాతర విజయానికి బలం. ప్రజల సహకారం, మీడియా బాధ్యతాయుత పాత్రతో మహాజాతర సజావుగా కొనసాగుతోంది' అని తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Snake vs Dog: జీవ ప్రపంచంలో ఒక జీవితో మరో జీవికి పడదు. దానికి మానవులు కూడా అతీతం కాదు. మానవుల విషయం పక్కనపెడితే పాములకు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు ఉంటాయి. పాములు పగబట్టడంలో.. తమ జాతి పాములతోనే పోరాడే పాములు ఇక వేరే జాతి జంతువులతో కూడా శత్రుత్వం కొనసాగిస్తాయి. వాటిలో పాము, ముంగిస ఒకటీ కాగా.. రెండోది పాము, కుక్క. ప్రస్తుతం ఒక వీడియో వైరల్గా మారింది. పాము, కుక్క కలిసి రెండూ కొన్ని నిమిషాల పాటు పోరాటం చేశాయి. చివరకు కుక్క పైచేయి సాధించింది. పామును చంపేసి యజమాని కుటుంబాన్ని కాపాడింది. తెలంగాణలోని సిద్దిపేట జిల్లా ధూళిమిట్టలో ఈ సంఘటన జరగ్గా.. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
Also Read: Gold Prices: బడ్జెట్లో కేంద్రం సంచలన నిర్ణయం? రూ.లక్షలోపు దిగిరానున్న బంగారం ధర
తెలంగాణలోని సిద్దిపేట జిల్లా ధూళిమిట్టలో బడుగు సాయిలు అనే వ్యక్తి ఇంటి ఆవరణలోకి నాగుపాము వచ్చింది. పాము వచ్చి బుసలు కొట్టడంతో ఆ కుటుంబం తీవ్ర భయాందోళన చెందింది. పాము రావడంతో ఏం చేయాలో పాలుపోకపోవడంతో చుట్టుపక్కల ఉన్న వారు కూడా వచ్చారు. ఆ పాము కాటు వేయకుండా బయటకు పంపించే ప్రయత్నం చేశారు. అయితే వారు పెంచుకుంటున్న కుక్క పాముపై ప్రతాపం చూపించింది.
Also Read: Prices Decrease: భారత్ చారిత్రక ఒప్పందం.. లిక్కర్, నూనెల ధరలు అమాంతం తగ్గుముఖం
అందరూ బెదిరించడంతో ప్రాణభయంతో ఆ నాగుపాము ఇంటి గోడ పక్కన ఉన్న రంధ్రంలోకి వెళ్లింది. అయితే పెంపుడు కుక్క ఇది గమనించి పామును తోక పట్టుకుని బయటకు లాగింది. బయటకు లాగిన నాగుపాముతో కుక్క పోట్లాడింది. అటు మనుషులు, ఇటు కుక్క దెబ్బకు పాము ఎటు పోలేని పరిస్థితి. ప్రాణభయంతో పారిపోతుండగా కుక్క పట్టుకుని వచ్చి యుద్ధం చేసింది. దీంతో ప్రాణం పోతున్నా ఆ పాము కుక్కతో హోరాహోరీగా పోరాడింది. అయితే అప్పటికే తీవ్రంగా గాయపడిన ఆ పాము కుక్క దెబ్బకు ప్రాణం విడిచింది. వెంటాడి వేటాడి ప్రాణం పోయేంత వరకు పాముతో కుక్క పోరాటం చేసింది.
Also Read: Medaram Jatara: మేడారం జన జాతర.. 2 రోజుల్లో 80 లక్షల మంది భక్తుల రాక
ఈ పాము, కుక్క పోరాటాన్ని ఆ కుటుంబసభ్యులు, స్థానికులు ఆసక్తిగా తిలకించారు. యజమాని కుటుంబాన్ని పాము బారి నుంచి కుక్క కాపాడడం ఆసక్తికరంగా మారింది. మనుషులపై కుక్క చూపించే విశ్వాసానికి మరో ప్రత్యక్ష ఉదాహరణ ఈ సంఘటన. పాము, కుక్క కొట్లాడే వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. ఇన్నాళ్లు పాము, ముంగిస పోరాటం చూశాం కానీ పాము, కుక్క కొట్లాడడం ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ వీడియో మీరు కూడా చూసేయండి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
YS Jagan vs YS Sharmila: ఆంధ్రప్రదేశ్లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రకటించిన పాదయాత్రపై రాజకీయాలు వేడెక్కగా.. పాదయాత్ర చుట్టూ రాజకీయాలు నడుస్తున్నాయి. ఈ క్రమంలోనే తన సోదరుడు, వైఎస్సార్సీపీ అధినేతపై చెల్లెలు వైఎస్ షర్మిల ఘాటు విమర్శలు చేశారు. తన అన్న ప్రకటించిన పాదయాత్రపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పాదయాత్ర ఎందుకు? అని సూటిగా ప్రశ్నించారు. అధికారం ఇస్తే ఏం చేశారని నిలదీశారు. స్వార్థం తగ్గి మంచితనం పెరగాలని సూచించారు.
Also Read: Traffic Challan: ట్రాఫిక్ చలాన్లపై ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఐదు చలాన్లు దాటితే లైసెన్స్ రద్దు
ఇటీవల వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ఏడాదిన్నర తర్వాత పాదయాత్ర చేస్తానని ప్రకటించిన విషయం తెలిసిందే. జగన్ చేసిన పాదయాత్రపై కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించారు. 'జగన్ పాదయాత్ర ఎందుకు? అధికారం కోసమే కదా ఈ పాట్లు? అధికారం ఇస్తే ఏం చేశారు?' అని ప్రశ్నించారు. 'వైఎస్సార్ జలయజ్ఞం పూర్తి చేయగలిగారా? నవరత్నాల్లో పెట్టిన హామీలకు దిక్కులేదు. అధికారంలో వచ్చిన 6 నెలల్లో పూర్తి చేస్తానన్నాడు. అధికారం ఇస్తే ఎందుకు పూర్తి చేయలేదు?' అని నిలదీశారు.
Also Read: Prices Decrease: భారత్ చారిత్రక ఒప్పందం.. లిక్కర్, నూనెల ధరలు అమాంతం తగ్గుముఖం
'మద్యనిషేధం అన్నాడు. అధికారం ఇస్తే కల్తీ మద్యం పెట్టి క్యాష్ పద్ధతిలో మద్య మాఫియా చేశాడు. రుషికొండ వేల ఏళ్ల నుంచి నిలబడ్డ కొండ. రుషికొండను బోడి గుండు చేశాడు. అధికారం ఇస్తే ఒక్క రోజు కూడా బయటకు రాలేదు. ఆ పార్టీ వాళ్లకే అందుబాటులో లేడు' అని తన సోదరుడు జగన్పై వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికలకు 6 నెలల ముందు బయటకు వచ్చి సిద్ధం అంటూ కొన్ని నెలలు తిరిగారు తప్పిస్తే ఒకరోజు అయినా ప్రజల కోసం బయటకు వచ్చారా? అని ప్రశ్నించారు.
Also Read: Gold Prices: బడ్జెట్లో కేంద్రం సంచలన నిర్ణయం? రూ.లక్షలోపు దిగిరానున్న బంగారం ధర
'అబ్రహం లింకన్ ఒక మాట అన్నాడు. ఒక మనిషి నిజమైన నైజం తెలియాలి అంటే అధికారం ఇచ్చి చూడండి అన్నాడు. మనం జగన్ని అధికారంలో చూశాం. జగన్కి అధికారం సూట్ అవ్వలేదు. జగన్కు పవర్ సూట్ అవ్వలేదు' అని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల విమర్శలు చేశారు. 'జగన్ నేచర్ మారాలి. జగన్ నైజం మారాలి. జగన్లో మార్పు రావాలి. జగన్లో స్వార్థం తగ్గి మంచితనం పెరగాలి' అని హితవు పలికారు. 'అప్పుడు దేవుడు అధికారం ఇస్తాడేమో? అంతవరకు దేవుడు ప్రజలు ఆశీర్వదించడు' అని పేర్కొన్నారు. ఏడాదిన్నర తర్వాత చేసే పాదయాత్రకు ఇప్పుడు అనౌన్స్ ఎందుకు? చిత్తశుద్ధి లేని యాత్రలు ఎందుకు? అని మాజీ సీఎం వైఎస్ జగన్ను ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Railway Ticket Discount For Senior Citizens: ఫిబ్రవరి 1న కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్ 2026-27 పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా సీనియర్ సిటిజన్లకు (వృద్ధులకు) రైల్వే ప్రయాణాల్లో ఊరటనిచ్చేలా కేంద్రం ఒక సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం. కరోనా సమయంలో నిలిపివేసిన రైల్వే కన్సెషన్లను (Railway Concessions) మళ్లీ ప్రవేశపెట్టాలని రైల్వే శాఖ ప్రతిపాదించింది. దీనిపై ఆర్థిక శాఖ కూడా సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఎవరికి ఎంత రాయితీ?
పాత నిబంధనల ప్రకారం.. ఈ పథకం అమల్లోకి వస్తే సీనియర్ సిటిజన్లకు ఈ క్రింది విధంగా ప్రయోజనం చేకూరుతుంది.
మహిళలు (58 ఏళ్లు పైబడిన వారు): టికెట్ ధరపై 50 శాతం రాయితీ.
పురుషులు (60 ఏళ్లు పైబడిన వారు): టికెట్ ధరపై 40 శాతం రాయితీ.
అన్ని తరగతులకు వర్తింపు
కేవలం సాధారణ స్లీపర్ క్లాస్ మాత్రమే కాకుండా, ఏసీ కోచ్లలో (1st AC, 2nd AC, 3rd AC) కూడా ఈ రాయితీ లభించే అవకాశం ఉంది. ఐఆర్సీటీసీ (IRCTC) వెబ్సైట్ లేదా ఆఫ్లైన్ కౌంటర్ల ద్వారా టికెట్ బుక్ చేసుకునేటప్పుడు 'సీనియర్ సిటిజన్' ఆప్షన్ను ఎంచుకోవడం ద్వారా ఈ తగ్గింపును పొందవచ్చు.
ఎందుకు నిలిపివేశారు?
మార్చి 2020లో కరోనా మహమ్మారి కారణంగా రైల్వే ఆదాయం దెబ్బతినడంతో, ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడానికి ఈ రాయితీలను తాత్కాలికంగా నిలిపివేశారు. దీనివల్ల ప్రతి ఏటా రైల్వే శాఖకు సుమారు రూ.1,600 నుంచి రూ.2,000 కోట్ల వరకు ఆదా అవుతోంది. అయితే, ప్రస్తుతం రైల్వే ఆదాయం పెరగడం, వృద్ధుల నుంచి వస్తున్న డిమాండ్ను పరిగణనలోకి తీసుకుని దీనిని పునరుద్ధరించాలని నిర్ణయించారు.
బడ్జెట్పై ఆశలు
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో ఈ ప్రకటన చేసే అవకాశం ఉంది. ఇప్పటికే బ్యాంకు డిపాజిట్లపై అధిక వడ్డీ వంటి ప్రయోజనాలు పొందుతున్న సీనియర్ సిటిజన్లకు, ఇది అదనపు బూస్ట్ను ఇస్తుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Elephant Jumping Video Watch Here: సోషల్ మీడియాలో నిత్యం వింత ఘటనలకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతూనే ఉంటాయి.. నెటిజన్స్ ఎక్కువగా ఇలాంటి వీడియోలు చూసేందుకు మాత్రమే ఆసక్తి చూపుతూ ఉంటారు. ఇందులో భాగంగా కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు తరచుగా ఇలాంటి వీడియోలను పోస్ట్ చేస్తూ ఉంటారు. తాజాగా ఓ ఏనుగుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా వినియోగదారులను విస్మయానికి గురి చేస్తోంది. ఈ వీడియోలో ఏనుగు ఒక భవనం పై నుంచి అదుపుతప్పి కారుపై దూకుతున్న దృశ్యాలు కళ్లకు కట్టినట్లు చూడొచ్చు. అయితే, ఇది ఎక్కడ జరిగింది? ఏనుగు ఇలా దూకడానికి గల కారణాలేంటి? దీనికి సంబంధించిన అన్ని వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ వీడియోకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఒక భారీ జనావాస ప్రాంతంలో ఇరుకైన వీధిలో ఇంటి పైకప్పు పై ఒక పెద్ద ఏనుగు కనిపించడం మీరు చూడొచ్చు. అంతేకాకుండా ఆ భవనం శిథిలావస్థలో ఉండడం.. చెక్కలు, రేకులాంటి నిర్మాణంపై ఏనుగు నిలబడి ఉండడం మీకు కనిపిస్తుంది. అయితే, ఆ పాత భవనం ఏనుగు బరువు తట్టుకోలేక కూలిపోయేందుకు దగ్గరగా ఉన్నట్లు మీరు చూడొచ్చు. ఇదే సమయంలో ఏనుగు దానిపై నిలకడ కోల్పోయి.. నేరుగా రోడ్డుపై ఆగి ఉన్న ఒక కారుపై దూకడం మీరు చూడొచ్చు.
అయితే, ఈ ప్రమాదం జరిగిన సమయంలో ప్రజలంతా అదే వీధుల్లో ఉండడంతో భయాందోళనకు గురయ్యారు. అంతేకాకుండా ఆ ఏనుగు కారుపై పడగానే భారీ శబ్దం రావడంతో చుట్టుపక్కల వారంతా.. వెనక్కి వెళ్ళండి.. వెనక్కి వెళ్ళండి అంటూ అరవడం కూడా మీరు ఈ వీడియోలో చూడొచ్చు. దీంతో చాలామంది అక్కడి నుంచి పారిపోవడం కూడా మీరు గమనించవచ్చు. అయితే ఆ ఏనుగు పైనుంచి దూకడంతో కొద్దిగా గాయాలైనట్లు తెలుస్తోంది. దూకిన వెంటనే ఆ ఏనుగు అక్కడి నుంచి పరుగులు పెట్టేందుకు ప్రయత్నించడం కూడా మీరు చూడొచ్చు.
Also Read: Giant Cobra Video: కిచెన్లో ఫ్రిజ్ వెనుక భారీ నాగుపాము.. సంచలనం సృష్టిస్తున్న వీడియో..
ఈ వీడియోలో ఏనుగు పరిస్థితి ఏంటి అంటే.. పైనుంచి దూకిన ఏనుగు వెంటనే లేచి నిలబడడంతో గాయాలు కొద్దిగానే అయినట్లు తెలుస్తోంది. అలాగే అదృష్టవశాత్తూ ఆ సమయంలో కారులో ఎవరూ లేకపోవడం పెద్ద ప్రమాదం తప్పినట్లు అయింది. ఈ ఘటనను అక్కడున్న కొంతమంది తమ మొబైల్లో చిత్రీకరించి పోస్ట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ వీడియో చూసిన సోషల్ మీడియా వినియోగదారులు మాత్రం.. ఇది నిజమైన వీడియో కాదని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ సృష్టించిందని కామెంట్లు చేస్తున్నారు. అవును మీరు కూడా క్లియర్ గా గమనించి ఈ వీడియోని చూస్తే.. ఇది ఒక ఏఐ వీడియోగా అనిపిస్తుంది. అలాగే ఫ్యాట్ చెక్ చేసి చూడగా.. ఇది ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ వీడియో గా తేలింది.
Also Read: Giant Cobra Video: కిచెన్లో ఫ్రిజ్ వెనుక భారీ నాగుపాము.. సంచలనం సృష్టిస్తున్న వీడియో..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Liquor And Wine Prices: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న బడ్జెట్పై ప్రజల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దేశంలో అన్నింటి ధరలు పెరిగిపోతున్నాయి.. బంగారం, వెండి అయితే అడ్డూ అదుపు లేకుండా పెరిగిపోతోంది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1వ తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. అయితే బడ్జెట్కు ముందే ఓ కీలక పరిణామం జరిగింది. భారత్, యూరోపియన్ యూనియన్ మధ్య కీలక ఒప్పందం జరిగింది. ఇరు దేశాల మధ్య చారిత్రాత్మక ఒప్పందంగా పరిగణిస్తుండగా.. ఈ ఒప్పందంతో ఆర్థిక వ్యవస్థకు బలోపేతం చేస్తుందని.. చాలా వాటి ధరలు తగ్గుముఖం పడతాయని తెలుస్తోంది.
Also Read: Gold Prices: బడ్జెట్లో కేంద్రం సంచలన నిర్ణయం? రూ.లక్షలోపు దిగిరానున్న బంగారం ధర
ఈయూతో భారత్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందంతో దిగుమతి చేసుకునే వస్తువులపై సుంకాలు తగ్గనున్నట్లు తెలుస్తోంది. దీని ప్రభావంతో ఈయూ నుంచి భారత్కు వచ్చే వస్తువుల ధరలు తగ్గుముఖం పడతాయని వాణిజ్య వర్గాలు చెబుతున్నాయి. ఈ ఒప్పందంతో దేశంలోనే పలు వస్తువుల ధరలు తగ్గనున్నాయని.. యూరోపియన్ యూనియన్తో చేసుకున్న కీలక వాణిజ్య ఒప్పందం ఎంతో దోహదం చేస్తుందని తెలుస్తోంది.
Also Read: Govt Employees: ప్రభుత్వ ఉద్యోగుల కీలక నిర్ణయం.. పీఆర్సీ, ఈపీఎఫ్, డీఏ కోసం పోరాటం
ఈ ఒప్పందంపై నరేంద్ర మోదీ స్పందిస్తూ.. 'ఇది చారిత్రాత్మక నిర్ణయం. ఇదొక పెద్ద డీల్' అని తెలిపారు. ఈ ఒప్పందంతో రెండు దేశాలకు ప్రయోజనం జరగనుందని.. ఇది ఆరంభం మాత్రమేనని ప్రధాని వెల్లడించారు. రెండు దేశాల మధ్య వ్యూహత్మాక సంబంధాలు బలోపేతమవుతాయని చెప్పారు. అయితే ఈయూతో చేసుకున్న ఈ ఒప్పందంతో భారత్లో వివిధ వస్తువుల ధరలు తగ్గే అవకాశం ఉంది. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ద్వారా భారతదేశంలో కొన్ని వస్తువుల ధరలు తగ్గుతున్నాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ధరలు తగ్గే జాబితాలో కార్లు, మద్యం ప్రధానంగా ఉన్నాయి. బీర్, విస్కీ, వోడ్కా, వైన్తోపాటు నూనె ధరలు (ఆలివ్ ఆయిల్, కూరగాయల నూనె) తగ్గుతాయని తెలుస్తోంది. కివీస్, ప్రాసెస్డ్ ఫుడ్, ఫ్రూట్ జ్యూస్ వంటి ధరలు తగ్గే అవాకశం ఉంది. ఈయూ దేశాల నుంచి భారతదేశం దిగుమతి చేసుకునే వస్తువుల ధరలు భారీగా తగ్గే అకాశాలు ఉన్నాయి.
Also Read: Traffic Challan: ట్రాఫిక్ చలాన్లపై ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఐదు చలాన్లు దాటితే లైసెన్స్ రద్దు
ఈయూ నుంచి దిగుమతి చేసుకునే 96.6 శాతం వస్తువులపై ఎలాంటి సుంకాలు ఉండకపోవడంతో వాటి ధరలు తగ్గనున్నాయి. దీంతోపాటు ఈయూకి భారతదేశం నుంచి ఎగుమతి అయ్యే వస్తువులపై కూడా సుంకాలు తగ్గుతాయి. 96.6 శాతం సుంకాలను తొలగిస్తామని యూరోపియన్ యూనియన్ తెలిపింది.
వీటిపై తగ్గనున్న సుంకాలు
స్పిరిట్లపై 40 శాతం సుంకాలు
అఫ్టికల్, సర్జికల్, మెడికల్ పరికరాలపై 90 శాతం సుంకాలు
భారత్ నుంచి వెళ్లే ఈయూ విమానాలు, అంతరిక్ష నౌక ఎగుమతులపై సుంకాల తొలగింపు
యంత్రాలు 44 శాతం
రసాయనాలు 22 శాతం
ఔషధాలు 11 శాతం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook