icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

Karimnagar: ఆపన్న హస్తంపై అక్రమహస్తం.. CMRF చెక్కుల్లో కమీషన్ల దందా..

Hyderabad, Telangana:

CMRF Commission Scam In Karimnagar: పేద ప్రజలకు ఆపద కాలంలో అండగా నిలవాల్సిన ముఖ్యమంత్రి సహాయనిది ఇప్పుడు కొందరు దళారులకు ఇదొక బిజినెస్ గా మారింది.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మూడు ప్రధాన నియోజకవర్గాల్లో చోట లీడర్లు, స్వార్థపరులు దళారులుగా మారి నిరుపేదలను అష్ట కష్టాలకు గురి చేస్తున్నారు. ప్రాణాంతక వ్యాధులతో పాటు ప్రమాదాల్లో ఆసుపత్రుల పాలై.. అప్పులు చేసి వైద్యం చేయించుకున్న పేదలకు ప్రభుత్వం ఇచ్చే సహాయం లోను వీరు వాటాలు కోరుతుండడం ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

ఈ నియోజకవర్గాల్లో కమిషన్ల దందా ఒక పద్ధతి ప్రకారం సాగుతూ వస్తోంది. మంజూరైన చెక్కు మొత్తం ఆధారంగా దళారులు తమ వాటాలను ముందే ఖరారు చేస్తున్నారు. క్షేత్రస్థాయి నుంచి అందుతున్న సహకారం ప్రకారం వసూళ్ల పర్వం వివిధ రకాలుగా ఉంది. రూ.50 లోపు చెక్కులకు.. రూ.10 వేల రూపాయల వరకు కమిషన్ తీసుకుంటున్నారట. అంతేకాకుండా లక్ష వరకు వచ్చే చెక్కులకు ఏకంగా రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు డిమాండ్ చేస్తున్నారని సమాచారం. అంతేకాకుండా రెండు లక్షలు దాటిన చెక్కులకు ఏకంగా రూ.30 వేల నుంచి దాదాపు రూ.50 వేల వరకు వసూలు చేస్తున్నారని తెలుస్తోంది.

సాధారణంగా ప్రజలు నేరుగా ఎమ్మెల్యేలను కలిసి దరఖాస్తులు చేసుకుంటారు. అయితే, ఆ దరఖాస్తులను పరిశీలన నుంచి చెక్కుల పంపిణీ వరకు కీలకపాత్ర పోషించే కొందరు ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయ సిబ్బంది.. ఈ దళారులతో చేతులు కలిపినట్లు ఆరోపణలు కూడా ఊహించని స్థాయిలో వస్తున్నాయి. చెక్కులు మంజూరైన విషయం లబ్ధిదారుడికి తెలియక ముందే.. ఈ దళారులకు సమాచారం అందుతోంది.. మా వల్లే ఈ చెక్కులు మంజూరు అయ్యాయని.. మాకు ఇంత ఇస్తేనే చెక్కులు మీ చేతికి వస్తాయని బాధితులను బెదిరిస్తున్నట్లు తెలుస్తోంది..

ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా నిరుపేదలకు ఆర్థిక భరోసా కల్పించాల్సిన ప్రభుత్వ లక్ష్యం ఈ దళారుల తీరు వల్ల నీరుగారిపోతోంది.. అప్పుల బాధలతో ఉన్న లబ్ధిదారులు.. అంతో ఇంతో వస్తుంది కదా అనే ఆశతో దళారులు అడిగినంత ఇచ్చుకోక.. చెక్కు తీసుకోలేక సతమతమవుతున్నారు.. బాధితులు ఫిర్యాదు చేద్దామన్న.. భవిష్యత్తులో రాజకీయ నాయకుల నుంచి ఇబ్బందులు ఎదురవుతాయేమోనని భయపడుతున్నారు.. జిల్లా యంత్రాంగంతో పాటు ఉన్నతాధికారులు తక్షణమే.. చెక్కుల పంపిణీ పారదర్శకంగా జరిగేలా చూడాలని.. అవినీతికి పాల్పడుతున్న దళారులతో పాటు వారికి సహకరిస్తున్న సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజలు మీడియా ద్వారా కోరుతున్నారు..

Also Read:​  Cheapest Suv Market: కారు కొనాలనుకుంటున్నారా? NSP మార్కెట్‌లో రూ.9 లక్షలకే థార్, క్రెటా.. డీటెయిల్స్ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

0
0
Report

Chandrababu: గోతుల రహిత రోడ్లు ఉండాలి.. ఈవీ బస్సులు వాడాలి: సీఎం చంద్రబాబు

Amaravathi, Andhra Pradesh:

AP Roads Development: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 45 వేల కిలోమీటర్ల రహదారుల నిర్వహణ పటిష్టంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారు. మెరుగైన రోడ్లతో ప్రజలకు మౌలిక సదుపాయాలు అందుబాటులోకి రావాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో గుంతలు లేని రోడ్లుగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. అతి తక్కువ వ్యయానికే ప్రజా రవాణా జరిగేలా ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకువాలని సూచించారు.

రాష్ట్రంలో రహదారుల నిర్వహణ, పాత్ హోల్ ఫ్రీ రహదారులు, ఈవీ బస్సుల వినియోగంపై ఉండవల్లిలోని సచివాలయంలో సమీక్ష చేశారు. మంత్రులు బీసీ జనార్ధన్ రెడ్డి, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, రవాణాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు, ఆర్టీసీ ఎండీ బాలసుబ్రహ్మణ్యం తదితర ఉన్నతాధికారులతో చర్చించిన అనంతరం సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో ఉన్న 45 వేల కిలోమీటర్ల పైచిలుకు రహదారులు నిర్వహణ పటిష్టంగా ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారు. వివిధ ప్రాంతాల్లో భౌగోళిక పరిస్థితులను అధ్యయనం చేసి దాని ఆధారంగా రహదారుల నిర్మాణం జరగాలని సూచించారు.

మెరుగైన రహదారుల ద్వారా ప్రజలకు మౌలిక సదుపాయాలు అందుబాటులోకి రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. అతి తక్కువ వ్యయానికే ప్రజా రవాణా జరిగేలా ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తేవాలని ఆదేశించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report

Infinix Note 60 Ultra: 200MP కెమెరాతో ఇన్ఫినిక్స్ సంచలనం.. నోట్ 60 అల్ట్రా వచ్చేసింది!

Hyderabad, Telangana:

Infinix Note 60 Ultra Launched: ప్రముఖ  స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఇన్ఫినిక్స్ మార్కెట్లోకి మరో తమ శక్తివంతమైన మొబైల్‌ను లాంచ్ చేసింది. మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ వేదికగా ఇన్ఫినిక్స్ నోట్ 60 అల్ట్రా ను కంపెనీ అధికారికంగా విడుదల చేసింది. ఇటాలియన్ కార్ డిజైన్ హౌస్ Pininfarina సహకారంతో అద్భుతమైన డిజైన్తో ఈ మొబైల్ అందుబాటులోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ ప్రీమియం లుక్‌తో పాటు ఎన్నో రకాల అత్యాధునిక ఫీచర్లతో అందుబాటులోకి వచ్చింది. అంతేకాకుండా ఇది 200 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను కలిగి ఉన్నట్లు సమాచారం. అయితే మీ మొబైల్‌కు సంబంధించిన అన్ని రకాల వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ఇన్ఫినిక్స్ నోట్ 60 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ 6.78 అంగుళాల 1.5K అల్ట్రా HDR AMOLED డిస్‌ప్లేను కలిగి ఉండబోతున్నట్లు కంపెనీ వెల్లడించింది. అంతేకాకుండా ఇది 144Hz రిఫ్రెష్ రేట్, 4500 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్‌తో విజువల్స్ అద్భుతంగా కనిపిస్తున్నట్లు కంపెనీ క్లైమ్ చేస్తోంది. డిస్ప్లే కు ప్రొటెక్షన్ గా కంపెనీ గొరిల్లా గ్లాస్ విక్టస్ రక్షణను కూడా అందించింది. దీంతోపాటు ఫోటోగ్రఫీ ప్రియుల కోసం కంపెనీ ఇందులో అద్భుతమైన కెమెరా సెటప్ ను అందించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఇది ఎంతో శక్తివంతమైన Samsung ISOCELL HPE సెన్సార్ తో 200MP మెయిన్ కెమెరాను కలిగి ఉంటుంది.

అంతేకాకుండా ఇందులో అద్భుతమైన 3.5x ఆప్టికల్ జూమ్ తో 50MP పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్‌ను కలిగి ఉండడమే కాకుండా 8MP అల్ట్రా-వైడ్ లెన్స్‌తో అందుబాటులోకి వచ్చింది. ఇక సెల్ఫీ ప్రియుల కోసం కంపెనీ ఎందులో ఎంతో శక్తివంతమైన 32MP ఫ్రంట్ కెమెరాను అందించింది. ఇక ఈ మొబైల్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 8400 అల్టిమేట్ చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఈ ఫోన్ మల్టీ టాస్కింగ్‌తో పాటు గేమింగ్‌కు ఎంతో అద్భుతంగా పనిచేయబోతున్నట్లు ఇన్ఫినిక్స్ క్లైమ్ చేస్తోంది. ఇక ఈ ఫోన్లో అత్యంత ఆకర్షణీయమైన ఫీచర్ ఏంటంటే.. దీని బ్యాటరీ.. ఇది ఎంతో శక్తివంతమైన 7000mAh సిలికాన్ కార్బన్ బ్యాటరీతో లాంచ్ అయింది. దీనికి ఫాస్ట్ చార్జింగ్ కోసం కంపెనీ 100W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్‌ను సపోర్ట్ ను కూడా అందిస్తోంది. కేవలం 48 నిమిషాల్లో ఫోన్ పూర్తిగా ఫుల్ ఛార్జ్ అవుతోంది.

Also Read:​  Cheapest Suv Market: కారు కొనాలనుకుంటున్నారా? NSP మార్కెట్‌లో రూ.9 లక్షలకే థార్, క్రెటా.. డీటెయిల్స్ ఇవే!

అలాగే ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత XOS 16.2 ఆపరేటింగ్ సిస్టంపై రన్ అవుతుంది.. ఇది 3 ఏళ్ల మేజర్ అప్‌డేట్స్, 5 ఏళ్ల సెక్యూరిటీ ప్యాచెస్ హామీని కంపెనీ ఇచ్చింది. దీంతోపాటు ఈ మొబైల్ 256 జిబి ఇంటర్నల్ స్టోరేజ్ తో అందుబాటులోకి వచ్చింది. అయితే, ఇప్పటికే మలేషియా మార్కెట్లో అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది. దీని ధర సుమారు రూ.70 వేల ఉంటుంది. దీనిని అతి త్వరలోనే ఇండియాలో కూడా విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇది అమాల్ఫీ బ్లూ, మోన్జా రెడ్, రోమా సిల్వర్‌తో పాటు టొరినో బ్లాక్ రంగుల్లో లభిస్తుంది. హై ఎండ్ వేరియన్స్‌లో సాటిలైట్ కాలింగ్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది.

Also Read:​  Cheapest Suv Market: కారు కొనాలనుకుంటున్నారా? NSP మార్కెట్‌లో రూ.9 లక్షలకే థార్, క్రెటా.. డీటెయిల్స్ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

0
0
Report
Advertisement

Assam: బీఫ్ ఇంట్లోనే తినండి.. బయట వద్దు.. అస్సాం సీఎం సంచలన వ్యాఖ్యలు!

Hyderabad, Telangana:

Himanta Biswa Sarma Latest News: అస్సాం అసెంబ్లీ ఎన్నికల వేడి పెరుగుతున్న సమయంలో గోమాంసం వినియోగంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హీమంత బిశ్వ శర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో బీఫ్ వాడకాన్ని తాను పూర్తిగా నిషేధించడం లేదని.. అయితే పబ్లిక్ ప్లేసుల్లో దీని వినియోగంపై కొన్ని పరిమితులు ఉండాలని ఆయన స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఒక ప్రముఖ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ అంశంపై పూర్తి క్లారిటీని అందించినట్లు సమాచారం..

బీఫ్ తినాలనుకునే వారు తమ సొంత ఇళ్లలో కూర్చొని తినవచ్చని.. దానికి ఎటువంటి అభ్యంతరం లేదని సీఎం పేర్కొన్నారు. నేను ఎవరిని తినొద్దని చెప్పలేదు.. కానీ బహిరంగ ప్రదేశాల్లో.. ముఖ్యంగా హోటల్స్‌లో లేదా ఇతర మనోభావాలు దెబ్బ తినే చోట తినోద్దని కోరుకుంటున్నాను.. ప్రజలు తమ ప్రైవేట్ నివాసాల్లో దీనిని స్వేచ్ఛగా తినొచ్చు.. అని ఆయన వివరించారు. సామాజిక సామరస్యాన్ని కాపాడటమే తమ ప్రభుత్వం ఉద్దేశం అని ఆయన చెప్పుకొచ్చారు..

అస్సాం ప్రభుత్వం గతంలోనే అస్సాం పశువుల సంరక్షణ చట్టం తీసుకువచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గుర్తు చేశారు.. ఈ చట్టం ప్రకారం కొన్ని కఠిన నిబంధనలు అమలులో ఉన్నాయని ఆయన మరోసారి తెలిపారు.. హిందువుల దేవాలయాలతో పాటు వైష్ణవ సత్రాలు ఉన్న ప్రాంతాలకు ఐదు కిలోమీటర్ల పరిధిలో బీఫ్ విక్రయించడం పూర్తిగా నిషేధం.. హిందువులతో పాటు సిగ్గులు జైనులు ఎక్కువగా నివసించే ప్రాంతాల్లో కూడా బీఫ్ అమ్మకాలపై ఆంక్షలు ఉంటాయి. 

ఎన్నికల సమయంలో సీఎం చేసిన ఈ వ్యాఖ్యలు అస్సాం రాజకీయాల్లో చర్చనీ అంశంగా మారాయి.. రాష్ట్రంలోని విభిన్న సాంస్కృతులతో పాటు మతాల మధ్య సమతుల్యతను కాపాడటానికే ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు ఆయన సమర్థించుకున్నారు. చట్టాన్ని గౌరవిస్తూనే.. వ్యక్తిగత ఆహార పలవాట్లలో తాము జోక్యం చేసుకోవడం లేదని సంకేతాన్ని పంపే ప్రయత్నం చేశారు.. వివక్షాలు దీనిని రాజకీయ వ్యూహంగా విమర్శించినప్పటికీ..క్షేత్రస్థాయిలో తమ విధానం స్పష్టంగా ఉందని హిమంత విశ్వ శర్మ తేల్చి చెప్పారు..

Also Read:​  Cheapest Suv Market: కారు కొనాలనుకుంటున్నారా? NSP మార్కెట్‌లో రూ.9 లక్షలకే థార్, క్రెటా.. డీటెయిల్స్ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

0
0
Report

Sun Transit 2026: మేషరాశిలోకి సూర్యుడి ఎంట్రీ.. ఈ రాశుల జాతకం మారుతోంది, డబ్బే డబ్బు!

Hyderabad, Telangana:

Sun Enters Effect On These 4 Zodiac Signs: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. గ్రహాలకు రాజుగా  పిలిచే సూర్యుడు తన రాశిని మార్చుకున్నప్పుడల్లా ద్వాదశ రాశుల వారిపై ఊహించని ప్రభావం పడుతుంది. తాజాగా 2026 సంవత్సరం ఏప్రిల్ లో సూర్యభగవానుడు మేషరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. సూర్యుడి సంచారం ఈ వారంలోనే జరగబోతున్నట్లు జ్యోతిష్యులు చెబుతున్నారు. దీని కారణంగా ఆయా రాశుల వారిపై ఊహించని ప్రభావం పడే అవకాశాలు కూడా ఉండాయట.. ముఖ్యంగా ఈ సమయంలో కొన్ని రాశుల వారికి అదృష్టం ఊహించని స్థాయిలో లభిస్తే.. మరికొన్ని రాశుల వారికి దుష్ప్రభావాలు కలిగే అవకాశాలు కూడా ఉన్నాయట. కాబట్టి సూర్యుడి ప్రభావం చాలా ప్రత్యేకమైనదిగా భావిస్తారు. అయితే ఈ సమయంలో కొన్ని రాశుల వారికి అదృష్టం లభించి.. జీవితాల్లో ఆర్థికంగా, వృత్తిపరంగా ఊహించని మార్పులు సంభవించబోతున్నాయి..

ఈ రాశుల వారికి ఊహించని అదృష్టం..
మేష రాశి 
సూర్యుడు మేషరాశిలో సంచారం చేయడం వల్ల ఈ సొంత రాశి వారికి రాజయోగం పట్టే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా గత కొంతకాలంగా నిలిచిపోయిన పనులు వేగవంతం అవ్వడమే కాకుండా.  సమాజంలో గౌరవ మర్యాదలు విపరీతంగా పెరుగుతాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ లభించడమే కాకుండా జీతాలు పెరిగే అవకాశం ఉందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. 

సింహరాశి 
సూర్యుడు సింహరాశికి అధిపతిగా వ్యవహరిస్తాడు. అలాంటిది సూర్యుడి సంచారం వల్ల సింహ రాశి వారికి అపారమైన లాభాలు చేకూరుతాయి. ముఖ్యంగా వ్యాపారస్తులకు భారీ లాభాలు చేకూరే అవకాశాలు కనిపిస్తున్నాయి కొత్త పెట్టుబడిదారులకు ఈ సమయం చాలా అద్భుతంగా ఉండబోతోంది. వ్యాపారాల్లో భారీ లాభాలు చేకూరి అవకాశాలున్నాయి. కుటుంబంలో శుభకార్యాలు జరిగే సూచనలు కనిపిస్తున్నాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. 

ధనస్సు రాశి 
ధనస్సు రాశి వారికి సూర్యుడి సంచారం ప్రభావం వల్ల ఆత్మవిశ్వాసం విపరీతంగా పెరుగుతుంది. విదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థుల కల ఊహించని స్థాయిలో నెరవేరబోతోంది. పూర్వికులు ఆస్తి సంబంధిత వివాదాలు కూడా ఎంతో సులభంగా పరిష్కారం కాబోతున్నాయి. ఆర్థికంగా బలోపేతం అవ్వడమే కాకుండా వీరు ఆరోగ్యంగా అద్భుతంగా ఉండబోతున్నారు.

వృశ్చిక రాశి 
వృశ్చిక రాశిలో జన్మించిన వ్యక్తులకు వృత్తిపరంగా జీవితంలో అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి. వీరు శత్రువులపై అద్భుతమైన విజయాలు సాధించడమే కాకుండా.. అనుకున్న పనులు ఎంతో సులభంగా చేయగలుగుతారు. కోర్టు కేసులు మీకు అనుకూలంగా మారతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. అంతేకాకుండా ప్రభుత్వ రంగాల్లో పనిచేసే వారికి ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది. అలాగే దీర్ఘకాలిక సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report

Iphone Ultra: వచ్చేస్తోంది ఐఫోన్ అల్ట్రా.. మడతపెట్టే ఐఫోన్ ఫీచర్స్ ఇవే!

Hyderabad, Telangana:

Iphone Ultra Leaks Latest News: స్మార్ట్‌ఫోన్ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న దిగ్గజ సంస్థ యాపిల్ త్వరలో ఫొల్టబుల్ స్మార్ట్‌ఫోన్ విడుదల చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అతి త్వరలోనే అద్భుతమైన డిజైన్‌తో మార్కెట్లోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు సమాచారం. ఇప్పటివరకు కేవలం పుకార్లకే పరిమితమైన యాపిల్ ఫోన్ డబుల్ ఫోన్ గురించి.. తాజాగా ఒక ఆసక్తికరమైన లీక్ బయటికి వచ్చింది. ఈ ఫోన్ ఐఫోన్ అల్ట్రా పేరుతో మార్కెట్లోకి ప్రవేశపెట్టబోతున్నట్లు ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ సోషల్ మీడియా వేదికగా  పంచుకున్నట్లు తెలుస్తోంది.. ఇది గతంలో విడుదల చేసిన అన్ని మోడల్స్‌తో పోలిస్తే చాలా అద్భుతంగా ఉండబోతున్నట్లు సమాచారం. అయితే ఈ మొబైల్ కు సంబంధించిన అన్ని రకాల వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రస్తుతం గూగుల్‌తో పాటు సాంసంగ్ వంటి సంస్థలు ఫొల్టబుల్ మార్కెట్లో ఆధిపత్యం చెలాయిస్తూ వస్తున్నాయి. యాపిల్ తన మొదటి ఫోల్డబుల్ డిజైన్ అత్యంత ప్రీమియం లుక్కులో కనిపించేందుకు యాపిల్ వివిధ ప్రయత్నాలు చేస్తూ ఉండట. కేవలం పేరు మార్చడమే కాకుండా.. అల్ట్రా స్థాయిలో అత్యున్నత ఫీచర్లు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. గతంలో యాపిల్ తన ప్రో మోడల్స్ను ఎలాగైతే వివిధ రకాల కొత్త ఫీచర్లతో అందుబాటులోకి తీసుకువచ్చిందో.. ఇందులో కూడా ఎన్నో రకాల ప్రీమియం ఫీచర్లు ఉండబోతున్నట్లు లీకైన వివరాలు చెబుతున్నాయి.

ఈ స్మార్ట్‌ఫోన్ లోపలి భాగంలో ఒక పెద్ద ఫొల్టబుల్ స్క్రీన్‌తో పాటు.. సెకండరీ డిస్ప్లే ఉండే అవకాశాలు ఉన్నట్లు లీకైన వివరాలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. అంతేకాకుండా ఇది ప్రీమియం కేటగిరీలో రాబోతుంది కాబట్టి.. దీని ధర సాధారణ యాపిల్ మొబైల్స్ కంటే పది రేట్లు ఎక్కువగానే ఉండే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. అంతేకాకుండా పూల డబ్బులు ఫోన్లను వచ్చే ప్రధాన సమస్యలైనా క్రిజ్ కనిపించకుండా యాపిల్ సరికొత్త మెకానిజంపై పని చేస్తున్నట్లు లీకైన వివరాలు తెలుపుతున్నాయి. ఇందులో కెమెరా కూడా గత మోడల్స్ కంటే ఎంతో ప్రత్యేకంగా ఉంటుందని సమాచారం..

Also Read:​  Cheapest Suv Market: కారు కొనాలనుకుంటున్నారా? NSP మార్కెట్‌లో రూ.9 లక్షలకే థార్, క్రెటా.. డీటెయిల్స్ ఇవే!

యాపిల్ ప్రియులు గత కొంతకాలంగా హోల్డబుల్ ఐఫోన్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. అయితే, యాపిల్ ఈ స్మార్ట్‌ఫోన్ ను ఎప్పుడు విడుదల చేస్తాదని అంశంపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కానీ నిపుణుల అంచనాల ప్రకారం.. ఐఫోన్ అల్ట్రా 2026 సంవత్సరం చివరి నెలలో లేదా 2027 సంవత్సరం మొదటి నెలలో మార్కెట్లోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. యాపిల్ ఏ ఉత్పత్తిని తెచ్చిన అది పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటుంది. అందుకే ఫోన్ డబ్బులు టెక్నాలజీలో ఉన్న లోపాలను సరిదిద్ది.. అత్యద్భుతమైన నాణ్యతతో ఈ అల్ట్రా ఫోన్ను తీసుకురావాలని కంపెనీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి ఐఫోన్ అల్ట్రా మొబైల్‌ మార్కెట్లోకి వస్తే.. అది స్మార్ట్‌ఫోన్ ప్రపంచంలోనే సరికొత్త విప్లవానికి నాంది పలుకుతుందని టెక్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Also Read:​  Cheapest Suv Market: కారు కొనాలనుకుంటున్నారా? NSP మార్కెట్‌లో రూ.9 లక్షలకే థార్, క్రెటా.. డీటెయిల్స్ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

0
0
Report
Advertisement

Jio 265 Recharge Plan: జియో బంపర్ ఆఫర్..రూ.265కే అపరిమిత కాల్స్, హైస్పీడ్ 5G ఇంటర్నెట్..

Hyderabad, Telangana:

Jio 265 Recharge Plan Details: జియో టెలికాం సంస్థలో చీపెస్ట్ అపరిమిత 5G ప్రీపెయిడ్ ప్లాన్ రూ.349కే అందుబాటులో ఉంది. ఒకవేళ  అంతకు మించి తక్కువ ధరకే లభిస్తే..వినియోగదారులు ఆనందానికి అవధులు ఉండవు. కేవలం రూ.265కే జియో పోస్ట్ పెయిడ్ రీఛార్జ్ ప్లాన్ అందుబాటులోకి వచ్చింది. అయితే జియో పోస్ట్ పెయిడ్‌లో ఇదే అతితక్కువ ధరకు వినియోగించుకోవచ్చు. ఇందులో భాగంగా అపరిమిత కాలింగ్, 5G అన్‌లిమిటెడ్ డేటా నెల రోజులు వ్యాలిడిటీతో రానుంది. 

సాధారణంగా ప్రీపెయిడ్ ప్లాన్స్‌ కంటే పోస్ట్ పెయిడ్ ప్లాన్స్ ఎంతో ఖరీదైనవని అభిప్రాయం ఉండేది. కానీ, మీరు కేవలం రూ.449 కే పోస్ట్ పెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ను కొనుగోలు చేయవచ్చు. అయితే మీరు సరైన ప్లాన్‌ను ఎంచుకుని.. తెలివిగా పెట్టుబడి పెడితే.. జియో ద్వారా మరిన్ని ప్రయోజనాలు పొందేందుకు అవకాశం ఉంది.

జియో రూ.449 పోస్ట్‌పెయిడ్ ప్లాన్ ఎంతో స్పెషల్. ఎందుకంటే ఇది ఒకే ప్లాన్‌లో మూడు వేర్వేరు నంబర్‌లను జోడించేందుకు మీకు అనుమతి ఉంటుంది. ప్రతి నంబర్‌కు రూ.150 ఫ్లాట్ ఫీజు వసూలు చేస్తున్నట్లు లెక్క. దీంతో అపరమిత కాలింగ్, 5G ఇంటర్నెట్‌ను కూడా అందిచనున్నారు. 

మీరు జియో వినియోగదారు అయితే మీరు ప్రీపెయిడ్ కనెక్షన్ కంటే తక్కువ ధరకే పోస్ట్‌పెయిడ్ కనెక్షన్ పొందవచ్చు. దీనికోసం, మీరు రూ.449 పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌ను ఎంచుకోవాలి. మీ నంబరుతో పాటు అదనంగా మరో 2 నంబర్లను కలిపి ప్లాన్‌లో జోడించవచ్చు. అదనంగా జోడించిన ప్రతి నంబరుకు కేవలం రూ.150తో రీఛార్జ్ చేయాల్సి ఉంటుంది.

ఈ ప్లాన్ ద్వారా మీ కుటుంబంలో నలుగురు సభ్యులకు మీ ప్లాన్‌కు రూ.899 రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. పన్నుల కోసం రూ.161.82 రూపాయలు కలిపిన తర్వాత నలుగురి కోసం మొత్తం ప్లాన్ నెలకు 1060.82 రూపాయలు అవుతుంది. అంటే నలుగురి ప్లాన్‌కు ఒక్కొక్కరికి మీకు నెలకు రూ.265 రూపాయలు ఖర్చవుతుంది. దీని ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుంటే.. ఇది ప్రస్తుతం ఉన్న ఏ ప్రీపెయిడ్ ప్లాన్ కంటే కూడా ఉత్తమమైనది.

ఈ ప్లాన్‌లో భాగంగా ఇది 5G కవరేజ్ పరిధిలో నివసిస్తూ, 5G ఫోన్‌ను ఉపయోగించే వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. కాబట్టి, వినియోగదారుడు 5Gని ఉపయోగించడం కొనసాగించినంత కాలం, ప్లాన్‌లోని డేటా నుండి ఎటువంటి తగ్గింపు ఉండదు. అంతేకాకుండా, మీరు వ్యాలిడిటీ గురించి చింతించకుండా అపరిమిత కాలింగ్‌ను ఆస్వాదిస్తారు. ఎందుకంటే పోస్ట్‌పెయిడ్ కనెక్షన్‌తో రీఛార్జ్ అయిపోతుందనే చింత మీకు ఉండదు. కాబట్టి, మీరు మీ బిల్లు చెల్లించడం ఒకటి రెండు రోజులు మర్చిపోయినా కూడా, మీ సేవకు అంతరాయం కలగదు.

ఈ ప్లాన్‌లోని ప్రధాన నంబర్‌కు 75 GB ఇంటర్నెట్‌ను, ప్రతి అదనపు నంబర్‌కు 5GB డేటాను అందించనున్నారు. వినియోగదారు 4G ఇంటర్నెట్‌ను ఉపయోగించినప్పుడల్లా ఈ డేటా ఉపయోగించబడుతుంది. 5G సిగ్నల్ ఉంటే అపరమిత డేటాను ఉపయోగించుకోవచ్చు. అదే విధంగా 18 నెలల గూగుల్ జెమిని ప్రో సబ్‌స్క్రిప్షన్, 5TB క్లౌడ్ స్టోరేజ్ కూడా ఉన్నాయి. దీనితో పాటు మీకు 3 నెలల జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్, 50GB జియోక్లౌడ్ స్టోరేజ్ కూడా లభిస్తుంది.

(గమనిక: పైన ఇవ్వబడిన సమాచారం కేవలం పాఠకుల సమాచారం కోసం మాత్రమే. దీన్ని పరిగణలోకి తీసుకునే ముందు సంబంధిత అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి. దీన్ని జీ తెలుగు న్యూస్ ధ్రువీకరించడం లేదు.)

Also Read: Sooryavanshi Bumrah Bowling: భయంకర పేసర్ బుమ్రానే వణికించిన బుడ్డోడు..సూర్యవంశీ తొలి బంతికే ఉతికి ఆరేశాడు! వీడియో వైరల్!

Also REad: NC-JCM Meeting 8th CPC: జీతాల పెంపు కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగులకు అలర్ట్..ఏప్రిల్ 13న మొత్తం తేలిపోతుంది! ఆ రోజు ఏం జరుగుతుంది?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement

Spiritual Secrets: పూజా గది రహాస్యాలు తెలుసా? ప్రతి దాని వెనుక దాగి ఉన్న ఆధ్యాత్మికత

Wadgaon, Maharashtra:

Pooja Room Spiritual Secrets: పూజలో చిన్న చిన్న విషయాలే వాటిలో కొన్ని ఆధ్యాత్మిక రహాస్యాలు దాగి ఉంటాయి. పూజ మందిరం లేదా పూజ గదిలో దేవుడి విగ్రహాలు, చిత్రపటాలతోపాటు కొన్ని వస్తువులు ఉంచుతుంటారు. దీపం, గంట, కొన్ని వస్తువులతోపాటు నీళ్లు కూడా ఉంచుతారు. రాగి లేదా ఇత్తడి చెంబులో నీళ్లు పోసి ఉంచుతారు. పూజా గదిలో అలా ఎందుకు ఉంచుతారో తెలుసా? గంట ఎందుకు కొడతారు? తదితర వాటి వెనుక ఆధ్యాత్మిక రహాస్యాలు తెలుసుకుందాం.

Also Read: Govt Employees: తెలంగాణ ఉద్యోగుల సంచలన నిర్ణయం.. పీఆర్‌సీ కోసం భారీ యాక్షన్‌ ప్లాన్‌

మన ఇంటి పూజ గదిలో.. పూజా మందిరంలో నీళ్లు ఉంచడం ఒక సాధారణ అలవాటు కాదు. దాని వెనుక లోతైన ఆధ్యాత్మికత, తత్వం ఉంది. పూజ సమయంలో స్వామివారికి నైవేద్యం సమర్పించడం సంప్రదాయం. స్వీట్లు, పండ్లు, దద్దోజనం, పులిహోర వంటి వంటి వాటిని దేవుడికి సమర్పిస్తుంటారు. పూజ గదిలో మట్టి పాత్ర లేదా రాగి పాత్రలో నీళ్లు నింపి ఉంచుతారు. అనంతరం పూజ సమయంలో ప్రశాంతంగా ధ్యానంలో కూర్చొని ఇష్టమైన దైవాన్ని ప్రార్థించాలి. అప్పుడు మనం చెప్పే మంత్రాలకు సానుకూల శక్తి (పాజిటివ్‌ ఎనర్జీ) ఆ నీటిలో కలుస్తుందని నమ్మకం. తరువాత ఆ నీటిని తాగితే శారీరక, మానసిక ఆరోగ్యం లభిస్తుంది.

Also Read: Unclaimed Money: మూలుగుతున్న రూ.లక్షా 2000 కోట్లు.. అందులో మీ డబ్బు ఉందా? అని తెలుసుకోవడం ఇలా

దీపారాధన, గంట శబ్దం ప్రాముఖ్యం
పూజ సమయంలో దీపారాధన చేసి దైవ గీతాలను పాడుతూ పూజ చేస్తుంటారు. ఈ పూజ సమయంలో గంట మోగిస్తుటారు. గంట శబ్దం మధురమైనది. ఈ శబ్దం చెడు శక్తులను తొలగిస్తుంది. దైవిక శక్తిని ఇంట్లో నిలిపి ఉంచుతుంది

పూజలో ఉపయోగించకూడని పదార్థం
పూజలో ఇనుప వస్తువులను ఉపయోగించకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి. ఎందుకంటే ఇనుప యముడికి చెందినదిగా భావిస్తారు. ఇనుము వస్తువులు ఉంచితే సానుకూల శక్తులను ఆకర్షించదని పండితులు చెబుతారు. వెండి, రాగి, ఇత్తడి, మట్టి పాత్రలు పూజా గదిలో ఉండవచ్చు.

నీటిని ఎలా ఉపయోగించాలి
పూజ సమయంలో చిన్న పాత్రలో నీళ్లు ఉంచి పూజ చేయాలి. తరువాత రోజు ఆ నీటిని ఇంటి పైకప్పు లేదా బయట పారేయాలి. ఇలా చేయడం వల్ల దుష్ట శక్తులు ఇంటికి దగ్గరకు రావు.. మంచి శక్తులు ఇంట్లో నిలుస్తాయని వేదాంతులు చెబుతున్నారు.

ఐదు భూతాల శక్తి పొందే రహస్యం
పూజ సమయంలో ఐదు భూతాలు కలిస్తే వాటి శక్తి మనకు లభిస్తుంది.
ఆకాశం – పూజ గదిలో ఉన్న ఖాళీ స్థలం
భూమి – మనం కూర్చున్న/ నిలబడ్డ నేల
అగ్ని – మనం వెలిగించే దీపం
గాలి – దీపంలో ఉన్న గాలి
నీరు – మనం ఉంచే నీరు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report

Sooryavanshi Bumrah Bowling: భయంకర పేసర్ బుమ్రానే వణికించిన బుడ్డోడు..సూర్యవంశీ తొలి బంతికే ఉతికి ఆరేశాడు! వీడియో వైరల్!

Guwahati, Assam:

Sooryavanshi Bumrah Bowling Video: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో నిన్న రాత్రి జరిగిన రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ మ్యాచ్‌లో యువకెరటాలు సంచలనం సృష్టించారు. రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్లు వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్ విధ్వంసకర బ్యాటింగ్ చేశారు. సీనియర్ పేసర్లకు కూడా ఎలాంటి గౌరవం లేకుండా బౌండరీలు బాదేస్తూ అందర్ని ఆశ్చర్యానికి గురిచేశారు. 

తొలుత వర్షం కారణంగా నిన్న ఐపీఎల్‌లో రాజస్థాన్, ముంబై మధ్య జరిగిన మ్యాచ్‌ను 11 ఓవర్లకు అంపైర్లు కుదించారు. ఈ మ్యాచ్‌లో 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ.. విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. ఇప్పుడు అతడి ప్రదర్శనపై తెగ చర్చ జరుగుతోంది. టీమ్ఇండియా పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లోనూ తొలి బంతికే వైభవ్ అవలీలగా సిక్సర్‌గా మరల్చడం పట్ల అందరి దృష్టిని ఆకర్షించాడు. తొలి బంతికే సిక్సర్ కొట్టిన విధానం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 

గౌహతి స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో జస్‌ప్రీత్ బుమ్రా, యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మధ్య హోరాహోరీ పోరు జరిగింది. బుమ్రా వేసిన తన మొదటి బంతిని ఎదుర్కొన్న సూర్యవంశీ ఏమాత్రం సంకోచించలేదు. అతను ఆరంభంలోనే ఒక స్లాట్ డెలివరీని అంచనా వేసి, దానిని లాంగ్-ఆన్ మీదుగా సిక్సర్‌గా మరల్చాడు. క్షణాల్లోనే ఆ క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. టీమ్ఇండియా పేసర్‌ బుమ్రా ఏమాత్రం కనికరం లేకుండా ఆడిన తొలి ఇన్నింగ్స్  ఇదే అని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. 

వైభవ్ సూర్యవంశీ ప్రదర్శన రాజస్థాన్ రాయల్స్ జట్టు గెలుపులో కీలకంగా మారింది. రాజస్థాన్ ఓపెనర్లు యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ రన్‌రేట్‌ను భారీగా పెంచడంతో ఇద్దరూ కృషి చేశారు. అయితే బుమ్రా బౌలింగ్‌లో ఏకంగా రెండు సిక్సర్లు బాది సూర్యవంశీ ఆటతో అందర్ని ఆకట్టుకున్నాడు. ఆ విధంగా బుమ్రా బౌలింగ్‌లో ఒకే ఓవర్‌లో ఏకంగా 12 పరుగుల రాబట్టాడు. అయితే వైభవ్ సూర్యవంశీ కేవలం 14 బంతుల్లో 39 పరుగులు రాబట్టాడు. అందులో 5 సిక్సర్లు, 1 ఫోర్ ఉంది. అయితే శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో లాంగ్‌ఆన్‌లో తిలక్ వర్మకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 

అయితే యశస్వి జైస్వాల్.. ఆడిన 32 బంతుల్లో 77 పరుగులు చేసి రాజస్థాన్ రాయల్స్ గెలుపులో కీలక మలుపుగా మారాడు. వీరిద్దరి భాగస్వామ్యం కేవలం 5 ఓవర్లలో 80 పరుగులు రాబట్టారు. 

ALso Read: NC-JCM Meeting 8th CPC: జీతాల పెంపు కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగులకు అలర్ట్..ఏప్రిల్ 13న మొత్తం తేలిపోతుంది! ఆ రోజు ఏం జరుగుతుంది?

Also Read: Amaravati Gazette Notification: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి..అధికారికంగా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన కేంద్రప్రభుత్వం!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

NC-JCM Meeting 8th CPC: జీతాల పెంపు కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగులకు అలర్ట్..ఏప్రిల్ 13న మొత్తం తేలిపోతుంది! ఆ రోజు ఏం జరుగుతుంది?

Hyderabad, Telangana:

NC-JCM Meeting 8th CPC News: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఇప్పుడు ముఖ్యమైన వార్త వచ్చింది. 8వ వేతన సంఘం జీతం పెంపు వంటి అంశాలపై చర్చించేందుకు ఏప్రిల్ 13న ఉద్యోగుల సంఘాలు సమావేశం కానున్నాయి. ఈ కీలక సమావేశంలో 8వ వేతన సంఘం సిఫార్సులు జాప్యం జరుగుతున్న కారణంగా వారంతా తదుపరి కార్యచరణ ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.

NC-JCM కీలక సమావేశం
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న జాతీయ మండలి (సంయుక్త సలహా సంఘం) (NC-JCM) ముసాయిదా కమిటీ కూడా 8వ వేతన సంఘం సిఫార్సుల అమలు కోసం తమ డిమాండ్స్‌ను ఖరారు చేసేందుకు ఏప్రిల్ 13న కీలక సమావేశం కానున్నారు.  జె.పి. చౌబే మెమోరియల్ లైబ్రరీ (ఏఐఆర్‌ఎఫ్ కార్యాలయ ప్రాంగణం)లో ఉదయం 11:00 గంటలకు జరగనున్న ఈ ముసాయిదా కమిటీ సమావేశంలో.. తుది ప్రజా డిమాండ్ లేఖను పరిశీలించడంతో పాటు వార్షిక వేతన పెంపులు, వేతన స్కేలు సవరణలు, అలవెన్సులు, ఇతర ప్రయోజనాలపై కూడా చర్చించే అవకాశం ఉంది.

కొత్త వేతన సంఘం కింద జీతం ఎంత పెరుగుతుంది? పెన్షన్‌లో పెరుగుదల ఎంతమేర ఉంటుంది? అలవెన్సులలో ఎలాంటి మార్పు ఆశించవచ్చు? అనే అంశాలపై చర్చించనున్నారు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది ఉద్యోగులు, పెన్షనర్లు ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానాల కోసం ఎదురుచూస్తున్నారు. 8వ వేతన సంఘంపై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్న తరుణంలో సంయుక్త సంప్రదింపుల సంఘానికి సంబంధించిన ఈ ముఖ్యమైన కార్యక్రమం జరుగుతోంది. వేతన సంఘానికి సమర్పించాల్సిన సిఫార్సులను రూపొందించడంలో ఈ సమావేశం కీలక పాత్ర పోషిస్తుందని భావిస్తున్నారు. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఈ వేతన సవరణకు సంబంధించి కొనసాగుతున్న సంప్రదింపుల ప్రక్రియలో ఇది ఒక ప్రధాన మైలురాయి అవుతుందని ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు భావిస్తున్నాయి.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇది ఒక కీలక సమయంగా మారనుంది. వారి అవసరాలను కమిషన్‌కు సంపూర్ణంగా, దృఢంగా తెలియజేయాల్సిన సమయం ఇదని ఉద్యోగ సంఘాలు భావిస్తున్నాయి. ఏప్రిల్ 13న జరగనున్న NC-JCM డ్రాఫ్టింగ్ కమిటీ సమావేశంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల డిమాండ్లను వివరిస్తూ ఒక వినతిపత్రాన్ని ఖరారు చేయడంపై దృష్టి సారిస్తున్నారు. ఈ వినతి పత్రాన్ని 8వ వేతన కమీషన్‌కు అందజేయనున్నారు. అందులో వేతన సవరణలు, పెన్షన్ పునర్‌వ్యవస్థీకరణ, స్టెప్‌లలో మార్పులకు సంబంధించిన అంచనాలను ప్రముఖంగా తెలియజేయనున్నట్లు సమాచారం. 

8వ వేతన సంఘం 2027 చివరి నాటికి లేదా 2028 ప్రారంభంలో పూర్తిగా అమలులోకి వస్తుందని ఉద్యోగులు భావిస్తున్నారు. అయితే 8వ వేతన సంఘం సిఫార్సుల ప్రకారం.. వేతన సవరణలు 2026 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తాయని గత వేతన సంఘాన్ని ఉదాహరణకు తీసుకోవచ్చు. అయితే దీనిపై కేంద్ర ప్రభుత్వం ఇంకా ఎలాంటి ఖచ్చితమైన సమాచారం ఇవ్వకపోవడం గమనార్హం. వేతన సంఘం తన నివేదికను సిద్ధం చేయడానికి సాధారణంగా చాలా నెలల సమయం తీసుకుంటుంది. ఆ తర్వాత ప్రభుత్వం సిఫార్సులను పరిశీలించి ఆమోదిస్తుంది. అప్పుడే కొత్త వేతన సంఘం వాస్తవ అమలు ప్రారంభమవుతుంది.

ఒకవేళ పే కమిషన్ అమలులో ఏమైనా ఆలస్యం జరిగితే.. ఉద్యోగులు మధ్యంతర బకాయిలను (8వ పే కమిషన్ బకాయిలు) పొందే అవకాశాలు ఉన్నాయి. మూల వేతనంతో పాటు పెన్షన్లలో సవరణలు, పెన్షనర్ల కోసం వివిధ చర్యలు కూడా ఉంటాయని భావిస్తున్నారు. ఇవి ఉద్యోగుల ఆదాయం, పదవీ విరమణ ఆర్థిక భద్రతపై గణనీయమైన ప్రభావాన్ని చూపవచ్చని ఉద్యోగ సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.

ఈ కారణాల వల్ల ఏప్రిల్ 13న జరగనున్న సమావేశాన్ని 8వ వేతన సంఘం ప్రక్రియలో కీలక మైలురాయిగా పరిగణిస్తున్నారు. ఎందుకంటే, వేతన సంఘంతో చర్చలకు ప్రాతిపదికగా నిలిచే ఉద్యోగుల డిమాండ్లను ఈ సమావేశంలోనే రూపొందించనున్నారు. ఫలితంగా లక్షలాది మంది ఉద్యోగులు, పెన్షనర్లు ఈ సమావేశాన్ని చాలా నిశితంగా గమనిస్తూ దాని ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Also Read: Amaravati Gazette Notification: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి..అధికారికంగా గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన కేంద్రప్రభుత్వం!

Also Read: Retirement Planning: ఉద్యోగులు ఎగిరి గంతేసే వార్త..రిటైర్మెంట్ తర్వాత నెలకు రూ.50,000 పెన్షన్..ఏం చేయాలంటే?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement

Prakasham: పామూరులో తీవ్ర విషాదం.. వేధింపులు తాళలేక టీచర్‌ సూసైడ్‌..!

Hyderabad, Telangana:

Private Teacher Suicide In Prakasham: వేధింపుల వల్ల ఎంతోమంది ప్రాణాలు బలి తీసుకుంటున్నారు. చివరికి వారు కూడా జైలు పాలవుతున్నారు. ఆ కుటుంబానికి తీరని శోకాన్ని మిగులుస్తున్నారు. అయితే, సోషల్ మీడియా వేదికగా పరిచయాలు కూడా ప్రాణాలు తీసే వరకు వస్తున్నాయి. సోషల్ మీడియా వేదికగా తనను వేధిస్తున్నాడని ఓ ప్రైవేటు టీచర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లాలోని పామూరులో చోటుచేసుకుంది. టీచర్ పరిస్థితి ఇలా ఉండడంతో ఆ గ్రామమంతా తీవ్ర విషాదంతో పోయింది. పోలీసుల ప్రకారం పామూరుకు చెందిన మాధవి ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్ గా పని చేస్తుంది. అయితే అదే గ్రామానికి చెందిన షేక్ నాగూర్ భాష కొంతకాలంగా ఆమెను వేధిస్తున్నాడు. అది చాలదన్నట్టు సోషల్ మీడియా వేదిక కూడా ఆమె ఫోటోలు మార్ఫింగ్ చేసి పెడతానంటూ బ్లాక్ మెయిల్ చేయడంతో తీవ్ర మనస్థాపానికి గురైంది మాధవి.

 ఇక కుటుంబ పోషణ కూడా తాను ఒక్కతే దిక్కు కావడంతో  మరింత ఒత్తిడికి లోనైంది. చివరికి అరచేతిపై సూసైడ్ చేసుకునే ముందు ఓ సందేశం రాసింది. 'నాన్న జాగ్రత్త' అని రాసి ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఇక నాగూర్ భాష గతంలో దినపత్రికలో పనిచేస్తున్నట్లు సమాచారం. అయితే మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నాగూర్ భాష కోసం గాలింపులు చర్యలు చేపట్టారు.

 ఇక మాధవి చనిపోవడంతో తీవ్ర భావద్వేగానికి గురైన గ్రామస్తులు నాగూర్ భాషకు సరైన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతున్నారు. ఇక కేసు దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు నాగూర్ భాష కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

READ ALSO:  ఇన్‌స్టా ప్రేమాయణం.. చివరకు ప్రాణం తీసింది! మచిలీపట్నం గొడుగుపేటలో విషాదం!

READ ALSO: ఇన్‌స్టాగ్రామ్‌ ప్రేమ విషాదాంతం.. యువకుడితో కలిసి కాలువలోకి దూకి వివాహిత ఆత్మహత్య..!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report

Jagtial: జగిత్యాల మున్సిపాలిటీలో ACB పంజా.. ఐదేళ్లుగా వాహనాలు మాయం.. కోట్లలో పన్నుల గోల్‌మాల్!

Hyderabad, Telangana:

Jagtial Municipality Scam Latest News: జగిత్యాల్ మున్సిపల్ కార్యాలయంలో చోటుచేసుకున్న భారీ అవినీతి భాగవతాన్ని అవినీతి నిరోధక శాఖ అధికారులు రట్టు చేశారు.. గత కొద్ది రోజులుగా పురపాలక సంఘం రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించిన అధికారులు.. విత్తుకుపోయి నిజాలను వెల్లడించినట్లు తెలుస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా.. ప్రజాధనాన్ని పక్కదారి పట్టించిన అధికారులపై ఏసీబీ అధికారులు సీరియస్ అయినట్లు తెలుస్తోంది. గత కొద్ది ఏళ్ల నుంచి ఎంతో మొత్తంలో అవినీతి బాగోతం నడుస్తున్నప్పటికీ.. ఇప్పుడు ఏసీబీ దాడులు జరగడం విశేషం.. దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

మున్సిపాలిటీ కి చెందిన ఆస్తులు నిర్వహణలో తీవ్ర నిర్లక్ష్యం వహించినట్లు ఏసీబీ అధికారుల తనిఖీల్లో తేలింది. సుమారు ఐదేళ్ల క్రితమే మున్సిపాలిటీకి చెందిన ఒక ట్రాక్టర్ తో పాటు నాలుగు ఆటోలు మాయమైనట్లు అధికారులు గుర్తించారు. ఈ వాహనాలు ఏమయ్యాయి? ఎక్కడున్నాయి? అని కనీస సమాచారం కూడా రికార్డుల్లో లేకపోవడం గమనార్హంగా మారింది. ఐదేళ్లు గడుస్తున్న ఉన్నతాధికారులు వీటిపై ఫిర్యాదు చేయకపోవడం వెనక పెద్దల హస్తం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి..

ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ పన్నుల వసూళ్లు మున్సిపల్ సిబ్బంది చేతివాటం ప్రదర్శించారు. గత ఐదేళ్లుగా వాణిజ్య సముదాయాల నుంచి రావాల్సిన అద్దె బకాయాలను వసూలు చేయడంలో అధికారులు పూర్తిగా విఫలమైనట్లు తెలుస్తోంది. అంతేకాకుండా పట్టణంలోని ఏర్పాటు చేసిన అడ్వర్టైజ్మెంట్ బోర్డుల ద్వారా రావాల్సిన భారీ పన్ను ఆదాయాన్ని గాలికి వదిలేసినట్లు అధికారులు గుర్తించారు. అలాగే అద్దె భవనాలకు సంబంధించిన గత 18 ఏళ్లుగా రిటైన్డర్లు నిర్వహించకుండా పాత ధరలకే కొనసాగిస్తూ ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టారు..

Read more: Minister Sridhar Babu: తెలంగాణ ప్రజలు ఎగిరి గంతేసే వార్త.. తులం బంగారం పథకంపై మంత్రి కీలక ప్రకటన.. ఏమన్నారంటే..?..

పారిశుద్ధ్య వాహనాల నిర్వాహన పేరుతో అక్రమాలకు తెరలేపినట్లు తెలుస్తోంది. వాహనాలకు అవసరమైన డీజిల్ కోటాలో భారీ తేడాలు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. దీంతోపాటు వాహనాల రిపేర్ల పేరిట భారీగా నకిలీ బిల్లులు సృష్టించి నిధులను డ్రా చేసినట్లు ఆధారాలు కూడా అధికారులు సేకరించినట్లు తెలుస్తోంది. అసలు రిపేర్ చేయని వాహనాలకు కూడా ఖర్చు చూపించినట్లు ప్రాథమిక విచారణలో తేలడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఈ సోదాలతో జగిత్యాల మున్సిపల్ వర్గాల్లో ప్రకంపనాలు మొదలైనట్లు సమాచారం. అక్రమాలకు పాల్పడిన కిందిస్థాయి సిబ్బంది నుంచి ఉన్నత అధికారుల వరకు ఎవరిపై వేటు పడుతుందన్న భయం నెలకొంది. ఈ భారీ కుంభకోణం వెనక రాజకీయ నాయకుల ప్రమేయంపై కూడా ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.

Read more: Minister Sridhar Babu: తెలంగాణ ప్రజలు ఎగిరి గంతేసే వార్త.. తులం బంగారం పథకంపై మంత్రి కీలక ప్రకటన.. ఏమన్నారంటే..?..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

0
0
Report

Chaturgrahi Yoga 2026: చతుర్గ్రాహియోగం.. ఈ 4 రాశుల వారికి తిరుగులేని రాజయోగం.. ప్రమోషన్లు, భారీగా జీతాల పెంపు!

Hyderabad, Telangana:

Chaturgrahi Yoga 2026 Effect On Zodiac Signs: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒకే రాశిలో నాలుగు గ్రహాలు కలవడాన్ని శక్తివంతమైన చతుర్గ్రాహి రాజయోగంగా పిలుస్తారు. 2026 సంవత్సరం ఏప్రిల్ నెలలో ఈ రాజయోగం ఏర్పడబోతోంది. మేషరాశిలో సూర్యుడితో పాటు గురు, బుధ, చంద్రగ్రహాల శక్తివంతమైన కలయిక కారణంగా ఈ రాజయోగం ఏర్పడుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఈ సమయంలో కోరుకున్న కోరికలు ఎంతో సులభంగా నెరవేరుతాయి. చతుర్గ్రాహి రాజయోగం వల్ల నాలుగు రాశుల వారికి వృత్తి ఉద్యోగాలపరంగా ఎంతో మేలు జరుగుతుంది. వ్యాపారాల్లో గోల్డెన్ పీరియడ్ ప్రారంభమవుతుంది. ముఖ్యంగా అనుకున్న పనుల్లో విశేషమైన గుర్తింపు లభిస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. అలాగే అధికంగా అద్భుతమైన లాభాలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ సమయంలో ఆయారాశుల వారికి అనుకున్నది అనుకున్నట్లుగానే జరుగుతుంది.

చతుర్గ్రాహి రాజయోగంతో ఈ రాశులవారికి బంపర్‌ లాభాలు:
మేషరాశి 

చతుర్గ్రాహి రాజయోగం ఎఫెక్ట్‌తో మేషరాశి వారికి అత్యధిక ప్రయోజనాలు కలుగుతాయి. గత కొన్ని నీళ్లుగా ఆగిపోయిన పనులు ఎంతో వేగంగా పూర్తవుతాయి. ఉద్యోగస్తులకు మంచి పదోన్నతులు లభించడమే కాకుండా ప్రశంసలు కూడా దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఊహించని విధంగా అన్ని పనుల్లో అద్భుతమైన లాభాలు పొందుతారు. అలాగే సమాజంలో మీకంటూ మంచి గౌరవం కూడా లభిస్తుంది.

మిథున రాశి 
మిథున రాశిలో జన్మించిన వ్యక్తులకు ఈ సమయం ఆర్థికంగా అద్భుతమైన బలాన్ని అందించబోతోంది. వ్యాపారస్తులకు భారీ ఒప్పందాలకు కుదరడమే కాకుండా గొప్ప గొప్ప అవకాశాలు లభించబోతున్నాయి. దీంతోపాటు మీరు పెట్టిన పెట్టుబడులకు రెట్టింపు ఆదాయాన్ని కూడా పొందుతారు. కార్యాలయాల్లో మీ పనికి తగిన గుర్తింపు లభించి జీతం పెరుగుతుంది. అంతేకాకుండా ఆదనపు ఆదాయం కూడా లభించబోతోంది.

సింహరాశి 
సింహరాశిలో జన్మించిన వ్యక్తులకు అదృష్టం సూర్యుడిలా ప్రకాశించబోతోంది. వీరికి విదేశీ ప్రయాణాల్లో వస్తున్న ఆటంకాలు కూడా ఎంతో సులభంగా తొలగిపోబోతున్నాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఇది అత్యంత అనుకూలమై న సమయంగా మారబోతుంది.. దీంతోపాటు కెరియర్ పరంగా పెద్ద జంపు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వ రంగాల్లో పనులు చేసే వ్యక్తులకు ఈ సమయంలో బదిలీలు కూడా జరిగే అవకాశాలున్నాయి. దీని కారణంగా వీరికి ప్రమోషన్స్ కూడా లభిస్తాయి.

ధనస్సు రాశి 
ధనస్సు రాశిలో జన్మించిన వ్యక్తులకు ఆధ్యాత్మికంగా ఈ సమయంలో ఎంతో లావతాయకంగా ఉంటుంది. వీరికి సృజనాత్మకత కూడా విపరీతంగా పెరుగుతుంది. నిరుద్యోగ యువతకు మల్టీ నేషనల్ కంపెనీలో ఉద్యోగాలు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కుటుంబంలో ఉన్న కలహాలు కూడా ఉద్యోగాలు లభించడంతో పూర్తిగా తొలగిపోతాయి. ఆర్థిక ఇబ్బందుల నుంచి సులభంగా విముక్తి కలుగబోతోంది. అంతేకాకుండా అనుకున్న పనులు చాలా వరకు ముందుకు సాగుతాయి.

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

 

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report
Advertisement
Advertisement
Back to top