ఖమ్మం జిల్లాలో ప్రశాంతంగా ప్రారంభమైన గ్రూప్3 పరీక్ష
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
World Most Dangerous Snake: పాము అంటేనే భయం.. అలాంటిది అది కరవకుండానే, మీ దగ్గరకు రాకుండానే చంపగలదంటే ఎంత ప్రమాదకరమో ఊహించండి! సాధారణంగా పాములు కాటు వేసి విషాన్ని ఎక్కిస్తాయి. కానీ, 'మొజాంబిక్ స్పిట్టింగ్ కోబ్రా' అనే పాము మాత్రం ఏకంగా గాలిలోకి విషాన్ని వెదజల్లి శత్రువులను హతమారుస్తుంది.
ఈ వింతైన, భయంకరమైన పాముకు సంబంధించిన ఆసక్తికరమైన, భీతి గొలిపే నిజాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పాము తన శత్రువును వేటాడేందుకు లేదా ఆత్మరక్షణ కోసం తన కోరల ద్వారా విషాన్ని ఫౌంటెన్ లాగా బయటకు చిమ్ముతుంది.
ఇది ఏకంగా 9 అడుగుల దూరం వరకు విషాన్ని పిచికారీ చేయగలదు. ఈ పాము తన విషాన్ని ఎప్పుడూ ఎదుటి ప్రాణి కళ్లను లక్ష్యంగా చేసుకునే చిమ్ముతుందట. విషం చిమ్మేటప్పుడు ఇది తన తలను వేగంగా కదిలిస్తుంది. దీనివల్ల విషం ఎక్కువ విస్తీర్ణంలో వ్యాపించి, ఖచ్చితంగా శత్రువు కళ్లలోకి ప్రవేశించేలా చేస్తుంది.
కంటికి పడితే అంధత్వమే!
ఒకవేళ ఈ పాము చిమ్మిన విషం కళ్లలో పడితే ఫలితం చాలా భయంకరంగా ఉంటుంది. కళ్లలోకి విషం వెళ్లగానే తీవ్రమైన మంట, చికాకు మొదలవుతాయి. సకాలంలో సరైన చికిత్స అందకపోతే, కంటి కణాలు పూర్తిగా దెబ్బతిని ఆ వ్యక్తి శాశ్వతంగా అంధుడు అయ్యే ప్రమాదం ఉంది.
శరీర భాగాలు కుళ్లిపోతాయి..
దీని విషం కేవలం కళ్లకే కాదు, చర్మానికి కూడా చాలా ప్రమాదకరం. దీని విషం 'సైటోటాక్సిక్' రకానికి చెందినది. ఇది చర్మ కణాలను, కణజాలాలను వేగంగా నాశనం చేస్తుంది. విషం సోకిన చోట తీవ్రమైన వాపు రావడం, గాయాలు కావడం, చివరకు ఆ శరీర భాగం కుళ్ళిపోయేలా చేస్తుంది.
హెచ్చరిక: ఈ పాము ఆఫ్రికా ఖండంలోని మైదాన ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. దీనివల్ల ఏటా ఎంతో మంది ప్రాణాలు కోల్పోవడమో లేదా అంధత్వానికి గురికావడమో జరుగుతోంది. ప్రకృతిలో అత్యంత తెలివైన, ప్రమాదకరమైన పాముల్లో ఇది ఒకటి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Tollywood Movie Release This Week: 2025 సంవత్సరం సినీ ప్రేక్షకులకు ఎన్నో మధుర జ్ఞాపకాలను, విభిన్న అనుభూతులను మిగిల్చింది. భారీ అంచనాలతో వచ్చిన కొన్ని చిత్రాలు నిరాశపరిస్తే, చిన్న సినిమాలు అద్భుత విజయాలను సాధించి ఆశ్చర్యపరిచాయి. ఇక ఈ ఏడాదికి ఘనమైన ముగింపు పలికేందుకు, డిసెంబర్ 25న (క్రిస్మస్ సందర్భంగా) బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి సిద్ధమైన సినిమాల వివరాలు ఇక్కడ ఉన్నాయి.
తెలుగు సినిమాల సందడి..
ఛాంపియన్: నటుడు శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా రూపొందిన పీరియాడికల్ స్పోర్ట్స్ డ్రామా ఇది. ఫుట్బాల్ క్రీడ నేపథ్యంలో సాగే ఈ చిత్రాన్ని ప్రదీప్ అద్వైతం తెరకెక్కించారు. స్వప్న సినిమాస్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు దీని నిర్మాణంలో భాగమయ్యాయి.
శంబాల: 'హారర్.. సస్పెన్స్.. ఎమోషన్' - ఇదే ఈ సినిమా ప్రధాన బలం. ఆది సాయికుమార్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం ప్రేక్షకులకు ఊహించని ట్విస్టులు ఇస్తుందని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తోంది.
ఈషా: హారర్ సినిమాలను ఇష్టపడే వారికి ఇది మంచి ఛాయిస్. తన శరీరాన్ని పరాయి ఆత్మ ఆక్రమించినప్పుడు ఒక వ్యక్తి ఎదుర్కొనే భయంకర సంఘర్షణను ఇందులో చూపించారు. త్రిగుణ్, హెబ్బా పటేల్ ప్రధాన పాత్రల్లో నటించారు.
దండోరా: శివాజీ, నవదీప్, నందు వంటి సీనియర్, యంగ్ హీరోల కాంబినేషన్లో వస్తున్న పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ ఇది.
పతంగ్: గాలిపటాల పండుగ నేపథ్యం, విభిన్నమైన కథాంశంతో వస్తున్న యూత్ఫుల్ మూవీ. సురేష్ బాబు సమర్పణలో వస్తున్న ఈ చిత్రంలో గౌతమ్ మీనన్ కీలక పాత్ర పోషించడం విశేషం.
బ్యాడ్ గాళ్స్ : '30 రోజుల్లో ప్రేమించడం ఎలా' ఫేమ్ ఫణి ప్రదీప్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం యూత్ ఫుల్ అంశాలతో క్రిస్మస్ కానుకగా వస్తోంది.
డబ్బింగ్ చిత్రాలు..
> మలయాళ సూపర్స్టార్ మోహన్ లాల్ ప్రధానపాత్రలో రూపొందిన చిత్ర 'వృషభ'. ఈ మలయాళ డబ్బింగ్ చిత్రం తెలుగులో తల్లిదండ్రులు సెంటిమెంట్ డ్రామాగా రూపొందింది. మోహన్లాల్ రెండు విభిన్న పాత్రలు పోషిస్తున్నారు.
> కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ హీరోగా తెరకెక్కుతోన్న కొత్త చిత్రం 'మార్క్'. ఇదొక పవర్ఫుల్ క్రైమ్ డ్రామా. సుదీప్ ఇందులో పోలీసు ఆఫీసర్గా కనిపించనున్నారు.
ఎప్పుడు విడుదల?
పైన పేర్కొన్న సినిమాలన్నీ ఈ ఏడాది చివరి పండుగ అయిన క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న థియేటర్లలో సందడి చేయబోతున్నాయి. ఈ ఏడాది చివర్లో అటు స్పోర్ట్స్ డ్రామాలు, ఇటు హారర్ థ్రిల్లర్లు, అటు కమర్షియల్ ఎంటర్టైనర్లతో థియేటర్ల వద్ద పండుగ వాతావరణం కనిపించబోతోంది. మరి ఈ భారీ పోటీలో ప్రేక్షకుల మనసు గెలిచి 'ఛాంపియన్' గా నిలిచే సినిమా ఏదో చూడాలి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Gold Price Record 2025-Gold Outlook 2026: బులియన్ మార్కెటే కాదు.. పసిడి ప్రియులు కూడా 2025 ఏడాదిని అంత సులభంగా మర్చిపోరు. ఎందుకంటే 2025వ సంవత్సరంలో పెరిగినంత బంగారం ధరలు.. గత చరిత్రను చూస్తే ఏనాడూ ఇంతగా పెరగలేదు. ఈ ఏడాది వరుస రికార్డులు బద్దలు కొడుతూ దూసుకుపోయింది. దాదాపు 46ఏళ్ల తర్వాత అంటే 1979 తర్వాత బంగారం ధర ఇంతగా పెరిగడం ఇదే మొదటిసారి అని నిపుణులు చెబుతున్నారు. స్పాట్ గోల్డ్ ధర 2025 అక్టోబర్ లో ఔన్సుకు 4,381 డాలర్ల స్థాయికి తాకి సరికొత్త ఆల్ టైం హైని క్రియేట్ చేసింది. ఈ ఏడాది మొదటి నుంచి బంగారం ధర 45సార్లకు పైగా పెరిగి కొత్త గరిష్టాలను తాకింది. ఒక ఏడాదిలో ఎంత పెరిగిందనేది ఈ ర్యాలీ తీవ్రతను బట్టి అర్థం చేసుకోవచ్చు.
36 రోజుల్లోనే పరుగులు పెట్టిన పసిడి:
కేవలం 36రోజుల్లోనే పసిడి ధర పరుగులు పెట్టింది. 3,500 డాలర్ల నుంచి ఏకంగా 4,381 డాలర్లకు చేరడం మార్కెట్ ను ఆశ్చర్యపరిచింది. పసిడి ప్రియులు నోరెళ్లబెట్టేలా చేసింది. తక్కువ సమయంలోనే దాదాపు 14శాతం వరకు లాభాన్ని అందించింది. బులియన్ మార్కెట్ నిపుణుల అంచనాల ప్రకారం.. 1979 తర్వాత బంగారం చూపిన అత్యంత బలమైన వార్షిక ప్రదర్శన అని చెబుతున్నారు. ఇంతటి దూకుడు వెనక అసలు కారణాలు ఎన్నో ఉన్నాయి. ఒక కారణమని స్పష్టంగా చెప్పలేమంటున్నారు.
Also Read: Gold: ప్రతినెలా చిట్టీ కట్టి బంగారం కొనడం మంచిదా? లేదంటే లోన్ తీసుకుని బంగారం కొంటే లాభమా?
అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై అంచనాలు:
అయితే ఒక కారణం మాత్రం చెప్పుకోవచ్చు. అదే అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై అంచనాలు. నవంబర్ నెల సీపీఐ ద్రవ్యోల్బణ డేటా 2.7శాతం నమోదు అవ్వడంతో రానున్న కాలంలో ఫెడ్ రేట్ల కోతలు తప్పవన్న నమ్మకంతో మార్కెట్ బలపడింది. వడ్డీ రేట్ల తక్కినట్లయితే బంగారం వంటి రాబడి ఇవ్వని ఆస్తులపై డిమాండ్ పెరుగుతుంది. ఈ సమయంలోనే డాలర్ సూచిక బలహీనడపడుతుంది. ఫలితంగా బంగారం మరింత పెరిగే అవకాశం ఉంటుంది.
సెంట్రల్ బ్యాంకులు భారీ బంగారం కొనుగోలు:
మరో కీలకమైన అంశం ఏంటంటే.. సెంట్రల్ బ్యాంకులు బంగారం కొనుగోలు చేయడం. చైనా, రష్యా వంటి దేశాలు తమ విదేశీ మారక నిల్వల్లో బంగారం వాటాను భారీగా పెంచుకుంటున్నాయి. డాలర్ పై ఆధారపడకూదన్న వ్యూహంలోనే భాగంగా ఈ దేశాలు భారీగా బంగారాన్ని కొనుగోలు చేసి నిల్వ చేస్తున్నాయి. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కూడా బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా మార్చడంతో ధరలకు రెక్కలు వచ్చాయి. మధ్య ప్రాచ్యం, యూరప్ లో కొనసాగుతున్న అనిశ్చిత పరిస్థితులతోపాటు వాణిజ్య యుద్ధాల భయం వంటివి ఇన్వెస్టర్లకు బంగారం వైపు ఆకర్షితులను చేస్తున్నాయి.
ఎంసీఎక్స్ లో 10 గ్రాముల బంగారం:
అయితే ప్రపంచ మార్కెట్లో బంగారం 4,350 డాలర్లను దాటిన ప్రభావం భారత మార్కెట్పై కూడా స్పష్టంగా కనిపించింది. ఎంసీఎక్స్ లో 10 గ్రాముల బంగారం ధర రూ.1,13,000 నుంచి రూ.1,15,000 వరకు చేరి ఆల్టైమ్ హైను తాకింది. కేవలం ఒక నెల వ్యవధిలోనే దేశీయంగా బంగారం ధరలు 6 నుంచి 7 శాతం వరకు పెరిగాయి. వివాహాల సీజన్, పండుగలు సమయాల్లో బంగారం కొనేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అయితే అధిక ధరలు సామాన్య వినియోగదారులపై భారంగా మారుతున్నాయి. దిగుమతి సుంకాలు, హాల్మార్కింగ్ నిబంధనలు కూడా ప్రీమియంలను పెంచుతున్నాయి.
భవిష్యత్తులో భారీగా పెరిగే ఛాన్స్?
భవిష్యత్తులో బంగారం ధరలు ఎలా ఉండబోతున్నాయని చూస్తే.. 2026లో కూడా బంగారంపై బుల్లిష్ దృక్పథమే కొనసాగుతుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఫెడ్ వడ్డీ రేట్ల కోతలు కొనసాగితే బంగారం 4,000 నుంచి 4,500 డాలర్ల పరిధిలో స్థిరపడే అవకాశం ఉంది. అయితే మధ్య మధ్యలో లాభాల స్వీకరణ కారణంగా 10–15 శాతం దిద్దుబాట్లు రావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయినప్పటికీ, బంగారం బుల్ మార్కెట్ ఇంకా ముగియలేదనే అభిప్రాయం బలంగా ఉంది.
గోల్డ్మన్ సాచ్స్ వంటి ప్రముఖ బ్రోకరేజీలు 2026 చివరి నాటికి బంగారం ఔన్సుకు 4,900 నుంచి 5,000 డాలర్ల స్థాయికి చేరవచ్చని అంచనా వేస్తున్నాయి. జేపీ మోర్గాన్, బ్యాంక్ ఆఫ్ అమెరికా కూడా ఇదే తరహా బుల్లిష్ టార్గెట్లను ఇస్తున్నాయి. ఇదే సమయంలో వెండి కూడా బంగారంతో పాటు ర్యాలీలో దూసుకుపోతోంది. గ్రీన్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ వాహనాలు, AI ఆధారిత డేటా సెంటర్ల డిమాండ్ వెండికి అదనపు బలం ఇస్తోంది. మొత్తం మీద, 2025–26 కాలం విలువైన లోహాలకు స్వర్ణయుగంగా మారే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
Akkineni Akhil Become Father: అక్కినేని కుటుంబంలో త్వరలో ఓ శుభవార్త వినబోతున్నామంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఒక వార్త తెగ వైరల్ అవుతోంది. కింగ్ నాగార్జున త్వరలోనే తాతగా ప్రమోషన్ పొందబోతున్నారని, అక్కినేని వారసుడు రాబోతున్నాడని టాలీవుడ్ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. అయితే, తండ్రి కాబోయేది నాగచైతన్యనా? లేక అఖిలా? అనే దానిపై ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
చైతూనా..అఖిలా? అసలు ప్రచారం ఏంటి?
మొదట్లో నాగచైతన్య - శోభిత ధూళిపాళ్ల జంట త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నారనే ప్రచారం జరిగింది. శోభిత గర్భవతి అంటూ కొన్ని వార్తలు షికారు చేశాయి. అయితే, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే శోభిత నుండి గానీ, చైతూ నుండి గానీ దీనిపై ఎలాంటి క్లారిటీ రాలేదు. పైగా ఆ వార్తల్లో నిజం లేదని సన్నిహిత వర్గాల సమాచారం. దీంతో ఇప్పుడు అందరి దృష్టి అఖిల్ అక్కినేని - జైనాబ్ జంటపై పడింది.
ఈ ఏడాది జూన్ నెలలో అఖిల్, జైనాబ్ల వివాహం ఘనంగా జరిగింది. చైతూ కంటే ముందే అఖిల్ తండ్రి కాబోతున్నాడనే రూమర్స్ ఇప్పుడు ఫిలిం నగర్లో జోరుగా వినిపిస్తున్నాయి.
నాగార్జున అదిరిపోయే రియాక్షన్!
ఇటీవల హైదరాబాద్లో జరిగిన ఒక హెల్త్ ఈవెంట్కు ముఖ్య అతిథిగా హాజరైన నాగార్జునను మీడియా ప్రతినిధులు ఈ ప్రశ్న అడిగారు. "మీరు త్వరలోనే తాతగా ప్రమోట్ అవ్వబోతున్నారట.. నిజమేనా?" అని ఓ రిపోర్టర్ ప్రశ్నించగా.. నాగార్జున తనదైన శైలిలో చిరునవ్వుతో స్పందించారు.
"సరైన సమయం వచ్చినప్పుడు నేనే అధికారికంగా చెబుతాను" అని నవ్వుతూ నాగార్జున సమాధానమిచ్చి వెళ్ళిపోయారు. నాగార్జున ఈ వార్తలను ఖండించకపోవడం విశేషం. దీంతో అక్కినేని ఇంట్లో ఏదో శుభవార్త ఉందనే అనుమానం అభిమానుల్లో మరింత బలపడింది.
అఖిల్కు కలిసి రానున్న 'లెనిన్'?
వ్యక్తిగత జీవితంలో శుభవార్తలు వినిపిస్తున్నా, వృత్తిపరంగా అఖిల్ ఇంకా ఒక సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఆయన చివరిసారిగా హీరోగా నటించిన 'ఏజెంట్' చిత్రం భారీ అంచనాల మధ్య విడుదలై బాక్సాఫీస్ వద్ద ఘోరంగా విఫలమైంది.
ప్రస్తుతం అఖిల్ తన తదుపరి చిత్రం 'లెనిన్' షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాతో అయినా అఖిల్ కమర్షియల్ సక్సెస్ అందుకుంటాడని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. వారసుడి రాకతో అఖిల్కు అదృష్టం కలిసి వచ్చి, కెరీర్ కూడా ఊపందుకుంటుందని అక్కినేని అభిమానులు ఆశిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Mahalakshmi Smart Card Telangana: తెలంగాణ రాష్ట్రంలోని మహిళలకు ప్రభుత్వం మరో తీపి కబురు అందించింది. ఉచిత బస్సు ప్రయాణాన్ని మరింత సులభతరం చేస్తూ 'మహాలక్ష్మి స్మార్ట్ కార్డుల' పంపిణీకి శ్రీకారం చుట్టింది. దీనివల్ల ఇకపై ఆధార్ కార్డులు చూపించి, జీరో టికెట్లు తీసుకోవాల్సిన శ్రమ తప్పుతుంది.
స్మార్ట్ కార్డుల అవసరం ఏంటి?
ప్రస్తుతం మహిళలు ఆధార్ కార్డు చూపించి కండక్టర్ వద్ద నుండి జీరో టికెట్ పొందుతున్నారు. అయితే ఈ ప్రక్రియలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆధార్ కార్డుల్లో పాత ఫోటోలు ఉండటంతో కండక్టర్లకు ప్రయాణికులను గుర్తించడం కష్టమవుతోంది. గుర్తింపు విషయంలో మహిళలకు, కండక్టర్లకు మధ్య రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల గొడవలు జరుగుతున్నాయి.
ప్రతి ఒక్కరికీ టికెట్ కొట్టడం వల్ల రద్దీ సమయంలో కండక్టర్లపై పనిభారం పెరుగుతోంది. ఈ సమస్యలన్నింటికీ పరిష్కారంగా ప్రభుత్వం స్మార్ట్ కార్డులను ప్రవేశపెడుతోంది. ఇందుకోసం సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (CGG) సంస్థతో ఆర్టీసీ ఒప్పందం కుదుర్చుకుంది.
ప్రయాణం మరింత స్మార్ట్..
త్వరలో అమల్లోకి రానున్న ఈ కొత్త విధానం ద్వారా మహిళలందరికీ రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక స్మార్ట్ కార్డులను పంపిణీ చేస్తారు. బస్సు ఎక్కినప్పుడు ఈ కార్డును చూపితే సరిపోతుంది. కండక్టర్ వద్ద నుండి ప్రత్యేకంగా జీరో టికెట్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. కేవలం కార్డు ట్యాప్ చేయడం లేదా చూపించడం ద్వారా ప్రయాణం సాఫీగా సాగిపోతుంది.
ఆర్టీసీకి లాభాల పంట..కొత్త బస్సుల రాక!
ఆదివారం ప్రజాభవన్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక విషయాలను వెల్లడించారు. మహాలక్ష్మి పథకం అమలు వల్ల ఆర్టీసీకి రూ. 255 కోట్ల లాభం చేకూరిందని వారు తెలిపారు. పీఎం ఈ-డ్రైవ్ పథకం కింద హైదరాబాద్కు 2,800, వరంగల్కు 100 కొత్త ఎలక్ట్రిక్ బస్సులను త్వరలోనే తీసుకురానున్నారు. అర్హులైన మహిళలందరికీ వీలైనంత త్వరగా ఈ స్మార్ట్ కార్డులు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఎలా పొందాలి?
ఈ కార్డుల పంపిణీ ప్రక్రియ, దరఖాస్తు విధానంపై ప్రభుత్వం త్వరలోనే అధికారిక మార్గదర్శకాలను విడుదల చేయనుంది. గ్రామ పంచాయతీలు, మున్సిపల్ కార్యాలయాలు లేదా ఆన్లైన్ ద్వారా వీటిని పొందే అవకాశం కల్పించనున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
How to get an Ayushman Card online A step By Step Guide: అనారోగ్య సమస్యలు చెప్పిరావు. ఎవరి జీవితంలోనైనా ఎప్పుడో ఒకసారి ఎదురయ్యే అనివార్య పరిస్ధితి. అయితే నేటి కాలంలో వైద్య ఖర్చులు భారీగా పెరిగిపోయాయి. ఆసుపత్రులకు వెళ్లాలంలే చేతిలో లక్షలు పట్టుకోని వెళ్లాల్సింది. దీంతో చాలా మంది పేద, మధ్య తరగతి కుటుంబాలు సరైన వైద్యం పొందలేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోనే ప్రజలకు ఆర్థిక భారం లేకుండా మెరుగైన, నాణ్యమైన వైద్యం అందించాలన్న ఉద్దేశ్యంతోనే కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అత్యంత కీలకమైన పథకం.. ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన. ఈ స్కీమ్ కింద భారతీయ పౌరులకు ఉచిత వైద్య చికిత్స అందించే విధంగా ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
ఆయుష్మాన్ కార్డు జారీ:
ఈ స్కీమ్ కింద అర్హులైన వారికి ఆయుష్మాన్ భారత్ కార్డును జారీ చేస్తారు. ఈ కార్డు ఉన్నవారు దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఏడాదికి రూ. 5లక్షల వరకు ఫ్రీగా చికిత్స పొందవచ్చు. అంటే ఆసుపత్రిలో అడ్మిషన్ నుంచి చికిత్స పూర్తయి డిశ్చార్జీ అయ్యేంత వరకు ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదు. వైద్య ఖర్చుల భారం నుంచి కుటుంబాలను విముక్తి చేయడమే ఈ స్కీమ్ ప్రధాన లక్ష్యం.
మీరు, మీ కుటుంబ సభ్యులు లేదా మీకు తెలిసిన వాళ్లు ఈ ఫ్రీ వైద్య సదుపాయాలను పొందాలంటే ముందుగా ఆయుష్మాన్ భారత్ కార్డును కలిగి ఉండాలి. అయితే చాలా మందికి ఈ కార్డును ఎలా పొందాలి? ఎవరు అర్హులు? దరఖాస్తు ప్రక్రియ ఏంటి? ఇలాంటి అనేకు విషయాల్లో వారికి స్ఫష్టమైన సమాచారం తెలియన అయోమయంలో ఉంటారు. కానీ నిజానికి ఈ కార్డును పొందడం చాలా సులభం. ఎలాగో చూద్దాం.
అసలు ఆయుష్మాన్ కార్డ్ అంటే ఏమిటి?
ఆయుష్మాన్ కార్డును ఆయుష్మాన్ భారత్ కార్డు లేదా ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన (PMJAY) కార్డు అని పిలుస్తుంటారు. ఇది భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో అమలవుతున్న ఒక జాతీయ ఆరోగ్య బీమా పథకం. ఆర్థికంగా బలహీనమైన, పేద వర్గాలకు చెందిన కుటుంబాలకు సంవత్సరానికి రూ.5 లక్షల వరకు ఉచిత వైద్య బీమా కవరేజీని ఈ కార్డు అందిస్తుంది. తీవ్రమైన వ్యాధులు, శస్త్రచికిత్సలు, ఆసుపత్రి ఖర్చులు వంటి వాటిని ఈ పథకం కవర్ చేస్తుంది.
ఈ కార్డు ప్రత్యేకత ఏమిటంటే, లబ్ధిదారుడు చికిత్స సమయంలో నగదు చెల్లించాల్సిన అవసరం లేకుండా పూర్తిగా క్యాష్లెస్ విధానంలో వైద్యం పొందవచ్చు. ప్రభుత్వంతో పాటు అనేక ప్రైవేట్ ఆసుపత్రులు కూడా ఈ పథకం కింద చికిత్స అందిస్తున్నాయి. పేదరికం కారణంగా ఎవరూ ప్రాణాలను కోల్పోకూడదనే ఉద్దేశంతో ఈ పథకాన్ని రూపొందించారు.
ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు?
ప్రభుత్వం నిర్దేశించిన అర్హత ప్రమాణాలు కలిగిన వారు మాత్రమే ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పథకం ముఖ్యంగా సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలను లక్ష్యంగా చేసుకుంది.
-దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలు లేదా ఆర్థికంగా బలహీన వర్గాలకు చెందిన వారు
-2011 జనాభా లెక్కల (SECC డేటా)లో పేరు ఉన్న కుటుంబ సభ్యులు
-రోజువారీ కూలీ కార్మికులు, అసంఘటిత రంగంలో పనిచేసే వారు
-షెడ్యూల్డ్ కులాలు (SC), షెడ్యూల్డ్ తెగలు (ST)కు చెందిన కుటుంబాలు
-కుటుంబంలో వికలాంగులు ఉన్నట్లయితే వారికి అదనపు ప్రాధాన్యత
ఈ అర్హతల ఆధారంగా ప్రభుత్వం లబ్ధిదారుల జాబితాను రూపొందిస్తుంది. ఆ జాబితాలో మీ పేరు ఉంటే, మీరు ఆయుష్మాన్ కార్డుకు దరఖాస్తు చేసుకునే అర్హత కలిగి ఉన్నట్టే.
ఎలా దరఖాస్తు చేయాలి?
ప్రస్తుత డిజిటల్ యుగంలో ఆయుష్మాన్ కార్డు కోసం ఇంటి నుంచే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికోసం ప్రత్యేక కార్యాలయాలకు తిరగాల్సిన అవసరం లేదు.
-మొదటగా మీ స్మార్ట్ ఫోన్లో ఆయుష్మాన్ యాప్ ను ఇన్స్టాల్ చేసుకోవాలి.
-యాప్ ఓపెన్ చేసి లాగిన్ విభాగంలో ‘లబ్ధిదారుడు’ ఎంపికను సెలెక్ట్ చేయాలి.
-మీ మొబైల్ నంబర్ నమోదు చేసి క్యాప్చా పూరించాలి.
-తర్వాత ఈ స్కీము లిస్టులో ‘PMJAY’ని ఎంపిక చేసి, మీ రాష్ట్రం పేరు, జిల్లా పేరు వంటి పూర్తి వివరాలు ఇవ్వాలి.
-అనంతరం ఆధార్ నంబర్ ద్వారా లాగిన్ కావాలి.
- మీ కుటుంబ సభ్యుల వివరాలు, అర్హత కు సంబంధించి కాలమ్ కనిపిస్తుంది.
-ఈ స్కీముకు మీరు అర్హులైతే ‘దరఖాస్తు’ బటన్పై క్లిక్ చేసి అక్కడున్న ఫారమ్ ను నింపాలి.
-అవసరమైన వివరాలు సరిగ్గా పూరించి ఫారమ్ సమర్పించిన తర్వాత, కొన్ని రోజుల్లో ఆయుష్మాన్ కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు.
అవసరమైన పత్రాలు:
-ఆధార్ కార్డు
-ఆధార్కు లింక్ చేసిన మొబైల్ నంబర్
-రేషన్ కార్డు లేదా SECC డేటా వివరాలు
-కుటుంబ సభ్యుల సమాచారం
-పాస్పోర్ట్ సైజ్ ఫోటో
కొన్ని రాష్ట్రాల్లో అదనపు గుర్తింపు పత్రాలు అడిగే అవకాశం కూడా ఉంటుంది. అన్ని వివరాలు సరిగ్గా ఉంటే, ఆయుష్మాన్ కార్డు పొందడం ఈజీగా ఉంటుంది.
పొరపాటున కూడా ఈ 5 తప్పులు చేయకండి:
-ఆధార్ కార్డు, రికార్డులో పేరు లేదా తండ్రి పేరు స్పెల్లింగ్లో తేడా ఉండకూడదు.
-తేదీ, నెల లేదా సంవత్సరంలో చిన్న లోపం కూడా ఉండకూడదు.
-లింగ అసమతుల్యత విషయంలో.
-మీ ప్రస్తుత చిరునామాకు, రికార్డులో ఉన్న చిరునామాకు మధ్య వ్యత్యాసం ఉండరాదు.
-NHA డేటా, ఆధార్ డేటా ప్రతి స్థాయిలో స్థిరంగా ఉండాలి.
ఈ విధంగా.. ఆయుష్మాన్ భారత్ పథకం పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఒక పెద్ద వరంగా మారింది. ఆరోగ్యం కోసం అప్పులు చేయాల్సిన అవసరం లేకుండా, ప్రభుత్వమే భరోసాగా నిలిచే ఈ పథకం నిజంగా కోట్లాది కుటుంబాలకు జీవనాధారంగా నిలుస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
Pakistan Army Chief Asim Munir: పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ ఆపరేషన్ సింధూర్ పై మరోసారి వివాదాస్పద వ్యాక్యలు చేశారు. ఈసారి తాను చేసిన వ్యాఖ్యల్లో మతపరమైన ప్రస్తావనలు ఉన్నాయి. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్ కు వ్యతిరేకంగా పాకిస్తాన్ అల్లా సహాయం చేశాడంటూ చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. అసలు విషయం ఏంటంటే.. ఆపరేషన్ సింధూర్ లో విజయం సాధించేందుకు సహాయం చేసింది.. చైనా ఆయుధాలు కావని.. అల్లాపై ఉన్న విశ్వాసమే తమకు బలం ఇచ్చిందని అసిమ్ మునీర్ వ్యాఖ్యానించారు. భారత్ కు వ్యతిరేకంగా జరిగిన ఆపరేషన్ లో మాకు సహాయం చేసింది ఆయుధాలు కాదు.. అల్లా. అల్లాపై ఉన్న నమ్మకంతోనే దేవదూతలు కూడా పాకిస్తాన్ సైన్యానికి సహకరించారని పేర్కొన్నారు. బన్యన్ -ఎ-మర్సూస్ పేరుతో మునీర్ ఈ ఆపరేషన్ను ప్రస్తావించారు.
ఈ నెల ప్రారంభంలో జరిగిన జాతీయ ఉలామా, మషాయిక్ సమావేశంలో అసిమ్ మునీర్ ఈ కామెంట్స్ చేశారు. ఈ సమావేశానికి పాకిస్తాన్ ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్ తోపాటు పెద్ద సంఖ్యలో ఇస్లామిక్ మత పెద్దలు, పండితులు హాజరు అయ్యారు. ఆ సమావేశంలో చేసిన ప్రసంగానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా బయటకు వచ్చింది. ప్రస్తుతం అసిమ్ మునీర్ లిబియా పర్యటనలో ఉన్నారు.
వైరల్ అవుతున్న ఈ 40 సెకన్ల వీడియోలో అసిమ్ మునీర్ తన కామెంట్స్ మరింత రెచ్చగొట్టేలా చేశారు. మార్సూస్ యుద్ధంలో అల్లా సహాయం చేశాడని నా దేవుడు సాక్షి. ఆ సహాయాన్ని మేము స్వయంగా చూసి..అనుభవించాము అని అన్నారు. అదే సమయంలో దేశాన్ని సరైన దిశలో నడిపించాల్సిన అవసరం ఉందని, ప్రజల మార్గాలను సంస్కరించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. ప్రసంగం మధ్యలో అరబిక్ భాషలో కొన్ని మతపరమైన శ్లోకాలను కూడా ఆయన పఠించారు.
పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత.. భారత సాయుధ దళాలు 2025 మే 6న ఆపరేషన్ సిందూర్ను ప్రారంభించాయి. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్తో పాటు పాకిస్తాన్ భూభాగంలో ఉన్న పలు ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని భారత సేనలు దాడులు చేపట్టాయి. ఈ దాడుల్లో లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్ వంటి ఉగ్రవాద సంస్థలకు చెందిన కీలక శిబిరాలు ధ్వంసమయ్యాయి.
2025 ఏప్రిల్ 22న పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడి దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ దాడిలో పాకిస్తాన్ మద్దతుతో పనిచేసే ఉగ్రవాదులు పర్యాటక ప్రాంతంలోకి చొరబడి, ప్రజలను వారి మతం గురించి ప్రశ్నించి, అనంతరం కాల్చి చంపారు. ఈ అమానుష ఘటనలో మొత్తం 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దారుణానికి ప్రతీకారంగా, ఉగ్రవాద స్థావరాలను పూర్తిగా నిర్వీర్యం చేయాలనే లక్ష్యంతో భారతదేశం ఆపరేషన్ సిందూర్ను ప్రారంభించింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
IND vs PAK Asia Cup U19 Final: అండర్-19 ఆసియా కప్ 2025 టోర్నీ ఆద్యంతం అజేయంగా నిలిచి ఫేవరెట్గా బరిలోకి దిగిన భారత కుర్రాళ్లు, ఫైనల్లో మాత్రం చేతులెత్తేశారు. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో జరిగిన తుది పోరులో అన్ని రంగాల్లో విఫలమై 191 పరుగుల భారీ తేడాతో ఓటమిని చవిచూశారు. ఫలితంగా ఆసియా కప్ పాక్ వశమైంది.
టీమ్ ఇండియా బ్యాటింగ్ వైఫల్యం
పాక్ విధించిన 348 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత బ్యాటర్లు ఏ దశలోనూ నిలకడగా ఆడలేకపోయారు. టీమ్ ఇండియా కేవలం 26.2 ఓవర్లలో 156 పరుగులకే ఆలౌట్ అయింది. ఆశ్చర్యకరంగా పదో స్థానంలో వచ్చిన దీపేశ్ దేవేంద్రన్ (36) జట్టులో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.
టాప్ ఆర్డర్ బ్యాటర్లు వైభవ్ సూర్యవంశీ (26 రన్స్), ఖిలాన్ పటేల్ (19 రన్స్) మినహా మిగిలిన ప్రధాన బ్యాటర్లందరూ స్వల్ప స్కోరుకే పెవిలియన్ చేరారు. ఒక దశలో భారత్ 120 పరుగులకే 9 వికెట్లు కోల్పోయి ఘోర పరాజయం అంచున నిలవగా, దీపేశ్ పోరాటంతో స్కోరు 150 మార్కును దాటింది. పాక్ బౌలర్లలో అలీ రజా 4 వికెట్లతో విరుచుకుపడగా.. సయామ్, సుభాన్, హుజైఫా రెండేసి వికెట్లు పడగొట్టారు.
'సమీర్' సెంచరీ కారణం
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన పాకిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 347 పరుగుల భారీ స్కోరు సాధించింది. పాక్ ఓపెనర్ సమీర్ మిన్హాస్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 113 బంతుల్లోనే 17 ఫోర్లు, 9 సిక్సర్లతో 172 పరుగులు చేసి భారత బౌలర్లకు చుక్కలు చూపించాడు. మరోవైపు అహ్మద్ హుస్సేన్ (56) అర్ధ సెంచరీతో రాణించగా, ఉస్మాన్ ఖాన్ (35) కీలక పరుగులు జోడించాడు. భారత బౌలర్లలో దీపేశ్ దేవేంద్రన్ 3 వికెట్లు తీయగా, హెనిల్ పటేల్, ఖిలాన్ పటేల్ తలో రెండు వికెట్లు తీశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Shani Dev Vakri 2026 In Meena Rashi: 2026 సంవత్సరం చాలా ప్రత్యేకమైనది అని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ సమయంలో కొన్ని అత్యంత శక్తివంతమైన గ్రహాలు సంచారం చేయడమే కాకుండా.. నక్షత్ర ప్రవేశం, తిరోగమనలు జరపబోతున్నాయి. ఈ సమయంలోనే శని మార్పు కూడా ఉండబోతోంది. దీంతో 2026 సంవత్సరం మరింత ప్రత్యేక ప్రాముఖ్యతను అంతరించుకోబోతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. శని గ్రహాన్ని కర్మలకు ఫలాలు అందించే గ్రహంగా చెప్పుకుంటూ ఉంటారు. శని కదలికలు అనేవి కొన్ని రాశుల వారికి శుభప్రదంగాను.. మరి కొన్ని రాశుల వారికి అశుభ్రంగాను ఉంటుంది. ఇవి వ్యక్తులు చేసే కర్మలను బట్టి కూడా మారుతుంది. జులై 26వ తేదీన శనిగ్రహం మళ్లీ వక్రస్థితిలోకి వెళ్ళబోతున్నాడు. దీనికి కారణంగా ఈ ఏడాది కొన్ని రాశుల వారికి చాలా కలిసి రాబోతోంది. శని గ్రహం ఆశీస్సులతో కొన్ని రాశులు అద్భుతమైన ప్రయోజనాలు పొందుతాయి. ముఖ్యంగా ఆర్థికంగా చాలావరకు మెరుగుపడే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అయితే, 2026 సంవత్సరంలో శని అనుగ్రహంతో అత్యధిక లాభాలు పొందబోతున్న రాశులేవో తెలుసుకోండి.
మకర రాశి
మకర రాశికి ఎల్లప్పుడూ శని అధిపతిగా వ్యవహరిస్తాడు. కాబట్టి 2026 సంవత్సరంలో శని కదలికల కారణంగా ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. ఏదైనా పనుల్లో ఎక్కువ కాలం వస్తున్న అడ్డంకులన్నీ పూర్తిగా తొలగిపోతాయి. అంతేకాకుండా ఆర్థిక పరిస్థితులు చాలా బలంగా మారే అవకాశాలు ఉన్నాయి. దీంతోపాటు ఆత్మవిశ్వాసం పెరిగి ఊహించని స్థాయిలో లాభాలు కలుగుతాయి. తోబుట్టులతో సంబంధాలు మరింత మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో చిన్న చిన్న ప్రయాణాలు చాలా లాభదాయకంగా మారుతాయి అని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ రాశి వారు అన్ని పనుల్లో ఓపికతో ముందుకు సాగడం వల్ల అఖండ విజయాలు సాధించే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.
వృషభరాశి
వృషభ రాశిలో జన్మించిన వ్యక్తులకు శని కదలికల కారణంగా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ముఖ్యంగా వీరికి ఈ సంవత్సరం మొత్తం కొత్త ఆదాయ మార్గాలు లభిస్తూ ఉంటాయి. అలాగే దీర్ఘకాలికంగా వస్తున్న అనేక సమస్యల నుంచి కాస్త పరిష్కారం కూడా లభించబోతోంది. కెరీర్ కూడా స్థిరత్వంగా ఉండబోతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా వీరికి సీనియర్ల నుంచి మంచి సపోర్టు లభించి ఎన్నో రకాల లాభాలు కలుగుతాయి. అలాగే వీరికి సామాజిక బాధ్యత కూడా పెరుగుతుంది. దీని కారణంగా సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి. భవిష్యత్తు ప్రణాళికలు కూడా చాలావరకు లాభసాటిగా మారుతాయి.
Also Read: Chatugrahi Yoga 2026: త్వరలో 4 గ్రహాల అరుదైన కలయికతో రాజయోగం.. జాక్ పాట్ కొట్టబోతున్న రాశులు ఇవే..
తులారాశి
తులా రాశిలో జన్మించిన వ్యక్తులకు శని ప్రభావంతో క్రమశిక్షణ విపరీతంగా పెరుగుతుంది. ముఖ్యంగా వీరు ఈ సమయంలో ఎప్పుడు పొందలేని విజయాలు సొంతం చేసుకుంటారు. అలాగే కొత్త బాధ్యతలు లభించడమే కాకుండా అద్భుతమైన లాభాలు కలుగుతాయి. ఈ సమయంలో వీరు తప్పకుండా ఆరోగ్యం పై ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. మానసికంగా కూడా చాలా వరకు మెరుగుపడతారు. నమ్మకంతో ముందుకు సాగడం వల్ల అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. కుటుంబ జీవితంలో కూడా ఎన్నో రకాల లాభాలు కలుగుతాయి.
NOTE: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిష్యుల నుంచి సేకరించింది. దీనిని జీ తెలుగు న్యూస్ ధృవీకరించదు..
Also Read: Chatugrahi Yoga 2026: త్వరలో 4 గ్రహాల అరుదైన కలయికతో రాజయోగం.. జాక్ పాట్ కొట్టబోతున్న రాశులు ఇవే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook