పాఠశాలలో వసతుల కోసం విద్యార్థులు, తల్లిదండ్రుల ధర్నా
Dhamsalapuram, Telangana:ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరులోనీ జిల్లా పరిషత్ పాఠశాలలో సరిపడ ఉపాధ్యాయులు లేకపోవడంతో విద్యార్థులు స్కూల్ గేట్టు ఎదుట నిరసన చేసారు. పాఠశాల ప్రారంభం అయ్యి 2నెలలు అయినా, అన్ని సబ్జెక్టులకి సరిపోను ఉపాధ్యాయులు లేకపోవడం వలన తమ పిల్లలకు ఇబ్బంది అవుతుందని , వారి తల్లితండ్రులు కూడా పాఠశాల ముందు నిరసన తెలిపారు. ఖమ్మం - సూర్యాపేట జాతీయ రహదారి పై విద్యార్థులతో కలిసి తల్లితండ్రులు ధర్నా రాస్తారోకో నిర్వహించారు. ఉపాధ్యాయులని వెంటనే నియమించాలని నినాదాలు చేశారు.हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
Jagtial: జగిత్యాల మామిడికి ఇంటర్నేషనల్ బ్రాండ్.. రైతు సదస్సులో కవిత కీలక వ్యాఖ్యలు!
Hyderabad, Telangana:Kavitha Praises Jagtial Mangoes Latest News: ప్రపంచవ్యాప్తంగా మామిడి పండ్ల ప్రేమికులకు ఎంతగానో ఇష్టమైన జగిత్యాల మామిడి కి ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్ ఉందని TRS అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొనియాడారు.. నల్గొండ జిల్లాలో అత్యంత వైభవంగా నిర్వహించిన రైతు సమన్వయ సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.. ఈ సందర్భంగా తెలంగాణలో ఉద్యానవనల పంటల ప్రాముఖ్యతను, ముఖ్యంగా జగిత్యాల ప్రాంతంలో పండే మామిడి రకాల విశిష్టతను ఆమె ప్రత్యేకంగా ప్రస్తావించారు..
టేబుల్ టాప్ వెరైటీ..
జగిత్యాల జిల్లాలోని పండే మామిడి కాయలకు.. ముఖ్యంగా టేబుల్ టాప్ వెరైటీ రకానికి మార్కెట్లో అద్భుతమైన డిమాండ్ ఉందని కవిత గుర్తు చేశారు. ఇక్కడ పండ్ల లో ఉండే తీయని రుచితో పాటు నాణ్యత, అలాగే ఎక్కువ రోజులపాటు పాడవకుండా ఉండే నిల్వ సామర్థ్యం దీనికి దేశీ విదేశీ మార్కెట్లలో తిరుగులేని ఆదరణను తెచ్చిపెట్టాయని ఆమె వివరించారు. ఈ రకమైన పండ్లు కేవలం విక్రయాలకే కాకుండా ఎగుమతులకు కూడా ఎంతో అనుకూలమైన వని స్పష్టం చేశారు. అంతేకాకుండా ఈ మామిడి పండ్లు అన్ని రకాల కంటే ఎంతో అద్భుతమైన రంగును కలిగి ఉంటాయని ఆమె తెలిపారు.
రైతులకు గిట్టుబాటు ధర దక్కాలి..
అత్యంత నాణ్యమైన పంటను అందిస్తున్నప్పటికీ.. మార్కెట్ ఒడిదుడుకుల కారణంగా రైతులు నష్టపోకుండా చూడాలని కవిత పిలుపునిచ్చారు.. రైతులు ఎంతో శ్రమచేసి పండించే మామిడి పంటకు మార్కెట్లో సరైన.. లాభసాటి గిట్టుబాటు ధర లభించేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు.. తగిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. దళారుల ప్రమేయం లేకుండా నేరుగా రైతులకు లబ్ధి చేకూరేలా మార్కెటింగ్ వ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు..
Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!
ఉమ్మడి కరీంనగర్ జిల్లా.. ముఖ్యంగా జగిత్యాల ప్రాంతాన్ని మామిడి ఉత్పత్తిలో మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ప్రణాళికలు రూపొందించాలని కవిత సూచించారు.. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి.. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ లని ఏర్పాటు చేయడం ద్వారా జగిత్యాల జిల్లాను దేశంలోనే అతిపెద్ద మామిడి హబ్ గా తీర్చిదిద్దే అద్భుత అవకాశాలు ఉన్నాయని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.. ఈ సమావేశంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటు నల్గొండ జిల్లాకు చెందిన పెద్ద సంఖ్యలో రైతులతో పాటు ప్రజాప్రతినిధులు, వ్యవసాయ రంగ నిపుణులు పాల్గొన్నట్లు సమాచారం.
Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
Jammikunta: కోటీశ్వరులు వద్దు.. ఆ రూ.2,500 ఇస్తే చాలు.. రేవంత్ సర్కార్పై జీవన్ రెడ్డి ఘాటు విమర్శలు!
Hyderabad, Telangana:Mlc Jeevan Reddy Latest News: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేయడంలో ఘోరంగా విఫలమైందని సీనియర్ నేత, మాజీమంత్రి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.. జమ్మికుంట పట్టణంలో నిర్వహించిన బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గులాబీ జెండాను ఆవిష్కరించి.. పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నెలలు గడుస్తున్నప్పటికీ.. మహిళలకు ఇచ్చిన కీలకమైన హామీలను అటకెక్కించారని మండిపడ్డారు..
మేనిఫెస్టోలో నేను ఉన్నా.. అమలులో ఎందుకు లేదు?
ఈ కార్యక్రమంలో జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. ఒక ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలను సిద్ధం చేసినప్పుడు.. ఆ మేనిఫెస్టో రూపకల్పన కమిటీలో తాను కూడా ఒక కీలక భాగస్వామిని ఆయన గుర్తు చేశారు. ప్రజలు మేలు చేయాలని ఉద్దేశంతోనే ఆనాడు అనేక హామీలను పొందుపరిచామని.. అయితే నేడు అధికారంలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఆశయాలను నీరు కారుస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉన్న నిబంధనలతో పాటు హామీలు క్షేత్రస్థాయిలో అమలు కాకపోవడంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
కోటీశ్వరులు వద్దు.. రూ.2,500 ఇస్తే చాలు..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతి వేదికపై మహిళలను కోటీశ్వరులు చేస్తామంటూ గొప్పలు చెబుతున్నారని.. కానీ ఆ మాటల్లో అంత బోగస్ తప్ప నిజం లేదని జీవన్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ ఆడబిడ్డలను కోటీశ్వరులు చేయడం కంటే.. కనీసం లక్షల అధికారులను చేసిన చాలని ఆయన ఎద్దేవ చేశారు.. ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు ప్రతి నెల రూ.2,500 అందిస్తామని నమ్మ బలికిందని.. ప్రభుత్వం ఏర్పడి ఇంతకాలం అవుతున్న ఆ ఉసే ఎత్తడం లేదని.. పెద్దపెద్ద మాటలు చెప్పడం ఆపి.. ముందుగా మహిళలకు ఇస్తామన్న ఆర్థిక సహాయాన్ని తక్షణమే విడుదల చేయాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు.
Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!
కార్యకర్తలకు పిలుపు..
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే తెలంగాణలోని అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజలకు సంక్షేమ ఫలాలు అందాయని.. నేడు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ప్రజలు మోసపోయామని గ్రహించారని ఆయన అన్నారు.. రాబోయే రోజుల్లో ప్రజాపక్షాన పోరాటాలు చేయడానికి బీఆర్ఎస్ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని.. ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ముఖ్య నాయకులతో పాటు ప్రజాప్రతినిధులు, మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు..
Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
Indian Players In FIFA 2026: ఫిఫా ఫుట్బాల్ ప్రపంచకప్లో భారత ఆటగాళ్లు..రొనాల్డోతో పోటీపడుతున్న తమిళ అబ్బాయి!
Zürich, Zürich:Indian Players In FIFA World Cup 2026: ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా సంబరం 'ఫీఫా ప్రపంచ కప్ 2026' అట్టహాసంగా ప్రారంభమైంది. జూన్ 12 అర్ధరాత్రి (భారత కాలమానం ప్రకారం) మొదలైన ఈ సుదీర్ఘ టోర్నమెంట్లో మొత్తం 48 జట్లు తలపడుతున్నాయి. జూలై 20 వరకు జరిగే ఈ మహా సంగ్రామంలో లీగ్ దశ ముగిసేసరికి 32 జట్లు నాకౌట్కు, ఆ తర్వాత 16 జట్లు తదుపరి రౌండ్కు అర్హత సాధిస్తాయి.
లియోనెల్ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డో, కైలియన్ ఎంబాపే, నెయ్మార్, లామిన్ యమాల్ వంటి దిగ్గజాలను ఒకే వేదికపై చూడటానికి అభిమానులు ఎంతో ఆతృతగా ఉన్నారు. అయితే, ఈ మెగా టోర్నీలో మన భారత ఫుట్బాల్ జట్టు ఆడనప్పటికీ.. దేశంలోని ఫుట్బాల్ అభిమానులకు గర్వకారణంగా నిలుస్తూ నలుగురు భారత సంతతి ఆటగాళ్లు వేర్వేరు దేశాల తరఫున బరిలోకి దిగుతున్నారు. అందులోనూ ఇద్దరు దక్షిణాది మూలాలు ఉన్నవారు కావడం విశేషం.
ఆ నలుగురు పుట్బాల్ హీరోల వివరాలు ఇవే..
1) నిషాన్ వేలుపిళ్ళై (ఆస్ట్రేలియా) - తొలి తమిళ ప్లేయర్
ఆస్ట్రేలియా (మెల్బోర్న్)లో పుట్టి పెరిగిన నిషాన్ తండ్రి శశినాథ్ వేలుపిళ్ళై శ్రీలంక తమిళ సంతతికి చెందినవారు. అతని వయసు 25 ఏళ్లు. తల్లి గిలియన్ ఆంగ్లో-ఇండియన్. అక్టోబర్ 2024లో చైనాతో జరిగిన క్వాలిఫైయర్ మ్యాచ్లో ఆస్ట్రేలియా తరఫున అరంగేట్రం చేసిన నిషాన్, 83వ నిమిషంలో అద్భుతమైన గోల్ కొట్టి తన జట్టును ప్రపంచ కప్నకు అర్హత సాధించేలా చేశాడు. ఫీఫా ప్రపంచ కప్లో ఆడుతున్న తొలి తమిళ మూలాల ఆటగాడు ఇతనే. ఆస్ట్రేలియా తన తొలి మ్యాచ్ను జూన్ 14న టర్కీతో ఆడనుంది.
2) శామ్యూల్ ముత్తుసామి (డీఆర్ కాంగో) - రొనాల్డోతో ఫైట్!
శామ్యూల్ తండ్రి ముత్తుసామి (29 ఏళ్లు) తమిళ మూలానికి చెందిన ఇండో-గ్వాడెలోపే సంతతికి (19వ శతాబ్దంలో కరేబియన్ దీవులకు వలస వెళ్లిన దక్షిణ భారత కార్మికులు) చెందినవారు. తల్లి కాంగో దేశస్థురాలు. శామ్యూల్ ప్రస్తుతం ఫ్రెంచ్ పౌరసత్వం కలిగి ఉండి, యూరోపియన్ లీగ్స్లో ఆడుతున్న ముత్తుసామి ఇప్పటివరకు 57 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడాడు. జూన్ 17న జరిగే మ్యాచ్లో ముత్తుసామి ప్రాతినిధ్యం వహిస్తున్న డీఆర్ కాంగో జట్టు.. క్రిస్టియానో రొనాల్డో నేతృత్వంలోని పోర్చుగల్తో తలపడనుంది.
3) దాసిన్ ముహమ్మద్ జంషెడ్ (ఖతార్) - కేరళ ముద్దుబిడ్డ
ఖతార్ రాజధాని దోహాలో జన్మించిన దాసిన్ (19 ఏళ్లు) తల్లిదండ్రులు కేరళకు చెందినవారు. తండ్రి జంషీద్ (తలస్సేరి), తల్లి షైమా (కన్నూర్). ఫీఫా ప్రపంచ కప్ ఆడబోతున్న కేరళకు చెందిన మొట్టమొదటి ఆటగాడు దాసిన్ కావడం గమనార్హం. ఖతార్ అండర్-17, అండర్-19 జట్లలో ఆడి సీనియర్ జట్టుకు ఎంపికయ్యాడు.
4) సర్ ప్రీత్ సింగ్ (న్యూజిలాండ్) - పంజాబీ పవర్
న్యూజిలాండ్ (ఆక్లాండ్)లో స్థిరపడిన పంజాబ్లోని జలంధర్కు చెందిన భారతీయ దంపతులకు సర్ప్రీత్ సింగ్ (27 ఏళ్లు) జన్మించాడు. ప్రపంచ కప్లో ఆడుతున్న అత్యంత ప్రజాదరణ పొందిన భారత సంతతి ఆటగాళ్లలో సర్ ప్రీత్ సింగ్ ఒకడు. న్యూజిలాండ్ తరఫున 24 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడిన అనుభవం ఇతనికి ఉంది. జూన్ 16న ఇరాన్తో జరిగే మ్యాచ్తో న్యూజిలాండ్ తన ప్రయాణాన్ని ప్రారంభించనున్నాడు.
భారత్లో లైవ్ ఎక్కడ చూడాలి?
భారతదేశంలోని ఫుట్బాల్ ప్రేమికుల కోసం జీ ఎంటర్టైన్మెంట్ (ZEE) ప్రత్యక్ష ప్రసార ఏర్పాట్లు చేసింది. యునైట్8 స్పోర్ట్స్ 1 & 1 HD (Unite8 Sports), యునైట్8 స్పోర్ట్స్ 2 & 2 HD టీవీ ఛానళ్లలో ఫుట్ బాల్ ప్రపంచకప్ను ప్రత్యక్ష ప్రసారంగా చూడొచ్చు. అలాగే ఓటీటీ యాప్ జీ5 (ZEE5)లోనూ లైవ్ టెలికాస్ట్ అవుతుంది.
అయితే ఈ ప్రపంచకప్ చూడాలనుకున్న ప్రేక్షకులకు అతి తక్కువ ధరలకే జీ5 సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ అందుబాటులో ఉంచింది. రూ.799 సబ్స్క్రిప్షన్ ప్లాన్తో 3 నెలలకు గానూ గరిష్టంగా 3 డివైజ్ల్లో మ్యాచ్ చూసేందుకు అనుమతి ఉంది. అలాగే ఏడాది సబ్స్క్రిప్షన్ కోసం రూ.1,699 చెల్లిస్తే 4 డివైజ్ల్లో ఈ మ్యాచ్లను చూసి ఎంజాయ్ చేయోచ్చు.
మన దేశ జట్టు ఆడకపోయినా, మన రక్తం పంచుకున్న నలుగురు ఆటగాళ్లు ప్రపంచ అత్యున్నత వేదికపై మెరవనుండటం భారతీయులందరికీ గర్వకారణం!
Also Read: ఇక సెలవు..అంతర్జాతీయ క్రికెట్కు కివీస్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ వీడ్కోలు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
KTR Speech: ఒంటరిగానే బీఆర్ఎస్ పార్టీ పోటీ.. త్వరలో కేసీఆర్ బస్సు యాత్ర: కేటీఆర్
Baddipadaga, Telangana:KTR Breaking News: 'తెలంగాణ కాంగ్రెస్ పెద్దలు మీనాక్షి నటరాజన్పై కోపం ఉన్నవాళ్లు బీజేపీ నాయకులు ఉప్పు అందించారు. రేవంత్ రెడ్డితో నాకు వ్యక్తిగతంగా ఎలాంటి కోపం లేదు. రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని 40 ఏళ్లు వెనక్కి తీసుకుపోయారు' అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. 'మొన్నటి వర్షానికి హైదరాబాద్ అవస్థలకు రేవంత్ నిర్ణయాలే కారణం. రేవంత్ రెడ్డికి ప్రజెంట్ నగరంపై అవగాహన లేదు. ఉన్న నగరాన్ని పట్టించుకోకుండా ఫ్యూచర్ లేని ఫ్యూచర్ సిటీపై ఫోకస్. ఎయిర్పోర్టు మెట్రో పూర్తయితే ప్రజల ఇబ్బందులు తొలగేవి. కానీ ఆ ప్రాజెక్టు రేవంత్ రెడ్డి ఆపేశాడు' అని గుర్తుచేశారు. రెండు చెరువులు బాగు చేసి పోజులు కొడుతున్నారు. నాడు మేము 100 చెరువులు అభివృద్ధి చేశాం' అని మాజీ మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు.
మాకేం సంబంధం?
హైదరాబాద్లో మీడియా ప్రతినిధులతో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఇష్టాగోష్టిగా మాట్లాడారు. 'హైడ్రాను జిందా తిలిస్మాత్లా వాడుతున్నారు. 60 నియోజకవర్గాల్లో 'సర్', సభ్యత్వ నమోదు సమావేశాలు పూర్తి. సభ్యత్వ నమోదు యాప్ టెస్టింగ్ దశలో ఉంది. సభ్యత్వ నమోదు తర్వాత కమిటీలు, ట్రైనింగ్ కార్యక్రమాలు ఉంటాయి' అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. 'మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ అంశం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అంశం. మాకేం సంబంధం' అని స్పష్టం చేశారు. 'కాంగ్రెస్లో బ్లాక్షిప్ ఎవరో రేవంత్ రెడ్డి ఒట్టు వేస్తారా? మీనాక్షీ నటరాజన్ నామినేషన్ తిరస్కరించడం సరైంది కాదు' అని ప్రకటించారు. ప్రతిదానికి సిట్ వేస్తారు కదా మీనాక్షి నటరాజన్ అంశంపైన కూడా సిట్ వేయాలని రేవంత్ రెడ్డికి సూచించారు. బీజేపీలో ఎవరికి ఫ్రెండ్స్ ఉన్నారో, మీనాక్షి నటరాజన్ అంటే ఎవరికి కోపం ఉందో వాళ్లే కేసు గురించి చెప్పి ఉంటారు.
కాంగ్రెస్ మూడో స్థానంలో
'సభ్యత్వ నమోదు సంఖ్య ముఖ్యం కాదు క్రియాశీల సభ్యులే ముఖ్యమని.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ మూడో స్థానంలో ఉంటుందని మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. బీఆర్ఎస్, బీజేపీ మధ్యే పోటీ ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుంది. కాంగ్రెస్ జారుడు బండపై ఉంది' అని మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని కేటీఆర్ ప్రకటించారు. సచ్చిపోయిన బీఆర్ఎస్ అయితే తెల్లారిలేస్తే మాపై ఏడవడం ఎందుకు? అని ప్రశ్నించారు.
కాంగ్రెస్ పార్టీని కథం చేసి శిథిలాల కింద
'రైతు డిస్కం అని పెట్టీ మోటార్లకు మీటర్లు పెడుతారు. కేసీఆర్ ఏ డిస్కం పెట్టకుండానే 24 గంటలు కరెంట్ ఇచ్చారు. భట్టి విక్రమార్క మూడు ఇళ్లు కట్టుకుంటున్నారు. హైదరాబాద్లో రేవంత్ రెడ్డి రాజసౌధాలు కట్టుకుంటున్నాడు. 71 సార్లు ఢిల్లీకి తిరిగిన రేవంత్ రెడ్డి 71 రూపాయలు తేలేదు' అని మాజీ మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని కథం చేసి శిథిలాల కింద పెట్టడం ఖాయం అని జోష్యం చెప్పారు. 'దేశంలో వ్యవస్థలపై యువతకు ఆక్రోశం వస్తే యువతలో తిరుగుబాటు వస్తుందని తాను గతంలోనే చెప్పానని.. నేను అలా చెప్పినప్పుడు చాలా మంది నవ్వారు. ఇప్పుడు కాక్రోచ్ లాంటి పార్టీ చూడొచ్చు. కాంగ్రెస్ పార్టీలో చదువుకున్న నాయకుడు శ్రీధర్ బాబు ఒక్కరే' అని మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. హిట్లర్ మాటలను సమర్ధించడం బాధాకరమని పేర్కొన్నారు. 'షబ్బీర్ అలీకి శుభాకాంక్షలు చెప్తా. పార్టీలో జరుగుతున్న నిజాలు బయటకు చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీలో పైసలతోనే పదవులు వస్తాయి' అని కేటీఆర్ వివరించారు. పేమెంట్ కోటాలోనే రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి వచ్చిందని తెలిపారు.
ఊరుకునేది లేదు
'జూలైలో కేంద్ర ప్రభుత్వం మళ్లీ డీలిమిటేషన్ బిల్లు తెస్తుందని మాకు సమాచారం. దేశం మొత్తం కాకున్నా.. తెలంగాణ, ఏపీలో నియోజకవర్గాల సంఖ్య పెంచాలి' అని మాజీ మంత్రి కేటీఆర్ కోరారు. 'జమిలి ఎన్నికల విషయంలో ఏం జరుగుతుందో చూడాలి. డీలిమిటేషన్లో దక్షిణాదికి ఉన్న 24 శాతం వాటా తగ్గితే ఊరుకునేది లేదు' అని స్పష్టం చేశారు. మంచి పనితీరు కనబరిచిన రాష్ట్రాలను శిక్షిస్తామంటే ఎలా? దేశాభివృద్ధికి దోహదపడే రాష్ట్రాలకు అన్యాయం చేసే.. ఊరుకోమని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, కేటీఆర్ ప్రకటించారు.
Kane Williamson Retires: ఇక సెలవు..అంతర్జాతీయ క్రికెట్కు కివీస్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ హాఠాత్ వీడ్కోలు
Wellington, Wellington Region:Kane Williamson Retires News: ఆధునిక క్రికెట్ ప్రపంచంలో అత్యుత్తమ ఆటగాడిగా పేరొందిన న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ (35) సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇంగ్లాండ్తో జరుగుతున్న ప్రతిష్టాత్మక టెస్ట్ సిరీస్ మధ్యలోనే, తక్షణమే అమల్లోకి వచ్చేలా అన్ని రకాల అంతర్జాతీయ క్రికెట్ ఫార్మాట్ల నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించి ప్రపంచ క్రికెట్ను ఆశ్చర్యపరిచారు.
ఎలాంటి ఆర్భాటాలు, ముందుగా ప్రకటించిన వీడ్కోలు పర్యటనలు లేకుండా.. తన ఆట శైలి లాగే ఎంతో నిశ్శబ్దంగా అంతర్జాతీయ రంగానికి ఆయన స్వస్తి పలికారు. లార్డ్స్లో ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో కివీస్ జట్టు ఘోర పరాజయం పాలైన తర్వాతే, విలియమ్సన్ ఈ కఠిన నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
"నేను దీని గురించి కొంతకాలంగా ఆలోచిస్తున్నాను. న్యూజిలాండ్ తరఫున ఆడిన ప్రతి మ్యాచ్లో నా సర్వశక్తులు ఒడ్డి ఆడాను. ఇంతకంటే తక్కువ స్థాయిలో (నాణ్యత తగ్గించి) కొనసాగడం నాకు ఇష్టం లేదు. నా సొంత నిర్ణయంతో, గౌరవంగా తప్పుకుంటున్నందుకు అదృష్టవంతుడిగా భావిస్తున్నాను" అని కివీస్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ వెల్లడించారు.
'ఫ్యాబ్ ఫోర్'లో పడిన మొదటి వికెట్
ప్రపంచ క్రికెట్ను శాసించిన నలుగురు ఆధునిక బ్యాటింగ్ దిగ్గజాలు విరాట్ కోహ్లీ, జో రూట్, స్టీవ్ స్మిత్, కేన్ విలియమ్సన్లను కలిపి 'ఫ్యాబ్ ఫోర్' గా పిలుస్తారు. ఈ నలుగురిలో అన్ని రకాల అంతర్జాతీయ క్రికెట్ ఫార్మాట్ల (టెస్ట్, వన్డే, టీ20) నుండి పూర్తిగా వైదొలిగిన మొదటి ఆటగాడిగా విలియమ్సన్ నిలిచారు. సాంప్రదాయక క్రికెట్ సాంకేతికతకు నిదర్శనమైన విలియమ్సన్ లేని లోటును పూరించడం ప్రపంచ క్రికెట్కు అంత సులువు కాదు.
కివీస్ క్రికెట్లో 'స్వర్ణయుగం' ముగిసింది!
2010లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన విలియమ్సన్, 16 ఏళ్ల అద్భుత ప్రస్థానంలో ఎన్నో రికార్డులను తిరగరాశారు. 378 అంతర్జాతీయ మ్యాచ్లలో న్యూజిలాండ్ జట్టు ప్రాతినిధ్యం వహిస్తూ మొత్తంగా 19,346 పరుగులు (బ్లాక్ క్యాప్స్ చరిత్రలోనే అత్యధికం) రాబట్టాడు. అందులో 48 సెంచరీలు, 6 డబుల్ సెంచరీలు ఉండడం విశేషం. 2021లో భారత్పై తొలి ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) గెలిపించిన ఘనతకు కూడా అతనికే దక్కింది. 2016 నుండి 2024 మధ్య కాలంలో కివీస్ జట్టును రెండు వన్డే ప్రపంచ కప్ ఫైనల్స్, మూడు సెమీ-ఫైనల్స్కు నడిపించిన కెప్టెన్గా రికార్డులకు ఎక్కాడు.
తదుపరి ఇన్నింగ్స్ ఏంటి?
అంతర్జాతీయ క్రికెట్కు గుడ్-బై చెప్పినప్పటికీ, విలియమ్సన్ వివిధ లీగ్ క్రికెట్లలో ఆటగాడిగా కొనసాగుతారు. అయితే, ఆయన భవిష్యత్తుకు సంబంధించిన అత్యంత ఆసక్తికరమైన మలుపు భారత్లోనే ఉంది.
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నిర్వహిస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) వ్యూహాత్మక సలహాదారుగా విలియమ్సన్ కొనసాగుతున్నాడు. ఐపీఎల్ 2026 సీజన్కు ముందే విలియమ్సన్ లక్నో ఫ్రాంచైజీకి వ్యూహాత్మక సలహాదారుగా సంతకం చేశారు. జట్టు యజమాని సంజీవ్ గోయెంకాతో ఆయనకు అద్భుతమైన సంబంధాలు ఉన్నాయి.
అంతర్జాతీయ క్రికెట్ భారం తగ్గడంతో, ఇకపై లక్నో సూపర్ జెయింట్స్ (IPL)తో పాటు వారి కో-ఫ్రాంచైజీ అయిన సౌతాఫ్రికా లీగ్లోని 'డర్బన్ సూపర్ జెయింట్స్' (SA20) వ్యవహారాల్లోనూ విలియమ్సన్ కీలక పాత్ర పోషించనున్నారు. మైదానంలో తన బ్యాటింగ్తో అలరించిన ఈ మాజీ కివీస్ కెప్టెన్, ఇప్పుడు తెరవెనుక ఒక గ్లోబల్ క్రికెట్ వ్యూహకర్తగా సరికొత్త ఇన్నింగ్స్ ప్రారంభించబోతున్నారు.
Also Read: FIFA World Cup 2026: ఫిఫా ఫుట్బాల్ వరల్డ్ కప్ అట్టహాసంగా ప్రారంభం..48 దేశాలు..104 మ్యాచ్లతో
Also Read: విరాట్ కోహ్లీ ఇన్స్టాగ్రామ్లో పెట్టిన ఒక్క లైక్తో ఆమె జీవితమే మారిపోయింది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Pawan Kalyan Speech: ఏపీలో కూటమి ప్రభుత్వంపై డిప్యూటీ సీఎం పవన్ సంచలన వ్యాఖ్యలు..21 సీట్లకు జనసేన పోటీపై క్లారిటీ!
Tirupati, Andhra Pradesh:Pawan Kalyan Speech At Tirupati: ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం విజయవంతంగా రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని తిరుపతిలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా పాల్గొని, గత ఎన్నికల పొత్తులు, కూటమి ఏర్పాటు వెనుక ఉన్న అసలు రహస్యాలు, భవిష్యత్ లక్ష్యాలపై అత్యంత కీలక వ్యాఖ్యలు చేశారు.
గత ఎన్నికల్లో జనసేన కేవలం 21 అసెంబ్లీ స్థానాల్లోనే పోటీ చేయడంపై వచ్చిన విమర్శలకు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గట్టి కౌంటర్ ఇచ్చారు. "జనసేన కేవలం 21 సీట్లకే పరిమితమైందంటూ చాలా మంది విమర్శలు చేశారు. కానీ ఆ రోజు మేము సీట్ల కోసం రాజీపడలేదు. రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా భావించి మేము చేసిన రాజకీయ త్యాగమే, ఈ రోజు కూటమి సాధించిన చారిత్రాత్మక విజయానికి బలమైన పునాదిగా మారింది. అధికారాన్ని పంచుకోవడం మా లక్ష్యం కాదు.. బాధ్యతను పంచుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే మా అసలు లక్ష్యం" అని పవన్ స్పష్టం చేశారు.
గ్రామ స్థాయిలోనే సమస్యలు తీరాలి!
అభివృద్ధి అనేది గ్రామ స్థాయి నుంచే ప్రారంభం కావాలని పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. గ్రామమే దేశ ప్రగతికి కేంద్ర బిందువు. పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరి భవిష్యత్తును మార్చే నిర్ణయాలు గ్రామ పంచాయతీ స్థాయిలోనే జరగాలని ఆయన అన్నారు.
"ప్రస్తుతం ప్రతి చిన్న సమస్యకూ ప్రజలు ఎమ్మెల్యేల చుట్టూ తిరగాల్సి వస్తోంది. స్థానిక ప్రజాప్రతినిధుల అధికారాలను బలహీనపరిచి, మొత్తం వ్యవస్థను ఎమ్మెల్యేల చుట్టూ కేంద్రీకరించడం సరైన పద్ధతి కాదు. ఏ గ్రామానికి సంబంధించిన సమస్యలు ఆ గ్రామాల్లోనే పరిష్కారమయ్యేలా మార్పు రావాలి" అని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు.
విశాఖ ఉక్కుపై సమిష్టి విజయం..
కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఈ రెండేళ్ల కాలంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలన్నీ సమిష్టిగా కృషి చేస్తున్నాయని పవన్ తెలిపారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను అడ్డుకోవడంలో కూటమి ప్రభుత్వ సమిష్టి ప్రయత్నాలు ఫలించాయని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కేంద్ర ప్రభుత్వంతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ, యువత ఉపాధి, రాష్ట్ర ప్రగతి కోసం అడుగులు వేస్తున్నట్లు వెల్లడించారు.
2024 ఎన్నికల తీర్పు ఏపీలో ఒక కొత్త తరం భవిష్యత్తుకు నమ్మకాన్ని ఇచ్చిందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రజలు మౌనంగా ఉన్నా.. సరైన సమయంలో తమ ఓటు హక్కుతో చరిత్రను తిరగరాయగలరని గత ఎన్నికలు నిరూపించాయని చెప్పారు. అహంకారం, విధ్వంసక రాజకీయాలపై ప్రజాస్వామ్యం సాధించిన విజయమే ఈ కూటమి ప్రభుత్వమని ఆయన అభివర్ణించారు.
Also Read: దసరా, సంక్రాంతికి స్కూల్ సెలవుల లిస్టు వచ్చేసింది! ఈ ఏడాది 87 రోజులు సెలవులు!
Also Read: భారీగా పడిపోతున్న బంగారం ధరలు..ఇదే జరిగితే గోల్డ్ రేటు కుప్పకూలిపోవడం ఖాయం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Tecno Pova 8: బాబోయ్.. 8,000 mAh బ్యాటరీనా? భారీ ఫీచర్లతో Tecno Pova 8 లాంచ్!
Hyderabad, Telangana:Tecno Pova 8 Launch In India Telugu News: ప్రముఖ చైనీస్ స్మార్ట్ఫోన్ కంపెనీ టెక్నో గురువారం భారత మార్కెట్లోకి విడుదల చేసింది. దీనిని కంపెనీ టెక్నో పోవా 8 స్మార్ట్ఫోన్ పేరుతో అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఇది అద్భుతమైన ఫీచర్స్తో అందుబాటులోకి వచ్చింది. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 7100 ప్రాసెసర్తో విడుదలైంది. అంతేకాకుండా ఎన్నో రకాల ప్రీమియం ఫీచర్స్తో పాటు అద్భుతమైన డిజైన్ను కలిగి ఉంటుంది. అయితే, ఈ మొబైల్కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
టెక్నో పోవా 8 స్మార్ట్ఫోన్లో 6.76-అంగుళాల ఫుల్ HD+ IPS డిస్ప్లేను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ఫోన్లోని కంపెనీ ఎంతో శక్తివంతమైన 8,000 mAh బ్యాటరీతో పాటు 45 W ఫాస్ట్ ఛార్జింగ్కు సపోర్ట్ను కూడా అందిస్తోంది. ఈ టెక్నో పోవా 8 స్మార్ట్ఫోన్ను కంపెనీ ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ ఫ్లిప్కార్ట్లో విక్రయించబోతున్నట్లు తెలిపింది.. ఇది గత సంవత్సరం విడుదల చేసిన టెక్నో పోవా 7 స్మార్ట్ఫోన్కి సక్సెసర్గా అందుబాటులోకి తీసుకు వచ్చారు.
టెక్నో పోవా 8 ధరకి సంబంధించిన వివరాలు..
ఈ స్మార్ట్ఫోన్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.29,999 కాగా.. 8GB ర్యామ్తో పాటు 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.31,999తో అందుబాటులోకి వచ్చింది.. టెక్నో పోవా 8 మొబైల్ను కంపెనీ తెలుపు, నారింజతో పాటు ఆకుపచ్చ రంగులలో విడుదల చేసింది.
ఇక టెక్నో పోవా 8 స్పెసిఫికేషన్స్కి సంబంధించిన ఫీచర్స్ వివరాల్లోకి వెళితే.. ఇది 144 Hz రిఫ్రెష్ రేట్తో పాటు 381 ppi పిక్సెల్ డెన్సిటీ, 950 నిట్స్ పీక్ బ్రైట్నెస్తో కూడిన 6.76-అంగుళాల ఫుల్ HD+ అద్భుతమైన డిస్ప్లేను కలిగి ఉంటుందని కంపెనీ తెలిపింది.. ఇది ఆండ్రాయిడ్ 16 ఆధారిత టెక్నో HiOS 16 ఆపరేటింగ్ సిస్టమ్పై రన్ అవుతుంది. దీనికి మాలి-G610 MC2 GPUతో కూడిన ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 7100 ప్రాసెసర్తో అందుబాటులోకి తీసుకువవచ్చింది..
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
ఈ స్మార్ట్ఫోన్ వెనుక భాగంలో అద్భుతమైన కెమెరా సెటప్ను కూడా కలిగి ఉంటుంది. దీని వెనకాలో 50-మెగాపిక్సెల్ సోనీ LYT-600 ప్రధాన కెమెరాను కలిగి ఉంటుంది. అంతేకాకుండా సెల్ఫీతో పాటు వీడియో కాల్స్ కోసం దీనికి 13-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కూడా కంపెనీ అందించింది.. ఈ స్మార్ట్ఫోన్ కెమెరా యూనిట్ పోర్ట్రెయిట్ మోడ్, వ్లాగ్ మోడ్, డ్యూయల్ వీడియోతో పాటు స్లో మోషన్ వంటి ఎన్నో రకాల అద్భుతమైన ఫీచర్స్ అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది.
టెక్నో పోవా 8 మొబైల్ వెనక భాగంలో అలైవ్ మ్యాట్రిక్స్ డిస్ప్లేను కూడా కలిగి ఉంటుంది. ఇందులో కంపెనీ గేమింగ్ సమయంలో కెమెరా ప్రసెసర్కి చల్లదనం లభించేందుకు ఇందులో 14,689 చదరపు మిల్లీమీటర్ల కూలింగ్ సిస్టమ్ను కూడా అందుబాటులో ఉంచారు. అంతేకాకుండా ఈ స్మార్ట్ఫోన్లో ఎంతో శక్తివంతమైన 8,000 mAh బ్యాటరీతో పాలు చాలా ప్రత్యేకమైన 45W ఫాస్ట్ ఛార్జింగ్కు సపోర్ట్ కూడా అందుబాటులో ఉంది. దీని వల్ల సులభంగా బ్యాటరీ ఫుల్ అవుతుంది. ఇవే కాకుండా ఇందులో మరెన్నో ప్రీమియం ఫీచర్స్ అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
CM Vijay Divorce Case: విజయ్ దళపతి విడాకులు క్యాన్సిల్.. భర్తతో కలిసుండేందుకు సంగీత అంగీకారం?
Hyderabad, Telangana:CM Vijay Divorce News: తమిళనాడు ముఖ్యమంత్రి, నటుడు విజయ్ వ్యక్తిగత జీవితం గురించి గత కొంతకాలంగా సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. విజయ్, ఆయన భార్య సంగీత విడిపోతున్నారని.. విడాకుల వరకు వెళ్లారంటూ ప్రచారం సాగింది. అయితే, తాజాగా తమిళనాట ఒక క్రేజీ వార్త హల్చల్ చేస్తోంది. విజయ్, సంగీత దంపతులు తమ మధ్య ఉన్న విభేదాలను పక్కన పెట్టి మళ్లీ ఒక్కటయ్యారనేది ఇప్పుడు వైరల్గా మారింది.
గతంలో విజయ్ పాల్గొన్న పలు కీలకమైన సినిమా ఈవెంట్స్, రాజకీయ బహిరంగ సభల్లో సంగీత ఎక్కడా కనిపించలేదు. దీనితో వీరిద్దరి మధ్య తీవ్ర మనస్పర్థలు ఉన్నాయని, విడాకుల కేసు కోర్టు వరకు వెళ్లిందని పెద్ద ఎత్తున వదంతులు వచ్చాయి. నటి త్రిషతో విజయ్కు ఉన్న సాన్నిహిత్యమే దీనికి కారణమంటూ నెట్టింట ప్రచారం కూడా జరిగింది. అయితే, వాటన్నింటికీ చెక్ పెడుతూ.. ఈ జంట తిరిగి కలిసి జీవించడానికి అంగీకరించిందనే టాక్ ఇప్పుడు బలంగా వినిపిస్తోంది.
విజయ్ దంపతులు మళ్లీ కలవడానికి వారి కుటుంబ సభ్యులే కీలక పాత్ర పోషించారని సమాచారం. ముఖ్యంగా విజయ్ తల్లి శోభా చంద్రశేఖర్ చొరవ తీసుకుని, ఇరుపక్షాలతో మాట్లాడి సమస్యను సామరస్యంగా పరిష్కరించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సంగీత లండన్ నుండి చెన్నైకి తిరిగి వచ్చారని, ఈ జంట ప్రస్తుతం కలిసి సమయం గడుపుతున్నారని ఇండస్ట్రీ వర్గాల టాక్.
విజయ్, సంగీత మళ్లీ కలిశారనే వార్తలపై ఇప్పటివరకు సదరు నటుడి నుండి కానీ, ఆయన కుటుంబ సభ్యుల నుండి కానీ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇవన్నీ కేవలం సోషల్ మీడియా, అంతర్గత వర్గాల నుండి వస్తున్న ఊహాగానాలు మాత్రమే.
ఫ్యాన్స్ సంబరాలు
విజయ్ కేవలం నటుడిగానే కాకుండా రాజకీయాల్లోనూ చురుగ్గా రాణిస్తూ, ఉన్నత స్థానాల్లో కొనసాగుతున్నారు. ఈ తరుణంలో ఆయన వ్యక్తిగత జీవితం మళ్లీ గాడిన పడిందనే వార్త వినడంతో తలపతి అభిమానులు సోషల్ మీడియా వేదికగా సంబరాలు చేసుకుంటున్నారు. "మా అన్న కుటుంబం ఎప్పుడూ ఆనందంగా ఉండాలి" అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
Also Read: 'పెద్ది' సినిమాకు జాన్వీ ఎన్ని కోట్లు తీసుకుందో తెలుసా? ఒక్క సినిమాకే హీరోకి పోటీగా!
Also Read: బిగ్బాస్ హౌస్లోకి కాంట్రవర్సీ సింగర్..వివాదాస్పద సెలబ్రిటీలకు గాలం వేస్తున్నారు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
KCR Vs Kavitha: కేసీఆర్ కూతురికి బిగ్షాక్.. టీఆర్ఎస్ పేరుకు ఎలక్షన్ కమిషన్ నో!
Hyderabad, Telangana:KCR Vs Kavitha TRS Party: తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు కల్వకుంట కుటుంబంలో పెద్ద వివాదం రాజుకుంది. టీఆర్ఎస్ అనే పేరుతో గతంలో కేసీఆర్ పెట్టిన పార్టీకి అనుగుణంగా ఇప్పుడు కవిత పేరు పెట్టడం పెద్ద దుమారాన్ని రేపింది. కవిత ప్రతిపాదించిన 'తెలంగాణ రక్షణ సేన' పేరుపై ఇప్పుడు జాతీయ ఎన్నికల కమిషన్ అభ్యంతరం చెప్పినట్లు తెలుస్తోంది.PM Modi CM Revanth Reddy: ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం.. ఏం మాట్లాడారంటే?
Delhi, Delhi:PM Modi CM Revanth Reddy Meeting: భారత ప్రధాని నరేంద్ర మోదీతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం అయ్యారు. నీతి ఆయోగ్ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధి నమూనాను రేవంత్ వివరించారు. తెలంగాణ రాష్ట్రాన్ని ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చే లక్ష్యాలను ఈ సందర్భంగా సీఎం వెల్లడించారు.Indian Sailors Died: అమెరికా దాడిలో ముగ్గురు భారతీయులు దుర్మరణం..ఒమన్ తీరంలో ఘోరంగా అటాక్!
Dibab, Muscat Governorate:Gold Price Crash: భారీగా పడిపోతున్న బంగారం ధరలు..ఇదే జరిగితే గోల్డ్ రేటు కుప్పకూలిపోవడం ఖాయం
Hyderabad, Telangana:Gold Price Crash News: బంగారం కొనుగోలుదారులకు బులియన్ మార్కెట్ షాకిస్తోంది. గత రెండు వారాలుగా పసిడి, వెండి ధరలు భారీగా క్రాష్ అవుతున్నాయి. అంతర్జాతీయంగా చోటుచేసుకుంటున్న పరిణామాలు, డాలర్ పరుగు, అమ్మకాల ఒత్తిడి కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు ఏకంగా ఆరు నెలల కనిష్ట స్థాయికి పడిపోయాయి. దీని ప్రభావం దేశీయ మార్కెట్లపై కూడా బలంగా పడింది. అయితే ఈ తగ్గుదల ఇలాగే కొనసాగుతుందా? రానున్న రోజుల్లో పసిడి రేట్లు మరింత పతనమవుతాయా? అనే విషయాలపై మార్కెట్ నిపుణుల నుండి ఆసక్తికర అంచనాలు వెలువడుతున్నాయి.
ధరలు కుప్పకూలడానికి కారణాలు..
బంగారం ధరలు కుప్పకూలడం వెనుక అంతర్జాతీయ మార్కెట్లో ప్రధానంగా మూడు కారణాలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయంగా యూఎస్ డాలర్ విలువ పెరగడంతో ఇతర కరెన్సీలు ఉపయోగించే దేశాలకు బంగారం కొనుగోలు భారం పెరిగింది. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా బంగారానికి డిమాండ్ తగ్గింది.
అలాగే అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను ఎక్కువ కాలం పాటు అధికంగానే ఉంచే అవకాశం ఉందనే వార్తలు ఇన్వెస్టర్లను కలవరపెడుతున్నాయి. సాధారణంగా వడ్డీ రేట్లు ఎక్కువగా ఉంటే స్థిరమైన ఆదాయం లేని బంగారం వైపు పెట్టుబడులు తగ్గుతాయి. వచ్చే డిసెంబర్ నాటికి అమెరికా వడ్డీ రేట్లు పెరిగే అవకాశం 70 శాతానికి పైగా ఉందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరగడం వల్ల ద్రవ్యోల్బణం (ధరల పెరుగుదల) ముప్పు మరింత ఎక్కువైంది. ఇది ఆర్థిక మార్కెట్లలో తీవ్ర అనిశ్చితికి దారితీసింది.
కేవలం ఆర్థిక పరమైన అంశాలే కాకుండా, పశ్చిమ ఆసియాలో మళ్లీ మొదలైన యుద్ధ మేఘాలు కూడా మార్కెట్లను ప్రభావితం చేస్తున్నాయి. హోర్ముజ్ జలసంధిలో అమెరికాకు చెందిన అపాచీ హెలికాప్టర్ను ఇరాన్ కూల్చివేసిందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన తర్వాత, అమెరికా ఇరాన్పై దాడులకు దిగింది. దీనికి ప్రతీకారంగా జోర్డాన్లోని అమెరికా సైనిక స్థావరంపై, గల్ఫ్లోని మరో 21 ప్రాంతాలపై దాడులు లక్ష్యంగా చేసుకున్నట్లు ఇరాన్ వెల్లడించింది. ఈ ఆందోళనకర పరిస్థితులు పెట్టుబడిదారులు తమ ఆర్థిక వ్యూహాలను, వడ్డీ రేట్ల అంచనాలను పునఃపరిశీలించేలా చేస్తున్నాయి.
ప్రస్తుతం అంతర్జాతీయ గోల్డ్ ఎనలిస్టులు ఒక కీలకమైన మార్క్పై కన్నేశారు. వారి విశ్లేషణ ప్రకారం.. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర ఔన్సుకు 4,100 డాలర్ల స్థాయిని తాకవచ్చనే అంచనాలు వేస్తున్నారు. ఒకవేళ ధరలు ఈ మార్క్ కంటే దిగువకు పడిపోతే, పసిడి మార్కెట్లో సుదీర్ఘ కాలం పాటు భారీ పతనం కొనసాగే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతానికైతే మార్కెట్లో అమ్మకాల ఒత్తిడి ఎక్కువగా ఉన్నందున, రాబోయే కొద్ది రోజుల్లో బంగారం ధరలు మరికొంత మేర తగ్గే అవకాశాలే మెండుగా కనిపిస్తున్నాయి.
Also Read: భారీగా పడిపోయిన బంగారం ధరలు..రూ.3,000 తగ్గిన గోల్డ్ రేట్..10గ్రా. ఎంతంటే?
Also Read: వెండి కొనే వారికి బ్యాడ్న్యూస్..భారీగా పెరగనున్న వెండి ధరలు..కేంద్రం ఝలక్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Kanchrapara School News: ఆ స్కూల్లో రూ.1.77 కోట్లు అక్రమ నగదు..విద్యార్థినుల సిక్ రూమ్లో కండోమ్ ప్యాకెట్లు!
Kanchrapara, West Bengal:Kanchrapara School Cash Seized: విద్యా బుద్ధులు నేర్పాల్సిన పాఠశాలలో కోటి రూపాయల అక్రమ నగదు, కండోమ్ ప్యాకెట్లు దొరికాయి. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని కోల్కతాలోని సురేంద్రనాథ్ కళాశాల విద్యార్థి సంఘం గదిలో భారీ మొత్తంలో నగదుతో పాటు ఆయుధాలు, గర్భనిరోధక ప్యాకెట్లు లభించిన కొద్ది రోజులకే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.
బుధవారం అర్ధరాత్రి నిర్వహించిన సోదాల్లో కాంచరపారాలో ఉన్న ఒక ప్రైవేట్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో రూ.1 కోటికి పైగా నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గురువారం ఉదయం 4 గంటల సమయానికి లెక్కించిన మొత్తం సుమారు రూ. 1.77 కోట్లుగా తేలింది. పాఠశాలలోని విద్యార్థినుల సిక్ రూమ్ (అనారోగ్యంతో ఉన్న విద్యార్థుల కోసం కేటాయించిన గది)లోని ఒక అల్మారాలో కండోమ్ ప్యాకెట్లు కూడా దొరికాయని సమాచారం అందుతోంది.
సిక్ రూమ్లో కండోమ్ ప్యాకెట్లు..
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. బిజ్పూర్ ఎమ్మెల్యే సుదీప్త దాస్ ఇటీవల తన నియోజకవర్గంలోని విద్యాసంస్థల నుండి సమాచార సేకరణ ప్రక్రియను చేపట్టారు. ఈ క్రమంలో సదరు పాఠశాలకు సంబంధించిన సమాచారం వారికి అందడంతో.. ఎమ్మెల్యే స్వయంగా అక్కడికి వెళ్లి పోలీసులకు సమాచారం అందించారు.
కేంద్ర బలగాలు, స్థానిక పోలీసులు పాఠశాలకు చేరుకుని సోదాలు ప్రారంభించారు. స్వాధీనం చేసుకున్న నగదు మొత్తాన్ని నిర్ధారించడానికి రాత్రికి రాత్రే అనేక నగదు లెక్కింపు యంత్రాలను అక్కడికి తీసుకువచ్చారు. ఉదయం 4:30 గంటల వరకు లెక్కింపు కొనసాగిందని, మొత్తం నగదు దాదాపు రూ. 1.77 కోట్లుగా తేలిందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఈ ఘటనపై స్పందించిన బీజేపీ ఎమ్మెల్యే సుదీప్త దాస్, రాష్ట్రంలో గతంలో జరిగిన అవినీతి సంబంధిత దర్యాప్తుల్లో బయటపడిన నగదు మాదిరిగానే ఈ డబ్బు కూడా ఉందని ఆరోపించారు. పాఠశాల ఆవరణలో ఇంత భారీ మొత్తంలో నగదు ఉండటం తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతోందని, ఇది అక్రమాలకు సంకేతం కావచ్చని ఆయన పేర్కొన్నారు.
ప్రిన్సిపాల్ వాదన ఇదే!
ఆ డబ్బు పాఠశాలకు చెందినది కాదని, కాంచరపారా మున్సిపాలిటీ మాజీ చైర్మన్ కమల్ అధికారి, సుబోధ్ అధికారి, సీనియర్ టీఎంసీ (TMC) నాయకుడు పార్థ భౌమిక్లతో సంబంధం ఉన్న లెక్కల్లో చూపని నగదు అని ఎమ్మెల్యే ఆరోపించారు. పాఠశాల ఆవరణలో ఈ డబ్బును దాచి ఉంచారని ఆయన ఆరోపించారు. అయితే, ఈ వార్త ప్రచురించే సమయానికి కమల్ అధికారి, సుబోధ్ అధికారి లేదా పార్థ భౌమిక్ నుండి ఎటువంటి స్పందన లభించలేదు. విచారణ నిమిత్తం అకౌంట్స్ సిబ్బందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు
ఇదిలా ఉండగా, పాఠశాల ప్రిన్సిపాల్ బికాష్ చంద్ర పాల్ తాము ఎలాంటి తప్పు చేయలేదని ఖండించారు. స్వాధీనం చేసుకున్న నగదు గత కొన్ని నెలలుగా వసూలు చేసిన అడ్మిషన్ ఫీజులని ఆయన పేర్కొన్నారు. ఆ డబ్బు అకౌంట్స్ విభాగానికి చెందినదని, బ్యాంకులో జమ చేయడానికి వేచి ఉందని ఆయన తెలిపారు. అనారోగ్యంతో ఉన్న వ్యక్తి గదిలోని అల్మారాలో కండోమ్ ప్యాకెట్లు ఎలా చేరాయో తనకు తెలియదని కూడా ప్రిన్సిపాల్ పేర్కొన్నారు.
ఆ డబ్బు మూలం గురించి, పాఠశాల ప్రాంగణంలో అంత పెద్ద మొత్తంలో నగదును ఎలా నిల్వ చేశారనే దానిపై తాము దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. వారి వాంగ్మూలాల్లో పొంతన లేని విషయాలు వెలుగులోకి రావడంతో, పాఠశాల క్యాషియర్ అభిక్ నాథ్, అసిస్టెంట్ అకౌంటెంట్ సయన్ ఘోష్లను విచారణ నిమిత్తం బిజ్పూర్ పోలీస్ స్టేషన్ అదుపులోకి తీసుకున్నట్లు వర్గాలు తెలిపాయి.
Also Read: విద్యార్థులకు గుడ్న్యూస్..జూన్ 30 వరకు సెలవులు పొడిగింపు..ఇక పండగే పండగ!
Also REad: సామాన్యులకు కేంద్ర ప్రభుత్వం బిగ్షాక్.. నేడు పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
India Condemns US Attack: అమెరికా దాడిలో ముగ్గురు భారతీయులు మృతి..అమెరికాపై మండిపడ్డ భారత విదేశాంగ శాఖ!
New Delhi, Delhi:India Condemns US Attack News: పశ్చిమాసియాలోని ఒమన్ గల్ఫ్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. భారతీయ నావికులతో ప్రయాణిస్తున్న చమురు ట్యాంకర్పై అమెరికా దళాలు జరిపిన ఘోర దాడిలో ముగ్గురు భారతీయ నావికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనను భారతదేశం తీవ్రంగా ఖండించింది.
అసలేం జరిగింది?
యూఎస్ సెంట్రల్ కమాండ్ కథనం ప్రకారం.. ఒమన్ తీరంలో ఇరాన్ నుండి చమురును రవాణా చేస్తున్న పలావు జెండా కలిగిన 'MT సెట్టెబెల్లో' అనే చమురు ట్యాంకర్ను అమెరికా దళాలు అడ్డుకున్నాయి. ఆ ప్రాంతంలో ఉన్న దిగ్బంధనం నేపథ్యంలో, యూఎస్ దళాలు పదేపదే ఇచ్చిన ఆదేశాలను, హెచ్చరికలను ఆ ఓడ పెడచెవిన పెట్టడంతోనే ఈ దాడి చేయాల్సి వచ్చిందని అమెరికా సైన్యం వాదిస్తోంది.ఈ నౌకలో మొత్తం 28 మంది సిబ్బంది ఉండగా.. వారిలో 24 మంది భారతీయులు, ఇద్దరు పాకిస్థానీలు, ఒక ఉక్రేనియన్, ఒక రష్యన్ ఉన్నారు.
ఈ దాడిలో మొదట గల్లంతైనట్లు భావించిన ముగ్గురు భారతీయ నావికులు మరణించినట్లు షిప్పింగ్ శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ ధృవీకరించారు. ఇది అత్యంత 'విషాదకరమైన' నష్టమని ఆయన పేర్కొన్నారు. మరణించిన నావికులను క్రింది విధంగా గుర్తించారు. ఆదిత్య శర్మ (డెక్ క్యాడెట్), శివానంద్ చౌరాసియా (ఇంజన్ ఫిట్టర్), పట్నాల సురేష్ (చీఫ్ ఇంజనీర్) మిగిలిన 21 మంది భారతీయ నావికులను సురక్షితంగా రక్షించి తరలించారు.
అమెరికాపై భారత్ తీవ్ర ఆగ్రహం..
ఈ ఘోర దాడిపై భారతదేశం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. న్యూఢిల్లీలోని యూఎస్ ఛార్జ్ డి అఫైర్స్ (CDA)ను విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యాలయానికి పిలిపించి, గట్టిగా నిరసన తెలియజేస్తూ 'డిమార్చే' జారీ చేసింది.
"మేము మా నావికుల సంక్షేమానికి, శ్రేయస్సుకు అత్యున్నత ప్రాధాన్యత ఇస్తాము. ఒమన్ తీరంలో జరిగిన దాడిలో ముగ్గురు భారతీయ పౌరులను కోల్పోవడం అత్యంత బాధాకరం. మా తీవ్ర నిరసనను అమెరికా గమనిస్తుందని ఆశిస్తున్నాము. ఈ ప్రాంతంలో నౌకలపై నిరంతరం జరుగుతున్న దాడులు ఆగిపోవాలి. చర్చలు, దౌత్యం ద్వారానే శాంతి, స్థిరత్వం సాధ్యమవుతాయి" అని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు.
షిప్పింగ్ మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి ముఖేష్ మంగళ్ తెలిపిన వివరాల ప్రకారం.. జూన్ 8 (సోమవారం) నుండి భారతీయ నావికులున్న మూడు నౌకలపై దాడులు లేదా ప్రమాదాలు జరిగాయి. ప్రస్తుతం వ్యూహాత్మక ప్రాంతమైన హోర్ముజ్ జలసంధిలో భారత జెండా కలిగిన 13 నౌకలు ఉన్నాయని, వాటిలో 562 మంది భారతీయ నావికులు విధులు నిర్వహిస్తున్నారని ముఖేష్ మంగళ్ వెల్లడించారు. పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న అంతర్జాతీయ సంఘర్షణల కారణంగా అంతర్జాతీయ సముద్ర మార్గాల్లో ప్రయాణిస్తున్న భారతీయ పౌరుల భద్రత ఇప్పుడు తీవ్ర ఆందోళనకరంగా మారింది.
Also Read: భారత నౌకపై అమెరికా సైన్యం దాడి..ముగ్గురు భారతీయులు దుర్మరణం..ఏం జరుగుతోంది?
Also Read: విద్యార్థులకు గుడ్న్యూస్..జూన్ 30 వరకు సెలవులు పొడిగింపు..ఇక పండగే పండగ!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Peddapalli: రబీ సీజన్లో రికార్డు సృష్టించిన పెద్దపల్లి.. 4.29 లక్షల మెట్రిక్ టన్ల ధాన్యం సేకరణ..
Hyderabad, Telangana:Peddapalli Paddy Procurement: పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా.. రికార్డు స్థాయిలో ధాన్యంతో పాటు మొక్కజొన్న కొనుగోళ్లను పూర్తి చేసిందని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు తెలిపారు.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందనడానికి.. ఈ రికార్డు స్థాయి కొనుగోళ్లే నిదర్శనమన్నారు. జిల్లా కేంద్రంలోని ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
రికార్డు స్థాయిలో సేకరణ..
ఈ రబీ సీజన్లో పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా మొత్తం 334 కొనుగోలు కేంద్రాల ద్వారా రికార్డు స్థాయిలో 4 లక్షల 29 వేల 921 మెట్రిక్ టన్ల వరి ధాన్యాన్ని విజయవంతంగా సేకరించారని ఎమ్మెల్యే తెలిపారు. రైతులకు ఎలాంటి ఆలస్యం లేకుండా.. దళారీల ప్రమేయం లేకుండా దాదాపు 1,018 కోట్ల 65 లక్షల రూపాయలను నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే జమ చేశామని వెల్లడించారు. గత ఏడాదితో పోలిస్తే.. ఈసారి సుమారు 29 వేల మెట్రిక్ టన్ల ధాన్యం అదనంగా సేకరించామని తెలిపారు.. దీనికి తోడు మార్కెట్ యార్డుల ద్వారా మరో 25 వేల మెట్రిక్ టన్ల మొక్కజొన్నను కూడా కొనుగోలు చేసి రైతులకు అండగా నిలిచామన్నారు. ఇటీవలే కురిసిన అకాల వర్షాల వల్ల ధాన్యం తడిసినా.. రంగు మారినా ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకుని.. చివరి గింజ వరకు కొనుగోలు చేసిందని ఆయన వెల్లడించారు..
రైతుల నిల్వ అవసరాల కోసం.. పెద్దపల్లి నియోజకవర్గంలో 1.70 లక్షల మెట్రిక్ టన్ల సామర్థ్యం గల గోదాముల నిర్మించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికలు సిద్ధం చేశామని విజయరమణారావు తెలిపారు. ఇందులో భాగంగా ఎలిగేడు మండలం లాలపల్లిలో 20 వేల మెట్రిక్ టన్ల గోదాము పనులు ఇప్పటికే మొదలయ్యాయని... రాబోయే రోజుల్లో ఓదెల, శ్రీరాంపూర్, పెద్దపల్లి మండలాల్లో టెండర్లు పూర్తి చేసి పనులు మొదలుపెట్టబోతున్నట్లు స్పష్టం చేశారు.
Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!
బీఆర్ఎస్, బీజేపీలపై ఆగ్రహం..
ఇదే సమయంలో విపక్షాల తీరుపై ప్రభుత్వ విప్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.. పెద్దపల్లికి కాలేశ్వరం.. నీటి వల్ల పంటలు పండలేదని.. నెహ్రూ, ఇందిరా గాంధీల కాలం నాటి ఎస్ఆర్ఎస్పీ (SRSP) కెనాల్ నీటి వల్లే ఇక్కడి రైతులకు సాగునీరు అందిందని వివరించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల నిర్మాణంలో తీవ్ర లోపాలతో కట్టి.. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందని... అందుకే ఆ బ్యారేజీలు కుంగిపోయాయని ఆరోపించారు. ప్రాజెక్టులపై అవగాహనతో మాట్లాడాలని.. సలహాలు ఇచ్చేందుకు మాజీ సీఎం కేసీఆర్ను అసెంబ్లీకి రావాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించినా ప్రతిపక్షాలు భయపడి ముందుకు రావడం లేదని ఆయన తీవ్రంగా విమర్శించారు.
Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
