పాఠశాలలో వసతుల కోసం విద్యార్థులు, తల్లిదండ్రుల ధర్నా
Dhamsalapuram, Telangana:ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరులోనీ జిల్లా పరిషత్ పాఠశాలలో సరిపడ ఉపాధ్యాయులు లేకపోవడంతో విద్యార్థులు స్కూల్ గేట్టు ఎదుట నిరసన చేసారు. పాఠశాల ప్రారంభం అయ్యి 2నెలలు అయినా, అన్ని సబ్జెక్టులకి సరిపోను ఉపాధ్యాయులు లేకపోవడం వలన తమ పిల్లలకు ఇబ్బంది అవుతుందని , వారి తల్లితండ్రులు కూడా పాఠశాల ముందు నిరసన తెలిపారు. ఖమ్మం - సూర్యాపేట జాతీయ రహదారి పై విద్యార్థులతో కలిసి తల్లితండ్రులు ధర్నా రాస్తారోకో నిర్వహించారు. ఉపాధ్యాయులని వెంటనే నియమించాలని నినాదాలు చేశారు.हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
Puttaparthi AMCA: రూ.15,803 కోట్లతో పుట్టపర్తిలో డిఫెన్స్ పెట్టుబడి..ఫైటర్ జెట్ ప్రాజెక్టుకు శంఖుస్థాపన!
Puttaparthi, Andhra Pradesh:Puttaparthi AMCA Laying Foundation: శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి వేదికగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో మరో చరిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ కలిసి అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ (AMCA) ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమం రాయలసీమ ముఖచిత్రాన్ని, ముఖ్యంగా ఉమ్మడి అనంతపురం జిల్లా భవిష్యత్తును మార్చే దిశగా అడుగులు వేసింది.
రక్షణ శక్తి కేంద్రంగా పుట్టపర్తి
భారతదేశ రక్షణ రంగంలో కొత్త శక్తి కేంద్రంగా పుట్టపర్తి అవతరించబోతోంది. రూ.15,803 కోట్ల భారీ వ్యయంతో ఏర్పాటు చేస్తున్న ఈ AMCA ప్రాజెక్టును ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ (ADA), DRDO భాగస్వామ్యంతో నిర్మించారు. దీని ద్వారా సుమారు 7,500 మంది యువతకు ప్రత్యక్షంగా ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. కేవలం ఫైటర్ జెట్లే కాకుండా, డ్రోన్ సిటీలోని నిషేధ రక్షణ ప్రాజెక్టులకు కూడా ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన క్షిపణులు, హ్యాండ్ గ్రెనెడ్లు, ఆధునిక తుపాకులు, యుద్ధ విమానాల ప్రదర్శన సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంది.
బుల్లెట్ స్పీడ్తో అభివృద్ధి: సీఎం చంద్రబాబు
శంకుస్థాపన అనంతరం జరిగిన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. రాష్ట్రంలో అభివృద్ధిని 'బుల్లెట్ స్పీడ్'తో పరుగులు తీయిస్తున్నామని ప్రకటించారు. "అవకాశాలు కల్పించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది, వాటిని అందిపుచ్చుకుని ఎదగాల్సిన బాధ్యత యువతది" అని ఆయన అన్నారు. కరువు సీమలో గతంలో తాను తెచ్చిన కియా పరిశ్రమ నేడు 18 లక్షల కార్లను తయారు చేస్తూ, 80 దేశాలకు ఎగుమతి చేస్తోందని గుర్తుచేశారు. అదే స్ఫూర్తితో ఇప్పుడు యుద్ధ విమానాల తయారీ కేంద్రంగా ఈ ప్రాంతాన్ని మారుస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు.
"ఫ్యాక్షన్ Vs ఫైటర్ జెట్": నారా లోకేష్
రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ సందర్భంగా ప్రతిపక్ష వైసీపీపై విమర్శలు గుప్పించారు. "నాడు కియా కార్లు తెచ్చినా, నేడు ఫైటర్ జెట్లు తెచ్చినా అది చంద్రబాబు వల్లే సాధ్యమైంది. వైసీపీది ఫ్యాక్షన్, క్రిమినల్ బ్యాగ్రౌండ్ అయితే, మనది ఫైటర్ జెట్, కియా బ్యాగ్రౌండ్" అని ఆయన ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వం హయాంలో అభివృద్ధి కుంటుపడిందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కేవలం 23 నెలల్లోనే 'స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' అంటే ఏమిటో ప్రపంచానికి చూపామని లోకేష్ పేర్కొన్నారు.
పుట్టపర్తి ఆధ్యాత్మిక కేంద్రంగానే కాకుండా, ఇప్పుడు పారిశ్రామిక, రక్షణ రంగ హబ్గా మారుతోంది. సత్యసాయి బాబా దర్శనికతతో నిర్మించిన ఎయిర్పోర్టు నేడు పారిశ్రామిక అవసరాలకు ఎంతో ఉపయోగపడుతోంది. మొత్తానికి.. AMCA ప్రాజెక్టు రాకతో ఉమ్మడి అనంతపురం జిల్లా రాష్ట్రంలోనే నంబర్ వన్ అభివృద్ధి చెందిన రాష్ట్రంగా నిలవడం ఖాయమని ప్రభుత్వ వర్గాలకు ఉంది. ఈ కార్యక్రమంలో మంత్రులు, అధికారులు, బీజేపీ రాష్ట్ర నేతలు ఉన్నారు.
Also REad: ఏపీ క్యాబినెట్ మీటింగ్లో కీలక నిర్ణయాలు..నో వెహికల్ డే, ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్
Also Read: నీట్ అభ్యర్ధులకు శుభవార్త..ఫీజు తిరిగి చెల్లింపుతో పాటు 15 నిమిషాలు నిడివి పెంపు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Erragadda TIMS: హైదరాబాద్ ప్రజలకు కేసీఆర్ ప్రపంచ స్థాయి వైద్యం అందించారు: కేటీఆర్
Hyderabad, Telangana:KTR At TIMS Hospital: 'హైదరాబాద్ నగర ప్రజలకు ప్రపంచ స్థాయి వైద్యం అందించాలనే లక్ష్యంతో టిమ్స్ హాస్పిటల్స్ ఏర్పాటు చేశాం. గతంలో గాంధీ, ఉస్మానియా వంటి ప్రభుత్వ ఆసుపత్రులే ప్రధాన ఆధారమైతే నేడు కేసీఆర్ ప్రభుత్వ హయాంలో అత్యాధునిక టిమ్స్ హాస్పిటల్స్ అందుబాటులోకి వచ్చాయి. హైదరాబాద్లో ఎయిమ్స్ స్థాయి వైద్యం అందించేలా టిమ్స్ను ఆలోచించి రూపకల్పన చేశాం' మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వివరించారు.
Also Read: Bandi Bhageerath: 'మా కూతురిపై కుట్ర చేస్తున్నారు'.. పోక్సో బాధితురాలి తల్లి ఆవేదన
హైదరాబాద్లోని సనత్నగర్ (ఎర్రగడ్డ) టిమ్స్ ఆసుపత్రిని సందర్శించిన అనంతరం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. 'సనత్నగర్ టిమ్స్ కోసం 22 ఎకరాల విస్తీర్ణాన్ని వినియోగించాం. అత్యాధునిక టెక్నాలజీ, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఆస్పత్రిని నిర్మించాం. ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులకు పోటీగా పేదలకు మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో కేసీఆర్ ప్రభుత్వం టిమ్స్ను తీసుకువచ్చింది. హైదరాబాద్లో సనత్నగర్, ఎల్బీనగర్, అల్వాల్ ప్రాంతాల్లో టిమ్స్ ఆస్పత్రులను నిర్మించాం' అని మాజీ మంత్రి కేటీఆర్ వెల్లడించారు.
Also Read: PBKS vs MI Highlights: పంజాబ్ను దెబ్బతీసిన ముంబై.. తిలక్వర్మ తుఫాన్ ఇన్నింగ్స్
'వరంగల్లో 2000 పడకలతో ప్రభుత్వ ఆసుపత్రిని, నిమ్స్ ఆసుపత్రిని కూడా భారీ స్థాయిలో విస్తరించాం. సనత్నగర్ టిమ్స్లో మొత్తం మూడు బ్లాకులు నిర్మించాం. 300 ఐసీయూ బెడ్స్తో అత్యవసర వైద్య సేవలు అందుబాటులో ఉంటాయి. రోగుల బంధువుల కోసం ప్రత్యేక ధర్మశాల ఏర్పాటు చేశాం. రూ.1,200 కోట్ల వ్యయంతో టిమ్స్ నిర్మాణం చేపట్టాం. కేసీఆర్ ప్రభుత్వం కొనసాగి ఉంటే ఈ ఆసుపత్రి రెండేళ్ల క్రితమే పూర్తయ్యేది' అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు.
Also Read: Bandi Bhageerath: కొడుకును అప్పగించకుండా బండి సంజయ్ ఎవరిని బెదిరిస్తున్నాడు?
'16 అత్యాధునిక ఆపరేషన్ థియేటర్లు ఏర్పాటు చేశాం. ఎంఆర్ఐ, సీటీ స్కాన్ సహా అన్ని డయాగ్నస్టిక్ సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. ప్రత్యేక వీఐపీ సూట్స్ కూడా ఏర్పాటు చేశాం. కిడ్నీ సంబంధిత వ్యాధులపై ప్రత్యేక పరిశోధనలు జరిగేలా సదుపాయాలు కల్పిస్తున్నాం. దేశంలోనే అత్యధిక వైద్య సిబ్బందితో కూడిన ప్రభుత్వ వైద్య వ్యవస్థగా టిమ్స్ను అభివృద్ధి చేస్తున్నాం' అని మాజీ మంత్రి కేటీఆర్ వెల్లడించారు.
'ప్రత్యేక రీసెర్చ్ బ్లాక్స్, అకాడెమిక్ సదుపాయాలు కూడా ఏర్పాటు చేశాం. భారీ ఆడిటోరియం నిర్మాణం కూడా చేపట్టాం. ఒకేసారి వెయ్యి కార్లు పార్క్ చేసేలా ఆధునిక పార్కింగ్ వ్యవస్థ ఏర్పాటు చేశాం. టిమ్స్ హాస్పిటల్ డిజైన్ దేశంలోనే అత్యుత్తమ ప్రభుత్వ వైద్య నిర్మాణాల్లో ఒకటి' అని కేటీఆర్ ప్రకటించారు. అత్యవసర సేవల కోసం ప్రత్యేక ఎమర్జెన్సీ ర్యాంప్ నిర్మించామని తెలిపారు. లిఫ్టుల పనితీరును వెంటనే మెరుగుపరచాలని అధికారులకు సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా 350 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేసి ప్రజలకు చేరువలో వైద్యం అందించామని మాజీ మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు. మిగిలిన నిర్మాణ పనులను ప్రభుత్వం వెంటనే పూర్తి చేసి ఎర్రగడ్డ టిమ్స్ ఆస్పత్రిని ప్రజలకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేశారు.
Bandi Bhageerath: 'మా కూతురిపై కుట్ర చేస్తున్నారు'.. బండి భగీరథ్, బండి సంజయ్పై బాధితురాలి తల్లి ఆవేదన
Baddipadaga, Telangana:Arrest Bandi Bhageerath: తాగిన మత్తులో అత్యాచారం చేసిన నిందితుడు బండి భగీరథ్, అతడి తండ్రి కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ చాలా కుట్ర పన్నుతున్నారని బాధితురాలి తల్లి సంచలన విషయాలు తెలిపారు. తన కుమార్తెకు జరిగిన అన్యాయం.. బండి భగీరథ్ చేసిన మోసం.. అనంతరం పోక్సో నమోదు.. తర్వాత జరిగిన పరిణామాలపై పూసగుచ్చినట్టు బాధితురాలి తల్లి వివరించారు. ఈ సందర్భంగా పోలీసులు, మీడియాకు విజ్ఞప్తి చేస్తూ ఆమె లేఖ విడుదల చేశారు. తీవ్ర ఆవేదనతో విడుదల చేసిన ఆ లేఖలో కీలక అంశాలు ఉన్నాయి.
Also Read: Bride Death: రాత్రి పెళ్లి భజంత్రీలు తెల్లారి చావు డప్పు.. వివాహమైన తెల్లారి వధువు
'2025 సంవత్సరంలో మా కూతురికి బండి భగీరథ్ పరిచయమయ్యాడు. మొదట స్నేహితుడిలాగా ఉన్నా మా కూతురిని మానసికంగా లోబర్చుకుని, చదువుకోకుండా డిస్టర్బ్ చేశాడని గుర్తించాం. జనవరి 2026లో వారి మధ్య గొడవ జరిగినప్పుడు గతంలో భగీరథ్ తనపై పలు మార్లు లైంగిక దాడి చేశాడని డిసెంబర్ 31వ తేదీన బలవంతంగా మద్యం తాగించి ఒకసారి, మరోసారి ఓ అపార్టుమెంట్లో అఘాయిత్యానికి పాల్పడ్డాడని మా కూతురు చెప్పింది' అని పోక్సో కేసు బాధితురాలి తల్లి సంచలన విషయాలు బయటపెట్టారు.
Also Read: AMCA Project: అనంతపురం జిల్లాకు మరో వరం.. కరువు సీమలో భారీ యుద్ధ విమాన ప్రాజెక్టు
'రాజకీయ శక్తులతో పోరాడడానికి చట్టపరంగా, మానసికంగా సిద్ధమవుతున్న రోజుల్లో ఏప్రిల్ 21వ తేదీ 2026లో తమ కూతురిపై బ్లాక్మెయిల్ కేసు పెట్టారని తెలిసి మా మీద కుట్ర చేస్తున్నారని గ్రహించాం' అని బాధితురాలి తల్లి వివరించారు. 'ఏప్రిల్ 22వ తేదీన సంగప్ప అనే వ్యక్తి మా ఇంటికి వచ్చి ఇద్దరి మధ్య మధ్యవర్తిత్వం చేసేందుకు ప్రయత్నించాడు. ఏప్రిల్ 23వ తేదీన సంగప్ప ద్వారా బండి సంజయ్ని కలిశాం. న్యాయం చేస్తారనుకుంటే మా గురించి దారుణంగా మాట్లాడి బెదిరించి పంపించేశారు' అని సంచలన విషయాలు బయటపెట్టారు.
Also Read: AP Govt Teachers: ప్రభుత్వ టీచర్లకు సీఎం చంద్రబాబు తీపి కబురు.. ఏం ప్రకటించారంటే?
'నా కూతురి కోసం కోట్లాడాలని నిర్ణయించుకుని మే 8వ తేదీన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు నా కూతురిని తీసుకుని వెళ్లా. కానీ అక్కడి పోలీసులు ఎంత వేడుకున్నా ఫిర్యాదు తీసుకోకుండా గంటల తరబడి మమ్మల్ని వెయిట్ చేయించారు. ఎన్నో సార్లు బతిమాలిన తరువాత ఎట్టకేలకు బండి భగీరథ్ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు' అని పోక్సో బాధితురాలి తల్లి లేఖలో వివరించారు.
'మొదట బండి భగీరథ్ మీద బెయిల్ వచ్చేలా సెక్షన్లు పెట్టినా.. మా కుమార్తె స్టేట్మెంట్ రికార్డ్ చేశాక సెక్షన్లు మార్చారు. అయితే మేము పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో వేచి ఉన్న సమయంలో మా కూతురిపై కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో బండి భగీరథ్ కేసు పెట్టాడని తెలిసింది. మేము స్టేషన్లో ఉన్న సమయంలో సీసీటీవీ ఫుటేజ్, రిజిస్టర్లో టైమింగ్స్ భద్రపరచాలని, అలా చేస్తే బండి భగీరథ్ ఏ సమయంలో కేసు పెట్టాడో స్పష్టంగా తెలిసి పోతుందని పోలీసులకు విజ్ఞప్తి చేశాం' అని లేఖలో బాధితురాలి తల్లి వెల్లడించారు.
'మీడియా వారిని, సోషల్ మీడియా యూజర్లను చేతులు జోడించి వేడుకుంటున్నా. దయచేసి మా కూతురి ఫొటోలు, ఆమె ఐడెంటిటీ రివీల్ చేయకండి' అని లేఖలో విజ్ఞప్తి చేశారు. 'మరోవైపు ఆమె డేట్ ఆఫ్ బర్త్ గురించి అనేక వాదనలు వినిపిస్తున్నాయి. డాక్యుమెంట్లలో ఉండే డేటా నా కూతురు అనుభవించిన క్షోభను చెరిపివేయలేదు. పోక్సో కేసులో నమోదైన ఎఫ్ఐఆర్ పట్ల వేగంగా, నిష్పక్షపాతంగా విచారణ చేపట్టి నా కూతురికి న్యాయం చేస్తారని కోరుకుంటున్నా' అని బాధితురాలి తల్లి ఆవేదన చెందారు.
బాధితురాలి తల్లి లేఖ ద్వారా బండి సంజయ్ ఏవిధంగా తన కుమారుడు బండి భగీరథ్ను రక్షించే ప్రయత్నం చేశాడో అర్థమవుతోంది. ప్రధాన మీడియా, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఎలా బాధితురాలిని తప్పుబడుతూ వీడియో చేస్తున్నారో.. దానివలన బాధితురాలు ఎలా ఇబ్బందులు పడుతున్నారో ఆ లేఖలో స్పష్టమవుతోంది. ఇప్పటికే తెలంగాణ పోలీసులు దర్యాప్తు, విచారణ అంటూ కాలయాపన చేయకుండా వెంటనే నిందితుడు బండీ భగీరథ్ను అరెస్ట్ చేస్తారో లేదోననే ఉత్కంఠ నెలకొంది.
Re NEET 2026: నీట్ అభ్యర్ధులకు శుభవార్త..ఫీజు తిరిగి చెల్లింపుతో పాటు 15 నిమిషాలు నిడివి పెంపు!
Hyderabad, Telangana:Re NEET 2026 Extra 15 Minutes: ఇటీవలే జరిగిన నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్ NEET) పేపర్ లీక్ నేపథ్యంలో దాన్ని తిరిగి నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. రీ-నీట్ ను 2026 జూన్ 21న నిర్వహించనున్నామని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పష్టం చేశారు. అయితే ఈసారి పరీక్ష రాసే అభ్యర్థులకు కొంతమేర ఊరట కలిగించారు. పరీక్ష రాసే విద్యార్థులకు 15 నిమిషాలు అదనంగా సమయం ఇస్తామని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు.
ఈ ఏడాది జరిగిన నీట్ పరీక్షకు సంబంధించిన ప్రశ్నాపత్రం ఇటీవలే లీక్ అయ్యిన సంగతి తెలిసిందే. దీంతో ఈ పరీక్షను రద్దు చేస్తూ నేషనల్ టెస్ట్ ఏజెన్సీ (ఎన్టీఏ) కీలక ప్రకటన చేసింది. దీంతో అప్పటివరకు పరీక్ష కోసం ప్రిపేర్ అయ్యి టైమ్ ధారపోసిన విద్యార్థులు, వారి తల్లీదండ్రుల ఊసూరుమన్నారు. అయితే ఈ పరీక్షను రద్దు చేసినా.. భారతదేశపు అతిపెద్ద వైద్య ప్రవేశ పరీక్షను ఎటువంటి లోపాలు లేకుండా సజావుగా నిర్వహించడంలో విఫలమైనందుకు NTA, భారత ప్రభుత్వం.. ప్రజల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాయి. అయితే ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన దర్యాప్తును కేంద్ర ప్రభుత్వం సీబీఐకి అప్పగించగా.. ఇప్పుడు ఆ పరీక్షను తిరిగి నిర్వహించేందుకు ప్రణాళికను విడుదల చేశారు.
నీట్ ప్రశ్నపత్రం లీక్ కేసులో ఇప్పటికే ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. మంగీలాల్ బివాల్, దినేష్ బివాల్, వికాస్ బివాల్, శుభమ్ ఖైర్నార్, యష్ యాదవ్ అనే నిందితులను CBI కోర్టు ముందు హాజరుపరిచింది. వారిని ఏడు రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాలని రౌస్ అవెన్యూ కోర్టును కోరారు.
పరీక్షా కేంద్రం ఎంపిక ఎలా!
అభ్యర్థులు తమ పరీక్షా కేంద్రాన్ని ఎంచుకోవడానికి వీలుగా వారికి ఒక వారం రోజుల సమయం ఇస్తామని మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. తమ నివాసాన్ని మార్చుకున్న విద్యార్థులు, ప్రస్తుతం తాము నివసిస్తున్న నగరంలోనే పరీక్షా కేంద్రాన్ని ఎంచుకోవడానికి వీలుగా ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
Also Read: రజినీకాంత్ 'జైలర్ 2'షూటింగ్లో ప్రమాదం..ఒకరు మృతి, రంగంలోకి దిగిన పోలీసులు!
Also Read: ఏపీ క్యాబినెట్ మీటింగ్లో కీలక నిర్ణయాలు..నో వెహికల్ డే, ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Jailer 2 Crew Death: రజినీకాంత్ 'జైలర్ 2'షూటింగ్లో ప్రమాదం..ఒకరు మృతి, రంగంలోకి దిగిన పోలీసులు!
Chennai, Tamil Nadu:Jailer 2 Crew Death News: సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా, నెల్సన్ దర్శకత్వంలో రూపొందుతోన్న 'జైలర్ 2' షూటింగ్లో విషాదం చోటుచేసుకుంది. గురువారం మధ్యాహ్నం ఆ సినిమా కోసం సెట్ వర్క్ జరుగుతున్న క్రమంలో ఆర్ట్ డిపార్ట్మెంట్కు చెందిన కార్తికేయన్ అనే 28 ఏళ్ల టెక్నీషియన్ కరెంట్ షాక్కు గురై మృతిచెందాడు. పనైయూర్లోని ఒక స్టూడియోలో సెట్ నిర్మాణ పనులు జరుగుతుండగా ఈ ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. ఈ దిగ్భ్రాంతి ఘటనతో షూటింగ్ వెంటనే నిలిపేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసుల కథనం ప్రకారం.. మృతుడిని టి.కార్తికేయన్గా గుర్తించారు. ఈయన ఆర్ట్ డిపార్ట్మెంట్ సిబ్బందిలో ఒకరిగా పనిచేస్తున్నారు. ఒక ఇంటిని పోలిన సెట్ నిర్మాణ పనుల్లో కార్తికేయన్ నిమగ్నమై ఉన్నప్పుడు మధ్యాహ్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. విద్యుత్ కనెక్షన్ పనులు చేస్తుండగా, ప్రమాదవశాత్తు ఆయన విద్యుత్ తీగను తాకడం వల్లే ఈ ఘటన జరిగిందని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. తోటి సిబ్బంది వెంటనే అంబులెన్స్లో సమీప ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించినప్పటికీ, ఆసుపత్రికి చేరుకునేసరికే ఆయన మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు.
ఈ ఘటన జరిగిన వెంటనే, కనత్తూర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్ట్మార్టం పరీక్షల నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ రాయపేట ఆసుపత్రికి తరలించారు. అధికారికంగా 'ప్రథమ సమాచార నివేదిక' (FIR) నమోదు చేసే ప్రక్రియ కొనసాగుతుండగా, విద్యుత్ లీకేజీకి గల కారణాలపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. వైరింగ్ లోపాల వల్లనా, లేక సెట్లో తగినంత భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లనా ఈ ప్రమాదం జరిగిందనే కోణంలో దర్యాప్తు అధికారులు విచారణ జరుపుతున్నారు.
ఆర్ట్ డిపార్ట్మెంట్లోని ఓ టెక్నిషియన్ మృతి కారణంగా 'జైలర్ 2' షూటింగ్ను అర్ధాంతరంగా ఆపేశారు. ప్రమాదం జరిగిన కొద్దిసేపటికే, అంటే మధ్యాహ్నం సుమారు 2:00 గంటల ప్రాంతంలో ప్రధాన నటుడు రజనీకాంత్ సెట్కు చేరుకోవాల్సి ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. నెల్సన్ దిలీప్కుమార్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న 'జైలర్ 2', 2023 బ్లాక్బస్టర్ 'జైలర్' చిత్రానికి సీక్వెల్గా రూపొందుతోంది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పూర్తయినా.. ప్యాచ్ వర్క్ కోసం కొన్ని సన్నివేశాలు రీషూట్ చేస్తుంది చిత్రబృందం. అయితే దీనిపై చిత్రబృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
Also Read: ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమంత్రి తీపికబురు..2 శాతం డీఏ పెంచిన రాష్ట్ర ప్రభుత్వం!
Also Read: మహిళలకు ప్రభుత్వం శుభవార్త..బ్యాంకు ఖాతాల్లోకి రూ.1,000 జమ అప్పటి నుంచే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Jagtial: కేంద్రీయ విద్యాలయం ఎవరి వల్ల ఆగుతోంది? సంజయ్ కుమార్ కౌంటర్.. అరవింద్ అటాక్!
Hyderabad, Telangana:Jagtial Kendriya Vidyalaya Row Telugu News: జగిత్యాల జిల్లాకు మంజూరైన కేంద్రీయ విద్యాలయం ఇప్పుడు రాజకీయాలకు ఒక కీగా మారింది.. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాల్సిన పాఠశాల భవనంతో పాటు స్థల వివాదంలో చిక్కుకొని ప్రజాప్రతినిధుల మద్యం మాటల యుద్ధానికి దారితీస్తూ వస్తోంది. స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ తో పాటు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మధ్య ఈ వివాదం ముదరడంతో జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయినట్లు తెలుస్తోంది. అసలు అక్కడ ఏం జరుగుతుంది? వీరిద్దరి మధ్య మాటల యుద్ధం ఎందుకు? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..
చలిగల్ గ్రామ శివారులో కేంద్రీయ విద్యాలయానికి కేటాయించిన స్థల విషయంలో ఏర్పడిన ఓ చిన్న సమస్య వీరిద్దరి మధ్య రణ రంగానికి దారితీసింది. ఈ స్థలాన్ని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అడ్డుకుంటున్నారని.. ఎంపీ ధర్మపురి అరవింద్ ఆరోపిస్తున్నారు. కేంద్రం పాఠశాలను మంజూరు చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు స్థానిక ఎమ్మెల్యే ఉద్దేశపూర్వకంగానే స్థలం కేటాయింపులు జాప్యం చేస్తున్నారని ఆయన బండి పడ్డారు. దీనికి నిరసనగా జగిత్యాలాలు భారీ దీక్ష చేపట్టబోతున్నట్లు ఎంపీ ప్రకటించడం సంచలనంగా మారింది..
ఎంపీ ఆరోపణలను ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొన్ని కీలక అంశాలను లేవనెత్తారు.. చలిగల్ వాలెంటరీ స్థలం ఇరిగేషన్ శాఖ పరిధిలో ఉందని.. దానికి సంబంధించిన నిర్ణయాలు మంత్రి స్థాయిలో జరుగుతాయని ఆయన స్పష్టం చేశారు. గత ఐదేళ్లుగా జిల్లా అభివృద్ధిని పట్టించుకోని ఎంపి.. ఇప్పుడు కేవలం రాజకీయాల కోసమే తనను టార్గెట్ చేస్తున్నారని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు.. స్థల కేటాయింపుకు సాంకేతిక ఇబ్బందులు ఉన్నాయని.. వాటిని పరిష్కరించాల్సింది పోయి తనపై బురద జల్లడం సరికాదని ఆయన అన్నారు..
Also Read: నీ కాళ్లు మొక్కుతా సారూ.. మా ధాన్యం కొనండి!.. జగిత్యాలలో రైతు ఆవేదన..
కేంద్రీయ విద్యాలయం రాకూడదని నేనెందుకు అనుకుంటాను.. ఎంపీ గారు తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి నాపై అసత్య ప్రసారం చేస్తున్నారని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. ప్రజా ప్రతినిధుల మధ్య నడుస్తున్న ఈ వార్ వల్ల అసలు నష్టపోయేది విద్యార్థులేనని అక్కడి మేధావులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే తరగతులు ప్రారంభం కావాల్సి ఉండగా.. భవన నిర్మాణానికి పునాది పడకపోవడంపై యువత సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఎంపీ అరవింద్ దీక్షకు సిద్ధమవుతుండడంతో పోలీసులు జగిత్యాలలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసే యువచనలు ఉన్నట్లు తెలుస్తోంది..
Also Read: నీ కాళ్లు మొక్కుతా సారూ.. మా ధాన్యం కొనండి!.. జగిత్యాలలో రైతు ఆవేదన..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Delhi News: నాకు ముగ్గురు పిల్లలున్నారు.. వదిలేయండి.. ఢిల్లీ గ్యాంగ్ రే**ప్ బాధితురాలు కన్నీరు..
Hyderabad, Telangana:Delhi Gang Rape Telugu News: దేశ రాజధాని లోని మహిళా భద్రత మళ్లీ ప్రశ్నార్ధకంగా మారిపోయింది.. కామాందుల చేతిలో చిక్కిన ఒక బాధితురాలు తన ముగ్గురు పిల్లల కోసం ప్రాధేయపడిన.. వారు ఏమాత్రం కనికరించకుండా దారుణానికి ఒడిగట్టేసారు. హృదయాన్ని తగిలిస్తున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో బాధితురాలు కామాందులతో మాట్లాడిన కొన్ని అరుదైన మాటలు వైరల్ గా మారాయి.
నాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు.. వాళ్లు నాకోసం ఎదురు చూస్తూ ఉంటారు.. ప్లీజ్ నన్ను వదిలేయండి అని సదరు మహిళ నిందితులను వేడుకున్న వారు వినిపించుకోలేదు. బాధితురాలి వివరాలకు ప్రకారం.. ఆమెకు నాలుగు, ఆరు, 9 ఏళ్ల వయస్సు ఉన్న ముగ్గురు చ చిన్నారి ఆడపిల్లలున్నారు. పని ముగించుకుని ఇంటికి వెళ్తున్న సమయంలో కొందరు దుండగులు ఆమెను అడ్డగించి నిర్మాణస్య ప్రదేశానికి తీసుకెళ్లి ఆమెపై విచక్షణారహితంగా లైంగిక దాడికి పాల్పడ్డారు..
తనపై జరిగిన అఘాయిత్యాన్ని బాధితురాలు కన్నీరు మున్నీరవుతూ పోలీసులకు వివరించింది. నన్ను బలవంతంగా తీసుకెళ్లి హత్యాచారం చేశారు.. నేను ఎంతగా వదిలేయమని చెప్పినప్పటికీ వారు కనికరించలేదు. చివరకు ఈ విషయం ఎవరికీ చెప్పనని.. నా పిల్లల కోసం నన్ను వదిలేయమని కాళ్ళ వేళ్ళ పడ్డానని. నా దీన స్థితిని చూసి వారు వదిలిపెట్టారు.. అని ఆమె వాంగ్మూలంలో పేర్కొన్నారు..
నిందితుల నుంచి తప్పించుకున్న బాధితురాలు.. ఏ మాత్రం ధైర్యం కోల్పోకుండా కొంత దూరం వెళ్లిన తర్వాత వెంటనే పోలీసులకు ఫోన్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. ఈ దారుణ ఘటనపై కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు. బాధితురాలు చెప్పిన ఆడవాళ్లతో పాటు పరిసర ప్రాంతాల్లో సీసీటీవీ పుటిజి ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో పడ్డట్లు తెలుస్తోంది.. నగర నడిబొడ్డున ముగ్గురు పిల్లల తల్లి పై ఇలాంటి అఘాయిత్యం జరగడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. నిందితులను కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలు డిమాండ్ కూడా చేస్తున్నాయి..
Also Read: Fact Check: 1967 ఇందిరా గాంధీ బంగారం కొనవద్దని చెప్పారా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Gajalakshmi Rajayoga 2026: అరుదైన గజలక్ష్మి రాజయోగం.. ఈ 5 రాశుల వారికి అదృష్టం మాములుగా ఉండదు, ఇక డబ్బే డబ్బు!
Hyderabad, Telangana:Gajalakshmi Rajayoga 2026 Effect On Zodiac: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మే 14, 15, 16 తేదీలకు చాలా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఎందుకంటే మే 14వ తేదీన అనేక గ్రహాలు ఏకకాలంలోనే సంచారం చేశాయి. అర్ధరాత్రి వేళ చంద్రుడు మేషరాశిలోకి ప్రవేశించాడు. ఆ తర్వాత సూర్యుడితో పాటు కుజ గ్రహాల కలయిక కూడా జరిగింది. మరోవైపు శుక్రుడు గురుడితో కలయిక జరపడం కారణంగా ఎంతో శక్తివంతమైన రాజయోగం ఏర్పడింది. ఈ సమయంలో మిథున రాశిలో శుక్రుడితో పాటు గురుడి కలయిక జరిగింది. దీని కారణంగా గజలక్ష్మిరాజుయోగం ఏర్పడింది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ రాజయోగానికి చాలా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. అలాగే ఈ సమయంలో గురుడు పునర్వాసు నక్షత్రం మూడవ స్థానంలోకి ప్రవేశించాడు. బుధుడు వృషభ రాశిలోకి సంచారం చేశాడు. ఇలా అనేక గ్రహాలు ఈ తేదీల్లో సంచారం చేయడం విశేషం.. దీని కారణంగా మొత్తం ఐదు రాశుల వారిపై ఊహించని ప్రభావం పడుతుంది.
ఈ రాశులవారికి బంపర్ జాక్పాట్:
మిథున రాశి
మే 14వ తేదీ నుంచి మిధున రాశి వారికి ఈ సమయంలో విశేషమైన ప్రయోజనాలు కలగబోతున్నాయి. ముఖ్యంగా మిత్రగ్రహమైన శుక్రుడి ప్రవేశంతో ఏర్పడిన గజలక్ష్మి రాజయోగ ప్రభావం వల్ల వీరికి అన్ని రకాల సమస్యలు పరిష్కారం లభించబోతున్నాయి. అంతేకాకుండా ఈ సమయంలో వచ్చే ప్రతి సమస్యకు పరిష్కారం లభించబోతోంది. ఆర్థికంగా ప్రణాళికలు అద్భుతమైన విజయాలు సాధించగలుగుతారు. ఖర్చులు నియంత్రించుకోగలిగితే జీవితంలో ఊహించని లాభాలు పొందగలుగుతారు. ఇతరులనుంచి మంచి సపోర్టు పొంది.. అనుకోని ధన లాభాలు కూడా పొందుతారు. అలాగే ప్రేమ జీవితంలో వస్తున్న సమస్యలు కూడా పూర్తిగా పరిష్కారం అవుతాయి. వీరికి ఆత్మవిశ్వాసం కూడా అంచెలంచెలుగా రెట్టింపు అవుతుంది. సృజనాత్మకత కూడా చాలా వరకు పెరిగి అనుకున్న పనుల్లో అద్భుతమైన విజయాలు సాధిస్తారు.
తులారాశి
గజలక్ష్మి రాజయోగంతో తులారాశి వారికి ఈ సమయం మంచి ఫలితాలను అందిస్తుంది. అంతేకాకుండా జీవితంలో వస్తున్న ఆందోళనలు కూడా సులభంగా తొలగిపోతాయి. పనిలోని మీ సామర్థ్యంతో పాటు నైపుణ్యాలు విపరీతంగా పెరుగుతాయి. పై అధికారుల నుంచి మీకు మంచి సపోర్టు లభిస్తుంది. అంతేకాకుండా కొత్త భాగస్వాములు కూడా మీతో పరిచయాలు పెంచుకునే అవకాశాలు కనిపిస్తాయి. అలాగే పిల్లల గురించి ఆలోచిస్తున్న వ్యక్తులకు ఆందోళన తగ్గి విశేషమైన లాభాలు కలుగుతాయి. ప్రభుత్వ రంగాల్లో పనులు చేస్తున్న వ్యక్తులకు ఈ సమయంలో తప్పకుండా విజయాలు సాధించే అవకాశాలు లభిస్తాయి. ముఖ్యంగా ప్రేమ జీవితంలో శృంగారభరితమైన సమయం గడిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇష్టమైన ఆహారాన్ని ఆస్వాదించి జీవితంలో అద్భుతమైన ఆనందాన్ని పొందుతారు..
ధనస్సు రాశి
ధనస్సు రాశిలో జన్మించిన వ్యక్తులకు ఏడవ స్థానంలో శుక్ర గురు గ్రహాల కలయిక జరిగింది. దీని కారణంగా విద్యాతో పాటు వృత్తి జీవితంలో అభివృద్ధి లభించబోతోంది. అలాగే మీ పనుల్లో అనుభవంతో పాటు జ్ఞానం కూడా విపరీతంగా పెరుగుతుంది. ఈ సమయంలో ఎలాంటి విజయాలైన ఎంతో సులభంగా సాధించగలుగుతారు. మీ పనికి తగ్గ ప్రశంసలు కూడా దక్కుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. మీ జీవిత భాగస్వామి సపోర్టు లభించి కొన్ని రకాల పనులు ఎంతో సులభంగా చేయగలుగుతారు. అంతేకాకుండా కుటుంబ జీవితంలో గౌరవం కూడా విపరీతంగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతోపాటు ఈ సమయంలో ఉద్యోగాలు మారాలని చూస్తున్న వ్యక్తులకు ఈ సమయం ఎంతో లాభదాయక అందిస్తుంది..
కుంభరాశి
కుంభరాశిలో జన్మించిన వ్యక్తులకు శుక్ర, గురు గ్రహాల కలయిక కారణంగా ఈ సమయం చాలా శుభప్రదంగా ఉండబోతోంది. ముఖ్యంగా ఐదవ స్థానంలో ఈ రెండు గ్రహాల కలయిక కారణంగా ఉన్నట్టుండి ఇంట్లో ఆనందం ఊహించని స్థాయిలో పెరుగుతుంది. పనులన్నీ సజావుగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీకు మీ సహ ఉద్యోగుల నుంచి మంచి సపోర్టు లభించి.. ఎప్పుడూ పొందలేని ఆనందాన్ని కూడా సొంతం చేసుకోగలుగుతారు. అంతేకాకుండా అదృష్టంతో పాటు జీవితంలో అనుకున్న లాభాలన్నీ పొందగలుగుతారు. అలాగే ఎప్పటినుంచో కోరుకుంటున్న కోరికలు ఎంతో సులభంగా నెరవేరుతాయి. డబ్బు సంబంధిత సమస్యలకు కూడా చాలావరకు పరిష్కారం లభిస్తుంది.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
గమనిక: ఇక్కడ అందించిన వార్త కేవలం జ్యోతిష్య శాస్త్ర నిపుణులు నుంచి సేకరించి రాసింది మాత్రమే.. దీనిని జీ తెలుగు న్యూస్ ధృవీకరించదు.

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
PBKS vs MI Highlights: పంజాబ్ను దెబ్బతీసిన ముంబై.. తిలక్వర్మ తుఫాన్ ఇన్నింగ్స్
mathura, Dharamshala, Himachal Pradesh:Tilak Varma Heroic Batting: ప్లేఆఫ్స్ రేసులో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఆరంభంలో అదిరిపోయే మ్యాచ్లతో ఓటమి లేకుండా ఆడిన పంజాబ్ కింగ్స్ సెకండాఫ్లో పరిస్థితి రివర్స్ మారింది. ఇప్పుడు వరుస ఓటములు చవిచూస్తూ ప్లేఆఫ్స్ అవకాశాలను దూరం చేసుకుంటోంది. తాజాగా ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్ను కూడా పంజాబ్ కోల్పోయింది. విజయం కోసం చివరి బంతి వరకు పోరాడినా ఫలితం నిరాశ మిగిల్చింది. తిలక్ వర్మ భారీ ఇన్నింగ్స్తో మ్యాచ్ను గెలిపించి ముంబై జట్టుకు ఊరటనిచ్చాడు. ధర్మశాల వేదికగా జరిగిన మ్యాచ్లో పంజాబ్పై ముంబై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్కు సంబంధించి విశేషాలు ఇలా ఉన్నాయి.
Bandi Bhageerath: కొడుకును అప్పగించకుండా బండి సంజయ్ ఎవరిని బెదిరిస్తున్నాడు? ఆర్ఎస్ ప్రవీణ్ ఫైర్
Baddipadaga, Telangana:Bandi Bhageerath POCSO Case: 'పేట్ బషీరాబాద్ పోలీసులు చట్టానికి వ్యతిరేకంగా పోక్సో కేసు నిందితుడు బండి భగీరథ్ మామకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. బండి భగీరథ్కు నేర చరిత్ర ఉంది. ఆ విషయం పోలీసులకు తెలుసు. తెలంగాణ మహిళ లోకానికి బండి భగీరథ్తో ప్రమాదం పొంచి ఉంది' అని మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. 'బండి భగీరథ్పై నమోదైన పోక్సో కేసుపై పోలీసులు మీడియా సమావేశం ఎందుకు పెట్టలేదు? బండి భగీరథ్ను రక్షించాలనే ఆలోచన రేవంత్ రెడ్డికి ఉన్నట్లు కనిపిస్తుంది. సీతక్క మీడియా సమావేశం ఏర్పాటు చేసి బండి భగీరథ్ గురించి మహిళ లోకానికి తెలపాలి' అని డిమాండ్ చేశారు.
Also Read: Govt Employees: ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. రేపు సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
హైదరాబాద్లోని బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్లో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. 'బండి భగీరథ్ చేతిలో అన్యాయానికి గురయిన బాధితురాలి వ్యక్తిత్వాన్ని అడుగడుగున నాశనం చేయాలని చూస్తున్నారు. ఆమెపై సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు పోస్టులు పెడుతున్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రితో బాధితురాలు తల్లి కొట్లాట చేస్తానని నాతో చెప్పింది. బాధితురాలి ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ నాశనం చేస్తున్నారని బాధితురాలు తల్లి ఆవేదన చెందుతుంది' అని బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వివరించారు.
Also Read: AMCA Project: అనంతపురం జిల్లాకు మరో వరం.. కరువు సీమలో భారీ యుద్ధ విమాన ప్రాజెక్టు
'రేవంత్ రెడ్డికి ఒక అమ్మాయి ఉంది ఆ బాధ ఎలా ఉంటుందో ఆయనకు తెలుస్తుంది. సీతక్క, కొండా సురేఖ డీజీపీతో మాట్లాడి బాధితురాల ఫొటోలను సోషల్ మీడియా నుంచి వెంటనే తీసివేసేలా చర్యలు తీసుకోవాలి' అని బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. 'బండి భగీరథ్ పారిపోయారు. నిందితుడి తండ్రితో కలిసి రేవంత్ రెడ్డి మీటింగ్లో పాల్గొన్న తరువాత కేసు గురించి ఇంకేం విచారణ ఉంటుంది. బీజేపీ నాయకులు బాధిత మహిళను మేజరా, మైనరా చర్చ చేయడం బాధాకరం' అని మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read: KKR vs RCB Highlights: కలకత్తా ప్లేఆఫ్స్ ఆశలు గల్లంతు.. బెంగళూరు బెర్త్ పక్కా
'కల్వకుంట్ల కవిత పార్టీ పెట్టుకున్నప్పుడు తెలంగాణకు అమ్మలా ఉంటానని చెప్పి మర మనిషిగా ఉంటున్నారు. తెలంగాణ అమ్మలా ఉండాలని అనుకుంటున్న కవిత బాధితురాల అమ్మ బాధ ఒకసారి చూడాలి. రేవంత్ రెడ్డి, బీజేపీ స్క్రిప్ట్ కవిత చదవి మర మనిషిలా ఉంటున్నారు. బీఆర్ఎస్ నాయకులతోనే బాధితురాలి వివరాలు బయటకు వచ్చాయని కవిత అనడం సరికాదు' అని కవితపై బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
'ఒక సీనియర్ పోలీస్ అధికారి సలహాతోనే బండి భగీరథ్ కరీంనగర్లో బాధితురాలిపై కేసు పెట్టాడు. యూనివర్సిటీలో బండి భగీరథ్ ఇష్యూ అయినప్పుడే తన తండ్రి భగీరథ్ను బయటకు పంపించుకోవాలి. బండి సంజయ్ కొడుకు పెంపకంలో తేడా ఉంది. పిల్లలు అందరు ఒకటే పెంపకంలో లోపం ఉన్నప్పుడే ఇలాంటివి జరుగుతాయి' అని మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. 'బండి భగీరథ్ కరీంనగర్లో బాధితురాలుపై పెట్టిన కేసులో సెక్షన్ ఒకలా ఉన్నాయి. బండి భగీరథ్పై బాధితురాలు పెట్టిన కేసులో సెక్షన్ 6, 8 పెట్టకుండా పోలీసులు నిర్లక్ష్యం చేశారు' అని ఆరోపించారు.
'బాధితురాలుపై సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు పోస్టులు పెడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలి. రేవంత్ రెడ్డి పాలనలో తెలంగాణ ప్రజలకు రక్షణ లేదు. రిటైర్డ్ డీజీ ర్యాంక్ పోలీస్ అధికారి భార్యను పట్టపగలే నేపాల్ గ్యాంగ్ హత్య చేసింది. బండి సంజయ్ను ఇబ్బంది పెట్టిన వారిని ఏ ఒక్క వ్యక్తి వదిలిపెట్టను అని అంటున్నాడు. సీతమ్మ తల్లి కోసం ఆంజనేయుడు లంకను దహనం చేశాడు. ఆంజనేయుడు పేరు తీసే అర్హత బండి సంజయ్కు లేదు' అని బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు.
'బండి సంజయ్ ఎవరిని భయపెట్టిస్తున్నాడు? బాధితురాలను బెదిరిస్తున్నారా, మమ్మల్ని బెదిరిస్తున్నారా?' అని మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. బండి సంజయ్ వ్యాఖ్యలతో బాధితురాలు తల్లి భయపడుతోందని తెలిపారు. 'దేశం కోసం... ధర్మం కోసం పోక్సో కేసుల్లో అత్యధికంగా బీజేపీ నేతలపైనే ఎక్కువ. బాధితురాలకు న్యాయం చేయాలి' అని డిమాండ్ చేశారు.
AP Govt Teachers: ప్రభుత్వ టీచర్లకు సీఎం చంద్రబాబు తీపి కబురు.. ఏం ప్రకటించారంటే?
Nuzendla, Andhra Pradesh:Good News To Govt Teachers: ప్రభుత్వ టీచర్లు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న కీలక అంశంపై కూటమి ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఉద్యోగులకు ఊరట కలిగించేలా ప్రమోషన్లలో విషయంలో ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఏపీలో ప్రభుత్వ టీచర్ల ప్రమోషన్లకు కొత్త రూల్ తీసుకువచ్చింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇకపై టీచర్లకు పదోన్నతుల్లో టెట్ (ఉపాధ్యాయ అర్హత పరీక్ష) తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది.
Also Read: AMCA Project: అనంతపురం జిల్లాకు మరో వరం.. కరువు సీమలో భారీ యుద్ధ విమాన ప్రాజెక్టు
స్కూల్ అసిస్టెంట్, ప్రధానోపాధ్యాయులు గ్రేడ్-2 ప్రమోషన్లకు టెట్ తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఒకటో తరగతి నుంచి ఎనిమిదో తరగతి టీచర్లు ఉద్యోగంలో ఏ రోజు చేరినా సరే పదోన్నతులు (ప్రమోషన్) సమయంలో మాత్రం ఎన్సీటీఈ నిబంధనలు పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. ఏపీలో సర్వీసులో ఉన్న ఉపాధ్యాయుల కోసం టెట్కు సంబంధించిన మార్గదర్శకాలను సుప్రీంకోర్టు ఆదేశాలతో ప్రభుత్వం గతేడాది అక్టోబర్లో విడుదల చేసిన విషయం తెలిసిందే.
Also Read: Govt Employees: ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. రేపు సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
కొత్త రూల్తో ప్రభుత్వ టీచర్లకు సంబంధించిన ప్రమోషన్ల జాబితాలో టెట్ కాలమ్ ఉంచారు. కొత్తగా టెట్ కాలమ్ను సర్వీసులో ఉన్న స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీల సీనియారిటీ జాబితాలో చేరుస్తారు. సీనియారిటీ జాబితాలో టెట్ మార్కులు, ఏపీటెట్, సీటెట్లో అర్హత సాధించారా? లేదా? ఏపీటెట్లో ఏ పేపర్లో అర్హత సాధించారు? పేపర్-2లో అర్హత సాధించి ఉంటే సబ్జెక్టు, మాధ్యమం వివరాలను పొందుపర్చాలి ఉంది. సర్వీస్లో ఉన్న టీచర్లకు ప్రభుత్వం గతేడాది టెట్ రాసే అవకాశం ఇచ్చింది. దీంతో టీచర్ల ప్రమోషన్లలో ఎన్సీటీఈ నిబంధనలను ప్రస్తావించారు. గతేడాది సుప్రీంకోర్టు టీచర్లకు టెట్ అర్హత తప్పనిసరి అని తీర్పు ఇవ్వడంతో ఏపీలో కూడా టెట్ తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
Also Read: KKR vs RCB Highlights: కలకత్తా ప్లేఆఫ్స్ ఆశలు గల్లంతు.. బెంగళూరు బెర్త్ పక్కా
వారికి విదేశీ పర్యటన
ప్రమోషన్లలో కొత్త రూల్తోపాటు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు అందుకున్న ఉపాధ్యాయులకు ప్రభుత్వం బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఉత్తమ అవార్డులు అందుకున్న 31 మంది ఉపాధ్యాయులతోపాటు సీమ్యాట్ కాంట్రాక్ట్ లెక్చరర్ సతీష్రెడ్డికి ప్రభుత్వం విదేశీ పర్యటనకు ఎంపిక చేసింది. ఫిన్లాండ్లోని యూనివర్సిటీ ఆఫ్ టుర్కు సందర్శనకు ప్రభుత్వం పంపించనుంది. ఉపాధ్యాయుల ఫిన్లాండ్ టూర్కు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆగస్టు 17 నుంచి 26వ తేదీ వరకు 31మంది టీచర్లు, సీమ్యాట్ కాంట్రాక్ట్ లెక్చరర్ సతీశ్రెడ్డి, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ తమీమ్ అన్సారియా ఫిన్లాండ్ దేశంలో పర్యటిస్తారు.
Bride Death: రాత్రి పెళ్లి భజంత్రీలు తెల్లారి చావు డప్పు.. వివాహమైన తెల్లారి వధువు, తల్లి దుర్మరణం
Visakhapatnam, Andhra Pradesh:Wedding Tragedy: అంగరంగ వైభవంగా రాత్రి పెళ్లి చేశారు.. బంధుమిత్రులు తరలివచ్చారు. ఆనందోత్సాహాలతో పెళ్లి వేడుక జరగ్గా.. తన భర్తతో కలిసి వధువు అత్తారింటికి బయల్దేరింది. పెళ్లయిన తర్వాతి రోజు అత్తారింటికి కాపురం కోసం వెళ్తున్న వధువు జరిగిన ఘోర సంఘటనలో ఆమె దుర్మరణం పాలయ్యారు. ఆమెతోపాటు ఆమె తల్లి కూడా మరణించడంతో పెళ్లి ఇంట చావు భాజా మోగింది. తల్లీ కుమార్తెలు రోడ్డు ప్రమాదంలో మరణించడంతో విశాఖపట్టణంలో తీవ్ర విషాదం అలుముకుంది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
Also Read: AMCA Project: అనంతపురం జిల్లాకు మరో వరం.. కరువు సీమలో భారీ యుద్ధ విమాన ప్రాజెక్టు
విశాఖపట్టణం గాజువాక అగనంపూడి శానివాడ సమీపంలో గురువారం మధ్యాహ్నం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అగనంపూడి గ్రామానికి చెందిన నడుపూరు పెంటారావు, కనకమహాలక్ష్మి చిన్న కుమార్తె రామేశ్వరిని వాడచీపురుపల్లి గ్రామానికికి చెందిన నర్సింగరావుకు ఇచ్చి బుధవారం రాత్రి వైభవంగా వివాహం చేశారు. రాత్రి బంధుమిత్రుల సమక్షంలో విందు జరిగిన అనంతరం రామేశ్వరి మెడలో నర్సింగరావు మూడు ముళ్లు వేశాడు. వివాహం అనంతరం అక్కడే నిద్రపోయిన వధూవరులు తెల్లవారుజామున లేచి అత్తగారి ఊరు అగనంపూడి బయల్దేరారు.
Also Read: Govt Employees: ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. రేపు సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
తన భార్య, అత్తామాలను తీసుకుని వరుడు అంగనపూడి గ్రామానికి కారులో బయల్దేరగా.. మార్గమధ్యలో ఘోర సంఘటన జరిగింది. కారు అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. అతివేగంతో ఢీకొట్టడంతో కారులోని నూతన వధూవరులతోపాటు అత్తామామలు, ఇతర కుటుంబసభ్యులు ఎగిరిపడ్డారు. తీవ్ర గాయాలతో వధువు రామేశ్వరి అక్కడికక్కడే మృతి చెందగా.. మిగతా వారు గాయాలపాలయ్యారు. వెంటనే స్థానికులు, పోలీసులు అప్రమత్తమై క్షతగాత్రులను ఆస్పత్రికి ఇతరలించారు.
Also Read: KKR vs RCB Highlights: కలకత్తా ప్లేఆఫ్స్ ఆశలు గల్లంతు.. బెంగళూరు బెర్త్ పక్కా
ఇరు కుటుంబాలు
పెళ్లి దండలతో ఉన్న రామేశ్వరి మృతి చెందగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె తల్లి కనకమహాలక్ష్మి చికిత్స పొందుతూ మరణించారు. వరుడు నర్సింగరావుతోపాటు మిగతా ముగ్గురికి తీవ్ర గాయాలవగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉందని సమాచారం. ఈ సంఘటనతో ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం అలుముకుంది. పెళ్లితో ఆనందంగా ఉన్న ఆ కుటుంబాలు ఒక్కసారిగా తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాయి. ప్రమాదానికి డ్రైవర్ నిద్రమత్తు కారణంగా తెలుస్తోంది. డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి ఒక కునుకు వేయడంతో కారు పక్కకు ఒరిగి స్తంభాన్ని ఢీకొట్టి ఉంటుందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించారు. ప్రమాద స్థలంలో వధూవరుల పెళ్లి దండలు పడి ఉండడంతో ఆ సన్నివేశం చూస్తే అందరినీ కలచివేస్తోంది. ఇక నిన్న పెళ్లిలో దిగిన ఫొటోల్లో ఉన్న వ్యక్తులు అప్పుడే మరణించడంతో బంధుమిత్రులు షాక్కు గురయ్యారు. ఈ సంఘటన అగనంపూడి, వాడచీపురుపల్లి గ్రామాల్లో తీవ్ర విషాదం నింపింది.
AP Cabinet Meeting: ఏపీ క్యాబినెట్ మీటింగ్లో కీలక నిర్ణయాలు..ఒకరోజు నో వెహికల్ డే, ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్!
Velgapudi, Andhra Pradesh:AP Cabinet Meeting News: అమరావతిలో నేడు ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ మీటింగ్ జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మంత్రివర్గం దాదాపుగా 40కి పైగా అంశాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. అందులో ప్రధానంగా పరిపాలనా సంస్కరణలు, పొదుపు చర్యలు, పారిశ్రామికాభివృద్ధిపై దృష్టి సారించినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని అటు పర్యావరణ పరిరక్షణతో పాటు ఇటు ప్రభుత్వ ఖర్చుల పొదుపు కోసం మంత్రివర్గం వినూత్నమైన మార్పులకు శ్రీకారం చుట్టింది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు 'పొదుపు'ను ఒక విధానాన్ని అమలు చేయడానికి కేబినెట్ నిర్ణయించింది. వారానికి ఒకరోజు ప్రభుత్వ వాహనాలను వాడకూడదని (నో వెహికల్ డే) మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. మంత్రులు తమ రవాణా కోసం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, ఎలక్ట్రిక్ వాహనాలు (EV) లేదా సైకిళ్లను వాడాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. అలాగే మంత్రుల జిల్లాల పర్యటనల్లో అనవసర ఖర్చులను తగ్గించుకోవాలని (కాస్ట్ కటింగ్) సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. పాలకులతో పాటు పౌరుల్లో బాధ్యతను పెంచేలా ఈ ప్రత్యేక ప్రచారాన్ని మరింతగా ముందుకు తీసుకెళ్లాలని ఆయన పేర్కొన్నారు.
ఐటీ, ఇతర రంగాల తరహాలో ప్రభుత్వ శాఖల్లో కూడా విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. నేరుగా ఆఫీసుకు రావాల్సిన అవసరం లేని ఉద్యోగులకు 'వర్క్ ఫ్రమ్ ప్రభుత్వ హోమ్' కల్పించే ప్రతిపాదనపై మంత్రివర్గంలో కీలక చర్చ జరిగింది. త్వరలోనే మార్గదర్శకాలు విడుదలయ్యే అవకాశం ఉంది.
అలాగే భవిష్యత్తులో ప్రభుత్వం కొత్తగా కొనుగోలు చేసే వాహనాలన్నీ EV (ఎలక్ట్రిక్ వాహనాలు) అయి ఉండాలని నిర్ణయించారు. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు.
ఇదే సమావేశంలో రాష్ట్ర ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచేలా పలు పారిశ్రామిక ప్రాజెక్టులకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. టెక్నాలజీ రంగంలో డేటా సెంటర్ల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ఆటోమొబైల్, సిమెంట్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో భారీ పెట్టుబడులు, ప్రాజెక్టులకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. అలాగే ఈ సమావేశంలో క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టుల విస్తరణకు ప్రాధాన్యతనివ్వాలని మంత్రివర్గం నిర్ణయించింది.
Also Read: ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమంత్రి తీపికబురు..2 శాతం డీఏ పెంచిన రాష్ట్ర ప్రభుత్వం!
Also Read: మహిళలకు ప్రభుత్వం శుభవార్త..బ్యాంకు ఖాతాల్లోకి రూ.1,000 జమ అప్పటి నుంచే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
AMCA Project: అనంతపురం జిల్లాకు మరో వరం.. కరువు సీమలో భారీ యుద్ధ విమాన ప్రాజెక్టు
Puttaparthi, Andhra Pradesh:Puttaparthi AMCA Project: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కరువుకు కేరాఫ్గా నిలిచిన ఉమ్మడి అనంతపురం జిల్లా ఇప్పుడు అభివృద్ధికి కేంద్రంగా మారుతోంది. ఇప్పటికే ఈ కరువు ప్రాంతంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతుండగా.. అదే స్థాయిలో భారీ ప్రాజెక్టులు వస్తున్నాయి. కియా కార్ల సంస్థ ఉమ్మడి అనంతపురం జిల్లాలోనే ఉండగా.. తాజాగా యుద్ధ విమానాల తయారీ ప్రాజెక్టు కూడా అనంతపురం జిల్లాలో ఏర్పాటుకానుంది. రూ.లక్ష కోట్లతో ఈ ప్రాజెక్టు ఏర్పాటు కానుండడంతో అనంతపురం జిల్లాకు మహర్దశ పట్టనుంది.
Also Read: Bandi Bageerath POCSO Case: అమ్మాయి మైనర్ కాదు.. హైకోర్టులో బండి భగీరథ్ వాదనలు
పుట్టపర్తిలో రూ.లక్ష కోట్లతో ఫిఫ్త్ జనరేషన్ యుద్ధ విమానాల తయారీ ప్రాజెక్టుకు రేపు అంకురార్పణ జరగనుంది. ఈ ప్రాజెక్టు పనులకు సీఎం చంద్రబాబు, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ రేపు శంకుస్థాపన చేయనున్నారు. ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి పర్యటన నేపథ్యంలో పుట్టపర్తిలో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే అక్కడ ఏర్పాట్లు పూర్తిగా కాగా.. తాజాగా కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను అనంతపురం జిల్లా ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Also Read: KKR vs RCB Highlights: కలకత్తా ప్లేఆఫ్స్ ఆశలు గల్లంతు.. బెంగళూరు బెర్త్ పక్కా
ఈనెల 15న పుట్టపర్తిలో సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ యుద్ధ విమానాల తయారీ ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమం జరగనున్న నేపథ్యంలో ఏర్పాట్లను పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, సీఎం కోఆర్డినేటర్ పెందుర్తి వెంకటేష్, మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి, మడకశిర ఎమ్మెల్యే ఎమ్మెస్ రాజు పరిశీలించారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో 650 ఎకరాల్లో ఫిఫ్త్ జనరేషన్ యుద్ధ విమానాల తయారీ ప్రాజెక్టు ఏర్పాటు చేయడం ఎంతో చారిత్రాత్మక నిర్ణయమని పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి తెలిపారు.
Also Read: Govt Employees: ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. రేపు సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
సత్యసాయి బాబా ఆశీస్సులతో భారత రక్షణ రంగానికి సంబంధించిన అత్యంత ప్రతిష్టాత్మక విమానాల తయారీ ప్రాజెక్టు సత్యసాయి జిల్లా పుట్టపర్తికి రావడం గొప్ప వరం అని ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా వేలాది మందికి ప్రత్యక్ష, పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని వివరించారు. ఆమడగూరు మండలంలో 5 వేల మెగావాట్ల సామర్థ్యంతో రూ.51 వేల కోట్ల వ్యయంతో రిలయన్స్ సోలార్ పవర్ ప్రాజెక్టు ఏర్పాటు కావడం జిల్లాకు మరొక గర్వకారణమని ఎమ్మెల్యే సింధూర రెడ్డి చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి, పరిశ్రమల స్థాపనకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.
Bandi Bageerath POCSO Case: అమ్మాయి మైనర్ కాదు.. హైకోర్టులో బండి భగీరథ్ వాదనలు
Hyderabad, Telangana:Telangana High Court: అత్యాచారానికి పాల్పడిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు, నిందితుడు బండి భగీరథ్కు బెయిల్పై ఇంకా ఎలాంటి నిర్ణయం రాలేదు. తెలంగాణ హైకోర్టులో వేసిన పిటిషన్ గురువారం మధ్యాహ్నం విచారణకు వచ్చింది. మధ్యంతర బెయిల్ కోసం బండి భగీరథ్ న్యాయవాదులు వాదనలు వినిపించారు. బాధితురాలు మైనర్ కాదు మేజర్ అని చెబుతున్నారు కానీ ఆమెపై అత్యాచారం చేసిన విషయాన్ని మాత్రం మరచిపోతున్నారు. ఇదే విషయమై హైకోర్టులో వాదనల మీద వాదనలు జరిగాయి. చివరకు రేపు విచారణకు వాయిదా వేసింది.
Also Read: KKR vs RCB Highlights: కలకత్తా ప్లేఆఫ్స్ ఆశలు గల్లంతు.. బెంగళూరు బెర్త్ పక్కా
బాధితురాలు తరఫు న్యాయవాది వాదనలు
కరీంనగర్లో బాధితురాలిపై తప్పుడు కేసు పెట్టారు. బాధితురాలు తల్లి పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కి వెళ్లిన సమయంలో వెంటనే కరీంనగర్కి సమాచారం ఇచ్చి కేసు నమోదు చేశారు. నిందితుడు కేంద్ర మంత్రి కుమారుడు ఈ కేసులో చాలా ప్రభావితం చేశారు. తమ వాదనలు వినిపించడానికి మాకు కొంత సమయం కావాలని న్యాయస్థానాన్ని బాధితురాలు తరఫు న్యాయవాది కోరారు. రేపు మధ్యంతర బెయిల్ పై రేపు నిర్ణయం తీసుకుంటామని న్యాయస్థానం తెలిపింది.
Also Read: Govt Employees: ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. రేపు సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
'పోక్సో చట్టంలోని సెక్షన్ 11 నిర్దేశించిన వాటి పరిధిలోకి పిటిషనర్ రారు. బీఎన్ఎస్ సెక్షన్ 74, 75 ఆరోపించిన నేరాలు రుజువు కాలేదు. బాధితురాలుగా చెబుతున్న బాలిక వయసు 19 నుంచి 20 మధ్య ఉంటుంది. ఆమె తల్లి తప్పుడు రికార్డ్స్ సృష్టించి వయసు తగ్గించి కఠినమైన పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయించారు. 8 నెలలు కింద జరిగిన సంఘటనపై ఇప్పుడు ఫిర్యాదు చేయడంలో దురుద్దేశం ఉంది. ' అని బండి భగీరథ్ న్యాయవాది, సీనియర్ కౌన్సిల్ నిరంజన్ రెడ్డి వాదించారు. బాలిక మైనర్ కాదు అనడానికి మీ దగ్గర ఆధారాలు ఉంటే సమర్పించాలని నిందితుడు తరఫు న్యాయవాదికి హైకోర్టు సూచించారు.
'ఐదేళ్ల కిందట అంటే అమ్మాయికి 15 ఏళ్ల వయసు ఉన్నప్పుడు కారు నడుపుతూ కేసు నమోదైంది. అందులో ఉన్న డేట్ ఆఫ్ బర్త్ వివరాలు సరైనవే అయితే తను మేజర్ అవుతుంది. ఆ యువతి పలు రకాల తేదీలతో డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్స్ తీసుకుంది' అని పిటిషనర్ తరపున వాదన వినిపిస్తున్న సీనియర్ కౌన్సిల్ నిరంజన్ రెడ్డి తెలిపారు. 'ఈనెల 8వ తేదీన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో నమోదైన పోక్సో కేసులో తప్పుడు ఆరోపణలు చేశారు. నాపై ఆరోపణలు చేస్తున్న బాలిక, ఫిర్యాదు చేసిన వ్యక్తి రూ.5 కోట్లు డిమాండ్ చేశారు. బెదిరింపులకు పాల్పడమే కాకుండా ఆ మొత్తాన్ని చెల్లించకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బాధితురాలు బెదిరించారు. బాధితుల నుంచి వచ్చిన బెదిరింపులకు లొంగకుండా కరీంనగర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాం. ప్రముఖ రాజకీయ వ్యక్తి కుమారుడు కావడంతో ఈ కుట్రకు పాల్పడ్డారు' అని నిందితుడు బండి భగీరథ్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.
హైకోర్టు కీలక వ్యాఖ్యలు
'ప్రతిసారి కేంద్ర మంత్రి కుమారుడు అని మీరు పదే పదే చెప్పాల్సిన అవసరం లేదు. బాధితురాలు పుట్టినరోజు డేట్స్పై పోలీసులు విచారణ చేయాలి' అని హైకోర్టు ఆదేశించింది. ఇక బెయిల్పై విచారణను రేపటికి వాయిదా వేసింది.
