పాఠశాలలో వసతుల కోసం విద్యార్థులు, తల్లిదండ్రుల ధర్నా
Dhamsalapuram, Telangana:ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరులోనీ జిల్లా పరిషత్ పాఠశాలలో సరిపడ ఉపాధ్యాయులు లేకపోవడంతో విద్యార్థులు స్కూల్ గేట్టు ఎదుట నిరసన చేసారు. పాఠశాల ప్రారంభం అయ్యి 2నెలలు అయినా, అన్ని సబ్జెక్టులకి సరిపోను ఉపాధ్యాయులు లేకపోవడం వలన తమ పిల్లలకు ఇబ్బంది అవుతుందని , వారి తల్లితండ్రులు కూడా పాఠశాల ముందు నిరసన తెలిపారు. ఖమ్మం - సూర్యాపేట జాతీయ రహదారి పై విద్యార్థులతో కలిసి తల్లితండ్రులు ధర్నా రాస్తారోకో నిర్వహించారు. ఉపాధ్యాయులని వెంటనే నియమించాలని నినాదాలు చేశారు.हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
Oppo Find X10: ఒప్పో ఫైండ్ X10.. ఈ ఫీచర్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే.. లాంచ్ ఎప్పుడంటే?
Hyderabad, Telangana:Oppo Find X10 Launch Date: స్మార్ట్ఫోన్ మార్కెట్లో తనదైన ముద్ర వేసుకున్న ఒప్పో తాజాగా తన సరికొత్త ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్ ఒప్పో ఫైండ్ X10 (Oppo Find X10) లాంచ్కు సిద్ధం చేసింది ఇప్పటికే ఈ స్మార్ట్ఫోన్కు సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలతో పాటు ఫీచర్స్ కూడా సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. దీంతో ఈ మొబైల్ విడుదల ముందే మంచి పేరు లభించింది. ఈ స్మార్ట్ఫోన్ గతంలో విడుదల చేసిన అన్ని మోడల్స్ కంటే కాస్త భిన్నంగా ఉండబోతోంది.. ముఖ్యంగా ఇది ఎన్నో రకాల శక్తివంతమైన ఫీచర్లతో విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది.. అయితే, ఈ స్మార్ట్ఫోన్కు సంబంధించిన అన్ని రకాల వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..
సాధారణ బ్రాండ్లకు సంబంధించిన ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్స్ 5000mAh బ్యాటరీని కలిగి ఉండడం మనం చూస్తూ ఉంటాం. కానీ అతి త్వరలో విడుదల కాబోయే ఈ ఒప్పో ఫైండ్ X10లో ఏకంగా 8000mAh శక్తివంతమైన బ్యాటరీని కలిగి ఉండబోతోంది. అంతేకాకుండా ఇది అద్భుతమైన బ్యాకప్తో లభించబోతోంది. అలాగే ఈ మొబైల్ బ్యాటరీకి ఫాస్ట్ ఛార్జింగ్ కోసం అద్భుతమైన వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్తో పాటు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్లను కూడా అందిస్తోంది. అంతేకాకుండా ఇందులో ఎన్నో రకాల కొత్త కొత్త ఫీచర్లు అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది..
Also Read: Spray Fan Offer: అమెజాన్ బంపర్ ఆఫర్.. రూ.1,099కే AC లాంటి గాలినిచ్చే డబుల్ ఎండెడ్ స్ప్రే ఫ్యాన్!
ఒప్పో ఫైండ్ X10 స్మార్ట్ఫోన్ ఎంతో శక్తివంతమైన బ్యాటరీతో పాటు డిస్ప్లేను కలిగి ఉండబోతోంది. ఇటీవల లీక్ అయిన వివరాల ప్రకారం.. ఇది 6.59 అంగుళాల కాంపాక్ట్ సైజు ఫ్లాట్ డిస్ప్లేను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది.. అంతేకాకుండా ఇది 165Hz సూపర్ స్మూత్ రిఫ్రెష్ రేట్, 1.5K రిజల్యూషన్ సపోర్ట్తో రాబోతోంది. దీనివల్ల గేమింగ్తో పాటు ఎక్కువగా మొబైల్స్లో సినిమాలు చూసే వారికి మంచి ఎక్స్పీరియన్స్ లభిస్తుంది.. అంతేకాకుండా ఇందులో ఎంతో శక్తివంతమైన లేటెస్ట్ మీడియాటెక్ డైమెన్సిటీ 9600 సిరీస్ చిప్సెట్ ప్రాసెసర్ను కలిగి ఉంటుంది. అలాగే ఇది IP సర్టిఫికేషన్తో విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది.
అయితే, ఈ ఒప్పో ఫైండ్ X10 స్మార్ట్ఫోన్కు సంబంధించిన వివరాలను ఒప్పో(Oppo) కంపెనీ ఇంకా అధికారికంగా విడుదల చేయలేదు లీకైన వివరాలను బట్టి చూస్తే ఈ స్మార్ట్ఫోన్కు సంబంధించిన వివిధ అంశాలను అతి త్వరలోనే అధికారికంగా విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.. అంతేకాకుండా ఇదే సమయంలో ఒప్పో ఫైండ్ X10 స్మార్ట్ఫోన్కు సంబంధించిన ధర వివరాలను కూడా అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. లీకైన సమాచారం ప్రకారం.. ఈ ఒప్పో ఫైండ్ X10 మొబైల్ ధర గత మోడల్స్ కంటే కాస్త ఎక్కువగానే ఉండే అవకాశాలు ఉన్నాయి.
Also Read: Spray Fan Offer: అమెజాన్ బంపర్ ఆఫర్.. రూ.1,099కే AC లాంటి గాలినిచ్చే డబుల్ ఎండెడ్ స్ప్రే ఫ్యాన్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Brent Crude Oil Prices: ట్రంప్ నిర్ణయం.. భగ్గుమంటున్న చమురు ధరలు.. 120 డాలర్లు దాటిన క్రూడ్ అయిల్ ..!!
Hyderabad, Telangana:Brent Crude Oil Prices: ప్రస్తుతం ప్రపంచ మార్కెట్లో తీవ్ర గందరగోళంలో ఉన్నాయి. గురువారం బ్రెంట్ ముడి చమురు ధర బ్యారెల్ కు 120డాలర్లు దాటింది. ఈ పెరుగుదలకు ప్రధాన కారణం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనే అని చెప్పాలి. ట్రంప్ ఇరాన్ పై దిగ్బంధనం కొనస్తానని ప్రతిజ్ణ చేశారు. అమెరికా షరతులపై ఇరాన్ అణు ఒప్పందానికి అంగీకరించే వరకు హార్మూజ్ జలసంధిపై నావికా దిగ్భంధనం ముగియదని ట్రంప్ స్పష్టం చేశారు.
ఆక్సియోస్కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ.. ఇరాన్పై ఒత్తిడి తెచ్చేందుకు దిగ్బంధనమే అత్యంత శక్తివంతమైన సాధనమని తెలిపారు. తీవ్రమైన భాషను ఉపయోగిస్తూ.. బాంబు దాడుల కంటే దిగ్బంధనమే ఎక్కువ ప్రభావవంతంగా ఉందన్నారు. ఇది ఇరాన్ ఆర్థిక వ్యవస్థను పూర్తిగా ఉక్కిరిబిక్కిరి చేస్తోందని ఆయన అభిప్రాయ పడ్డారు. చర్చలకు ముందే దిగ్బంధనాన్ని ఎత్తివేసి.. సముద్ర మార్గాన్ని తెరవాలన్న ఇరాన్ ప్రతిపాదనను కూడా ట్రంప్ తిరస్కరించారు. ముందుగా అమెరికా ఆందోళనలను పరిష్కరించాలని.. ఆ తర్వాతే ఆంక్షలను ఎత్తివేస్తామన్నదే ట్రంప్ స్పష్టమైన సందేశం ఇచ్చారు. చర్చల ద్వారా పరిష్కారం లభించకపోతే.., సైనిక చర్యను పరిగణించవచ్చని కూడా ఆయన సూచించారు.
హోర్ముజ్ జలసంధి ప్రపంచంలోనే అత్యంత ముఖ్యమైన చమురు రవాణా మార్గం. గల్ఫ్ దేశాల నుండి వచ్చే ముడి చమురులో అధిక భాగం ప్రపంచంలోని ఇతర ప్రాంతాలకు చేరడానికి ఈ ఇరుకైన మార్గం గుండానే వెళుతుంది. అమెరికా ఈ మార్గాన్ని దిగ్బంధించినప్పుడు.. ప్రపంచ చమురు సరఫరా గొలుసుకు అంతరాయం కలుగుతుంది. తక్కువ సరఫరా .. అధిక డిమాండ్ కారణంగా, ధరలు ఆకాశాన్నంటుతాయి. ఇది తమ ఇంధన అవసరాల కోసం దిగుమతులపై ఆధారపడే భారతదేశంతో సహా ఇతర దేశాలను నేరుగా ప్రభావితం చేస్తుంది.
ప్రముఖ ఆర్థికవేత్త జెఫ్రీ సాక్స్ ఈ పరిస్థితి గురించి ప్రపంచాన్ని హెచ్చరించారు. FICCI లెజెండ్స్ సిరీస్ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ సంక్షోభం ఇలాగే కొనసాగితే, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీవ్రమైన మాంద్యంలోకి కూరుకుపోవచ్చని పేర్కొన్నారు. సాక్స్ ప్రకారం.. ప్రస్తుతం మార్కెట్ సరఫరా కొరత పరిష్కారమవుతుందని ఆశిస్తోంది. కానీ అలా జరగకపోతే ధరలు మరింత పెరుగుతాయి. ఈ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తత చమురుకే పరిమితం కాదు. ఇది ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో విస్తృత ఆర్థిక అస్థిరతకు దారితీయవచ్చు. ప్రస్తుతం.. మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతలు, చమురు ధరలపై యావత్ ప్రపంచం దృష్టి సారించింది. హోర్ముజ్ జలసంధిని త్వరలో తిరిగి తెరవకపోతే, పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యుడి జేబుకు, ప్రపంచ మార్కెట్ బడ్జెట్కు తీవ్ర అంతరాయం కలిగించే అవకాశం ఉందని చెప్పాలి.
Also Read: Gold Rate Today: మహిళలకు అదిరిపోయే గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు..!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Rohit Sharma Birthday: హ్యాపీ బర్త్డే హిట్మ్యాన్..రోహిత్ శర్మ సంపద ఎంతో తెలుసా? ఇల్లు ఒక్కటే రూ.40 కోట్లు!
Hyderabad, Telangana:Rohit Sharma Net worth: టీమ్ఇండియా వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ పుట్టినరోజు (ఏప్రిల్ 30) నేడు. హిట్మ్యాన్ నాయకత్వంలో 2024 ఐసీసీ టీ20 ప్రపంచ కప్, 2025 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా టీమ్ఇండియా నిలిచింది. ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ జట్టు కెప్టెన్గా 5 ట్రోఫీలను గెలుచుకున్నాడు. అంతకు ముందు, అతను 2009లో డెక్కన్ ఛార్జర్స్ తరఫున ఆడుతూ ఆటగాడిగా ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడాడు. ఐపీఎల్ సిరీస్లో అత్యధిక సార్లు (6 సార్లు) ట్రోఫీని గెలుచుకున్న ఏకైక ఇద్దరు ఆటగాళ్లు రోహిత్ శర్మ, అంబటి రాయుడు. ఈరోజు రోహిత్ శర్మ 38వ పుట్టినరోజు సందర్భంగా ఆయన వ్యక్తిగత విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ధోనీ తర్వాత అత్యధిక ఐసీసీ ట్రోఫీలు గెలిచిన రెండో భారత కెప్టెన్గా రోహిత్ శర్మ నిలిచాడు. ధోనీ కంటే ముందు ఐపీఎల్ సిరీస్లలో అత్యధిక ట్రోఫీలు గెలిచిన తొలి భారత క్రికెటర్ కూడా రోహిత్ శర్మే. వన్డేలలో రెండుసార్లు 200+ పరుగులు చేసిన ఏకైక ఆటగాడు రోహిత్ శర్మ. అతని విజయాల గురించి ఇలా చెప్పుకుంటూపోతే ఎన్నో ఉన్నాయి. తన అభిమానులు రోహిత్ను 'హిట్మ్యాన్' అని ప్రేమగా పిలుస్తారు. రోహిత్ శర్మ 1987 ఏప్రిల్ 30న మహారాష్ట్రలోని నాగ్పూర్లో జన్మించారు.
అతను 2007 నుండి అంతర్జాతీయ మ్యాచ్లు ఆడుతున్నాడు. 2024లో టీ20 ఫార్మాట్ నుంచి తప్పుకోగా.. ఆ తర్వాత 2025లో టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ప్రస్తుతం టీమ్ఇండియా వన్డే జట్టులో కొనసాగుతున్నాడు. రోహిత్ శర్మ 25కు పైగా బ్రాండ్లకు అంబాసిడర్గా ఉన్నారు. వాటిలో అడిడాస్, సియాట్, మాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ వంటి బ్రాండ్లను ముఖ్యంగా పేర్కొనవచ్చు. ఆయనకు ప్రతి బ్రాండ్ నుంచి కనీసం రూ.5 కోట్లు సంపాదన ఆర్జిస్తున్నారని సమాచారం.
రోహిత్ శర్మ ముంబైలోని వర్లీలో ఉన్న అహుజా అపార్ట్మెంట్ కాంప్లెక్స్లోని 29వ అంతస్తులో నివసిస్తున్నాడు. ఆ అపార్ట్మెంట్ సుమారు 6,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండి, 13 అడుగుల ఎత్తు గల సీలింగ్లను కలిగి ఉంది. దాని నుండి అరేబియా సముద్రం కనిపిస్తుంది. ఆ అపార్ట్మెంట్ విలువ రూ.40 కోట్లుగా ఉంది.
రోహిత్ శర్మకు కార్లంటే చాలా ఇష్టం. అతని దగ్గర లంబోర్ఘిని ఉరస్ నుండి టెస్లా వరకు వివిధ రకాల కార్లు ఉన్నాయి. అతని వద్ద ఉన్న లంబోర్ఘిని ఉరస్ విలువ రూ.4.50 కోట్లు. దీంతో పాటు టెస్లా మోడల్ వై, టయోటా ఫార్చ్యూనర్, బీఎండబ్ల్యూ ఎం5, రేంజ్ రోవర్, మెర్సిడెస్-బెంజ్ ఎస్-క్లాస్ వంటి కార్లు కూడా ఉన్నాయి.
రోహిత్ శర్మ ప్రస్తుతం ఐపీఎల్ సిరీస్లో ఒక్కో సీజన్కు రూ.16.30 కోట్లు అందుకుంటున్నాడు. 2008 నుండి ఇప్పటి వరకు రోహిత్ శర్మ ఒక్క ఐపీఎల్ లోనే రూ.195 కోట్లు సంపాదించాడు. రోహిత్ శర్మ ప్రస్తుతం బీసీసీఐ కాంట్రాక్ట్ ప్రకారం గ్రేడ్ బిలో ఉన్నాడు. ఇక్కడ అతనికి సంవత్సరానికి రూ.3 కోట్లు లభిస్తాయి. ఇది కాకుండా, మ్యాచ్ పే కూడా ఉంటుంది. దీంతో రోహిత్ శర్మ నికర ఆస్తి విలువ రూ.233 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు.
Also REad: MI Vs SRH Match: రికెల్డన్ సెంచరీ వృథా..ముంబైని దంచికొట్టిన సన్రైజర్స్ బ్యాటర్లు..వరుసగా ఐదో విజయం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Snake Video: పామును రక్షించబోతే ప్రాణం మీదికి.. షాకింగ్ వీడియో వైరల్!
Hyderabad, Telangana:Snake Catcher Bitten During Rescue Video Watch: జనావాసాల్లోకి వచ్చే పాములను చాలామంది స్నేక్ క్యాచర్స్ ఎంతో చాకచక్యంగా పట్టుకొని వాటిని రక్షిస్తూ ఉన్నారు. అయితే ఈ సమయంలో కొంతమంది వాటి కాటు బారిన పడుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఒక పాము సురక్షిత ప్రాంతానికి తరలించేందుకు ప్రయత్నిస్తున్న వ్యక్తిపై.. అది మెరుపు వేగంతో దాడి చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. సాధారణంగా చాలామంది స్నేక్ క్యాచర్స్ నైపుణ్యంతో పాములు పట్టుకుంటారు. కానీ అప్పుడప్పుడు ఇలా వాటి కాటు బారిన పడతారు.
వైరల్ అవుతున్న వీడియో వివరాల్లోకి వెళ్తే.. ఒక నివాస ప్రాంతంలోని భారీ పాము ప్రవేశించింది.. ఆ పామును చూసిన జనం భయపడి దానిని చంపేందుకు ప్రయత్నించారు.. ఒక స్నేక్ క్యాచర్ దానిని రక్షించాలని ముందుకు వచ్చారు. ఆ వ్యక్తి పామును బంధించి సురక్షితంగా అటవీ ప్రాంతంలో విడిచి పెట్టాలని అనుకున్నాడు. అయితే ఇదే సమయంలో ఊహించని ఘటన జరిగింది.. సాధారణంగా స్నేక్ క్యాచర్స్ పాములను పట్టుకునే క్రమంలో చాలా జాగ్రత్తగా ఉంటూ ఉంటారు. అంతేకాకుండా వారు చేతులకి ప్రత్యేకమైన తొడుగులు కూడా ధరిస్తారు. కానీ ఈ వీడియోలో దీనికి భిన్నంగా ఉంది.
Also Read: King Cobra Video: స్టౌపై గిన్నెలో తిష్టవేసిన భారీ కింగ్ కోబ్రా.. వీడియో చూస్తే వణికిపోవాల్సిందే!
పాములు పట్టుకునే క్రమంలో ఆయన దాని తోక భాగాన్ని పట్టుకొని.. సురక్షితమైన ప్రదేశానికి తీసుకు వెళ్లేందుకు ప్రయత్నించాడు. అయితే, ఆ పాము ఒక్కసారిగా వెనక్కి తిరిగి మెరుపు వేగంతో ఆయన చేతి పై దాడి చేసింది. ఏమాత్రం ఊహించని విధంగా ఆ పాము వ్యక్తిని కాటేసింది. పాము పట్టులో చిక్కినప్పటికీ తన శరీరాన్ని అత్యంత వేగంగా వదిలి ఆయన చేతి పై దాడి చేయడం చూసి అక్కడ ఉన్న వారంతా భయాందోళనకు గురయ్యారు..
ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవ్వడంతో చాలామంది నిపుణులు రకరకాలుగా స్పందిస్తూ వస్తున్నారు. అంతేకాకుండా ఈ వీడియోకు కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు కూడా కామెంట్లు చేస్తూ వస్తున్నారు. పాములను రక్షించుకోవడం మంచిదే. కానీ సరైన శిక్షణ లేకుండా వాటిని పట్టుకోవడం ఆత్మహత్యతో సమానమని కొందరు చెబుతూ వస్తున్నారు. తోక పట్టుకొని లాగడం వల్ల పాము మరింత ఆగ్రహానికి గురైనట్లు ఉందని.. ఆగ్రహంతోనే అతనిపై దాడి చేసి ఉంటుందని మరికొంతమంది నిపుణులు చెబుతున్నారు..
Also Read: King Cobra Video: స్టౌపై గిన్నెలో తిష్టవేసిన భారీ కింగ్ కోబ్రా.. వీడియో చూస్తే వణికిపోవాల్సిందే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
10th Results: ఫెయిలవుతానన్న భయంతో విద్యార్థిని ఆత్మహత్య.. రిజల్ట్స్ చూస్తే ఫస్ట్ క్లాస్!
Medak, Telangana:10th Results Tragedy Telugu News: పరీక్ష ఫలితాలు ఒక జీవితాన్ని నిర్ణయించేవి కాదని పెద్దలు చెబుతూ ఉంటారు.. కానీ చాలామంది ఫలితాలను సీరియస్గా తీసుకొని క్షణికావేశంలో చేయకూడని పనులు చేసి జీవితాలనే నాశనం చేసుకుంటారు. మరికొంతమంది ముందుగానే ఫలితాలు తమకు అనుకూలంగా రావని కానరాని లోకాలకు వెళ్ళిపోతూ ఉంటారు. ఆ క్షణికావేశం ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. పరీక్షల్లో ఫెయిల్ అవుతానని అనవసర భయం ఒక విద్యార్థిని కానరాని లోకాలకు పంపించేసింది. తీరా ఫలితాలు వచ్చాక ఆమె ఫస్ట్ క్లాస్ లో ఉత్తీర్ణత సాధించిందని తెలియడంతో ఆ తల్లిదండ్రులు రోదిస్తున్నారు..
మెదక్ జిల్లా పాపన్నపేట మండలం పొడ్చన్పల్లి తండాకు చెందిన సాయి ప్రియ పదో తరగతి పరీక్షలు రాసింది. పరీక్ష రాసినప్పటి నుంచి సాయి ప్రియ ఏదో తెలియని ఆందోళనలో ఉండేదట.. తాను సరిగ్గా రాయలేదని.. ఫలితాల్లో ఫెయిల్ అవుతాను అనే భయం ఆమెను నీడలా వెంటాడింది.. కూతురు పరిస్థితిని గమనించిన తల్లిదండ్రులు ఆమెను ఓదార్చే ప్రయత్నం కూడా చేశారు.. పరీక్షలు పోతే పోయాయి.. ఫెయిల్ అయిన పర్వాలేదు. మళ్లీ రాసుకోవచ్చు అని ధైర్యం కూడా చెప్పారు..
తల్లిదండ్రులు ఎంత ధైర్యం ఇచ్చిన సాయి ప్రియ మనసులోని భయం పోలేకపోయింది. తోటి స్నేహితుల ముందు.. ముఖ్యంగా సమాజం ముందు తలవంచుకోవాల్సి వస్తుందేమోనన్న ఆందోళనతో ఆమె ఈ నెల 24న ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది.. చేతికి వచ్చిన కూతురు విగత జీవిగా పడి ఉండడం చూసి తల్లిదండ్రులు గుండెలవిసేలా విలపిస్తున్నారు..
నిన్న పదవ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి.. సాయి ప్రియ హాల్ టికెట్ నెంబర్ ద్వారా ఫలితాలను చూడగా.. అందరూ షాక్కు గురయ్యారు.. సాయి ప్రియ ఫీల్ అవ్వడం పక్కన పెడితే.. ఏకంగా 480 మార్కులు సాధించి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యింది.. ఒకవేళ ఆమె మరో నాలుగు రోజులు ఓపిక పట్టి ఉంటే.. ఆరోజు ఆ ఇంట్లో సంబరాలు జరిగేవి.. కానీ అనవసర భయం ఆమెను కానరాని లోకాలకు పంపించేసింది.. పాసైన మార్కుల షీటును చూస్తూ బిడ్డ నువ్వు పాసయ్యావు చూడు.. తిరిగి రామ అంటూ తల్లిదండ్రులు ఏడుస్తున్న తీరు తండావాసులను కన్నీరు పెట్టించింది..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Mars And Jupiter: కుజ, గురు గ్రహాల అద్భుత కలయిక.. ఈ 3 రాశుల వారు రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయ్యే ఛాన్స్!
Hyderabad, Telangana:Mars And Jupiter Conjunction Effect On Zodiac 2026: గ్రహాల మార్పుల కారణంగా కొన్ని రాశుల వారికి అదృష్టం విపరీతంగా పెరుగుతుంది. మానవ జీవితాల్లో గ్రహాలు కూడా క్రియాశీలక పాత్ర పోషిస్తాయి. ఒక వ్యక్తి జీవితంలో ఉన్నతంగా ఎదగడానికి గ్రహ స్థితులు ఆధారపడుతూ ఉంటాయి. జాతకంలో ఏవైనా శక్తివంతమైన గ్రహాలు శుభస్థానంలో ఉంటే దేనికి లోటు ఉండదు. ఆర్థికంగా కూడా అభివృద్ధి చెందుతూ ఉంటారు. అంతేకాకుండా రాత్రికి రాత్రి ధనవంతులైపోతూ ఉంటారు. వీటితోపాటు జాతకంలో కొన్ని శక్తివంతమైన శుభయోగాలు కూడా క్రియాశీలక పాత్ర పోషిస్తూ ఉంటాయి. ఇదిలా ఉంటే జూన్ నెలలో ఎన్నో శక్తివంతమైన శుభయోగాలు ఏర్పడబోతున్నాయి. ముఖ్యంగా మేషరాశిలో కుజుడు, వృషభరాశిలో బృహస్పతి సంచారం చేయబోతున్నాయి.. దీనికి కారణంగా కొన్ని రాశుల వారికి రాజయోగం పట్టబోతోంది.
జూన్ నెలలో కుజ, గురు గ్రహాల సంచారం కారణంగా కొన్ని రాశుల వారికి ఆర్థిక స్థితిగతులు ఊహించని స్థాయిలో మారే అవకాశాలున్నాయి. ముఖ్యంగా ఈ రెండు గ్రహాల కదలికల కారణంగా గజకేసరి రాజయోగంతో పాటు మరికొన్ని రాజయోగాలు ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి దీంతో వ్యాపార రంగాల్లో ఉన్న వ్యక్తులకు ఊహించని లాభాలు కలుగుతాయి. అలాగే నిలిచిపోయిన పనులు ఎంతో సులభంగా పూర్తవుతూ ఉంటాయి. సమాజంలో గౌరవ మర్యాదలు కూడా విపరీతంగా పెరుగుతాయి.
ఈ రాశులవారికి లాభాలే లాభాలు:
మేష రాశి
జూన్ నెల మేష రాశి వారికి అత్యంత అద్భుతంగా ఉండబోతున్నదని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా వీరికి కుజుడు సొంత రాశిలో ఉండడం వల్ల ధైర్యం విపరీతంగా పెరుగుతుంది. ఎలాంటి సాహసోపేతమైన పనులు చేసిన అద్భుతమైన విజయాలు సాధించగలుగుతారు. పెండింగ్లో ఉన్న పనులు సులభంగా పూర్తవుతాయి.. అలాగే ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ కూడా కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. జీతాల పెంపు కూడా విపరీతంగా ఉండబోతోంది.
వృషభ రాశి
వృషభ రాశి వారికి కూడా ఈ సమయం చాలా అద్భుతంగా ఉండబోతోంది. వీరికి ఈ సమయంలో గురు బలం రెట్టింపడం వల్ల ఆర్థిక సమస్యల నుంచి ఎంతో సులభంగా విముక్తి లభించబోతోంది. ముఖ్యంగా కొత్త పెట్టుబడులకు భారీ మొత్తంలో డబ్బులు కూడా చేకూరుతాయి. దీని కారణంగా వ్యాపార రంగాల్లో పెట్టుబడులు పెట్టి అద్భుతమైన విజయాలు సాధించి భారీ మొత్తంలో డబ్బులు పొందగలుగుతారు. అలాగే కొత్త పెట్టుబడుల నుంచి అనుకున్నంత స్థాయిలో సంపాదించగలుగుతారు. ఈ సమయంలో కుటుంబంలో శుభకార్యాలు కూడా జరుగుతాయి.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
సింహరాశి
సింహ రాశి వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉండబోతోంది. ముఖ్యంగా వీరికి రాజయోగం పట్టబోతోంది. కాబట్టి వీరు ఏ పని చేపట్టిన అద్భుతమైన విజయాలు సాధించగలుగుతారు. విదేశీ ప్రయాణాలు చేయాలనుకునే వారికి ఈ సమయం చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే ఆదాయ మార్గాలు కూడా విపరీతంగా పెరుగుతాయి.. అనుకుంటున్న పనుల్లో విశేషమైన లాభాలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ఆరోగ్యం కూడా గతంలో కంటే ఇప్పుడు మరింత మెరుగుపడి చాలా అద్భుతంగా ఉంటుంది.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Fish Side Effects: చేపలు తింటే వీళ్లకు అదే చివరిరోజు! ఈ రోగాలతో బాధపడే వాళ్లు చేపలు ముట్టుకోవద్దు!
Hyderabad, Telangana:Fish Eating Disadvantages: చేపలు శరీరానికి చాలా మంచివని వైద్యులు చెబుతుంటారు. చేపల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్లు, నాణ్యమైన ప్రొటీన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ పోషకాలు గుండె, మెదడు, చర్మం వంటి అవయవాలకు అనేక ప్రయోజనాలను చేకూరుస్తున్నాయి. అయితే, కొన్ని ఆరోగ్య సమస్యలు లేదా వైద్య పరిస్థితులు ఉన్నవారికి ఆహారం ప్రమాదకరంగా మారవచ్చు. అటువంటి పరిస్థితులలో చేపలను తినడం పూర్తిగా మానుకోవాలని లేదా జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
చేపలలో సహజంగా పాదరసం ఉండవచ్చు. సముద్రపు నీటిలోని కలుషితాలు చిన్న చేపలకు చేరి.. ఆ విధంగా పెద్ద చేపల్లో పేరుకుపోతాయి. షార్క్, స్వర్డ్ ఫిష్, కింగ్ మాకెరెల్ వంటి పెద్ద చేపలలో పాదరసం అధిక స్థాయిలో ఉంటుంది. ఈ పాదరసం శరీరంలోకి ప్రవేశిస్తే, అది కొంతమందికి తీవ్రమైన హాని కలిగించవచ్చు.
గర్భిణీ స్త్రీలు ఎందుకు జాగ్రత్తగా ఉండాలి?
గర్భధారణ సమయంలో చేపలు తినేటప్పుడు జాగ్రత్తగా ఉండటం ముఖ్యం. పాదరసం అధికంగా ఉండే చేపలను తినడం వల్ల, గర్భస్థ శిశువు మెదడు అభివృద్ధి, నాడీ వ్యవస్థపై తీవ్రమైన ప్రభావం పడుతుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం.. అధిక స్థాయిలో ఉండే పాదరసం శిశువు గ్రహణశక్తి, చలన నైపుణ్యాలు, ప్రవర్తనను ప్రభావితం చేస్తుంది. పాలిచ్చే తల్లులు కూడా పాదరసం తక్కువగా ఉండే చేపలను ఎంచుకోవాలి. సాల్మన్, రొయ్యలు, ట్యూనా స్థిరమైన సాపేక్షంగా సురక్షితమైనప్పటికీ, వాటిని అధికంగా తినకుండా ఉండటమే మంచిది.
పిల్లలకు చేపల హెచ్చరికలు అవసరం
11 ఏళ్ల లోపు పిల్లలకు చేపలు తినిపించేటప్పుడు జాగ్రత్త తీసుకోవాలి. వారి ఏడుగుతున్న నాడీ వ్యవస్థ పాదరసానికి సున్నితంగా ఉంటుంది. ఇది వారి ఆలోచనా నైపుణ్యాలు, నేర్చుకునే సామర్థ్యాలు ప్రభావం చూపుతుంది. అందువల్ల, తల్లిదండ్రులు తమ పిల్లలకు చేపలు తినిపించే ముందు సంప్రదించడం మంచిది.
అలర్జీలు ఉన్నవారు చేపలను ఎందుకు తినకూడదు?
సముద్రపు ఆహారాలు ఉన్నవారికి చేపలు చాలా ప్రమాదకరం. కొంతమంది చేపలు తిన్న వెంటనే చర్మంపై దద్దుర్లు, దురద, వాపు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలను అనుభవిస్తారు. తీవ్రమైన సందర్భాల్లో అనాఫిలాక్సిస్ అనే ప్రాణాంతక పరిస్థితి సంభవించవచ్చు. అటువంటి వాటిలో ఉన్నవారు చేపలను పూర్తిగా మానుకోవాలి. అవిసె గింజలు, చియా గింజలు, వాల్నట్ల వంటి మొక్కల ఆధారిత వనరుల నుండి ఒమేగా-3లను పొందాలి.
అలాగే ఎయిడ్స్ ఉన్నవారు, క్యాన్సర్కు కీమో థెరపీ చేయించుకుంటున్నవారు, అవయవ మార్పిడి చేయించుకున్నవారు వంటి బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ ఉన్నవారు పచ్చిగా లేదా సరిగ్గా ఉడకని చేపలను తినకూడదు. వీటిలో కనిపించే లేదా పరాన్నజీవులు తీవ్రమైన ఇన్ఫెక్షన్లకు కారణం కావచ్చు. చేపలలో అధిక స్థాయిలో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లకు రక్తాన్ని పల్చబరిచే గుణాలు ఉన్నాయి. అందువల్ల, రక్తాన్ని పల్చబరిచే మందులతో పాటు చేపలను తినడం వల్ల రక్తస్రావం అయ్యే ప్రమాదం పెరుగుతుంది. అటువంటి మందులు తీసుకుంటున్న వారు వైద్య సలహాతో మాత్రమే చేపలను తినాలి.
గౌట్ లేదా రక్తంలో అధిక యూరిక్ యాసిడ్ స్థాయిలు ఉన్నవారు, కొన్ని రకాల చేపలను తినడం వల్ల వారి శరీరంలో యూరిక్ యాసిడ్ పరిమాణం పెరుగుతుంది. ఇది కీళ్ల నొప్పులు, వాపును మరింత తీవ్రతరం చేస్తుంది. ప్లాస్టిక్ సమస్యలు ఉన్నవారు కూడా ప్యూరిన్ అధికంగా ఉండే ఆహార పదార్థాల వినియోగాన్ని పరిమితం చేసుకోవాలి. చేపలను పూర్తిగా మానుకోవలసిన వారు, ఒమేగా-3 నుండి తమ ఆహారంలో అవిసె గింజలు, చియా గింజలు, వాల్నట్లు, ఆకుకూరలను చేర్చుకోవచ్చు. చేపలు తినాలనుకునేవారు, సాల్మన్, రొయ్యలు, సార్డినెస్ వంటి పాదరసం తక్కువగా ఉండే రకాలు, బాగా ఉడికించి, వారానికి ఒకటి లేదా రెండుసార్లు తినవచ్చు.
(గమనిక: పైన పేర్కొన్న సమాచారం కేవలం కొన్ని నివేదికల ఆధారంగా రూపొందించింది. దీన్ని పాటించే ముందు సంబంధిత వైద్యుడ్ని సంప్రదించడం మేలు. దీన్ని జీ తెలుగు న్యూస్ ధ్రువీకరించడం లేదు.)
Also Read: Career Options After 10th: 10వ తరగతి తర్వాత ఏం చేయాలి? ఏ కోర్సు తీసుకుంటే కెరీర్ బాగుంటుంది?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
GT vs RCB Preview: అగ్రస్థానంపై కన్నేసిన ఆర్సీబీ టీమ్..గుజరాత్ టైటాన్స్పై మరోసారి గెలుస్తుందా? స్టార్ ఆటగాడు దూరం!
Ahmedabad, Gujarat:GT vs RCB Match Preview: ఇండియన్ ప్రీమియర్ లీగ్ వేదికగా నేడు మరో రసవత్తపోరుకు రంగం సిద్ధమైంది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరగనున్న ఈ మ్యాచ్లో ఆతిథ్య గుజరాత్ టైటాన్స్ జట్టుతో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది. ఈ మ్యాచ్లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకోవాలని ఆర్సీబీ చూస్తుండగా.. మరో విజయాన్ని తమ ఖాతాలో వేసుకోని ప్లేఆఫ్స్కు మార్గం సుగమం చేసుకోవాలని గుజరాత్ జట్టు ప్లాన్ చేస్తోంది.
ఐపీఎల్ పాయింట్ల పట్టిక ప్రకారం.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్లలో 6 గెలిచింది. +1.919 నెట్ రన్ రేట్తో టేబుల్లో రెండో స్థానంలో నిలిచింది. ఒకవేళ గుజరాత్ టైటాన్స్ మ్యాచ్లో గెలిస్తే.. ఆర్సీబీ అగ్రస్థానానికి చేరుతుంది. ఆర్సీబీ ఆడిన గత 5 మ్యాచ్లను పరిశీలిస్తే 4 విజయాలు ఉండడం విశేషం. అలాగే శుభ్మన్ గిల్ కెప్టెన్సీలోని గుజరాత్ టైటాన్స్ జట్టు ఆడిన 8 మ్యాచ్ల్లో 4 మ్యాచ్ల్లో విజయం సాధించి.. పాయింట్ల పట్టికలో -0.475 నెట్ రన్ రేట్తో 5వ స్థానంలో నిలిచింది.
ఈ మ్యాచ్ అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గురువారం అనగా ఏప్రిల్ 30న, భారత కాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు జరుగుతుంది. టాస్ రాత్రి 7 గంటలకు ఉంటుంది. ఈ మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్ లేదా జియో హాట్స్టార్ వేదికలా ప్రత్యక్ష ప్రసారం చూడవచ్చు.
ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు 7 సార్లు తలపడ్డారు. అందులో ఆర్సీబీ 4 మ్యాచ్ల్లో గెలుపొందగా.. గుజరాత్ టైటాన్స్ 3 మ్యాచ్ల్లో నెగ్గింది. దీన్ని బట్టి పరిశీలిస్తే గుజరాత్పై ఆర్సీబీ పైచేయిగా ఉంది. అయితే నేడు జరిగే మ్యాచ్లో ఏం జరుగుతుందో చూడాలి. ఈ రెండు టీమ్స్ కలిసి ఏప్రిల్ 24న బెంగళూరులోని ఎం.చిన్నస్వామి స్టేడియంలో తలపడ్డారు. ఆ మ్యాచ్లో ఆర్సీబీ 5 వికెట్ల తేడాతో గెలిచింది. జీటీ 205/3 స్కోరు చేసింది. ఇప్పుడు లీగ్ దశలో మరోసారి ఇరు జట్లు తలపడనున్నాయి.
ఆ మ్యాచ్లో సాయి సుదర్శన్ సెంచరీ సాధించగా, శుభ్మన్ గిల్ 32 పరుగులు చేశాడు. ఆర్సీబీ లక్ష్యాన్ని ఛేదించి, 206/5 స్కోరుతో ముగించింది. విరాట్ కోహ్లీ 81 పరుగులు చేయగా, దేవదత్ పడిక్కల్ 55 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్లో టోర్నీలో అత్యధిక పరుగులు రాబట్టి విరాట్ కోహ్లీ ఆరెంజ్ క్యాప్ దక్కించుకున్నాడు. అలాగే గుజరాత్ టైటాన్స్ జట్టుపై అతని సగటు 60కి పైగా ఉంది. అలాగే అత్యధిక పరుగులు సాధించిన వారిలో గుజరాత్ టైటాన్స్ తరఫున పోటీలో ఉన్నాడు.య
ఈ మ్యాచ్లోకి ముందు గాయం కారణంగా ఆర్సీబీ నుంచి ఓ ఆటగాడు వైదొలగాడు. గుజరాత్ టైటాన్స్తో జరగనున్న మ్యాచ్లో గాయం కారణంగా ఫిల్ సాల్ట్ దూరమయ్యాడు. ప్లేయింగ్ 11లో అతని స్థానంలో జకోబ్ బెథెల్ను జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. జోష్ హేజిల్వుడ్, భువనేశ్వర్ కుమార్ ఇద్దరూ అద్భుతంగా రాణిస్తున్నారు. అయితే ఈ మ్యాచ్లో రసిఖ్ సలామ్ ధార్ అందుబాటులో ఉంటాడా లేదా అనే విషయంపై ఇప్పుడు సందిగ్ధత నెలకొంది. ఈ మ్యాచ్కు ముందు గుజరాత్ టైటాన్స్ జట్టులో ఎలాంటి గాయల బెడద లేదు. కెప్టెన్ శుభ్మన్ గిల్ ఫిట్నెస్తో అందుబాటులో ఉన్నాడు. రషీద్ ఖాన్, మహ్మద్ సిరాజ్ అద్భుతంగా రాణిస్తున్నారు.
గుజరాత్ టైటాన్స్ తుదిజట్టు అంచనా..
శుభ్మన్ గిల్ (కెప్టెన్), సాయి సుదర్శన్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, జాసన్ హోల్డర్, M షారుఖ్ ఖాన్, అర్షద్ ఖాన్, రషీద్ ఖాన్, కాగిసో రబాడా, మహ్మద్ సిరాజ్, మానవ్ సుథార్, ప్రసిద్ కృష్ణ (ఇంపాక్ట్ ప్లేయర్).
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తుదిజట్టు అంచనా..
విరాట్ కోహ్లీ, జాకబ్ బెథెల్, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్ (కెప్టెన్), జితేష్ శర్మ (వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్వుడ్, రసిఖ్ సలామ్ దార్, సుయాష్ శర్మ (ఇంపాక్ట్ ప్లేయర్).
Also Read: Career Options After 10th: 10వ తరగతి తర్వాత ఏం చేయాలి? ఏ కోర్సు తీసుకుంటే కెరీర్ బాగుంటుంది?
Also Read: MI Vs SRH Match: రికెల్డన్ సెంచరీ వృథా..ముంబైని దంచికొట్టిన సన్రైజర్స్ బ్యాటర్లు..వరుసగా ఐదో విజయం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Career Options After 10th: 10వ తరగతి తర్వాత ఏం చేయాలి? ఏ కోర్సు తీసుకుంటే కెరీర్ బాగుంటుంది?
Hyderabad, Telangana:Career Options After 10th Class: ఇరు తెలుగు రాష్ట్రాల్లో పదో తరగతి ఫలితాలు వచ్చేశాయి. పదో తరగతి పూర్తైన తర్వాత ఏం చేయాలి? అని ప్రతి విద్యార్థితో పాటు వారి తల్లీదండ్రులను వెంటాడే ప్రశ్న. మనలో చాలామందికి పెద్ద పెద్ద చదువులకు ఖర్చు పెట్టే అంత స్థోమత దిగువ మధ్య తరగతి కుటుంబాలకు ఉండకపోవచ్చు. విద్యార్థుల్లో అధికంగా ఇంటర్మీడియట్ వైపు మళ్లుతుండగా.. ప్రస్తుతం అనేక సాంకైతిక, వృత్తిపరమైన కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. తక్కువ సమయంలోనే నైపుణ్యాలను పొందుతూ త్వరగా ఉద్యోగ అవకాశాలను పొందేందుకు అవకాశం ఉంది. వాటిలో ఉత్తమ ఎంపిక ఏదో తెలుసుకుందాం.
పాలిటెక్నిక్ డిప్లొమా
ఇంజనీరింగ్ కోర్సుల్లో ముందుగానే ప్రవేశించాలనుకునే వారికి పాలిటెక్నిక్ డిప్లొమా అనేది మంచి ఎంపిక. అయితే ఇది మూడేళ్ల పాటు సాగే కోర్సు. ఇందులో ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్, కంప్యూటర్ సైన్స్ వంటి బ్రాంచ్లు ఉంటాయి. ఈ పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తిచేసిన విద్యార్థులు లెటరల్ ఎంట్రీ ద్వారా సాంకేతిక డిగ్రీ కోర్సు బీటెక్లో రెండో ఏడాది నుంచి కొనసాగించే అవకాశం ఉంది.
ఐటీఐ
సాంకేతిక పనులపై ఆసక్తి ఉన్న విద్యార్థులకు ఐటీఐ కోర్సు మంచి ఎంపికగా ఉంటుంది. 1 లేదా 2 ఏళ్లలో ఎలక్ట్రీషియన్, వెల్డర్, ఫిట్టర్, ప్లంబర్, కంప్యూటర్ ఆపరేటర్, మెకానిక్ వంటి ట్రేడ్లను నేర్చుకోవచ్చు. ఐటీఐ పూర్తి చేసిన తర్వాత రైల్వేలు, ప్రైవేట్ కంపెనీలు, ఫ్యాక్టరీలు, ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ అవకాశాలు మెండుగా ఉన్నాయి. అయితే వీటి ప్రారంభ జీతం రూ.15,000 నుంచి రూ.30,000 వరకు ఉంటుంది.
డిజిటల్ మార్కెటింగ్
నేటి కంప్యూటర్ యుగంలో వేగంగా ఎదుగుతున్న రంగాల్లో డిజిటల్ మార్కెటింగ్ కూడా ఉంది. కేవలం 3 నెలల నుండి 12 నెలల్లో పూర్తి చేయగలిగిన ఈ కోర్సులో SEO, ఆన్లైన్ అడ్వర్టైజింగ్, సోషల్ మీడియా మార్కెటింగ్, కంటెంట్ ప్రమోషన్ వంటి స్కిల్స్ నేర్పిస్తారు. డిజిటల్ మార్కెటింగ్ ఉద్యోగాలతో పాటు సొంతంగా వ్యాపారం ప్రారంభించుకునే అవకాశం ఉంది. ఈ రంగంలో ప్రారంభ ఆదాయం రూ.20,000 నుండి రూ.40,000 వరకు ఉంటుంది.
పారామెడికల్ కోర్సులు
హెల్త్ సెక్టార్లో ఎదగాలి అనుకునే వారికి పారామెడికల్ కోర్సు ఓ మంచి ఎంపిక. నర్సింగ్ అసిస్టెంట్, ల్యాబ్ టెక్నీషియన్, ఎక్స్-రే టెక్నీషియన్ వంటి కోర్సులు ఇందులో ఉంటాయి. 1 లేదా 2 ఏళ్లుగా సాగే కోర్సును పూర్తి చేసిన తర్వాత క్లినిక్స్, ఆస్పత్రులు, డయాగ్నిసిస్ ల్యాబ్స్ వంటి వాటిలో ఉద్యోగాలు పొందవచ్చు. వీటిలో ప్రారంభ జీతం రూ.15,000 నుంచి రూ.25,000 వరకు ఉంటుంది.
కంప్యూటర్ హార్డ్వేర్ అండ్ నెట్వర్కింగ్
కంప్యూటర్స్, ల్యాప్టాప్ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో హార్డ్వేర్, నెట్వర్కింగ్ రంగానికి మంచి గిరాకీ ఉంది. 6 నెలల నుంచి 1 ఏడాదిలోపు ఉండే ఈ కోర్సు పూర్తి చేసిన వెంటనే.. కంప్యూటర్ సర్వీస్ సెంటర్లు, ఐటీ కంపెనీల్లో టెక్నిషియన్గా లేదా సొంత వ్యాపారాన్ని ప్రారంభించేందుకు అవకాశం ఉంది. ఆదాయం మీరు ఎంచుకున్న మార్గాన్ని బట్టి మారుతుంది.
అయితే, 10వ తరగతి తర్వాత సరైన కోర్సు ఎంపిక మీ జీవితాన్ని, దాని భవిష్యత్ను నిర్ణయిస్తుంది. మీ వ్యక్తిగత ఆసక్తి, మీకు ఉన్న నైపుణ్యాలకు అనుగుణంగా సరైన ఎంపిక చేసుకోవడం ఎంతో ముఖ్యం. ఇప్పుడు వేసే తొలి అడుగు.. మీ జీవితాంతం కొనసాగుతుంది. మంచి కెరీర్ నిర్మాణానికి మంచి రంగంలోకి ఎంపిక ఇప్పుడే అవసరం.
Also Read: MI Vs SRH Match: రికెల్డన్ సెంచరీ వృథా..ముంబైని దంచికొట్టిన సన్రైజర్స్ బ్యాటర్లు..వరుసగా ఐదో విజయం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
MI Vs SRH Match: రికెల్డన్ సెంచరీ వృథా..ముంబైని దంచికొట్టిన సన్రైజర్స్ బ్యాటర్లు..వరుసగా ఐదో విజయం!
Mumbai, Maharashtra:MI Vs SRH Match 2026: ఐపీఎల్ వేదికగా నేడు జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు గెలుపొందింది. ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ టీమ్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. హైదరాబాద్ టీమ్కు ఇది వరుసగా ఐదో విజయం కావడం విశేషం. ఈ గెలుపుతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానం నుంచి సన్రైజర్స్ మూడో స్థానానికి ఎగబాకింది. ప్రస్తుత లీగ్ ఇప్పటి వరుకు ఆడిన 9 మ్యాచ్ల్లో 6 మ్యాచ్లు గెలిచి, 3 మ్యాచ్ల్లో ఓడింది.
మరోపక్క ముంబై ఇండియన్స్ వరుస ఓటములతో సతమతమవుతుండగా..ఈ లీగ్లో ఆడిన 8 మ్యాచ్ల్లో కేవలం రెండింటిలోనే గెలవడం గమనార్హం. కేవలం 4 పాయింట్లతో టేబుల్లో 9వ స్థానంలో ముంబై కొనసాగుతోంది. 244 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆరంభంలో ఓపెనర్లు శుభారంభాన్ని ఇచ్చారు. అభిషేక్ శర్మ 45 పరుగులతో ఆకట్టుకోగా.. 30 బంతుల్లో 76 పరుగులతో ట్రావిస్ హెడ్ చెలరేగాడు.
ఆ తర్వాత వచ్చిన ఇషాన్ కిషన్ డకౌట్ అవ్వగా.. క్లాసెన్ 65 పరుగులతో విజృభించగా, నితీష్ కుమార్ రెడ్డి (21) సన్రైజర్స్ జట్టును ఆదుకున్నారు. చివరిగా వచ్చిన సలీల్ 10 బంతుల్లో 30 పరుగులు రాబట్టి చివరి షాట్తో విజయాన్ని అందించాడు. మరోవైపు ముంబై బౌలర్లలో ఘజాఫర్ 2 వికెట్లు పడగొట్టగా.. కెప్టెన్ హార్దిక్ పాండ్యా, ట్రెండ్ బౌల్ట్ చెరో వికెట్ సాధించాడు.
ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో తొలుత టాస్ గెలిచిన ఆతిథ్య జట్టు ముంబై బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 243 పరుగులను రాబట్టింది. ఓపెనర్లు అద్భుతంగా రాణించగా.. రైన్ రికెల్డన్ (123) సెంచరీ సాధించగా, అది ఇప్పుడు వృథా అయ్యింది. విల్ జాక్స్ (46) పరుగులతో ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన సూర్య కుమార్ యాదవ్ 5 పరుగులతో మరోసారి విఫలమయ్యాడు. ఆ వెంటనే క్రీజ్లోకి వచ్చిన నమన్ ధీర్ (22), హార్దిక్ పాండ్యా 31 పరుగులతో తమదైన స్టైల్లో జట్టు స్కోర్ బోర్డు పరుగులు పెట్టడంలో కృషి చేశారు. సన్రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో ప్రఫుల్ 2 వికెట్లు పడగొట్టగా.. ఇషాన్ మలింగ్, షకీబ్ హుస్సేన్, నితీష్ కుమార్ రెడ్డి చెరో వికెట్ సాధించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Govt Employees: ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు.. ఆరోగ్య పథకంపై బిగ్ అప్డేట్ ఇదే!
Baddipadaga, Telangana:Employees Health Scheme: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరో శుభవార్త ఇది. ఆరోగ్య పథకానికి సంబంధించి ప్రభుత్వంతో ఉద్యోగ సంఘాలు జరిపిన చర్చలు సఫలమయ్యాయి. ఈహెచ్ఎస్ పథకం అమలు కోసం విధివిధానాల ఖరారయ్యాయని తెలుస్తోంది. ఉద్యోగుల జేఏసీ ప్రతినిధులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చర్చలు జరిపారు. ఈ సమావేశంలో ఆరోగ్య పథకానికి సంబంధించి ఉద్యోగుల ప్రతినిధులు చర్చించి తమ అభిప్రాయాలు పంచుకున్నారు.
Also Read: Singer Mangli: యూట్యూబ్ చానళ్లపై మంగ్లీ ఫిర్యాదు! మేనేజర్ తీవ్ర ఆరోపణలు
హైదరాబాద్లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన బుధవారం ఉద్యోగుల ఆరోగ్య భద్రత పథకం అమలు అంశంపై సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తెలంగాణ గెజిటెడ్ అధికారుల సెంట్రల్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. సమావేశంలో జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు, ఇతర ప్రతినిధులు పులగం దామోదర్ రెడ్డి, చావ రవి, వంగ రవీందర్ రెడ్డి, దామోదర్ రెడ్డి, రిటైర్డ్ ఉద్యోగుల తరఫున ముజీబ్ హుస్సేన్, బి. శ్యామ్, దాస్య నాయక్, రమేష్, లక్ష్మయ్య, మహమ్మద్ అబ్దుల్లా, ఉమాదేవి పాల్గొన్నారు.
Also Read: AP Summer Camps: విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్న్యూస్.. త్వరలో 1,389 సమ్మర్ క్యాంపులు
ఈ పథకం అమలులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాన కార్యదర్శి తెలిపారు. ఆ కమిటీలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల నుంచి ఆరుగురు సభ్యులు, పెన్షనర్ల నుంచి ఇద్దరు సభ్యులు ఉంటారు. అదనంగా ప్రభుత్వ ఉద్యోగులలో ఒకరిని సీఈఓగా రాష్ట్ర ప్రభుత్వం నియమించనుంది. ఉద్యోగులు, పెన్షనర్ల బేసిక్ పే లో 1.5 శాతం మొత్తాన్ని కంట్రిబ్యూషన్గా తీసుకోవాలని ఆ మొత్తానికి సమానంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా తన వంతు వాటాగా నిధులు జమ చేస్తుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలిపారు . నగదు రహిత వైద్య సేవల కోసం అర్హత కలిగిన 515 ఆసుపత్రులను ప్రస్తుతానికి గుర్తించామని.. ఈ ఆరోగ్య పథకాన్ని పారదర్శకంగా అమలు చేయాలని నిర్ణయించారు.
పోలీస్ శాఖకు ఆరోగ్య భద్రత పథకం కింద, ఎక్సైజ్ శాఖకు సహాయత పథకం కింద ఆరోగ్య పథకాలు అమలులో ఉన్నాయి. భవిష్యత్తులో ఆ శాఖల ఉద్యోగులను కూడా ఈహెచ్ఎస్ పథకంలో చేర్చే విషయాన్ని పరిశీలిస్తుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తెలిపారు. అవసరమైన విధి విధానాలను 15 రోజులలోగా సిద్ధం చేసి.. 45 రోజులలోగా ముఖ్యమంత్రి ఈ పథకాన్ని అధికారికంగా ప్రారంభించే అవకాశం ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Riyan Parag Vape: రియాన్ పరాగ్ అరెస్ట్ తప్పదా?? ఐపీఎల్ మ్యాచ్ల్లో రాజస్థాన్ కెప్టెన్ బ్యాన్ చేస్తారా?
Hyderabad, Telangana:Riyan Parag Vape Incident: ఐపీఎల్ 2026లో నిన్న జరిగిన పంజాబ్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ సందర్భంగా కెప్టెన్ ర్యాన్ పరాగ్ ఒక చిక్కులో పడ్డాడు. డ్రెస్సింగ్ రూమ్లో అతను చేయకూడని పని చేస్తూ కెమెరాకు చిక్కాడు. దీనివల్ల అతని అరెస్టు తప్పదంటూ వార్తలు వస్తున్నాయి. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాన్ పరాగ్ పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో ఈ-సిగరెట్ వినియోగిస్తూ కెమెరాకు చిక్కడం ఇప్పుడు కలకలం సృష్టిస్తోంది. లైవ్ మ్యాచ్లో డ్రైస్సింగ్ రూమ్ నుంచి రియాన్ సిగరెట్ తాగుతున్న వీడియో క్లిప్ ఇప్పుడు అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది.
సోషల్ మీడియాలో ఆ వీడియో వైరల్ అయిన నేపథ్యంలో.. రియాన్ పరాగ్ను అరెస్ట్ చేస్తారా లేదా అనే ప్రశ్న ఇప్పుడు తలెత్తుతోంది. ఎందుకంటే, ప్రత్యక్ష ప్రసారం అవుతున్న మ్యాచ్ సమయంలో ఈ-సిగరెట్ తాగడం యువతకు ఎలాంటి సందేశాన్ని ఇస్తుంది? అనే విధంగా చర్చ జరుగుతోంది.
అయితే ఈ ఐపీఎల్ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ రియాగ్ పరాగ్ అనుకున్న స్థాయిలో రాణించడం లేదు. పంజాబ్తో జరిగిన మ్యాచ్లో లక్ష్య ఛేదన సమయంలో, 16 బంతుల్లో 29 పరుగులు చేసి ఔటయ్యాక రియాన్ పరాగ్ నేరుగా డ్రెస్సింగ్ రూమ్కు వెళ్లాడు. అలా వచ్చి రాగానే రియాన్ పరాగ్ వేపింగ్ చేయడం మొదలుపెట్టాడు. అది కాస్త కెమెరాకు చిక్కింది. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. ఇప్పుడు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. అయితే ఇదే విషయమై రియాన్ పరాగ్పై క్రిమినల్ చర్యలు తీసుకుంటారా అని బీసీసీఐ కార్యదర్శి దేవ్జిత్ సైకియాను అడిగారు. అయితే, క్రికెట్ బోర్డు ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు చెబుతున్నారు.
ఎలక్ట్రానిక్ సిగరెట్ నిషేధ చట్టం (PECA) 2019 ప్రకారం.. వేప్లు, ఇ-సిగరెట్ల తయారీ, అమ్మకం, దిగుమతి, ప్రకటనలను భారత ప్రభుత్వం నిషేధించింది. వీటిని సేవించకూడదని స్పష్టం చేసింది. ఈ చట్టాన్ని ఉల్లంఘిస్తే జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా పడుతుంది. అదేవిధంగా, నేరం రుజువైతే రియాన్ పరాగ్ కు రూ.లక్ష జరిమానాతో పాటు జైలుశిక్ష పడే అవకాశం ఉంది. అయితే ఈ ఘటన క్రికెట్ స్టేడియంలో జరగడం వల్ల భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అతడిపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
స్టేడియంలో వంటి బహిరంగ ప్రదేశాలలో ధూమపానం లేదా వేపింగ్ చేయడం నేరపూరితమైనది. రియాన్ పరాగ్పై కొన్ని మ్యాచ్ల నిషేధం విధించే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు అందరి దృష్టి బీసీసీఐ నిర్ణయంపైనే ఉంది. 2026 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్గా ఉన్న రియాన్ పరాగ్ ఇప్పటికే బ్యాటింగ్ వైఫల్యంతో బాధపడుతున్నాడు. ఇప్పుడు వేపింగ్ చేస్తూ వీడియోలో చిక్కి వైరల్ అవుతున్నాడు. పంజాబ్తో మ్యాచ్కు రియాన్ పరాగ్ ఆడిన 7 ఇన్నింగ్స్లలో కేవలం 81 మాత్రమే చేసి విమర్శలు ఎదుర్కొంటున్నాడు.
Also Read: Tamil Nadu Exit Poll: తమిళనాడులో హీరో విజయ్ సీఎం అవుతాడా? ఎగ్జిట్ పోల్స్ సర్వే ఏం చెబుతోంది?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Tamil Nadu Exit Poll: తమిళనాడులో హీరో విజయ్ సీఎం అవుతాడా? ఎగ్జిట్ పోల్స్ సర్వే ఏం చెబుతోంది?
Nagalapuram, Tamil Nadu:Tamil Nadu Exit Poll 2026: తమిళనాడు 2026 అసెంబ్లీ ఎన్నికల్లో అధికార డీఎంకే కూటమి మరోసారి అధికారం చేపట్టనుందని పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్ సర్వే వెల్లడించింది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయిలో 84 శాతంపైగా ఓటింగ్ నమోదవ్వగా.. గత 2021 ఎన్నికల కంటే 11 శాతం ఎక్కువగా ఓటింగ్ పెరిగింది. తమిళనాడు చరిత్రను పరిశీలిస్తే గత నాలుగు దశాబ్దాల్లో రాష్ట్రంలో ప్రతి ఐదేళ్లకు ప్రభుత్వం మారే సంప్రదాయం ఉంది. అయితే 2016లో మాత్రం జయలలిత నేతృత్వంలో ఏఐడీఎంకే వరుసగా రెండోసారి అధికారం చేపట్టారు. ఇప్పుడు డీఎంకే కూడా రెండోసారి అధికారం చేపట్టే అవకాశాలున్నట్టు సర్వేలో తేలింది.
అధికార డీఎంకే, ప్రతిపక్ష ఏఐడీఎంకే కూటముల మధ్య తీవ్ర పోటీ ఉన్నా డీఎంకే ఆధిపత్యం కనిపిస్తోందని సర్వేలో తేలింది. సినీ నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ రెండు కూటములకు గట్టి పోటీ ఇస్తుందని సర్వేలో వెల్లడైంది. తమిళనాడులో 234 అసెంబ్లీ స్థానాలుండగా మ్యాజిక్ ఫిగర్ 118 స్థానాలు. డీఎంకే కూటమి 125-145 స్థానాలతో అధికారం చేపట్టనుందని సర్వేలో తేలింది. ఏఐడీఎంకే 65-80 స్థానాలతో మరోసారి ప్రతిపక్షానికే పరిమితమయ్యే అవకాశాలున్నాయి. టీవీకే 18-24 స్థానాలు, ఇతరులు 2-6 స్థానాలు గెలుపొందే అవకాశాలున్నాయి.
అలాగే ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో అధికార డీఎంకే కూటమి 38.4 శాతం, ఏఐడీఎంకే 31.5 శాతం, టీవీకే 23.6 శాతం, ఇతరులు 6.5 శాతం ఓట్లు పొందే అవకాశాలున్నట్లు పీపుల్స్ సర్వే చెబుతోంది. ఎన్నికల సర్వేలో 3 శాతం ప్లస్ ఆర్ మైనస్ ఉండే అవకాశం ఉందని తెలిపింది.
మహిళలు డీఎంకేకు 37.8 శాతం, ఏఐడీఎంకేకు 30.2 శాతం, టీవీకేకు 26 శాతం, ఇతరులకు 6 శాతం మద్దతివ్వగా... పురుషులు డీఎంకేకు 39.5 శాతం, ఏఐడీఎంకేకు 32.6 శాతం, టీవీకేకు 21.1 శాతం, ఇతరులకు 6.8 శాతం మద్దతిచ్చినట్లు తేలింది. అలాగే రాష్ట్రంలోని యువ ఓటర్లు అనగా 18 నుండి 24 ఏళ్ల మధ్య నూతన యువ ఓటర్లలో డీఎంకేకు 34.9 శాతం, ఏఐడీఎంకు 25.8 శాతం, టీవీకేకు 32.3 శాతం, ఇతరులకు 7 శాతం మద్దతిచ్చినట్టు సర్వేలో తేలింది. సినీ నటడు విజయ్ యువ ఓటర్లపై భారీ ఆశలు పెట్టుకున్నా అధికార డీఎంకే వైపు యువత మొగ్గు చూపినట్టు సర్వేలో వెల్లడైంది.
డీఎంకే, ఏఐడీఎంకే ప్రత్యక్షంగా పోటీ పడకుండా వారి మిత్రపక్షాలు పోటీ పడిన స్థానాల్లో టీవీకే గట్టి పోటీ ఇచ్చిందని సర్వేలో తేలింది. ప్రధాన అభ్యర్థుల స్థానాలను పరిశీలిస్తే డీఎంకే అధినేత ముఖ్యమంత్రి స్టాలిన్ కొలతూరులో, ఏఐడీఎంకే అధినేత మాజీ ముఖ్యమంత్రి పళని స్వామి ఎడప్పాడిలో విజయం దిశగా కొనసాగుతారని పీపుల్స్ సర్వే చెప్పింది. మరో ఏఐడీఎంకే మాజీ సీఎం పన్నీరు సెల్వం ఎన్నికల ముందు డీఎంకేలో చేరి బోడినాయకనూర్ నుండి పోటీ చేస్తుండగా అక్కడ టీవీకే నుండి గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు.
సినీ నటుడు టీవీకే అధినేత విజయ్ రెండు స్థానాల్లో పోటీ చేస్తుండగా పెరంబూర్ నుండి గెలిచే అవకాశాలుండగా, ఈస్ట్ తిరుచిరాపల్లిలో వెనకబడినట్టు సర్వేలో తేలింది. అలాగే డిప్యూటీ సీఎం, ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్ చపాక్ నుండి పోటీ పడుతుండగా ఆయన అక్కడ టీవీకే పార్టీ నుండి గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు.
శ్రీపెరంబదూర్ నుండి పోటీలో ఉన్న కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు సెల్వ అక్కడ టీవీకే చేతిలో వెనుకబడినట్టు సర్వేలో తేలింది. తెలంగాణ మాజీ గవర్నర్ తమిళ సై సౌందరరాజన్ మైలాపూర్లో బీజేపీ తరఫున పోటీ పడుతుండగా ఆమె టీవీకే చేతిలో ఓడిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.
తమిళనాడు బీజేపీ చీఫ్ నయనార్ నాగేందర్ పోటీ పడుతున్న సత్తూరులో ఆయన గెలిచే అవకాశాలున్నట్టు సర్వేలో తేలింది. సినీ నటుడు దివంగత విజయ్కాంత్ సతీమణి, డీఎండీకే చీఫ్ ప్రేమలత గతంలో విజయ్కాంత్ గెలిచిన విరుదాచలం నుండి పోటీ పడుతుండగా ఆమె మూడో స్థానానికే పరిమితమయ్యే అవకాశాలున్నాయి.
తమిళ రాజకీయాల్లో వృద్ధ నేత. కరుణానిధి సన్నితులైన 86 ఏళ్ల దురై మురుగన్ డీఎంకే తరఫున కాట్పాడి నుండి పోటీ పడుతుండగా ఆయన ఇప్పుడు పదకొండవ సారి గెలిచే అవకాశాలున్నాయి. ఏఐడీఎంకే మిత్రపక్షం పీఎంకే చీఫ్ అన్బమణి రాందాస్ సతీమణి సౌమ్య అన్బమణి రాందాస్ ధర్మపురి నుండి పోటీ చేస్తుండగా ఆమె టీవీకే నుండి గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు.
డీఎంకే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు టీవీకే, ఏఐడీఎంకే మధ్య చీలిపోతున్నాయి. టీవీకే, పీఎమ్కే (ఆర్), శశికళ కూటమితో ఏఐడీఎంకే నష్టపోతోందని సర్వే తెలియజేస్తోంది. ముఖ్యంగా ఏఐడీఎంకే ట్రెడిషనల్ ఓటు బ్యాంకు అయిన తేవర్ శశికళ కూటమి, ఓపీఎస్ వల్ల, వన్నియార్ ఓటు పీఎమ్కే (ఆర్) పార్టీ వల్ల నష్టపోతుంది. తద్వారా గ్రాస్ రూట్లో ఏఐడీఎంకే చాలా స్థానాల్లో దెబ్బతింది.
ఎస్సీ యూత్ టీవీకే ఆకర్షించగా, వీసీకే మద్దతుతో డీఎమ్కే తన ఎస్సీ ఓటు బ్యాంకు పదిలపరుకుంటుంది. విజయ్ వల్ల డీఎంకే కొంత క్రిస్టియన్ ఓట్లు కోల్పోపోతున్నప్పటికీ, ముస్లింలు డీఎంకే వైపే మొగ్గు చూపారు. డీఎంకే ప్రభుత్వ పథకాలతో మహిళలు ఆ కూటమి వైపు మొగ్గు చూపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Komatireddy On Kavitha: కవితపై కోమటిరెడ్డి రాజగోపాల్ కామెంట్స్.."కేసీఆర్ను అలా అనడం బాధేసింది!"
Hyderabad, Telangana:Komatireddy Comments On Kavitha: మాజీ ఎమ్మెల్సీ కవిత కొత్తగా టీఆర్ఎస్ పార్టీ పెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ పార్టీ ప్రకటనతో పాటు పార్టీ ఆవిర్భావ సభలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్పై కవిత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పందించారు. కేసీఆర్పై అలాంటి విమర్శలు చేయడం బాధించిందని ఆయన స్పష్టం చేశారు.Exit Poll Results 2026: హీరో విజయ్ సీఎం అవుతాడా? పశ్చిమబెంగాల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందా? 2026 అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్..
Hyderabad, Telangana:Exit Poll Results 2026 Updates: దేశంలో ఇటీవలే ప్రారంభమైన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ నేటితో ప్రశాంతంగా ముగిసింది. మే 4వ తేదీన వెలువడనున్న అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కోసం యావత్ భారత్ ఎదురుచూస్తోంది. అయితే ఏ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారం చేజెక్కిచ్చుకోబోతుందనే అంశంలో ఎగ్జిట్ పోల్ సర్వే వచ్చేసింది.
బీజేపీకి 'బెంగ'ల్ తప్పదా?
| పార్టీ | తృణమూల్ (TMC) | ఎన్డీఏ (NDA) | కాంగ్రెస్ (INC) | సీపీఎం (CPM) | ఇతరులు |
| సీట్లు | 170 - 190 | 120 - 130 | 1 - 4 | 0 - 2 | 1 - 5 |
ఈ సర్వే ప్రకారం భారతీయ జనతా పార్టీ ఎంతో ఆశలు పెట్టుకున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్ను పరిశీలిస్తే.. బీజేపీ నేతృత్వంలోని ఎన్టీఏ (NDA) కూటమికి మరోసారి పరాభవం తప్పదని అంచనా వేస్తున్నారు. సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీ మరోసారి అధికారం చేపట్టబోతోందని సర్వే చెబుతోంది. అధికార టీఎంసీ పార్టీ 170 నుంచి 190 స్థానాల్లో విజయం సాధించే అవకాశం కనిపిస్తోంది.
అలాగే ఎన్డీఏ కూటమికి 120 -130 స్థానాలు.. కాంగ్రెస్ (INC)కు 1-4 సీట్లు.. సీపీఎం (CPM) పార్టీకి 0-2 స్థానాలతో పాటు ఇతరులు 1-5 సీట్లలో గెలిచే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్ సర్వే చెబుతోంది. అయితే పశ్చిమ బెంగాల్లోని 294 అసెంబ్లీ ఎన్నికల స్థానాలకు గానూ మ్యాజిక్ మార్క్ 148 స్థానాల్లో గెలుపొందిన వారే అధికారం చేపట్టే అవకాశం ఉంది. దీంతో సర్వే ప్రకారం పశ్చిమ బెంగాల్లో మరోసారి దీదీ అధికారం చేపట్టబోతోందని అంచనాలు వెల్లడిస్తున్నాయి. మమతా బెనర్జీ వరుసగా నాలుగో సారి అధికారం చేపట్టి రికార్డు నెలకొల్పే అవకాశం ఉంది.
కేరళలో మారనున్న అధికారం..
| పార్టీ | కాంగ్రెస్ (UDF) | ఎల్డీఎఫ్ (LDF) | బీజేపీ (BJP) | ఇతరులు |
| సీట్లు | 76 - 81 | 61 - 66 | 3 - 4 | 0 - 1 |
కేరళ విషయానికొస్తే ఎగ్జిట్ పోల్స్ ప్రకారం కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యూడీఎఫ్ (UDF) కూటమి.. అధికారం చలాంచి దిశగా వెళుతుందని సర్వేలు చెబుతున్నాయి. కాంగ్రెస్ యూడీఎఫ్ కూటమికి 76 - 81 స్థానాల్లో గెలుపొందుతుందని.. అలాగే సీఎం పినరయి విజయ్ పార్టీ ఎల్డీఎఫ్ (LDF) పార్టీకి 61 - 66 సీట్లు.. భారతీయ జనతా పార్టీకి 3 నుంచి 4 సీట్లు.. ఇతరులు సున్నా లేదా ఒక అసెంబ్లీ స్థానాల్లో నెగ్గే అవకాశం కనిపిస్తోంది.
ఏప్రిల్ 23న జరిగిన ఎన్నికల్లో 140 అసెంబ్లీ స్థానాలకు గాను 74% పైగా ఓటింగ్ నమోదయింది. మ్యాజిక్ ఫిగర్ 71 స్థానాలు చేరుకున్నవారు అధికారం చేపట్టనున్నారు. ఈ సర్వే ప్రకారం కాంగ్రెస్ నేతృత్వంలోని (UDF) గెలుపు ఖాయమని.. పినరయ్ విజయన్ సీఎం స్థానం నుంచి తప్పుకోక తప్పదని సర్వేలు చెబుతున్నాయి.
మరోసారి ఎన్డీఏ..
| పార్టీ | కాంగ్రెస్ + | ఎన్డీఏ (NDA) | ఇతరులు |
| సీట్లు | 40 - 46 | 84 - 90 | 2 - 3 |
అస్సాం రాజకీయాల విషయానికొస్తే అధికార బీజేపీ ఎన్డీఏ కూటమి అలాగే కాంగ్రెస్ నాయకత్వంలోని మహాజోత్ కూటమి మధ్య తీవ్ర ఉత్కంఠపోరు నెలకొంది. బీజేపీ తరఫున సీఎం హిమంత విశ్వ శర్మ దూకుడుగా ప్రచారం చేశారు. అస్సాంలో 126 అసెంబ్లీ స్థానాలకు జరిగిన పోటీల్లో అధికార ఎన్డీఏ కూటమి మరోసారి అధికారం చేపట్టబోతోందని సర్వే చెబుతోంది. బీజేపీ కూటమికి 46 శాతం ఓట్లతో 84 - 90 స్థానాల్లో గెలుపు ఖాయంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ కూటమికి 42 శాతం ఓట్లతో 40 - 46 స్థానాలు.. ఇతరులు 2 -3 స్థానాల్లో నెగ్గే అవకాశం ఉంది.
తమినాడులో వాళ్లదే అధికారం..
| పార్టీ | డీఎంకే (DMK) | అన్నాడీఎంకే (AIADMK) | టీవీకే (TVK) |
| సీట్లు | 130 - 141 | 84 - 90 | 4 - 8 |
ఈసారి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు మరింత ఆసక్తికరంగా సాగాయి. గత ఎన్నికల్లో ద్విముఖ పోరుగా ఉన్న అసెంబ్లీ ఎన్నికలు.. హీరో విజయ్ రాకతో త్రిముఖ పోరుగా మారాయి. సీఎం స్టాలిన్ నాయకత్వంలో అధికార ద్రవిడ మున్నేట్ర కజగం (DMK) పార్టీ ప్రచారంలో దూసుకుపోయింది. అయితే పళని స్వామి నాయకత్వంలోని అన్నా డీఎంకే (AIADMK) మాత్రం కొంత వెనుకబడిందని వార్తలు వినిపిస్తున్నాయి. తమిళనాట అధికారమే లక్ష్యంగా బరిలో దిగిన హీరో విజయ్ తమిళ వెట్రి కజగం (TVK) పార్టీ ప్రభావం చూపలేకపోయింది.
ఏప్రిల్ 23న జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎలక్షన్స్ లో 234 అసెంబ్లీ స్థానాలకు 80 శాతానికి పైగా ఓటింగ్ నమోదయింది. అయితే తమిళనాడు ఎన్నికల చరిత్రలో ఇదే అత్యధిక ఓటింగ్ కావడం విశేషం. ఎగ్జిట్ పోల్ సర్వే ప్రకారం తమిళనాడు రాష్ట్రంలో మరొకసారి అధికార డీఎంకే పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుందని అంచనా వేస్తున్నారు. ఈ పార్టీకి 130 - 141 స్థానాల్లో గెలుపొందే అవకాశం కనిపిస్తోంది. అలాగే అన్నా డీఎంకే పార్టీకి 84 - 90 స్థానాలు.. విజయ్ టీవీకే పార్టీకి 4 - 8 స్థానాలు రావొచ్చని అంచనాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో 234 అసెంబ్లీ స్థానాలకు గానూ మ్యాజిక్ మార్క్ 118 స్థానాల్లో గెలుపొందిన పార్టీ అధికారం చేపడుతోంది.
పుదుచ్చేరి బీజేపీదే?!
| పార్టీ | ఎన్డీఏ (NDA) | కాంగ్రెస్ (SPA) | టీవీకే (TVK) |
| సీట్లు | 17 - 19 | 11 - 12 | 1 - 2 |
అదేవిధంగా పుదుచ్చేరి అసెంబ్లీ ఎలక్షన్స్ లో మొత్తం 30 స్థానాలకు గాను భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ ఎక్కువ 17 నుంచి 19 స్థానాల్లో గెలుపొందే అవకాశం కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని కూటమికి 11 నుంచి 12 స్థానాలు.. అలాగే సినీ నటుడు విజయ స్థాపించిన టీవీకే పార్టీకి 1 - 2 స్థానాల్లో విజయం సాధించే అవకాశం కనిపిస్తోంది. పుదుచ్చేరిలో ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తుందని అంచనా.
మొత్తంగా హైదరాబాద్లోని ఎస్ఏఎస్ గ్రూపు చెందిన ఐఐటిఎస్ గ్రూప్ విడుదల చేసిన ఎగ్జిట్ పోల్ అసెంబ్లీ ఎలక్షన్స్ 2026లో జరిగిన ఐదు రాష్ట్రాల్లో ఫలితాలు ఇలా రాబోతున్నాయని అంచనా వేయడం జరిగింది. ఒక మాటలో చెప్పాలంటే కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఏఫ్ (UDF), అస్సాంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ (NDA), తమిళనాడులో అధికార డీఎంకే (DMK), వెస్ట్ బెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ (TMC), పుదుచ్చేరిలో ఎన్డీఏ (NDA) కూటమి విజయకేతనం ఎగురవేసే అవకాశం కనిపిస్తుంది.
(గమనిక: పైన పేర్కొన్న ఎగ్జిట్ పోల్స్ సమాచారం కేవలం అంచనా మాత్రమే. కొన్నిసార్లు ఇందుకు భిన్నంగా కూడా ఫలితాలు రావొచ్చు లేదా దీనికి అనుగుణంగా వెలువడొచ్చు. కానీ, దీన్నే అంతిమంగా ఖరారు చేసుకోరాదు.)
Also Read: Vande Bharat Derail: వందేభారత్ రైలుకు తృటిలో తప్పిన ప్రమాదం..పట్టాలు తప్పిన రన్నింగ్ ట్రైన్..అంతలోనే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
