icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

LSG vs DC Highlights: లక్నోకు ఘోర ఓటమి.. ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన ఢిల్లీ క్యాపిటల్స్‌

Lucknow, Uttar Pradesh:

IPL 2026 LSG vs DC Highlights: ఐపీఎల్‌ 2026లో అతి తక్కువ స్కోర్‌ నమోదైన మ్యాచ్‌లో పోరాడలేక లక్నో సూపర్‌ జియాంట్స్‌ చేతులెత్తెయగా.. అద్భుత ప్రదర్శన కనబర్చిన ఢిల్లీ క్యాపిటల్స్‌ ఆల్‌రౌండ్‌ ప్రదర్శన చేసి తొలి విజయాన్ని అందుకుంది. 17 బంతులు మిగిలుండగానే 6 వికెట్ల తేడాతో ఢిల్లీ మ్యాచ్‌ను సొంతం చేసుకోగా.. బ్యాటింగ్‌లో.. బౌలింగ్‌లో విఫలమైన లక్నోకు తీవ్ర నిరాశ ఎదురైంది. ఈ ఐపీఎల్‌లో అతి తక్కువ స్కోర్‌ మ్యాచ్‌ ఇదే కావడం విశేషం.

Also Read: Tirumala: తిరుమల భక్తులకు భారీ శుభవార్త.. అలిపిరిలో పులి భయం అక్కర్లేదు

లక్నో వేదికగా జరిగిన మ్యాచ్‌లో టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లక్నో సూపర్‌ జియాంట్స్‌ 18.4 ఓవర్లకే కుప్పకూలి 141 పరుగులు చేసింది. టాపార్డర్‌, మిడిలార్డర్‌ కుప్పకూలిపోవడంతో ఏ ఒక్క బ్యాటర్‌ అర్థ సెంచరీ నమోదు చేయలేదు. ఈ సమయంలో అబ్దుల్‌ సమద్‌, మిచెల్‌ మార్ష్‌ తలా 35 పరుగులు సాధించి పర్వాలేదనిపించారు. కెప్టెన్‌ రిషబ్‌ పంత్‌ 7 పరుగులకే ఔటవగా.. మార్‌క్రమ్‌ 11 పరుగులు చేసి నిరాశపర్చాడు. ఆయుశ్‌ బదౌనీ డకౌట్‌ కాగా.. నికోలస్‌ పూరన్‌ 8 పరుగులు చేశాడు. చౌదరి (14), షమీ (1), నోర్ట్జే, మోహిసిన్‌ ఖాన్‌ డకౌట్‌ అయ్యారు. ఢిల్లీ బౌలర్లు అద్భుతంగా బంతులు వేసి లక్నో బ్యాటర్లను ఏమాత్రం స్కోర్‌ చేయకుండా కట్టడి చేశారు. ఎంగిడి, నటరాజన్‌ నిప్పులు చెరిగేలా బంతులు వేసి మూడేసి వికెట్లు తీశారు. నటరాజన్‌ రెండు వికెట్లు తీయగా.. అక్షర్‌ పటేల్‌ ఒక వికెట్‌ పడగొట్టాడు.

ఛేదనకు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌ 17.1 ఓవర్‌లలో 4 వికెట్లు కోల్పోయి 145 సాధించింది. ఢిల్లీ జట్టు కూడా ఆరంభంలో తీవ్ర ఒత్తిడికి లోనయ్యింది. సీనియర్‌ ఆటగాడు కేఎల్‌ రాహుల్ గోల్డెన్ డకౌట్‌ కాగా.. నిస్సాంక ఒక్క పరుగుకే ఔటయ్యాడు. టాప్‌ ఓపెనర్లు ఔటయిన వేళ గ్రౌండ్‌లో నిలబడదామనుకున్న నితీశ్‌ రానా 15 పరుగులకే వెనుదిరిగాడు. ఈ సమయంలో గ్రౌండ్‌లోకి దిగిన సమీర్‌ రిజ్వీ అద్భుతంగా ఆడి 70 పరుగుల భారీ స్కోర్‌తో జట్టుకు విజయాన్ని అందించాడు. అక్షర్‌ పటేల్‌ గోల్డెన్‌ డకౌట్‌ అయినా కూడా త్రిస్టన్‌ స్టబ్స్‌తో కలిసి సమీర్‌ రిజ్వీ చక్కటి భాగస్వామ్యం నెలకొల్పి స్కోర్‌ బోర్డును పరిగెత్తించాడు. 47 బంతుల్లో 70 పరుగులు చేసిన రిజ్వీ.. 5 ఫోర్లు, 4 సిక్సర్లు బాదాడు. 32 బంతుల్లో 39 పరుగులు చేసిన త్రిస్టన్‌ 3 ఫోర్లు, ఒక సిక్సర్‌ నమోదు చేశాడు. బౌలింగ్‌లో లక్నో ఆరంభంలో అదరగొట్టినా ఆఖరు వరకు కసి కొనసాగించలేకపోవడంతో మ్యాచ్‌ చేజారింది. ప్రిన్స్‌ యాదవ్‌, షమీ మినహా మిగతా బౌలర్లు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report

Wholesale Second Hand Market: రేంజ్ రోవర్ రూ.18 లక్షలు.. క్రెటా రూ. 6 లక్షలే. హైదరాబాద్, ఢిల్లీ మార్కెట్‌లో కళ్లు చెదిరే ధరలు..!!

BBhoomi6h ago
Lakshmapur, Telangana:

Wholesale Second Hand Market: సాధారణంగా షోరూమ్‌లో లగ్జరీ కార్ల ధరలు ఆకాశాన్ని తాకుతుంటాయి. కానీ సెకండ్ హ్యాండ్ మార్కెట్‌లో ఇవే కార్లు నమ్మశక్యం కాని ధరలకు లభిస్తున్నాయి. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలోని కరోల్ బాగ్ మార్కెట్ సెకండ్ హ్యాండ్ వాహనాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది. ఇక్కడ లగ్జరీ కార్లు, సూపర్‌బైక్‌లు హోల్‌సేల్ రేట్లకే దొరుకుతుండటంతో దేశవ్యాప్తంగా ఉన్న కారు ప్రేమికులు ఇక్కడికి క్యూ కడుతున్నారు.

ప్రముఖ ఆటోమొబైల్ వ్లాగర్స్, మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం, కరోల్ బాగ్‌లో కార్ల ధరలు ఇలా ఉన్నాయి:

మెర్సిడెస్ CLA (Mercedes CLA): దీని ధర సుమారు రూ. 12 లక్షల (₹1.2 మిలియన్లు) నుంచే ప్రారంభమవుతోంది.

రేంజ్ రోవర్ ఎవోక్ (Range Rover Evoque): కేవలం రూ. 18 లక్షలకే (₹1.8 మిలియన్లు) ఈ లగ్జరీ ఎస్‌యూవీని సొంతం చేసుకోవచ్చు.

జాగ్వార్ F-పేస్ (Jaguar F-Pace): దీని ధర దాదాపు రూ. 23 లక్షల వరకు పలుకుతోంది.

ఫోర్డ్ ఎండీవర్ (Ford Endeavour): ఆఫ్‌రోడ్ ప్రియుల ఫేవరెట్ అయిన ఈ కారు రూ. 18 లక్షల నుంచి లభిస్తోంది.

హ్యుందాయ్ క్రెటా (Hyundai Creta): పాపులర్ ఎస్‌యూవీ క్రెటా ఇక్కడ కేవలం రూ. 6.75 లక్షల నుంచే అందుబాటులో ఉంది.

ఢిల్లీలో కేవలం కరోల్ బాగ్ మాత్రమే కాకుండా సరోజినీ నగర్, లజపత్ నగర్, వికాస్‌పురి,  మోతీ నగర్ వంటి ప్రాంతాలు కూడా సెకండ్ హ్యాండ్ కార్లకు ప్రధాన హబ్‌లుగా ఉన్నాయి.

హైదరాబాద్ మార్కెట్‌లోనూ సందడి!
కేవలం ఢిల్లీలోనే కాదు, మన హైదరాబాద్‌లో కూడా సెకండ్ హ్యాండ్ కార్ల మార్కెట్ భారీగా విస్తరించింది. నగరంలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ పరిసరాల్లో లగ్జరీ కార్ల రీసేల్ షోరూమ్‌లు ఎక్కువగా ఉన్నాయి. అలాగే కూకట్‌పల్లి, ఎల్బీనగర్,  ఉప్పల్ ప్రాంతాల్లోని మల్టీ-బ్రాండ్ యూజ్డ్ కార్ స్టోర్లలో క్రెటా, ఫార్చ్యూనర్ వంటి వాహనాలు రీజనబుల్ ధరలకే లభిస్తున్నాయి. ఢిల్లీతో పోలిస్తే ఇక్కడ ధరలు కొంచెం అటు ఇటుగా ఉన్నప్పటికీ, లోకల్ రిజిస్ట్రేషన్ (TS/AP) ఉండటం వల్ల రీ-రిజిస్ట్రేషన్ తలనొప్పులు ఉండవు.

Also Read: Gold- Silver ETF:  బంగారం, వెండి ఇన్వెస్టర్లకు సెబీ షాక్.. నేటి నుంచి గోల్డ్, సిల్వర్ ఈటీఎఫ్‌లో కొత్త రూల్స్..!!  

సెకండ్ హ్యాండ్ కారు కొనే ముందు ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
తక్కువ ధరకు వస్తుంది కదా అని తొందరపడి కారు కొంటే భవిష్యత్తులో ఇబ్బందులు పడే అవకాశం ఉంది. అందుకే కొనుగోలు చేసే ముందు ఈ క్రింది విషయాలను గుర్తుంచుకోండి:

డాక్యుమెంట్ వెరిఫికేషన్: వాహనానికి సంబంధించిన ఆర్‌సి (RC), ఇన్సూరెన్స్,  పొల్యూషన్ సర్టిఫికేట్‌లను క్షుణ్ణంగా తనిఖీ చేయండి. ఆర్‌సి బదిలీలో ఎటువంటి చట్టపరమైన చిక్కులు లేకుండా చూసుకోవాలి.

మెకానికల్ చెకప్: కారు ఇంజిన్ కండిషన్, యాక్సిడెంట్ హిస్టరీ, కిలోమీటర్ల రీడింగ్‌ను నమ్మకమైన మెకానిక్‌తో చూపించడం మంచిది.

సర్వీస్ రికార్డ్స్: కారుకు కంపెనీ సర్వీస్ సెంటర్‌లో రెగ్యులర్ సర్వీసింగ్ జరిగిందో లేదో రికార్డుల ద్వారా తెలుసుకోండి.

టెస్ట్ డ్రైవ్: కారును కనీసం 5-10 కిలోమీటర్లు నడిపి చూడండి. దీనివల్ల సస్పెన్షన్, గేర్ బాక్స్,  ఏసీ పనితీరుపై అవగాహన వస్తుంది.

తక్కువ ధరలో మంచి కారు దొరకడం అదృష్టమే, కానీ సరైన సమాచారం లేకుండా కొంటే మోసపోయే ప్రమాదం ఉంది. అందుకే పూర్తి వివరాలు తెలుసుకున్నాకే డీల్ కుదుర్చుకోండి.

Also Read: IndiGo New CEO: ఇండిగో కొత్త బాస్‌గా విలియం వాల్ష్.. ఎవరీయన? రాకతోనే రాకెట్లలా దూసుకెళ్తున్న షేర్లు..!!  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

 

0
0
Report

Tirumala: తిరుమల భక్తులకు భారీ శుభవార్త.. అలిపిరిలో పులి భయం అక్కర్లేదు

Tirupati Urban, Andhra Pradesh:

Alipiri Foot Path: తిరుమల వెళ్లే భక్తుల భద్రతే ధ్యేయంగా టీటీడీ అటవీ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. వేసవి కాలంలో తిరుమలకు భక్తుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో, అడవి జంతువుల నుంచి యాత్రికులను రక్షించేందుకు అత్యాధునిక సాంకేతికతను రంగంలోకి దించింది. మొదటి ఘాట్ రోడ్, నడకదారుల్లో చిరుతలు, ఎలుగుబంట్ల కదలికలను కనిపెట్టేందుకు డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. దీంతో అటవీ జంతువుల నుంచి రక్షణ లభిస్తుంది.

Also Read: YS Sharmila: ఆత్మగౌరవాన్ని మోదీ కాళ్ల దగ్గర తాకట్టు పెట్టిన ఏపీ ఎంపీలు: వైఎస్‌ షర్మిల

కలియుగ వైకుంఠం తిరుమలకు వేసవి సెలవుల దృష్ట్యా భక్తుల తాకిడి విపరీతంగా పెరిగింది. కాలినడకన వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. అయితే అటవీ ప్రాంతం కావడంతో నడకదారిలో చిరుత పులులు, ఎలుగుబంట్లు, ఏనుగుల సంచారం భక్తులను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. మొదటి ఘాట్ రోడ్డులోని అటవీ ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాలను వినియోగిస్తున్నారు. రాత్రి సమయాల్లో కూడా జంతువుల జాడను స్పష్టంగా గుర్తించేందుకు నైట్ విజన్ కెమెరాలతో కూడిన డ్రోన్లను ఉపయోగిస్తున్నారు. ప్రతి రోజూ రాత్రి 7 గంటల నుంచి 11 గంటల వరకు ఈ డ్రోన్ల ద్వారా నిరంతర మానిటరింగ్ కొనసాగుతుంది.

Also Read: Liquor Shops: రేపు హైదరాబాద్‌లో 24 గంటలు వైన్‌షాపులు, బార్లు బంద్‌

అలిపిరి నడకదారి సమీపంలో క్రూర మృగాల కదలికలు కనిపిస్తే.. వెంటనే క్షేత్రస్థాయి సిబ్బందిని అప్రమత్తం చేసి భక్తులకు ఎలాంటి హాని జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. గతంలో జరిగిన కొన్ని ఘటనలను దృష్టిలో ఉంచుకుని టీటీడీ, అటవీ శాఖ సమన్వయంతో తీసుకుంటున్న ఈ డ్రోన్ నిఘా చర్యలపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భయం లేకుండా గోవిందుడిని దర్శించుకునేలా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

Also Read: Liquor Income:లిక్కర్‌తో తెలంగాణ ఖజానా గలగల.. ఏడాదిలో వచ్చిన ఆదాయం ఎంతంటే?

తిరుమలలో ప్రముఖులు
తిరుమల వేంకటేశ్వర స్వామిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు ఉదయం విరామ సమయంలో తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల  కుటుంబసమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికి.. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదాశీర్వచనం అందించి స్వామి తీర్థప్రసాదాలను అందజేశారు. తెలంగాణలోని బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, అశ్వారావుపేట ఎమ్మెల్యే ఆదినారాయణ దర్శించుకున్నారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహారెడ్డి తన పిల్లలతో కలిసి తిరుమలను సందర్శించారు. కన్నడ సీనియర్ నటి తార  శ్రీవారి మొక్కును చెల్లించుకున్నారు. ప్రముఖ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి, నిర్మాత అచ్చిరెడ్డి  కలిసి వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report
Advertisement

YS Sharmila: ఆత్మగౌరవాన్ని మోదీ కాళ్ల దగ్గర తాకట్టు పెట్టిన ఏపీ ఎంపీలు: వైఎస్‌ షర్మిల

Nuzendla, Andhra Pradesh:

Amaravati Capital Bill: విభజన హామీలు, ప్రత్యేక హోదాపై, పార్లమెంట్ వేదికగా ఒక్క ఆంధ్రప్రదేశ్‌ ఎంపీ నోరు విప్పలేదని ఏపీ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. విభజన హామీలపై వారికి చిత్తశుద్ధి లేకపోవడం సిగ్గుచేటు అని మండిపడ్డారు. ప్రత్యేక హోదా అంశంపై ఒక్కరూ కూడా ప్రశ్నించలేకపోయారని దుయ్యబట్టారు. తెలుగు వారి ఆత్మగౌరవం, ఆత్మాభిమానం, పౌరుషాన్ని మోదీ కాళ్ల దగ్గర తాకట్టు పెట్టారని వైఎస్‌ షర్మిల విమర్శించారు.

Also Read: Liquor Shops: రేపు హైదరాబాద్‌లో 24 గంటలు వైన్‌షాపులు, బార్లు బంద్‌

ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్దత కల్పిస్తూ లోక్‌సభలో బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంగా జరిగిన చర్చపై వైఎస్‌ షర్మిల ఎక్స్‌ వేదికగా స్పందించారు. 'విభజన హామీలు, ప్రత్యేక హోదాపై, పార్లమెంట్ వేదికగా కాంగ్రెస్ పార్టీ గళం వినిపించిన ఎంపీ మాణిక్కం ఠాగూర్‌కి ఆంధ్రప్రదేశ్ ప్రజల పక్షాన కృతజ్ఞతలు. కాంగ్రెస్ పార్టీ ఏపీ వ్యవహారాల ఇంచార్జిగా ఉన్నందుకు విభజన హామీలపై మీకున్నంత చిత్తశుద్ధి ఏపీ ఎంపీలకు లేనందుకు సిగ్గుపడాలి. ప్రత్యేక హోదా ఏది అని అడుగుతుంటే ఇక్కడ పుట్టిన ఒక్క ఎంపీ కూడా మద్దతుగా నిలబడకపోవడం తెలుగుగడ్డ చేసుకున్న దౌర్భాగ్యం' అని వైఎస్‌ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. 'తెలుగు వారి ఆత్మగౌరవాన్ని, ఆత్మాభిమానాన్ని, పౌరుషాన్ని మోదీ కాళ్ల దగ్గర తాకట్టు పెట్టారని అనడానికి ఇంతకంటే నిదర్శనం మరేం కావాలి?' అని ప్రశ్నించారు.

Also Read: Liquor Income:లిక్కర్‌తో తెలంగాణ ఖజానా గలగల.. ఏడాదిలో వచ్చిన ఆదాయం ఎంతంటే?

'ఎప్పటిలాగే మళ్లీ మన ఎంపీలు బుద్ధిమంతులు. ప్రధాని మోదీకి భజనపరులు. మన ఎంపీలకు స్వలాభం మిన్నా.. రాష్ట్ర ప్రయోజనాలు సున్నా' అని ఏపీ ఎంపీలపై వైఎస్‌ షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విభజన హామీలు, హక్కుల కంటే మోడీ మెప్పే మిన్న అని ఎంపీ తీరును ఖండించారు. 'పేరుకు మాత్రమే వేరు వేరు పార్టీ ఎంపీలు. అందరూ బీజేపీకి బానిసలు. మోడీ చేతుల్లో రబ్బర్ స్టాంప్స్. బీజేపీ చేతిలో కీలుబొమ్మలు' అని వైఎస్‌ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. 'బీజేపీ బిల్లులకు గొర్రెల్లా తల ఊపడం తప్ప 11 ఏళ్లు దాటినా ప్రత్యేక హోదా ఏమైందని అడిగే దమ్ము ఒక్కరిలో లేదు. 10 ఏళ్లు హోదా ఎక్కడ అని అడిగే నిలదీసే సత్తా ఎవరికి లేదు' అని మండిపడ్డారు. ఢిల్లీని తలదన్నే రాజధాని నిర్మాణానికి అప్పులెందుకని ప్రశ్నించే ధైర్యం 25 మంది లోక్‌సభ, 11 మంది రాజ్యసభ ఎంపీలకు లేకపోవడం రాష్ట్రం చేసుకున్న దురదృష్టం అని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు.

Also Read: Chicken Margin: మాంసంప్రియులు నోరు కట్టేసుకోవాల్సిందే! రేపటి నుంచి చికెన్‌ దుకాణాలు బంద్‌!

విభజన హామీలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇచ్చిన చెక్కు లాంటిదని తాను మళ్లీ చెబుతున్నట్లు వైఎస్‌ షర్మిల తెలిపారు. '2014లోనే విభజన హామీల విలువ రూ.5 లక్షల కోట్లు. చెక్కు మన చేతిలో ఉంది. దాని మనం ఎన్‌క్యాష్ చేసుకోలేకపోతున్నాం. పార్లమెంట్ వేదికగా హామీల కమిటీ అమరావతికి కేంద్రం సహాయం చేయలేదని చెప్పినా.. పోలవరం ఎత్తు ఇక 41 మీటర్లే అని లిఖితపూర్వకంగా సమాధానాలు చెబుతున్నా, విభజన హామీల్లో ఇప్పటివరకు 5 శాతం కూడా అమలు కాకపోయినా, మౌనం వహిస్తూ గుడ్డి గుర్రాలకు పళ్ళు తోముతున్నందుకు ఎంపీలు రాజీనామా చేయాలి' అని కాంగ్రెస్‌ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల డిమాండ్‌ చేశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report

Happy Hanuman Jayanti 2026: హనుమాన్ జయంతి శుభకాంక్షలు.. అందరి ఇంట ఆయురారోగ్యాలు నిండాలి!

Hyderabad, Telangana:

Happy Hanuman Jayanti Wishes And Greetings 2026: చైత్ర పౌర్ణమి రోజు హనుమాన్ దీక్షను ప్రారంభించిన భక్తులు.. మండల కాలం పూర్తిచేసుకుని వైశాఖ దశమినాడే మాలవిరమణ చేస్తారు. అందుకే ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత వైభవంగా హనుమాన్ జయంతిని జరుపుకుంటారు. హనుమమాల ధరించిన వేలాదిమంది భక్తులు ఈరోజు తమ దీక్షను విరమించి.. ఇష్ట దైవానికి మొక్కులు తీర్చుకుంటారు. ఏడాది హనుమాన్ జయంతి ఏప్రిల్ రెండవ తేదీన వచ్చింది. ఇంతటి ప్రత్యేకత కలిగిన పండగ అందరి జీవితాల్లో వెలుగును నింపాలని కోరుకుంటూ.. ఇలా మీ మేలుకోరే ప్రతి ఒక్కరికి హనుమాన్ జయంతి శుభాకాంక్షలు సోషల్ మీడియా ద్వారా పంపండి.

శుభాకాంక్షలు..
కొండల నెత్తిన మేటి బలిశాలి.. కోరిన కోరికలు తీర్చే వనమాలి.. మీ జీవితం ఆ హనుమంతుడి ఆశీస్సులతో ధైర్యంగా సాగిపోవాలని మనసారా కోరుకుంటూ.. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ పేరుపేరునా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. 

రామ నామమే శ్వాసగా.. రామసేవయే ధ్యానంగా.. భక్తికి ప్రతిరూపమైన ఆ వాయు పుత్రుడు మీ ఇంట సుఖశాంతులు నింపాలని.. మనసారా కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ పేరుపేరునా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. 

సముద్రాన్ని దాటిన ఆ ధీరుడు సంకల్పం.. మీ లక్ష్య సాధనకు స్ఫూర్తి కావాలి.. అంజనీపుత్రుని దీవెనలు మీకు ఎల్లప్పుడూ తోడుండాలని ఆకాంక్షిస్తూ.. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు..

గదను పట్టిన చేతులు అభయాన్ని ఇస్తుంటే.. నూట వినిపించే రామాయణం లోకాన్ని తరిస్తుంటే.. ఆ మారుతీ కరుణాకటాక్షాలు మీకు కలగాలని కోరుకుంటూ.. హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. 

బుద్ధిర్బలం యశోధైర్యం.. ప్రసాదించే జ్ఞాన గురువు హనుమంతుడు.. మీలో అజ్ఞానపు చీకట్లు తొలిగి.. జ్ఞానపు జ్యోతి వెలగాలని ఆశిస్తూ.. మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. 

ఎక్కడ రామనామం వినిపిస్తుందో.. అక్కడ హనుమంతుడు కొలువై ఉంటాడు.. మీ ప్రతి అడుగులో ఆ స్వామి తోడుండి.. మీకు విజయాన్ని చేకూర్చాలని కోరుకుంటూ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. 

మనసు కంటే వేగంగా కదిలి భక్తులను కాపాడే ఆపద్బాంధవుడు ఆ హనుమంతుడు.. మీ కష్టాలన్నీ వాయువేగంతో మాయమాయి పోవాలని కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. 

Also Read: Saleshwaram: రేపటి నుంచే సలేశ్వరం జాతర.. తెలంగాణ అమరనాథ్‌ యాత్ర ప్రత్యేకత ఏంటో తెలుసా? 

చిరంజీవిగా వెలుగొందే కేసరీ నందనుడు.. మీ ఆయురారోగ్యాలను రక్షించాలి.. మీ కుటుంబం పై ఆయన కరుణ, ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ.. హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. 

సూర్యుడినే ఫలంగా భావించి.. ఎగసిన పరాక్రమశాలి.. మీ జీవితంలో కూడా అంతటి ప్రకాశం, కీర్తి ప్రతిష్టలను ఆ స్వామివారు అందించాలని కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ హనుమాన్ జయంతి ప్రత్యేకమైన శుభాకాంక్షలు..

దాస్య భక్తికి నిలువెత్తు సాక్ష్యం ఆ ఆంజనేయుడు.. నీ స్వార్థమైన సేవతో.. ధర్మ మార్గంలో మీరు పయనించాలని కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ పేరుపేరునా హనుమాన్ జయంతి ప్రత్యేకమైన శుభాకాంక్షలు..

Also Read: Saleshwaram: రేపటి నుంచే సలేశ్వరం జాతర.. తెలంగాణ అమరనాథ్‌ యాత్ర ప్రత్యేకత ఏంటో తెలుసా? 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report

Karimnagar: వింత ఘటన.. ఇళ్లకు తాళాలు వేసి పొలాల్లోకి.. భయంతో వణికిపోతున్న గ్రామస్థులు!

Karimnagar, Telangana:

Karimnagar Latest News: ఒక మామూలు సాధారణ గ్రామం కాదు.. తెల్లవారుజామున నాలుగు గంటలకి ఇళ్లకు తాళాలు వేస్తున్నారు.. విల్లాపాపలతో సహా జనం పొలాల బాట పడుతున్నారు.. వంట సామాగ్రి తో పాటు బియ్యం, కూరగాయలు మూటలు గట్టుకొని అడవి బాట పట్టారు.. కారణం తెలిస్తే అందరూ ఆశ్చర్య పోవాల్సిందే.. కారణమేంటో కాదు ఆ ఊరికి కీడు సోకిందన్న భయం.. అవును మీరు విన్నది నిజమే. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం కేశవాపూర్ గ్రామంలో చోటుచేసుకున్న ఈ వింత ఘటన ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు ఈ ఊరు పేరు వింటేనే అంతా భయపడి పోవలసిన పరిస్థితి ఏర్పడింది. అసలు ఏం జరిగింది? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..

గత రెండు నెలలుగా కేశవపూర్ గ్రామంలో వరస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి.. కేవలం 60 రోజుల వ్యవధిలో సుమారు 15 మంది వివిధ కారణాలతో మరణించారట.. తాజాగా ఒకరు మరణించిన తర్వాత.. వారి దశదిన కర్మలు కూడా పూర్తికాకముందే మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోవడంతో గ్రామస్తుల్లో ఒక ఊహించని ఆందోళన మొదలైంది. వయస్సుతో సంబంధం లేకుండా ఒకరి వెనక ఒకరు మృత్యువాత పడడంతో.. గ్రామానికి ఏదో దోష చుట్టుముట్టిందని ప్రజలు బలంగా నమ్ముతున్నారు..

గ్రామంలో నెలకొన్న ఈ భయానక పరిస్థితులపై గ్రామ పెద్దలతో పాటు యువకులు కలిసి ఒక జ్యోతిష్య శాస్త్ర పండితుడిని ఆశ్రయించినట్లు తెలుస్తోంది. ఊరిపై ఉన్న గ్రహ దోషం పోవాలంటే కీడు పంటలు చేయాలని ఆయన సూచించారు. సూర్యోదయానికి ముందే ఊరు విడిచి వెళ్లాలని.. రోజంతా ఊరి పొలిమేరల అవతల పడుకొని తిని.. సూర్యాస్తమయం అయ్యాక చీకటి పడ్డాకే మల్లి పిల్లకు చేరుకోవాలని నియమం విధించారు.. ఇలా చేస్తే గ్రామానికి అంతా బాగా జరుగుతుందని ఆ జ్యోతిష్యులు తెలిపారుట..

పండితుడి సూచనల మేరకు గ్రామస్తులందరూ ఏకమై ఈ నిర్ణయాన్ని అమలు చేస్తున్నారు. బుధవారం తెల్లవారుజామునే గ్రామం అంత ఖాళీ చేసిన పొలాల్లోకి చేరుకున్నారు.. ఊరులోని పాఠశాలలతో పాటు అంగన్వాడి కేంద్రాలు, దుకాణాలు అన్ని మూతపడ్డాయి. అలాగే చెట్ల కింద పొయ్యిలు వెలిగించి సామూహికంగా వంటలు చేసుకుంటున్నారు.. చిన్నపిల్లల నుంచి ముసలి వారి వరకు అందరూ రోజంతా ఊరికి దూరంగానే గడిపారు.  వరుస చావులు సంభవిస్తుంటే తట్టుకోలేకపోతున్నాం.. ఎవరికి ఏమవుతుందో అని భయమేస్తోంది.. అందుకే అందరం కలిసి ఊరి దోషం పోవాలని ఈ కార్యక్రమం చేపట్టామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తూ వస్తున్నారు.

Also Read: Saleshwaram: రేపటి నుంచే సలేశ్వరం జాతర.. తెలంగాణ అమరనాథ్‌ యాత్ర ప్రత్యేకత ఏంటో తెలుసా? 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report
Advertisement

Liquor Shops: రేపు హైదరాబాద్‌లో 24 గంటలు వైన్‌షాపులు, బార్లు బంద్‌

Hyderabad, Telangana:

Tomorrow Wine Shops Close: మొన్ననే మద్యం దుకాణాలు, బార్లు బంద్‌ ఉండగా మందుబాబులు కొంత ఇబ్బందులు పడ్డారు. మళ్లీ మరోసారి మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. హైదరాబాద్‌లోని మద్యం దుకాణాలతోపాటు బార్లు, కల్లు దుకాణాలు బంద్‌ ఉండనున్నాయి. మొన్న శ్రీరామనవమి సందర్భంగా వైన్స్‌ మూసివేయగా.. ఇప్పుడు హనుమాన్‌ జయంతి సందర్భంగా మద్యం దుకాణాలు మూసివేయాలని ఎక్సైజ్‌ శాఖ, పోలీస్‌ శాఖ సూచించింది.

Also Read: Amaravati: అమరావతిని ఎవరూ టచ్‌ చేయలేరు.. అంగుళం కదపలేరు: సీఎం చంద్రబాబు

వైన్స్‌ దుకాణాలు మూసివేస్తూ మల్కాజిగిరి పోలీస్‌ కమిషనర్‌ అవినాశ్‌ మహంతి ఉత్తర్వులు జారీ చేశారు. మల్కాజిగిరి పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని మద్యం దుకాణాలు, కల్లు దుకాణాలు, బార్లు రెస్టారెంట్లు మూసివేస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. 2వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 3వ తేదీ ఉదయం 6 గంటల వరకు మూసివేయాలని పోలీస్‌ శాఖ ఆదేశాలు జారీ చేసింది. హనుమాన్‌ జయంతి సందర్భంగా మద్యం విక్రయాలు బంద్‌ చేస్తున్నట్లు పోలీస్‌ శాఖ తెలిపింది. హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో కూడా మద్యం దుకాణాలు మూసివేసే అవకాశం ఉంది. ఒక్క సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌లో తెరచి ఉంటాయని తెలుస్తోంది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడలేదు.

Also Read: Tank Bund Shiva: ప్రాణాలు కాపాడే ట్యాంక్‌బండ్‌ శివకు రూ.5 లక్షలు, ప్రభుత్వ ఉద్యోగం

వీర హనుమాన్ విజయయాత్ర
హనుమాన్ జయంతి సందర్భంగా గౌలిగూడ నుంచి సికింద్రాబాద్ తాడ్‌బండ్ వరకు వీర హనుమాన్ విజయయాత్ర నిర్వహించనున్నట్లు భజరంగ్ దళ్ తెలిపింది. రేపు గురువారం ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు గౌలిగూడ రామమందిరంలో యజ్ఞం, 11 గంటలకు కోఠి కూడలిలో సామూహిక హనుమాన్ చాలీసా నిర్వహించనున్నట్లు భజరంగ్ దళ్ రాష్ట్ర కన్వీనర్ కొండా శ్రీకాంత్ వెల్లడించారు. అనంతరం ద్విచక్ర వాహన ర్యాలీ ప్రారంభమై కోఠి, సుల్తాన్ బజార్, కాచిగూడ, నారాయణగూడ, చిక్కడపల్లి, అశోక్‌నగర్, ట్యాంక్‌బండ్, బాటా, ప్యారడైజ్ మీదుగా తాడ్‌బండ్ హనుమాన్ దేవాలయం వరకు యాత్ర కొనసాగుతుందని తెలిపారు.

Also Read: Chicken Margin: మాంసంప్రియులు నోరు కట్టేసుకోవాల్సిందే! రేపటి నుంచి చికెన్‌ దుకాణాలు బంద్‌!

శోభయాత్ర ఏర్పాట్లు పరిశీలన
ఈ నెల 2వ తేదీన హనుమాన్ జయంతి నేపథ్యంలో తాడ్‌బండ్ వద్ద జరుగుతున్న ఏర్పాట్లను  హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ పరిశీలించారు. హనుమాన్ జయంతి శోభాయాత్ర రూట్ మ్యాప్‌ పరిశీలించి నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఎలివేటెడ్ కారిడార్ పనులు జరుగుతుండడంతో శోభాయాత్ర  రూట్‌మ్యాప్‌ను బాంటియా గార్డెన్ మీదుగా తరలించేందుకు చర్యలు చేపడుతున్నట్లు కమిషనర్‌ సజ్జనార్‌ తెలిపారు. 3000 మంది పోలీసు సిబ్బందితో పాటు సీసీ కెమెరాలతో శోభయాత్రను అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా విజయవంతం చేసేందుకు సన్నహాలు చేస్తున్నట్లు పోలీస్‌ శాఖ వెల్లడించింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report

Kondagattu: కేసరి వర్ణంగా మారిన కొండగట్టు గుట్ట.. కిలోమీటర్ల మేర క్యూ!

Kondagattu, Telangana:

Kondagattu Latest Telugu News: జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయస్వామి సన్నిధి భక్తులతో కిటకిట లాడుతోంది. చిన్న హనుమాన్ జయంతి పండుగను పురస్కరించుకొని రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా తరలివచ్చిన హనుమాన్ దీక్ష పరులతో కొండగట్టు పరిసరాలన్నీ కేసరి వర్ణంగా మారాయి.. ప్రతి ఏడాది కొండగట్టులో హనుమాన్ జయంతి ఎంతో ఘనంగా జరుగుతుంది. ఈసారి కూడా దీక్షాపరులతో హనుమాన్ జయంతి ఘనంగా జరగబోతున్నట్లు ఆలయ అధికారులు తెలుపుతున్నారు. ఇప్పటికే ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు..

41 రోజులపాటు కఠిన దీక్షలు చేపట్టిన స్వాములు.. శనివారం తెల్లవారుజాము నుంచే కొండగట్టుకు చేరుకోవడం ప్రారంభించారు. తమ ఆరాధ్య దైవమైన అంజనకు ఇరుముడులు సమర్పించి.. మొక్కులు చెల్లించుకుంటున్నారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు కిలోమీటర్ల మేర క్యూ లైన్ లలో వేచి ఉన్నారు. జైశ్రీరామ్.. జై హనుమాన్ అనే నామస్మరణతో కొండగట్టు పై ఆధ్యాత్మిక వాతావరణం ఏర్పడింది. కొండపై భారీ ఎత్తున స్వాములు ఉండడంతో..  కేసరి వర్ణంగా మారిపోయింది..

దీక్షపరుల తాకిడిని దృష్టిలో ఉంచుకొని ఆలయ అధికారులతో పాటు జిల్లా యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లను చేసినట్లు తెలుస్తోంది. దీక్ష పరులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఆలయ ఆవరణంలోని ప్రత్యేకమైన ఇరుముడి సమర్పణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎండ తీవ్రత దృశ్య క్యూ లైన్ లో ఉన్న భక్తులకు నిరంతరం మంచినీరుతో పాటు మజ్జిగ సరఫరా కూడా చేయబోతున్నట్లు తెలుస్తోంది. స్వచ్ఛంద సంస్థల సహకారంతో ప్రత్యేకమైన అన్నదాన కార్యక్రమాలు కూడా కొనసాగుతాయి. అలాగే అత్యవసర పరిస్థితుల కోసం ప్రత్యేక వైద్య శిబిరాలతో పాటు ఆంబులెన్స్ సేవలను కూడా అందుబాటులో ఉంచారు.

Also Read: Saleshwaram: రేపటి నుంచే సలేశ్వరం జాతర.. తెలంగాణ అమరనాథ్‌ యాత్ర ప్రత్యేకత ఏంటో తెలుసా? 

భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని కొండగట్టు పై వాహనాల రాకపోకలపై పోలీసులు ప్రత్యేకమైన ఆంక్షలు కూడా విధించినట్లు తెలుస్తోంది. ఘాటు రోడ్లలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు చేసి.. కొన్నిచోట్ల ప్రత్యేకమైన సీసీ కెమెరాలు ద్వారా పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తెలుస్తోంది. తమ కష్టాలను తీర్చి.. కొంగుబంగారంగా విరాజిల్లే కొండగట్టు అంజన్న ను దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.. ఏడాది దీక్షపరుల సంఖ్య గతంతో పోలిస్తే మరింత పెరిగే అవకాశం ఉండడంతో అధికారులు మరిన్ని అదనపు ఏర్పాట్లు చేయాలని భక్తులు కోరుతున్నారు..

Also Read: Saleshwaram: రేపటి నుంచే సలేశ్వరం జాతర.. తెలంగాణ అమరనాథ్‌ యాత్ర ప్రత్యేకత ఏంటో తెలుసా? 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report

Most Expensive Wine: ఒక్క బాటిల్ వైన్.. ఒక లగ్జరీ విల్లా కంటే ఖరీదు! ఎందుకంత క్రేజ్?

Hyderabad, Telangana:

Most Expensive Wine Telugu: ఒక్క వైన్ బాటిల్ ధర ఎంత ఉంటుంది? కొన్ని వందలు లేదా వేల రూపాయలు ఉంటుంది.. మల్టీ నేషనల్ బ్రాండ్ అయితే లక్షల్లో ఉండవచ్చు.. కానీ ఒకే ఒక బాటిల్ వైన్ ధర ఏకంగా విల్లా, ఖరీదైన లగ్జరీ కార్ల కంటే ఎక్కువకు అమ్ముడై అందర్నీ ఆశ్చర్యపరిచేలా చేసింది. ప్రపంచ ప్రఖ్యాతి డొమైన్ డి లా రోమనీ-కొంటి బ్రాండ్ కు చెందిన 1945 నాటి ఓ వైన్ బాటిల్ ఇటీవల జరిగిన అకర్ వేలంలో ఏకంగా 7.63 కోట్ల రూపాయలకు అమ్ముడైంది. ఇది ఇప్పుడు ప్రపంచ రికార్డును సృష్టించింది. కేవలం ఒక వైన్ బాటిల్ ఇంతవరకు అమ్ముడుపోవడానికి గల కారణాలు? అసలు ఈ వైన్‌లో ఉన్న స్పెషాలిటీ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

న్యూయార్క్‌లో నిర్వహించిన ప్రతిష్టాత్మక వేలంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోటీశ్వరులతో పాటు వైన్ బాటిల్స్ ను సేకరించేవారు భారీ మొత్తంలో పాల్గొన్నారు. ఈ వేళంలో 1945 నాటి వింటేజ్‌కు చెందిన ఈ బాటిల్ కోసం ఒకరంటే ఒకరు పోటా పోటీగా.. దీనిని గెలుచుకునేందుకు ఆసక్తి చూపారు. చివరికి ఒక వ్యక్తి దీనిని రికార్డు స్థాయి ధరకు దక్కించుకున్నారు. 2018లో ఇదే బ్రాండ్ కు చెందిన ఒక బాటిల్ సుమారు నాలుగు కోట్ల రూపాయలకు అమ్ముడవ్వగా.. తాజా వేలం ఆ రికార్డును తుడిచి వేసింది..

ఈ వైన్ బాటిల్ ఇంత ఖరీదు పలకడానికి ప్రధాన కారణం దాని అరుదైన చరిత్రగా భావించవచ్చు. 1945 ప్రాంతంలో ఫ్రాన్స్‌లోని బుర్గుండి ప్రాంతంలో ఉన్న ప్రసిద్ధ రోమనీ-కొంటి ద్రాక్ష తోటల నుండి దీనిని తయారు చేశారు. ఆ సంవత్సరంలో కేవలం 600 బాటిళ్లు మాత్రమే తయారు చేశారు. రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన సమయంలో తయారైన ఈ వైన్.. ఆ తోటల్లోని పాత ద్రాక్ష తీగలను తొలగించి కొత్తవి నాటడానికి ముందు సేకరించిన చివరి పంట నుండి వచ్చినది. అందుకే దీనిని పురాతన రుచిగా వైన్ ప్రియులు భావిస్తారు.. దాదాపు 80 ఏళ్లు గడిచిన దీని రుచితో పాటు నాణ్యతకు చెక్కుచెదరకుండా ఉండడం విశేషం..

Read more: Scorpio, Ertiga సగం ధరకే.. ఢిల్లీ కార్ బజార్‌లో రూ.30 వేలకే కారు మీ సొంతం!

వేల నిర్వహించిన అకర్ సంస్థ చైర్మన్ జాన్ కాపోన్ మాట్లాడుతూ.. ఇది కేవలం వైన్ మాత్రమే కాదు.. ఒక చరిత్రని.. నా జీవితంలో కేవలం మూడుసార్లు మాత్రమే దీనిని రుచి చూసే అవకాశం కలిగిందని.. ఇది కేవలం ప్రపంచంలోనే అత్యంతమైనదని.. ఆయన తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైన్ కలెక్టర్లు కూడా దీనిని వైన్ ప్రపంచంలో కోహినూర్ వజ్రంగా అభివర్ణిస్తారు. అరుదైన వస్తువులను సేకరించే వారికి దీని సీసా గొప్ప ఆస్తిగా పరిగణిస్తారు..

Read more: Scorpio, Ertiga సగం ధరకే.. ఢిల్లీ కార్ బజార్‌లో రూ.30 వేలకే కారు మీ సొంతం!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report
Advertisement

Amaravati: అమరావతిని ఎవరూ టచ్‌ చేయలేరు.. అంగుళం కదపలేరు: సీఎం చంద్రబాబు

Vinjamur, Andhra Pradesh:

Amaravati Capital Bill: ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్దత కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకువచ్చిన బిల్లును లోక్‌సభ ఆమోదించిన నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక అమరావతిని ఎవరూ టచ్‌ చేయలేరని ప్రకటించారు. ఒక్క అంగుళం కూడా కదపలేరని స్పష్టం చేశారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతి అని తెలిపారు. అమరావతికి చట్టబద్దత కల్పిస్తూ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టడం ఒక చరిత్రగా ప్రకటించారు. భవిష్యత్‌లోనే అమరావతిని ఎవరూ టచ్‌ చేయలేరని.. ఆంధ్రప్రదేశ్‌కు ఏకైక రాజధానిగా అమరావతి ఉంటుందని తెలిపారు. 

Also Read: Tank Bund Shiva: ప్రాణాలు కాపాడే ట్యాంక్‌బండ్‌ శివకు రూ.5 లక్షలు, ప్రభుత్వ ఉద్యోగం

నెల్లూరు జిల్లా వింజమూరులో ఫించన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం నిర్వహించిన ప్రజా వేదిక సభలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఐదేళ్లు అరాచక, విధ్వంస పాలన సాగిందని వైఎస్‌ జగన్‌ పేరు ప్రస్తావించకుండా విమర్శించారు. వైఎస్సార్‌సీపీ మూడు ముక్కలాట, మూడు రాజధానుల నినాదంతో అమరావతిపై దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు. అమరావతికి చట్టబద్దత కోసం తీర్మానం చేసేందుకు ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశం నిర్వహిస్తే మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ రాలేదని గుర్తుచేశారు.

Also Read: Chicken Margin: మాంసంప్రియులు నోరు కట్టేసుకోవాల్సిందే! రేపటి నుంచి చికెన్‌ దుకాణాలు బంద్‌!

ప్రజామోదం పొందిన రాజధాని అమరావతి విషయంలో ఇంత కక్ష పెట్టుకోవడాన్ని ఏమనాలి? అని సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. అలాంటప్పుడు ఆ పార్టీ ఎందుకు? ఇలాంటి నాయకులతో ఎవరికీ ఉపయోగం అని నిలదీశారు. ఎవరు ఏం చేసినా భవిష్యత్‌లో రాజధాని అమరావతిని అంగుళం కూడా కదపలేరు అని విశ్వాసం వ్యక్తం చేశారు. అభివృద్ధిని ఎవరూ ఆపలేరని స్పష్టం చేశారు.

Also Read: Heat Waves: ఏపీలోని ఈ జిల్లాలకు భారీ అలర్ట్‌.. రాబోయే రోజుల్లో తీవ్ర వడగాలులు

లోక్‌సభలో అమరావతి రాజధానికి చట్టబద్దత కల్పిస్తూ బిల్లు ఆమోదం పొందడంపై నారా లోకేశ్‌ స్పందించారు. 'నా రాష్ట్రం ఆంధ్ర‌ప్ర‌దేశ్-నా రాజ‌ధాని అమ‌రావ‌తి అని ఐదుకోట్ల ఆంధ్రులు గ‌ర్వంగా నిన‌దించే చారిత్రాత్మ‌కమైన రోజుకు దేశ పార్ల‌మెంటు వేదిక కావ‌డం చాలా సంతోషంగా ఉంది. ఒకే రాష్ట్రం-ఒకే రాజ‌ధాని నినాదంతో అభివృద్ధి వికేంద్రీక‌ర‌ణ విధానంతో రాజ‌ధానిగా అమ‌రావ‌తిని నిర్ణ‌యిస్తూ ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ చేసిన ఏక‌గ్రీవ తీర్మానానికి చ‌ట్ట‌బ‌ద్ధ‌త క‌ల్పించే అమ‌రావ‌తి బిల్లు పార్ల‌మెంటులో ప్ర‌వేశ‌పెట్టి, ఆమోదించడం కోట్లాది ప్ర‌జ‌లు గ‌ర్వించ‌ద‌గ్గ సంద‌ర్భం. కేంద్ర‌ప్ర‌భుత్వానికి, మ‌ద్ద‌తుగా నిలిచిన పార్టీల‌కు కృత‌జ్ఞ‌త‌లు. ఇది ఐదుకోట్ల ఆంధ్రుల ఆకాంక్ష అమ‌రావ‌తి విజ‌యం. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల విజ‌యం. ఇది రైతుల త్యాగాలకు ద‌క్కిన దైవ ఆశీస్సులు.. శాంతియుత పోరాటానికి ద‌క్కిన ఫ‌లితం. కోట్లాది ప్ర‌జ‌ల కోరిక‌ను గౌర‌వించిన కేంద్రం ఆంధ్రుల ఆత్మ‌గౌర‌వ రాజ‌ధానిగా చ‌రిత్ర‌-సంస్కృతికి ఆల‌వాల‌మైన అమ‌రావ‌తిని నిలిపింది. జై ఆంధ్ర‌ప్ర‌దేశ్..జ‌య‌హో అమ‌రావ‌తి' అని నారా లోకేశ్‌ ప్రకటన విడుదల చేశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report

Bike Market: ఇక్కడ సగం ధరకే యమహా R15, బుల్లెట్ బైక్‌! రూ.45 వేలకే స్ప్లెండర్, షైన్..

Hyderabad, Telangana:

Second Hand Bikes In Delhi: ప్రస్తుత కాలంలో సొంత వాహనం ఉండటం అనేది కనీస అవసరంగా మారింది.. అయితే, కొత్త బైకుల ధరలు ఆకాశాన్ని తాకుతున్న తరుణంలో సామాన్యులకు సెకండ్ హ్యాండ్ బైకులు వరంగా మారాయి.. తాజాగా దేశ రాజధాని పరిధిలోని సెకండ్ హ్యాండ్ మోటార్ సైకిల్స్ షాపుల్లో వినియోగదారుల కోసం అద్భుతమైన బైక్లను అత్యంత తక్కువ ధరలకే అందిస్తున్నారు. ముఖ్యంగా ఢిల్లీలోని సెకండ్ హ్యాండ్ బైకులు దొరికే ప్రాంతాల్లో ఆయా షాపుల్లో కేవలం రూ.15 వేల నుంచి సెకండ్ హ్యాండ్ బైకులు లభిస్తూ ఉండడం విశేషం. అద్భుతమైన కండిషన్ లో ఉన్న బైకులు చీపు ధరలకు విక్రయించడం విశేషం..

ఢిల్లీలోని సెకండ్ హ్యాండ్ మోటార్స్ విక్రయించే అగర్వాల్ మోటార్స్ షాపులో అత్యంత తక్కువ ధరలకే స్పోర్ట్స్ బైక్ ల నుంచి ఫ్యామిలీ స్కూటర్ల వరకు అందుబాటులో ఉన్నాయి. దాదాపు వీరు షాపులో అత్యంత తక్కువ ధరలోనే 140 కి పైగా విక్రయించే వాహనాలు ఉన్నట్లు షాప్ యజమాని తెలుపుతున్నారు.  ముఖ్యంగా యువత ఎంతగానో ఇష్టపడే యమహా R15 V4, MT-15, బజాజ్ పల్సర్ NS 200, సుజుకి జిక్సర్ 250 వంటి మోడళ్లు షోరూమ్ కండిషన్‌లో అత్యంత చీపు ధరలకే అందుబాటులో ఉన్నాయి. వీటిలో కొన్ని బైకులు అయితే కేవలం 150 కిలోమీటర్లు మాత్రమే తిరగడం విశేషం..

ముఖ్యంగా ఈ షాపులో 2022 మోడల్ డబుల్ ఛానల్ ABS కలిగిన హంటర్ 350 మోటార్ సైకిల్ కేవలం రూ.1 లక్ష లోపే అందుబాటులో ఉంది. అంతేకాకుండా 2023 మోడల్ జావా 42 మోటార్ సైకిల్ కేవలం రూ. 1,20,000లకే అందుబాటులో ఉంది. ఇక రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350, బుల్లెట్ స్టాండర్డ్, సిగ్నల్ ఎడిషన్లు రూ. 1.10 లక్షల నుండి ప్రారంభమవుతున్నాయి. ఇక స్కూటీల వివరాల్లోకి వెళ్తే.. యాక్సెస్, జుపిటర్ వంటి స్కూటర్లు రూ. 40,000  నుంచి రూ. 50,000 మధ్య లభిస్తున్నాయి. అలాగే స్ప్లెండర్, షైన్ వంటి డైలీ యూజ్ బైకులు రూ. 45,000ల నుండే  ప్రారంభమవ్వడం విశేషం..

Read more: Scorpio, Ertiga సగం ధరకే.. ఢిల్లీ కార్ బజార్‌లో రూ.30 వేలకే కారు మీ సొంతం!

అలాగే ప్రతి వాహనానికి సంబంధించిన ఒరిజినల్ పేపర్లతో పాటు ఇన్సూరెన్స్, సర్వీస్ రికార్డులను అక్కడే అందిస్తున్నట్లు  సదరు షాపు యజమానులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఎటువంటి పెండింగ్ చలాన్లు లేకుండా.. క్లియర్ కండిషన్లు బైకులను అందిస్తున్నట్లు వారి చెబుతున్నారు. అలాగే దేశవ్యాప్తంగా ఎక్కడికైనా వాహనాలను పంపేందుకు ట్రాన్స్పోర్ట్ సదుపాయంతో పాటు తక్కువ డౌన్ పేమెంట్తో ఫైనాన్షియల్ సౌకర్యాన్ని కూడా అందిస్తున్నారు. అయితే మీరు కూడా ఇక్కడ మోటార్ సైకిల్ కొనుగోలు చేయాలనుకుంటే నేరుగా ఢిల్లీ వెళ్లాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఒక మోటార్ సైకిల్ కొనుగోలు చేసే క్రమంలో తప్పకుండా వాటికి సంబంధించిన రిజిస్ట్రేషన్ పేపర్స్ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది.

Read more: Scorpio, Ertiga సగం ధరకే.. ఢిల్లీ కార్ బజార్‌లో రూ.30 వేలకే కారు మీ సొంతం!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report

Scorpio, Ertiga సగం ధరకే.. ఢిల్లీ కార్ బజార్‌లో రూ.30 వేలకే కారు మీ సొంతం!

Hyderabad, Telangana:

Cheapest Used Cars In Delhi: సొంత కారు ఉండాలని సామాన్యుడి కల.. కానీ కొత్త కార్ల ధరలు ఏకంగా ఆరు నుంచి ఏడు లక్షల రూపాయల నుంచి ప్రారంభం అవడం వల్ల మధ్యతరగతి కుటుంబాలు కొనలేకపోతున్నాయి. ఒకవైపు యుద్ధం కారణంగా అన్ని వస్తువుల ధరలు పెరగడం వల్ల.. కొన్ని కంపెనీలు ప్రత్యేకమైన కార్ల మోడల్స్ పై ధరలు కూడా పెంచేసాయి.. దీని కారణంగా సామాన్య జనాలు కారులను కొనుగోలు చేయడం చాలా కష్టమైపోయింది. అయితే ఇప్పుడు మధ్యతరగతి ప్రజల చూపు సెకండ్ హ్యాండ్ కార్ మార్కెట్ పై మల్లుతూ వస్తుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని రోహిణి సెక్టార్ 11 లో ఉన్న సెకండ్ హ్యాండ్ మోటార్ షోరూమ్స్ కొన్ని కార్ల మోడల్స్ పై ప్రత్యేకమైన ఆఫీసును అందించడంతో.. చాలామంది ఇక్కడ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా ఇక్కడ కేవలం రూ.99 వేల నుంచి ప్రారంభం కావడమే కాకుండా.. అతి తక్కువ డౌన్ పేమెంట్ ఆప్షన్లతో వందలాది వాహనాలు అందుబాటులో ఉండటం వల్ల చాలామంది వెళ్లి కొనుగోలు చేస్తున్నారు. అయితే మీరు కూడా మంచి కారు కొనుగోలు చేయాలనుకుంటున్నారా? 

కొన్ని సెకండ్ హ్యాండ్ మోటార్ షో రూముల్లో ఇప్పటికే ప్రత్యేకమైన సేల్స్ను ప్రారంభించారు. ఇందులో భాగంగా హోండా కు చెందిన సెవెన్ సీటర్ కార్లు ఆకర్షణీయంగా నిలుస్తూ వస్తున్నాయి. ముఖ్యంగా ఈవీ కార్లు కూడా అత్యధిక తగ్గింపు ధరల్లోనే అందుబాటులో ఉండడం విశేషం. అలాగే ఇప్పుడు సిఎన్జి కోరత ఏర్పడడానికి కారణంగా.. చాలామంది ఈ కార్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపడం లేదు.. దీంతో ఇక్కడ అత్యంత చీప్ ధనలకే వీటిని విక్రయిస్తున్నారు. అంతేకాకుండా కొన్ని కార్లపై ఏకంగా 50 నుంచి 60 శాతం వరకు స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్స్ అందిస్తున్నారు. 

ముఖ్యంగా రోహిణి సెక్టార్ 11 లో ఉన్న షాపుల్లో ఎక్కువగా స్విఫ్ట్, బ్రెజ్జా, స్కార్పియో, ఎక్స్‌యూవీ 500, అల్టో వంటి ప్రముఖ బ్రాండ్ల కార్లు భారీ సంఖ్యలో అందుబాటులో ఉన్నాయి. చిన్న కుటుంబాల కోసం 2020 మోడల్ కు సంబంధించిన ఆల్టో కార్లు కేవలం రూ.2 లక్షల నుంచి ప్రారంభమవుతున్నాయి. అలాగే 2017 మోడల్ మహీంద్రా స్కార్పియో రూ. 6.90 లక్షలకు, ఎస్ యూవీ 500 కేవలం రూ. 7.25 లక్షలకే ఆఫర్ చేస్తున్నారు. దీంతోపాటు ఎర్టిగా వంటి ఫ్యామిలీ కార్లు కేవలం ఇక్కడ రూ.4 లక్షల నుంచి అందుబాటులో ఉండడం విశేషం. ఇవే కాకుండా మల్టీ నేషనల్ కార్ బ్రాండ్లకు సంబంధించిన కార్లు కూడా అందుబాటులో ఉండడమే కాకుండా అత్యంత చీకు ధరల్లో లభిస్తున్నాయి.

ఈ రోహిణి సెక్టార్ 11 ఉన్న షాపుల్లో ఎక్కడ కార్లను కొనుగోలు చేసిన ఈఎంఐ ఆప్షన్ అందుబాటులో ఉంటుంది. ఇందులో భాగంగా కేవలం మీరు రూ. 20వేల నుంచి రూ.30 వేల వరకు డౌన్ పేమెంట్ చెల్లిస్తే చాలు.. కారు మీ వెంట తీసుకెళ్లొచ్చు. అంతేకాకుండా కస్టమర్ ప్రొఫైల్ బాగుంటే 100 శాతం లోన్స్ సౌకర్యం కూడా కల్పిస్తున్నారు. ఇక ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారికి కూడా సర్వీస్ రికార్డు ఉన్న అద్భుతమైన కార్లను విక్రయిస్తున్నట్లు అక్కడ నిర్వాహకులు చెబుతున్నారు. ముఖ్యంగా నవరాత్రి సీజన్లలో ఇక్కడ కార్లు కొనుగోలు చేసే వారికి ఎన్నో రకాల బంపర్ డిస్కౌంట్ ఆఫర్స్ ను కూడా అందిస్తున్నట్లు వారు చెబుతున్నారు.

Read more: Vivo T4R 5G: Sony కెమెరా, 5700 mAh బ్యాటరీ.. vivo T4R 5G పై కళ్లు చెదిరే డిస్కౌంట్లు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report
Advertisement

Gold Rate Today: ట్రంప్ ప్రకటనతో ఒక్కసారిగా మారిన సీన్.. బంగారం కొనేవారికి చుక్కలు.. తెలుగు రాష్ట్రాల్లో నేటి ధరలివే..!!

BBhoomi14h ago
Lakshmapur, Telangana:

Gold Rate Today:  ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్ల చూపు ఇప్పుడు వైట్ హౌస్ వైపు మళ్లింది. రాబోయే రెండు మూడు వారాల్లోనే యుద్ధాన్ని ముగించనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన సంచలన ప్రకటన అంతర్జాతీయ మార్కెట్లలో పెను మార్పులకు కారణమైంది. ఈ ప్రకటనతో అటు స్టాక్ మార్కెట్లు లాభాల్లో పయనిస్తుండగా..  ఇటు బులియన్ మార్కెట్‌లో కూడా కదలికలు మొదలయ్యాయి. గత కొద్ది రోజులుగా అనిశ్చితిలో ఉన్న బంగారం, వెండి ధరలు ఇప్పుడు తిరిగి పుంజుకుంటున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన పసిడి ధరలు:
ఏప్రిల్ 1వ తేదీన తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. మార్చి 31తో పోలిస్తే.. నేడు ధరల్లో పెరుగుదల కనిపించడం కొనుగోలుదారులను కాస్త ఆందోళనకు గురిచేస్తోంది. ముఖ్యంగా 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారంపై గ్రాముకు రూ. 197 చొప్పున ధర పెరిగింది.

ప్రస్తుతం హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్, ఖమ్మం వంటి తెలంగాణ నగరాలతో పాటు విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప వంటి ఆంధ్రప్రదేశ్ నగరాల్లో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

24 క్యారెట్ల బంగారం: నేడు పది గ్రాముల (తులం) స్వచ్ఛమైన బంగారం ధర రూ. 1,51,480 వద్ద ట్రేడవుతోంది (అంటే గ్రాముకు రూ. 15,148).

22 క్యారెట్ల బంగారం: ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ. 13,885 గా ఉంది.

Also Read: Gold Selling: కేంద్ర బ్యాంకుల సంచలన నిర్ణయం.. మార్కెట్లోకి భారీగా బంగారం.. తులం ధర రూ. లక్ష దిగువకు..?   

వెండి ధరల జోరు:
కేవలం బంగారం మాత్రమే కాకుండా, వెండి ధరలు కూడా గరిష్ట స్థాయిలోనే కొనసాగుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రధాన నగరాల్లో కేజీ వెండి ధర రూ. 2,55,000 మార్కు వద్ద స్థిరంగా ఉంది. అంటే ఒక గ్రాము వెండి కొనాలంటే వినియోగదారులు రూ. 255 వెచ్చించాల్సి ఉంటుంది.

ధరల పెరుగుదలకు కారణాలేంటి?
అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు సడలుతాయన్న ఆశలతో ఇన్వెస్టర్లు మళ్ళీ విలువైన లోహాలపై పెట్టుబడులు పెట్టడం ప్రారంభించారు. యుద్ధం ఆగిపోతే ఆర్థిక వ్యవస్థలు స్థిరపడతాయని, తద్వారా డిమాండ్ పెరుగుతుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలోనే అమెరికా డాలర్ విలువలో వచ్చే మార్పులు కూడా బంగారం ధరలను ప్రభావితం చేస్తున్నాయి.

Also Read:  Bank Auto Sweep Facility: బ్యాంకు ఖాతాదారులకు బంపర్ ఆఫర్! ఆటో స్వీప్ సౌకర్యంతో మీ సేవింగ్స్ అకౌంట్‌పై భారీ వడ్డీ.. ఎలాగో తెలుసా?

కొనుగోలుదారులకు సూచన:
పెళ్లిళ్ల సీజన్ సమీపిస్తున్న తరుణంలో ధరలు పెరగడం సామాన్యులకు ఇబ్బందికరమే అని చెప్పాలి. అయితే, మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. అంతర్జాతీయ పరిస్థితులు పూర్తిగా చక్కబడే వరకు ధరల్లో ఇలాంటి ఒడిదుడుకులు సహజం. కాబట్టి, బంగారం కొనాలనుకునే వారు ప్రతిరోజూ ధరలను గమనిస్తూ, తక్కువగా ఉన్న సమయంలో కొనుగోలు చేయడం ఉత్తమం. షాపింగ్‌కు వెళ్లే ముందు మీ నగరంలోని లేటెస్ట్ రేట్లను మరోసారి సరిచూసుకోవడం మర్చిపోవద్దు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

0
0
Report

Stock Market Today: ట్రంప్ శాంతి మంత్రం.. ఒక ప్రకటనతో దుమ్మురేపుతున్న స్టాక్ మార్కెట్లు..!!

BBhoomi14h ago
Lakshmapur, Telangana:

Stock Market Today: ఏప్రిల్ నెల ట్రేడింగ్ భారత స్టాక్ మార్కెట్ చరిత్రలో ఒక తీపి గుర్తుగా నిలిచిపోయేలా కనిపిస్తోంది. గత కొంతకాలంగా మధ్యప్రాచ్యంలో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతలు ప్రపంచ దేశాలను కలవరపెట్టగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ఒక్క ప్రకటన మార్కెట్ల రూపురేఖలను మార్చేసింది. ఇరాన్‌తో యుద్ధాన్ని సాగదీయడం తనకు ఇష్టం లేదని, రాబోయే రెండు మూడు వారాల్లోనే దీనికి ముగింపు పలకనున్నట్లు ట్రంప్ ప్రకటించడంతో అంతర్జాతీయ మార్కెట్లు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నాయి.

బుల్ రన్: పాయింట్ల వర్షం
బుధవారం ఉదయం మార్కెట్లు ప్రారంభమైన నిమిషాల్లోనే ఇన్వెస్టర్లు కొనుగోళ్ల జాతర మొదలుపెట్టారు. ఉదయం 9.50 గంటల సమయానికే బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ ఏకంగా 1942 పాయింట్ల భారీ లాభంతో అగ్రభాగాన నిలిచింది. అటు నిఫ్టీ కూడా 590 పాయింట్లకు పైగా లాభపడి ఇన్వెస్టర్ల సంపదను అమాంతం పెంచేసింది. కేవలం లార్జ్ క్యాప్ కంపెనీలే కాకుండా, మిడ్ క్యాప్ (1773 పాయింట్లు), బ్యాంక్ నిఫ్టీ (1360 పాయింట్లు) కూడా తమ సత్తా చాటాయి.

ముడి చమురు ధరల తగ్గుదల - భారత్‌కు వరం
భారత మార్కెట్ల రాలీకి ప్రధాన కారణం ముడి చమురు ధరలు తగ్గడం. యుద్ధం ముగిసే సంకేతాలు రావడంతో అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 105 డాలర్లకు పడిపోయింది. భారత్ తన చమురు అవసరాల కోసం దిగుమతులపైనే ఎక్కువగా ఆధారపడుతుంది కాబట్టి, ధరల తగ్గుదల దేశ ఆర్థిక వ్యవస్థకు, రూపాయి విలువకు పెద్ద ఊరటనిస్తుంది. దీని ప్రభావంతోనే ఆసియా మార్కెట్లు కూడా దాదాపు 3.7% మేర లాభపడ్డాయి.

Also Read: Gold Selling: కేంద్ర బ్యాంకుల సంచలన నిర్ణయం.. మార్కెట్లోకి భారీగా బంగారం.. తులం ధర రూ. లక్ష దిగువకు..?   

బ్యాంకింగ్ రంగంలో అద్భుత కోలుకోలు
గత మార్చి నెలలో బ్యాంక్ నిఫ్టీ దాదాపు 17% మేర పతనమై ఇన్వెస్టర్లను ఆందోళనకు గురిచేసింది. అయితే, ఏప్రిల్ ప్రారంభంలోనే పరిస్థితి తారుమారైంది. సరైన కారణం లేకుండానే పడిపోయిన నాణ్యమైన ప్రైవేట్ బ్యాంక్ షేర్లను కొనుగోలు చేసేందుకు ఇన్వెస్టర్లు మొగ్గు చూపుతున్నారు. మార్కెట్ ఒడిదుడుకులను సూచించే VIX (Volatility Index) 10% తగ్గడం అనేది మార్కెట్లో స్థిరత్వం ఏర్పడుతోందన్న సానుకూల సంకేతాన్ని ఇస్తోంది.

నిపుణుల విశ్లేషణ - టెక్నికల్ వ్యూ
ప్రస్తుత బుల్ రన్ ఉత్సాహాన్ని ఇస్తున్నప్పటికీ, టెక్నికల్ అంశాలను గమనించాలని నిపుణులు సూచిస్తున్నారు. నిఫ్టీ 24,000 మార్కు పైన స్థిరంగా ముగిస్తేనే ఈ బుల్లిష్ ట్రెండ్ మరికొంత కాలం కొనసాగే అవకాశం ఉంటుంది. అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ పరిస్థితులు చక్కబడుతున్న వేళ, వ్యాల్యూ స్టాక్స్‌లో పెట్టుబడులు పెట్టడం దీర్ఘకాలంలో ప్రయోజనకరంగా ఉంటుందని మార్కెట్ అనలిస్టులు అభిప్రాయపడుతున్నారు.ఏప్రిల్ మొదటి రోజున భారత మార్కెట్లు చూపిన జోరు ఇన్వెస్టర్లలో కొత్త ఆశలను చిగురింపజేసింది. యుద్ధ భయాలు వీడి శాంతి చర్చలు ఫలిస్తే, భారత ఆర్థిక వ్యవస్థ మరిన్ని రికార్డులను అధిగమించడం ఖాయంగా కనిపిస్తోంది.

Also Read:  Bank Auto Sweep Facility: బ్యాంకు ఖాతాదారులకు బంపర్ ఆఫర్! ఆటో స్వీప్ సౌకర్యంతో మీ సేవింగ్స్ అకౌంట్‌పై భారీ వడ్డీ.. ఎలాగో తెలుసా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

0
0
Report

Tank Bund Shiva: ప్రాణాలు కాపాడే ట్యాంక్‌బండ్‌ శివకు రూ.5 లక్షలు, ప్రభుత్వ ఉద్యోగం

Hyderabad, Telangana:

Tank Bund Shiva Family: నగరానికే తలమానికంగా నిలిచే ట్యాంక్‌బండ్‌పై నిత్యం ప్రజల ప్రాణాలు కాపాడే వ్యక్తి.. యముడితో పోరాడి ప్రజల ప్రాణాలకు పునర్జన్మనిస్తూ ఆదర్శంగా నిలుస్తున్న ట్యాంక్‌బండ్‌ శివకు తెలంగాణ ప్రభుత్వం పూర్తి అండగా నిలిచింది. ట్యాంక్‌బండ్‌ శివను గుర్తించి రూ.5 లక్షల ఆర్థిక సహాయంతోపాటు ఆ కుటుంబంలోని ఒకరికి ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చింది. ఈ సహాయంతో స్వచ్ఛందంగా ప్రజా సేవ చేస్తున్న ట్యాంక్‌బండ్‌ శివ కష్టాలు కొంత గట్టెక్కినట్టే.

Also Read: Chicken Margin: మాంసంప్రియులు నోరు కట్టేసుకోవాల్సిందే! రేపటి నుంచి చికెన్‌ దుకాణాలు బంద్‌!

హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై ఎంతో మంది ప్రాణాలను కాపాడుతున్న ట్యాంక్‌బండ్‌ శివకు ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించారు. ఆర్థిక సహాయంతో పాటు ట్యాంక్‌బండ్‌ శివ కుమారుడు వేణుమాధవ్‌కు హోంగార్డు ఉద్యోగం ఇచ్చింది. దీనికి సంబంధించిన నియామకపత్రాన్ని ఆ కుటుంబానికి సీఎం అందజేశారు. ప్రమాదవశాత్తు, లేదా ఇతరత్రా ఘటనల్లో హైదరాబాద్ హుస్సేన్ సాగర్‌ (ట్యాంక్‌బండ్)లో పడడంతోపాటు జీవితంపై విరక్తితో ప్రాణాలు తీసుకుంటున్న వారి ఎంతోమంది ప్రాణాలను శివ కాపాడడాన్ని అభినందించారు. అయితే కుటుంబ పోషణ భారమై శివ ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని తెలియడంతో ముఖ్యమంత్రి స్పందించి వెంటనే తన వద్దకు పిలుపించుకున్నారు.

Also Read: Heat Waves: ఏపీలోని ఈ జిల్లాలకు భారీ అలర్ట్‌.. రాబోయే రోజుల్లో తీవ్ర వడగాలులు

ట్యాంక్‌బండ్‌ శివకు అవసరమైన సహాయం అందించాలని కొద్ది రోజుల కిందట ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. సీఎం ఆదేశాలతో స్పందించిన అధికారులు చర్యలు తీసుకుని శివ కుమారుడికి హోంగార్డు ఉద్యోగ బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా శివ కుటుంబం ముఖ్యమంత్రిని కలిశారు. ఉపాధి కోసం ట్యాంక్‌బండ్ సమీపంలో ఒక స్విమ్మింగ్‌పూల్‌ నిర్మించి ఇవ్వాలని ఈ సందర్భంగా శివ కోరడంతో ఆ దిశగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. శివ కుటుంబానికి డబుల్ బెడ్రూం ఇల్లు మంజూరు చేయాలని అధికారులకు సీఎం ఆదేశించారు. తమను గుర్తించి ఆదుకున్న తెలంగాణ ప్రభుత్వంపై అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి చేతులమీదుగా సాయం అందుకోవడం ఎంతో సంతోషంగా ఉందని ట్యాంక్‌బండ్‌ శివ కుటుంబ సభ్యులు తెలిపారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report
Advertisement
Advertisement
Back to top