హామిల అమలు కోసం కలెక్టరేట్ ఎదుట ధర్నా
Mahabubabad, Telangana:కాంగ్రెస్ ఇచ్చిన ఆరు హామీ పథకాలను అమలు చేయాలని సీపీఐఎంఎల్ మాస్ లైన్ పార్టీ ఖమ్మం కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టింది. అర్హులైన వారికి నివాస స్థలం, ఇళ్లు నిర్మించి ఇవ్వాలి. రేషన్కార్డులు, పోడు భూములకు పట్టాలు, రైతు బీమా, పింఛన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అధికారం చేపట్టి ఎనిమిది నెలలు అవుతున్నా ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
Thalliki Vandanam: 'తల్లికి వందనం' భారీ మోసం.. సిమ్లతో రూ.3 కోట్ల దోపిడీ
Kurnool, Andhra Pradesh:Thalliki Vandanam Cyber Fraud In Kurnool With Virtual SIM In KurnoolKurnool: సైబర్ నేరగాళ్ల భారీ మోసం.. కర్నూలులో బాధితుల లబోదిబో
Kurnool, Andhra Pradesh:Rs 3 Crore Cyber Fraud On Name Of Thalliki Vandanam Scheme In KurnoolCyber Fraud: బిగ్ అలర్ట్.. ఓటీపీలు చెప్పడంతో తల్లికి వందనం రూ.3 కోట్లు దోపిడీ
Kurnool, Andhra Pradesh:Thalliki Vandanam Scheme: విద్యా వ్యవస్థ బలోపేతం.. డ్రాపౌట్లు నివారించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకువచ్చిన తల్లికి వందనం పథకం విజయవంతంగా అమలవుతోంది. ఈ పథకం కింద విద్యార్థుల తల్లులకు రూ.13 వేలు బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ పథకాన్ని ఆసరాగా చేసుకుని సైబర్ మోసగాళ్లు భారీ మోసానికి పాల్పడ్డారు. రూ.3 కోట్ల మేర దోపిడీ చేశారు. ఈ సంఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకోగా.. మోసపోయిన బాధితులు లబోదిబోమంటున్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
'తల్లికి వందనం' పథకం లబ్ధిదారులను లక్ష్యంగా చేసుకుని.. వర్చువల్ సిమ్ల ద్వారా భారీ సైబర్ మోసానికి పాల్పడ్డారని పథకం లబ్ధిదారులు వాపోయారు. సైబర్ నేరగాళ్లు లబ్ధిదారులకు ఫోన్ చేసి, వారి నుంచి ఓటీపీలను సేకరించి.. తద్వారా వారి బ్యాంకు ఖాతాల్లో జమ అయిన నిధులను కాజేసినట్లు పోలీసులు గుర్తించారు. కర్నూలు నగరానికి చెందిన పలువురు బాధితుల ఫిర్యాదుల మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వర్చువల్ సిమ్లను ఉపయోగించి మోసాలకు పాల్పడుతున్న ముఠాను గుర్తించారు.
తల్లికి వందనం పథకం సైబర్ మోసం కేసులో ప్రధాన నిందితుడిని కర్నూలు పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి 36 వర్చువల్ సిమ్లు, మొబైల్ ఫోన్లు, ఇతర కీలక ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా ద్వారా కోట్ల రూపాయల విలువైన లావాదేవీలు జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని వన్ టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ తదుపరి దర్యాప్తు కోసం ఆధారాలు సేకరిస్తున్నామని, త్వరలోనే సమావేశం ఏర్పాటు చేసి పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.
ఎంత అవగాహన కల్పిస్తున్నా సైబర్ మోసానికి గురవడంతో కర్నూలు పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ సందర్భంగా పోలీసులు ప్రజలకు కీలక సూచనలు జారీ చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియని వ్యక్తులకు ఓటీపీలు, బ్యాంకు ఖాతా వివరాలు లేదా వ్యక్తిగత సమాచారాన్ని వెల్లడించవద్దని సూచించారు. అనుమానాస్పద ఫోన్ కాల్స్ లేదా సందేశాలు వచ్చిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్ను లేదా సైబర్ క్రైమ్ విభాగాన్ని సంప్రదించాలని ప్రజలకు సూచనలు చేశారు. తల్లికి వందనం పథకం కింద ఇప్పటికే ఏపీ పోలీస్ యంత్రాంగం అవగాహన కల్పించినా ఈ స్థాయిలో పెద్ద ఎత్తున మహిళలు మోసపోవడం విస్మయానికి గురి చేసింది.
ఎల్లంపల్లి వద్ద వరద ముప్పు.. తీరప్రాంత ప్రజలకు తీవ్ర హెచ్చరికలు!
Hyderabad, Telangana:Yellampalli Project News: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల ధాటికి ఉత్తర తెలంగాణలోని ప్రధాన జలాశయాలకు జలకళ సంతరించుకుంది. ఎగువన ఉన్న కడెం ప్రాజెక్టు భారీ వరద ప్రవాహం చేరుకోవడంతో అధికారులు గేట్లు ఎత్తి దిగువకు భారీగా నీటిని విడుదల చేశారు. దీంతో మంచిర్యాలతో పాటు పెద్దపల్లి జిల్లాల సరిహద్దుల్లోని ఎల్లంపల్లి ప్రాజెక్ట్కు వరద ప్రవాహం అత్యంత ఉధృతంగా పెరుగుతోంది. అయితే, భద్రతను దృష్టిలో ఉంచుకుని ఇరిగేషన్ శాఖ అధికారులు తక్షణమే అత్యవసర చర్యలు చేపట్టారు.
ఈ రోజు రాత్రి 7:30 గంటలకు ఎల్లంపల్లి ప్రాజెక్ట్ రేడియల్ క్రస్ట్ గేట్లను తెరిచి.. దిగువ గోదావరి నదిలోకి దాదాపు 1,00,000 క్యూసెక్కులకు పైగా నీటిని విడుదల చేయనున్నట్లు రామగుండం ఇరిగేషన్ విభాగం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (EE) అధికారికంగా ప్రకటించారు.
వరద నీరు ఒక్కసారిగా ఉప్పొంగే ప్రమాదం ఉన్నందున ప్రాజెక్ట్ దిగువన ఉన్న గోదావరి పరివాహక గ్రామాల ప్రజలను అధికారులు ప్రత్యేకమైన హెచ్చరికలు జారీ చేశారు. గోదావరి తీర ప్రాంతాల వైపు ఎవరూ వెళ్లకూడదని ఆంక్షలు విధించారు. ముఖ్యంగా ఈ ప్రాంతాలకు సంబంధించిన ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
అలాగే నదిలో ప్రవాహ వేగం ప్రమాదకర స్థాయిలో ఉన్నందున చేపల వేట కోసం నదిలోకి దిగడం కానీ.. పడవలు నడపడం మానుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. పశువులను, గొర్రెలతో పాటు మేకల మందలను మేత కోసం నదీ తీరంలోకి కానీ.. ముంపు ప్రాంతాల్లోకి గానీ తీసుకెళ్లవద్దని కోరారు. దిగువ ముంపు ప్రాంతాల ప్రజలు నిరంతరం పరిస్థితిని గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని.. అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు లేదా పునరావాస కేంద్రాలకు మారేందుకు సిద్ధంగా ఉండాలని ఆదేశించారు.
Also Read: గౌరవెల్లి రిజర్వాయర్కు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్.. ప్రజల దశాబ్దాల కల నెరవేరింది..
అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు పోలీస్, రెవెన్యూ యంత్రాంగాలు, ప్రజా ప్రతినిధులు తక్షణమే క్షేత్రస్థాయిలోకి రావాలని.. ఇరిగేషన్ శాఖ విజ్ఞప్తి చేసిన్నట్లు కూడా తెలుస్తోంది.. నదీ తీర గ్రామాల్లో మైకుల ద్వారా దండోరా వేయిస్తూ.. ప్రజలను చైతన్య పరచాలని సూచించారు. ముందస్తు హెచ్చరిక చర్యల ద్వారా ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
Also Read: గౌరవెల్లి రిజర్వాయర్కు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్.. ప్రజల దశాబ్దాల కల నెరవేరింది..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.
రైలులో పూజలు.. దీపం వెలిగించి షాకిచ్చిన ప్రయాణికుడు.. వైరల్ వీడియో..
Hyderabad, Telangana:Man Lights Diya Inside Moving Train Video: భక్తితో ఉండడం తప్పు కాదు.. కానీ అది ఇతరుల ప్రాణాలకు లేదా ప్రజా ఆస్తులకు ముప్పుగా మారినప్పుడు తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేస్తోంది.. కదులుతున్న ఒక రైలులో ఒక వ్యక్తి చేసిన నిర్వాకం ఇప్పుడు ఇంటర్నెట్లో తీవ్ర దుమారాన్ని రేపుతోంది.. దీనికి సంబంధించిన వీడియో కూడా ఇప్పుడు సోషల్ మీడియాల్లో సంచలనంగా మారింది. అయితే, దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
కదులుతున్న రైలులో దీపారాధన..
సాధారణంగా రైలు ప్రయాణాల్లో అగ్గిపెట్టెలు, లైటర్లు లేదా మండే స్వభావం కలిగిన పదార్థాలను తీసుకెళ్లడం చట్టరీత్యా నేరం.. కానీ, ఓ వ్యక్తి వీటన్నింటినీ పక్కన పెట్టి.. భారీగా ప్రయాణికులు కలిగిన కదులుతున్న రైలు భోగిలోనే పూజలు చేయడం ప్రారంభించాడు.. అంతటితో ఆగకుండా ప్రమిదలో నూనె పోసి.. ఒత్తి వేసి నిప్పు వెలిగించాడు. రైలు వేగంగా వెళ్తుండగా దేవుడికి హారతి ఇస్తూ.. నమస్కారాలు చేయడం ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోలో మీరు క్లియర్గా చూడొచ్చు..
ప్రమాదం జరిగితే పరిస్థితి ఏంటి?
రైలు వేగంగా వెళ్తున్నప్పుడు గాలి దాటికి ఆ దీపం కిందపడినా.. లేదా పక్కనే ఉన్న ప్రయాణికుల దుస్తులకు, సీట్లకు మంటలు అంటుకున్నా తీవ్ర ప్రమాదం జరిగే అవకాశం ఉంది.. గతంలో రైళ్లలో సంభవించిన ప్రమాదాలను గుర్తుచేసుకుంటూ.. పలువురు ప్రయాణికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక చిన్న నిప్పు రవ్వ కూడా పెద్ద ఎంత ప్రమాదానికి దారితీస్తుందో తెలిసి కూడా ఇలాంటి బాధ్యతారాహిత్యమైన పనులు చేయడంపై ఆ వ్యక్తిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
A fellow passenger reportedly intervened, explaining that such acts can be dangerous. Smoke may trigger the train's… pic.twitter.com/79SrmBnAdW
— Jharkhand Rail Users (@JharkhandRail) July 26, 2026
Also Read: పోలీస్ వ్యాన్ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!
నెటిజన్ల తీవ్ర ఆగ్రహం..
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగానే సోషల్ మీడియా వినియోగదారులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. భక్తి ఉండాలి కానీ ఇలాంటి పిచ్చి పనులు కాదు.. ఇది భక్తి కాదు.. ప్రయాణికుల ప్రాణాలతో ఆడుకోవడమే.. అంటూ కామెంట్లు చేస్తున్నారు. కొందరు నెటిజన్లు ఈ వీడియోను రైల్వే మంత్రిత్వ శాఖకు, రైల్వే పోలీస్ ఫోర్స్ (RPF)కు ట్యాగ్ చేస్తూ.. సదరు వ్యక్తిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Also Read: పోలీస్ వ్యాన్ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Rat steals diamond Video: హమ్మా.. నీకెందుకే బంగారం.. 10 లక్షల విలువైన వజ్రాల ఆభరణాల్ని కాజేసిన ఎలుక.. వీడియో చూస్తే షాక్..
Hyderabad, Telangana:Rat steals diamond jewellery worth rs 10 lakh in Karnataka: సాధారణంగా నగల షాపులోని యజమానులు చాలా జాగ్రత్తగా ఉంటారు. ముఖ్యంగా బంగారం, వెండి రెట్లు ధరలు భారీగా పెరిగిపోయిన తర్వాత చోరీలు మరీ ఎక్కువయ్యాయి. ఈక్రమంలో ఇప్పటికే చాలా మంది కస్టమర్ల రూపంలో వచ్చిన దొంగలు బంగారంను కొట్టేస్తు అడ్డంగా దొరికిపోయిన ఘటనలు కొకొల్లలు. సీసీటీవీలో ఎప్పటికప్పుడు సిబ్బంది నిఘాలుపెడుతుంటారు. ఒక కస్టమర్ షోరూంలో ఎంట్రీ అయినప్పటి నుంచి అతను తిరిగి వెళ్లిపోయే వరకు ఒక కంట కనిపెడుతూనే ఉంటారు. ఏ మాత్రం అనుమానాస్పదంగా కన్పించిన వెంటనే అతడ్ని పట్టుకుని తనిఖీలు చేస్తారు. ఈ క్రమంలో కర్ణాటకలోని తూమకూరులోని గోల్డ్ షాపులో వింత ఘటన చోటు చేసుకుంది. ఇది కాస్త ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
A jewellery store in Tumakuru was left puzzled after several gold rings and chains went missing overnight, only for CCTV footage to reveal an unlikely culprit—a rat.
The incident occurred at Vishwas Jewellers, where staff discovered the missing ornaments during their routine… pic.twitter.com/fJexzVf834
— Hate Detector 🔍 (@HateDetectors) July 30, 2026
కర్ణాటకలోని తుమకూరులో ఒక నగల దుకాణం ఉంది.దీనిలో అనేక రకాల బంగారం, వెండి నెక్లెస్ లు, వజ్రాల నగలు ఉన్నాయి. కస్టమర్లు రోజు వస్తుంటారు. ఇటీవల రూ. 10 లక్షల విలువైన వజ్రాలు పొదిగిన చిన్న బంగారు ఆభరణాలు మాయం అయ్యాయి. దీంతో షాపు యజమాని ఖంగుతిన్నాడు. షాపులో ఎవరైన చోరీకి పాల్పడ్డారా అని సీసీ ఫుటేజీ అంతా పరిశీలించాడు.
ఆ తర్వాత వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగలోకి దిగిన స్థానిక పోలీసులు ఆ షాపులో ఉన్న ప్రతి ఒక్క సీసీ ఫుటేజీని చాలా జాగ్రత్తగా గమనించారు. అప్పుడు ఒక ఎలుక బంగారం నగలు ఉన్న ర్యాక్ లోకి ప్రవేశించి చిన్న చిన్న నగల్ని పట్టుకుని తన కలుగులోకి లాక్కెళ్లడంను గమనించారు .అక్కడ వెళ్లి చూడగా నిజం ఒక ఎలుక కలుగు ఉంది.
వెంటనే అక్కడి బొరియను తవ్వి చూశాడు. పోయిన ఆభరణాలు అందులో బైటపడ్డాయి. వాటి విలువ దాదాపు 10 లక్షలుగా షోరూమ్ సిబ్బంది చెప్పాడు. ఏది ఏమైన పొయిందనుకున్న వజ్రాలు లభించడంతో ఆ గోల్డ్ షాపు ఓనర్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అయితే.. ఈ ఎలుక చోరీకి పాల్పడిన ఘటనకు చెందిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
హిమాలయాల్లో మహా వింత.. 15 ఏళ్లకు ఒకసారే పూచే డైమండ్ ఫ్లవర్.. వీడియో..
Hyderabad, Telangana:Himalayan Diamond Flower Video: ప్రకృతి ఒడిలో ఎన్నో వింతలు, విశేషాలు దాగి ఉంటాయని మనందిరికీ తెలుసు.. ముఖ్యంగా మంచు కొండలతో కూడిన హిమాలయాల్లో లభించే వృక్ష సంపద, అరుదైన మొక్కలు నిత్యం శాస్త్రవేత్తలతో పాటు సామాన్యులను సైతం ఆశ్చర్యపరుస్తుంటాయి. తాజాగా అలాంటి ఒక అద్భుతమైన, అత్యంత అరుదైన పువ్వుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటూ వైరల్ అవుతోంది.
సముద్ర మట్టానికి దాదాపు 13,000 అడుగులకు పైగా ఎత్తైన ప్రతికూల వాతావరణంలో మాత్రమే పెరిగే ఈ పువ్వును హిమాలయన్ డైమండ్ ఫ్లవర్ అని.. స్థానికంగా కేంజో (Kenjo) అని పిలుస్తారు. ఈ అరుదైన మొక్క అత్యంత అద్భుతమైన జీవిత చక్రాన్ని కలిగి ఉంటుంది. సాధారణ పూల మొక్కల్లాగా ఇవి ప్రతి ఏటా లేదా ప్రతి సీజన్లో పూయవు.. కేవలం 7 నుంచి 15 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే ఈ మొక్క విరబూస్తూ ఉంటుందని సమాచారం. పైగా.. ఈ పూల ఆకారం మనిషి ఎత్తు కంటే ఎక్కువ పొడవు పెరగడం విశేషం.. దట్టమైన మంచు, హానికరమైన తీవ్ర గాలులు వీచే ఎత్తైన పర్వత ప్రాంతాల్లో ఇది అత్యంత దృఢంగా పెరుగుతుంది.
ఈ కేంజో మొక్క నిర్మాణం సైంటిఫిక్ పరంగా ఎంతో అద్భుతమైనదిగా భావించవచ్చు. పసుపు రంగులో ఉండే దీని ఆకులు ఒక గ్లాస్హౌస్ లాగా పనిచేస్తాయి. ఇవి లోపల ఉన్న సున్నితమైన పువ్వులను, విత్తనాలను హిమాలయాల అతినీలలోహిత (UV) కిరణాలు, చలిగాలుల నుంచి రక్షిస్తూ ఉంటాయని సమాచారం. లోపలి భాగాన్ని వెచ్చగా ఉంచడం వల్ల పునరుత్పత్తి ప్రక్రియకు ఇవి ఎంతగానో సహాయపడుతూ ఉంటాయి.
ఇంతటి ప్రత్యేకత కలిగిన ఈ అరుదైన హిమాలయన్ డైమండ్ ఫ్లవర్ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్లో తెగ చక్కర్లు కొడుతోంది.. ఈ వీడియోను చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఇది నిజంగా ప్రకృతి సృష్టించిన అద్భుతం.. మనిషి కంటే ఎత్తుగా పెరిగే ఇలాంటి వింత పూవును చూడటం ఇదే తొలిసారి.. అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మనుషుల సంచారం లేని అత్యంత ఎత్తైన హిమాలయ ప్రదేశాలలో మాత్రమే కనిపించే ఈ పుష్పం.. ప్రకృతి తన ఒడిలో దాచుకున్న రహస్యాలకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోంది.
Also Read: పోలీస్ వ్యాన్ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
YS Jagan: విద్యార్థి జీవితాన్ని నాశనం చేస్తున్న చంద్రబాబు మనిషా.. రాక్షసుడా?: వైఎస్ జగన్
Srikakulam, Andhra Pradesh:Sidiri Appalaraju Son Bike Accident Case: 'బైక్ ప్రమాదంలో 18 ఏళ్ల విద్యార్థి జీవితాన్ని నాశనం చేస్తున్న చంద్రబాబు గడ్డి తింటున్నారా..? మనిషా? రాక్షసుడా..?' అని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇదే టీడీపీ నాయకులు ఎవరైనా చేస్తే ఇలాగే శిక్షలు విధిస్తారా..? అని ప్రశ్నించారు. 'ఇదే శ్రీకాకుళం ఎమ్మెల్యే, పాతపట్నం ఎమ్మెల్యే ప్రమాదం చేస్తే ఈ కేసుల్లో ఎవరిని అరెస్టు చేశారు. ఒక్కొక్కరికి ఒక్కోలా చేస్తే వ్యవస్థ బతకదు. చంద్రబాబు విష విత్తనాలు నాటుతున్నారు. అదే వ్యవస్థను నాశనం చేస్తున్నారు' అని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం పైడిభీమవరానికి చేరుకుని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుటుంబాన్ని పరామర్శించారు. అప్పలరాజు జైలుకు వెళ్లడంతో తాము ఉంటామని.. వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని ఆ కుటుంబానికి మాజీ సీఎం వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు. అంతకుముందు విశాఖపట్నం నుంచి రోడ్డుమార్గంలో జగన్ శ్రీకాకుళం చేరుకున్నారు. దారిపొడవునా అభిమానులకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ఆంక్షలు ఉన్నప్పటికీ పెద్దసంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. చంద్రబాబు ప్రభుత్వంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. అక్రమ కేసులు పెట్టడమే చంద్రబాబు సర్కారు తెలిసిన పని.. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు సీదిరి అప్పలరాజు అరెస్ట్ ఉదాహరణ అని వివరించారు.
అంపోలు జిల్లా జైలు వద్ద మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు గారి కుటుంబాన్ని పరామర్శించిన వైయస్ జగన్ గారు.#YSJaganInSrikakulam#SadistChandraBabu pic.twitter.com/uDuuONSBti
— YSR Congress Party (@YSRCParty) July 30, 2026
'యాక్సిడెంట్ ఎవరూ కావాలని చేయరు. యాక్సిడెంట్ హత్య ఎలా అవుతుంది? గొర్రెల కాపరి ఎవరో కూడా వీరికి తెలియదు. దురదృష్టవశాత్తు జరిగిన ప్రమాదం. చిన్నపిల్లాడు చేసిన ప్రమాదానికి హత్య, కుట్ర కోణం ఆపాదించారు. బైక్ ప్రమాదం జరిగితే కుట్ర కోణం ఎక్కడుంది?' అని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ నిలదీశారు. అప్పలరాజు టెన్త్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్. చంద్రబాబు అప్పట్లో అభినందించారు కూడా. సీదిరి అప్పలరాజు సామాన్య కుటుంబం నుంచి వచ్చి మంత్రిగా ఎదిగారు. సీదిరిపై తప్పుడు కేసును బనాయించారు. టీడీపీకి చెందినవారు కూడా ప్రమాదం చేస్తే.. వారిపైనా ఇలాగే కుట్ర కేసులు పెడతారా?' మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రశ్నించారు.
'మంచితనాన్ని చంద్రబాబు పూర్తిగా పాతరేశారు. పొరపాటున.. దురదృష్టవశాత్తూ బైక్ ప్రమాదం జరిగింది. అప్పలరాజు కుమారుడు పొరపాటునో.. దురదృష్టవశాత్తునో ప్రమాదం చేశాడు. అతడి కెరీర్ను నాశనం చేయాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వ పెద్దలు కుట్రలకు దిగారు. అప్పలరాజును కూడా ఇరికించారు' అని మాజీ సీఎం వైఎస్ జగన్ వివరించారు. 'అప్పలరాజు కుమారుడి భవిష్యత్తును నాశనం చేయాలని చూస్తున్నారు. చెడు విత్తనాలు నాటుతున్నారు. ఇవి వృక్షాలై వ్యవస్థను నాశనం చేస్తాయి. ప్రమాదం జరిగిన వెంటనే 108కు ఫోన్ చేసి.. సీపీఆర్ కూడా చేశాడు. రాష్ట్రంలో కక్ష సాధింపు చర్యలకు అప్పలరాజు అరెస్ట్ ఒక ఉదాహరణ' అని చంద్రబాబు పాలనపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. యాక్సిడెంట్ను హత్య కేసుగా మార్చి సీదిరి కుటుంబంపై కూటమి ప్రభుత్వం కుట్రలకు తెరలేపిందని విమర్శించారు.
'రాష్ట్రంలో కక్ష సాధింపు రాజకీయాలు జరుగుతున్నాయనే దానికి ఇదే నిదర్శనం. కనీసం మానవతా విలువలు లేకుండా మంచితనానికి పాతరేశారు. నీట్ రాసి.. తన తండ్రిలాగా డాక్టర్ అవ్వాలని అనుకున్నాడు సీదిరి కుమారుడు. తెలిసో తెలియకుండా యాక్సిడెంట్ చేశాడు. కానీ కేసును ట్విస్ట్ చేసి హత్య చేశాడని, కుట్ర చేసి సీదిరి కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నారు' అని చంద్రబాబుపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
అనుకోని పరిస్థితుల్లో రోడ్డు ప్రమాదం జరిగితే.. ఆ పిల్లాడి జీవితాన్ని నాశనం చేయాలని చూడటం ఎంతవరకు సరైంది అని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ప్రశ్నించారు. 'బీసీల్లో సీదిరి మంచి నాయకుడు. చిన్న పిల్లాడు చేసిన యాక్సిడెంట్ను కుట్రగా.. హత్యగా చిత్రీకరించి సీదిరి కుటుంబాన్ని ఇరికించే కార్యక్రమం ఎంతవరకు ధర్మం' అని నిలదీశారు. అప్పలరాజును ఇబ్బంది పెట్టేలా తన కెరీర్ను నాశనం చేయాలని దుర్మార్గకపు ఆలోచన చేస్తున్నారని మండిపడ్డారు.
ఇంటర్నెట్ను ఊపేస్తున్న పంజాబీ డాన్స్.. అబ్బబ్బ భలే ఉంది..
Hyderabad, Telangana:Punjabi Girl Video Viral: సోషల్ మీడియాలో ఎప్పుడు ఏ వీడియో వైరల్ అవుతుందో చెప్పడం కష్టం.. ముఖ్యంగా డాన్స్ వీడియోలకు నెటిజన్ల నుంచి లభించే ఆదరణే వేరు.. తాజాగా పంజాబీ సంప్రదాయ దుస్తుల్లో ఒక యువతి చేసిన డాన్స్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. దీనిని చూసిన సోషల్ మీడియా వినియోగదారులు ఫిదా అవుతున్నారు. అయితే, ఈ వీడియో ఇంతలా వైరల్ అవ్వడానికి గల కారణాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
సాధారణంగా పంజాబీ డాన్స్ అనగానే ఉత్సాహం, ఎనర్జీ, కలర్ఫుల్ మూవ్స్ మనకు గుర్తుకొస్తాయి. ఈ వైరల్ వీడియోలోనూ సరిగ్గా అదే జరిగింది.. ఎరుపు రంగు పంజాబీ సూట్ (Red Suit) ధరించిన ఒక యువతి.. పంజాబీ పాటలకు వేసిన స్టెప్పులు చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఆమె డాన్స్ మూవ్స్, బాడీ లాంగ్వేజ్, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ పర్ఫెక్ట్గా ఉండటంతో ఈ వీడియో తక్కువ సమయంలోనే లక్షలాది మంది దృష్టిని ఆకర్షిస్తోంది..
ఆకట్టుకుంటున్న ఎక్స్ప్రెషన్స్..
ఈ వీడియోలోని యువతి డాన్స్ మాత్రమే కాదు.. ఆమె ముఖంలో కనిపిస్తున్న Expressions ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయిగా భావించవచ్చు.. పాటలోని ప్రతి బీట్కు అనుగుణంగా ఆమె ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్, వేసిన స్టెప్స్ చూసి నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. సంప్రదాయ దుస్తులలో ఇంతటి ఎనర్జిటిక్ డాన్స్ చేయడం నిజంగా అద్భుతమని నెటిజన్స్ అంటున్నారు..
ఈ వీడియోను వివిధ సోషల్ మీడియా ఫ్లాట్ఫామ్స్లో వేలాది మంది షేర్ చేస్తున్నారు. రియల్ టాలెంట్ అంటే ఇదే.. చూపు తిప్పుకోలేకపోతున్నాం.. పంజాబీ సంస్కృతికి తగ్గట్టుగా చాలా అందంగా డాన్స్ చేసింది.. అంటూ నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ వీడియోకు లైకులతో పాటు కామెంట్లు నిమిషాల్లోనే విపరీతంగా పెరిగిపోతున్నాయి.
Also Read: పోలీస్ వ్యాన్ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!
ప్రస్తుతం ఈ డాన్స్ వీడియో ఇంటర్నెట్లో ఒక సంచలనంగా మారిందని భావించవచ్చు. గూగుల్ ట్రెండింగ్ లిస్ట్లో కూడా చోటు దక్కించుకుంటోంది. టాలెంట్ ఉంటే చాలు.. సరైన వేదిక లభిస్తే ఎవరైనా సోషల్ మీడియా స్టార్గా మారవచ్చని ఈ ఘటన మరొకసారి గుర్తు చేసింది..
Also Read: పోలీస్ వ్యాన్ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
KCR: మనవడి కోసం ఆస్పత్రికి వచ్చిన తెలంగాణ తొలి సీఎం కేసీఆర్
Hyderabad, Telangana:Former CM KCR Visits Hospital For His Grand Son Himanshu RaoNeeraj Chopra: కామన్వెల్త్ గేమ్స్లో సత్తా చాటిన నీరజ్ చోప్రా..ఫైనల్లో అడుగుపెట్టిన ముగ్గురు భారత అథ్లెట్లు!
Hyderabad, Telangana:Neeraj Chopra CWG Final: కామన్వెల్త్ గేమ్స్ (CWG) 2026 పురుషుల జావెలిన్ త్రో క్వాలిఫికేషన్ రౌండ్లో భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా అద్భుతమైన ప్రదర్శన చేశాడు. రెండుసార్లు ఒలింపిక్ పతక విజేతగా నిలిచిన నీరజ్ చోప్రా కామన్వెల్త్ గేమ్స్లో ఫైనల్ పోరుకు చేరాడు. ఫైనల్కు అర్హత సాధించే క్రమంలో తీవ్రమైన పోటీ నెలకొనగా..నీరజ్ చోప్రాతో పాటు మరో ఇద్దరు భారత ఆటగాళ్లు సత్తా చాటి ఫైనల్కు చేరారు.
క్వాలిఫికేషన్ హైలైట్స్
ఈ పోటీలో పాల్గొన్న ఏ అథ్లెట్ కూడా నిర్ణీత 84 మీటర్ల ఆటోమేటిక్ క్వాలిఫికేషన్ మార్కును అందుకోలేకపోయారు. ఆటోమేటిక్ మార్కు నమోదు కాకపోవడంతో, ఉత్తమ ప్రతిభ కనబరిచిన టాప్-12 మంది అథ్లెట్లను ఫైనల్ రౌండ్కు ఎంపిక చేశారు. 2018 కామన్వెల్త్ గేమ్స్ ఛాంపియన్ అయిన నీరజ్ చోప్రా 79.61 మీటర్ల ఉత్తమ త్రోతో క్వాలిఫికేషన్ స్టాండింగ్స్లో ఐదవ స్థానంలో నిలిచి ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకున్నారు.
భారత్ నుండి ముగ్గురు ఫైనల్కు
నీరజ్ చోత్రాతో పాటు ఇతర భారతీయ జావెలిన్ త్రో అథ్లెట్లు కూడా అంచనాలను అందుకుంటూ ఫైనల్లోకి ప్రవేశించారు. రోహిత్ యాదవ్ 78.37 మీటర్ల త్రోతో తొమ్మిదవ స్థానంలో ఉండగా.. యశ్ వీర్ సింగ్ 78.36 మీటర్ల త్రోతో పదవ స్థానంలో నిలిచాడు.
ఫైనల్ చేరిన ఆటగాళ్ల వివరాలు..
1) రుమేష్ పతిరాగే (శ్రీలంక) - 82.84 మీటర్లు
2) ఆండర్సన్ పీటర్స్ (గ్రేనాడా) - 81.29 మీటర్లు
3) డౌ స్మిత్ (దక్షిణాఫ్రికా) - 80.64 మీటర్లు
4) బెన్ ఈస్ట్ (ఇంగ్లాండ్) - 80.38 మీటర్లు
5) నీరజ్ చోప్రా (భారత్) - 79.61 మీటర్లు
6) కామెరాన్ మెక్ఎంటైర్ (ఆస్ట్రేలియా) - 78.91 మీటర్లు
7) అర్షద్ నదీమ్ (పాకిస్థాన్) - 78.63 మీటర్లు
8) కీషాన్ స్ట్రాచన్ (బహ్మాస్) - 78.60 మీటర్లు
9) రోహిత్ యాదవ్ (భారత్) - 78.37 మీటర్లు
10) యశ్ వీర్ సింగ్ (భారత్) - 78.36 మీటర్లు
11) కేశోర్న్ వాల్కాట్ (ట్రినిడాడ్ & టొబాగో) - 78.26 మీటర్లు
12) చినెచెరెమ్ నమ్ది (నైజీరియా) - 75.27 మీటర్లు.
ఫైనల్ మ్యాచ్ వివరాలు
జావెలిన్ త్రో ఫైనల్ పోరు భారత కాలమానం ప్రకారం శనివారం (ఆగస్టు 1) అర్ధరాత్రి 12:45 గంటలకు (IST) ప్రారంభం కానుంది. పతకం కోసం జరిగే ఈ తుది పోరులో భారత్ నుండి ముగ్గురు అథ్లెట్లు బరిలోకి దిగుతున్నారు.
Also Read: మీరాబాయి చానుకు బంగారు పతకం..కామన్ వెల్త్ గేమ్స్లో భారత జెండా రెపరెపలు
Also Read: రహానే కెప్టెన్సీలో భారత్ ఒక్క మ్యాచ్ ఓడిపోలేదు..కానీ, చివరికి అతడ్ని పక్కన పెట్టారు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
గౌరవెల్లి రిజర్వాయర్కు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్.. ప్రజల దశాబ్దాల కల నెరవేరింది..
Hyderabad, Telangana:Gouravelli Reservoir: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజల దశాబ్దాల కలను సాకారం చేస్తూ.. గౌరవెల్లి రిజర్వాయర్ పర్యావరణ అనుమతులపై సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పునిచ్చింది. ప్రాజెక్టుకు సంబంధించిన ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్కు అత్యున్నత న్యాయస్థానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఎన్నో ఏళ్లుగా న్యాయపరమైన చిక్కుల్లో నలిగిపోయిన గౌరవెల్లి నిర్మాణానికి ఎట్టకేలకు మోక్షం లభించింది.
తుది దశకు ప్రాజెక్ట్..
గతంలో BRS ప్రభుత్వ హయాంలో పర్యావరణ అనుమతులు లేకుండానే.. గౌరవెల్లి ప్రాజెక్టును నిర్మిస్తున్నారని ఆరోపిస్తూ.. కొందరు భూ నిర్వాసితులు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT), సుప్రీంకోర్టు వనశక్తి సంస్థల ద్వారా కేసు దాఖలు చేశారు. దీంతో పనులు నిలిచిపోయాయి. అయితే, తాజాగా ఈ కేసులపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. రాష్ట్రంలో ఇప్పటికే మంజూరైన కీలక సాగునీటి ప్రాజెక్టుల పర్యావరణ అనుమతులు పూర్తిగా చెల్లుబాటులో ఉంటాయని స్పష్టం చేసింది.. ప్రస్తుతం 95 శాతం పనులు పూర్తయిన ఈ ప్రాజెక్టు.. మిగిలిన 5 శాతం పనులను కూడా త్వరితగతిన పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావడానికి మార్గం సుగమమైంది.
1.20 లక్షల ఎకరాలకు సాగునీరు..
మొత్తం 8.23 TMCల నీటి నిల్వ సామర్థ్యంతో నిర్మిస్తున్న గౌరవెల్లి రిజర్వాయర్ పూర్తయితే.. హుస్నాబాద్ పరిసర ప్రాంతాల్లోని 1,20,000 ఎకరాలకు పైగా ఆయకట్టుకు పుష్కలంగా సాగునీరు అందుతుంది. వర్షాభావ పరిస్థితులతో నిత్యం కరువు భయంతో అల్లాడే ఈ ప్రాంతం.. గౌరవెల్లి జలాలతో సస్యశ్యామలం కాబోతోంది. వ్యవసాయ రంగం పండుగలా మారి.. స్థానిక రైతాంగ ఆర్థిక పరిస్థితి రూపురేఖలు మారనున్నాయి.
సుప్రీంకోర్టు అనుకూల తీర్పునివ్వడంతో హుస్నాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా పండగ వాతావరణం నెలకొంది. పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ నాయకులు, రైతులు భారీ ఎత్తున టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి.. ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకున్నారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని సుప్రీంకోర్టులో బలమైన వాదనలు వినిపించడం వల్లే ఈ విజయం సాధ్యమైందని కొనియాడారు.. ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా రైతు ప్రయోజనాలే ధ్యేయంగా పనిచేస్తున్న ప్రస్తుత ప్రజా పాలన ప్రభుత్వం నిజమైన రైతు సంక్షేమ ప్రభుత్వం అని నిరూపించుకుందని హర్షం వ్యక్తం చేశారు.
Also Read: పోలీస్ వ్యాన్ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
IMD Weather Alert: ఏపీ, తెలంగాణకు భారీ తుఫాను ముప్పు..బంగాళాఖాతంలో తీవ్ర అలజడి!
Nunna, Vijayawada, Andhra Pradesh:IMD Heavy Rain Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణ మార్పుల కారణంగా తెలుగు రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తనున్నాయి. భారత వాతావరణ శాఖ (IMD) ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు కీలక వాతావరణ హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణలో పలుచోట్ల భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా, ఆంధ్రప్రదేశ్లో రాబోయే 7 రోజుల పాటు విస్తారంగా వర్షాలు, పిడుగులు, గంటకు 40-50 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ఈ క్రమంలో అమరావతి, హైదరాబాద్ వాతావరణ కేంద్రాలు విడుదల చేసిన తాజా వివరాలు ఇలా ఉన్నాయి.కదులుతున్న రైలు డోర్ను పట్టుకుని ప్రాణాలకు తెగించి డ్యాన్స్.. షాకింగ్ వీడియో వైరల్!
Hyderabad, Telangana:Viral Train Stunt Video: సోషల్ మీడియాలో లైక్స్, కామెంట్స్, ఫాలోవర్ల కోసం నెటిజన్లు ఎంతటి సాహసానికైనా వెనుకాడటం లేదు.. రోజురోజుకూ రీల్స్ క్రేజ్ పరాకాష్ఠకు చేరుతోంది.. సోషల్ మీడియాలో ఒక్కరాత్రిలోనే వైరల్ అయిపోవాలనే.. తపనతో కొందరు తమ ప్రాణాలను సైతం పణంగా పెడుతున్నారు. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక షాకింగ్ వీడియో చూస్తే.. ఎవరైన ఆశ్చర్యపోవాల్సిందే. కదులుతున్న రైలు తలుపుల నుంచి వేలాడుతూ ఒక మహిళ చేసిన విన్యాసాలు ప్రస్తుతం నెటిజన్లను ఊహించని స్థాయిలో ఆశ్చర్యానికి గురిచేస్తోంది..
సోషల్ మీడియా ప్లాట్ఫామ్ Xలో అందుబాటులో ఉన్న 12 సెకన్లు కలిగిన ఈ వీడియోలో.. ఓ మహిళ వేగంగా వెళ్తున్న రైలు తలుపుల నుంచి నిలబడి ప్రమాదకర రీతిలో డ్యాన్స్ చేస్తూ కనిపించింది. రైలు డోర్కు ఇరువైపులా ఉన్న హ్యాండిల్స్ను పట్టుకుని.. చుట్టూ ఉన్న ప్రమాదాన్ని పూర్తిగా మర్చిపోయి.. కెమెరా ముందు రకరకాల డ్యాన్స్ స్టెప్పులేసింది. రైలు అత్యంత వేగంతో ప్రయాణిస్తున్నప్పటికీ.. చిన్నపాటి పట్టు తప్పినా లేదా రైలుపై నుంచి కాలు జారినా నేరుగా ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని తెలిసి.. కూడా ఆమె ఏమాత్రం భయపడకుండా రీల్ చిత్రీకరించడం స్పష్టంగా కనిపిస్తోంది..
— zamir (@jamir1919) July 28, 2026
నెటిజన్ల తీవ్ర ఆగ్రహం..
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారడమే ఆలస్యం.. వేల సంఖ్యలో వ్యూస్, కామెంట్లతో నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. అయితే, చాలామంది యూజర్లు సదరు మహిళ ప్రవర్తనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం కొన్ని లైక్స్, కామెంట్స్ కోసం ప్రాణాలతో చెలగాటం ఆడటం ఎంతవరకు మంచిదని? అని ప్రశ్నిస్తున్నారు. వేగంగా వెళ్తున్న రైలులో గాలి తీవ్రత లేదా హ్యాండిల్ జారితే క్షణాల్లో దారుణమైన ప్రమాదం జరుగుతుందని.. ఇటువంటి ప్రమాదకరమైన పనులను ఎంతమాత్రం ప్రోత్సహించకూడదని అధికారులు సూచిస్తున్నారు.
Also Read: పోలీస్ వ్యాన్ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!
సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడానికి ఇలాంటి రిస్కీ స్టంట్స్ చేసే వారిపై రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF), రైల్వే అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ప్రయాణాల సమయంలో ప్రయాణికుల భద్రత అత్యంత కీలకమని.. ఇటువంటి ఘటనలు ఇతరులకు, ముఖ్యంగా యువతకు తప్పుడు సందేశాన్ని ఇస్తాయని అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం రైలు పట్టాలపై, కదులుతున్న బోగీలపై రీల్స్ చేస్తూ ప్రమాదాల బారిన పడుతున్న ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో.. ఈ తరహా స్టంట్లపై కఠిన నిబంధనలు అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.
Also Read: పోలీస్ వ్యాన్ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..
School Holidays: తెలంగాణ విద్యార్థులకు గుడ్న్యూస్..భారీ వర్షాలు, బోనాల సందడి..వరుసగా 4 రోజులు సెలవులు?
Hyderabad, Telangana:Telangana School Holidays: తెలంగాణలో నైరుతి రుతుపవనాలు పూర్తిస్థాయిలో పుంజుకోవడంతో పాటు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. రాష్ట్రవ్యాప్తంగా కుండపోత వర్షాలు కురుస్తుండగా, ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతుండటంతో జలాశయాలు నిండుకుండలా మారాయి. ఈ నేపథ్యంలో విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది.
భారీ వర్షాలు-విద్యాసంస్థలకు సెలవులు
వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో గురువారం (జూలై 30) రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు కలెక్టర్లు సెలవులు ప్రకటించారు. జగిత్యాల, కొమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి జిల్లాలతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో వర్ష తీవ్రతను బట్టి స్కూళ్లకు సెలవులు ఇచ్చారు.
వారమంతా సెలవుల జోరు
జూలై 30 నుండి ఆగస్టు 1 వరకు వర్షాలు మరింత తీవ్రంగా ఉండే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆదిలాబాద్, నిజామాబాద్, మంచిర్యాల, సిరిసిల్ల, కరీంనగర్, ములుగు తదితర జిల్లాలకు రెడ్, ఆరెంజ్, యెల్లో అలర్ట్లు జారీ చేశారు. పరిస్థితులను బట్టి శుక్ర, శనివారాల్లో కూడా స్థానిక కలెక్టర్లు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించే అవకాశాలున్నాయి.
బోనాల వేడుకలు-ప్రత్యేక సెలవులు
ఈ వర్షాల జోరు మధ్యే ఆషాడమాస బోనాల సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి.
ఆగస్టు 2 (ఆదివారం): సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. నగర నలుమూలల నుంచే కాక వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి బోనాలతో మొక్కులు చెల్లించుకుంటారు.
ఆగస్టు 3 (సోమవారం): బోనాల మరుసటి రోజు ఉజ్జయిని మహంకాళి ఆలయంలో 'భవిష్యవాణి' (రంగం), సాయంత్రం పలహారం బండ్ల ఊరేగింపు ఉంటుంది. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్ ప్రాంతంలోని విద్యాసంస్థలకు సోమవారం కూడా సెలవు ఉండే అవకాశం ఉంది.
ఇవాళ (గురువారం) భారీ వర్షాల కారణంగా ఇచ్చిన సెలవులను భర్తీ చేసేందుకు, రాబోయే ఆగస్టు 8వ తేదీ (రెండో శనివారం) విద్యాసంస్థలు పని చేయాలని అధికారులు తెలిపారు. అంటే ఇవాళ సెలవున్న స్కూళ్లకు ఆగస్టు 8న సెలవు ఉండదు. దీంతో ఆ విద్యాసంస్థలకు రావాల్సిన లాంగ్ వీకెండ్ బ్రేక్ పడే అవకాశం ఉంది.
మరో లాంగ్ వీకెండ్ (ఆగస్టు 8, 9, 10)
సికింద్రాబాద్ బోనాల తర్వాత, ఆగస్టు 9న (ఆదివారం) లాల్ దర్వాజ సింహవాహిని మహంకాళి అమ్మవారితో పాటు హైదరాబాద్ నగరవ్యాప్తంగా ప్రధాన బోనాల ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయి. ఆషాడమాసపు చివరి ఆదివారం కావడంతో రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంటుంది.
ఈ నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం బోనాల మరుసటి రోజు ఆగస్టు 10 (సోమవారం) తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు అధికారికంగా సెలవు ఉండనుంది. ఫలితంగా ఆగస్టు 8, 9, 10 తేదీలలో (శని, ఆది, సోమవారాలు) విద్యార్థులకు మరో లాంగ్ వీకెండ్ రానుంది.
Also Read: బంగాళాఖాతంలో వేగంగా మారుతున్న వాతావరణం..తెలుగు రాష్ట్రాలకు తుఫాన్ ముప్పు!
Also Read: విద్యార్థులు ఎగిరి గంతేసే వార్త..జూలై 31, ఆగస్టు 1న ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
