Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Mahabubabad506105

వైరాలో పలు అభివృద్ధి పనులకు డిప్యూటీ సీఎం‌ శంకుస్థాపన

Aug 09, 2024 10:29:57
Madugulagudem, Telangana
వైరా పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శంకుస్థాపన చేసారు. మున్సిపాలిటీలో అమృత్ 2.0 పథకంలో భాగంగా జనవరి నీటి సరఫరా పథకం పనులను భట్టి ప్రారంభించారు. పనులను త్వరగా పూర్తి చేసి ప్రజల తాగునీటి కష్టాలు తీర్చాలని అధికారులను ఆదేశించారు. భట్టి వెంట ఎమ్మెల్యే రాందాస్ నాయక్,రాయల నాగేశ్వరరావు, మున్సిపల్ చైర్మన్ జైపాల్ తదితరులు ఉన్నారు.
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
RKRavi Kumar Sargam
Mar 05, 2026 17:21:56
Mumbai, Maharashtra:

IND vs ENG: టీ20 ప్రపంచకప్‌ 2026ను వరుసగా రెండోసారి అందుకునేందుకు భారత జట్టు ఒక్క అడుగు దూరంలో నిలిచింది. ఉత్కంఠగా జరిగిన రెండో సెమీ ఫైనల్‌లో ఇంగ్లాండ్‌పై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి టీమిండియా విజయం సాధించింది. ఇంగ్లాండ్‌ బౌలర్లను భారత బ్యాటర్లు ఉతికి పారేయగా.. ప్రత్యర్థిని మాత్రం భారత బౌలర్లు తీవ్రంగా కట్టడి చేసి జట్టుకు విజయాన్ని అందించి ఫైనల్‌లో నిలబెట్టారు. వాంఖడేలో జరిగిన ఈ మ్యాచ్‌ ఫలితాలు ఇలా ఉన్నాయి.

కోల్‌కత్తాలోని వాంఖడే స్టేడియంలో రెండో సెమీ ఫైనల్‌ భారత్‌, ఇంగ్లాండ్‌ మధ్య ఉత్కంఠ పోరు జరిగింది. ఇంగ్లాండ్‌ టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకోగా.. భారత్‌ బ్యాటింగ్‌ చేసింది. అభిషేక్‌ శర్మ 9 పరుగులకే ఔటవగా.. మరోసారి సంజూ శామ్‌సన్‌ బ్యాట్‌తో అదరగొట్టాడు. 42 బంతుల్లో 89 పరుగులు చేసి సెంచరీని మిస్సయ్యాడు. 8 ఫోర్లు, 7 సిక్స్‌లతో దుమ్మురేపాడు. ఈ మ్యాచ్‌లో అయినా సెంచరీ చేస్తాడనుకుంటే అనూహ్యంగా ఔటయ్యాడు. ఇషాన్‌ కిషన్‌ 39 పరుగులతో రాణించగా.. శివమ్‌ దూబే 43 స్కోర్‌తో మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. కెప్టెన్‌ సూర్య కుమార్‌ యాదవ్‌ (11), తిలక్‌ వర్మ (21), అక్షర్‌ పటేల్‌ (2) కొన్ని పరుగులు చేశారు.

ఇంగ్లాండ్‌ బౌలింగ్‌
భారత జట్టును ఇంగ్లాండ్‌ బౌలర్లు కట్టడి చేయడంలో విఫలమయ్యారు. భారత బ్యాటర్లను నిలువరించలేకపోవడంతో భారీ స్కోర్‌ నమోదైంది. భారీ స్కోర్‌ దిశగా దూసుకెళ్తున్న సమయంలో విల్‌ జాక్స్‌, అదిల్‌ రషీద్‌ కొంత నియంత్రించారు. వారిద్దరూ రెండు వికెట్ల చొప్పున తీయగా.. జోఫ్రా ఆర్చర్‌ ఒక వికెట్‌ తీశాడు.

పాండ్యా తీరు వివాదాస్పదం
సెమీస్‌ గెలవాలనే కసితో భారత జట్టు మొత్తం ఉండగా.. హార్దిక్‌ పాండ్యా ప్రవర్తన మాత్రం విస్మయానికి గురి చేసింది. హార్దిక్‌ పాండ్యా ఆట తీరు భారత్‌కు కొంత నష్టం చేసింది. శివమ్‌ దూబేతో కలిసి ఆడుతుండగా.. అవనసరంగా ఔట్‌ చేయించాడు. పరుగుకు పిలిచి తర్వాత వద్దనడంతో వెనక్కి తిరిగిన దూబే రనౌట్‌ అయ్యాడు. జట్టు భారీ స్కోర్‌ చేయాలంటే దూబే క్రీజులో ఉండాల్సి ఉంది. ఆ సమయంలో దూబే రనౌట్‌ కారణంగా భారత్‌కు మరో 20 పరుగులు వచ్చే అవకాశం ఉండేది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
HDHarish Darla
Mar 05, 2026 16:47:59
Tirupati Urban, Andhra Pradesh:

Divvela Madhuri Thanuja Birthday Cake Cutting: తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా ప్రవర్తించి గతంలోనే వివాదాల్లో నిలిచిన దివ్వెల మాధురి, మరోసారి తన అత్యుత్సాహంతో వార్తల్లోకి ఎక్కింది. నిబంధనలకు విరుద్ధంగా ఏడుకొండలపై పుట్టినరోజు వేడుకలు నిర్వహించి శ్రీవారి భక్తుల ఆగ్రహానికి గురైంది. ఈ ఘటనపై టీటీడీ విజిలెన్స్ విచారణకు ఆదేశించింది.

బిగ్ బాస్ ఫేమ్ దివ్వెల మాధురి, నిబంధనలను బేఖాతరు చేస్తూ తిరుమల కొండపై బర్త్ డే వేడుకలు జరపడం ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. ఈ వివాదానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

తిరుమల కొండపైకి కేకులు తీసుకురావడం, వేడుకలు జరపడం పూర్తిగా నిషేధం. అయినప్పటికీ, మాధురి తన సన్నిహిత మిత్రురాలు, బిగ్ బాస్ విన్నర్ తనూజ పుట్టినరోజును పురస్కరించుకుని తిరుమలలోని ఒక గెస్ట్ హౌస్‌లో గ్రాండ్‌గా సెలబ్రేషన్స్ నిర్వహించింది. ఈ వేడుకలో తనూజకు చీర, గాజులతో పాటు బంగారు కమ్మలను కూడా మాధురి బహుమతిగా ఇచ్చింది. అయితే ఇప్పుడు కట్టుదిట్టమైన తనిఖీలు ఉండే తిరుమల కొండపైకి కేక్ ఎలా వెళ్ళింది? సెక్యూరిటీ కళ్లుగప్పి ఈ పని ఎలా చేశారు? అనే అంశాలపై టీటీడీ విజిలెన్స్ అధికారులు ఆరా తీస్తున్నారు.

గతంలోనూ వివాదాలే..
దివ్వెల మాధురికి ఇలాంటి వివాదాలు కొత్తేమీ కాదు. గతంలో దువ్వాడ శ్రీనివాస్‌తో కలిసి తిరుమల మాడ వీధుల్లో రీల్స్ చేసి భక్తుల మనోభావాలను దెబ్బతీసింది. ఆ ఘటనపై అప్పట్లో పోలీసులు ఆమెపై కేసు కూడా నమోదు చేశారు. ఇప్పుడు మళ్లీ అదే తరహాలో వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం గమనార్హం.

సోషల్ మీడియాలో విమర్శల వర్షం
"హ్యాపీ బర్త్‌డే బంగారం.. నువ్వు స్వర్గం నుంచి దిగివచ్చావు" అంటూ తనూజకు శుభాకాంక్షలు చెబుతూ మాధురి పోస్ట్ చేసిన వీడియో ఇప్పుడు ఆమెకు చిక్కులు తెచ్చిపెట్టింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు, భక్తులు "దేవుడి సన్నిధిలో ఇలాంటి పనులేంటి?" అంటూ మండిపడుతున్నారు.

పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలను కేవలం ఫోటో షూట్లు, వేడుకలకు వేదికగా మార్చుకోవడంపై భక్తులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ తాజా వివాదంపై టీటీడీ ఎలాంటి కఠిన చర్యలు తీసుకుంటుందో చూడాలి.

Also Read: Vrushakarma Glimpse: మొన్న 'తండేల్', నేడు 'వృషకర్మ'..అక్కినేని ఫ్యాన్స్‌కు నాగచైతన్య ఫీస్ట్ రెడీ!

Also Read: Russia Oil Supply To India: భారతదేశానికి మరోసారి రష్యా భరోసా..యుద్ధం వేళ చమురు సరఫరా కోసం మాస్టర్ ప్లాన్!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
RKRavi Kumar Sargam
Mar 05, 2026 16:30:21
Hyderabad, Telangana:

Vijay Rashmika Marriage Cost: సినిమాలో కలిసి పని చేసిన విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్నాలు ఆ సమయంలో జరిగిన పరిచయం కాస్త ప్రేమగా మారింది. వరుసగా సినిమాలు చేస్తుండగా వారి మధ్య బంధం మరింత దృడమైంది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి డేటింగ్‌ వరకు వచ్చేసింది. ఇరువురు మనసులు మార్చుకోగా.. పెళ్లితో జీవితాలను పంచుకున్నారు. సినీ పరిశ్రమలో అగ్ర తారలుగా గుర్తింపు పొందుతున్న ఈ నటీనటులు ప్రేమ బంధాన్ని పెళ్లిగా మార్చుకున్నారు. నెల రోజుల నుంచి విజయ్‌, రష్మిక పెళ్లిపైనే అందరి దృష్టి పడింది. మరి వీరి పెళ్లి ఎలా జరిగింది? ఎంత బంగారం కొన్నారు? ఎంత ఖర్చయ్యింది? తదితర వివరాలు తెలుసుకుందాం.

Also Read: Ind vs Eng: భారీ లక్ష్యం నమోదు చేసిన భారత్.. ఇంగ్లాండ్ టార్గెట్ ఎంతంటే?

తెలుగు సినీ పరిశ్రమలోనే అత్యంత ఖరీదైన వివాహంగా విజ‌య్ దేవ‌ర‌కొండ, ర‌ష్మిక పెళ్లి ఉండనుంది. ఫిబ్రవరి 26వ తేదీన ఉదయ్‌పూర్‌లో ఆత్మీయులు, సన్నిహితులు, కుటుంబసభ్యులు, బంధుమిత్రులతో వివాహం జరిగింది. ఫ్యామిలీ స్టార్‌, నేషనల్‌ క్రష్‌ పెళ్లి అక్కడ జరిగినా.. వివాహ విందు మాత్రం హైదరాబాద్‌లో భారీ స్థాయిలో జరిగింది. అంతకుముందు తెలంగాణలోని తమ స్వగ్రామంలో విజయ్‌ దేవరకొండ దంపతులు సత్యనారాయణ స్వామి వ్రతం చేశారు.

Also Read: Telangana CM: కేంద్ర హోంమంత్రితో తెలంగాణ సీఎం భేటీ.. కీలకాంశాలపై చర్చ

దాదాపు పక్షం రోజులుగా వీరి పెళ్లిపై ఒకటే చర్చ. పెళ్లిలో విజయ్‌ వేసుకున్న వస్త్రధారణ.. వధువుగా రష్మిక ధరించిన ఆభరణాలపై అందరి దృష్టి పడింది. రాజుల కాలంలో మాదిరి విరోష్‌ జంట కనిపించింది. మరి పెళ్లికి ఎంత బంగారం వినియోగించారనేది చర్చ జరిగింది. మొత్తం మూడు కిలోలకు పైగా బంగారం వధూవరులు వినియోగించారని తెలుస్తోంది. తులాల పరంగా చూస్తే 257 తులాల బంగారం కొత్త జంట వాడింది. విజయ్‌, రష్మిక పెళ్లి ఒక ప్రముఖ ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థ నిర్వహించిందని సమాచారం. ఉదయ్‌పూర్‌లో పెళ్లి, సొంతూరులో సత్యనారాయణ వ్రతం, సంగీత్‌ కార్యక్రమం, అభిమానులకు విందు, మీడియాకు ప్రత్యేక విందు, దేశవ్యాప్తంగా మిఠాయిల పంపిణీ, ఆలయాల్లో అన్నదానంతోపాటు  హైదరాబాద్‌లో రిసెప్షన్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమాలన్నీ ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థ చేసింది. మొత్తం ఒక ప్యాకేజ్‌గా మాట్లాడుకున్నారని తెలుస్తోంది.

Also Read: BRS Party: గులాబీ పార్టీలో గుబులు.. సంస్థాగత నిర్మాణంపై మళ్లీ చేతులెత్తేసిన బీఆర్‌ఎస్‌

ఖర్చులు పోగా లాభం
విరోష్‌ పెళ్లి కోసం దాదాపు రూ.15 కోట్లకు పైగా ఖర్చయ్యిందని చర్చ జరుగుతోంది. సాధారణ ప్రజల వివాహాలు అయితే ఎవరు పెళ్లి చేస్తారని ప్రధానంగా చర్చ ఉంటుంది. ఇలా విజయ్‌, రష్మిక పెళ్లి ఖర్చు వధువు, వరుడు తరఫున ఎవరో ఖర్చు చేశారని చర్చించగా.. ఇద్రూ కలిసి ఖర్చు పెట్టుకున్నారని వార్తలు వస్తున్నాయి. వీరి పెళ్లికి సంబంధించిన వీడియోను విరోష్‌ జోడీ నెట్‌ఫ్లిక్స్‌కు అప్పగింంచింది. దీనికోసం నెట్‌ఫ్లిక్స్‌ సంస్థ సుమారు రూ.60 కోట్లు చెల్లించనున్నట్లు తెలుస్తోంది. ఆ వీడియో ద్వారా విరోష్‌ జోడీ తమ పెళ్లి ఖర్చుపోను అదనంగా రూ.45 కోట్ల వరకు లాభం పొందారు. తమ పెళ్లిని కూడా వ్యాపారంగా మలుచుకుని ఈ స్టార్‌ జంట లాభదాయకంగా మారింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
BBhoomi
Mar 05, 2026 15:39:56
Secunderabad, Telangana:

Nepal Political History: హిమాలయాల ఒడిలో ఉన్న చిన్న దేశం నేపాల్..  శతాబ్దాల పాటు రాజరిక పాలనలో కొనసాగింది. 1768లో పృథ్వీ నారాయణ్ షా నేపాల్‌ను ఏకీకృతం చేసిన తరువాత షా వంశం దేశాన్ని పాలించింది. దాదాపు రెండు శతాబ్దాలకు పైగా ఈ రాజవంశం అధికారాన్ని కొనసాగిస్తూ వచ్చింది. అయితే కాలక్రమేణా ప్రజల్లో ప్రజాస్వామ్యంపై ఆకాంక్ష పెరిగింది. 1960లో అప్పటి రాజు  మహేంద్ర దేశ రాజకీయ వ్యవస్థలో కీలక మార్పు చేశారు. ఆయన పార్లమెంటును రద్దు చేసి.. రాజకీయ పార్టీలను నిషేధిస్తూ  పంచాయతీ వ్యవస్థ అనే పార్టీలు లేని పాలనను ప్రవేశపెట్టారు. ఈ వ్యవస్థలో రాజుకు అత్యధిక అధికారాలు ఉండేవి. అయితే ప్రజాస్వామ్య ప్రక్రియలకు చాలా పరిమితులు ఉండటంతో దేశంలో అసంతృప్తి పెరిగింది.

ఈ పరిస్థితుల్లో ప్రజాస్వామ్యానికి మద్దతుగా ఉద్యమాలు ప్రారంభమయ్యాయి. 1990లో జరిగిన ప్రజా ఉద్యమాల ఒత్తిడితో అప్పటి రాజు బీరేంద్ర కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయన రాజకీయ పార్టీలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేసి రాజ్యాంగబద్ధ రాజ్యాన్ని అంగీకరించారు. దీంతో నేపాల్‌లో బహుళ పార్టీ ప్రజాస్వామ్యానికి మార్గం సుగమమైంది. అయితే దేశ రాజకీయ పరిస్థితులు స్థిరపడకముందే మరో పెద్ద సంక్షోభం తలెత్తింది. 1996లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ నేతృత్వంలో మావోయిస్టు తిరుగుబాటు ప్రారంభమైంది. ఈ ఉద్యమం ప్రధాన లక్ష్యం రాజరికాన్ని పూర్తిగా రద్దు చేసి ప్రజాస్వామ్య గణతంత్రాన్ని ఏర్పాటు చేయడం. ఈ తిరుగుబాటు దాదాపు దశాబ్దం పాటు కొనసాగి దేశాన్ని తీవ్రమైన రాజకీయ అస్థిరతలోకి నెట్టింది.

Also Read: Gold: బంగారం కొంటున్నారా? ఇకపై ఇది తప్పనిసరి.. కేంద్రం కీలక నిర్ణయం..!  

అయితే ఈ మధ్యకాలంలో 2001లో నేపాల్‌ను కుదిపేసిన విషాద ఘటన చోటుచేసుకుంది. రాజు బీరేంద్రతో పాటు రాజ కుటుంబ సభ్యులు హత్యకు గురయ్యారు. ఈ సంఘటన దేశ రాజకీయాల్లో మరింత అనిశ్చితిని సృష్టించింది. తరువాత జ్నానేంద్ర సింహాసనాన్ని అధిష్ఠించినప్పటికీ, ప్రజల్లో రాజరికంపై వ్యతిరేకత మరింత పెరిగింది. చివరకు ప్రజా ఉద్యమాలు, రాజకీయ పార్టీల పోరాటం, మావోయిస్టు తిరుగుబాటు ఇలా అన్ని కలిసి దేశ భవిష్యత్తును మార్చాయి. 2008లో నేపాల్ పార్లమెంట్ చారిత్రాత్మక నిర్ణయం తీసుకొని దాదాపు 240 ఏళ్ల షా వంశపు రాజరిక పాలనకు ముగింపు పలికింది. దీంతో నేపాల్ ను అధికారికంగా గణతంత్ర దేశంగా ప్రకటించారు. 

రాజరికం రద్దైన తర్వాత దేశంలో కొత్త రాజ్యాంగం రూపొందించేందుకు దీర్ఘకాల రాజకీయ చర్చలు జరిగాయి. చివరికి 2015లో కొత్త రాజ్యాంగం అమల్లోకి వచ్చి నేపాల్‌ను ఫెడరల్ ప్రజాస్వామ్య గణతంత్రంగా ప్రకటించారు. ప్రస్తుతం ప్రజల చేత ఎన్నుకోన్న ప్రభుత్వం దేశాన్ని నడిపిస్తోంది. రాజరికం నుంచి ప్రజాస్వామ్యానికి జరిగిన ఈ మార్పు నేపాల్ చరిత్రలో అత్యంత కీలక మలుపుగా భావిస్తున్నారు. 

Also Read: Stock Market: యుద్ధం జరుగుతున్నా డోంట్ కేర్ అంటున్న స్టాక్ మార్కెట్.. ఒక్కరోజే 6 లక్షల కోట్ల లాభం..!!  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.

0
comment0
Report
BBhoomi
Mar 05, 2026 15:03:18
Secunderabad, Telangana:

Iran Israel Conflict: మధ్యప్రాచ్యంలో వేగంగా ముదురుతున్న యుద్ధ పరిస్థితులు..  అమెరికా ప్రభుత్వాన్ని కొత్త సవాళ్ల ముందుకు నెట్టాయి. అక్కడ చిక్కుకుపోయిన అమెరికా పౌరులను సురక్షితంగా బయటకు తీసుకురావడం.. అలాగే యుద్ధ పరిణామాలపై సమగ్ర సమాచారం సేకరించడం కోసం అమెరికా ప్రభుత్వం అత్యవసర చర్యలు ప్రారంభించింది. అయితే ఈ పరిణామాలు చూస్తే..  యుద్ధం ఇంత వేగంగా విస్తరిస్తుందని డొనాల్డ్ ట్రంప్ నాయకత్వంలోని పరిపాలన పూర్తిగా ఊహించలేకపోయిందన్న విమర్శలు కూడా జోరుగా  వినిపిస్తున్నాయి.

మధ్యప్రాచ్యంలో పరిస్థితులు క్షణక్షణం మారుతున్న నేపథ్యంలో..  అక్కడ ఉన్న అమెరికా పౌరులకు సహాయం చేసేందుకు యునైటేడ్ స్టేట్స్ డిపార్ట్ మెంట్ ఆఫ్ స్టేట్ అత్యవసరంగా అదనపు సిబ్బందిని నియమిస్తోంది. ముఖ్యంగా గ్రీస్ రాజధాని ఎథేన్స్ లో ప్రత్యేక సహాయక కేంద్రాన్ని బలోపేతం చేస్తోంది. అక్కడికి చేరుకునే అమెరికన్లకు పాస్‌పోర్ట్ పునరుద్ధరణ, ప్రయాణ ఏర్పాట్లు, తాత్కాలిక నివాసం వంటి సేవలు అందించేందుకు ప్రత్యేక బృందాలను పంపించారు. సాధారణంగా కాన్సులర్ విభాగం నిర్వహించే తరలింపు చర్యలను ఈసారి విదేశాంగ శాఖ అగ్ర నాయకత్వం నేరుగా పర్యవేక్షిస్తోంది.

మరోవైపు యుద్ధ కార్యకలాపాలకు అవసరమైన నిఘా వ్యవస్థను బలోపేతం చేయడానికి యునైటేడ్ స్టేట్స్ డిపార్ట్ మెంట్ ఆఫ్ డిఫెన్స్ చర్యలు ప్రారంభించింది. యునైటేడ్ సెంట్రల్ కమాండ్ ప్రధాన కార్యాలయం ఉన్న టంపాకు మరిన్ని సైనిక నిఘా అధికారులను పంపాలని పెంటగాన్ నిర్ణయించింది. కనీసం 100 రోజుల పాటు కొనసాగే ఆపరేషన్లను దృష్టిలో ఉంచుకుని ఈ బలగాలను పెంచుతున్నట్లు సమాచారం. ఇది యుద్ధం మొదట అంచనా వేసిన నాలుగు వారాల కాలాన్ని దాటే అవకాశమున్నదని సూచిస్తున్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఈ పరిణామాలన్నీ చూస్తే.. యుద్ధం విస్తృతి.. ప్రభావం విషయంలో ట్రంప్ ప్రభుత్వం పూర్తిగా ముందస్తు అంచనా వేయలేదని మాజీ దౌత్యవేత్తలు పేర్కొంటున్నారు. మధ్యప్రాచ్య వ్యవహారాల్లో అనుభవం ఉన్న మాజీ అమెరికా రాయబారి జెరాల్డ్ ఫీయర్‌స్టెయిన్ అభిప్రాయం ప్రకారం.. ప్రారంభంలో ఇది తాత్కాలిక సైనిక చర్యగా భావించారని, కానీ త్వరలోనే అది విస్తృత యుద్ధంగా మారే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. ఇజ్రాయెల్‌తో కలిసి అమెరికా నిర్వహించిన దాడుల్లో  ఇరాన్ లోని భద్రతా మౌలిక వసతులు, కీలక స్థావరాలు లక్ష్యంగా మారాయి. ఆపరేషన్ లక్ష్యం ఏమిటన్నది స్పష్టంగా ప్రకటించకపోయినా.. ఇరాన్ నాయకత్వంపై ఒత్తిడి తీసుకురావడమే ప్రధాన ఉద్దేశంగా భావిస్తున్నారు. అయితే దీనికి ప్రతిగా ఇరాన్ కూడా మధ్యప్రాచ్య ప్రాంతంలోని అమెరికా స్థావరాలపై ప్రతీకార దాడులు ప్రారంభించింది.

Also Read: Gold: బంగారం కొంటున్నారా? ఇకపై ఇది తప్పనిసరి.. కేంద్రం కీలక నిర్ణయం..!  

ఇటీవల కువైట్ లోని ఓడరేవు సమీపంలో జరిగిన డ్రోన్ దాడిలో కనీసం ఆరుగురు అమెరికా సైనికులు మరణించడం పరిస్థితిని మరింత ఉద్రిక్తం చేసింది. ఈ దాడికి కారణమైన డ్రోన్ తక్కువ ఖర్చుతో తయారయ్యే షాహెద్ రకం డ్రోన్‌గా భావిస్తున్నారు. ఇవి తక్కువ ఎత్తులో ఎగిరి రాడార్‌లకు చిక్కకుండా దాడులు చేయగలవని రక్షణ నిపుణులు చెబుతున్నారు. అయితే వీటిని కూల్చివేయడానికి అమెరికా లక్షల డాలర్ల విలువైన క్షిపణులను వినియోగించాల్సి రావడం మరో సవాలుగా మారింది. మధ్యప్రాచ్యంలో చిక్కుకుపోయిన అమెరికన్లను బయటకు తీసుకురావడంలో ఆలస్యం జరిగిందన్న విమర్శలు కూడా ప్రభుత్వంపై పెరుగుతున్నాయి. యుద్ధం ప్రారంభమైన తరువాతే అనేక దేశాల్లో ఉన్న రాయబార కార్యాలయాలు సిబ్బందిని తరలించడం ప్రారంభించాయని విమర్శకులు చెబుతున్నారు. చివరకు విదేశాంగ శాఖ ఈ ప్రాంతంలోని 14 దేశాల్లో ఉన్న అమెరికా పౌరులు  తక్షణమే బయలుదేరాలి  అంటూ హెచ్చరిక జారీ చేసింది.

విమాన మార్గాలు మూసివేయడం, విమాన టికెట్లు దొరకకపోవడం వంటి సమస్యల మధ్య వేలాది మంది అమెరికన్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయినప్పటికీ ఇప్పటివరకు 17,500 మందికి పైగా అమెరికన్లు మధ్యప్రాచ్యం నుంచి తిరిగి వచ్చారని విదేశాంగ శాఖ తెలిపింది. అయితే వీరిలో చాలామంది ప్రభుత్వ సహాయం లేకుండానే స్వయంగా ప్రయాణించినట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితులపై అమెరికా రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. డెమోక్రటిక్ నేతలు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అమెరికా పౌరుల భద్రత ప్రభుత్వ ప్రధాన బాధ్యత అని వారు గుర్తుచేస్తున్నారు. ఈ వ్యవహారంపై పార్లమెంటరీ విచారణలు కూడా జరిగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

మధ్యప్రాచ్యంలో ముదురుతున్న యుద్ధం కేవలం ప్రాంతీయ సంక్షోభంగా మాత్రమే కాకుండా అంతర్జాతీయ రాజకీయాలపై కూడా గణనీయమైన ప్రభావం చూపుతోంది. పరిస్థితి ఎలా మారుతుందన్నది రాబోయే రోజుల్లో ప్రపంచ రాజకీయాలకు కీలకంగా మారనుంది.

Also Read: Stock Market: యుద్ధం జరుగుతున్నా డోంట్ కేర్ అంటున్న స్టాక్ మార్కెట్.. ఒక్కరోజే 6 లక్షల కోట్ల లాభం..!!  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.

 

0
comment0
Report
HDHarish Darla
Mar 05, 2026 14:04:26
Hyderabad, Telangana:

Vrushakarma Movie Glimpse: టాలీవుడ్ యువ సామ్రాట్ నాగ చైతన్య వరుస ప్రయోగాలతో బాక్సాఫీస్ వద్ద తనదైన ముద్ర వేస్తున్నారు. తాజాగా ఆయన నటిస్తున్న మిస్టరీ థ్రిల్లర్ 'వృషకర్మ' చిత్రానికి సంబంధించిన గ్లింప్స్‌ను చిత్రబృందం విడుదల చేసింది. 'విరూపాక్ష' వంటి సెన్సేషనల్ హిట్ అందించిన దర్శకుడు కార్తీక్ వర్మ దండు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండటంతో సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి.

చిత్రబృందం విడుదల చేసిన గ్లింప్స్ చూస్తుంటే, దర్శకుడు మరోసారి ప్రేక్షకులను ఒక సరికొత్త ఫాంటసీ ప్రపంచంలోకి తీసుకెళ్లబోతున్నాడని స్పష్టమవుతోంది. "అతీంద్రియ శక్తి మేల్కొన్నప్పుడు, సృష్టి ధర్మం తప్పినప్పుడు, విధి ఒక వృషకర్మను ఎంచుకుంటుంది" అంటూ సాగే డైలాగ్ సినిమా మూడ్‌ను సెట్ చేసింది. 2 నిమిషాల 9 సెకన్ల పాటు సాగే ఈ గ్లింప్స్‌లో విజువల్స్ నెక్స్ట్ లెవెల్‌లో ఉన్నాయి. హారర్, మిస్టరీ అంశాలను మేళవించిన తీరు అద్భుతంగా ఉంది.

కథానాయకుడు నాగచైతన్య ఇందులో ఒక అన్వేషకుడిగా కనిపించగా.. హీరోయిన్ మీనాక్షి చౌదరి, జయరామ్‌లు ఆర్కియాలజిస్ట్ పాత్రల్లో మెరిశారు. ముఖ్యంగా బాలీవుడ్ మూవీ 'లాపతా లేడీస్' ఫేమ్ స్పర్శ్ శ్రీవాస్తవ విలన్‌గా కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు.

సాంకేతిక హంగులు
'వృషకర్మ' గ్లింప్స్‌లో కనిపించిన విజువల్ ఎఫెక్ట్స్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు ప్రధాన బలంగా నిలిచేలా ఉన్నాయి. మీనాక్షి చౌదరి పాత్ర కేవలం గ్లామర్‌కే పరిమితం కాకుండా కథలో కీలక ప్రాధాన్యత కలిగి ఉండబోతోందని సమాచారం.

సోషల్ మీడియాలో 'వృషకర్మ' గ్లింప్స్‌కు భారీ స్పందన లభిస్తోంది. "చైతూ కెరీర్‌లో ఇదొక బిగ్గెస్ట్ హిట్ అవుతుంది" అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. విభిన్న కథాంశాలను ఎంచుకోవడంలో నాగ చైతన్య చూపిస్తున్న పరిణతిని విమర్శకులు సైతం ప్రశంసిస్తున్నారు. మరీ ముఖ్యంగా హీరో నాగచైతన్య ప్రతి సినిమాలోనూ తనదైన స్టైల్‌ను కొనసాగిస్తూనే..ఈ మూవీలోనూ తన మార్క్‌ను చూపిస్తున్నారు. గత సినిమాలతో పోలిస్తే 'తండేల్' సినిమా నుంచి ఆయనలో మరింత పరిణితి కనిపిస్తుందని ఫ్యాన్స్ చెబుతున్నారు.

మొత్తానికి 'విరూపాక్ష' సినిమాతో భయపెట్టిన దర్శకుడు కార్తీక్ వర్మ దండు, ఇప్పుడు 'వృషకర్మ'తో అంతకంటే పెద్ద మ్యాజిక్ చేయబోతున్నాడని అర్థమవుతోంది. మరి ఈ అన్వేషణలో నాగ చైతన్య ఎలాంటి రహస్యాలను ఛేదిస్తాడో చూడాలి!

Also Read: Keerthy Suresh Transformation: జెట్ స్పీడ్‌లో బరువు తగ్గిన హీరోయిన్ కీర్తి సురేష్..ఈ ట్రిక్స్‌తో 10 కిలోలు తగ్గిపోయింది!

Also Read: Russia Oil Supply To India: భారతదేశానికి మరోసారి రష్యా భరోసా..యుద్ధం వేళ చమురు సరఫరా కోసం మాస్టర్ ప్లాన్!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
HDHarish Darla
Mar 05, 2026 13:35:07
Abbeyville, Colorado:

Trump Epstein Files News: పశ్చిమాసియాలో ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం తీవ్రతరమవుతున్న వేళ, అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు స్వదేశంలో ఊహించని రాజకీయ సంక్షోభం ఎదురవుతోంది. సంచలనం సృష్టించిన 'ఎప్‌స్టీన్ ఫైళ్ల' విషయంలో అటార్నీ జనరల్ పామ్ బోండి తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ట్రంప్ ప్రభుత్వానికి పెను సవాలుగా మారింది.

జెఫ్రీ ఎప్‌స్టీన్ లైంగిక వేధింపుల కేసులో దాగి ఉన్న వేలాది పత్రాలను విడుదల చేసేందుకు అమెరికా న్యాయ శాఖ సిద్ధమవుతోంది. ఈ పరిణామం ట్రంప్ రాజకీయ భవిష్యత్తుపై ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఆ ఫైళ్లలో ఏముంది?
వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక ప్రకారం.. జెఫ్రీ ఎప్‌స్టీన్ కేసుకు సంబంధించి మొత్తం 6 లక్షల పత్రాలు ఉండగా, ఇప్పటివరకు సగం మాత్రమే బహిర్గతమయ్యాయి. గతంలో కనిపించకుండా పోయాయని భావించిన 50,000 కీలక పత్రాలను ఇప్పుడు న్యాయశాఖ గుర్తించింది. ఈ కొత్త పత్రాలలో డొనాల్డ్ ట్రంప్ పేరు కూడా ప్రస్తావనకు వచ్చిందనే వార్తలు ఆయనకు ఆందోళన కలిగిస్తున్నాయి. వచ్చే వారంలోగా ఈ ఫైళ్లు విడుదలయ్యే అవకాశం ఉంది.

అటార్నీ జనరల్ పామ్ బోండి ఈ వ్యవహారంలో తీసుకున్న స్టాండ్ చర్చనీయాంశమైంది. జెఫ్రీ ఎప్‌స్టీన్ ఫైల్స్‌ను దాచిపెట్టి ప్రభుత్వం తనను తప్పుదారి పట్టించిందని ఆమె ఆరోపించారు. దీనిపై వివరణ ఇచ్చేందుకు ఆమె హౌస్ కమిటీ ముందుకు హాజరుకానున్నారు.

బోండిని కమిటీ ముందు ప్రశ్నించే విషయంపై జరిగిన ఓటింగ్‌లో 24 మంది సభ్యులు అనుకూలంగా, 19 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. దీంతో ఆమె కమిటీ అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం తప్పనిసరి అయ్యింది.

ఇప్పటివరకు వెలుగులోకి రాని ఉన్నత స్థాయి వ్యక్తుల వివరాలు ఈ 50,000 పత్రాల ద్వారా బయటకు వచ్చే ఛాన్స్ ఉంది. ఒకవేళ బోండి కమిటీ ముందు సరైన వివరణ ఇవ్వకపోతే, ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఇటు యుద్ధం, అటు ఎప్‌స్టీన్ ఫైల్స్ సెగతో అమెరికా రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. ఈ పత్రాల విడుదల తర్వాత అమెరికాలో మరిన్ని సంచలనాలు రేగే అవకాశం ఉంది.

Also Read: Russia Oil Supply To India: భారతదేశానికి మరోసారి రష్యా భరోసా..యుద్ధం వేళ చమురు సరఫరా కోసం మాస్టర్ ప్లాన్!

Also Read: Iran Attacks US Warship: ఇరాన్ ట్యాంకర్ కూల్చిన 24 గంటల్లో అమెరికా ట్యాంకర్‌‌ని కూల్చేసిన ఇరాన్‌!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
BBhoomi
Mar 05, 2026 13:34:44
Secunderabad, Telangana:

Stock Market: ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న యుద్ధ ఉద్రిక్తతలు ప్రపంచ మార్కెట్లపై ప్రభావం చూపుతున్న నేపథ్యంలో... వరుసగా పతనమవుతున్న భారతీయ స్టాక్ మార్కెట్లు ఎట్టకేలకు గురువారం పుంజుకున్నాయి. యుద్ధ భయాలు పూర్తిగా తగ్గకపోయినా, అంతర్జాతీయ స్థాయిలో వచ్చిన కొన్ని సానుకూల సంకేతాలు దేశీయ మార్కెట్లలో పెట్టుబడిదారుల నమ్మకాన్ని కొంతమేర పెంచాయి. దాంతో ప్రధాన సూచీలు అయిన సెన్సెక్స్, నిఫ్టీలు లాభాల్లో ముగిశాయి. మార్కెట్‌లో వచ్చిన ఈ పుంజుకోలు కారణంగా ఒక్కరోజులోనే ఇన్వెస్టర్ల సంపద సుమారు రూ.6 లక్షల కోట్ల మేర పెరిగినట్లు అంచనా.

మార్చి 5న జరిగిన ట్రేడింగ్ సెషన్‌లో ప్రారంభం నుంచే మార్కెట్‌కు సానుకూల వాతావరణం కనిపించింది. ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైనప్పుడు సెన్సెక్స్ 79,530 పాయింట్ల వద్ద లాభాలతో ప్రారంభమైంది. రోజు మొత్తం కూడా కొనుగోళ్ల ఊపు కొనసాగడంతో ఒక దశలో సూచీ 1,100 పాయింట్లకు పైగా పెరిగి 80,303 పాయింట్ల వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని నమోదు చేసింది. చివరకు సెన్సెక్స్ 900 పాయింట్లకు సమీపంగా లాభపడి 80,015 పాయింట్ల వద్ద ముగిసింది. ఇదే సమయంలో నిఫ్టీ సూచీ కూడా బలమైన ప్రదర్శన కనబరిచి 285.40 పాయింట్లు పెరిగి 24,765 పాయింట్ల వద్ద స్థిరపడింది.

ఈ రోజు ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌లోని కొన్ని ప్రధాన కంపెనీల షేర్లు గణనీయంగా లాభపడ్డాయి. ముఖ్యంగా అదానీ పోర్ట్స్, ఎల్ అండ్ టీ, ఎన్టీపీసీ, రిలయన్స్, బెల్ వంటి స్టాక్స్ నాలుగు శాతం వరకు పెరిగాయి. అయితే టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్, హిందుస్థాన్ యూనిలీవర్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్‌బీఐ వంటి కొన్ని కంపెనీల షేర్లు మాత్రం స్వల్ప నష్టాలను నమోదు చేశాయి.

మార్కెట్ పుంజుకోవడానికి అంతర్జాతీయ పరిణామాలు ప్రధాన కారణంగా నిలిచాయి. ముఖ్యంగా ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని నిలిపివేయడానికి సిద్ధంగా ఉందని ఉప విదేశాంగ మంత్రి చేసిన ప్రకటన మార్కెట్‌లో ఆశాజనక సంకేతాలను పంపింది. అదేవిధంగా అమెరికా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీతో చర్చలకు సిద్ధమనే వార్తలు వెలువడటంతో పశ్చిమాసియాలో యుద్ధ ఉద్రిక్తతలు తగ్గే అవకాశాలపై పెట్టుబడిదారుల్లో ఆశలు పెరిగాయి.

Also Read: Gold Rate Today: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధర..!!  

ప్రపంచ మార్కెట్లలో కూడా ఇదే తరహా ధోరణి కనిపించింది. గత సెషన్‌లో భారీగా పడిపోయిన దక్షిణ కొరియా కోస్పీ సూచీ ఈరోజు దాదాపు 9 శాతం వరకు పెరిగింది. అలాగే జపాన్, చైనా, హాంకాంగ్ మార్కెట్లు కూడా లాభాల్లో ముగిశాయి. అంతేకాకుండా అమెరికా మార్కెట్లు కూడా ముందురోజు ట్రేడింగ్‌లో మంచి ప్రదర్శన కనబర్చాయి.ఇక అంతర్జాతీయ చమురు రవాణాకు కీలకమైన హార్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకలకు తక్కువ ధరకే బీమా సదుపాయం కల్పిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం కూడా మార్కెట్ సెంటిమెంట్‌ను మెరుగుపరిచింది. అవసరమైతే చమురు నౌకలకు అమెరికా నౌకాదళం భద్రత కల్పిస్తుందని ఆయన తెలిపారు.

ఇవే కాకుండా రూపాయి విలువ కూడా కొంత బలపడింది. గత ట్రేడింగ్ సెషన్‌లో డాలర్‌తో పోలిస్తే 92 స్థాయిని దాటిన రూపాయి, ఈరోజు తిరిగి 91.60 వద్ద ట్రేడ్ కావడం మార్కెట్‌కు మరో సానుకూల అంశంగా మారింది. అలాగే రిలయన్స్ వంటి భారీ వెయిటేజీ స్టాక్స్‌లో కొనుగోళ్లు పెరగడం కూడా మార్కెట్ సూచీలకు బలాన్నిచ్చింది. మొత్తంగా చూస్తే వరుస నష్టాల తర్వాత దేశీయ స్టాక్ మార్కెట్‌కు ఈరోజు ట్రేడింగ్ కొంత ఊరటనిచ్చిందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.

Also Read: Stock Market: వార్ ఎఫెక్ట్.. ఒక్కరోజే రూ. 10లక్షల కోట్ల సంపద ఆవిరి..!!  

Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. దయచేసి దీన్ని పెట్టుబడి, ఆర్థిక లేదా వ్యాపార సలహాగా భావించవద్దు. గుర్తుంచుకోండి స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టోకరెన్సీలు, రియల్ ఎస్టేట్, విలువైన లోహాలు వంటి అన్ని రకాల పెట్టుబడులు మార్కెట్ ఆటు పోటులు రిస్కులకు లోబడి ఉంటాయి. దీని అర్థం, మీరు లాభపడవచ్చు లేదా నష్టపోవచ్చు. మీరు తీసుకునే ఎలాంటి పెట్టుబడి నిర్ణయాలు లేదా వ్యాపార కార్యకలాపాల వల్ల కలిగే నష్టాలు లేదా లాభాలకు మా సంస్థ జీ తెలుగు వెబ్ పోర్టల్ ఎట్టి పరిస్థితుల్లోనూ బాధ్యత వహించదు. ఏదైనా ఆర్థిక నిర్ణయం తీసుకునే ముందు, తప్పకుండా ఒక రిజిస్టర్డ్ లేదా సర్టిఫైడ్ ఆర్థిక నిపుణుడిని సంప్రదించి, వారి సలహా తీసుకోమని పాఠకులకు సిఫార్సు చేస్తున్నాము.

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.

 

0
comment0
Report
IPInamdar Paresh
Mar 05, 2026 13:15:10
Hyderabad, Telangana:

Chandrababu naidu key statement on population management policy: ప్రస్తుతం ఉత్తరాది రాష్ట్రాల కన్నా సౌత్ రాష్ట్రాల్లో జనాభా చాలా తక్కువగా ఉందని చంద్రబాబు అన్నారు. ఈ నేపథ్యంలో ఏపీ మండలిలో చంద్రబాబు మాట్లాడుతూ.. ఆంధ్ర ప్రదేశ్ లో ఇక జనాభా నియంత్రణ నుంచి పాపులేషన్ మెనెజ్ మెంట్ దిశగా ముందుకు వెళ్తుందన్నారు.  దీనిపైన నెల రోజుల్లో ఒక డ్రాఫ్ట్ రూపొందిస్తామన్నారు. అదే విధంగా ఏపీలో సంతానోత్పత్తి ప్రస్తుతం  రేటు 1.5 గా ఉందని, దీన్ని 2.1 గా తీసుకొని వెళ్లడమే తమ టార్గెట్ అన్నారు.  1997 లో ఏపీ పాపులేషన్ పాలసీ తెచ్చామన్నారు . తమిళనాడులో 1.4, కేరళ 1.6, బీహర్ 3 టీఎఫ్ ఆర్ ఉందని అన్నారు. ముఖ్యంగా ప్రజలు.. 57 శాతం ఒకరితో సంతానంను ఆపేస్తున్నారని, 32 శాతం ఇద్దర్ని, 9 శాతం మాత్రమే ఇద్దరి కంటే ఎక్కువగా పిల్లల్ని కంటున్నారని అన్నారు.

మరోవైపు 60 ఏళ్లు దాటిన వారు 10 శాతం ఉన్నారు. ఏప్రిల్ 1 నుంచి కొత్త పాలసీ అమలుచేసేలా ముందుకు వెళ్తామన్నారు. అదే విధంగా.. పాపులేషన్ పాలసీ అమలులో ఏపీ మొదటి స్థానంలో నిలిచేలా చేస్తామన్నారు టీఎఫ్ఆర్ ను 2.1 కు తీసుకెళ్లేలా చూస్తామన్నారు.ఈ క్రమంలో ఇద్దరుకంటే ఎక్కువగా పిల్లల్ని కనేవారికి బంపర్ ఆఫర్ ఇచ్చారు. కాన్పుకు రూ. 25 వేలు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఈ నగదు పురస్కారం గెమ్ చెంజర్ గా మారుతుందని అన్నారు.

రెండో బిడ్డ పుడితే తండ్రికి ఒకనెల, మూడో బిడ్డ పుడితే రెండు నెలల పెయిడ్ లీవ్ మంజురు చేస్తామన్నారు. ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా పథంక అమలు చేస్తామన్నారు.ఈ పథకం జనాభా పెరుగుదలకు తోడ్పడుతుందని అన్నారు. ఇప్పటికే తమిళనాడు , కేరళ జనాభా సమస్యలను ఎదుర్కొంటున్నాయని, యూపీ , బీహర్ లు మాత్రమే కాస్తంత బెటర్ గా ఉన్నాయన్నారు.

Read more: kalvakuntla Kavitha: తిరుపతికి చేరుకున్న కల్వకుంట్ల కవిత.!. జై ఆంధ్రా అంటూ సెన్సెషనల్ కామెంట్స్..

ఆ బిడ్డ సంతానంకు ఐదేళ్ల పాటు నెలకు1 వెయ్యి, మూడు ఆపై జననాలకు 12 నెలల పెరెంటల్ లీవ్,షీ క్యాబ్స్, వర్కింగ్ ఉమెన్ హస్టళ్లు, ఉద్యోగులకు  15 రోజుల వెల్ నెస్ లీవ్, ఆరోగ్య నిధి కింద రూ. 50 వేలు ఇస్తామని  చంద్రబాబు ప్రకటించారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.

0
comment0
Report
HDHarish Darla
Mar 05, 2026 12:52:10
Krasnoyarskiy kray:

Russia Massive Oil To India: పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ జ్వాలల కారణంగా అంతర్జాతీయంగా చమురు సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా కీలకమైన 'హొర్ముజ్ జలసంధి' మార్గం మూతపడటంతో భారత్‌కు ఇంధన గండం పొంచి ఉంది. ఈ క్లిష్ట సమయంలో రష్యా భారత్‌కు బాసటగా నిలిచేందుకు సిద్ధమైంది. అమెరికా-ఇజ్రాయెల్ కూటమి, ఇరాన్ మధ్య దాడులు-ప్రతిదాడుల నేపథ్యంలో సముద్ర మార్గాల్లో చమురు రవాణా నిలిచిపోయింది. 

భారత్‌లో నిల్వల పరిస్థితి..
ప్రస్తుతం భారతదేశం వద్ద కేవలం 25 రోజులకు సరిపడా ముడి చమురు నిల్వలు మాత్రమే ఉన్నాయి. రిఫైనరీల వద్ద ఎల్‌పీజీ, గ్యాసోలిన్ వంటి ఇంధనాలు కూడా తక్కువ పరిమాణంలోనే ఉన్నాయి. భారత్ దిగుమతి చేసుకునే చమురులో దాదాపు 40 శాతం వాటా హొర్ముజ్ జలసంధి ద్వారానే జరుగుతుంది. యుద్ధం కారణంగా ఈ మార్గంలో వందలాది నౌకలు నిలిచిపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషణ తప్పనిసరి అయింది.

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరో 10-15 రోజులు ఇలాగే కొనసాగితే భారత్‌లో ఇంధన కొరత ఏర్పడే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో పశ్చిమాసియా నుండి నిలిచిపోయిన సరఫరాను భర్తీ చేసేందుకు, భారత్‌కు 95 లక్షల బ్యారెళ్ల చమురును మళ్లించడానికి రష్యా అంగీకరించినట్లు సమాచారం. భారతీయ రిఫైనరీలు రోజుకు సుమారు 56 లక్షల బ్యారెళ్ల చమురును శుద్ధి చేస్తాయి. రష్యా నుండి అందే ఈ అదనపు నిల్వలు దేశీయ అవసరాలకు పెద్ద ఊరటనివ్వనున్నాయి.

హొర్ముజ్ జలసంధి మార్గం పూర్తిగా మూతపడితే సౌదీ అరేబియా, ఇరాక్ వంటి దేశాల నుండి వచ్చే చమురు ఆగిపోతుంది. దీంతో ప్రత్యామ్నాయ మార్గాలైన రష్యా నుండి చమురును వేగంగా తరలించడానికి సురక్షితమైన సముద్ర మార్గాలను భారత్ వెతకాల్సి ఉంది. పశ్చిమాసియా సంక్షోభం భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. రష్యా సహాయంతో ఇంధన భద్రతను కాపాడుకోవాలని భారత్ భావిస్తోంది.

Also Read: Iran Attacks US Warship: ఇరాన్ ట్యాంకర్ కూల్చిన 24 గంటల్లో అమెరికా ట్యాంకర్‌‌ని కూల్చేసిన ఇరాన్‌!

Also Read: Pakistan Cricketer Misconduct: పాకిస్థాన్‌కు దెబ్బ మీద దెబ్బ..హోటల్‌లో అమ్మాయిలతో పాక్ క్రికెటర్ అసభ్య ప్రవర్తన!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
HDHarish Darla
Mar 05, 2026 11:10:53
:

Iran Attack On US Submarine: పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రస్థాయిలో కొనసాగుతోంది. హిందూ మహాసముద్రంలో ఇరాన్‌ యుద్ధ నౌక ఐరిస్‌ దేనాపై అమెరికా దాడి చేసి సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇరాన్ దానికి ప్రతీకారంగా అమెరికా ట్యాంకర్‌ను పేల్చేసింది. గల్ఫ్‌లోని యూఎస్ ట్యాంకర్‌ను కూల్చినట్లు ఆ దేశ మీడియా కథనాల్లో వెల్లడిస్తోంది.

ఇరాన్‌ మీడియా చెప్పిన కథనం ప్రకారం.. పర్షియన్‌ గల్ఫ్‌లోని అమెరికా యుద్ధ‌ ట్యాంకర్‌పై క్షిపణితో దాడి చేసినట్లు ఇస్లామిక్‌ రివల్యూషనరీ గార్డ్‌ కోర్‌ ప్రకటించింది. ఆ యుద్ధ నౌక నుంచి భారీ ఎత్తున మంటలు ఎగిసిపడినట్లు పేర్కొంది. 

అయితే ఈ దాడిలో ప్రాణ నష్టానికి సంబంధించిన వివరాలను ఇంకా ప్రకటించలేదు. తమ యుద్ధనౌకపై దాడికి ప్రతీకారంగానే అమెరికా యుద్ధ ట్యాంకర్‌పై దాడి చేసినట్లు ఇరాన్ అధికారులు వెల్లడించారు. అయితే దీనిపై ఇరాన్‌ ప్రభుత్వం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు సహా అటు అమెరికా కూడా దీనిపై ఇంకా స్పందన లేదు.

మరోవైపు భారత్‌లోని వైజాగ్ నుంచి ఇరాన్‌కు తిరిగి వెళ్తున్న ఐరిస్‌ దేనా-75పై అమెరికా జలాంతర్గామితో దాడి చేసింది. దాడి సమయంలో నౌకలో 180 మంది సిబ్బంది ఉన్నట్లు సమాచారం. అయితే ఈ దాడిలో 87 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. మరికొందర్ని శ్రీలంక రక్షణ దళాలు రక్షించాయి. 

కొందరు సముద్రంలో గల్లంతయ్యారు. ఇప్పటికే అమెరికా దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ వార్నింగ్ ఇచ్చారు. ఇదే క్రమంలో యూఎస్ ట్యాంకర్‌పై దాడి జరగడం గమనార్హం.

Also Read: Pakistan Cricketer Misconduct: పాకిస్థాన్‌కు దెబ్బ మీద దెబ్బ..హోటల్‌లో అమ్మాయిలతో పాక్ క్రికెటర్ అసభ్య ప్రవర్తన!

Also Read: SA Vs NZ Semi Final 2026: సెమీఫైనల్లో కివీస్ విధ్వంసం..చిత్తుగా ఓడిన సౌతాఫ్రికా..ఫైనల్‌కు న్యూజిలాండ్!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
HDHarish Darla
Mar 05, 2026 09:39:09
Kandy, Central Province:

Pakistan Cricket Player Controversy: పాకిస్థాన్ క్రికెట్ జట్టును వివాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. అటు మైదానంలో వరుస పరాజయాలు, ఇటు మైదానం బయట ఆటగాళ్ల క్రమశిక్షణారాహిత్యం ఆ దేశ క్రికెట్ బోర్డును (PCB) ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. తాజాగా ఒక ఆటగాడి అసభ్య ప్రవర్తనకు సంబంధించిన వార్త సంచలనం సృష్టిస్తోంది. ప్రపంచ కప్ ప్రదర్శన కంటే కూడా ఇప్పుడు ఒక వివాదాస్పద ఘటన పాకిస్థాన్ క్రికెట్ పరువును బజారున పడేసింది. 

హోటల్‌లో ఏం జరిగింది?
టీ20 ప్రపంచ కప్ సూపర్-8 దశలో భాగంగా శ్రీలంకలోని కాండీలో పాక్ జట్టు బస చేసింది. ఆ సమయంలో ఒక గుర్తు తెలియని పాక్ క్రికెటర్, హోటల్‌లోని మహిళా హౌస్ కీపింగ్ సిబ్బందితో అత్యంత అనుచితంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు వచ్చాయి. బాధితురాలు వెంటనే అప్రమత్తమై అలారం మోగించడంతో హోటల్ యాజమాన్యం జోక్యం చేసుకుంది.

ఈ విషయం తీవ్రరూపం దాల్చడంతో హోటల్ సీనియర్ అధికారులు కఠిన చర్యల కోసం పట్టుబట్టారు. అయితే, టీమ్ మేనేజర్ నవీద్ చీమా మధ్యవర్తిత్వం వహించి హోటల్ వర్గాలకు క్షమాపణలు చెప్పారు. ఆ ఆటగాడికి భారీ జరిమానా విధించి, ప్రస్తుతానికి విషయాన్ని బయటకు పొక్కకుండా మేనేజ్ చేశారు. కానీ, పీసీబీ ఈ కేసును ఇంకా క్లోజ్ చేయలేదని సమాచారం.

పాకిస్థాన్ క్రికెట్‌లో గందరగోళం
టీ20 ప్రపంచకప్‌లో జట్టు వైఫల్యాలు, బోర్డు తీసుకుంటున్న వివాదాస్పద నిర్ణయాలు పాక్ క్రికెట్‌ను పీకల్లోతు కష్టాల్లోకి నెట్టాయి. ప్రపంచకప్‌లో పేలవ ప్రదర్శన, ముఖ్యంగా భారత్ చేతిలో ఓటమిని పీసీబీ సీరియస్‌గా తీసుకుంది. దీనికి బాధ్యతగా ప్రతి ఆటగాడికి రూ.50 లక్షల (పాక్ రూపాయలు) భారీ జరిమానా విధించినట్లు నివేదికలు చెబుతున్నాయి.

బంగ్లాదేశ్‌తో జరగాల్సిన వన్డే సిరీస్ కోసం ప్రకటించిన జట్టులో బాబర్ అజామ్, సైమ్ అయూబ్ వంటి కీలక ఆటగాళ్లను తొలగించడం పెను దుమారం రేపుతోంది. టీ20 వైఫల్యానికి వన్డే జట్టు నుండి వారిని తప్పించడాన్ని అభిమానులు తప్పుబడుతున్నారు. మరోవైపు ఇరాన్, యూఎస్-ఇజ్రాయిల్ మధ్య నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతల వల్ల బంగ్లాదేశ్ పర్యటన పూర్తిగా రద్దయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

వరుసగా మూడు ఐసీసీ ఈవెంట్లలో సెమీస్‌కు కూడా చేరలేకపోయిన పాక్ జట్టు, ఇప్పుడు ఇటువంటి వ్యక్తిగత ప్రవర్తనా వివాదాలతో మరింత అప్రతిష్ట పాలవుతోంది. సదరు ఆటగాడిపై బోర్డు ఎలాంటి కఠిన చర్యలు తీసుకుంటుందో చూడాలి.

Also Read: SA Vs NZ Semi Final 2026: సెమీఫైనల్లో కివీస్ విధ్వంసం..చిత్తుగా ఓడిన సౌతాఫ్రికా..ఫైనల్‌కు న్యూజిలాండ్!

Also Read: Liquor Digital Payments In AP: మందుబాబులకు గుడ్‌న్యూస్..ఇకపై వైన్ షాపుల్లో అవి తప్పనిసరి..చిల్లర గాళ్ల ముప్పు తప్పినట్టే!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
BBhoomi
Mar 05, 2026 03:42:21
Secunderabad, Telangana:

Gold Rate Today: పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ ఉద్రిక్తతలు అంతర్జాతీయ బంగారం మార్కెట్‌పై స్పష్టమైన ప్రభావాన్ని చూపుతున్నాయి. ముఖ్యంగా  ఇరాన్ , ఇజ్రాయెల్   మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు గోల్డ్ ధరలను కొన్ని రోజుల క్రితం భారీగా పెంచాయి. అయితే ఇటీవల పరిస్థితుల్లో కొంత స్థిరత్వం కనిపించడంతో బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల నమోదవుతోంది.

హైదరాబాద్  నగరంలో నిన్న బంగారం ధరలు గణనీయమైన స్థాయిలోనే కొనసాగినా, స్వల్పంగా తగ్గాయి. నిన్న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర సుమారు రూ.1,64,510 వద్ద ట్రేడ్ అయింది. అదే సమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,50,800 వద్ద ఉండగా, 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర సుమారు రూ.1,23,380 వద్ద నమోదైంది. అయితే నిన్నటి ధరలతో పోలిస్తే ప్రతి గ్రాముకు ఒక రూపాయి చొప్పున తగ్గుదల కనిపించింది. దీంతో పది గ్రాముల బంగారంపై మొత్తం రూ.10 వరకు ధర తగ్గినట్లు మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.

ఈ రోజు కూడా బంగారం ధరలు అదే ధోరణిని కొనసాగిస్తున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర సుమారు రూ.1,64,500 వద్ద ట్రేడ్ అవుతోంది. అదే విధంగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,50,790 వద్ద కొనసాగుతోంది. 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా స్వల్పంగా తగ్గి రూ.1,23,370 వద్ద ట్రేడ్ అవుతోంది.

బంగారం ధరలతో పాటు వెండి మార్కెట్‌లో కూడా స్వల్ప తగ్గుదల కనిపిస్తోంది. నిన్న హైదరాబాద్‌లో ఒక కిలో వెండి ధర రూ.2,95,000 వద్ద ట్రేడ్ అయింది. అదే సమయంలో 100 గ్రాముల వెండి ధర రూ.29,500 వద్ద నమోదైంది. అయితే ఈ రోజు వెండి ధరలు కూడా కొద్దిగా తగ్గాయి. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.100 తగ్గి రూ.2,94,900 వద్ద ఉంది. అలాగే 100 గ్రాముల వెండి ధర రూ.10 తగ్గి రూ.29,490 వద్ద ట్రేడ్ అవుతోంది.

దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లో కూడా బంగారం ధరలు దాదాపు సమానంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో ఒక గ్రాము 24 క్యారెట్ల బంగారం ధర రూ.16,450గా ఉండగా, విజయవాడలో అది రూ.16,451గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో ఒక గ్రాము బంగారం ధర సుమారు రూ.16,466 వద్ద కొనసాగుతోంది. ఇక ముంబైలో ఒక గ్రాము బంగారం ధర హైదరాబాద్‌తో సమానంగా రూ.16,450 వద్ద ట్రేడ్ అవుతోంది.

Also Read: Kurdish Army: కుర్దిష్ సైన్యం దెబ్బతో ఇరాన్‌ లొంగిపోనుందా? అమెరికా మాస్టర్ ప్లాన్ ఇదే..!!  

ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, యుద్ధ వాతావరణం, అంతర్జాతీయ మార్కెట్‌లో పెట్టుబడిదారుల ధోరణి వంటి అంశాలు బంగారం ధరలను ప్రభావితం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. భవిష్యత్తులో కూడా ఈ అంశాల ఆధారంగా గోల్డ్ మార్కెట్‌లో హెచ్చుతగ్గులు కొనసాగే అవకాశముందని వారు అంచనా వేస్తున్నారు.

Also Read: Mortgage Property: మార్ట్‌గేజ్ ప్రాప‌ర్టీ అంటే ఏంటి..? నిబంధ‌న‌లు ఏంటి..? కొనే ముందు ఈ రూల్స్ తప్పనిసరిగా తెలుసుకోవాలి..!!  

Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. దయచేసి దీన్ని పెట్టుబడి, ఆర్థిక లేదా వ్యాపార సలహాగా భావించవద్దు. గుర్తుంచుకోండి స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టోకరెన్సీలు, రియల్ ఎస్టేట్, విలువైన లోహాలు వంటి అన్ని రకాల పెట్టుబడులు మార్కెట్ ఆటు పోటులు రిస్కులకు లోబడి ఉంటాయి. దీని అర్థం, మీరు లాభపడవచ్చు లేదా నష్టపోవచ్చు. మీరు తీసుకునే ఎలాంటి పెట్టుబడి నిర్ణయాలు లేదా వ్యాపార కార్యకలాపాల వల్ల కలిగే నష్టాలు లేదా లాభాలకు మా సంస్థ జీ తెలుగు వెబ్ పోర్టల్ ఎట్టి పరిస్థితుల్లోనూ బాధ్యత వహించదు. ఏదైనా ఆర్థిక నిర్ణయం తీసుకునే ముందు, తప్పకుండా ఒక రిజిస్టర్డ్ లేదా సర్టిఫైడ్ ఆర్థిక నిపుణుడిని సంప్రదించి, వారి సలహా తీసుకోమని పాఠకులకు సిఫార్సు చేస్తున్నాము.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.

0
comment0
Report
RKRavi Kumar Sargam
Mar 04, 2026 17:32:21
Balapur, Telangana:

Telangana CM Delhi Tour: అకస్మాత్తుగా ఢిల్లీ పర్యటనకు వెళ్లిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి బిజీబిజీగా గడిపారు. ఢిల్లీలో బుధవారం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో సమావేశమై పలు కీలక అంశాలపై చర్చించారు. మావోయిస్టుల ఏరివేత.. లొంగుబాటుతోపాటు రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక భద్రతా అంశాలు, పోలీస్ విభాగ బలోపేతంపై సమావేశంలో  చర్చలు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించి పలు విజ్ఞప్తులు కూడా కేంద్ర హోంమంత్రి ముందు ఉంచారు. కేంద్ర హోంమంత్రితో జరిగిన సమావేశంలో రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రెటరీ శేషాద్రి, డీజీపీ శివధర్ రెడ్డి, ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీపీ విజయ్ కుమార్, ఎస్‌ఐబీ ఐజీపీ సుమతి తదితరులు పాల్గొన్నారు.

Also Read: BRS Party: గులాబీ పార్టీలో గుబులు.. సంస్థాగత నిర్మాణంపై మళ్లీ చేతులెత్తేసిన బీఆర్‌ఎస్‌

తెలంగాణ రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలను ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రికి ముఖ్యమంత్రి వివరించారు. డ్రగ్స్‌, గంజాయి వంటి నివారణకు ఈగల్ ఫోర్స్ కార్యకలాపాలు, సైబర్ నేరాలను, సైబర్ సవాళ్లను ఎదుర్కోవడంలో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోషిస్తున్న క్రియాశీలక పాత్రను ప్రస్తావించి వాటి పనితీరు.. సాధించిన ఫలితాలు వివరించారు. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజిగిరి కమీషనరేట్లను పునర్వ్యవస్థీకరణ చేసి కొత్తగా ఫ్యూచర్ సిటీ కమిషనరేట్‌ను ఏర్పాటుచేసిన విషయాన్ని ప్రస్తావించారు.

Also Read: Adulterated Ghee: హైదరాబాద్‌ ప్రజలకు అలర్ట్‌.. బంజారాహిల్స్‌లో 460 కిలోల కల్తీ నెయ్యి సీజ్‌

తెలంగాణకు మరింత సంఖ్యలో ఐపీఎస్ అధికారుల అవసరం ఉందని.. తెలంగాణ ఐపీఎస్ క్యాడర్ సంఖ్యను పెంచాలని కేంద్ర హోంమంత్రిని తెలంగాణ సీఎం విజ్ఞప్తి చేశారు. శరవేగంగా పెరుగుతున్న హైదరాబాద్ జనాభా దృష్ట్యా, పరిపాలన సౌలభ్యం కొరకు తెలంగాణకు అదనంగా ఐపీఎస్ అధికారుల కేటాయింపు అత్యవసరం అని.. ఈ దిశగా కేంద్ర హోం శాఖ సానుకూల నిర్ణయం తీసుకోవాలని కేంద్ర హోంమంత్రికి విన్నవించారు.

మావోయిస్టుల లొంగుబాటు అంశం
తెలంగాణ రాష్ట్రంలో అజ్ఞాతం వీడి బయటకు వచ్చి జనజీవన స్రవంతిలో కలిసిపోయిన మావోయిస్టు నాయకుల విషయాన్ని కేంద్ర హోంమంత్రి వద్ద ప్రత్యేకంగా ప్రస్తావించారు. మావోయిస్టుల లొంగుబాటు అంశం కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చింది. మిగిలిన మావోయిస్టు నాయకుల లొంగుబాటు, వారి పునరావాసం సంబంధించిన విషయాలను ఈ భేటీలో కేంద్ర హోంమంత్రికి వివరించారు. రెండు సంవత్సరాల కాలంలో రాష్ట్రంలో గణనీయమైన మార్పులు వచ్చాయని.. మొత్తం 591 మంది మావోయిస్టులు తెలంగాణ రాష్ట్రంలో ఆయుధాలను వీడి జనజీవన స్రవంతిలో కలిశారని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఇటీవల పలువురు మావోయిస్టు అగ్ర నాయకులు కూడా సాధారణ జీవితం గడిపేందుకు ముందుకువచ్చారని తెలిపారు. వీరందరికీ ప్రభుత్వం తరపున కల్పిస్తున్న సౌకర్యాలను కేంద్ర హోంమంత్రికి తెలంగాణ సీఎం వివరించారు. రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వం నుంచి అందాల్సిన సహకారంపై కేంద్ర హోంమంత్రితో తెలంగాణ సీఎం చర్చించారు. పలు అంశాలపై కేంద్ర హోంమంత్రికి విజ్ఞాపనలు చేశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
Advertisement
Back to top