వైరాలో పలు అభివృద్ధి పనులకు డిప్యూటీ సీఎం శంకుస్థాపన
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
T20 World Cup 2026 New Schedule: క్రికెట్ అభిమానులకు అదిరిపోయే వార్త! T20 ప్రపంచ కప్ 2026 షెడ్యూల్లో కొన్ని కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. బంగ్లాదేశ్ జట్టు ఈ టోర్నీ నుండి వైదొలగడంతో, వారి స్థానంలో స్కాట్లాండ్ జట్టును చేర్చుతూ ఐసీసీ కొత్త షెడ్యూల్ను విడుదల చేసింది. భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ మెగా టోర్నమెంట్ సరికొత్త షెడ్యూల్ను ఇప్పుడు తెలుసుకుందాం.
భారత్, శ్రీలంకలోని ప్రముఖ నగరాలైన ముంబై, కోల్కతా, చెన్నై, అహ్మదాబాద్, ఢిల్లీ, కొలంబో వేదికలుగా ఈ మ్యాచ్లు జరగనున్నాయి.
కీలక మార్పులు..
బంగ్లాదేశ్ నిష్క్రమణతో స్కాట్లాండ్కు అవకాశం దక్కింది. స్కాట్లాండ్ జట్టు తన మ్యాచ్లను కోల్కతా, ముంబై వేదికల్లో ఆడనుంది. మిగిలిన గ్రూపుల్లో ఎటువంటి మార్పులు లేవు.
భారత్ ప్రస్థానం..
టీమ్ ఇండియా తన మొదటి మ్యాచ్ను ఫిబ్రవరి 7న అమెరికాతో (ముంబైలో) టోర్నీని ఆరంభిస్తుంది. క్రికెట్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే భారత్ వర్సెస్ పాకిస్థాన్ హై-వోల్టేజ్ పోరు ఫిబ్రవరి 15న కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో రాత్రి 7 గంటలకు జరగనుంది.
టోర్నీ ముఖ్య తేదీలు..
ప్రారంభం: ఫిబ్రవరి 7, 2026.
సూపర్ 8: ఫిబ్రవరి 21 నుండి ప్రారంభం.
సెమీ-ఫైనల్స్: మార్చి 4, 5 తేదీల్లో.
ఫైనల్: మార్చి 8న అహ్మదాబాద్ లేదా కొలంబోలో.
ముఖ్యమైన మ్యాచ్ల షెడ్యూల్..
| తేదీ | మ్యాచ్ | వేదిక | సమయం |
| ఫిబ్రవరి 7 | ఇండియా vs అమెరికా | ముంబై | రాత్రి 7:00 |
| ఫిబ్రవరి 12 | భారత్ vs నమీబియా | ఢిల్లీ | రాత్రి 7:00 |
| ఫిబ్రవరి 15 | ఇండియా vs పాకిస్తాన్ | కొలంబో | రాత్రి 7:00 |
| ఫిబ్రవరి 18 | భారత్ vs నెదర్లాండ్స్ | అహ్మదాబాద్ | రాత్రి 7:00 |
| మార్చి 4 & 5 | సెమీ-ఫైనల్స్ | కోల్కతా/ముంబై | రాత్రి 7:00 |
| మార్చి 8 | ఫైనల్ | అహ్మదాబాద్/కొలంబో | రాత్రి 7:00 |
మొదటి సెమీ-ఫైనల్, ఫైనల్ వేదికలు పాకిస్తాన్ జట్టు ప్రదర్శనపై ఆధారపడి ఉంటాయి. ఒకవేళ పాకిస్తాన్ నాకౌట్ దశకు చేరుకోలేకపోతే, ఆ మ్యాచ్లు భారతదేశంలోనే నిర్వహిస్తారు.
టీ20 వరల్డ్ కప్ పూర్తి మ్యాచ్ షెడ్యూల్
గ్రూప్ దశ
శనివారం, ఫిబ్రవరి 7
నెదర్లాండ్స్ vs పాకిస్తాన్: ఉదయం 11 గంటలకు (05:30 GMT) – కొలంబో
స్కాట్లాండ్ vs వెస్టిండీస్: మధ్యాహ్నం 3 గంటలకు (09:30 GMT) – ఈడెన్ గార్డెన్స్, కోల్కతా
భారతదేశం vs USA: సాయంత్రం 7 గంటలకు (13:30 GMT) – వాంఖడే స్టేడియం, ముంబై
ఆదివారం, ఫిబ్రవరి 8
ఆఫ్ఘనిస్తాన్ vs న్యూజిలాండ్: ఉదయం 11 గంటలకు (05:30 GMT) – MA చిదంబరం స్టేడియం, చెన్నై
ఇంగ్లాండ్ vs నేపాల్: మధ్యాహ్నం 3 గంటలకు (09:30 GMT) – వాంఖడే స్టేడియం, ముంబై
శ్రీలంక vs ఐర్లాండ్: సాయంత్రం 7 గంటలకు (13:30 GMT) – R ప్రేమదాస స్టేడియం, కొలంబో
సోమవారం, ఫిబ్రవరి 9
స్కాట్లాండ్ vs ఇటలీ: ఉదయం 11 గంటలకు (05:30 GMT) – ఈడెన్ గార్డెన్స్, కోల్కతా
ఒమన్ vs జింబాబ్వే: మధ్యాహ్నం 3 గంటలకు (09:30 GMT) – SSC, కొలంబో
కెనడా vs దక్షిణాఫ్రికా: సాయంత్రం 7 గంటలకు (13:30 GMT) – నరేంద్ర మోడీ స్టేడియం, అహ్మదాబాద్
మంగళవారం, ఫిబ్రవరి 10
నమీబియా vs నెదర్లాండ్స్: ఉదయం 11 గంటలకు (05:30 GMT) – అరుణ్ జైట్లీ స్టేడియం, న్యూఢిల్లీ
న్యూజిలాండ్ vs యుఎఇ: మధ్యాహ్నం 3 గంటలకు (09:30 GMT) – ఎంఎ చిదంబరం స్టేడియం, చెన్నై
పాకిస్తాన్ vs యుఎస్ఎ: సాయంత్రం 7 గంటలకు (13:30 GMT) – SSC, కొలంబో
బుధవారం, ఫిబ్రవరి 11
ఆఫ్ఘనిస్తాన్ vs దక్షిణాఫ్రికా: ఉదయం 11 గంటలకు (05:30 GMT) – నరేంద్ర మోడీ స్టేడియం, అహ్మదాబాద్
ఆస్ట్రేలియా vs ఐర్లాండ్: మధ్యాహ్నం 3 గంటలకు (09:30 GMT) – ఆర్ ప్రేమదాస స్టేడియం, కొలంబో
ఇంగ్లాండ్ vs వెస్టిండీస్: సాయంత్రం 7 గంటలకు (13:30 GMT) – వాంఖడే స్టేడియం, ముంబై
గురువారం, ఫిబ్రవరి 12
శ్రీలంక vs ఒమన్: ఉదయం 11 గంటలకు (05:30 GMT) – పల్లెకెలె అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం, కాండీ
ఇటలీ vs నేపాల్: మధ్యాహ్నం 3 గంటలకు (09:30 GMT) - వాంఖడే స్టేడియం, ముంబై
భారతదేశం vs నమీబియా: సాయంత్రం 7 గంటలకు (13:30 GMT) - అరుణ్ జైట్లీ స్టేడియం, న్యూఢిల్లీ
శుక్రవారం, ఫిబ్రవరి 13
ఆస్ట్రేలియా vs జింబాబ్వే: ఉదయం 11 గంటలకు (05:30 GMT) – ఆర్ ప్రేమదాస స్టేడియం, కొలంబో
కెనడా vs యుఎఇ: మధ్యాహ్నం 3 గంటలకు (09:30 GMT) – అరుణ్ జైట్లీ స్టేడియం, న్యూఢిల్లీ
నెదర్లాండ్స్ vs యుఎస్ఎ: సాయంత్రం 7 గంటలకు (13:30 GMT) – ఎంఎ చిదంబరం స్టేడియం, చెన్నై
ఫిబ్రవరి 14 శనివారం
ఐర్లాండ్ vs ఒమన్: ఉదయం 11 గంటలకు (05:30 GMT) – SSC, కొలంబో
స్కాట్లాండ్ vs ఇంగ్లాండ్: మధ్యాహ్నం 3 గంటలకు (09:30 GMT) – ఈడెన్ గార్డెన్స్, కోల్కతా
న్యూజిలాండ్ vs దక్షిణాఫ్రికా: సాయంత్రం 7 గంటలకు (13:30 GMT) – నరేంద్ర మోడీ స్టేడియం, అహ్మదాబాద్
ఫిబ్రవరి 15 ఆదివారం
నేపాల్ vs వెస్టిండీస్: ఉదయం 11 గంటలకు (05:30 GMT) – వాంఖడే స్టేడియం, ముంబై
నమీబియా vs యుఎస్ఎ: మధ్యాహ్నం 3 గంటలకు (09:30 GMT) – ఎంఎ చిదంబరం స్టేడియం, చెన్నై
భారతదేశం vs పాకిస్తాన్: సాయంత్రం 7 గంటలకు (13:30 GMT) – ఆర్ ప్రేమదాస స్టేడియం, కొలంబో
సోమవారం, ఫిబ్రవరి 16
ఆఫ్ఘనిస్తాన్ vs యుఎఇ: ఉదయం 11 గంటలకు (05:30 GMT) – అరుణ్ జైట్లీ స్టేడియం, న్యూఢిల్లీ
ఇంగ్లాండ్ vs ఇటలీ: మధ్యాహ్నం 3 గంటలకు (09:30 GMT) – ఈడెన్ గార్డెన్స్, కోల్కతా
ఆస్ట్రేలియా vs శ్రీలంక: సాయంత్రం 7 గంటలకు (13:30 GMT) – పల్లెకెలె అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం, కాండీ
మంగళవారం, ఫిబ్రవరి 17
కెనడా vs న్యూజిలాండ్: ఉదయం 11 గంటలకు (05:30 GMT) – MA చిదంబరం స్టేడియం, చెన్నై
ఐర్లాండ్ vs జింబాబ్వే: మధ్యాహ్నం 3 గంటలకు (09:30 GMT) – పల్లెకెలె అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం, కాండీ
స్కాట్లాండ్ vs నేపాల్: సాయంత్రం 7 గంటలకు (13:30 GMT) – వాంఖడే స్టేడియం, ముంబై
బుధవారం, ఫిబ్రవరి 18
దక్షిణాఫ్రికా vs యుఎఇ: ఉదయం 11 గంటలకు (05:30 GMT) – అరుణ్ జైట్లీ స్టేడియం, న్యూఢిల్లీ
నమీబియా vs పాకిస్తాన్: మధ్యాహ్నం 3 గంటలకు (09:30 GMT) – SSC, కొలంబో
భారతదేశం vs నెదర్లాండ్స్: సాయంత్రం 7 గంటలకు (13:30 GMT) – నరేంద్ర మోడీ స్టేడియం, అహ్మదాబాద్
గురువారం, ఫిబ్రవరి 19
ఇటలీ vs వెస్టిండీస్: ఉదయం 11 గంటలకు (05:30 GMT) – ఈడెన్ గార్డెన్స్, కోల్కతా
శ్రీలంక వర్సెస్ జింబాబ్వే: మధ్యాహ్నం 3 గంటలకు (09:30 GMT) – ఆర్ ప్రేమదాస స్టేడియం, కొలంబో
ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ కెనడా: సాయంత్రం 7 గంటలకు (13:30 GMT) – ఎంఏ చిదంబరం స్టేడియం, చెన్నై
శుక్రవారం, ఫిబ్రవరి 20
ఆస్ట్రేలియా వర్సెస్ ఒమన్: సాయంత్రం 7 గంటలకు (13:30 GMT) – పల్లెకెలె అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం, క్యాండీ
సూపర్ 8
శనివారం, ఫిబ్రవరి 21
TBD వర్సెస్ TBD: సాయంత్రం 7 గంటలకు (13:30 GMT) – ఆర్ ప్రేమదాస స్టేడియం, కొలంబో
ఆదివారం, ఫిబ్రవరి 22
TBD వర్సెస్ TBD: మధ్యాహ్నం 3 గంటలకు (09:30 GMT) – పల్లెకెలె అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం, క్యాండీ
TBD వర్సెస్ TBD: సాయంత్రం 7 గంటలకు (13:30 GMT) – నరేంద్ర మోడీ స్టేడియం, అహ్మదాబాద్
సోమవారం, ఫిబ్రవరి 23
TBD వర్సెస్ TBD: సాయంత్రం 7 గంటలకు (13:30 GMT) – వాంఖడే స్టేడియం, ముంబై
మంగళవారం, ఫిబ్రవరి 24
TBD వర్సెస్ TBD: సాయంత్రం 7 గంటలకు (13:30 GMT) – పల్లెకెలె అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం, క్యాండీ
బుధవారం, ఫిబ్రవరి 25
TBD వర్సెస్ TBD: సాయంత్రం 7 గంటలకు (13:30 GMT) – ఆర్ ప్రేమదాస స్టేడియం, కొలంబో
గురువారం, ఫిబ్రవరి 26
TBD వర్సెస్ TBD: మధ్యాహ్నం 3 గంటలకు (09:30 GMT) – నరేంద్ర మోడీ స్టేడియం, అహ్మదాబాద్
TBD వర్సెస్ TBD: సాయంత్రం 7 గంటలకు (13:30 GMT) – ఎంఏ చిదంబరం స్టేడియం, చెన్నై
శుక్రవారం, ఫిబ్రవరి 27
TBD వర్సెస్ TBD: సాయంత్రం 7 గంటలకు (13:30 GMT) – ఆర్ ప్రేమదాస స్టేడియం, కొలంబో
శనివారం, ఫిబ్రవరి 28
TBD వర్సెస్ TBD: సాయంత్రం 7 గంటలకు (13:30 GMT) – పల్లెకెలె అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం, క్యాండీ
ఆదివారం, మార్చి 1
TBD వర్సెస్ TBD: మధ్యాహ్నం 3 గంటలకు (09:30 GMT) – అరుణ్ జైట్లీ స్టేడియం, న్యూఢిల్లీ
TBD వర్సెస్ TBD: సాయంత్రం 7 గంటలకు (13:30 GMT) – ఈడెన్ గార్డెన్స్, కోల్కతా
నాకౌట్లు
బుధవారం, మార్చి 4
మొదటి సెమీఫైనల్ సాయంత్రం 7 గంటలకు (13:30 (GMT) – ఈడెన్ గార్డెన్స్, కోల్కతా లేదా ఆర్ ప్రేమదాస స్టేడియం, కొలంబో
గురువారం, మార్చి 5
రెండో సెమీఫైనల్ రాత్రి 7 గంటలకు (13:30 GMT) – వాంఖడే స్టేడియం, ముంబై
ఆదివారం, మార్చి 8
ఫైనల్ రాత్రి 7 గంటలకు (13:30 GMT) – నరేంద్ర మోడీ స్టేడియం, అహ్మదాబాద్ లేదా ఆర్ ప్రేమదాస స్టేడియం, కొలంబో.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Virat Kohli Instagram Earning: ప్రపంచ క్రికెట్ ఐకాన్ విరాట్ కోహ్లీ, కేవలం మైదానంలోనే కాదు, డిజిటల్ దునియాలోనూ రికార్డుల రారాజుగా దూసుకుపోతున్నారు. 2026 నాటికి ఆయన ఇన్స్టాగ్రామ్ ఆదాయం అమాంతం పెరిగి, గ్లోబల్ స్టార్లకు గట్టి పోటీనిస్తోంది. క్రీడలకు అతీతంగా ఒక పవర్ఫుల్ డిజిటల్ బిజినెస్ సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న కోహ్లీ, ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్లో సరికొత్త బెంచ్మార్క్లను సృష్టిస్తున్నారు.
భారతీయ సెలబ్రిటీలలో అగ్రస్థానం
ప్రస్తుతం విరాట్ కోహ్లీ ఒక్కో స్పాన్సర్డ్ పోస్ట్కు సుమారు రూ.11 కోట్ల నుండి రూ.14 కోట్ల వరకు వసూలు చేస్తున్నారని సమాచారం. భారతీయ సినీ, క్రీడా రంగాల్లో మరే ఇతర సెలబ్రిటీ కూడా ఈ స్థాయిలో ఆదాయం పొందడం లేదు. దీనితో ఆయన ఇండియాలోనే అత్యధికంగా ఆర్జిస్తున్న ఇన్స్టాగ్రామ్ సెలబ్రిటీగా నిలిచారు.
గ్లోబల్ టాప్-20 క్లబ్లో ఏకైక భారతీయుడు
ప్రపంచవ్యాప్తంగా ఇన్స్టాగ్రామ్ ద్వారా అత్యధికంగా సంపాదిస్తున్న టాప్-20 వ్యక్తుల జాబితాలో కోహ్లీ స్థిరంగా కొనసాగుతున్నారు. క్రిస్టియానో రొనాల్డో (ఒక్కో పోస్ట్కు సుమారు రూ.26 కోట్లు), లియోనెల్ మెస్సీ (రూ.21 కోట్లు) అగ్రస్థానంలో ఉండగా, కోహ్లీ తన రూ.12-14 కోట్ల ఫీజుతో వారికి గట్టి పోటీ ఇస్తున్నారు.
274 మిలియన్ల ఫాలోవర్లు..
కోహ్లీకి ఉన్న 274 మిలియన్లకు పైగా ఫాలోవర్లు బ్రాండ్లకు తక్షణమే గ్లోబల్ విజిబిలిటీని అందిస్తారు. రొనాల్డో కంటే తక్కువ మంది ఫాలోవర్లు ఉన్నప్పటికీ, కోహ్లీ పోస్ట్లకు వచ్చే 'లైక్స్', 'కామెంట్స్' (Engagement Rate) ప్రపంచ స్థాయి స్టార్లకు సమానంగా ఉంటాయి. దీనివల్ల బ్రాండ్లు ఆయనకు భారీ మొత్తంలో చెల్లించడానికి మొగ్గు చూపుతాయి.
ఆదాయం ఎలా పెరుగుతుంది?
కోహ్లీ ఆదాయం కేవలం ఒక ఫోటో పోస్ట్ చేయడంతోనే ఆగిపోదు. ప్రచారాల కాలపరిమితి, గ్లోబల్ యూసేజ్ హక్కులు, క్రాస్-ప్లాట్ఫామ్ ప్రమోషన్ల ఆధారంగా ఈ ఒప్పందాల విలువ మరిన్ని కోట్లకు చేరుకుంటుంది. ఆయన వార్షిక ఎండార్స్మెంట్ పోర్ట్ఫోలియో విలువ ఇప్పుడు రూ.200 కోట్లు దాటినట్లు అంచనా.
గతంలో (2023లో) తన ఆదాయంపై వచ్చిన వార్తలను కోహ్లీ స్పందిస్తూ.. థర్డ్ పార్టీ నివేదికలు ఇచ్చే అంకెలు ఎప్పుడూ వాస్తవానికి దగ్గరగా ఉండకపోవచ్చని, అవి కేవలం అంచనాలు మాత్రమేనని గుర్తుచేశారు. అయినప్పటికీ, మార్కెట్ నిపుణుల ప్రకారం ఆయన బ్రాండ్ వాల్యూ నిరంతరం పెరుగుతూనే ఉంది.
క్రికెట్ ఆడుతున్నా లేకపోయినా, కోహ్లీ పర్సనల్ బ్రాండింగ్ మాత్రం స్థిరంగా ఉంది. ఇది క్రీడాకారులు తమ కెరీర్ ముగిసిన తర్వాత కూడా డిజిటల్ రంగంలో ఎలా రాణించవచ్చో నిరూపిస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Motorola Signature Offer Price in Flipkart: మోటరోలా కంపెనీ ఇప్పటికీ విడుదల చేసిన అత్యంత ప్రీమియం ఫీచర్స్ మొబైల్స్లో Motorola Signature ఒకటి. దీనిని కంపెనీ జనవరి 30వ తేదీ నుంచి వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రస్తుతం ఈ స్మార్ట్ఫోన్ ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్కార్ట్లో అందుబాటులో ఉంది. అయితే, దీనిని మొదటి సేల్లో భాగంగా కొనుగోలు చేసే వారికి ప్రత్యేకమైన డిస్కౌంట్తో లభిస్తోంది. దీనిపై స్పెషల్ ఆఫర్స్ లభించడమే కాకుండా ఎక్స్చేంజ్ బోనస్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది.
ఈ Motorola Signature స్మార్ట్ఫోన్కు సంబంధించిన ఫీచర్స్ వివరాల్లోకి వెళ్తే, ఇది ఎంతో అద్భుతమైన 6.8 అంగుళాల 1.5K LTPO AMOLED స్క్రీన్ను కలిగి ఉంటుంది.. అంతేకాకుండా దీన్ని స్క్రీన్ గరిష్టంగా 6200 నిట్స్ బ్రైట్నెస్ను అందిస్తుంది. అలాగే ఇందులో స్క్రీన్ ప్రొటెక్షన్ కోసం కంపెనీ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్ కూడా అందిస్తోంది. దీనిని మార్కెట్లోకి కంపెనీ అల్ట్రా స్లిమ్ డిజైన్తో అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇది కేవలం 6.99mm మందం మాత్రమే ఉంటుంది. అంతేకాకుండా 186 గ్రాముల బరువుతో చాలా తేలికగా చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది ఇది ఎయిర్క్రాఫ్ట్ గ్రేడ్ అల్యూమినియం ఫ్రేమ్తో వచ్చింది.
ఇందులో కంపెనీ ఎంతో శక్తివంతమైన క్వాల్కమ్ లేటెస్ట్ Snapdragon 8 Gen 5 చిప్సెట్ ప్రాసెసర్తో అందుబాటులోకి తీసుకువచ్చింది. కాబట్టి మల్టీ టాస్కింగ్ చేసుకోవాలనుకునే వారికి ఇది ఎంతగానో సహాయపడుతుంది. గేమింగ్ చేసేవారు దాదాపు అన్లిమిటెడ్ గా 12 గంటలు ఎంతో తేలికగా ఆడొచ్చు. ఇక వెనక భాగంలో మూడు కెమెరాలు కలిగి ఉంటుంది. ఇందులోని ప్రధాన కెమెరా సోనీ LYTIA 828 సెన్సార్తో 50MPతో అందుబాటులోకి వచ్చింది. అంతేకాకుండా అదనంగా మరో రెండు 50MP కెమెరాలు కూడా లభిస్తాయి. దీంతో పాటు వీటిల్లోని 3x ఆప్టికల్ జూమ్, 100x సూపర్ ఫీచర్ కూడా అందుబాటులో ఉంది.
ఫ్రంట్ భాగంలో 50MP ఆటోఫోకస్ కెమెరా కూడా లభిస్తోంది. ఇక ఈ మొబైల్ ఎంతో శక్తివంతమైన 5200mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీని కలిగి ఉంటుంది. దీంతోపాటు ఫాస్ట్ చార్జింగ్ కోసం ఇందులో కంపెనీ 90W వైర్డ్ ఛార్జింగ్, 50W వైర్లెస్ ఛార్జింగ్ను సపోర్ట్ను కూడా అందిస్తోంది. ఇవే కాకుండా ఎన్నో రకాల అద్భుతమైన స్పెషల్ ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం మార్కెట్లో ఇది మూడు స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. మొదటి స్టోరేజ్ వేరియంట్ 12GB + 256GB రూ.59,999తో.. రెండవ స్టోరేజీ వేరియంట్ 16GB + 512GB రూ.64,999తో, ఇక మూడవ స్టోరేజ్ వేరియంట్ 16GB + 1TB రూ.69,999తో అందుబాటులో ఉంది. అయితే ప్రస్తుతం ఫ్లిప్కార్ట్లో బేస్ వేరియంటిపై ప్రత్యేకమైన ఆఫర్ లభిస్తుంది.
మార్కెట్లో బేస్ వేరియంట్ అసలు ధర రూ.74 వేల రూపాయలు కాగా.. ఫ్లిప్కార్ట్లో మొదటి సేల్లో భాగంగా కొనుగోలు చేసే వారికి.. 20 శాతం తగ్గింపుతో కేవలం రూ.59,999కే అందుబాటులో ఉంది. దీనిని ఫ్లిప్కార్ట్ అనుసంధాన యాక్సిస్ బ్యాంకు క్రెడిట్ కార్డు ద్వారా పేమెంట్ చేస్తే రూ.7,740 వరకు తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా ఇతర బ్యాంకులకు సంబంధించిన క్రెడిట్ కార్డులను వినియోగించి కూడా పేమెంట్ చేసే వారికి భారీ డిస్కౌంట్ లభిస్తుంది. మీరు యాపిల్ కంపెనీ లేదా సామ్సంగ్ కంపెనీకి సంబంధించిన హై ఎండ్ మొబైల్ను ఈ స్మార్ట్ఫోన్ కొనుగోలు చేసే క్రమంలో ఎక్స్చేంజ్ చేస్తే ఏకంగా రూ.59,000 వరకు బోనస్ లభిస్తుంది. గరిష్టంగా ఈ బోనస్ను వినియోగించి కొత్త స్మార్ట్ఫోన్ కొనుగోలు చేసే వారికి కేవలం ఇది రూ999కే పొందవచ్చు. అయితే, బోనస్ అనేది పాత మొబైల్ కండిషన్పై ఆధారపడి ఉంటుంది.
Also Read: Redmi 14C 5G Offer: రెడ్మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్ఫోన్..అదిరిపోయే ఆఫర్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Telangana High Court Job Notification 2026: తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ఉన్నత న్యాయస్థానం శుభవార్త అందించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వివిధ జిల్లాల కోర్టులో ఖాళీగా ఉన్న 859 పోస్టులను భర్తీ చెయ్యబోతున్నట్లు అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారానే జూనియర్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్, స్టెనోగ్రాఫర్ వంటి ప్రత్యేకమైన విభాగాల్లో నియామకాలు చేపట్టబోతున్నట్లు అధికారికంగా తెలిపింది. అయితే, ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
తెలంగాణ ఉన్నత న్యాయస్థానం విడుదల చేసిన ఈ నోటిఫికేషన్లో భాగంగా మొత్తం 859 పోస్టులకు భర్తీ చేయబోతోంది. ముఖ్యంగా ఆఫీస్ సబార్డినేట్ విభాగంలో 319 ఖాళీలు భర్తీ చేసేందుకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగానే 1509 జూనియర్ అసిస్టెంట్, 95 ప్రాసెస్ సర్వీస్, 63 కాపిస్ట్, 61 ఫీల్డ్ అసిస్టెంట్, 49 ఎగ్జామినేర్ తో పాటు మరికొన్ని పోస్టులను భర్తీ చేయబోతున్నట్లు పేర్కొంది. అలాగే ఈ పోస్టుల్లో భాగంగా స్టెనోగ్రాఫర్ గ్రేట్ 3కి సంబంధించిన 35 పోస్టులతో పాటు రికార్డ్ అసిస్టెంట్ 36 పోస్టులు, టైపిస్టు 42 పోస్టులను భర్తీ చేసేందుకు అధికారిక నోటిఫికేషన్ లో వెల్లడించింది. అంతేకాకుండా ఈ నోటిఫికేషన్ లో భాగంగా వయోపరిమితికి సంబంధించిన వివరాలను కూడా అందుబాటులో ఉంచారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని కొనేవారు 18 నుంచి 46 ఏళ్ల మధ్యలో వయస్సును కలిగి ఉండాల్సి ఉంటుంది.
అంతేకాకుండా పోస్టులను బట్టి అర్హతలు ఉంటాయని ఈ నోటిఫికేషన్ లో హైకోర్టు పేర్కొంది. ఇక విద్యార్హతలో భాగంగా.. పోస్టులను బట్టి ఏడవ తరగతి నుంచి డిగ్రీ వరకు ఉత్తీర్ణులైన వారిని అప్లై చేసుకోవచ్చని పేర్కొంది. అభ్యర్థులు ఈ పోస్టులకు నేరుగా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. హైకోర్టుకు సంబంధించిన అధికారిక వెబ్సైట్ tshc.gov.in ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఈ అధికారిక నోటిఫికేషన్ను తెలంగాణ హైకోర్టు జనవరి 24వ తేదీన విడుదల చేసింది. అయితే ఈ నోటిఫికేషన్ లో భాగంగా ఫిబ్రవరి 13 వరకు చివరి తేదీ ఉండబోతున్నట్లు పేర్కొంది. అంతేకాకుండా ఈ పోస్టులకు అప్లై చేసుకునే వారికి.. ఏప్రిల్ లో పరీక్షలు కూడా ఉండబోతున్నట్లు నోటిఫికేషన్ లో తెలిపింది.
ఇక ఈ పోస్టులకు సంబంధించిన జీతాల వివరాల్లోకి వెళ్తే.. ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను బట్టి ప్రతినెల రూ.19 వేల నుంచి రూ.96 వేల వరకు వేతనాన్ని అందించబోతున్నట్లు హైకోర్టు అధికారికంగా నోటిఫికేషన్ లో వెల్లడించింది. అయితే, ఈ పోస్టులను అప్లై చేసుకున్న అభ్యర్థులు ఎంపికవడానికి కంప్యూటర్ ఆధారిత పరీక్షను రాయాల్సి ఉంటుంది.
అంతేకాకుండా పరీక్ష రాసిన తర్వాత స్కిల్ టెస్ట్ తో పాటు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది. వీటిల్లో కూడా ఉత్తీర్ణత సాధిస్తే.. జిల్లాకు సంబంధించిన కోర్టుల్లో ఉద్యోగాలు లభిస్తాయి. అలాగే ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు తప్పకుండా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.. ఓసి, బీసీ అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకుంటే రూ.600 చెల్లించాల్సి ఉంటుంది.. ఇక ఇతరులకు రూ.400 పరీక్ష ఫీజు ఉండబోతున్నట్లు అధికారికంగా హైకోర్టు తెలిపింది..
Also Read: Giant Cobra Video: కిచెన్లో ఫ్రిజ్ వెనుక భారీ నాగుపాము.. సంచలనం సృష్టిస్తున్న వీడియో..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Mood Of The Nation Survey Andhra: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికలు ముగిసి కొద్ది నెలలు గడుస్తున్నా, రాజకీయ వేడి మాత్రం తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో, ప్రముఖ మీడియా సంస్థ ఇండియా టుడే దేశవ్యాప్తంగా నిర్వహించిన 'మూడ్ ఆఫ్ ది నేషన్' (MOTN) సర్వేలో ఆంధ్రప్రదేశ్ ప్రజల నాడిని స్పష్టం చేసింది.
కూటమి హవా కొనసాగుతుందా?
ఇండియా టుడే సర్వే ప్రకారం, రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్నికలు జరిగినా తెలుగుదేశం పార్టీ (TDP), జనసేన, బీజేపీ (BJP) కూటమికే ప్రజలు పట్టం కడుతున్నట్లు తేలింది. ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అమరావతి పునఃప్రారంభం వంటి నిర్ణయాలు ప్రజల్లో సానుకూలతను పెంచాయని సర్వే వెల్లడించింది.
సీట్ల లెక్కలు (అంచనా)
లోక్సభ స్థానాల ప్రాతిపదికన ఇండియా టుడే వెల్లడించిన అంచనాలు ఇలా ఉన్నాయి.
NDA కూటమి (TDP + JSP + BJP): మొత్తం 25 లోక్సభ స్థానాల్లో మెజారిటీ స్థానాలను ఈ కూటమి కైవసం చేసుకునే అవకాశం ఉంది. ఓట్ల శాతం కూడా గత ఎన్నికల కంటే నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది.
YSRCP: ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సీట్ల సంఖ్యలో పెద్దగా మార్పు లేకపోయినా, కొన్ని ప్రాంతాల్లో ఓట్ల శాతం పుంజుకుంటున్నట్లు సర్వే సూచించింది.
సర్వేలో తేలిన ప్రధానాంశాలు..
ముఖ్యమంత్రి పనితీరు: చంద్రబాబు నాయుడు అనుభవం, పరిపాలన దక్షతపై ప్రజలు నమ్మకంగా ఉన్నారు. కూటమి ప్రభుత్వ 'సూపర్ సిక్స్' హామీల అమలుపై ప్రజలు ఆశలు పెట్టుకున్నారు.
పవణ్ కళ్యాణ్ ప్రభావం: ఉప ముఖ్యమంత్రి హోదాలో పవణ్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలు, ముఖ్యంగా పంచాయతీ రాజ్, అటవీ శాఖల్లో ఆయన మార్పులు యువతను ఆకట్టుకుంటున్నాయి.
వైఎస్ జగన్ పరిస్థితి: ఓటమి తర్వాత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజల్లోకి వెళ్లేందుకు చేస్తున్న ప్రయత్నాలు కొంతవరకు క్యాడర్లో ధైర్యాన్ని నింపుతున్నాయని, అయితే అధికారం చేజిక్కించుకునే స్థాయికి సెంటిమెంట్ ఇంకా పెరగలేదని సర్వే అభిప్రాయపడింది.
కేంద్ర రాజకీయాల ప్రభావం..
రాష్ట్రానికి కేంద్రం అందిస్తున్న నిధులు, పోలవరం ప్రాజెక్టుకు బడ్జెట్ కేటాయింపులు వంటివి కూటమికి ప్లస్ పాయింట్లుగా మారాయి. అదే సమయంలో ప్రత్యేక హోదా వంటి పెండింగ్ అంశాలపై ప్రజల్లో ఇంకా అసంతృప్తి ఉన్నట్లు కూడా సర్వే పేర్కొంది.
మొత్తానికి ఇండియా టుడే 'మూడ్ ఆఫ్ ది నేషన్' సర్వే ప్రకారం.. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మళ్ళీ కూటమి ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని స్పష్టమవుతోంది. అయితే, అభివృద్ధి పనులు వేగవంతం కాకపోతే భవిష్యత్తులో ఈ సమీకరణాలు మారే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Free Bus For Men In Telangana: తెలంగాణ కుంభమేళాగా పిలవబడే మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర సందర్భంగా భక్తులకు టీజీఎస్ఆర్టీసీ (TGSRTC) బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఇప్పటివరకు 'మహాలక్ష్మి' పథకం ద్వారా కేవలం మహిళలకే పరిమితమైన ఉచిత ప్రయాణం, ఇప్పుడు నిర్దేశిత ప్రాంతాల్లో పురుషులకు కూడా అందుబాటులోకి వచ్చింది. మేడారం మహా జాతరకు వచ్చే కోట్లాది మంది భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ అధికారులు వినూత్న నిర్ణయం తీసుకున్నారు.
ఎక్కడ నుండి ఎక్కడి వరకు ఉచితం?
సాధారణంగా రాష్ట్రవ్యాప్తంగా మహిళలకు మాత్రమే ఉచిత ప్రయాణం ఉన్నప్పటికీ, మేడారం పరిసర ప్రాంతాల్లో రద్దీని తగ్గించేందుకు పురుషులకు కూడా ఉచిత సౌకర్యం కల్పించారు. ములుగు జిల్లాలోని పస్రా నుండి మేడారం వరకు నడిచే ప్రత్యేక బస్సుల్లో స్త్రీ, పురుష భేదం లేకుండా అందరికీ ఉచిత ప్రయాణం కల్పిస్తున్నారు.
ప్రైవేట్ వాహనాల్లో వచ్చే భక్తులు తమ వాహనాలను చింతల్ క్రాస్ వద్ద పార్క్ చేసి, అక్కడి నుండి మేడారం చేరుకోవడానికి ఏర్పాటు చేసిన 20 ప్రత్యేక బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు.
4,000 ప్రత్యేక బస్సులు
రాష్ట్రం నలుమూలల నుండి మేడారం చేరుకోవడానికి టీజీఎస్ఆర్టీసీ మొత్తం 4,000 ప్రత్యేక బస్సులను నడుపుతోంది. ఫిబ్రవరి 1 వరకు ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. మహాలక్ష్మి పథకం వర్తించే బస్సుల్లో మహిళలు యథావిధిగా రాష్ట్రవ్యాప్తంగా ఉచితంగా ప్రయాణించవచ్చు.
భక్తుల రద్దీ - ఆర్టీసీ ఏర్పాట్లు
ప్రతి రెండేళ్లకోసారి జరిగే ఈ జాతరకు ఈ ఏడాది సుమారు 1.5 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా. మేడారంలో భక్తుల సౌకర్యార్థం భారీ విస్తీర్ణంలో తాత్కాలిక బస్ స్టాండ్ను ఏర్పాటు చేశారు. ప్రైవేట్ వాహనాల వల్ల ట్రాఫిక్ జామ్ కాకుండా ఉండేందుకు పార్కింగ్ స్థలాల నుండి జాతర గద్దెల వరకు 'షటిల్' సర్వీసుల రూపంలో ఉచిత బస్సులను నడుపుతున్నారు.
పురుషుల విజ్ఞప్తికి ఊరట
తెలంగాణలో ఉచిత బస్సు పథకాల వల్ల బస్సుల్లో రద్దీ పెరిగి, టికెట్ కొని ప్రయాణించే పురుషులు సీట్లు దొరకక ఇబ్బంది పడుతున్నట్లు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో, జాతర వంటి ప్రత్యేక సందర్భాల్లో అందరికీ ఉచిత ప్రయాణం కల్పించడంపై సామాన్యుల నుండి హర్షం వ్యక్తం అవుతోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Petrol Diesel Price Hikes 2026: ప్రపంచ రాజకీయాల్లో చోటుచేసుకుంటున్న పరిణామాలు ఇప్పుడు సామాన్యుడి జేబుకు చిల్లు పెట్టేలా కనిపిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు, ఇరాన్తో పెరుగుతున్న ఉద్రిక్తతలు అంతర్జాతీయ చమురు మార్కెట్ను అతలాకుతలం చేస్తున్నాయి. అమెరికా-ఇరాన్ మధ్య మాటల యుద్ధం ముదిరి పాకాన పడటంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.
70 డాలర్లు దాటిన బ్రెంట్ క్రూడ్
సెప్టెంబర్ నెల తర్వాత మొదటిసారిగా అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ ముడి చమురు ధర బ్యారెల్కు 70 డాలర్ల మార్కును దాటింది. లండన్ మార్కెట్లో బ్రెంట్ ధర 2.4% పెరిగి $70.06 కి చేరగా, అమెరికా బెంచ్మార్క్ WTI 2.6% పెరిగి బ్యారెల్కు $64.82 కి చేరుకుంది.
ట్రంప్ హెచ్చరికలు - ఇరాన్ ప్రతిస్పందన
డొనాల్డ్ ట్రంప్ తన 'ట్రూత్ సోషల్' వేదికగా ఇరాన్ను హెచ్చరించారు. అణు కార్యక్రమంపై ఇరాన్ వెంటనే చర్చలకు రావాలని, లేనిపక్షంలో తీవ్ర పరిణామాలు ఉంటాయని స్పష్టం చేశారు. దీనిపై ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చి స్పందిస్తూ.. అమెరికా ఏదైనా సైనిక చర్యకు దిగితే తమ స్పందన చాలా వేగంగా, కఠినంగా ఉంటుందని హెచ్చరించారు.
హార్ముజ్ జలసంధిపై నీలినీడలు
ప్రపంచ చమురు సరఫరాలో అత్యంత కీలకమైనది హార్ముజ్ జలసంధి (Strait of Hormuz). ఒకవేళ యుద్ధ వాతావరణం నెలకొంటే, ఈ జలసంధి ద్వారా జరిగే చమురు, గ్యాస్ ట్యాంకర్ల రవాణా నిలిచిపోయే ప్రమాదం ఉంది. ఇరాన్ రోజువారీ ఉత్పత్తి చేసే సుమారు 3 మిలియన్ బ్యారెళ్ల చమురుపై కూడా ప్రభావం పడవచ్చు. దీనివల్ల మార్కెట్లో చమురు కొరత ఏర్పడి ధరలు అమాంతం పెరిగే అవకాశం ఉంది.
భారతదేశం తన చమురు అవసరాలలో 80% కంటే ఎక్కువ దిగుమతులపైనే ఆధారపడుతుంది. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ధర పెరిగితే, అది నేరుగా మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు దారితీస్తుంది. ఇది రవాణా ఖర్చులను పెంచి, నిత్యావసర వస్తువుల ధరలు పెరగడానికి కారణమవుతుంది.
ప్రస్తుతం మార్కెట్లో ఒక రకమైన భయాందోళన నెలకొంది. అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గకపోతే, రాబోయే రోజుల్లో పెట్రోల్ బంకుల వద్ద సామాన్యుడికి ధరల సెగ తప్పదు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Archana Ravichandran Tiruvannamalai News: తమిళ బుల్లితెర నటి అర్చనా రవిచంద్రన్ చేసిన పని ఇప్పుడు పెను వివాదానికి దారితీసింది. పవిత్రమైన అరుణాచల క్షేత్రంలో నిబంధనలను ఉల్లంఘించినందుకు గానూ అటవీశాఖ అధికారులు ఆమెకు గట్టి షాక్ ఇచ్చారు. పరమశివుని స్వరూపంగా భావించే అరుణాచలంలోని 'అన్నామలై గిరి' చుట్టూ ప్రదక్షిణ చేయడానికి అనుమతి ఉంటుంది కానీ, కొండపైకి ఎక్కడం మాత్రం కఠినంగా నిషేధించారు.
ఏం జరిగింది?
తమిళ టీవీ నటి అర్చనా రవిచంద్రన్ తన సహ నటుడు అరుణ్తో కలిసి అరుణాచలం సందర్శనకు వెళ్లారు. అయితే, భక్తులు పవిత్రంగా భావించే 2,668 అడుగుల ఎత్తైన అన్నామలై గిరిపైకి వీరిద్దరూ ఎక్కారు. అటవీశాఖ నిబంధనలను బేఖాతరు చేస్తూ కొండపైకి వెళ్లడమే కాకుండా, అక్కడ దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
అటవీశాఖ అధికారుల కొరడా
నిషేధిత ప్రాంతంలోకి ప్రవేశించి ఫోటోలు దిగడంపై అటవీశాఖ అధికారులు తీవ్రంగా స్పందించారు. నిబంధనలను ఉల్లంఘించినందుకు అర్చన మరియు అరుణ్లకు తలా రూ.5,000 చొప్పున జరిమానా విధించారు. భవిష్యత్తులో ఇలాంటి పనులు పునరావృతమైతే కఠిన చర్యలు తీసుకుంటామని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.
భక్తుల ఆగ్రహం..
అరుణాచలం కొండను భక్తులు శివుని రూపంగా ఆరాధిస్తారు. కాబట్టి గిరిపైకి ఎక్కడం అంటే దైవత్వాన్ని అవమానించడమేనని స్థానిక భక్తులు మండిపడుతున్నారు. "నిబంధనలు అందరికీ ఒకటే, సెలబ్రిటీ అయితే రూల్స్ వర్తించవా?" అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. "ఎంత ధైర్యం ఉంటే దైవ స్వరూపంగా భావించే కొండపైకి ఎక్కుతావు?" అంటూ ఆమె పోస్ట్లపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అరుణాచల గిరి ప్రత్యేకత
అరుణాచలంలో ఉన్న ఆలయం చుట్టూ ఉన్న 14 కిలోమీటర్ల మార్గంలో లక్షలాది మంది భక్తులు గిరి ప్రదక్షిణ చేస్తారు. పర్యావరణ పరిరక్షణ, ఆధ్యాత్మిక విలువల దృష్ట్యా సామాన్యులెవరూ కొండపైకి వెళ్లకూడదని అటవీశాఖ ఎప్పటి నుంచో నిబంధనలు పెట్టింది. అయినా ఈ రూల్ బేఖాతరు చేసి వాళ్లిద్దరూ కొండపైకి ఎక్కడాన్ని భక్తులు తప్పుబడుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Pawan Kalyan: జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పార్టీలో కీలక మార్పు తీసుకురాబోతున్నారు. జనసేనలో ప్రజాస్వామ్యం బలపడేలా చర్యలు తీసుకుంటున్నారు. సీల్డ్ కవర్లో పేరు ఇచ్చి మిగిలిన రాజకీయ పార్టీల తరహాలో గ్రామ, వార్డు, మండల కమిటీలను ఎంచుకునే విధానం కాకుండా పూర్తిగా ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. ప్రత్యక్ష ఎన్నిక విధానంతో ప్రజాస్వామ్యానికి మారుపేరుగా నిలుస్తుందని ఆ పార్టీ భావిస్తోంది.
Also Read: Medaram Jatara 2026: మేడారం జాతరకు చారిత్రక ఏర్పాట్లు చేశాం: కేంద్ర, రాష్ట్ర మంత్రులు
ఈ విధానాన్ని తొలుత తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కాకినాడ జిల్లా పిఠాపురంలో అమలుచేసి అనంతరం రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని పవన్ నిర్ణయించారు. ఇందులో భాగంగా రెండు రోజుల నుంచి పిఠాపురం నియోజవర్గం చేబ్రోలులోని జనసేన కార్యాలయంలో పార్టీ ప్రధాన కార్యదర్శి తాళ్లూరి రామ్ ఆధ్వర్యంలో ఈ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. జనసేన సభ్యత్వం ఉన్నవారితో ఎవరైతే పోటీ పడుతున్నారో వారికి ఓటు వేసే విధంగా తీసుకున్న చర్యలతో మరో ఎన్నికల సంగ్రామం ఉత్కంఠంగా కొనసాగుతోంది.
Also Read: Medaram Jatara: మేడారం జన జాతర.. 2 రోజుల్లో 80 లక్షల మంది భక్తుల రాక
పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే, ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కల్యాణ్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాళ్లూరి రామ్ మీడియాతో మాట్లాడుతూ.. 'క్షేత్రస్థాయిలో జనసేన పార్టీని బలోపేతం చేసేందుకు గత నెలలో 52 గ్రామాలకు ఇన్చార్జిలు, బూత్ కన్వీనర్ని ఎన్నుకున్నాం. గొల్లప్రోలు పట్టణం, పిఠాపురం పట్టణానికి వార్డు ఇన్చార్జిలు, ఎన్నికల బూత్ కన్వీనర్లను ఎన్నుకునేలా ప్రజాస్వామ్యబద్ధంగా సీక్రెట్ ఓటింగ్ చేస్తున్నాం. ఈ ప్రక్రియ జరుగుతుందని.. 30వ తేదీన మూడు మండలాలకు, గొల్లప్రోలు పట్టణ, పిఠాపురం పట్టణ అధ్యక్షులు, ఉపాధ్యక్షులను ఓటింగ్ ద్వారా ఎన్నుకుంటాం' అని వివరించారు. ఎన్నికలతో సుమారు 5,867 మంది నాయకులు ఏర్పడతారని.. దీంతో జనసేన పార్టీని బరిష్టంగా ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈసారి జనసేన సభ్యత్వం ఉన్నవారిని మాత్రమే పరిగణనలోకి తీసుకున్నామని.. జనసేన సభ్యత్వం లేని వారికి దానిపై వివరణ ఇస్తామని తాళ్లూరి రామ్ తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Royal Enfield Hunter 350 Price: రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ కొనాలనేది చాలా మంది యువత కల. ముఖ్యంగా రద్దీగా ఉండే నగరాల్లో సులభంగా నడపడానికి, స్టైలిష్గా కనిపించడానికి రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350 (Hunter 350) ఒక అద్భుతమైన ఆప్షన్. మీరు ఈ బైక్ను ఫైనాన్స్లో తీసుకోవాలనుకుంటే, నెలవారీ EMI, వడ్డీ లెక్కలు ఎలా ఉంటాయో ఇక్కడ చూడవచ్చు. హంటర్ 350 బైక్ కేవలం లుక్స్ పరంగానే కాకుండా, రాయల్ ఎన్ఫీల్డ్ శ్రేణిలోనే అత్యంత సరసమైన (Affordable) బైక్గా గుర్తింపు పొందింది.
ధర వివరాలు
హంటర్ 350 వివిధ వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఎక్స్-షోరూమ్ ధర రూ.1,37,640 నుండి రూ.1,66,883 వరకు (వేరియంట్ను బట్టి మారుతుంది). టాప్ వేరియంట్ ధర సుమారు రూ.1,66,883గా ఉంటుంది.
లోన్, EMI లెక్కలు (టాప్ వేరియంట్పై)
ఒకవేళ మీరు రూ.1,66,883 మొత్తాన్ని 8.5% వడ్డీ రేటుతో లోన్ తీసుకుంటే, మీ చెల్లింపులు ఇలా ఉండవచ్చు.
| రుణ కాలపరిమితి | నెలవారీ EMI | మొత్తం వడ్డీ |
| 12 నెలలు (1 సంవత్సరం) | ₹14,556 | ₹7,783 |
| 24 నెలలు (2 ఏళ్లు) | ₹7,586 | ₹15,176 |
పైన పేర్కొన్న లెక్కలు ఎక్స్-షోరూమ్ ధరపై ఆధారపడి ఉన్నాయి. ఆన్-రోడ్ ధర (రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్ కలిపి) మీరు చెల్లించే డౌన్ పేమెంట్ బట్టి EMI మారుతుంది.
హంటర్ 350 ప్రత్యేకతలు
ఆధునిక రెట్రో లుక్, యువతను ఆకట్టుకునే కలర్ ఆప్షన్లు. 350cc పవర్ఫుల్ జే-సిరీస్ ఇంజిన్, ఇది నగర వీధుల్లో మంచి టార్క్ను అందిస్తుంది. తక్కువ సీటు ఎత్తు, తక్కువ బరువు ఉండటం వల్ల రద్దీగా ఉండే ట్రాఫిక్లోనూ సులభంగా హ్యాండిల్ చేయవచ్చు. డిజిటల్-అనలాగ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్ వంటి ఆధునిక ఫీచర్లు ఉన్నాయి.
మీరు తక్కువ వడ్డీతో రాయల్ ఎన్ఫీల్డ్ అనుభూతిని పొందాలనుకుంటే హంటర్ 350 సరైన ఎంపిక. లోన్ తీసుకునే ముందు వివిధ బ్యాంకుల వడ్డీ రేట్లను పోల్చి చూసుకోవడం మంచిది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Gajakesari Raja Yoga Effect On Zodiac Telugu: చాలా రోజుల తర్వాత బృహస్పతి, చంద్రగ్రహాల కలయిక జరిగింది. జ్యోతిష్య శాస్త్రంలో ఈ రెండు గ్రహాల కలయిక చాలా శుభప్రదమైనదిగా భావిస్తారు. ముఖ్యంగా బృహస్పతిని జ్ఞానం, మతం, డబ్బు విస్తరణకు సూచికగా భావిస్తారు. ఇక చంద్రుడిని మనస్సు, భావన, మానసిక స్థితి, ప్రశాంతతకు సూచికగా చెప్పుకుంటారు. అయితే ఈ రెండు గ్రహాల కలయిక కారణంగా ఏర్పడిందే గజకేసరి రాజయోగం.. ఈ యోగం జాతకంలో శుభస్థానంలో ఉన్న రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది.
ప్రస్తుతం మిథున రాశిలో బృహస్పతి సంచార దశలో ఉన్నాడు. అయితే, జూన్ రెండవ తేదీ వరకు ఈ గ్రహం అక్కడే ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఇది ఇలా ఉంటే బుధవారం జనవరి 29వ తేదీన సాయంత్రం మిధున రాశిలోకి చంద్రుడు ప్రవేశించాడు. దీని కారణంగానే ఈ రెండు గ్రహాల సంయోగం జరిగి గజకేసరి రాజయోగం ఏర్పడింది. దాదాపు ఈ యోగం 54 గంటల పాటు ఎంతో యాక్టివ్గా ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. అప్పటివరకు ఆయా రాశుల వారికి ఎంతో మేలు జరుగుతుంది.
గజకేసరి రాజయోగ ప్రభావం:
మకర రాశి
బృహస్పతి చంద్ర సంయోగాల కారణంగా మకర రాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ సమయంలో ఏర్పడిన గజకేసరి యోగ ప్రభావంతో చాలాకాలంగా పనుల్లో తలెత్తుతున్న సమస్యలు అనేక రకాల అడ్డంకులు ఈ యోగ ప్రభావంతో పరిష్కారం అవుతాయి. అంతే కాకుండా శత్రువులు కూడా చాలావరకు బలహీనంగా మారే అవకాశాలున్నాయి. పోటీ పరీక్షలు రాసేవారికి ఈ సమయం అద్భుతమైన ఫలితాలని అందిస్తుంది. చట్టపరమైన కేసులతో పాటు న్యాయ రంగాల్లో విశేషమైన అనుభవం ఉన్నవారికి బోలెడు ప్రయోజనాలు కలుగుతాయి. ఉద్యోగాలు చేస్తున్న వ్యక్తులు కార్యాలయాల్లో గౌరవం కూడా సంపాదిస్తారు. అంతేకాకుండా ఆరోగ్య సంబంధిత సమస్యలకు కాస్త ఉపశమనం కూడా కలుగుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు..
కన్యా రాశి
కన్యా రాశి వారికి గజకేసరి రాజయోగం ప్రభావంతో కెరీర్ పరంగా విశేషమైన లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా వృత్తి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. కొత్త బాధ్యతలు లభించడమే కాకుండా.. వీరు కొత్త ఉద్యోగాల్లో మార్పులు కూడా పొందుతారు. వ్యాపారాలు చేసే వారికి ఈ సమయం విశేషమైన ఫలితాలను అందిస్తుంది. అంతేకాకుండా కష్టపడి పనులు చేసే వ్యక్తులు ఈ సమయంలో భారీ మొత్తంలో లాభాలు పొందగలుగుతారు. ఆశించిన వాటికంటే ఎక్కువ మోతాదులు ధన లాభాలు కూడా పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగం చేస్తున్న కన్యారాశి వారికి కార్యాలయాల్లో అద్భుతమైన గుర్తింపు లభిస్తుంది. అంతేకాకుండా ఎన్నో సమస్యలు పరిష్కారం అవుతాయి.
ధనస్సు రాశి
ధనస్సు రాశిలో జన్మించిన వ్యక్తులకు కూడా ఈ అద్భుతమైన సంయోగంతో వైవాహిక జీవితం చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా భాగస్వామ్యం పరంగా విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే వివాహాల గురించి ఆలోచిస్తున్న వ్యక్తులకు ఈ సమయంలో అద్భుతమైన ప్రతిపాదనలు కూడా రావచ్చు. వ్యాపార భాగస్వాముల నుంచి భారీ మొత్తంలో లాభాలు కూడా సంపాదిస్తారు. అంతేకాకుండా చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న పనులు కూడా సులభంగా పూర్తవుతాయి. ఈ సమయంలో ఒప్పందాలతో పాటు వ్యాపార భాగస్వాములతో అద్భుతమైన నిర్ణయాలు తీసుకుంటారు. దీని కారణంగా సమాజంలో మంచి గౌరవం కూడా పెరుగుతుంది.
Also Read: Mercury Transit 2026: మకరంలో తిష్ట వేసిన బుధుడు.. ఈ రాశుల వారికి కోటీశ్వరులయ్యే యోగం ప్రారంభం!

Also Read: Mercury Transit 2026: మకరంలో తిష్ట వేసిన బుధుడు.. ఈ రాశుల వారికి కోటీశ్వరులయ్యే యోగం ప్రారంభం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Aadhaar App Launched Services List: ఆధార్ కార్డుదారులకు ఏవైనా మార్పులు చేసుకోవాలంటే ఆధార్ కేంద్రాలకు ముందుగానే తమ పేరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఉద్యోగానికి ఒకరోజు సెలవు పెట్టి మరి ఆధార్ కేంద్రాల వద్ద పడిగాపులు కాయల్చి వచ్చేది. అయితే విధానానికి చెక్ పెట్టింది యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా. కొత్తగా ఆధార్ యాప్ ద్వారా ఇంటి నుంచే సులభంగా అప్డేట్ చేసుకోవచ్చు. మన దేశంలో మొత్తం 143 కోట్ల మంది ఆధార్ కార్డు కలిగి ఉన్నారు. ఈ ఆధార్ కార్డు ద్వారానే డిజిటల్ సేవలు జరుగుతున్నాయి. అయితే ఆధార్ పై ఏవైనా మార్పులు చేసుకోవాలంటే మాత్రం ఇకపై ఇంట్లో నుంచే మొబైల్ సులభంగా చేసుకోవచ్చు. ఆధార్ కార్డు పై ఫోన్ నెంబర్, అడ్రస్ వివిధ సేవలు సులభంగా పొందవచ్చు.
కేవలం ఈ యాప్ ఉపయోగించి ఎవరైనా ఆధార్ కార్డులో సులభంగా ఉపయోగించవచ్చు. ఆధార్ అనేది మన దేశంలో ఎంత ముఖ్యమైంది. స్కూల్ అడ్మిషన్ నుంచి ఇంటి రిజిస్ట్రేషన్ చేయాలన్న ఆధార్ కార్డు కలిగి ఉండాలి. ఈ ఆధార్ కొత్త యాప్ ద్వారా సులభంగా పని ఇంట్లోనే పూర్తి చేసుకోవచ్చు ఎక్స్ వేదికగా కొత్త ఆధార్ యాప్ ప్రకటించారు.
కొత్త ఆధార్ యాప్ ద్వారా మీరు సులభంగా మొబైల్ నెంబరు, ఇంటి అడ్రస్ మార్చుకోవచ్చు. దీంతో పాటు మీ పేరు, ఇమెయిల్ ఐడీ కూడా అప్డేట్ చేసుకోవచ్చు. మీ ఫోన్లో కేవలం ఆధార్ యాప్ ఉంటే చాలు ఎక్కడికైనా వెళ్తే మీరు ఫిజికల్ ఆధార్ కార్డును తీసుకు వెళ్లాల్సిన పని కూడా లేదు. దీన్ని మీరు ఒక ప్రూఫ్ గా చూపించవచ్చు. హోటల్ లేదా ఇతర ప్రాంతాలను సందర్శిస్తే ఈ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఓకే యాప్ లో సులభంగా మీరు బహుళ ప్రయోజనాలు పొందుతారు.
కొత్త ఆధార్ యాప్ తో మీరు సులభంగా ఫోన్ నెంబర్ కూడా మార్పు చేసుకోవచ్చు. దీనికి మీ ఫోన్ నుంచి ఆధార్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. అక్కడ మీ మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవాలి. ఆధార్ యాప్ ఓపెన్ చేసి మీరు హోం స్క్రీన్ లో ఉన్న ఆధార్ వివరాలు అప్ డేట్ ఎంపిక చేయాలి. అక్కడ ఫోన్ నెంబర్ అప్డేట్ అనే ఆప్షన్ క్లిక్ చేయాల్సి ఉంటుంది. అక్కడ మీకు కావాల్సిన ఫోన్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత అప్డేట్ అనే ఆప్షన్ ఎంచుకోండి. ఇక్కడ మీ వివరాలు కూడా ధ్రువీకరించాల్సి ఉంటుంది. ఆ ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత సులభంగా మీ ఆధార్ కార్డుపై ఫోన్ నెంబర్ అప్డేట్ అయిపోతుంది. నిర్ణీత సమయంలో మీరు ఆధార్ కార్డును సులభంగా అప్డేట్ చేసుకోవచ్చు. అయితే గూగుల్ ప్లే స్టోర్ నుంచి మీరు ముందుగా ఆధార్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మీకు నచ్చిన భాషను ఎంచుకొని ధ్రువీకరిస్తే సులభంగా ఆధార్ యాప్ ఉపయోగించుకోవచ్చు.
Also Read: 'అన్న వచ్చేశాడోచ్'..! విరాట్ కోహ్లి ఇన్స్టాగ్రామ్ మళ్లీ యాక్టివేట్, సస్పెన్షన్కు కారణం ఏంటంటే?
Also Read: ఫిబ్రవరి 1 అలెర్ట్..! మీ ఖర్చులపై ప్రభావం చూపే 5 కీలక మార్పులు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
AP Assembly Budget Session: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను ఈసారి ముందెన్నడూ లేని విధంగా అత్యంత సుదీర్ఘంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఫిబ్రవరి 12న ప్రారంభించి, మార్చి 12 వరకు నెల రోజుల పాటు సభను నడపాలని నిర్ణయించడం వెనుక బలమైన రాజకీయ వ్యూహం కనిపిస్తోంది. ముఖ్యంగా, సభకు వరుసగా గైర్హాజరవుతున్న వైసీపీ ఎమ్మెల్యేల సభ్యత్వంపై వేటు వేసేందుకు అవసరమైన అర్హత సాధించడమే ఈ సుదీర్ఘ షెడ్యూల్ వెనుక ఉన్న అసలు టార్గెట్ అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
Also Read: Snake Dog Video: పాము, కుక్క వైరం.. గంటపాటు జరిగిన యుద్ధంలో ఏం జరిగిందో తెలుసా?
60 రోజుల అనర్హత
రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఒక సభ్యుడు వరుసగా 60 పని దినాల పాటు సభకు హాజరు కాకపోతే వారిపై అనర్హత వేటు వేసే అవకాశం ఉంటుంది. ఇప్పటికే సభ ఏర్పడినప్పటి నుంచి సమావేశాలకు దూరంగా ఉన్న వైసీపీ సభ్యులను.. ఈసారి కూడా రాకుండా ఉంటే ఆ నిబంధన పరిధిలోకి తీసుకురావాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. అయితే కేవలం ఒక రోజు హాజరై సంతకం చేసి వెళ్లడం ద్వారా ఈ గండం నుంచి గట్టెక్కవచ్చని వైసీపీ ఎమ్మెల్యేలు భావిస్తున్నట్లు సమాచారం. దీనిని అడ్డుకునేందుకు ప్రభుత్వం నైతికత అనే అస్త్రాన్ని తెరపైకి తెస్తోంది.
Also Read: YS Sharmila: మళ్లీ జగనన్నపై వైఎస్ షర్మిల ఘాటు విమర్శలు.. పాదయాత్రపై సంచలన వ్యాఖ్యలు
ఎథిక్స్ కమిటీ సిఫారసులు
అసెంబ్లీ సమావేశాలకు రాకుండా.. చర్చల్లో పాల్గొనకుండా కేవలం సంతకాలు పెట్టి జీతభత్యాలు తీసుకోవడం ప్రజలను వంచించడమేనని కూటమి ప్రభుత్వం వాదిస్తోంది. ప్రజా సమస్యలపై గళం విప్పాల్సిన బాధ్యతను విస్మరించి.. సాంకేతిక కారణాలతో సభ్యత్వాన్ని కాపాడుకోవాలని చూడడం వారి నైతిక పతనానికి నిదర్శనమని విమర్శలు గుప్పిస్తోంది. రాబోయే సమావేశాల్లో రాజ్యాంగ స్ఫూర్తిని, అసెంబ్లీ నియమావళిని గౌరవించని వారికి గట్టి గుణపాఠం చెప్పే దిశగా స్పీకర్ నిర్ణయం ఉండబోతోందని సమాచారం. ఎథిక్స్ కమిటీ ఇప్పటికే విచారణ జరుపుతోంది. చర్యలకు సిఫారసు చేస్తూ నివేదిక సమర్పిస్తే.. అసెంబ్లీ నిర్ణయం తీసుకుంటుంది.
Also Read: Traffic Challan: ట్రాఫిక్ చలాన్లపై ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఐదు చలాన్లు దాటితే లైసెన్స్ రద్దు
వైసీపీ ఎమ్మెల్యేలకు గడ్డు పరిస్థితి
వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ఈసారి కూడా సభకు గైర్హాజరైతే చట్టపరమైన చిక్కులు తప్పవనే పరిస్థితి కనిపిస్తున్నాయి. అటు ప్రజల్లోనూ దీనిపై వ్యతిరేకత వచ్చే అవకాశం ఉండడంతో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు ఇప్పుడు సంకటంలో పడ్డారు. పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆదేశాలు పాటించాలా? లేక సభ్యత్వాన్ని కాపాడుకునేందుకు సభకు వెళ్లాలా? అనేది తేల్చుకోలేకపోతున్నారు. మొత్తానికి ఫిబ్రవరి 12 నుంచి ప్రారంభం కానున్న ఈ సమావేశాలు ఏపీ రాజకీయాల్లో పెను మార్పులకు వేదిక కానున్నాయి.
Also Read: Prices Decrease: భారత్ చారిత్రక ఒప్పందం.. లిక్కర్, నూనెల ధరలు అమాంతం తగ్గుముఖం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
QR Code Rist Band: తెలంగాణ కుంభమేళా మేడారం సమ్మక్క-సారక్క మహాజాతర-2026 అంగరంగ వైభవంగా సాగుతోంది. లక్షలాది సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. దారులన్నీ మేడారం వైపు అన్నట్టు ఉంది. జాతరలో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తుండడంతో ఈక్రమంలో పిల్లలు తప్పిపోతున్నారు. పిల్లలు అదృశ్యమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉండడంతో పోలీసులు పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే తప్పిపోయిన పిల్లలను రెండు గంటల్లోనే ఆచూకీ కనిపెట్టి అప్పగిస్తున్నారు. క్యూఆర్ కోడ్ రిస్ట్ బ్యాండ్ సత్ఫలితాలను ఇస్తోంది. దానికి సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.
Also Read: Mamnoor Airport: వరంగల్ ఎయిర్పోర్టులో కీలక ముందడుగు.. త్వరలోనే ఎగరనున్న విమానాలు
మేడారం జాతర రద్దీలో చిన్నారులు తప్పిపోయే ప్రమాదం ఉండడంతో వారి రక్షణ కోసం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన ‘క్యూఆర్ కోడ్ రిస్ట్ బ్యాండ్’ వ్యవస్థను భక్తులు సద్వినియోగం చేసుకుంటున్నారు. క్యూఆర్ కోడ్ రిస్ట్ బ్యాండ్ వ్యవస్థపై మల్టీ జోన్ -2 ఐజీపీ ఎస్ చంద్రశేఖర్ రెడ్డి వివరాలు వెల్లడించారు. తెలంగాణ ఆర్టీసీ సహకారంతో భక్తులు వచ్చే ప్రధాన మార్గాల్లో 11 ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసి చిన్న పిల్లలకు ఈ బ్యాండ్లను ఉచితంగా అందిస్తున్నట్లు చెప్పారు.
Also Read: Govt Employees: ప్రభుత్వ ఉద్యోగుల కీలక నిర్ణయం.. పీఆర్సీ, ఈపీఎఫ్, డీఏ కోసం పోరాటం
హన్మకొండ హయగ్రీవాచారి గ్రౌండ్, హైదరాబాద్లోని ఉప్పల్, ఎంజీబీఎస్ బస్స్టేషన్లలో, కరీంనగర్, పరకాల, పెద్దపల్లి, మంథని, ఏటూరునాగారం, కాటారం బస్ స్టేషన్లతో పాటు.. వరంగల్ రైల్వే స్టేషన్, కాజిపేట్ రైల్వే స్టేషన్లలో రిస్ట్ బ్యాండ్లను అందజేసే కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఐజీపీ ఎస్ చంద్రశేఖర్ రెడ్డి వివరించారు. జాతరలో ఎవరైనా చిన్నారి తప్పిపోయినట్లు కనిపిస్తే వారి చేతికి ఉన్న రిస్ట్ బ్యాండ్పై ఉన్న క్యూఆర్ కోడ్ను స్మార్ట్ఫోన్ ద్వారా స్కాన్ చేయాలని సూచించారు. స్కాన్ చేసిన వెంటనే లభించే ఫోన్ నంబర్ ద్వారా సదరు బాధితుల బంధువులకు లేదా పోలీసులకు సమాచారం అందించి చిన్నారులను క్షేమంగా వారి కుటుంబ సభ్యుల వద్దకు చేర్చవచ్చని వివరించారు.
Also Read: Snake Dog Video: పాము, కుక్క వైరం.. గంటపాటు జరిగిన యుద్ధంలో ఏం జరిగిందో తెలుసా?
ఎస్ఐబీ, ఐజీపీ సుమతి ఈ వినూత్న సాంకేతిక ప్రక్రియను రూపొందించారని ఐజీపీ ఎస్ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ఈ నూతన ప్రక్రియను విజయవంతం చేసేందుకు ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు పోలీసులకు పూర్తి సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఈ క్యూఆర్ రిస్ట్ బ్యాండ్లు జాతరలో ఇప్పటికే సత్ఫలితాలను ఇస్తున్నాయని చెప్పారు. తప్పిపోయిన ఇద్దరు చిన్నారులను కేవలం గంటల వ్యవధిలోనే గుర్తించి వారి తల్లిదండ్రుల వద్దకు సురక్షితంగా చేర్చినట్లు తెలిపారు. కరీంనగర్ బస్టాండ్లో రిస్ట్ బ్యాండ్ వేయించుకున్న మురళీకృష్ణ కుమారుడు అరియాన్ష్ (4) అనే బాలుడు జాతరలో తప్పిపోగా ఈ సాంకేతికత ఆధారంగానే అతడిని త్వరగా గుర్తించగలిగినట్లు వెల్లడించారు. హనుమకొండ హయగ్రీవచారి గ్రౌండ్స్లో రిస్ట్ బ్యాండ్ ధరించిన గోవిందరావుపేట గ్రామానికి చెందిన మిల్కీ అనే బాలిక కూడా తప్పిపోయిన కొద్దిసేపటికే తన తండ్రి గుంజ నాగరాజు చెంతకు చేరిందని తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook