ఈ నెల 15న ఖమ్మంలో సీఎం రేవంత్ సమావేశం
Mahabubabad, Telangana:ఖమ్మం జిల్లాలో సీతారామ సాగునీటి ప్రాజెక్టును ఈ నెలలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో తుమ్మల వైరాలో ఏర్పాటు చేసిన సభ ఏర్పాట్లను పరిశీలించారు. ప్రాజెక్టు ప్రారంభోత్సవం అనంతరం జరిగిన సభలో సీఎం రేవంత్ రూ.2 లక్షల రుణమాఫీని ప్రారంభిస్తామన్నారు. తమది రైతుల ప్రభుత్వమని చెప్పుకుంటున్నారు. సీఎం సభకు పెద్ద ఎత్తున జన సమీకరణ చేస్తున్నామని, సభకు వచ్చే ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామని తుమ్మల తెలిపారు.
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
విద్యార్థుల అన్నీ డిమాండ్లకు కేంద్రం ఓకే.. పోరాటం ముగిసిందని కాక్రోచ్ పార్టీ ప్రకటన
New Delhi, Delhi:Jantar Mantar Turn To Silence: నీట్ పేపర్ లీక్ అంశంపై నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని గడగడలాడించిన కాక్రోచ్ జనతా పార్టీ తన ఉద్యమానికి ముగింపు పలికింది. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేయడంతో దేశవ్యాప్తంగా సంబరాలు జరుగుతున్నాయి. దీనికితోడు మిగిలిన డిమాండ్లకు కూడా కేంద్ర ప్రభుత్వం అంగీకరించడంతో కాక్రోచ్ పార్టీ తన పోరాటాన్ని ముగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంతో చేసిన చర్చలు సఫలమయ్యాయి. విద్యార్థులపై నమోదు చేసిన కేసులు ఎత్తివేసేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది.
Also Read: జెన్జీ ఉద్యమంతో దేశం గర్విస్తోంది.. విద్యార్థుల పోరాటానికి బీఆర్ఎస్ హ్యాట్సఫ్
క్షేమంగా ఇళ్లకు..
ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద నిరసనను విరమిస్తున్నట్లు కాక్రోచ్ జనతా పార్టీ ప్రతినిధులు ప్రకటించారు. డిమాండ్లను కేంద్రం అంగీకరించడంతో తమ నిరసనను విరమిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు క్షేమంగా ఇంటికి తిరిగి వెళ్లాలని కోరిన కాక్రోచ్ పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ తెలిపారు.
కేంద్ర మంత్రులతో చర్చలు పూర్తి..
న్యూఢిల్లీలో కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్తో కాక్రోచ్ జనతా పార్టీ చర్చలు ముగిశాయి. ఢిల్లీతో సహా దేశంలోని అన్నీ రాష్ట్రాల్లో విద్యార్థులపై నమోదైన కేసులను ఎత్తివేస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. భవిష్యత్తులోనూ కేసుల పేరుతో విద్యార్థులను వేధించమని ప్రకటించింది. విద్యాశాఖలో సంస్కరణలు చేపడతామని కేంద్ర మంత్రి జేపీ నడ్డా హామీ ఇచ్చారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో తమ ప్రధాన డిమాండ్ నెరవేరిందని కాక్రోచ్ పార్టీ తెలిపింది.
Cockroach Janta Party withdraws its nationwide agitation with immediate effect
All demands of the Cockroach Janta Party have been accepted by the government:
1. Maximum possible compensation for families of NEET paper leak-related suicides
2. All FIRs by Central govt and…
— Cockroach is Back (@Cockroachisback) July 25, 2026
Also Read: Dharmendra Pradhan: నా ప్రియమైన బొద్దింకలకు అభినందనలు.. ప్రకాశ్ రాజ్ ట్వీట్ వైరల్
అన్నీంటికి కేంద్రం అంగీకారం
విద్యార్థులపై నమోదైన కేసులను ఎత్తివేయడానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించినట్లు కాక్రోచ్ పార్టీ ప్రతినిధులు తెలిపారు. నాలుగు రోజుల్లోగా కేసులు ఉపసంహరిస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందని వెల్లడించారు. ఇక నీట్ పేపర్ లీక్తో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు నిబంధనల ప్రకారం పరిహారం అందిస్తామని కేంద్రం చెప్పినట్లు వివరించారు. కేంద్ర ప్రభుత్వం అన్ని డిమాండ్లకు అంగీకరించిన నేపథ్యంలో ఆందోళనను విరమిస్తున్నట్లు ప్రకటించారు. కాక్రోచ్ పార్టీ ఆందోళన విరమణతో జంతర్ మంతర్ వద్ద ఉన్న విద్యార్థులు తిరుగుముఖం పట్టారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఢిల్లీ జంతర్ మంతర్ మెట్రో స్టేషన్ను తిరిగి తెరవడం విశేషం. అత్యంత రద్దీగా ఉండే ఈ మెట్రో స్టేషన్ను విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు మూసివేశారు.
Rajasthan Doctor Case: డాక్టర్కి వయాగ్రా ట్యాబ్లెట్స్ ఇచ్చిన లేడీ నర్సు..మత్తులో రూ.2 కోట్లు కాజేసిన మాయాలేడి!
Degana, Rajasthan:Rajasthan Doctor Extortion Case: సాటి మనిషిని నమ్మలేని ఈ రోజుల్లో, ఓ నర్సు చేసిన హైటెక్ క్రైమ్ స్టోరీ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. రాజస్థాన్లోని బార్మర్ జిల్లాలో ప్రైవేట్ ఆసుపత్రి వైద్యుడిని నర్సు బ్లాక్మెయిల్ చేసి, ఏకంగా రూ.2 కోట్లు వసూలు చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
నేపథ్యం, బ్లాక్మెయిల్ పర్వం
బార్మర్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో కమల (అలియాస్ కమలేష్) అనే మహిళ నర్సుగా పనిచేస్తోంది. అదే ఆసుపత్రికి చెందిన 65 ఏళ్ల వృద్ధ వైద్యుడిని టార్గెట్ చేసిన ఆమె, ఆయనకు సంబంధించిన కొన్ని అసభ్యకరమైన ఫోటోలు, వీడియోలను రహస్యంగా తన ఫోన్లోకి మార్చుకుంది. ఆపై ఆ ఫొటోలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తానని, అత్యాచారం కేసులో ఇరికిస్తానని, చివరికి ప్రాణాలు తీస్తానని బెదిరింపులకు దిగింది. పరువు పోతుందనే భయంతో ఆ డాక్టర్ ఆమె డిమాండ్లకు తలొగ్గాల్సి వచ్చింది.
హైటెక్ పంథాలో డిజిటల్ అరెస్ట్!
ఈ దందాను నర్సు కమల అత్యంత వ్యూహాత్మకంగా నడిపించింది. వృద్ధ వైద్యుడిని తన గుప్పిట్లో ఉంచుకునేందుకు, ఆయనకు లైంగిక సామర్థ్యాన్ని పెంచే వయాగ్రా మాత్రలను బలవంతంగా వేయించినట్లు విచారణలో తేలింది. ఆసుపత్రిలోని సీసీటీవీ కెమెరాల ద్వారా ఆ డాక్టర్ను ఆమె నిరంతరం పర్యవేక్షించేది.
డాక్టర్ కదలికలపై నిఘా ఉంచేందుకు ప్రత్యేకంగా ఒక చిన్న మొబైల్ ఫోన్, సిమ్ కార్డును ఇచ్చి.. దానిని రోజులో 24 గంటలూ ఆన్లోనే ఉంచాలని తీవ్రంగా బెదిరించేది. ఇలా భయభ్రాంతులకు గురిచేసి సదరు వైద్యుడి నుంచి విడతలవారీగా దాదాపు రూ.2 కోట్లను ఆమె కాజేసింది.
పోలీసుల ఎంట్రీ, అరెస్ట్
బాధిత వైద్యుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు డిజిటల్ ఆధారాలు సేకరించి, నిందితురాలు కమలను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. విచారణలో భాగంగా నర్సు బ్యాంక్ ఖాతాలు, అక్రమంగా వసూలు చేసిన నగదు, ఆస్తులపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
శుక్రవారం కోర్టులో హాజరుపరిచే సమయంలో నర్సు కమల మీడియాతో మాట్లాడుతూ సంచలన విషయాలు వెల్లడించింది. తనపై పోలీసులు మోపిన కేసులన్నీ బూటకమని, ఆ డాక్టర్ ఎలాంటివాడంటే.. వందలాది మంది మహిళా రోగులపై లైంగిక దాడికి పాల్పడిన ఘరానా నేరస్థుడని ఆరోపించింది. అయితే, నర్సు చేస్తున్న ఈ ఆరోపణలను పోలీసులు ఇంకా ధ్రువీకరించలేదు. నిందితురాలు విచారణకు సహకరించడం లేదని, అన్ని కోణాల్లోనూ దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు స్పష్టం చేశారు.
Also Read: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా..అసలు ఎవరీ ధర్మేంద్ర, ఆయన బ్యాగ్రౌండ్ ఏంటి?
Also REad: ముఖేష్ అంబానీ మనవడు చదువుతున్న స్కూల్ ఏది? ఫీజు ఎంతంటే షాక్ అవ్వాల్సిందే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Dharmendra Pradhan: విద్యార్థులు గెలిచారు.. ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా
New Delhi, Delhi:Dharmendra Pradhan Resign To As Union Minister Its Cockroaches Victory Watch Full Videoబాధితుల వ్యక్తిగత ప్రైవసీ రక్షణకు తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు
Hyderabad, Telangana:Victims Identity Privacy: లైంగిక దాడికి తీవ్ర మనో వేదనలో ఉన్న బాధితులకు వారి వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించేలా ఉన్న వీడియోలు, ఫొటోలు, డిజిటల్ కంటెంట్పై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. లైంగిక దాడికి గురైన బాధితుల వ్యక్తిగత గోప్యత.. వారి ఆత్మగౌరవాన్ని కాపాడేలా తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. బాధితురాలిని ముఖం బహిర్గతం చేస్తూ ఉన్న కంటెంట్ను తొలగించాలని పలు సంస్థలకు హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. బాధితుల డిజిటల్ ప్రైవసీకి విఘాతం కలిగిస్తున్న 200 కంటే ఎక్కువ వీడియోలు, ఫొటోలు, సోషల్ మీడియా పోస్టులను వెంటనే డిలీట్ చేయాలని యూట్యూబ్, గూగుల్, మెటా, ఎక్స్ సంస్థలకు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. బాధితుల రాజ్యాంగ హక్కులను పునరుద్ధరిస్తూ జస్టిస్ బి. విజయ్సేన్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారు.
లైంగిక దాడికి గురయిన బాధితురాలి తరఫున హైకోర్టు అడ్వకేట్ నాగుర్బాబు రిట్ పిటిషన్ను దాఖలు చేయగా హైకోర్టు విచారణ చేపట్టింది. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల గ్రీవెన్స్ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా బాధితుల గోప్యతకు భంగం కలిగించే కంటెంట్ను తొలగించడంలో విఫలమయ్యారని న్యాయవాది న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. తమ ఫొటోలు, వీడియోలు డిజిటల్ మాధ్యమాల్లో ప్రసారమవుతుండడంతో బాధితురాలి ఆత్మగౌరవానికి, సమాజంలో జీవించేందుకు తీవ్ర భంగం వాటిల్లుతోందని వివరించారు.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 21 ప్రకారం జీవించే హక్కు, ప్రైవసీ హక్కులకు ఇది భంగమని అడ్వకేట్ నాగుర్బాబు వాదనలు వినిపించారు. ఐటీ చట్టం-2000, ఐటీ ఇంటర్మీడియరీ రూల్స్-2021తో పాటు లైంగిక దాడి బాధితుల గుర్తింపును ఏ సమయంలోనూ బయటపెట్టరాదని సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పులను ప్రస్తావించారు. ఈ కంటెంట్ తరచూ ప్రసారం చేస్తుండడంతో బాధితురాలు మానసిక వేదనకు గురవుతున్నారని న్యాయస్థానానికి అడ్వకేట్ నాగుర్బాబు వాదించారు.
పిటిషనర్ వాదనలతో హైకోర్టు ఏకీభవించింది. ఈ సందర్భంగా డిజిటల్ మీడియా సంస్థలపై ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖతోపాటు యూట్యూబ్, గూగుల్, మెటా, ఎక్స్ ప్లాట్ఫామ్లకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అత్యవసర మధ్యంతర ఉపశమనం కింద రిట్ పిటిషన్ అనుబంధం-ఏలో పేర్కొన్న 200కి పైగా వివాదాస్పద యూట్యూబ్ వీడియోలు, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్ పోస్టులను వెంటనే తొలగించాలని ఆదేశించింది. లేదంటే బ్లాక్ చేయాలని చెప్పింది. దీనిపై తదుపరి విచారణను ఆగస్టు 20వ తేదీకి న్యాయస్థానం వాయిదా వేసింది.
AP Devotee Tragedy: అరుణాచలం క్షేత్రంలో తీవ్ర విషాదం..మోక్ష మార్గం గుహలో ఇరుక్కొని ఆంధ్రప్రదేశ్ భక్తుడు మృతి!
Tiruvannamalai, Tamil Nadu:Arunachalam Devotee Death: తమిళనాడులోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరువణ్ణామలైలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మోక్ష మార్గంగా భావించే ఓ ఇరుకైన గుహలో ఇరుక్కుపోయి ఆంధ్రప్రదేశ్కు చెందిన భక్తుడు ఊపిరాడక ప్రాణాలు కోల్పోయాడు.
అసలు ఏం జరిగింది?
ఆంధ్రప్రదేశ్కు చెందిన మణికుమార్ (36) తన కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం రాత్రి తిరువణ్ణామలైలోని శ్రీ ఉన్నాములయ్యమ్మన్ సమేత అరుణాచలేశ్వర స్వామి ఆలయ దర్శనానికి వెళ్లారు. దర్శనానంతరం రాత్రి 11 గంటల ప్రాంతంలో గిరిప్రదక్షిణ మార్గంలో ఉన్న 'ఇడుక్కు పిల్లయ్యార్' ఆలయానికి చేరుకున్నారు. తెలుగు భక్తులు దీనిని సాధారణంగా 'మోక్ష మార్గం' అని పిలుస్తారు.
ఈ గుహ ఆకారంలో ఉండే ఆలయంలో భక్తులు వెనుక ద్వారం నుంచి పడుకుని లోపలికి ప్రవేశించి, అత్యంత ఇరుకైన మార్గంలో పాకుతూ ముందు ద్వారం గుండా బయటకు రావాలి. మణికుమార్ శరీరాకృతి కాస్త లావుగా ఉండటంతో ఆయన గుహ మధ్యలోనే ఇరుక్కుపోయారు. కుటుంబ సభ్యులు, తోటి భక్తులు ఆయనను బయటకు లాగేందుకు తీవ్రంగా ప్రయత్నించినా సాధ్యపడలేదు.
గాలి ఆడక ఆయన అపస్మారక స్థితికి చేరుకున్నారు. ఎంతో శ్రమించి బయటకు తీసినప్పటికీ, అప్పటికే ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే 108 అంబులెన్స్లో తిరువణ్ణామలై ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.
ఈ అకస్మిక పరిణామంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. సమాచారం అందుకున్న తిరువణ్ణామలై తాలూకా పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి, కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.
'ఇడుక్కు పిల్లయ్యార్' ప్రత్యేకత ఏమిటి?
గిరిప్రదక్షిణ మార్గంలో వెలసిన ఈ ఇడుక్కు పిల్లయ్యార్ ఆలయం ఒక చిన్న గుహలా ఉంటుంది. భక్తులు ఇరుకైన మార్గంలో పాకుతూ వెళ్లి బయటకు రావడం ఆచారంగా భావిస్తారు. బయటకు వచ్చిన తర్వాత నందిని, ఇడుక్కు పిల్లయ్యార్ను దర్శించుకోవడం అనవాయితీగా వస్తోంది. ఈ భక్తి ఆచారమే ఇపుడు ఒక ప్రాణాన్ని బలిగొనడంతో స్థానికంగా, భక్తుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.
Also REad: ముఖేష్ అంబానీ మనవడు చదువుతున్న స్కూల్ ఏది? ఫీజు ఎంతంటే షాక్ అవ్వాల్సిందే!
Also REad: కేంద్ర మాజీ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆస్తుల వివరాలు..కోట్లలో సంపద, భారీగా అప్పులు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
శ్రావణ మాసంలో జన్మించిన పిల్లలు ఎలా ఉంటారు?
Hyderabad, Telangana:Shravana Masam: పవిత్రమైన శ్రావణ మాసానికి ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాధాన్యత ఉంది. శివారాధనకు అత్యంత అనుకూలమైన ఈ మాసంలో జన్మించే పిల్లలపై పరమశివుని ప్రత్యేక అనుగ్రహంతో పాటు ఆయన ప్రభావం స్పష్టంగా కనిపిస్తాయని ఆధ్యాత్మిక గ్రంథాలు తెలుపుతున్నారు. స్కంద పురాణంలోని మహేశ్వర ఖండం, కేదార ఖండంతో పాటు శ్రావణ మాహాత్మ్యం అధ్యాయాలలో శ్రావణ మాసంలో జన్మించిన పిల్లల లక్షణాలు, వారి ప్రవర్తన, భవిష్యత్తు గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం..
దృఢ సంకల్పంతో పాటు పట్టుదల..
శ్రావణ మాసంలో జన్మించిన పిల్లలు ఎంతో దృఢ సంకల్పాన్ని కలిగి ఉంటారు. వీరు ఏదైనా ఒక పనిని సాధించాలని మనస్సులో అనుకుంటే.. దానిని పూర్తి చేసే వరకు శ్రమిస్తూనే ఉంటారు. ఈ బలమైన పట్టుదలే కొన్నిసార్లు ఇతరులకు మొండితనంగా కనిపించినప్పటికీ.. వారి లక్ష్య సాధనకు ఇదే ప్రధాన కారణమవుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.
శాంత స్వభావం..
శివుని శక్తితో ఉండే ఈ పిల్లలు బయటకు ఎంతో ప్రశాంతంగా కనిపిస్తారు. అయితే, లోపల మాత్రం ఎంతో గంభీరమైన ఆలోచనాలను కలిగి ఉంటారని గ్రంథాలు చెబుతున్నాయి.. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడంలో వీరు ముందుంటారు. మాట తప్పని నిబద్ధత వీరి నైజం..
ఊహించని ఆత్మవిశ్వాసం..
ఈ మాసంలో పుట్టిన వారిలో ఆత్మవిశ్వాసం మెండుగా ఉంటుంది. తమ లక్ష్యాల పట్ల స్పష్టమైన అవగాహన కలిగి ఉండి.. ఎలాంటి గందరగోళానికి గురికాకుండా అద్భుతమైన విజయాలు సాధించే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఏ రకమైన సవాళ్లు ఎదురైనా బెదిరిపోకుండా ఎదుర్కొనే ధైర్యం వీరి సొంతం..
బంధాలకు ప్రాధాన్యత..
భౌతిక సుఖసంతోషాలు, విలాసాల కంటే మానవ సంబంధాలకు, ఆత్మీయతకే వీరు ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. ఎంతో సున్నితమైన మనస్తత్వం కలిగి ఉండటం వల్ల కొన్నిసార్లు ఇతరులు వీరి ఆలోచనలను తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
గమనిక.. 
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..
IShowSpeed రికార్డును తుడిచిపెట్టేసిన PM Modi.. 24 గంటల్లో 303 మిలియన్ల వ్యూస్!
Hyderabad, Telangana:PM Modi Breaks IShowSpeed Records: దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన నీట్ (NEET) పేపర్ లీక్ వ్యవహారంపై ప్రధాని మోదీ గురువారం అర్ధరాత్రి తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఒక ప్రత్యేక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. యువత, విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన సున్నితమైన అంశం కావడం.. ప్రధాని స్వయంగా స్పందించడంతో ఈ వీడియో విడుదలైన క్షణాల్లోనే సోషల్ మీడియాను ఊపేసింది. ఊహించని రీతిలో, కేవలం 24 గంటల వ్యవధిలోనే ఈ వీడియో 303 మిలియన్ల (30.3 కోట్లు)కి పైగా వ్యూస్ సాధించి గ్లోబల్ రికార్డు సృష్టించింది.
ఫుట్బాల్ ప్రపంచకప్ రికార్డు క్రాష్..
ఇటీవల ముగిసిన ఫుట్బాల్ ప్రపంచకప్ (FIFA World Cup) సమయంలో ప్రపంచ ప్రసిద్ధ కంటెంట్ క్రియేటర్, ప్రముఖ యూట్యూబర్ IShowSpeed (స్పీడ్) పేరిట ఉన్న 300 మిలియన్ల వ్యూస్ రికార్డును ప్రధాని మోదీ వీడియో తుడిచిపెట్టేసింది. ప్రపంచంలో ఏ ఒక్క రాజకీయ నాయకుడికి లేదా ఏ ఇతర కంటెంట్ క్రియేటర్కు కూడా ఇంత తక్కువ సమయంలో ఈ స్థాయిలో వ్యూస్ రాకపోవడం విశేషం..
ఒక్క రాత్రిలోనే 10 లక్షల మంది కొత్త ఫాలోవర్లు..
ఈ వీడియో వైరల్ అవ్వడమే కాకుండా ప్రధాని మోదీ ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఫాలోవర్లు కూడా పెరిగారు. కేవలం ఒక్క రాత్రి వ్యవధిలోనే ప్రధాని ఇన్స్టాగ్రామ్ ఖాతాకు సుమారు 10 లక్షల (1 Million) మంది కొత్త ఫాలోవర్లు చేరారు. ప్రపంచంలోనే అత్యధిక ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్లు కలిగిన రాజకీయ నేతగా ఉన్న మోదీ.. ఈ కొత్త మైలురాయితో డిజిటల్ ప్రపంచంలో తన అగ్రస్థానాన్ని మరింత పటిష్టం చేసుకున్నారు.
Also Read: పోలీస్ వ్యాన్ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!
సాధారణంగా స్పోర్ట్స్, ఎంటర్టైన్మెంట్ రంగానికి చెందిన అంతర్జాతీయ స్టార్లకు మాత్రమే సోషల్ మీడియాలో ఈ స్థాయి వ్యూస్.. ఫాలోయింగ్ లభిస్తుంటాయి. అయితే, ఒక దేశ ప్రధాని పరిపాలనాపరమైన, విద్యార్థులకు కీలకమైన సమస్యపై పోస్ట్ చేసిన వీడియో గ్లోబల్ డిజిటల్ రికార్డులను తిరగరాయడం ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశమైంది.
Also Read: పోలీస్ వ్యాన్ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
జెన్జీ ఉద్యమంతో దేశం గర్విస్తోంది.. విద్యార్థుల పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ హ్యాట్సాఫ్
Hyderabad, Telangana:Salute To Students: నీట్ పేపర్ లీక్ అంశంపై విద్యార్థులు సాగిస్తున్న పోరాటానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం దిగివచ్చింది. విద్యార్థుల ఆందోళనకు తలొగ్గిన కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ తన పదవికి రాజీనామా చేశారు. దీంతో దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతుండగా.. వివిధ రంగాల ప్రముఖులు, ఆయా రాజకీయ పార్టీల నాయకులు స్పందిస్తున్నారు. ఈ పరిణామాన్ని బీఆర్ఎస్ పార్టీ స్వాగతించింది. విద్యార్థుల పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ హ్యాట్సఫ్ చెప్పింది.
కేటీఆర్, హరీశ్ రావు స్పందన
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. 'అధికారంలో ఉన్నవారి కంటే ప్రజల శక్తి ఎప్పుడూ గొప్పది. జెన్ జీ' అని పోస్టు చేసి విక్టరీ (✌️) ఎమోజీ పోస్టు చేశారు. బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్ రావు ఎక్స్ వేదికగా స్పందించారు. 'దేశంలోని యువతకు ఇది ఒక గొప్ప విజయం. సామాజిక దృక్పథంలో వస్తున్న మార్పు నిజంగానే కనిపిస్తోంది. అభినందనలు' అని పోస్టు చేశారు.
“Power of people is always greater than the people in power “
Gen Z ✌️
— KTR (@KTRBRS) July 25, 2026
Major victory for the country’s youth. The vibe shift is real.
Congratulations !!
— Harish Rao Thanneeru (@BRSHarish) July 25, 2026
తలసాని శ్రీనివాస్ యాదవ్
ఇక హైదరాబాద్లోని బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్లో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రెస్మీట్ నిర్వహించి దేశ రాజకీయ పరిణామాలపై స్పందించారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ప్రజాస్వామ్య విజయం.. విద్యార్థులు, యువత కాక్రోచ్ల విజయం అని ప్రకటించారు. బీఆర్ఎస్ పార్టీ తరపున విద్యార్థులకు హ్యాట్సాఫ్ చెప్పారు. విద్యార్థులను చూసి దేశం గర్విస్తోందని చెప్పారు. 'విద్యార్థుల ఉద్యమం ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది' అని తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచించారు.
'తరం మారుతోంది.. ఇక అందరి వైపు చూస్తుంది. లాఠీఛార్జ్ చేసినా.. దమనకాండకు పాల్పడినా.. దేశద్రోహులు అని చెప్పినా కేంద్రం దిగి రాక తప్పలేదు. విద్యార్థుల పోరాటంలో న్యాయం ఉందని కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు సంఘీభావం ప్రకటించారు' అని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గుర్తుచేశారు. విద్యార్థుల పోరాటాన్ని చూసి ప్రభుత్వాలు గుణపాఠంలా తీసుకోవాలని చెప్పారు. మేనిఫెస్టోలు ప్రకటించే సమయంలో, హామీలు ఇచ్చేటపుడు పార్టీలు జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. 'విద్యార్థుల దెబ్బకు పార్లమెంట్ గేట్లు మూయాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఆలోచించండి. ఇష్టం వచ్చినట్లు మాట్లాడిన వారికి విద్యార్థులు ఇచ్చిన సమాధానం' అని తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.
దేశపతి శ్రీనివాస్ చురకలు
'ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఈ దేశ యువత సాధించిన అసాధారణ విజయం! ప్రజాస్వామ్య శక్తులకు ఇది నూతన ప్రేరణ. ప్రజలు పాలనలో జవాబుదారీతనాన్ని, కోరుకుంటున్నారు. ఇది కొత్త రాజకీయాలకు నాంది కావాలి. అవాక్కయిన అంధ భక్తులారా ఇక ఇన్స్టాగ్రామ్ యూనివర్సిటీ తెరుద్దామనే ఆలోచనలు ఆపి ఇప్పటికైనా ప్రజాస్వామ్యాన్ని గౌరవించడం నేర్చుకోండి' అని బీజేపీ నాయకులకు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ సూచించారు.
రాజీనామా విద్యార్థుల ఉద్యమం ఫలితమే
'ప్రజాగ్రహానికి ఎవరైనా తల వంచాల్సిందే. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విద్యార్థుల ఉద్యమం ఫలితమే' అని బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి తెలిపారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం సంపూర్ణంగా విద్యార్థుల విజయం అని ప్రకటించారు. 'నీట్ ప్రశ్నా పత్రాల లీకేజి విషయంలో కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖ వైఫల్యం స్పష్టంగా ఉంది. ఈ విషయంలో బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులు, యువకులు, విద్యావేత్తలు ఎంతగా కోరినా కేంద్రం పెడచెవిన పెట్టడంతోనే పరిస్థితి చేయి దాటింది' అని తెలిపారు.
pic.twitter.com/WOkqGbN526🔥యువత తిరగబడితే ఏ పీఠమైనా…
ఇది యువశక్తి విజయం... ప్రశ్నించే గొంతుకల విజయం!"
"అధికార మదం, అధిపత్య అహంకారం ఎంతటిదైనా... ప్రజాస్వామ్యంలో సమిష్టి విద్యార్థి చైతన్యం ముందు మోకాలిల్లాల్సిందే!
✊ విద్యార్థి ఉద్యమం ముందు అధిపత్య అహంకారం తలవంచక తప్పలేదు!💥ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా💥
— Prof Dasoju Sravan Kumar (@sravandasoju) July 25, 2026
Dharmendra Pradhan: నా ప్రియమైన బొద్దింకలకు అభినందనలు.. ప్రకాశ్ రాజ్ ట్వీట్ వైరల్
New Delhi, Delhi:Dharmendra Pradhan Resignation: రాజీలేకుండా.. ధృడసంకల్పంతో విద్యార్థులు అలుపెరగకుండా ఉద్యమం చేయడంతో భారత ప్రభుత్వం దిగివచ్చింది. విద్యార్థుల ఉద్యమానికి తలొగ్గిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ ఎట్టకేలకు రాజీనామా చేశాడు. ఆయన రాజీనామాతో దేశవ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి. ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామాపై పలు రంగాల ప్రముఖులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు స్పందిస్తున్నారు. అయితే మొదటి నుంచి విద్యార్థులకు తోడుగా ఉన్న పర్యావరణవేత్త సోనమ్ వాంగ్చుక్, సినీ నటుడు ప్రకాశ్ రాజ్ స్పందించారు. ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామాను స్వాగతించారు.
వాంగ్చుక్ స్పందన
నీట్ పేపర్ లీక్పై అవిశ్రాంత పోరాటం చేసిన పర్యావరణ వేత్త సోనమ్ వాంగ్చుక్ ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామాపై ఎక్స్ వేదికగా స్పందించారు. ‘ఇది ప్రజాస్వామ్య విజయం’ అంటూ పోస్టు చేశారు. ‘వీధుల నుంచే ప్రత్యక్ష ప్రజాస్వామ్యం. ఇది శాంతి, సహనం, పట్టుదల సాధించిన విజయం. కాక్రోచ్ జనతా పార్టీ, దేశ యువతకు అభినందనలు తెలిపారు. భయాన్ని వీడి ఉద్యమంలో పాల్గొన్న ప్రజలకు కృతజ్ఞతలు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో ఇకపై ఉద్యమం జవాబుదారీతనం, విద్యాసంస్కరణల దిశగా ముందుకు సాగుతుంది' అని సోనమ్ వాంగ్చుక్ ప్రకటించారు.
IT'S A VICTORY OF DEMOCRACY
direct democracy... straight from the streets.
It's a victory of peace, patience & persévérance.
Congratulations CJP, Gen Z of the nation and thank you all citizens for shedding fear and the fear of fear and rising up from every corner of the nation.… pic.twitter.com/rSLOfvba2R— Sonam Wangchuk (@Wangchuk66) July 25, 2026
నీట్ పేపర్ లీక్పై సోనమ్ వాంగ్చుక్ ఉద్యమాన్ని తీవ్రస్థాయికి తీసుకెళ్లారు. జూన్ 28వ తేదీన కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనకు మద్దతుగా సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. 26 రోజులపాటు నిరాహారదీక్ష చేసిన ఆయన కేంద్ర ప్రభుత్వం హామీలతో గురువారం విరమించారు. ఆందోళనలో పాల్గొన్నవిద్యార్థులపై కేసులు, నీట్ వివాదం నేపథ్యంలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు పరిహారం అంశాలపై కేంద్రం ప్రభుత్వం హామీ ఇచ్చింది.
ప్రకాశ్ రాజ్ స్పందన
సోనమ్ వాంగ్చుక్ నేతృత్వంలో సాగిన ఉద్యమంపై ప్రశంసలు కురిపిస్తూనే బొద్దింకలు అదే విద్యార్థుల పోరాటంపై అభినందనలు తెలిపారు. అధికారాన్ని, ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ప్రజలకు ఉందనే విషయాన్ని ఈ పోరాటం నిరూపించిందని 'ఎక్స్' వేదికగా ప్రకాశ్ రాజ్ పోస్టు చేశారు. ప్రకాశ్ రాజ్ చేసిన పోస్టుకు నెటిజన్లు వేగంగా స్పందిస్తున్నారు. విద్యార్థుల పోరాటానికి అండగా నిలిచిన ప్రకాశ్ రాజ్ను కూడా అభినందిస్తున్నారు.
Congratulations ❤️❤️❤️ my Dear Cockroaches.. Dear Sonam wangchuk sir and every single one who stood by the youth . You Have proved that you can bring a regime down to its knees . 💪💪💪 #justasking pic.twitter.com/efMYgbzxlf
— Prakash Raj (@prakashraaj) July 25, 2026
ట్వీట్ ఇదే!
'నా ప్రియమైన బొద్దింకల (కాక్రోచ్)కు అభినందనలు. ప్రియమైన సోనమ్ వాంగ్చుక్ సర్, యువత పక్షాన నిలబడిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు. ఒక నిరంకుశ పాలనను మీరు మోకాళ్లపైకి తెప్పించగలరని నిరూపించారు'- ప్రకాశ్ రాజ్
జగిత్యాలలో విషజ్వరాల కలకలం.. రెండ్రోజుల్లో ఇద్దరు చిన్నారులు మృతి!
Hyderabad, Telangana:Jagtial Viral Fever: జగిత్యాల రూరల్ మండలం పొరండ్ల గ్రామంలో విషజ్వరాలు పంజా విసిరాయి. రెండు రోజుల వ్యవధిలోనే ఇద్దరు ఆరేళ్ల చిన్నారులు జ్వరం బారిన పడి ప్రాణాలు కోల్పోవడంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు.. ఒకే తరగతికి చెందిన ఆడుకునే స్నేహితులు వరుసగా మృతి చెందడంతో ఇరు కుంటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి.
కన్నీరు మున్నీరవుతున్న కుటుంబాలు..
గ్రామానికి చెందిన హరిస్మిత (6), వరుణ్ తేజ (6) అనే చిన్నారులు పక్కపక్క ఇళ్లలోనే నివాసముంటూ.. స్థానిక పాఠశాలలో యూకేజీ (UKG) చదువుతున్నారు. ఎంతో ఆప్యాయంగా కలిసి ఆడుకునే ఈ చిన్నారులను విధి జ్వరం రూపంలో బలితీసుకుంది. కొద్దిరోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్న వరుణ్ తేజ రెండు రోజుల క్రితం పరిస్థితి విషమించి ప్రాణాలు వదిలాడు. ఆ విషాదం నుంచి కోలుకోకముందే.. తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న హరిస్మిత కూడా నిన్న ఉదయం తుదిశ్వాస విడిచింది.
గల్ఫ్ నుంచి వచ్చినా దక్కని కుమార్తె..
కూతురు హరిస్మిత ఆరోగ్య పరిస్థితి విషమించిందని తెలుసుకున్న తండ్రి కిరణ్, గల్ఫ్ నుంచి హుటాహుటిన స్వగ్రామానికి చేరుకున్నారు. కానీ.. వచ్చేసరికి కూతురు మరణించడంతో ఆయన గుండెలవిసేలా రోదించిన తీరు గ్రామాన్ని తీవ్రంగా కలచివేసింది. చిన్నారులిద్దరూ తీవ్రమైన విషజ్వరం (Viral/Toxic Fever) కారణంగానే మరణించినట్లు వైద్యులు ప్రాథమికంగా వెల్లడించారు.
రంగంలోకి వైద్య ఆరోగ్య శాఖ..
ఇద్దరు చిన్నారుల మృతితో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తక్షణమే స్పందించారు. పొరండ్ల గ్రామంలో ప్రత్యేక వైద్య శిబిరాలను (Medical Camps) ఏర్పాటు చేశారు. వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు ప్రతి ఇంటికీ తిరుగుతూ ప్రజల ఆరోగ్య పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ప్రాథమిక సర్వే ప్రకారం.. గ్రామంలో సుమారు 20 మంది వివిధ రకాల జ్వరాలతో బాధపడుతున్నట్లు అధికారులు గుర్తించి.. వారికి ఉచిత మందులు పంపిణీ చేశారు.
గ్రామప్రజలు ఎవరూ అధైర్యపడకూడదని.. పరిసరాల పరిశుభ్రత పాటించడంతో పాటు తప్పనిసరిగా కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలని వైద్య అధికారులు స్పష్టం చేశారు. ముఖ్యంగా తీవ్రమైన జ్వరం, నీరసంతో పాటు వాంతులు, విరేచనాలు, తీవ్రమైన కడుపునొప్పి వంటి లక్షణాలు కనిపిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆర్ఎంపీలు లేదా నాటు వైద్యులను ఆశ్రయించి కాలాన్ని వృథా చేయవద్దని.. తక్షణమే సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లాలని అధికారులు ప్రజలను సూచిస్తున్నారు.
Also Read: పోలీస్ వ్యాన్ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
సినిమా ఫక్కీలో స్కెచ్.. సిద్ధిపేట ఆసుపత్రి నుంచి ఖైదీ పరార్!
Hyderabad, Telangana:Siddipet Latest News: సిద్ధిపేట జిల్లా కేంద్రంలో శనివారం తీవ్ర కలకలం రేగింది. వైద్య పరీక్షల నిమిత్తం స్థానిక ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తీసుకువచ్చిన ఓ ఖైదీ.. పోలీసుల కళ్లుగప్పి సినిమా ఫక్కీలో పరారైన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. బైక్ దొంగతనాల కేసులో రిమాండ్లో ఉన్న నిందితుడు సాయికుమార్ తప్పించుకోవడంతో పోలీస్ యంత్రాంగం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
ఘటన వివరాల్లోకి వెళ్తే..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బైక్ దొంగతనాల కేసులో నిందితుడైన సాయికుమార్తో పాటు మొత్తం ఏడుగురు ఖైదీలను క్రమశిక్షణా ప్రక్రియలో భాగంగా.. అలాగే జైలు నిబంధనల ప్రకారం.. మెడికల్ చెకప్ నిర్వహించేందుకు సిద్ధిపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తీసుకువచ్చారు.
ఆసుపత్రి ప్రాంగణంలో రోగుల రద్దీ ఎక్కువగా ఉండటాన్ని ఆసరాగా చేసుకున్న సాయికుమార్.. పోలీసులు అజాగ్రత్తగా ఉన్న సమయంలో వారి దృష్టిని మళ్లించి ఒక్కసారిగా అక్కడి నుంచి జారుకున్నాడు. ఖైదీ మాయమైనట్లు గమనించిన సిబ్బంది వెంటనే తేరుకుని ఆసుపత్రి పరిసరాల్లో వెతికినప్పటికీ.. అప్పటికే అతడు పరారయ్యాడు.
పరారైన సాయికుమార్ పలు బైక్ దొంగతనాల కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. గతంలో వివిధ ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాలను చోరీ చేస్తూ.. పోలీసులకు చిక్కాడు. న్యాయస్థానం అతనికి రిమాండ్ విధించడంతో జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ క్రమంలోనే వైద్య పరీక్షలకు తీసుకురాగా ఈ ఊహించని ఘటన చోటుచేసుకుంది.
ఖైదీ పరార్ వార్త తెలిసిన వెంటనే జిల్లా పోలీస్ ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. ఘటనపై తక్షణమే స్పందించి ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. సిద్ధిపేట జిల్లా కేంద్రంతో పాటు చుట్టుపక్కల మండలాల్లోకి వెళ్లే ప్రధాన రహదారుల వద్ద చెక్పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేసిన్నట్లు తెలుస్తోంది.. ఆసుపత్రి పరిసరాల్లోని సీసీటీవీ (CCTV) కెమెరాల ఫుటేజీని సేకరించి.. అతడు ఏ వైపు పరారయ్యాడనే అంశంపై విశ్లేషిస్తున్నారు. అలాగే ఆర్టీసీ బస్టాండ్, రైల్వే స్టేషన్లతో పాటు రద్దీగా ఉండే ప్రదేశాల్లో పోలీసులు గాలింపు చర్యలను తీవ్రతరం చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Mukesh Ambani Grandson: ముఖేష్ అంబానీ మనవడు చదువుతున్న స్కూల్ ఏది? ఫీజు ఎంతంటే షాక్ అవ్వాల్సిందే!
Mumbai, Maharashtra:Mukesh Ambani Grandson School Fee: ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా పేరుగాంచిన ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ కుటుంబానికి సంబంధించిన ప్రతి విషయం నిత్యం నెట్టింట వైరల్ అవుతుంటుంది. ముఖేష్, నీతా అంబానీ దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్న విషయం తెలిసిందే. అయితే, ముఖేష్ అంబానీ పెద్ద మనవడు పృథ్వీ అంబానీ (ఆకాశ్ అంబానీ కుమారుడు) చదువుకుంటున్న స్కూల్, దాని ఫీజులకు సంబంధించిన వివరాలు ప్రస్తుతం అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి.
అంబానీ మనవడు చదువుతున్న స్కూల్ పేరు ఏంటంటే?
పృథ్వీ అంబానీ సాధారణ పాఠశాలల్లో కాకుండా, ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడిన అత్యంత ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ పాఠశాలలో విద్యనభ్యసిస్తున్నాడు. ఆయన చదువుతున్న స్కూల్ పేరు 'నీతా ముఖేష్ అంబానీ జూనియర్ స్కూల్' (NMAJS). ఈ పాఠశాలకు ప్రపంచంలోనే అత్యంత గౌరవప్రదమైన కరికులమ్ సంస్థ అయిన 'ఇంటర్నేషనల్ బాకలారియేట్ వరల్డ్ స్కూల్' (IB) గుర్తింపు ఉంది. ఇక్కడ పిల్లల ప్రాథమిక విద్య 'ప్రైమరీ ఇయర్స్ ప్రోగ్రామ్'తో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత 'మిడిల్ ఇయర్స్ ప్రోగ్రామ్' కూడా ఇక్కడే బోధిస్తారు.
ముంబైలోని బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ (BKC), జియో వరల్డ్ సెంటర్ ప్రాంగణంలో ఈ స్కూల్కు అత్యాధునికమైన రెండు భారీ క్యాంపస్లు ఉన్నాయి. ఈ పాఠశాలల్లో బాలీవుడ్ ప్రముఖులు, నూతన తరం సెలబ్రిటీల పిల్లలు కూడా చదువుతుండటం విశేషం.
భారీగా స్కూల్ ఫీజులు!
ఈ స్కూల్లో ఫీజుల గురించి వింటే ఎవరికైనా మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. తరగతిని బట్టి జూనియర్ స్కూల్ ఫీజు సుమారు రూ.14 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు ఉంటుందని అంచనా. అంటే పృథ్వీ అంబానీ ప్రాథమిక విద్య కోసమే లక్షల్లో ఫీజు చెల్లిస్తున్నారు.
ఈ 'నీతా ముఖేష్ అంబానీ జూనియర్ స్కూల్' భారతదేశంలోనే నంబర్ వన్ ఇంటర్నేషనల్ స్కూల్గా పేరుగాంచిన ప్రఖ్యాత 'ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్' (DAIS)లో ఒక భాగం కావడం గమనార్హం. కేవలం ప్రాథమిక విద్యకే ఇంత భారీ స్థాయిలో ఫీజులు ఉంటే, ఉన్నత తరగతులకు ఫీజులు ఏ స్థాయిలో ఉంటాయో ఊహించుకోవచ్చు.
Also REad: కేంద్ర మంత్రి పదవికి రవ్నీత్ సింగ్ రాజీనామా..రాష్ట్రపతి ఆమోదం..!
Also REad: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా..అసలు ఎవరీ ధర్మేంద్ర, ఆయన బ్యాగ్రౌండ్ ఏంటి?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా.. మహారాష్ట్ర సీఎంకు అధిష్టానం పిలుపు.. ఏం జరుగుతుంది?
Hyderabad, Telangana:Devendra Fadnavis Delhi Visit: కేంద్ర రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో దేశ రాజధాని ఢిల్లీ కేంద్రంగా రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఈ క్రమంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్కు బీజేపీ అధిష్టానం నుంచి అత్యవసర పిలుపు రావడం రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. ఆయన హుటాహుటిన ఢిల్లీ పర్యటనకు సిద్ధం కావడంతో జాతీయ రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
కేంద్ర పెద్దల పిలుపుమేరకు ఢిల్లీ చేరుకోనున్న ఫడ్నవీస్.. బీజేపీ అగ్రనేతలు, భారత ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, అలాగే బీజేపీ జాతీయ అధ్యక్షుడితో భేటీ కానున్నట్లు సమాచారం. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో ఖాళీ అయిన కేంద్ర మంత్రివర్గ స్థానాన్ని భర్తీ చేయడం సహా, కేంద్ర మంత్రివర్గంలో భారీ మార్పులు చేర్పులు (Cabinet Reshuffle) చేపట్టేందుకు అధిష్టానం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది..
ఈ అత్యవసర భేటీలో పలు కీలక విషయాలపై సుదీర్ఘంగా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.. మొదటగా.. కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ.. ధర్మేంద్ర ప్రధాన్ స్థానంలో కొత్తవారికి బాధ్యతలు అప్పగించడంతో పాటు కేంద్రంలో మహారాష్ట్ర నేతల ప్రాతినిధ్యంపై చర్చించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. రాబోయే వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు సార్వత్రిక వ్యూహాలపై అధిష్టానంతో చర్చించనున్నారు. మహారాష్ట్రలోని ప్రాంతీయ సమీకరణాలతో పాటు దేశవ్యాప్తంగా మారుతున్న రాజకీయ వాతావరణంపై సమాలోచనలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది..
రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ..
దేవేంద్ర ఫడ్నవీస్ ఢిల్లీ పర్యటన వెనుక పెద్ద వ్యూహాత్మక అడుగు ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకవైపు కేంద్ర మంత్రివర్గంలో కీలక మార్పులు, మరోవైపు పార్టీ సంస్థాగత నియామకాలపై నిర్ణయాలు తీసుకునేందుకే అధిష్టానం ఆయనను అత్యవసరంగా పిలిపించినట్లు తెలుస్తోంది. ఫడ్నవీస్ భేటీ ముగిసిన తర్వాతే కేంద్రంలో జరగబోయే ఆ నిర్ణయాలపై స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read: పోలీస్ వ్యాన్ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Dharmendra Pradhan Net Worth: కేంద్ర మాజీ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆస్తుల వివరాలు..కోట్లలో సంపద, భారీగా పేరుకుపోయిన అప్పులు!
Hyderabad, Telangana:Dharmendra Pradhan Net Worth: నీట్ (NEET) పేపర్ లీక్ వ్యవహారం, ఇతర పరిణామాల నేపథ్యంలో ప్రతిపక్షాల నిరసనలతో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రస్తుతం జాతీయ స్థాయిలో తీవ్ర చర్చనీయాంశంగా నిలిచారు. ఆయన రాజీనామా డిమాండ్తో విద్యార్థి సంఘాలు, కాంగ్రెస్ పార్టీ ఆందోళనలు చేస్తుండటంతో.. తాజాగా ఆయన తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఈ క్రమంలో ధర్మేంద్ర ప్రధాన్ వ్యక్తిగత జీవితం, రాజకీయ ప్రస్థానంతో పాటు ఆస్తుల వివరాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 2024 లోక్సభ ఎన్నికల సందర్భంగా ఆయన సమర్పించిన అఫిడవిట్ ప్రకారం.. ఆయన ఆస్తులు, అప్పుల పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
మొత్తం ఆస్తులు, అప్పులు
2024 ఎన్నికల అఫిడవిట్ ప్రకారం కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆస్తుల విలువ సుమారు రూ.6.92 కోట్లుగా ఉంది. ఆయనపై వివిధ బ్యాంకులు, ఇతరుల నుంచి కలిపి మొత్తం రూ.2.30 కోట్ల మేర రుణాలు ఉన్నట్లు తెలుస్తోంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఐడీబీఐ (IDBI) బ్యాంకుల నుంచి ఆయన దాదాపు రూ.31.38 లక్షల రుణం తీసుకున్నారు.
బ్యాంక్ రుణాలతో పాటు ఆయన తన భార్యకు రూ.10 లక్షలు, తండ్రికి రూ.5 లక్షలు ఇవ్వడంతో పాటు మరికొంత మంది బంధువులకు కూడా వ్యక్తిగత అప్పులు ఇచ్చినట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు.
వార్షిక ఆదాయం
ఆదాయం విషయంలో ధర్మేంద్ర ప్రధాన్ కంటే ఆయన సతీమణి ముందుండటం విశేషం. ధర్మేంద్ర ప్రధాన్ వార్షిక ఆదాయం రూ.12.75 లక్షలు కాగా, ఆయన భార్య వార్షిక ఆదాయం రూ.49.92 లక్షలుగా ఉంది.
పెట్టుబడులు, పొదుపులు
ధర్మేంద్ర ప్రధాన్ దంపతులు తమ సంపాదనలో సింహభాగాన్ని భద్రమైన ఆర్థిక పథకాల్లో మళ్లించారు. బ్యాంక్ డిపాజిట్లు, ఫిక్స్డ్ డిపాజిట్లు (FDs), పీపీఎఫ్ (PPF) ఖాతాల్లో సుమారు రూ.2.47 కోట్లు ఉన్నాయి. మ్యూచువల్ ఫండ్లలో రూ.80.40 లక్షల పెట్టుబడులు ఉన్నాయి. అలాగే ఎల్ఐసీ (LIC) తదితర బీమా పాలసీల విలువ రూ.67.72 లక్షలుగా ఉంది.
స్థిరాస్తులు (భూములు, ఇళ్లు)
ఒడిశాలో రూ.12 లక్షల విలువైన వ్యవసాయ భూమి, రూ. 20.50 లక్షల విలువైన వ్యవసాయేతర భూమి ఆయన పేరిట ఉన్నాయి. అదే విధంగా ఘజియాబాద్, భువనేశ్వర్లలో మంత్రి దంపతుల పేరిట సుమారు రూ.1.98 కోట్ల విలువైన ఇళ్లు ఉన్నాయి.
బంగారం, వెండి, వాహనాలు
ధర్మేంద్ర ప్రధాన్ వద్ద 200 గ్రాముల బంగారం, 2.5 కిలోగ్రాముల వెండి ఉండగా.. ఆయన భార్య వద్ద 500 గ్రాముల బంగారం, 10 కిలోగ్రాముల వెండి ఉన్నాయి. ధర్మేంద్ర ప్రధాన్ వద్ద 2011 మోడల్ హోండా సిటీ కారు ఉండగా, ఆయన భార్య పేరిట పలు వాణిజ్య వాహనాలు నమోదై ఉన్నాయి.
Also Read: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా..అసలు ఎవరీ ధర్మేంద్ర, ఆయన బ్యాగ్రౌండ్ ఏంటి?
Also Read: కేంద్ర మంత్రి పదవికి రవ్నీత్ సింగ్ రాజీనామా..రాష్ట్రపతి ఆమోదం..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
ఆగస్టు 2 నుంచి కేతువు ఎఫెక్ట్.. ఈ 4 రాశుల వారికి తిరుగులేని రాజయోగం!
Hyderabad, Telangana:Ketu Transit Effect On Zodiac: జ్యోతిష్య శాస్త్రంలో కేతువు గ్రహ సంచారానికి ఎంతో విశిష్టమైన ప్రాముఖ్యత ఉంటుంది.. గ్రహాల నక్షత్ర మార్పుల ప్రభావంతో ద్వాదశ రాశుల జీవితాల్లో గణనీయమైన మార్పులు చోటుచేసుకుంటాయి. రాబోయే ఆగస్టు 2న రాత్రి 12 గంటలకు కేతువు మఘ నక్షత్రం రెండవ పాదంలోకి సంచారం చేయబోతోంది.. ఈ నక్షత్ర పద సంచారం అక్టోబర్ 3 వరకు కొనసాగనుంది. ఈ సమయం నాలుగు ప్రత్యేక రాశుల వారికి అత్యంత శ్రేయస్సకరంగా మారడమే కాకుండా.. వారి ఆర్థిక పరిస్థితులు పూర్తిగా మారే అవకాశాలు ఉన్నాయి..
ఈ సమయంలో ఆయా రాశుల వారికి నూతన ఆదాయ మార్గాలు విపరీతంగా పెరుగుతాయి. కుటుంబంలో దీర్ఘకాలంగా వేధిస్తున్న విభేదాలు తొలగిపోయి శాంతి సౌఖ్యాలు వర్ధిల్లుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. కేతువు శుభ దృష్టి వల్ల విపరీతమైన ప్రయోజనాలు కలిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.
ఈ రాశులవారికి బంపర్ జాక్ఫాట్..
కన్యా రాశి (Virgo)
కన్యా రాశి వారికి ఈ నక్షత్ర సంచారం అత్యంత అద్భుతంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.. పట్టేదల్లా బంగారమే అన్నట్లుగా.. ప్రతి పనిలో విజయాలు సాధించే అవకాశాలు కూడా ఉన్నట్లు జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఉద్యోగంలో ఉన్నతాధికారుల మెప్పు పొందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.. కీలక బాధ్యతలు స్వీకరిస్తారు. అంతేకాకుండా రాబడి నుంచి భారీ మొత్తంలో ధన లాభాలు కూడా కలుగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి కూడా విపరీతంగా పెరుగుతుంది..
మేష రాశి (Aries)
కేతువు నక్షత్ర సంచారం కారణంగా మేష రాశి వారికి ఈ సమయం అత్యంత అనుకూల ఫలితాలను అందిస్తుంది. వ్యాపార రంగంలో ఉన్నవారు మంచి పురోగతి కూడా కలుగుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఉద్యోగస్తులకు ఆఫీసులో పదోన్నతి లేదా జీతం పెరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఫలితంగా ఒక్కసారిగా రాబడి పెరిగి ఆర్థిక స్థిరత్వం కూడా విపరీతంగా పెరుతుంది.. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా.. సంతోషంగా మారుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు..
మిథున రాశి (Gemini)
మిథున రాశివారికి ఈ సమయం ఒక రకంగా గోల్డెన్ టైమ్గా భావించవచ్చు. వ్యాపారాన్ని విస్తరించడానికి నూతన పెట్టుబడులు లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. ఉద్యోగంలో ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభించి.. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది.
ధనుస్సు రాశి (Sagittarius)
ధనుస్సు రాశి వారికి కేతు ప్రభావంతో కొత్త అవకాశాలు వస్తాయి. ఉద్యోగ మార్పు కోసం చూస్తున్న వారికి భారీ జీతంతో కూడిన మంచి ఆఫర్లు కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి.. సమాజంలో కీర్తి ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులందరి మధ్య అప్యాయత, సమన్వయం పెరుగుతాయి.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
గమనిక.. 
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..
