ఈ నెల 15న ఖమ్మంలో సీఎం రేవంత్ సమావేశం
Mahabubabad, Telangana:ఖమ్మం జిల్లాలో సీతారామ సాగునీటి ప్రాజెక్టును ఈ నెలలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో తుమ్మల వైరాలో ఏర్పాటు చేసిన సభ ఏర్పాట్లను పరిశీలించారు. ప్రాజెక్టు ప్రారంభోత్సవం అనంతరం జరిగిన సభలో సీఎం రేవంత్ రూ.2 లక్షల రుణమాఫీని ప్రారంభిస్తామన్నారు. తమది రైతుల ప్రభుత్వమని చెప్పుకుంటున్నారు. సీఎం సభకు పెద్ద ఎత్తున జన సమీకరణ చేస్తున్నామని, సభకు వచ్చే ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామని తుమ్మల తెలిపారు.
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
KTR: వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే.. ఎన్నారైలు తెలంగాణ అభివృద్ధికి సహకరించాలి: కేటీఆర్
Baddipadaga, Telangana:Telangana Formation Day At Malaysia: 'రైతులకు ఉచితంగా 24 గంటలపాటు కరెంట్ ఇచ్చిన ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ. ప్రతి గడపకు నల్లా పెట్టి ఇంటింటికీ నీళ్లు ఇచ్చిన మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ. కరెంట్ కోతలతో అల్లాడిన చోటే కరెంట్ కోతలంటే తెల్వని పరిస్థితిని సృష్టించింది తెలంగాణ. నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిస్ అనే మహమ్మారిని తరిమికొట్టింది కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ. 70 లక్షల మంది రైతు కుటుంబాలకు రైతుబంధు ఇచ్చి తెలంగాణ రైతులను దేశంలోనే నెంబర్ వన్గా కేసీఆర్ నాయకత్వం నిలబెట్టింది' అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. 'ఆయిల్, అణ్వాయుధాలు ఉన్నవాడు కాదు లీడర్.. ఆలోచన ఉన్నవాడే అసలైన లీడర్. కొత్త ఆవిష్కరణలతో, నవ్య సాంకేతికతతో పోటెత్తే యువ సముద్రం భారతదేశం.. తెలంగాణలో ఉంది. ఇవాళ జెన్-జీ కొత్త శక్తితో.. కొత్త ఉత్సాహంతో తొణికిసలాడుతున్నది' అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు.
పామాయిల్ విప్లవం
మలేషియాలోని కౌలాలంపూర్ నగరంలో మలేషియా తెలంగాణ అసోసియేషన్ (మైటా), బీఆర్ఎస్ పార్టీ మలేషియా శాఖల సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన తెలంగాణ ఆవిర్భావ వేడుకలలో పాల్గొని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక ప్రసంగం చేశారు. మలేషియాతో కూడా తెలంగాణకి ఒక అద్భుతమైన సంబంధం ఉంది. మలేషియా మాదిరే తెలంగాణలోనూ పామాయిల్ విప్లవం సాధించి, రైతుల వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలనే ఏకైక ఉద్దేశంతో పామాయిల్ కోసం మలేషియా నుంచి విత్తనాలు, మొక్కలు తీసుకువచ్చి తెలంగాణలో నాటించారు' అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గుర్తుచేశారు. కేసీఆర్ కృషి ఫలితంగా ఈరోజు భారతదేశంలోనే అత్యధికంగా పామాయిల్ ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రాల్లో ఒకటిగా తెలంగాణ నిలిచిందని సగర్వంగా ప్రకటించారు.
ఆలోచన ఉన్నవాడే అగ్రస్థానంలో
'ప్రపంచం విపరీతమైన మార్పులకు గురవుతున్నది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వంటి సాంకేతిక రంగాలు ప్రపంచాన్ని కుదిపేస్తున్నాయి. కేవలం విజ్ఞానం ఉన్నవాడే నాయకుడని, ఆ దేశం మాత్రమే ఎదుగుతుంది. ఒకనాడు అణ్వాయుధాలు ఉన్నవాడు నాయకుడైతే.. ఈరోజు విజ్ఞానం, ఆలోచన ఉన్నవాడే అగ్రస్థానంలో నిలబడుతున్నారు. అందుకే తెలంగాణ రాష్ట్రానికి ఎన్నారైల సేవలు కావాలని.. తెలంగాణ అభివృద్ధికి వారి సూచనలు, భవిష్యత్తుకు ప్రవాసుల మద్దతు అవసరం' అని మాజీ మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.
బీఆర్ఎస్ పార్టీకి ఒక ప్రత్యేక విజన్
'10 సంవత్సరాల పాటు వెనుకబడిన తెలంగాణను అగ్రస్థానంలో నిలిపిన కేసీఆర్కు, బీఆర్ఎస్ పార్టీకి వచ్చే 25 సంవత్సరాల కోసం, తెలంగాణ భవిష్యత్తు కోసం ఒక ప్రత్యేక విజన్ ఉంది. అలాంటి అద్భుతమైన విజన్ను నిజం చేయగలిగే శక్తి ముమ్మాటికీ కేసీఆర్కే ఉంది. 10 సంవత్సరాల ఆయన పరిపాలనే దానికి సజీవ సాక్ష్ం' అని మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. 60 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో కరెంట్ కోతలతో తల్లడిల్లిన తెలంగాణకు 24 గంటల ఉచిత, నాణ్యమైన విద్యుత్ను అన్ని రంగాలకు అందించిన తీరుగానే.. రాబోయే రోజుల్లో అభివృద్ధి చెందిన దేశాల మాదిరిగా 24 గంటల పాటు స్వచ్ఛమైన తాగునీటిని నిరంతరం సరఫరా చేయాలన్నదే తమ ప్రధాన విజన్' అని కేటీఆర్ ప్రకటించారు.
భవిష్యత్ ప్రణాళిక
'ప్రజారవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని, ఆ దిశగా పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తాం. తెలంగాణను తిరిగి అభివృద్ధి పథంలో నిలిపే శక్తి కేసీఆరకే ఉంది. కేసీఆర్ ప్రభుత్వం తిరిగి రాగానే భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా తెలంగాణను తీర్చిదిద్దుతాం' అని తమ భవిష్యత్ ప్రణాళికను బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వివరించారు. 'ప్రస్తుతం ప్రపంచంలోని అనేక దేశాల్లో విపరీతమైన మార్పులు వస్తున్న నేపథ్యంలో ప్రవాస భారతీయులు స్థానికులతో కలిసిమెలిసి ముందుకు సాగాల్సిన అవసరాన్ని గుర్తించాలి' అని సూచించారు. 'స్థానికులతో, స్థానిక సంస్కృతితో కలిసి ముందుకు పోతే ప్రతి దేశంలోనూ తెలంగాణ బిడ్డలు అద్భుతమైన విజయాలు సాధిస్తారు' అని కేటీఆర్ తెలిపారు.
కలిసి రావాలి
తెలంగాణ రాష్ట్రం కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం ప్రవాస భారతీయులంతా తమతో కలిసి రావాలని మాజీ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. మలేషియాలో ఈ అద్భుతమైన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మలేషియా తెలుగు అసోసియేషన్తో పాటు బీఆర్ఎస్ ఎన్నారై మలేషియా శాఖకు, పార్టీ శ్రేణులకు కేటీఆర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
KT Rama Rao: కాలనాగులతో జాగ్రత్త.. 2028లో మళ్లీ వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే: కేటీఆర్
Kuala Lumpur, Federal Territory of Kuala Lumpur:KTR Malaysia Meeting: 'అభివృద్ధిపై విషం చిమ్ముతున్న 'నాలుగు ఫీట్ల' నాయకులు. వానపాములు కూడా నాగుపాములై బుసకొడుతున్నాయి. కాలనాగులతో జాగ్రత్త.. 2028లో మళ్లీ వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే' అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ జోష్యం చెప్పారు. 'రాష్ట్ర భవిష్యత్తు మీద బీఆర్ఎస్కు మాత్రమే విజన్ ఉంది. రాబోయే 25 ఏళ్లకు బీఆర్ఎస్కు స్పష్టమైన విజన్ ఉంది' అని స్పష్టం చేశారు. తెలంగాణ పునర్నిర్మాణంలో ప్రవాస బిడ్డలు కలిసిరావాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ బిడ్డ గర్వంగా చెప్పుకోవాలి
మలేషియా తెలుగు అసోసియేషన్, బీఆర్ఎస్ ఎన్నారై మలేషియా శాఖ సంయుక్తంగా మలేషియా దేశంలో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలతో సహా హాజరైన కేటీఆర్ కీలక ప్రసంగం చేశారు. మనది తెలంగాణ జాతి అని ప్రతి తెలంగాణ బిడ్డ గర్వంగా చెప్పుకోవాలని.. తెలంగాణ జాతి సంస్కృతి ప్రపంచంలోనే అనన్య సామాన్యం అని కొనియాడారు. 'వేల సంవత్సరాల కిందట మొదలైన తెలంగాణ చరిత్ర రాజులు, చక్రవర్తులు, కవులు, కళాకారులు, సంస్కృతి, పాటలతో తరతరాలుగా విలసిల్లుతున్నది. తెలంగాణ జాతిలో ప్రతి తరం ఏదో ఒక యుద్ధాన్ని, రణాన్ని నడిపించింది' అని కేటీఆర్ గుర్తుచేశారు.
ఒకే ఒక్క జాతి తెలంగాణ జాతి
సాయుధ పోరాటాలు, ప్రజా ఉద్యమాలు, త్యాగాలతో కూడిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం. ప్రతిసారి తెలంగాణ జాతి తోటి ప్రజల కోసం కొట్లాడిందన్న విషయాన్ని మనం మర్చిపోకూడదని మాజీ మంత్రి కేటీఆర్ సూచించారు. భక్త రామదాసు (కంచర్ల గోపన్న) నుంచి గోరటి వెంకన్న దాకా దిక్కార స్వరాన్ని వినిపించిన ప్రజా కళాకారుల నుంచి మొదలుకొని ప్రజానాయకులు ఎందరినో కన్న ఈ గడ్డ అత్యంత ప్రత్యేకమైనదని వివరించారు. ప్రకృతితో మమేకమై బతుకమ్మను జరుపుకునే, పువ్వులను పూజించి ప్రకృతిని ఆరాధించే ఒకే ఒక్క జాతి ఈ ప్రపంచంలో తెలంగాణ జాతి అని ప్రకటించారు.
నాది తెలంగాణ జాతి
ఇంత అద్భుతమైన చరిత్ర, సంస్కృతి కలిగిన మనందరం "నాది తెలంగాణ, నాది తెలంగాణ జాతి, నేను తెలంగాణ బిడ్డను" అని సగర్వంగా చెప్పుకోవాలని మాజీ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఊరికేనే రాలేదని గుర్తుచేశారు. దశాబ్దాల పాటు జరిగిన తొలి తెలంగాణ ఉద్యమం, ఆ తర్వాత కేసీఆర్ సారథ్యంలో జరిగిన మలి తెలంగాణ ఉద్యమంతోనే ఇది సాధ్యమైందని తెలిపారు. మలి విడత ఉద్యమానికి నాయకత్వం వహించి, సబ్బండ వర్గాలను కలుపుకొని ముందుకు వెళ్లిన కేసీఆర్ నాయకత్వంలో పుష్కరానికి పైగా సాగిన ప్రజాస్వామిక ఉద్యమంతో ప్రత్యేక తెలంగాణ సిద్ధించిందని వివరించారు.
ఏషియన్ టైగర్స్'గా తెలంగాణ
'ప్రపంచంలో కొరియా, తైవాన్, సింగపూర్, మలేషియా, వియత్నాం లాంటి దేశాలను 'ఏషియన్ టైగర్స్'గా పిలుస్తుంటారు. అవి చిన్న దేశాలే అయినా సాధించిన విజయాలు అతి గొప్పవి. అదేవిధంగా భారతదేశంలో చిన్న రాష్ట్రమైన తెలంగాణ అత్యంత తక్కువ కాలంలోనే అద్భుతమైన విజయాలను సాధించింది. ఒకనాటి వలసల తెలంగాణను.. కరువుల తెలంగాణను దేశానికి అన్నపూర్ణగా మార్చిన ఘనత కేసీఆర్దే' అని కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణను వ్యవసాయం నుంచి మొదలుకొని పరిశ్రమల దాకా ప్రతి రంగంలో అగ్రస్థానంలో నిలబెట్టింది ముమ్మాటికీ కేసీఆర్ అని ప్రకటించారు.
తెలంగాణను అగ్రస్థానంలో నిలిపి
'ఒకనాడు అత్యంత వెనుకబడిన రాష్ట్రంగా పేరున్న తెలంగాణను ఆర్థిక అభివృద్ధిలో అగ్రస్థానంలో నిలిపి.. తలసరి ఆదాయంతో పాటు స్థూల జీఎస్డీపీలోనూ ప్రథమ స్థానానికి చేర్చామన్నారు. ఒకప్పుడు గేలి చేయబడిన తెలంగాణ సంస్కృతిని ఈనాడు సగర్వంగా ప్రపంచానికి చాటిచెప్పింది కూడా ముమ్మాటికీ కేసీఆర్' అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. 'ఇవేమీ తెలియని 4 ఫీట్లు ఉన్న నాయకులు కొంతమంది తెలంగాణ గురించి, తెలంగాణ అభివృద్ధి గురించి, తెలంగాణ నీళ్ల గురించి, నిధుల గురించి అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. కాలం మనది కానప్పుడు వానపాములు కూడా నాగుపాములై బుసకొడతాయి. అలాంటి విషనాగులతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి" అని హెచ్చరించారు. 2028లో మళ్లీ తెలంగాణ రాష్ట్రంలో గులాబీ జెండా ఎగురుతుందని, కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రిగా రావడం ఖాయమని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు.
Revanth Reddy: కాళ్లలో కట్టె పెట్టినా.. కోహెడ పండ్ల మార్కెట్ నిర్మించి తీరుతాం: రేవంత్ రెడ్డి
Koheda, Telangana:Koheda Fruit Market: హైదరాబాద్ అంతర్జాతీయ నగరంగా మారింది. ఇప్పుడు నగర ప్రజల అవసరాలను తీర్చలేకపోతున్నామని తెలంగాణ ముఖ్యమంత్రి తెలిపారు. 'అంతర్జాతీయ ప్రమాణాలతో ఫ్రూట్ మార్కెట్ను ఏర్పాటు చేస్తామని ఆ నాడే హామీ ఇచ్చా. పాలు, పండ్లు, కూరగాయలు ఏమైనా ఇక్కడికి వస్తే అందరికీ అందుబాటులో ఉండేలా 240 ఎకరాల్లో ఫ్రూట్ మార్కెట్ను నిర్మించుకుంటున్నాం' అని రేవంత్ రెడ్డి తెలిపారు. గతంలో తాత్కాలికంగా రేకులతో షెడులు వేసి మార్కెట్ నిర్మిస్తే గాలివానకు కూలి అనేక మంది గాయపడితే ఆ రోజు పరామర్శించానని గుర్తుచేసుకున్నారు. అంతర్జాతీయ ఎయిర్ పోర్టు తర్వాత కోహెడ ఫ్రూట్ మార్కెట్ మనకు మరింత గుర్తింపు తెస్తుందని ఆశిస్తున్నామని పేర్కొన్నారు.
కోహెడలో ఫ్రూట్ మార్కెట్తోపాటు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు శంకుస్థాపన చేసిన అనంతరం కోహెడ సభలో రేవంత్ రెడ్డి కీలక ప్రసంగం చేశారు. 'కొత్తిమీర లాంటివి కూడా పక్క రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. వరి, మొక్క జొన్న, పత్తి, మిర్చి లాంటి పంటలను మాత్రమే మన రైతులు పండిస్తున్నారు. మోదీ ప్రభుత్వ హయాంలో కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటున్నాయి. మన ప్రాంతంలో ప్రతి పండును పండించాలి. కందుకూరు ప్రాంతంలో పండించే టమోటా కోసం సాస్ ఫ్యాక్టరీని తీసుకువస్తాం' అని రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఫ్రూట్ మార్కెట్ను అడ్డుకోవడానికి కొందరు ప్రయత్నం చేస్తున్నారని. ఫార్మా పరిశ్రమలతో కాలుష్యంతో స్థానికులకు నష్టం జరుగుతుందని అక్కడ భారత్ ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నట్లు వివరించారు. ప్రపంచంలోనే ప్రసిద్ది చెందిన 500 కంపెనీలను భారత్ ఫ్యూచర్ సిటీకి తీసుకువస్తామని స్పష్టం చేశారు.
ఇలాగే వ్యవహరిస్తే..
'బీఆర్ఎస్ పార్టీ నాయకులు భారత్ ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామంటున్నారు, రీజనల్ రింగ్ రోడ్డు, వరంగల్, ఆదిలాబాద్ ఎయిర్ పోర్టులు, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం వద్దంటున్నారు. తుమ్మిడిహట్టిని నిర్మించవద్దని అంటున్నారు. ఏ అభివృద్ధి చేస్తామన్నా రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు. ఇలాగే వ్యవహరిస్తే రాబోయే రోజుల్లో ప్రతిపక్ష హోదా కాదు కాదా.. కారును తోయడానికి కూడా ఎవరూ దొరకరు' అని ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీపై రేవంత్ రెడ్డి విమర్శించారు.
రెండేళ్లలో పూర్తి కావాలి
'డిసెంబర్ నుంచే ఫ్రూట్ మార్కెట్లో కార్యకలాపాలు ప్రారంభం కావాలి. రెండేళ్లలో ఫ్రూట్ మార్కెట్ నిర్మాణం పూర్తి కావాలి. ఫ్రూట్ మార్కెట్ కోసం నిధులను గ్రీన్ ఛానల్లో ఇస్తాం' అని రేవంత్ రెడ్డి తెలిపారు. ఫ్రూట్ మార్కెట్ నిర్మాణం కోసం తుమ్మల, శ్రీధర్ బాబు ఇక్కడ కుర్చీ వేసుకుని కూర్చోవాలని సూచించారు. కోట్లాది రూపాయల రిజిస్ట్రేషన్లు జరుగుతున్నా సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో కనీస సౌకర్యాలు కూడా లేవని చెప్పారు. 'ప్రతి యేడాది రిజిస్ట్రేషన్ల ద్వారా 15 వేల కోట్ల ఆదాయం వస్తోంది. ఇంత ఆదాయం ఇచ్చే వాళ్ల కోసం కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయాలి. ఔటర్ రింగ్ రోడ్డు లోపల 39 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులను 12 క్లస్టర్లుగా విభజించి ఇంట్రిగ్రేటేడ్ కాంప్లెక్స్ లు నిర్మిస్తున్నాం. కాళ్లలో కట్టపెట్టినా, శాపనార్థాలు పెట్టినా, పెడబొబ్బలు పెట్టినా, మూసిలో పడి దొర్లినా అభివృద్ధి చేసుకునేదే' అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మిస్తాం, ఫ్రూట్ మార్కెట్ నిర్మిస్తాం,రీజనల్ రింగ్ నిర్మిస్తామని ప్రకటించారు. కడుపులో మంట ఉన్నవాళ్లకు అజీర్తి ఉంటూనే ఉంటుందని బీఆర్ఎస్ పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
రికార్డు స్థాయిలో వరి
'వ్యవసాయాన్ని దండుగ అంటే పండుగ చేశాం. వరి వేసుకుంటే ఉరే అంటే ఇప్పుడు వరికి 500 రూపాయల బోనస్ ఇస్తున్నాం. లక్షా నలభై వేల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని ఉత్పత్తి చేశాం. ఏ ఊళ్లో వడ్లు పండినా కాళేశ్వరం నీళ్లు కాళేశ్వరరావు చెప్పుకుంటు తిరిగేవాడు. కానీ కాళేశ్వరం నుంచి ఇప్పుడు చుక్క నీరు రాకుండానే రికార్డు స్థాయిలో వరి పండించాం. కాళేశ్వరం కూలేశ్వరమై లక్ష కోట్లు గోదావరిలో కొట్టుకుపోయాయి' అని రేవంత్ రెడ్డి విమర్శలు చేశారు.
Telugu Desam Party: టీడీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు.. విజయ్, రామకృష్ణ, సతీశ్కు అవకాశం
Nuzendla, Andhra Pradesh:TDP Rajya Sabha Candidates: అందరూ ఊహించినట్టుగానే తెలుగుదేశం పార్టీ రాజ్యసభ అభ్యర్థులు ఎంపికయ్యారు. పార్టీలో విశ్వసనీయంగా పనిచేయడంతోపాటు సామాజిక సమతూకం పాటిస్తూ టీడీపీ రాజ్యసభకు పోటీ చేసే అభ్యర్థులను ఎంచుకుంది. చింతకాయల విజయ్ పాత్రుడు, సానా సతీష్, భాష్యం రామకృష్ణలను రాజ్యసభ అభ్యర్థులుగా టీడీపీ అధికారికంగా ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్లో నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీ కానుండగా.. ఒకటి జనసేన పార్టీకి వదిలేయగా.. మిగిలిన మూడింటిలో టీడీపీ పోటీ చేస్తోంది. వైఎస్సార్సీపీకి అవకాశం లేకపోవడంతో నాలుగు స్థానాలు కూటమికే దక్కనున్నాయి.
సామాజిక సమతుల్యత అంకిత భావం, యువతకు పెద్ద పీట వేస్తూ రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. మొదటి నుంచి రాజ్యసభకు రేసులో చింతకాయల విజయ్ పాత్రుడు, సానా సతీష్, భాష్యం రామకృష్ణ ఉండగా.. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా వారివైపే మొగ్గు చూపడంతో అభ్యర్థులుగా వారిని ఖరారు చేశారు. అయితే రాజ్యసభ సభ్యత్వం కోసం తీవ్రమైన పోటీ ఉన్నప్పటికీ సామాజిక సమీకరణాలు, పార్టీతో ఉన్న అనుబంధాన్ని పరిగణనలోకి తీసుకుని చంద్రబాబు నాయుడు ముగ్గురిని ఎంపిక చేశారు. మిగిలిన ఒక స్థానానికి జనసేన పార్టీ తరఫున లింగమనేని రమేశ్ రాజ్యసభ సభ్యుడిగా నియమితులయ్యారు.
పార్టీకి విశేష సేవలు
మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు పార్టీకి అత్యంత విశ్వాసంగా కొన్ని దశాబ్దాల నుంచి పనిచేస్తున్నారు. ముఖ్యంగా వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్న సమయంలో అయ్యన్నపాత్రుడు తీవ్రమైన వేధింపులు ఎదుర్కొన్నారు. తమ కుటుంబంతోపాటు వైఎస్సార్సీపీ చేస్తున్న మోసాలు, ఘోరాలను 2019-24 మధ్య కాలంలో ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించాడని చింతకాయల విజయ్ను టీడీపీ ఎంపిక చేసింది. వాస్తవంగా అసెంబ్లీ ఎన్నికల్లో చింతకాయల అయ్యన్నపాత్రుడి కన్నా అతడి కుమారుడు విజయ్కు ఇవ్వాలని భావించారు. కానీ అప్పుడు ఉన్న పరిస్థితుల్లో కుదరకపోగా.. అధికారంలోకి వచ్చిన తర్వాత అయ్యన్నపాత్రుడికి స్పీకర్ పదవితోనే సరిపెట్టారు. దీంతో అతడు పార్టీకి చేస్తున్న సేవలను గుర్తించి ఇప్పుడు అయ్యన్నపాత్రుడి కుమారుడికి రాజ్యసభ అవకాశం కల్పించారు.
పార్టీకి వెన్నంటి ఉండి
కష్టపడే వారికి, కష్టకాలంలో నిలబడిన వారికి పదవులు దక్కుతాయని విజయ్ ఎంపికతో టీడీపీ నిరూపించింది. తండ్రి అయ్యన్నపాత్రుడు స్పీకర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నప్పటికీ.. పార్టీకి విజయ్ చేసిన సేవలను గుర్తుపెట్టుకుని చంద్రబాబు రాజ్యసభకు పంపిస్తున్నారు. ఇక అందరూ ఊహించినట్టుగానే సుదీర్ఘ కాలంగా పార్టీకి వెనకుండి పని చేసిన భాష్యం రామకృష్ణకు రాజ్యసభ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. తన వ్యాపార సంస్థలపై వైఎస్సార్సీపీ ప్రభుత్వం అనేక వేధింపులకు పాల్పడినప్పటికీ టీడీపీ కోసం రామకృష్ణ నిలబడ్డారు.
సానా సతీశ్
పార్టీకి సేవలు అందిస్తున్న సానా సతీశ్కు టీడీపీ రాజ్యసభ సభ్యత్వం ఖరారు చేసింది. 2019-24 మధ్య క్లిష్ట సమయంలో టీడీపీలో కీలకంగా వ్యవహరించిన సానా సతీశ్కు రెండోసారి రాజ్యసభ సభ్యుడిగా చంద్రబాబు అవకాశం కల్పించారు. మరోసారి పొడగించడంతో మరో ఆరేళ్ల పాటు సానా సతీశ్ రాజ్యసభ సభ్యుడిగా కొనసాగనున్నారు. అవకాశం దక్కని ఆశావహులకు రానున్న రోజుల్లో వేర్వేరు పదవులను కేటాయించేందుకు టీడీపీ సిద్ధమైంది. కష్టపడి పని చేసిన ప్రతి ఒక్కరికీ పదవి లభిస్తుందని తాజాగా రాజ్యసభ అభ్యర్థుల ప్రకటనతో అర్థమవుతోంది.
Sthree Ride: మహిళలకు గుడ్ న్యూస్.. ర్యాపిడో, ఉబర్, ఓలాకు ప్రత్యామ్నాయం 'స్త్రీ రైడ్'
Hyderabad, Telangana:Sthree Ride Movo Fleet App: తెలంగాణ మహిళలకు ప్రభుత్వం భారీ శుభవార్త వినిపించింది. హైదరాబాద్ నగరంలో నివసిస్తున్న మహిళలకు సరికొత్త రవాణా వ్యవస్థను తీసుకువచ్చారు. నగరంలో ఎక్కడికైనా వెళ్లాలంటే ప్రజా రవాణా వ్యవస్థ కాకుండా యాప్లను వినియోగిస్తుండగా.. వారికి సరికొత్త వ్యవస్థను ప్రభుత్వం పరిచయం చేసింది. ఉబర్, ర్యాపిడో, ఓలా తదితర యాప్లలో బైక్ లేదా కార్లను బుక్ చేసుకున్నప్పుడు పురుష డ్రైవర్లు వస్తుంటారు. రైడింగ్ సమయంలో పురుష డ్రైవర్లతో మహిళలు ఇబ్బందులు ఎదుర్కొనేవారు. వేధింపులు, ఇబ్బందులను అధిగమించేందుకు ‘స్త్రీ రైడ్’ ప్రాజెక్ట్ తీసుకువచ్చారు. ప్రస్తుతం అమలులో ఉన్న ప్రధాన యాప్లకు ప్రత్యామ్నాయంగా ఈ యాప్ను తెలంగాణ పోలీసుల ఆధ్వర్యంలో ప్రారంభమైంది. ఈ యాప్లో మహిళలు రైడర్లుగా ఉండడం విశేషం. ఇకపై మహిళలు తమ ప్రయాణాల కోసం ‘మోవో ఫ్లీట్ యాప్ (Movo Fleet App)’ డౌన్లోడ్ చేసుకుని రైడ్ బుక్ చేసుకుంటే.. మహిళా డ్రైవర్లే వచ్చి గమ్యస్థానానికి చేరుస్తారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
తెలంగాణ రాష్ట్ర పోలీస్ విభాగానికి చెందిన ‘విమెన్ సేఫ్టీ వింగ్’ ఆధ్వర్యంలో ‘స్త్రీ రైడ్’ పేరుతో ప్రత్యేక రవాణా వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చింది. ర్యాపిడో తరహాలో మహిళా ప్రయాణికుల కోసం మహిళా డ్రైవర్లనే అందుబాటులోకి తీసుకువచ్చింది. ‘మోవో ఫ్లీట్ యాప్’ యాప్ ద్వారా బైక్ సేవలను ప్రారంభించింది. ఈ యాప్ వినియోగంతో మహిళలు ఎలాంటి భయం లేకుండా ప్రయాణించే అవకాశం ఏర్పడనుంది. ఈ యాప్ను డీజీపీ సీవీ ఆనంద్ ప్రారంభించారు.
హైదరాబాద్లోని తన కార్యాలయంలో జెండా ఊపి డీజీపీ సీవీ ఆనంద్ ‘మోవో ఫ్లీట్ యాప్’ యాప్ ద్వారా బైక్ ప్రయాణ సేవలను ప్రారంభించి మాట్లాడారు. మహిళలకు ఆర్థిక స్వావలంబన, ఆత్మవిశ్వాసం కల్పించేలా.. ఆర్థికంగా వారి కాళ్లపై వారు నిలబడేలా ఈ రవాణా సౌకర్యాన్ని ప్రవేశపెట్టినట్లు డీజీపీ తెలిపారు. నాలుగు నెలల్లో మహిళా రైడర్ల సంఖ్యను మూడింతలు పెంచాలని కోరారు. మహిళల ఉపాధి, సాధికారతకు ప్రభుత్వం పూర్తి మద్దతు ఇస్తోందని చెప్పారు.
స్త్రీ రైడర్లు
ఈ కార్యక్రమంలో భాగంగా తొలి విడతలో 55 మంది మహిళలను ‘స్త్రీ రైడర్లు’గా ఎంపిక చేశారు. మహిళా రైడర్లు 55 మందికి అంబర్పేట్ పోలీస్ లైన్స్లో విమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో టూ వీలర్, త్రీ వీలర్, ఫోర్ వీలర్ వాహనాలను నడపడంలో ప్రత్యేకంగా డ్రైవింగ్ శిక్షణ కల్పించారు. విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న మహిళా రైడర్లకు ఉమెన్స్ సేఫ్టీ వింగ్ ద్వారా డ్రైవింగ్ లైసెన్సులను అందించారు.
పురుషులకు ఏమాత్రం తీసిపోకుండా టూ వీలర్, ఫోర్ వీలర్ వాహనాలను మహిళలు నడిపేందుకు స్త్రీ రైడ్ యాప్ను తీసుకువచ్చారు. మహిళలపై జరిగే వేధింపులు నివారించేందుకు.. ఆత్మరక్షణ విషయంలో కూడా విమెన్ సేఫ్టీ వింగ్ ప్రాధాన్యం ఇస్తోంది. ఈ వ్యవస్థ రవాణా కోసమే కాకుండా.. అత్యవసర పరిస్థితుల్లో చిక్కుకున్న మహిళలకు తక్షణ సేవలు అందించడానికి స్త్రీ రైడర్లు అందుబాటులో ఉండనున్నారు. మహిళా ప్రయాణికులకు రక్షణ కల్పించడమే కాకుండా మహిళలకు ఉపాధి మార్గం కల్పించేందుకు ఈ అవకాశం కల్పించింది.
School 21 In Russia: టీచర్లు, క్లాస్రూమ్లు లేని సరికొత్త 'స్కూల్ 21'.. విద్యాశాఖలో విప్లవాత్మక మార్పుల కోసం నారా లోకేష్, శ్రీకృష్ణ దేవరాయలు పర్యటన!
Vijayawada, Andhra Pradesh:School 21 In Russia News: ఆంధ్రప్రదేశ్ విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ రష్యా పర్యటనలో భాగంగా మాస్కోలోని వినూత్నమైన భవిష్యత్ పాఠశాల 'స్కూల్ 21' (School 21)ను సందర్శించారు. పార్లమెంట్ టీడీపీ ఫ్లోర్ లీడర్ ఎంపీ లావు శ్రీ కృష్ణ దేవరాయలుతో కలిసి ఆయన సాంప్రదాయ విద్యావిధానానికి భిన్నంగా, సరికొత్త సాంకేతికతతో నడుస్తున్న ఈ పాఠశాల పనితీరును, అక్కడ అనుసరిస్తున్న విద్యా పద్ధతులను నిర్వాహకులు, విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.
రష్యాకు చెందిన ప్రముఖ 'స్బేర్బ్యాంక్' (Sberbank) ప్రారంభించిన ఈ ఉచిత ప్రోగ్రామింగ్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ విద్యా కార్యక్రమం అంతర్జాతీయంగా ఎంతో గుర్తింపు పొందింది. ఫ్రెంచ్ కోడింగ్ స్కూల్ 'ఎకోల్ 42' రూపొందించిన వినూత్న విద్యా పద్ధతులను పాటిస్తూ, ఇంటర్నేషనల్ 42 నెట్వర్క్లో భాగస్వామిగా ఈ సంస్థ పనిచేస్తోంది.
'స్కూల్ 21' ప్రధాన ప్రత్యేకతలు
ఈ పాఠశాల ప్రపంచంలోని మిగిలిన విద్యాసంస్థల కంటే భిన్నంగా ఉండటానికి ప్రధాన కారణాలు కొన్ని ఉన్నాయి.
1) ఉపాధ్యాయులు, ఉపన్యాసాలు ఉండవు.. ఇక్కడ సాంప్రదాయ పద్ధతిలో పాఠాలు చెప్పే టీచర్లు గానీ, బోర్డులు, క్లాస్రూమ్లు గానీ ఉండవు.
2) తోటి విద్యార్థులే ఇక్కడ అధ్యాపకులు. విద్యార్థులు పూర్తిగా గేమిఫైడ్, ప్రాజెక్ట్-ఆధారిత పనుల ద్వారా ఒకరికొకరు సహాయం చేసుకుంటూ నేర్చుకుంటారు. ఒకరు రాసిన కోడ్ను మరొకరు పరిశీలించి, మూల్యాంకనం చేసుకుంటారు.
3) స్బేర్బ్యాంక్ ఈ ప్రోగ్రామ్కు పూర్తిగా నిధులు సమకూరుస్తుంది. ఎంపికైన అభ్యర్థుల నుంచి ఎటువంటి ట్యూషన్ ఫీజు వసూలు చేయరు. ఎలాంటి ఆర్థిక భారం లేకుండా ఐటీ, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చదివే అవకాశం ఇక్కడ లభిస్తుంది.
4) ఈ క్యాంపస్లు ఏడాది పొడవునా, రోజులో 24 గంటలూ అందుబాటులో ఉంటాయి. విద్యార్థులు తమ సౌకర్యాన్ని బట్టి, నచ్చిన సమయంలో వచ్చి చదువుకోవచ్చు.
విభిన్నమైన ఎంపిక ప్రక్రియ
ఈ వినూత్న స్కూల్లో ప్రవేశం పొందడానికి అభ్యర్థి గత విద్యా ప్రతిభ, డిగ్రీలు లేదా ముందస్తు కోడింగ్ పరిజ్ఞానంతో ఎలాంటి సంబంధం లేదు. ఎంపిక ప్రక్రియ పూర్తిగా భిన్నంగా ఉంటుంది. దరఖాస్తుదారులు మొదట ఆన్లైన్ కాగ్నిటివ్ పరీక్షను పూర్తి చేయాలి. పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి కొన్ని వారాల పాటు ఇంటెన్సివ్ ఆన్-సైట్ ఎంపిక శిబిరం నిర్వహిస్తారు. దీనిని ఫ్రెంచ్ భాషలో 'స్విమ్మింగ్ పూల్' అని పిలుస్తారు.
ఈ శిబిరంలో అభ్యర్థుల సమస్య పరిష్కార నైపుణ్యాలను, క్లిష్ట పరిస్థితులకు తట్టుకునే సామర్థ్యాన్ని ప్రత్యక్షంగా పరీక్షించి, వారి ప్రతిభ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు. భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా ఐటీ రంగంలో నైపుణ్యం కలిగిన యువతను తయారుచేయడానికి ఇలాంటి వినూత్న విద్యా విధానాలు ఎంతగానో దోహదపడతాయని ఈ సందర్భంగా నిర్వాహకులు మంత్రి నారా లోకేష్కు వివరించారు. ఈ పర్యటనలో నారా లోకేష్ వెంట నరసరావుపేట ఎంపీ శ్రీకృష్ణ దేవరాయులుతో పాటు పలువురు ప్రభుత్వ అధికారులు ఉన్నారు.
Also Read: పవన్ కల్యాణ్ 'ఓజీ' సినిమా చూపిస్తూ మహిళకు సర్జరీ..ఏపీలో బ్రెయిన్ సర్జరీ సక్సెస్!
Also Read: విద్యార్థులు ఎగిరి గంతేసే వార్త..స్కూళ్లకు మరోసారి వరుస సెలవులు..రీఓపెన్ రోజే సెలవు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Zee Short Film Contest 2026: జీ స్టూడియోస్లో సినిమా ఛాన్స్..! విజేతలకు రూ.5 లక్షల బహుమతి!
Mumbai, Maharashtra:Zee Short Film Contest 2026 News: భారతదేశపు ప్రముఖ వినోద, సాంకేతిక సంస్థ 'జీ' (ZEE) దేశవ్యాప్తంగా నిర్వహించిన 'జీ షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ 2026' ముగింపు వేడుక ముంబైలోని గ్రాండ్ హయత్ హోటల్లో అత్యంత వైభవంగా జరిగింది. దేశంలోని విభిన్న భాషలకు చెందిన ప్రతిభావంతులైన యువ సృష్టికర్తలను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ పోటీలను నిర్వహించారు. 8 భాషల నుండి తుది రౌండ్కు ఎంపికైన లఘు చిత్రాల విజేతలకు భారీ నగదు బహుమతులతో పాటు, వెండితెరకు పరిచయమయ్యే అరుదైన అవకాశం దక్కింది.
వేడుకలోని ముఖ్య విశేషాలు
1) జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ వ్యవస్థాపకులు, గౌరవ ఛైర్మన్ డాక్టర్ సుభాష్ చంద్ర ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. యువ దర్శకులు తమ సృజనాత్మకతతో భారతీయ సినిమా భవిష్యత్తును సరికొత్తగా తీర్చిదిద్దాలని ఆయన ఆకాంక్షించారు.
2) కథలు చెప్పడంలో జీ గ్రూప్నకు ఉన్న 33 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణాన్ని ఈ సందర్భంగా Z గ్రూప్ సీఈఓ పునీత్ గోయెంకా గుర్తుచేసుకున్నారు. ఈ పోటీల్లో ఎంపికైన యువతను జీ గ్రూప్ 'తదుపరి తరం సృష్టికర్తలు'గా ఆయన అభివర్ణించారు.
3) ప్రముఖ సినీ విమర్శకుడు రాజీవ్ మసంద్ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో దేశవ్యాప్తంగా విచ్చేసిన స్టార్ డైరెక్టర్లు పాల్గొన్నారు. ప్రాంతీయ సినిమా ప్రాధాన్యత, సాంకేతికత, భారతీయ చిత్ర పరిశ్రమ భవిష్యత్తుపై వారు ఆసక్తికర చర్చ జరిపారు.
విజేతలను ఎంపిక చేసిన దిగ్గజ దర్శకులు (జ్యూరీ)
భారతదేశంలోని వివిధ భాషలకు చెందిన ప్రముఖ దర్శకులు ఈ పోటీకి న్యాయనిర్ణేతలుగా వ్యవహరించి విజేతలను ఎంపిక చేశారు.
1) అనురాగ్ కశ్యప్ (హిందీ)
2) పి. సముద్రకని (తమిళం)
3) లిజో జోస్ పెల్లిస్సేరీ (మలయాళం)
4) హేమంత్ రావు (కన్నడ)
5) రవి జాదవ్ (మరాఠీ)
6) శ్రీజిత్ ముఖర్జీ (బెంగాలీ)
బహుమతుల వివరాలు
యువ ప్రతిభను ఆర్థికంగా ఊతమిచ్చేందుకు డాక్టర్ సుభాష్ చంద్ర విజేతలకు కింది విధంగా నగదు బహుమతులను ప్రకటించారు.
మొదటి స్థానం (ప్రతి భాషలో): రూ.5 లక్షలు
రెండవ స్థానం (ప్రతి భాషలో): రూ.2.5 లక్షలు
ప్రత్యేక విభాగాలు: ఉత్తమ నటీనటులు, రచయితలు, సినిమాటోగ్రాఫర్లు, ఎడిటర్లు, సంగీత దర్శకులు, హాస్యనటులకు ఒక్కొక్కరికి రూ.1 లక్ష చొప్పున బహుమతి అందించారు.
షార్ట్ ఫిల్మ్ నుండి వెండితెరపైకి..
ఈ పోటీ కేవలం నగదు బహుమతులకే పరిమితం కాకుండా, యువ సృష్టికర్తలకు సినీ పరిశ్రమలోకి నేరుగా ప్రవేశించే అద్భుతమైన అవకాశాన్ని కల్పించింది. ప్రతి భాషలోనూ మొదటి రెండు స్థానాల్లో నిలిచిన విజేతలకు, తమ పూర్తి నిడివి కథను జీ స్టూడియోస్ (Zee Studios)కు వివరించే అవకాశం లభిస్తుంది. అందులో ఎంపికైన ఒక ఉత్తమ కథను జీ స్టూడియోస్ స్వయంగా భారీ స్థాయిలో నిర్మించనుంది. ఈ విధంగా 'జీ షార్ట్ ఫిల్మ్ కాంపిటీషన్' యువ దర్శకులకు షార్ట్ ఫిల్మ్స్ నుండి నేరుగా వెండితెరపైకి అడుగుపెట్టడానికి ఒక బలమైన వారధిగా నిలిచింది.
Also Read: స్వర్గానికి దారి చూపిస్తానంటూ ఊరిస్తున్న బిగ్బాస్ బ్యూటీ దివి..జిమ్లో అందాల ఆరబోత!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Hockey Asia Cup 2026: ఆసియా క్రీడల్లో టీమ్ఇండియా జయకేతనం..జపాన్ను మట్టికరిపించి మూడోసారి టైటిల్ కైవసం!
New Delhi, Delhi:Hockey Asia Cup 2026 Winner: భారత హాకీ జట్టు అంతర్జాతీయ వేదికపై మరోసారి సత్తా చాటింది. జపాన్లో జరిగిన పురుషుల అండర్-18 ఆసియా కప్ 2026 ఫైనల్లో భారత జట్టు అద్భుత ప్రదర్శనతో ఆతిథ్య జపాన్ను 4-1 తేడాతో ఘోరంగా ఓడించింది. ఈ విజయంతో భారత్ రికార్డు స్థాయిలో మూడవసారి ఆసియా కప్ టైటిల్ను కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది. మరోవైపు అంతకుముందు జరిగిన మహిళల విభాగంలో భారత అండర్-18 మహిళల జట్టు దక్షిణ కొరియాపై 3-0తో ఘనవిజయం సాధించి కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది.
మ్యాచ్ హైలైట్స్..
మ్యాచ్ ప్రారంభమైన క్షణం నుంచే భారత్ ఆతిథ్య జట్టుపై పూర్తి ఆధిపత్యం చెలాయించింది. తొలి క్వార్టర్ (90 సెకన్లు)లో ఆట మొదలైన తొలి నిమిషంలోనే భారత్కు పెనాల్టీ కార్నర్ లభించింది. దీనిని ఆశిష్ తాని పుర్తి అద్భుతమైన గోల్గా మలిచి భారత్కు 1-0 ఆధిక్యాన్ని అందించారు.
రెండో క్వార్టర్లో జపాన్ ఎదురుదాడికి దిగినప్పటికీ భారత రక్షణ విభాగం పటిష్టంగా నిలబడింది. 28వ నిమిషంలో తాని పుర్తి మరో గోల్ చేసి ఆధిక్యాన్ని 2-0కి పెంచారు. ఆ వెంటనే 30వ నిమిషంలో కెప్టెన్ కేతన్ కుష్వాహ మెరుపు గోల్ చేయడంతో విరామ సమయానికి భారత్ 3-0తో తిరుగులేని స్థితికి చేరింది.
అలాగే మూడో క్వార్టర్ (34వ నిమిషం)లో వరీందర్ సింగ్ అందించిన పాస్తో లభించిన పెనాల్టీ కార్నర్ను తాని పుర్తి మళ్లీ గోల్గా మార్చి తన హ్యాట్రిక్ పూర్తి చేశాడు. దీంతో భారత్ 4-0తో విజయాన్ని ఖరారు చేసుకుంది. చివరిగా ఆఖరి క్వార్టర్ (52వ నిమిషం)లో జపాన్ ఆటగాడు నుమడ గాకు ఒక ఓదార్పు గోల్ చేసినప్పటికీ, అది జపాన్ ఓటమిని తప్పించలేకపోయింది. చివరికి భారత్ 4-1తో జయభేరి మోగించింది.
అవార్డుల్లోనూ భారత హవా!
టోర్నమెంట్లో అద్భుత ప్రదర్శన చేసిన భారత ఆటగాళ్లకు ప్రత్యేక అవార్డులు దక్కాయి. ఫైనల్లో హ్యాట్రిక్ కొట్టిన ఆశిష్ తాని పుర్తికి 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' దక్కింది. అంతేకాదు టోర్నమెంట్లో మొత్తం 13 గోల్స్తో ఆయన 'టాప్ స్కోరర్'గా నిలిచారు. మరోవైపు భారత గోల్కీపర్ ఆయుష్ రజాక్ టోర్నమెంట్ 'బెస్ట్ గోల్కీపర్' అవార్డును గెలుచుకున్నారు. మహిళల విభాగంలో భారత మహిళా జట్టు కాంస్య పతకాన్ని గెలుచుకుంది. ఇందులో నౌషీన్ నాజ్ 12 గోల్స్తో మహిళల టోర్నమెంట్లో టాప్ స్కోరర్గా నిలిచింది.
హాకీ ఇండియా భారీ నజరానాలు!
విజేతలుగా నిలిచిన భారత జట్లకు హాకీ ఇండియా భారీ నగదు బహుమతులను ప్రకటించింది. పురుషుల U-18 జట్టులో ఒక్కో ఆటగాడికి రూ. 3 లక్షలు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. అదే విధంగా పురుషుల జట్టులోని సహాయక సిబ్బందికి రూ.1.5 లక్షలు చొప్పున ఇవ్వనున్నారు. అదే విధంగా ఆసియా క్రీడల్లో కాంస్య పతకం సాధించిన మహిళల అండర్-18 జట్టులో ఒక్కో ప్లేయర్కు రూ.1 లక్ష.. అలాగే మహిళా జట్టు సహాయకులకు రూ.50,000 చొప్పున నజరానా ఇవ్వనున్నట్లు హాకీ ఇండియా ప్రకటించింది.
Also REad: "కోహ్లీ అందుకే ఇండియాలో ఉండడానికి ఇష్టపడడు!" ఇంగ్లాండ్ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు!
Also Read: భారీగా పడిపోయిన బంగారం ధరలు..రూ.3,000 తగ్గిన గోల్డ్ రేట్..10గ్రా. ఎంతంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
OG Movie Brain Surgery: పవన్ కల్యాణ్ 'ఓజీ' సినిమా చూపిస్తూ మహిళకు సర్జరీ..ఏపీలో బ్రెయిన్ సర్జరీ సక్సెస్!
Vijayawada, Andhra Pradesh:OG Movie Brain Surgery News: వైద్యరంగంలో సాంకేతికత, అద్భుతాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. రోగికి స్పృహ తప్పించకుండా, వారు ఇష్టపడే విషయాల్లో ముంచెత్తుతూ శస్త్రచికిత్సలు చేయడం ఇటీవల ఎక్కువైంది. తాజాగా ప్రకాశం జిల్లాలో ఇటువంటి ఒక అరుదైన, ఆసక్తికరమైన మెడికల్ వండర్ చోటుచేసుకుంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన 'ఓజీ' (OG) సినిమా చూపిస్తూ ఒక మహిళకు వైద్యులు విజయవంతంగా బ్రెయిన్ సర్జరీ పూర్తి చేశారు.
అసలేం ఏం జరిగిందంటే?
ప్రకాశం జిల్లా దర్శి ప్రాంతానికి చెందిన కోటేశ్వరమ్మ అనే మహిళ కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల ఆమె ఒక్కసారిగా మూర్ఛ (ఫిట్స్) వచ్చి కింద పడిపోయారు. ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించారు.
వైద్యులు ఆమెకు MRI (ఎంఆర్ఐ) స్కాన్ టెస్ట్ చేసి చూడగా.. మెదడులో ఒక గడ్డ (బ్రెయిన్ టూమర్) ఉన్నట్లు నిర్ధారణ అయింది. అయితే, ఈ సర్జరీ అత్యంత సున్నితమైనది కావడంతో ఆమెకు పూర్తిగా స్పృహ తప్పించకుండా.. మెలకువగా ఉన్నప్పుడే ఆ గడ్డను తొలగించాలని డాక్టర్ల బృందం నిర్ణయించింది.
'ఓజీ' చూపిస్తూ చూపిస్తూ సర్జరీ..
రోగికి సర్జరీ సమయంలో ఎలాంటి భయం లేకుండా, ప్రశాంతంగా ఉంచేందుకు ఆమె ఇష్ట దైవం లేదా అభిమాన నటుడి గురించి వైద్యులు అడిగి తెలుసుకున్నారు. కోటేశ్వరమ్మకు పవన్ కల్యాణ్ అంటే విపరీతమైన అభిమానం అని తెలియడంతో.. వైద్యులు ఒక వినూత్న ప్రయోగం చేశారు.
ఆపరేషన్ థియేటర్లోనే ఆమెకు ఎదురుగా స్క్రీన్ ఏర్పాటు చేసి, పవన్ కల్యాణ్ నటిస్తున్న 'OG' సినిమా (గ్లింప్స్/పాటలు/వీడియోలు) ప్లే చేశారు. కోటేశ్వరమ్మ ఆ సినిమాను ఆసక్తిగా చూస్తూ, మెలకువగా ఉన్న సమయంలోనే వైద్యులు చాలా చాకచక్యంగా శస్త్రచికిత్సను ప్రారంభించారు.
సినిమా చూస్తూ ఆమె పరధ్యానంలో ఉండటంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా మెదడులోని గడ్డను వైద్యులు విజయవంతంగా తొలగించారు. ప్రస్తుతం కోటేశ్వరమ్మ కోలుకుంటున్నట్లు సమాచారం. రోగి అభిమానాన్ని సైతం వైద్య చికిత్సకు అనుకూలంగా మార్చుకుని అరుదైన సర్జరీని సక్సెస్ చేసిన డాక్టర్ల బృందాన్ని స్థానికులు, పవన్ కల్యాణ్ అభిమానులు అభినందిస్తున్నారు.
Also Read: విద్యార్థులు ఎగిరి గంతేసే వార్త..స్కూళ్లకు మరోసారి వరుస సెలవులు..రీఓపెన్ రోజే సెలవు!
Also Read: భారీగా పడిపోయిన బంగారం ధరలు..రూ.3,000 తగ్గిన గోల్డ్ రేట్..10గ్రా. ఎంతంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Free Bus To Students: విద్యార్థులకు తెలంగాణ సీఎం తీపి కబురు.. త్వరలో ఉచితంగా స్కూల్ బస్సు
Baddipadaga, Telangana:Free Bus To School Students: వేసవి సెలవులు ముగిసిపోతున్న వేళ మళ్లీ విద్యాలయాలకు వెళ్లేందుకు విద్యార్థులు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి విద్యార్థులకు భారీ వరం ప్రకటించారు. విద్యాలయాలకు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్న విద్యార్థులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని ప్రకటించారు. ఇళ్ల నుంచి స్కూళ్లకు ఉచితంగా బస్సులు నడిపించే ఆలోచన చేస్తున్నట్లు ప్రకటన చేశారు. అంతేకాకుండా అవసరమైన చోట ఉచితంగా ట్యూషన్స్ కూడా ఏర్పాటుచేస్తామని తెలిపారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
బెంగళూరులో ఓ ప్రముఖ ఆంగ్ల మీడియా సంస్థ నిర్వహించిన సదస్సులో తెలంగాణ ముఖ్యమంత్రి పాల్గొని కీలక వ్యాఖ్యలు చేశారు. దేశ, రాష్ట్ర రాజకీయాలను ప్రస్తావిస్తూ.. అంతేకాకుండా తెలంగాణ పరిపాలన, విధానపరమైన నిర్ణయాలపై కీలక ప్రకటన చేశారు. ఈ క్రమంలో విద్యా శాఖ మంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి విద్యార్థులకు సంబంధించి రెండు ప్రకటనలు చేశారు. 'ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఉచితంగా స్కూల్ బస్ సదుపాయం అందిస్తాం' అని రేవంత్ రెడ్డి తెలిపారు.
సీక్రెట్ ఏమిటంటే
ప్రైవేటు పాఠశాలలు విజయవంతం కావడం వెనుక సీక్రెట్ ఏమిటంటే స్కూల్ బస్సులు అని రేవంత్ రెడ్డి వివరించారు. ఇంటి నుంచి విద్యార్థిని తీసుకుని పాఠశాలకు పంపించి.. తర్వాత మళ్లీ పాఠశాల నుంచి విద్యార్థిని ఇంటి నుంచి చేర్చే పనిని తాము చేయబోతున్నట్లు తెలంగాణ సీఎం తెలిపారు. 'ఉద్యోగులు, ఉన్నత వర్గాల పిల్లలు నర్సరీ, ఎల్కేజీ, యూకేజీకి వెళుతున్నారు. ప్రభుత్వ పాఠశాల్లలో ఒకటో తరగతి నుంచి మొదలుపెడుతున్నారు దీన్ని మార్చేందుకు మేం ప్రీ స్కూల్స్ను ప్రవేశపెడుతున్నాం' అని ప్రకటన చేశారు.
అన్నీ సౌకర్యాలు
'27 వేల ప్రభుత్వ పాఠశాలలు ఉంటే 18 లక్షలు మంది పిల్లలు ఉన్నారు. 12 వేల ప్రైవేటు పాఠశాలలు ఉంటే వాటిలో 35 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు అత్యుత్తమ అర్హతలు ఎంఏ, పీహెచ్డీ చేసిన వారు ఉన్నా ప్రీ స్కూల్ లేకపోవడంతో పిల్లలు రావడం లేదు. ఎందుకంటే రవాణా సమస్య. ప్రైవేటు స్కూళ్లకు ట్రాన్స్పోర్ట్ సౌకర్యం ఉండడంతో వారి మాదిరి పిల్లలకు రవాణా సౌకర్యం కల్పిస్తాం' అని వివరించారు. 'మేం కూడా రవాణా సౌకర్యం కల్పించడంతో పాటు పిల్లలకు టిఫిన్, మధ్యాహ్న భోజనం ఇస్తున్నాం' అని తెలంగాణ సీఎం వెల్లడించారు. పాఠశాల అనంతరం అవసరమైన చోట ఉచితంగానే ట్యూషన్స్ సౌకర్యం కల్పించే ఆలోచనలు చేస్తున్నట్లు తెలంగాణ సీఎం తెలిపారు. కార్పొరేట్ సంస్థలు సీఎస్ఆర్ నిధులతో ట్యూటర్లను నియమించి విద్యార్థులకు పాఠాలు చెప్పించే ప్రయత్నం చేస్తున్నట్లు రేవంత్ రెడ్డి చెప్పారు.
స్నేహపూర్వక మ్యాచ్
'ప్రతిపక్షంగా పోరాడతాం. కేంద్ర ప్రభుత్వ వివక్షపై పోరాడతా. మా దగ్గర పెట్టుబడులకు అనుమతులు ఇచ్చే విషయంలో వాళ్లు గుజరాత్ వెళ్లి పెట్టుబడులు పెట్టమంటున్నారు. ఇది మేం ఎదుర్కొంటున్నాం' అని రేవంత్ రెడ్డి తెలిపారు. పెట్టుబడుల సాధన విషయంలో పొరుగు రాష్ట్రాలతో స్నేహపూర్వక మ్యాచ్ ఆడతామని పేర్కొన్నారు. మోదీ మహిళా రిజర్వేషన్ల పేరుతో రాజకీయ జిమ్మిక్కులు చేస్తున్నారని విమర్శించారు. పార్లమెంట్ సీట్ల పెంపును మహిళా రిజర్వేషన్ బిల్లుతో ముడిపెట్టడాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్లు రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పని చేసే దక్షిణాది రాష్ట్రాలను శిక్షించవద్దని కోరుతున్నట్లు తెలిపారు.
Pawan Kalyan Telangana: "పవన్ కల్యాణ్ సభ పెడితే మీకెంటి నొప్పి..తెలంగాణ ముసుగులో అరాచకాలు చేస్తే ఊరుకోం"
Hyderabad, Telangana:Pawan Kalyan On Telangana: తెలంగాణ ఆవిర్భావ దినం రోజున ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రెస్ మీట్ పెట్టిన సంగతి తెలిసిందే. అయితే అదే రోజున జనసేన పార్టీ ఏర్పాటు చేయాల్సిన సభకు పోలీసులు అనుమతి ఇవ్వని నేపథ్యంలో ఆయన తన ఇంటి వద్ద ప్రెస్ మీట్ నిర్వహించారు. అయితే దీనిపై పలు తెలంగాణ నాయకులు విమర్శలు చేయగా..తాజాగా ప్రముఖ జర్నలిస్టు కప్పర ప్రసాద్ పవన్ కల్యాణ్ చెప్పిన మాటల్లో తప్పేం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. అనవసరంగా తెలంగాణ వాదం ముసుగులో అరచకాలు చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. అలాంటి వాళ్లను సహించేది లేదని ఆయన దుయ్యబట్టారు.Vaibhav Sooryavanshi: సచిన్ రికార్డు బ్రేక్ చేసిన బుడ్డోడు.. వైభవ్ సూర్యవంశీ ఘనత ఇదే!
Wadgaon, Maharashtra:Vaibhav Sooryavanshi: ఐపీఎల్లో తన పరుగులతో ఊచకోత కోస్తున్న బుడ్డోడు వైభవ్ సూర్యవంశీ భారత జాతీయ జట్టులోకి దూసుకొచ్చాడు. ఐర్లాండ్, ఇంగ్లండ్ సిరీస్లకు జాతీయ జట్టులో వైభవ్ సూర్యవంశీ ఎంపికయ్యాడు. జట్టుకు ఎంపికవడంతో వైభవ్ సూర్యవంశీ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రికార్డును అధిగమించాడు. అతి పిన్న వయసులో భారత జట్టులోకి వచ్చిన ప్లేయర్గా వైభవ్ రికార్డు నెలకొల్పాడు. ఇన్నాళ్లు సచిన్ పేరిట ఉన్న రికార్డును పోరడు తిరగరాశాడు.
భారత జట్టు నుంచి పిలుపు రావడంతో సచిన్ టెండూల్కర్ 36 ఏళ్ల రికార్డును వైభవ్ సూర్యవంశీ బద్దలు కొట్టాడు. 2026 జూన్లో ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనల కోసం సీనియర్ పురుషుల టీ20 అంతర్జాతీయ జట్టును బీసీసీఐ ఎంపిక చేసిన విషయం తెలిసిందే. భారత జట్టుకు ఎంపికైన అతి పిన్న వయస్కుడైన క్రికెటర్గా వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు.
15 ఏళ్ల బ్యాటింగ్ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్ తరఫున అదరగొట్టిన విషయం తెలిసిందే. ఐపీఎల్ తర్వాత భారత జాతీయ జట్టుకు తొలిసారిగా పిలుపు లభించింది.
జూన్ 2026లో ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటన కోసం సీనియర్ పురుషుల టీ20 జట్టుకు ఎంపికై వైభవ్ చరిత్ర సృష్టించాడు. గతంలో ఈ రికార్డు సచిన్ టెండూల్కర్ పేరిట ఉండేది. సచిన్ 16 ఏళ్ల వయసులో భారత జట్టుకు ఎంపికవగా.. వైభవ్ 15 ఏళ్ల వయసులో ఎంపికయ్యాడు. భారత జట్టులోకి సచిన్ టెండూల్కర్ 16 ఏళ్ల 205 రోజులకు రాగా.. వైభవ్ సూర్యవంశీ 15 సంవత్సరాల 71 రోజుల వయస్సులో భారత జాతీయ జట్టులోకి అడుగుపెట్టాడు. దీంతో క్రికెట్ దేవుడు టెండూల్కర్ పేరిట ఉన్న రికార్డును అధిగమించి భారత క్రికెట్ జట్టులో ఆడిన అత్యంత పిన్న వయస్కుడైన ఆటగాడిగా వైభవ్ నిలిచాడు.
ఐర్లాండ్ టూర్
భారత జట్టు రెండు టీ20 మ్యాచ్ల కోసం జూన్ 26, 28 తేదీలలో ఐర్లాండ్కు వెళ్లనుంది.
ఇంగ్లండ్ టూర్
జూలై 1 నుంచి 11 మధ్య ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడనుంది.
ఐర్లాండ్, ఇంగ్లాండ్ టీ20 సిరీస్కు భారత జట్టు ఇదే
శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, శివమ్ దూబే, తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, మహ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా, అర్ష్దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్షిబ్, ప్రిన్స్ యాదవ్, వైభవ్ సూర్యవంశీ.
తెలంగాణకు చెందిన తిలక్ వర్మకు ప్రమోషన్ లభించింది. ఆసియాకప్లో అదరగొట్టిన తిలక్వర్మ అనంతరం ఐపీఎల్లో దుమ్మురేపాడు. నిలకడగా ఆడుతూ అద్భుతాలు చేస్తున్న తిలక్కు బీసీసీఐ వైస్ కెప్టెన్గా పదోన్నతి కల్పించింది. ఐర్లాండ్, ఇంగ్లాండ్ టూర్లకు శ్రేయస్ అయ్యర్ సారథ్యం వహించనుండగా.. మన తిలక్ వర్మ వైస్ కెప్టెన్సీ బాధ్యతలు నిర్వహించనున్నాడు. పదోన్నతి లభించడంతో తిలక్ వర్మ కుటుంబసభ్యులు, సన్నిహితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Buchi Babu Apology: ఎట్టకేలకు జాన్వీ కపూర్కు క్షమాపణ చెప్పిన 'పెద్ది' డైరెక్టర్..సినిమాలో ఆ సీన్లు కట్ చేస్తానని హామీ!
Hyderabad, Telangana:Buchi Babu Apology To Janhvi Kapoor: మెగా పవర్స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ కలయికలో రూపొందిన భారీ బడ్జెట్ చిత్రం 'పెద్ది'. దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కించిన ఈ సినిమా ఇటీవల థియేటర్లలో విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. అయితే ఇటీవలే ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు ఇప్పుడు తీవ్ర వివాదానికి దారితీశాయి. ఆ సీన్లపై వస్తున్న విమర్శలపై దర్శకుడు బుచ్చిబాబు స్పందించాడు.
సినిమాలో హీరోయిన్ పాత్రను చూపించిన విధానం, అలాగే కొన్ని సీన్లపై ప్రేక్షకుల నుంచే కాకుండా పలువురు సినీ సెలబ్రిటీల నుంచి కూడా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. సోషల్ మీడియా వేదికగా సినిమాపై వస్తున్న విమర్శలపై దర్శకుడు బుచ్చిబాబు స్పందించడమే కాకుండా.. తన తప్పును అంగీకరిస్తూ సోషల్ మీడియాలో క్షమాపణలు చెబుతు పోస్టు పెట్టాడు.
"క్షమాపణలు కోరుతున్నా: బుచ్చిబాబు"
దర్శకుడు బుచ్చిబాబు ఆ పోస్టు ద్వారా స్పందిస్తూ.. మహిళల పట్ల తనకు ఎప్పుడూ అపారమైన గౌరవం ఉంటుందని తన పోస్ట్లో పేర్కొన్నారు. "ఒక దర్శకుడిగా సినిమా ద్వారా ప్రేక్షకులను అలరించడం, వారిలో స్ఫూర్తి నింపడమే నా లక్ష్యం. ఎవరినీ అసౌకర్యానికి గురిచేయాలనో, అగౌరవపరచాలనో నేను అనుకోలేదు. 'పెద్ది' సినిమాలోని కొన్ని సన్నివేశాలపై వస్తున్న అభ్యంతరాలు, విమర్శలను మేము చాలా తీవ్రంగా పరిగణించాం. తెరపైన, తెర వెనుక కూడా మహిళలకు నేను ఇచ్చే గౌరవం ఎప్పటికీ తగ్గదు. ఎవరినైనా అగౌరవపరచడం నా ఉద్దేశం కాదు. ఈ సినిమాలోని కొన్ని సీన్లు మీ మనోభావాలను దెబ్బతీసి ఉంటే.. అందుకు నేను మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుతున్నాను" అని బుచ్చిబాబు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు.
అభ్యంతర సన్నివేశాల్లో మార్పు!
అభ్యంతరాలు, విమర్శలు తీవ్రం కావడంతో ఆయా సన్నివేశాలను సినిమాలో నుంచి తొలగించడమో లేదా మార్పులు చేయడమో చేస్తున్నట్లు దర్శకుడు అధికారికంగా ప్రకటించారు. సోషల్ మీడియాలో వస్తున్న వ్యతిరేకతను గమనించిన వెంటనే, వివాదస్పద సన్నివేశాల్లో మార్పులు చేయాలని చిత్రబృందం నిర్ణయించింది.
ప్రేక్షకులు ఆదరిస్తేనే సినిమా ఎదుగుతుందని, భవిష్యత్తులో కథలు రాసుకునేటప్పుడు అభిమానుల భావోద్వేగాలు, అంచనాలను దృష్టిలో పెట్టుకుని మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తామని బుచ్చిబాబు చెప్పారు.
ప్రతి మహిళా గౌరవానికి అర్హురాలని, రాబోయే రోజుల్లో మహిళలను మరింత శక్తిమంతంగా చూపించే కథలను చెప్పడానికి తాను కట్టుబడి ఉంటానని ఆయన స్పష్టం చేశారు. 'పెద్ది' సినిమాపై తమ అభిప్రాయాలను పంచుకున్న ప్రతి ఒక్కరికీ బుచ్చిబాబు ధన్యవాదాలు తెలిపారు.
Also REad: హీరోయిన్ త్రిషకు దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన సీఎం విజయ్..ఉపఎన్నికలో హీరోకి ఛాన్స్!
ALso Read: ప్రియమణి బర్త్డే స్పెషల్..42 ఏళ్లు వచ్చినా నీ అందానికి ఎవరూ సాటి రారు ప్రియా!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Hyderabad Police: బైక్ రైడర్లు, కారు డ్రైవర్లకు హైదరాబాద్ పోలీసుల స్ట్రాంగ్ వార్నింగ్
Hyderabad, Telangana:Hyderabad Bike Riders: హైదరాబాద్లో సాఫ్ట్వేర్ కంపెనీలు కొలువుదీరిన హైటెక్సిటీ, నాలెడ్జ్ సిటీ, టీ హబ్ వంటి ఐటీ కారిడార్ పరిసర ప్రాంతాల్లో బైక్ రైడర్లు, కారు డ్రైవింగ్తో హల్చల్ చేస్తున్న వారికి హైదరాబాద్ పోలీసులు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఉల్లంఘించి మరోసారి స్టంట్లు, రైడ్లకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కూకట్పల్లి జోన్ డీసీపీ రీతిరాజ్ హెచ్చరించారు. ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా రహదారులపై ప్రమాదకర విన్యాసాలు చేయడం, రాంగ్ పార్కింగ్ చేయడం, ట్రాఫిక్కు అంతరాయం కలిగించడం వంటి చర్యలను ఏమాత్రం ఉపేక్షించబోమని స్పష్టం చేశారు.
ముఖ్యంగా వారాంతాలైన శనివారం, ఆదివారం రోజుల్లో ప్రత్యేక నిఘా కొనసాగిస్తామని కూకట్పల్లి జోన్ డీసీపీ రీతిరాజ్ తెలిపారు. డ్రోన్ల సహాయంతో నిరంతర పర్యవేక్షణ చేపడుతున్నామని, ఎక్కడైనా స్టంట్స్ లేదా అక్రమ రేసింగ్లు జరిగిన వెంటనే వీడియో ఆధారాలు సేకరించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలను సీజ్ చేయడంతో పాటు సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేస్తామని వెల్లడించారు.
సోషల్ మీడియా ఖాతాలు కూడా..
బైక్ రైడింగ్లు, స్టంట్స్ చేస్తూ రీల్స్ రూపొందించి ఇన్స్టాగ్రామ్, ఇతర సోషల్ మీడియా వేదికల్లో అప్లోడ్ చేస్తున్న ఖాతాలను కూడా గుర్తించి వాటిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కూకట్పల్లి జోన్ డీసీపీ రీతిరాజ్ స్పష్టం చేశారు. సోషల్ మీడియా ద్వారా ఇటువంటి ప్రమాదకర కార్యకలాపాలను ప్రోత్సహించే వారిని కూడా ఉపేక్షించబోమని ప్రకటించారు. ఐటీ కారిడార్ను సురక్షితంగా ఉంచడం, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడడం పోలీసుల బాధ్యత అని డీసీపీ రీతిరాజ్ పేర్కొన్నారు. ప్రజల భద్రతకు విఘాతం కలిగించే వారిపై భవిష్యత్తులో కూడా ప్రత్యేక డ్రైవ్లు కొనసాగుతాయని తెలిపారు.
విస్తృత తనిఖీలు
హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు చార్మినార్ జోన్ పరిధిలోని మలక్పేట్, దిల్సుఖ్నగర్, సైదాబాద్, చాదర్ఘాట్, ఐఎస్ సదన్, సంతోష్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లాడ్జీలు, హోటళ్లలో పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో హోటళ్లలో బస చేస్తున్న అతిథుల ఆధార్ కార్డులు, ఇతర గుర్తింపు పత్రాలు, గెస్ట్ రిజిస్టర్లు, చెక్-ఇన్ రికార్డులు, సీసీటీవీ కెమెరాల పనితీరు, భద్రతా ఏర్పాట్లు మరియు అవసరమైన అనుమతి పత్రాలను పరిశీలించారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా అసాంఘిక కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం ఏదైనా ఉందా అనే అంశాలపై ప్రత్యేక దృష్టి సారించారు.
మహిళలకు'స్త్రీ రైడ్' కార్యక్రమం
ఓ కార్యక్రమంలో డీజీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళల భద్రతకు సంబంధించి స్త్రీ రైడ్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. 'ప్రస్తుతం 55 టూ వీలర్, నాలుగు ఆటో రైడ్స్ను ప్రారంభిస్తున్నాం. జొమాటో, స్విగ్గీలాంటి డెలివరీలలో మగవారిని చూస్తూ ఉంటాం. కానీ ఇప్పుడు మహిళలు రైడ్ సర్వీస్లకు ముందుకు రావడం శుభ పరిణామం' అని చెప్పారు. 'మహిళలు డ్రైవింగ్ చేయాలంటే కుటుంబ సహకారం చాలా అవసరమని గుర్తుచేశారు. కొంతకాలంగా మహిళలకు సపోర్ట్ తగ్గడంతో క్యాబ్ సర్వీస్ల నుంచి వైదొలిగారు. పోలీసు శాఖలో మహిళా అధికారులకు సమస్యలు ఎదురయ్యాయి. ప్రస్తుతం డ్రైవర్లగా నియమితులైయిన మహిళలు కష్టాలను దాటుకుంటూ ధైర్యంగా పనిచేయాలి. రాబోయే రోజుల్లో మహిళా రైడర్స్ సంఖ్యను పెంచే విధంగా సక్సెస్ చేయాలని కోరుకుంటున్నా' అని డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు.
Viral Video: ముక్కులోంచి దూరి నోట్లోకి.. యువతి పామ్తో షాకింగ్ స్టంట్.. వైరల్ వీడియో!
Hyderabad, Telangana:Snake Through Nose And Mouth Viral Video: సోషల్ మీడియా వేదికగా వ్యూస్తో పాటు లైక్స్ కోసం కొందరు ప్రాణాలను సైతం పణంగా పెడుతున్నారు.. ఊహకందని.. ఒళ్లు గగుర్పొడిచే స్టంట్లను చేస్తూ సోషల్ మీడియా వినియోగదారులను ఆశ్చర్యపోయేలా చేస్తున్నారు. తాజాగా అలాంటి అత్యంత ప్రమాదకరమైన ఒక ఘటన ఇంటర్నెట్ను షేక్ చేస్తుంది. ఒక యువతి ఏకంగా బతికున్న పాముతో చేసిన సాహసం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతుంది. అయితే, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
భయం లేని భామ.. ఒళ్లు గగుర్పొడిచే విన్యాసం..
వైరల్ అవుతున్న ఈ వీడియోలో.. ఒక యువతి ఎలాంటి భయం లేకుండా ఒక సజీవమైన చిన్న పామును తీసుకుంది. చూస్తుండగానే ఆ ప్రమాదకరమైన పామును తన ముక్కు రంధ్రం ద్వారా లోపలికి పంపించింది. అంతటితో ఆగకుండా.. ఆ పామును గొంతు భాగం గుండా కిందికి లాగి.. నోటి గుండా దాని తలను బయటకు తీసింది. ముక్కులోంచి దూరి నోటి ద్వారా బయటికి వచ్చిన ఆ పాముతో ఆమె ఎంతో హ్యాపీగా ఆడుకుంటూ.. కెమెరాకు ఫోజులు ఇవ్వడం ఈ వీడియోలో మీరు చూడొచ్చు..
ఈ దృశ్యం చూసిన వారంతా ఒక్కసారిగా షాక్ గురవుతున్నారు. అసలు ఈమె మనిషేనా? ఆ పాము కరిస్తే పరిస్థితి ఏంటి? అంటూ నోరెళ్లబెడుతున్నారు. ఈ వీడియో పై సోషల్ మీడియాలో నెటిజన్ల నుంచి భిన్నమైన కామెంట్లు వస్తున్నాయి. కొందరు ఆమె సాహసానికి ఆశ్చర్యపోతుంటే.. మరి కొంతమంది మాత్రం తీవ్రంగా మండిపడుతూ వస్తున్నారు.. కేవలం సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం ఇలాంటి ప్రాణాంతక స్టంట్లు చేస్తున్నారు. ఇది మూగజీవాలను వేధించడమే కాకుండా చూసేవారికి కూడా తప్పుడు సందేశాన్ని ఇస్తుంది అని సోషల్ మీడియా వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..
Also Read: Video Viral: సాయం ముసుగులో అరాచకం.. యువతి ప్రైవేటు పార్ట్ మీద చెయ్యి వేసి మరీ.!. వీడియోపై దుమారం..
వైద్య నిపుణులు కూడా ఈ విధమైన ఘటనపై తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తున్నారు.. ముక్కుతో పాటు గొంతు భాగాలు అత్యంత సున్నితమైనవని.. పాములో విషపూరితమైన బ్యాక్టీరియా లేదా అది పొరపాటున లోపల కరిస్తే ప్రాణానికే ముప్పు వాటిల్లే అవకాశం ఉందని స్పష్టం చేస్తున్నారు.. ఇలాంటి ప్రమాదకరమైన స్టంట్లను ఎవరు అనుసరించవద్దని.. ఇవి ప్రాణానికే ప్రమాదమని హెచ్చరిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ వీడియో ఇంస్టాగ్రామ్లో మాత్రం ఊహించని స్థాయిలో వైరల్ అవుతుంది. ఇప్పటివరకు ఈ వీడియోను కొన్ని లక్షల మందికి పైగా వీక్షించినట్లు సమాచారం..
Also Read: Video Viral: సాయం ముసుగులో అరాచకం.. యువతి ప్రైవేటు పార్ట్ మీద చెయ్యి వేసి మరీ.!. వీడియోపై దుమారం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్.. - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..Twitter, Facebook
