ఈ నెల 15న ఖమ్మంలో సీఎం రేవంత్ సమావేశం
ఖమ్మం జిల్లాలో సీతారామ సాగునీటి ప్రాజెక్టును ఈ నెలలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో తుమ్మల వైరాలో ఏర్పాటు చేసిన సభ ఏర్పాట్లను పరిశీలించారు. ప్రాజెక్టు ప్రారంభోత్సవం అనంతరం జరిగిన సభలో సీఎం రేవంత్ రూ.2 లక్షల రుణమాఫీని ప్రారంభిస్తామన్నారు. తమది రైతుల ప్రభుత్వమని చెప్పుకుంటున్నారు. సీఎం సభకు పెద్ద ఎత్తున జన సమీకరణ చేస్తున్నామని, సభకు వచ్చే ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామని తుమ్మల తెలిపారు.
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Giant Cobra Video Watch Here: అడవికి దగ్గరగా ఉన్న ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఇంటి లోపల ఎప్పుడు ఎప్పుడు పరీక్షిస్తూ శుభ్రం చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం అడవుల్లో నీటి కోరత విపరీతంగా పెరిగి.. ఆహార సమస్యలు వస్తున్నాయి.. దీనికి కారణంగా పాములు పెద్ద మొత్తంలో జనావాసాల వైపు సంచారం చేస్తూ ఉన్నాయి. ఇలా ఇప్పటివరకు చాలా పాములు జనాభాసాల్లో సంచారం చేసిన దాఖలాలు ఉన్నాయి. అయితే, తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో కూడా ఇలాంటి సందర్భానికి సంబంధించిందే. అడవిలోకి వచ్చిన ఓ పాము ఏకంగా ఇంట్లో వంట గదిలో ఉండే ఫ్రిడ్జ్ వెనక భాగంలో దూరింది. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియోలే వైరల్ గా మారాయి.
ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియో వివరాల్లోకి వెళితే.. సర్పమిత్ర ఆకాష్ జాదవ్ అనే యూట్యూబ్ ఛానల్ నుంచి షేర్ చేసిన వీడియో ఊహించని స్థాయిలో వైరల్ అవుతూ వస్తోంది. ఈ వీడియోలో స్నేక్ క్యాచర్ నెమ్మదిగా ఫ్రిజ్ను జరుపుతూ అందులో దూరిన పామును బయటకు తీయడం మీరు చూడొచ్చు. ముందుగా స్నేక్ క్యాచర్ ఆ పామును చాలా నెమ్మదిగా అందులో ఇరుక్కున్న పామును తన దగ్గర ఉన్న స్నేక్ స్టిక్ వినియోగించి నెమ్మదిగా బయటికి తీయడం మీరు చూడొచ్చు. అలాగే దానిని చూసిన ఆ పాము ఫ్రిడ్జ్ వెనక భాగం నుంచి స్పీడ్గా బయటికి దూసుకురావడం కూడా మీరు గమనించవచ్చు.
స్నేక్ క్యాచర్ ఎంతో నెమ్మదిగా ఆ పామును పట్టుకొని బయటికి లాగేసాడు. బయటికి లాగేసిన వెంటనే దాని తల పట్టి నెమ్మదిగా ఆ ఇంట్లో నుంచి బయటికి తెచ్చేసాడు. అయితే, ఈ సమయంలో పాము అతనిపై దాడి చేసేందుకు ఎంతగానో ప్రయత్నించింది. అతను ఏమాత్రం భయపడకుండా ఎంతో చాకచక్యంగా ఆ పామును పట్టుకొని.. దానిని సులభంగా ఓ బ్యాగ్లో బంధించాడు. ఇలా బంధించిన వీడియోని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియోను చూసిన సోషల్ మీడియా వినియోగదారులు ఆశ్చర్యానికి గురవుతున్నారు.
ఈ వీడియో చూసిన కొంతమంది వన్యప్రాణి సంరక్షకులు.. ఇలాంటి పాములతో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. అంతేకాకుండా ఆ పాము ఎంత యాక్టివ్గా ఉందోనని.. ఎప్పుడైనా ఎవరినైనా సులభంగా దాడి చేసే సామర్థ్యం కలిగి ఉంటుందని.. దీనికి దూరంగా ఉండటం చాలా మంచిదని కొంతమంది నిపుణులు చెబుతున్నారు. అలాగే ఈ పట్టుకున్న పామును ఎంతో సులభంగా బ్యాంకులో బంధించి దానిని అడవి ప్రదేశంలో వదిలిపెట్టినట్లు వన్యప్రాణి సంరక్షకులు ఆకాష్ చెప్పారు.
Also Read: ktr On Revanth Video: రేవంత్ కాదు.. వాడి జేజేమ్మకు భయపడేది లేదు.. కేటీఆర్ ఫైర్..వీడియో..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Cobra Drinking Water Video Water: ప్రకృతిలో అనేక వింతలు విశేషాలు మనల్ని ఎంతగానో ఆశ్చర్యానికి గురిచేస్తూ ఉంటాయి. ముఖ్యంగా అప్పుడప్పుడు వన్యప్రాణులకు సంబంధించిన కొన్ని ఆసక్తికర వీడియోలు సోషల్ మీడియా వినియోగదారులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. తాజాగా అటువంటి వీడియోనే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వస్తోంది. ఈ వీడియోలో అత్యంత ప్రమాదకరమైన భారీ నాగుపాముకు ఒక వ్యక్తి ప్లాస్టిక్ డబ్బాతో నీటిని పట్టిస్తున్న దృశ్యాలు ఉన్నాయి. దీనిని చూసిన వారంతా ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఇంతకీ ఇది ఎక్కడ జరిగింది? ఈ వీడియోలో ఉన్న వారెవరు? వీటన్నిటికీ సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఇరవై ఒక్క సెకన్ల నిడివి గల యూట్యూబ్ షార్ట్ వీడియో లో ఓ భారీ నాగుపాము పడగవిప్పి నిలబడి ఉండడం మీరు చూడొచ్చు. సాధారణంగా ఏ పాములైన పడక విప్పాయ అంటే దాడి చేస్తాయని అర్థం. ఈ వీడియోలో కూడా ఆ నాగుపాము ముందు ఉన్న వ్యక్తిపై దాడి చేసేందుకు పడగ విప్పింది. ఇంతటి భారీ నాగుపాము పడకవింపడంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా దూరం జరిగి పోయారు. కానీ ఒక వ్యక్తి మాత్రం డబ్బాలు నీళ్లు తీసుకువచ్చి ఆ నాగుపాము ముందు ఉంచాడు. దీంతో ఆ పాము ఏం చేసిందో చూస్తే ఆశ్చర్యానికి గురవ్వాల్సిందే..
డబ్బాలో నీళ్లు తీసుకువచ్చిన ఆ వ్యక్తి.. నెమ్మదిగా నాగుపాము తల ముందు ఉంచి కిందికి నీటిని విడుస్తూ ఉన్నాడు. అయితే, ఈ సమయంలోనే ఆ ప్రమాదకరమైన నాగుపాము ఆ డబ్బాలో నీటిని తాగేందుకు ప్రయత్నిస్తోంది. నెమ్మది నెమ్మదిగా ఆ పాము డబ్బాలో ఉన్న నీటిని తాగడం ప్రారంభించింది. ఇలా ఆ పాము అందులో ఉన్న కొద్ది నీటిని తాగేసింది. ఈ దృశ్యాలు అక్కడున్న కొంతమంది స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో వైరల్ అవుతూ వస్తుంది.
తీవ్రమైన వేడి వాతావరణం అడవుల్లో నీటి కోరత కారణంగానే వన్యప్రాణులు ఇలా ఎక్కువగా జనాలు తిరిగే ప్రదేశాల్లో సంచారం చేస్తున్నాయి. అంతేకాకుండా కనబడిన చోట నీటిని తాగేస్తున్నాయి. ఇందులో భాగంగానే ఈపాము కూడా ఇలా అడవిలో నుంచి బయటికి వచ్చి దాహం కోసం ఇళ్లలోకి సంచారం చేయాలని చూసింది. అయితే, దీనిని ముందుగానే గమనించిన వన్యప్రాణి సంరక్షకులు.. దానిని పట్టుకొని నీటిని తాగించారు. ఇప్పుడు ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Also Read: ktr On Revanth Video: రేవంత్ కాదు.. వాడి జేజేమ్మకు భయపడేది లేదు.. కేటీఆర్ ఫైర్..వీడియో..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Kondagattu News: జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం, భక్తుల కొంగు బంగారం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద చిన్నపాటి ఉద్రుక్త వాతావరణం నెలకొంది. ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వ్యవహార శైలిని నిరసిస్తూ అర్చకులు ఒక్కసారిగా ఆందోళనకు దిగారు.. విధులను బహిష్కరించి ఆలయ ముఖ ద్వారం వద్ద బయటాయించడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఇంతకీ అర్చకులు ఆందోళన చేయడానికి ప్రధాన కారణాలేంటి? అసలు ఏం జరుగుతుంది? వీటన్నిటికీ సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
గత కొంతకాలంగా ఆలయ అధికారులకు అర్చకులకు మధ్య విభేదాలు కొనసాగుతున్నట్లు సమాచారం.. తాజాగా ఈవో తీసుకున్న కొన్ని ప్రత్యేకమైన నిర్ణయాలు అర్చకుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని వారు ఆరోపిస్తున్నారు.. తమ సమస్యలను విన్నవించుకున్న ఈవో పట్టించుకోవడంలేదని.. అలాగే తమ పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారని అర్చకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీని కారణంగానే శుక్రవారం ఉదయం నుంచి అర్చకులు అందరూ ఏకమై ఆలయం ముందు ధర్నా చేపట్టినట్లు సమాచారం.
Also Read: ktr On Revanth Video: రేవంత్ కాదు.. వాడి జేజేమ్మకు భయపడేది లేదు.. కేటీఆర్ ఫైర్..వీడియో..
ముఖ్యంగా ఆలయ అధికారి అర్చకులకు కనీస గౌరవం ఇవ్వకుండా నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని ఈఓపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్చకులు నిరసనకు దిగడంతో స్వామివారికి జరగాల్సిన నిత్య కైంకర్యాలు, పూజలు ఆలస్యమైనట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సుదూర ప్రాంతం నుంచి వచ్చిన భక్తులు దర్శనం కోసం గంటల తరబడి వేసి చూడాల్సి వచ్చిందట. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఇతరు ఉన్న అధికారులు ఘటన స్థలానికి చేరుకొని అర్చకులతో చర్చలు జరిపే ప్రయత్నం చేశారు..
పోలీస్ అధికారులు రావడంతో కాస్త పరిస్థితి కాస్త సర్దుమనిగినట్లు తెలుస్తోంది. మంచి పేరున్న కొండగట్టు ఆలయంలో అర్చకుల నిరసన ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అలాగే అర్చకులు ప్రధాన ద్వారం ముందు నిరసనకు దిగిన కొన్ని వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతూ వస్తున్నాయి.
Also Read: ktr On Revanth Video: రేవంత్ కాదు.. వాడి జేజేమ్మకు భయపడేది లేదు.. కేటీఆర్ ఫైర్..వీడియో..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Govt Employees Gift: కేంద్ర బడ్జెట్కు ముందే ప్రభుత్వ ఉద్యోగులకు భారీ కానుక ఉండబోతున్నట్లు సమాచారం. బడ్జెట్ ప్రవేశపెట్టక ముందే కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు భారీ ఆర్థిక ప్రయోజనం కలిగించే నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. కరువు భత్యం విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కరువు భత్యం దాదాపు 63 శాతం పెంచనుందని సమాచారం. డీఏ పెంపుపై కేంద్ర ప్రభుత్వం ప్రకటన విడుదల చేయనుందని ఉద్యోగ వర్గాలు భావిస్తున్నాయి. దీనికి సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.
Also Read: Red Nagamani: స్కూల్లో కలకలం.. నాగుపాము తలపై ఎర్రటి నాగమణి
కేంద్ర ప్రభుత్వం 2026-27కు సంబంధించిన బడ్జెట్ను ఫిబ్రవరి 1వ తేదీన ప్రవేశపెట్టనుంది. బడ్జెట్కు ముందు డీఏ 63 శాతానికి పెరుగుతుందని సమాచారం. ద్రవ్యోల్బణ డేటాను పరిశీలిస్తే అది జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం డీఏ 58 శాతం ఉంది. ఉద్యోగులకు సంబంధించి డీఏ పెంచి 5 శాతం వేయనుందని.. దీనిద్వారా డీఏ 63 శాతానికి పెరగనుందని ఉద్యోగ వర్గాలు భావిస్తున్నాయి. కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లు ప్రస్తుతం డిసెంబర్ 2025 ద్రవ్యోల్బణ డేటాను చూస్తున్నారు. ఈ డేటా ఆధారంగా జనవరి 2026 నుంచి కరువు భత్యం పెంపు నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి.
Also Read: PM Kisan: రైతులకు మోదీ సర్కార్ శుభవార్త.. పీఎం కిసాన్ సహాయం డబ్బుల్ డబుల్
ద్రవ్యోల్బణ డేటాను కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. ప్రభుత్వం చివరిసారిగా డీఏని జూలై 2025లో 55 శాతం నుంచి 58 శాతానికి పెంచింది. డిసెంబర్ డేటా తదుపరి డీఏ పెంపుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ పెరుగుదల సుమారు 50.14 లక్షల మంది ప్రస్తుత ఉద్యోగులకు, సుమారు 69 లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం చేకూరనుంది. బడ్జెట్కు ముందు ప్రభుత్వం డీఏను పెంచుతుందో లేదో చూడాలి. కేంద్ర ప్రభుత్వం దసరా సమయంలో డీఏను ప్రకటించిన విషయం తెలిసిందే. నాడు ప్రకటించడంతో ఊరట చెందిన ఉద్యోగ వర్గాలు ఇప్పుడు బడ్జెట్ ముందు డీఏ ప్రకటించనుండడంతో ఆనందంలో మునిగారు. దీంతోపాటు 8వ వేతన సంఘం కూడా ప్రభుత్వం త్వరలో ప్రకటించనుంది. 8వ వేతన సంఘం అమల్లోకి వస్తే మాత్రం భారీ ఆర్థిక ప్రయోజనం లభించనుంది. దీంతో ప్రభుత్వ ఉద్యోగ వర్గాలు సంతోషంలో ఉన్నారు.
Also Read: KTR: సిట్ నోటీసులపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు.. రేవంత్ రెడ్డి ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేస్తుండు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
BRS Party News: మున్సిపల్ ఎన్నికల వేళ వివిధ జిల్లాల్లో రాజయకీల్లో ఊహించని మార్పులు వస్తున్నాయి. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీలో పెను రాజకీయ సంచలనం చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి.. గత రెండు దశాబ్దాల నుంచి పార్టీకి నియోజవర్గం స్థాయిలో వెన్నుముకగా ఉన్న కీలక నేత అనూప్ రావు బీఆర్ఎస్ పార్టీని వీడబోతున్నట్లు తెలుస్తోంది. అయితే, ఇది స్థానిక ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్కు కోలుకోలేని దెబ్బగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
బీఆర్ఎస్ పార్టీలో 2001 ఆవిర్భావం నుంచి అనూప్ రావు చాలా చురుకైన పాత్ర పోషిస్తూ వస్తున్నారు. అంతేకాకుండా ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో భాగంగా ఆయన లాఠీ దెబ్బలు తిని, జైలుకు వెళ్లిన చరిత్ర కూడా ఉంది. అలాగే పార్టీ ఎంతో కష్టకాలంలో ఉన్న సమయంలో కూడా నియోజకవర్గంలో కేడర్ను సమన్వయం చేస్తూ బలమైన శక్తిగా ఎదుగుతూ వచ్చారు. అయితే, గత కొద్ది రోజుల నుంచి పార్టీలో తనకు సరైన ప్రాధాన్యత లభించడం లేదని.. కష్టపడిన వారికి కాకుండా ఇతర ఇతరులకు పార్టీ పెద్దపీట వేస్తోందని ఆయన తీవ్ర ఆసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
ముఖ్యంగా కోరుట్ల నియోజకవర్గ అభివృద్ధి పనులకు.. నామినేటెడ్ పదవుల భర్తీలో పాతతరం నేతలను పట్టించుకోవడం లేదని, కొత్తగా వచ్చిన వారికి ఎమ్మెల్యే సంజయ్ ప్రాధాన్యత ఇస్తున్నారని.. అనూప్ రావు ప్రధాన ఆరోపణగా వినిపిస్తోంది. అయితే, మున్సిపల్ ఎన్నికలు వస్తున్న సమయంలో తన అనుచరవర్గానికి టికెట్ల కేటాయింపు విషయాల్లో కూడా సరైన స్పష్టత లేనందున, ఆయన పార్టీ వీడాలనే నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది..
Also Read: ktr On Revanth Video: రేవంత్ కాదు.. వాడి జేజేమ్మకు భయపడేది లేదు.. కేటీఆర్ ఫైర్..వీడియో..
అలాగే అనూప్ రావు పార్టీ మారడానికి ఇప్పటికే.. బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్తో ప్రత్యేకమైన సంప్రదింపులు కూడా జరిపినట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే కోరుట్ల నియోజకవర్గంలో BJPని బలోపేతం చేసేందుకు చూస్తున్న అరవింద్.. అనూప్ రావుకు ప్రత్యేమైన కీలక బాధ్యతలు కూడా అప్పగించిన్నట్లు హామీ ఇచ్చినట్లు సమాచారం.. అలాగే త్వరలోనే తన అనుచరులతో భారీ బహిరంగ సభను కూడా నిర్వహించి.. వారి సమక్షంలోనే కాషాయ కండువా కప్పుకునే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. మున్సిపల్ ఎన్నికల్లో అనూప్ రావు వంటి కీలక నేతలు పార్టీ వీడడం వల్ల BRSకు ఓటు బ్యాంకుపై తీవ్ర ప్రభావం పడే అవకాశాలు ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
Also Read: ktr On Revanth Video: రేవంత్ కాదు.. వాడి జేజేమ్మకు భయపడేది లేదు.. కేటీఆర్ ఫైర్..వీడియో..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Egg Diet For Kids: కోడిగుడ్డు ఆరోగ్యానికి ఎంత మంచిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏడాది వయసు దాటిన తర్వాత నుంచి పిల్లలకు ఈ కోడి గుడ్డును పెట్టొచ్చు. గుడ్డులో ప్రోటీన్తో పాటు చాలా రకాల విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలన్నీ మెదడు శక్తికి, ఆరోగ్యకరమైన రోగనిరోధక వ్యవస్థకు సహాయపడతాయి. కోడి గుడ్డు కేవలం మంచి అల్పాహారం మాత్రమే కాదు.. పిల్లలలో పోషకాహారాన్ని పెంచడానికి ఇది ఒక గొప్ప ఆహారం. ఒక కోడిగుడ్డులో 6 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఇది పిల్లల్లో మెదడు అభివృద్ధికి, తెలివితేటలు పెరగడానికి కూడా సహాయపడుతుంది.
పిల్లలకు రోజుకి ఒక గుడ్డు అందిస్తే..
పిల్లలకు రోజూ ఒక కోడి గుడ్డు ఇవ్వడం వల్ల అవసరమైన విటమిన్లు, ఖనిజాలను గుడ్డు అందిస్తుంది. కంటి చూపును మెరుగుపరిచే లుటిన్, జియాక్సంతిన్ కూడా గుడ్లలో ఉంటాయి. గుడ్లు ప్రోటీన్ను మాత్రమే కాదు. పిల్లలకు రోజూ అవసరమైన విటమిన్లు, ఖనిజాలను అందిస్తాయి.
ఎన్ని గుడ్లు తినొచ్చు..?
1 నుంచి 8 ఏళ్ల పిల్లలు రోజుకు 1 నుంచి 2 గుడ్లు తినడం మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఈ మోతాదు పెరుగుతున్న పిల్లలకు అవసరమైన ప్రోటీన్, పోషకాలను అందిస్తుంది. శక్తిని నిలబెట్టడంలో, మెదడును ఉత్తేజపరచడంలో, శరీర పెరుగుదలలో ఇది పాత్ర పోషిస్తుంది.
గుడ్లు తినని పిల్లలతో పోలిస్తే, గుడ్లు తినే పిల్లలకు ప్రోటీన్, మంచి కొవ్వు, డిహెచ్ఏ, కోలిన్, విటమిన్ డి వంటి పోషకాలు ఎక్కువగా అందుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ పోషకాలన్నీ శక్తిని నిలబెట్టడంలో, మెదడును ఉత్తేజపరచడంలో, శరీర పెరుగుదలలో పాత్ర పోషిస్తాయి. రోజూ గుడ్డు తినడం వల్ల పిల్లల్లో పెరుగుదల వేగవంతమవుతుందని ఓ అధ్యయనంలో నిరూపితమైంది. రోజూ ఒక గుడ్డు తినడం వల్ల పెరుగుదల లోపం 47%, బరువు తక్కువగా ఉండటం 70% నివారించవచ్చని పీడియాట్రిక్స్ జర్నల్లో ప్రచురించిన ఈ అధ్యయనం తేల్చింది.
ఏ రూపంలో ఇవ్వొచ్చు..?
ఇతర ఆహారాలతో పాటు రోజుకు 1 నుండి 2 గుడ్లు ఇవ్వండి. కూరగాయలతో కలిపి స్క్రాంబుల్డ్ ఎగ్స్ లేదా ఆమ్లెట్ రూపంలో కూడా ఇవ్వొచ్చు. ఇంకో విషయం, పిల్లలకు మొదటిసారి గుడ్డు పెట్టినప్పుడు అలర్జీ సమస్య ఉందేమో గమనించండి. ఏవైనా ఇబ్బందులు కనిపిస్తే డాక్టర్ను సంప్రదించండి.
Also Read: Cardamom: యాలకులు ఇలా తీసుకుంటే ఈ ఐదు అనారోగ్య సమస్యలకు గుడ్బై చెప్పొచ్చు..!
Also Read: Secunderabad Railway Station: సికింద్రాబాద్ వెళ్లే ప్రయాణికులకు బిగ్ అలెర్ట్.. ఎందుకంటే..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Cardamom Health Benefits: మన భారతీయ వంటకాల్లో యాలకులకు ఎంతో ప్రత్యేకత ఉంది. యాలకులు మంచి సువాసన ఇచ్చే సుగంధ ద్రవ్యం మాత్రమే కాదు. ఇందులో అద్భుతమైన ఔషధ గుణాలుంటాయి. అవి ఆరోగ్యానికి ఎంతోమేలు చేస్తాయి. అందుకే యాలకులను "సుగంధ ద్రవ్యాల రాణి''గా పిలుస్తారు. వీటిలో యాంటీఆక్సిడెంట్, యాంటీ మైక్రోబయల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. యాలకులను ఈ విధంగా తీసుకుంటే.. అనేక అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చు.
1. జీర్ణక్రియ మెరుగుపడుతుంది
యాలకులు జీర్ణశక్తిని పెంచడంలో బాగా సహాయపడుతుంది. భోజనం తర్వాత ఒక యాలక గింజ నమలడం వల్ల గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలకు చెక్ పెట్టొచ్చు. కడుపులో మంటను కూడా యాలకులు తగ్గిస్తాయి.
2. నోటి ఆరోగ్యం కాపాడుతుంది
యాలకుల్లో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు నోటిలోని బ్యాక్టీరియాను చంపి, దుర్వాసనను పోగొడతాయి. చిగుళ్ల ఇన్ఫెక్షన్లు రాకుండా రక్షిస్తాయి.
3. గుండె ఆరోగ్యానికి మేలు
యాలకులు బీపీని కంట్రోల్ చేయడంలో సహాయపడతాయి. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్స్ రక్త ప్రసరణను మెరుగుపరిచి గుండె జబ్బుల సమస్యలను చాలా వరకు తగ్గిస్తాయి.
4. శ్వాసకోస ఇబ్బందుల నుంచి ఉపశమనం
తరుచూ వచ్చే దగ్గు, జలుబు, ఆస్తమా వంటి ఇబ్బందులతో బాధపడేవారికి యాలకులు మంచి ఉపశమనం కలిగిస్తాయి. ఊపిరితిత్తులలో గాలి ప్రవాహాన్ని మెరుగుపరిచి ఈజీగా శ్వాస తీసుకునేలా చేస్తుంది.
5. డిప్రెషన్ దూరం
ఇటీవల కాలంలో చాలామంది తమ పనుల వల్ల ఒత్తిడి, డిప్రెషన్కు లోనవుతున్నారు. అలాంటివారు యాలకుల టీ లేదా యాలకులు నోట్లో వేసుకుని నమిలితే మనుసు ప్రశాంతంగా ఉంటుంది. మానసిక ఒత్తిడి, ఆందోళన దూరమవుతాయి.
Also Read: Secunderabad Railway Station: సికింద్రాబాద్ వెళ్లే ప్రయాణికులకు బిగ్ అలెర్ట్.. ఎందుకంటే..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Gajakesari Yoga Effect On Zodiac Signs: ఈ రోజే మాఘ మాసం శుక్ల పక్ష పంచమి తిథి.. అయితే, ఇదే రోజు వసంత పంచమి పండగ తిథి.. కాబట్టి ఈ రోజును సరస్వతి దేవికి అంకితం చేస్తారు. జ్యోతిష్య శాస్త్రం పరంగా చంద్రుడు మీన రాశిలోకి సంచారం చేశాడు. అయితే, ఈ సమయంలో చంద్రుడు, బృహస్పతి గ్రహాలు 10వ స్థానంలో ఉండబోతున్నాయి. దీని కారణంగానే ఈ రోజు గజకేశరి యోగం ఏర్పడిందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, గజకేశరి యోగం అత్యంత శక్తివంతమైన గ్రహాల్లో ఒకటిగా భావిస్తారు. దీంతో కెరీర్, సామాజికంగా ఊహించని స్థాయిలో గౌరవం పెరుగుతుంది. అంతేకాకుండా బుధుడు ఈ సమయంలో శ్రావణ నక్షత్రంలోకి కూడా సంచారం చేస్తాడు. దీంతో శుక్ర, బుధుల కలయిక కూడా జరిగింది.. దీని కారణంగానే లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పడింది. ఈ యోగం కారణంగా కూడా అద్భుతమైన లాభాలు కలుగుతాయి.
ఈ రాశులపై ప్రభావం:
మేషరాశి
గజకేశరి రాజయోగం ఎఫెక్ట్తో మేష రాశివారికి అనేక రకాల ఆర్థిక లాభాలు కలుగుతాయి. వీరికి కెరీర్ పరంగా అద్బుతమైన గుర్తింపు లభిస్తుంది. ఏవైనా పనులు ప్రారంభించాలనుకునేవారికి, ఇది అద్భుతమైన అవకాశంగా భావించవచ్చు. అంతేకాకుండా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వ్యక్తులకు ఈ సమయం చాలా బాగుటుంది. అంతేకాకుండా ఆనందం కూడా ఊహించని స్థాయిలో రెట్టింపు అవుతుంది. ఆస్తుల పరంగా ఈ సమయంలో లావాదేవీలు కూడా జరుగుతాయి. దీంతో పాటు ఒప్పందాలు కూడా ఖరారు చేసుకుంటారు.
మిథున రాశి
ఈ శక్తివంతమైన యోగాల ప్రభావంతో మిథున రాశివారికి వ్యాపారాల పరంగా అద్భుతమైన విజయాలు కలుగుతాయి. వీరికి ఉన్నతాధికారుల నుంచి పూర్తి సపోర్ట్ కూడా లభిస్తుంది. అంతేకాకుండా ఈ సమయంలో పెద్ద పెద్ద బాధ్యతలు కూడా పొందుతారు. అంతేకాకుండా ఆర్థిక విషయాల్లో కూడా మంచి ప్రయోజనాలు పొందుతారని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఈ సమయంలో ప్రయాణాలు చేయడం వల్ల ఊహించని స్థాయిలో ఆనందం కూడా లభిస్తుంది. తల్లిదండ్రుల నుంచి లాభాలు కూడా పొందుతారు.
కర్కాటక రాశి
శక్తివంతమైన గజకేశరి రాజయోగంతో కర్కాటక రాశివారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. వీరికి ఈ సమయంలో అదృష్టం కూడా రెట్టింపు అవుతుంది. పెండింగ్లో ఉన్న పనులు కూడా ఊహించని స్థాయిలో ఊపందుకుంటాయి. విదేశీ ప్రయాణాలు చేయడం వల్ల కెరీర్ పరంగా కూడా చాలా వరకు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. రాజకీయ రంగాల్లో ఉన్న వ్యక్తులు ఈ సమయంలో అద్భుతమైన లాభాలు పొందుతారు. ఈ సమయంలో ఊహించని స్థాయిలో నైపుణ్యం కూడా పెరుగుతుంది.
వృశ్చిక రాశి
ఈ శుక్రవారం నుంచి వృశ్చిక రాశివారికి విద్యా పరంగా అద్భుతమైన లాభాలు కలుగుతాయి. దీంతో పాటు కెరీర్ పరంగా విశేషమైన లాభాలు కలుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అలాగే వీరికి పెండింగ్లో ఉన్న పనులు కూడా సులభంగా పూర్తవుతాయి. దీంతో పాటు వ్యాపారాలు చేసేవారు యాత్రలు కూడా వెళ్లాల్సి వస్తుంది. దీంతో పాటు ఈ సమయంలో పెండింగ్లో ఉన్న పనులు కూడా సులభంగా పూర్తవుతాయి. అంతేకాకుండా వీరికి ప్రేమ జీవితం కూడా చాలా వరకు మెరుగుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Also Read: Mercury Transit 2026: మకరంలో తిష్ట వేసిన బుధుడు.. ఈ రాశుల వారికి కోటీశ్వరులయ్యే యోగం ప్రారంభం!

Also Read: Mercury Transit 2026: మకరంలో తిష్ట వేసిన బుధుడు.. ఈ రాశుల వారికి కోటీశ్వరులయ్యే యోగం ప్రారంభం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Union Budget 2026: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న పార్లమెంటులో 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్ నిర్మలమ్మ వరుసగా ప్రవేశపెడుతున్న 9వ బడ్జెట్ కావడం విశేషం. ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా పన్ను చెల్లింపుదారుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా ఆదాయపు పన్ను రేట్ల తగ్గింపు, పన్ను శ్లాబ్ల సరళీకరణ, అలాగే పాత పన్ను విధానంలో మినహాయింపులు, తగ్గింపులు పెంచుతారేమో అన్న ఆశలు వ్యక్తమవుతున్నాయి. అయితే గత కొన్ని సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న పన్ను విధానాన్ని గమనిస్తే, పాత పన్ను వ్యవస్థకు పెద్ద ఎత్తున ఉపశమనం కల్పించడం ప్రభుత్వ ప్రాధాన్యతగా కనిపించడం లేదు.
ఇటీవలి సంవత్సరాల్లో ప్రభుత్వం పాత పన్ను విధానంలో పెద్దగా మార్పులు చేయకుండా, పన్ను చెల్లింపుదారులను క్రమంగా కొత్త పన్ను విధానం వైపు మళ్లిస్తోంది. అధికారిక గణాంకాల ప్రకారం ఇప్పటికే 80 శాతం కంటే ఎక్కువ మంది పన్ను చెల్లింపుదారులు కొత్త వ్యవస్థను ఎంచుకున్నారు. అయినప్పటికీ, ఇంకా పాత విధానంలో కొనసాగుతున్న జీతభత్యాలు పొందే ఉద్యోగులు కొంత ఊరట కోసం ఎదురుచూస్తున్నారు. అయితే గత ఆరు బడ్జెట్లను పరిశీలిస్తే, తక్కువ మినహాయింపులు, తక్కువ సంక్లిష్టతతో కూడిన సరళమైన పన్ను నిర్మాణాన్ని రూపొందించడమే ప్రభుత్వ లక్ష్యంగా స్పష్టంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకుంటే, 2026–27 బడ్జెట్లో పాత పన్ను విధానంలో పెద్ద మార్పులు చోటు చేసుకునే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.
గత ఏడాది బడ్జెట్లో మాత్రం కొత్త పన్ను విధానాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రాథమిక మినహాయింపు పరిమితిని రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షలకు పెంచింది. అలాగే సెక్షన్ 87A కింద ఇచ్చే పన్ను రాయితీని రూ.25,000 నుంచి రూ.60,000కు పెంచడంతో, కొత్త విధానంలో రూ.12 లక్షల వరకు ఆదాయం పన్ను రహితంగా మారింది. జీతం పొందే ఉద్యోగులకు ఇచ్చే ప్రామాణిక మినహాయింపును కూడా రూ.50,000 నుంచి రూ.75,000కు పెంచడం జరిగింది. ఈ మార్పులతో కొత్త పన్ను విధానం ఇప్పటికే గణనీయంగా లాభదాయకంగా మారిన నేపథ్యంలో, ఈసారి మళ్లీ పెద్ద ఎత్తున శ్లాబ్ల పునర్నిర్మాణం జరిగే అవకాశాలు కనిపించడం లేదు.
పన్ను శ్లాబ్లపై పెద్ద మార్పులు ఆశించవద్దని పన్ను నిపుణులు కూడా సూచిస్తున్నారు. చార్టర్డ్ అకౌంటెంట్ డాక్టర్ సురేష్ సురానా మాట్లాడుతూ.. గత బడ్జెట్లోనే వ్యక్తిగత ఆదాయపు పన్ను వ్యవస్థలో విస్తృతమైన మార్పులు చేసిన నేపథ్యంలో, 2026–27 బడ్జెట్లో మరోసారి భారీ సవరణలు రావడం కష్టమేనని అభిప్రాయపడ్డారు. అంతేకాదు, ఆదాయపు పన్ను చట్టం–2025 ఏప్రిల్ 1, 2026 నుంచి పూర్తిగా అమల్లోకి రానున్న నేపథ్యంలో, ఈసారి బడ్జెట్లో స్థిరత్వం, విధానపరమైన కొనసాగింపు, స్పష్టతపై ప్రభుత్వం ఎక్కువ దృష్టి పెట్టే అవకాశముందని ఆయన పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా, పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 28 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు రెండు దశల్లో జనవరి 28 నుంచి ఏప్రిల్ 2, 2026 వరకు కొనసాగనున్నాయి. ఫిబ్రవరి 1న ఉదయం 11 గంటలకు లోక్సభలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్ కోసం ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇప్పటికే తుది దశ సన్నాహాల్లో ఉంది. మోదీ ప్రభుత్వ హయాంలో నిర్మలా సీతారామన్ సమర్పించనున్న తొమ్మిదవ బడ్జెట్ కావడంతో దేశవ్యాప్తంగా ప్రజలు, వ్యాపార వర్గాలు, మధ్యతరగతి నుంచి ఉన్నత వర్గాల వరకు ప్రతి ఒక్కరూ తమకు అనుకూలమైన కీలక ప్రకటనల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Also Read: Union Budget 2026: రైతులకు కేంద్రం తీపికబురు.. ఈ సారి బడ్జెట్లో ఎవరూ ఊహించని గిఫ్ట్..!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
PM Kisan Amount Increase: అధికారంలోకి వచ్చి పుష్కర కాలం దాటిన నరేంద్ర మోదీ ప్రభుత్వం రైతులకు భారీ శుభవార్త ప్రకటించబోతున్నట్లు సమాచారం. రైతులకు అందిస్తున్న పంట పెట్టుబడి సహాయాన్ని పెంచబోతున్నట్లు తెలుస్తోంది. రైతులకు అందిస్తున్న సహాయాన్ని పెంచి కానుకగా ఇచ్చేందుకు సిద్ధమైందని వార్తలు వస్తున్నాయి. పీఎం కిసాన్ సహాయాన్ని పెంచి ఇవ్వనున్నట్లు.. రానున్న బడ్జెట్లో ఈ ప్రకటన ఉంటుందని తెలుస్తోంది.
Also Read: KTR: సిట్ నోటీసులపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు.. రేవంత్ రెడ్డి ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేస్తుండు
కేంద్ర బడ్జెట్ ఫిబ్రవరి 1వ తేదీన ప్రవేశపెట్టనున్న విషయం తెలిసిందే. కేంద్ర బడ్జెట్పై సామాన్య ప్రజానీకంతోపాటు రైతులు, ఉద్యోగులు భారీ ఆశలు పెట్టుకున్నారు. అధికారంలోకి వచ్చి 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం రైతులకు భారీ కానుక ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ క్రమంలో బడ్జెట్పై అన్నీ వర్గాలు భారీగా అంచనాలు పెంచుకున్నారు. ఈ బడ్జెట్లో రైతులకు సంబంధించిన పీఎం కిసాన్ సమ్మాన్ పథకానికి సంబంధించి భారీ కానుక రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అరకొరగా అందిస్తున్న పంట పెట్టుబడి సహాయం ఈసారి పెంచనున్నట్లు తెలుస్తోంది. ప్రధానమంత్రి కిసాన్ యోజన బడ్జెట్ను పెంచవచ్చని రైతులు ఆశిస్తున్నారు. ఈ పథకం ప్రారంభమైనప్పటి నుంచి రూపాయి కూడా పెంచలేదు. ఈసారి బడ్జెట్లో పెంపు ఉండబోతున్నదని సమాచారం.
Also Read: KT Rama Rao: తెలంగాణలో సంచలన పరిణామం.. కేటీఆర్కు సిట్ నోటీసులు
ప్రధానమంత్రి కిసాన్ యోజనను కేంద్ర ప్రభుత్వం 2019లో ప్రారంభించగా.. ఈ పథకం కింద రైతులకు సంవత్సరానికి రూ.6,000 పంట పెట్టుబడి సహాయం అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సహాయం మూడు విడతలుగా పంపిణీ చేస్తున్నారు. ప్రతి నాలుగు నెలలకు ఒక విడతగా రూ.2 వేల చొప్పున విడుదల చేస్తున్నారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా రైతులకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద 21 వాయిదాలు చెల్లించారు.
ఫిబ్రవరి 1వ తేదీన ప్రవేశపెట్టే బడ్జెట్లో ప్రధానమంత్రి కిసాన్ పథకంపై కీలక ప్రకటన ఉంటుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. బడ్జెట్లో పీఎం కిసాన్ పథకానికి కేటాయింపులు పెంచనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందిస్తున్న రూ.6,000 నుంచి రూ.8,000కు పెంచవచ్చని వ్యవసాయ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం ప్రస్తుతం చెల్లిస్తున్న రూ.6 వేలు రైతులకు ఏకోశాన సరిపోవడం లేదు. విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, డీజిల్, విద్యుత్, నీటిపారుదల, వ్యవసాయ యంత్రాలు ఇలా ప్రతి దాని ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో రైతులకు పంట పెట్టుబడి పెరిగిపోతున్నది. వ్యవసాయ ఖర్చు భారీగా పెరిగిపోతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న పీఎం కిసాన్ సహాయం ఏమాత్రం చాలడం లేదు.
Also Read: YS Jagan: మాజీ సీఎం వైఎస్ జగన్ సంచలన ప్రకటన.. 2027 తర్వాత పాదయాత్ర
ఆంక్షలతో పీఎం కిసాన్ దూరం
అందించే అరకొర సహాయానికి అడ్డమైన కొర్రీలు పెట్టారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతుబంధుకు నకలుగా అమలుచేస్తున్న పీఎం కిసాన్ పథకంలో అనేక కొర్రీలు పెట్టారు. రైతుబంధు మాదిరి అందరు రైతులకు సహాయం రావడం లేదు. భార్యాభర్తలిద్దరూ పీఎం కిసాన్ సహాయం పొందడానికి అనర్హులు. ఎవరైనా అలా చేస్తే ప్రభుత్వం వారిని మోసగాళ్లుగా ప్రకటించి వారి నుంచి డబ్బును తిరిగి పొందుతుంది. రైతు కుటుంబంలో ఎవరైనా పన్నులు చెల్లిస్తే వారు ఈ పథకం ప్రయోజనాలకు అర్హులు కారు. అంటే గత సంవత్సరం భర్త లేదా భార్య ఆదాయపు పన్ను చెల్లించినట్లయితే వారు పీఎం కిసాన్ పథకం ప్రయోజనాలకు అర్హులు కారు. ఈ నిబంధనలు ఎత్తివేయాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఒక రైతు మరొక రైతు నుంచి భూమిని సాగు చేయడానికి కౌలుకు తీసుకుంటే వారికి కూడా పీఎం కిసాన్ పథకం ప్రయోజనాలు లభించవు. పీఎం కిసాన్ సహాయం కోసం భూమి యాజమాన్యం అవసరం. ఒక రైతు లేదా కుటుంబ సభ్యుడు రాజ్యాంగ పదవిలో ఉంటే వారికి కూడా పీఎం కిసాన్ డబ్బులు రావు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి