ఈ నెల 15న ఖమ్మంలో సీఎం రేవంత్ సమావేశం
Mahabubabad, Telangana:ఖమ్మం జిల్లాలో సీతారామ సాగునీటి ప్రాజెక్టును ఈ నెలలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో తుమ్మల వైరాలో ఏర్పాటు చేసిన సభ ఏర్పాట్లను పరిశీలించారు. ప్రాజెక్టు ప్రారంభోత్సవం అనంతరం జరిగిన సభలో సీఎం రేవంత్ రూ.2 లక్షల రుణమాఫీని ప్రారంభిస్తామన్నారు. తమది రైతుల ప్రభుత్వమని చెప్పుకుంటున్నారు. సీఎం సభకు పెద్ద ఎత్తున జన సమీకరణ చేస్తున్నామని, సభకు వచ్చే ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నామని తుమ్మల తెలిపారు.
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
Sangareddy Wedding Fraud: అందగత్తె అని ఎదురుకట్నం ఇచ్చి పెళ్లి చేసుకున్నాడు..చివరికి ఫస్ట్నైట్ రోజే..
Sangareddy, Telangana:Sangareddy Wedding Fraud News: ఒంటరి జీవితానికి స్వస్తి చెప్పి, కొత్త జీవితాన్ని ప్రారంభిద్దామని ఆశపడిన ఓ మెకానిక్కు పెళ్లయిన మరుసటి రోజే ఘోరమైన మోసం ఎదురైంది. అందంగా ఉందన్న ఉద్దేశంతో ఎదురుకట్నం ఇచ్చి మరీ వివాహం చేసుకుంటే.. ఫస్ట్నైట్ తిరిగేసరికి భార్య కళ్లుగప్పి పరారైన ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో సంచలనంగా మారింది.
ఘటన వివరాల్లోకి వెళ్తే..
సంగారెడ్డి ప్రాంతానికి చెందిన ఆరిఫుద్దీన్ మెకానిక్గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. 30 ఏళ్ల వైవాహిక జీవితం ఆ వెంటనే మొదటి భార్యతో విడిపోయిన తర్వాత ఒంటరితనం వెంటాడటంతో.. తోడు కోసం మరో వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు. ఈ క్రమంలోనే హైదరాబాద్ పాతబస్తీకి చెందిన ఓ యువతితో అతనికి వివాహం కుదిరింది. అమ్మాయి కుటుంబం ఆర్థిక పరిస్థితి బాగాలేకపోవడంతో పెళ్లి ఖర్చుల నిమిత్తం ఆరిఫుద్దీన్ స్వయంగా రూ.60 వేలు ఎదురుకట్నం ఇచ్చి పెద్దల సమక్షంలో ఘనంగా పెళ్లి చేసుకున్నాడు. జీవితంలో కొత్త ఆశలతో భార్యను ఇంటికి తీసుకెళ్లాడు.
తెల్లారేసరికి షాక్..
అంతా సంతోషంగా గడుస్తుందనుకున్న తరుణంలో మరుసటి రోజు ఉదయం నిద్రలేచి చూసేసరికి భార్య కనిపించకపోవడంతో ఆరిఫుద్దీన్ కంగుతిన్నాడు. ఇల్లంతా వెతికి, బంధువులను ఆరా తీసినా ఎలాంటి ప్రయోజనం లేకపోయింది. రాత్రికి రాత్రే ఆమె పరారవడంతో ఇది ముందస్తుగా వేసిన పక్కా పథకం (ప్లాన్) కావచ్చని భావించాడు.
ఈ మోసంపై వెంటనే పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయడంతో పాటు, తన భార్య క్షేమంగా తిరిగి రావాలని సోషల్ మీడియాలోనూ పోస్ట్ చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. యువతి కాల్ డేటా, స్థానిక సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తును ముమ్మరం చేశారు. కేవలం డబ్బుల కోసమే ఈ పెళ్లి నాటకం ఆడిందా? లేక దీని వెనుక అంతరాత్మను కదిలించే ఇతర కారణాలున్నాయా? అనే కోణంలో పోలీసులు కూపీ లాగుతున్నారు.
Also Read: ఆగస్టులో విద్యార్థులకు పండగే పండగ..ఏకంగా వారం రోజులకు పైగా సెలవులు!
ALso Read: బంగాళాఖాతంలో వేగంగా మారుతున్న వాతావరణం..తెలుగు రాష్ట్రాలకు తుఫాన్ ముప్పు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
NEET UG Counselling: నీట్ విద్యార్థులకు అలర్ట్..కౌన్సిలింగ్ తేదీల షెడ్యూల్ విడుదల..ఆగస్టు 5 నుంచి రిజిస్ట్రేషన్లు షురూ!
Hyderabad, Telangana:NEET UG Counselling Schedule: వైద్య విద్యనభ్యసించాలనుకునే లక్షలాది మంది విద్యార్థులకు మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (MCC) గుడ్న్యూస్ చెప్పింది. నీట్ యూజీ 2026 కౌన్సెలింగ్ పూర్తి షెడ్యూల్ను అధికారికంగా విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 5 నుంచి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు వెసులుబాటు కల్పించారు.
దేశవ్యాప్తంగా ఉన్న 15 శాతం ఆల్ ఇండియా కోటా (AIQ) కింద ఎంబీబీఎస్ (MBBS), BDS, B.Sc. నర్సింగ్ కోర్సులు, ఇతర కేటగిరీ సీట్ల భర్తీకి ఈ ప్రక్రియ కొనసాగనుంది. పూర్తి ఆన్లైన్ విధానంలో జరిగే ఈ కౌన్సెలింగ్లో పాల్గొనే అభ్యర్థులు ముందుగా MCC (మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ) పోర్టల్లోని ఇన్ఫర్మేషన్ బులెటిన్ను క్షుణ్ణంగా చదవాలని సూచించారు.
మొదటి రౌండ్ కౌన్సెలింగ్ కీలక తేదీల వివరాలు ఇలా ఉన్నాయి..
ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: ఆగస్టు 5, 2026
దరఖాస్తుకు చివరి తేదీ: ఆగస్టు 12, 2026
కాలేజీల ఆప్షన్ల ఎంపిక & లాకింగ్: ఆగస్టు 6 నుంచి ప్రారంభం
మొదటి రౌండ్ సీట్ల కేటాయింపు ఫలితాలు: ఆగస్టు 17, 2026
కాలేజీల్లో రిపోర్టింగ్ (అడ్మిషన్ ప్రక్రియ): ఆగస్టు 18 నుంచి ఆగస్టు 22 వరకు
కౌన్సెలింగ్లో ఎవరు అర్హులు?
నీట్ యూజీ 2026 పరీక్షలో కటాఫ్ మార్కులు సాధించి ఉత్తీర్ణులైన అభ్యర్థులు మాత్రమే ఈ కౌన్సెలింగ్కు అర్హులు. నిర్దేశిత పర్సంటైల్ కలిగి ఉండి, గడువులోగా ఆన్లైన్ దరఖాస్తు పూర్తి చేయాలి. అయితే, స్టేట్ కోటా కింద సీటు కోరుకునేవారు సంబంధిత రాష్ట్ర కౌన్సెలింగ్ అథారిటీ ద్వారా విడిగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఆన్లైన్ రిజిస్ట్రేషన్ విధానం..
1) మొదటగా MCC (మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ) అధికారిక వెబ్సైట్ను సందర్శించండి.
2) హోమ్పేజీలో కనిపించే 'NEET UG Counseling 2026' లింక్పై క్లిక్ చేయండి.
3) మీ నీట్ అప్లికేషన్ నంబర్, పాస్వర్డ్తో లాగిన్ అవ్వండి.
4) రిజిస్ట్రేషన్ ఫారమ్ను పూరించి, నిర్దేశిత కౌన్సెలింగ్ ఫీజు చెల్లించండి.
5) వ్యక్తిగత, విద్యా వివరాలను తప్పులు లేకుండా ఎంటర్ చేసి, అవసరమైన సర్టిఫికెట్లను అప్లోడ్ చేయండి.
6) మీ ప్రాధాన్యత ప్రకారం కాలేజీలు, కోర్సులను ఎంచుకుని (ఆప్షన్స్) లాక్ చేసి తుది దరఖాస్తును సమర్పించండి.
అభ్యర్థులు సిద్ధంగా ఉంచుకోవాల్సిన పత్రాలు..
> నీట్ యూజీ 2026 స్కోర్కార్డ్, అడ్మిట్ కార్డ్
> 10వ తరగతి సర్టిఫికేట్ (పుట్టిన తేదీ ధృవీకరణ కోసం)
> 12వ తరగతి లేదా ఇంటర్ మార్క్షీట్, పాసింగ్ సర్టిఫికేట్
> చెల్లుబాటు అయ్యే ఫోటో ఐడీ ప్రూఫ్ (ఆధార్, పాన్ లేదా ఓటర్ ఐడీ)
> రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు
> రిజర్వేషన్ కోరేవారు కుల ధృవీకరణ పత్రం (క్యాస్ట్ సర్టిఫికేట్)
> దివ్యాంగులు లేదా ప్రత్యేక కోటా అభ్యర్థులు సంబంధిత సర్టిఫికెట్లు
> అడ్మిషన్ సమయంలో అన్ని ఒరిజినల్ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది కాబట్టి వాటిని భద్రపరుచుకోవాలి.
సీట్ల కేటాయింపు ఎలా జరుగుతుంది?
రిజిస్ట్రేషన్లు ముగిసిన తర్వాత అభ్యర్థులు ఇచ్చిన ఆప్షన్ల ఆధారంగా సీట్ల కేటాయింపు ప్రక్రియ చేపడతారు. నీట్ ర్యాంక్, రిజర్వేషన్ నిబంధనలు, కేటగిరీ, కాలేజీల్లో అందుబాటులో ఉన్న సీట్ల సంఖ్య (సీట్ మ్యాట్రిక్స్) తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని పారదర్శకంగా సీట్లను కేటాయిస్తారు.
Also Read: ప్రధాని మోదీని బూతులు పట్టిన యువతి..ఇప్పుడు అమాయకంగా క్షమాపణలు చెబుతోంది!
Also Read; E20 పెట్రోల్తో మైలేజ్ తగ్గుతుందా? రాజ్యసభలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్య
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
India Medals At CWG: కామన్వెల్త్ గేమ్స్లో భారత్కు పతకాల పంట..ఒకే రోజు 8 స్వర్ణ పతకాలు..భారత్ ఖాతాలో 39 పతకాలు!
Hyderabad, Telangana:India Medals At CWG 2026: గ్లాస్గో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్లో భారత అథ్లెట్లు సత్తా చాటుతున్నారు. అంచనాలను మించి రాణిస్తూ దేశ కీర్తిని ప్రపంచ వేదికపై సగర్వంగా నిలబెడుతున్నారు. ముఖ్యంగా బాక్సింగ్ రింగ్లో మన క్రీడాకారులు పవర్ఫుల్ పంచ్లతో ప్రత్యర్థులను చిత్తుచేస్తూ పతకాల వర్షం కురిపించారు. ఒకే రోజు ఏకంగా ఐదు స్వర్ణ పతకాలను కైవసం చేసుకుని చరిత్ర సృష్టించారు. ఈ క్రమంలో కామన్వెల్ గేమ్స్ పదో రోజు నాటికి భారత్ ఖాతాలో పతకాల సంఖ్య 39కి చేరింది.
బాక్సింగ్లో పసిడి పరుగు..
మహిళా, పురుషుల బాక్సింగ్ విభాగాలలో మన వీర వనితలు, వీరులు పవర్ఫుల్ పంచ్లతో ప్రత్యర్థులను చిత్తుచేశారు. మహిళల విభాగంలో ప్రీతి పవార్ (54 కేజీలు), జైస్మిన్ లాంబోరియా (57 కేజీలు), ప్రియా ఘంగాస్ (60 కేజీలు), సాక్షి చౌదరి (51 కేజీలు), అరుంధతి చౌదరి (70 కేజీలు) అద్భుత విజయాలతో స్వర్ణ పతకాలను సాధించారు. లవ్లీనా బోర్గోహైన్ (75 కేజీలు) రజత పతకంతో మెరిశారు.
అదే విధంగా పురుషుల విభాగం సచిన్ శివాచ్ (60 కేజీలు), అంకుష్ పంఘాల్ (80 కేజీలు) పసిడి పతకాలు గెలుచుకోగా.. నరేందర్ బెర్వాల్ (90+ కేజీలు), జదుమణి సింగ్ రజత పతకాలు సాధించారు.
ఇతర క్రీడల్లోనూ మెరిసిన భారత్..
అథ్లెటిక్స్లో పురుషుల 5000 మీటర్ల ఫైనల్లో గుల్వీర్ సింగ్ అద్భుత ప్రదర్శనతో కాంస్య పతకం సాధించి, కామన్వెల్త్ చరిత్రలో ఈ ఈవెంట్లో పతకం సాధించిన తొలి భారతీయ అథ్లెట్గా రికార్డు సృష్టించారు. అలాగే పురుషుల ట్రిపుల్ జంప్లో ప్రవీణ్ చిత్రవేల్ రజతం, సెల్వ ప్రభు తిరుమరన్ కాంస్యం కైవసం చేసుకున్నారు.
పారా షాట్ పుట్: పురుషుల F57 విభాగంలో రాణా (13.40 మీటర్లు) స్వర్ణం సాధించగా, శుభమ్ జుయాల్ రజతం గెలుచుకుని భారత్కు 'వన్-టూ' ఘనతను అందించారు.
జూడో: మహిళల 63-కేజీల విభాగంలో ఉన్నతి శర్మ అద్భుతమైన ఇప్పోన్ విజయంతో కాంస్య పతకాన్ని సొంతం చేసుకున్నారు.
పతకాల పట్టికలో నాలుగో స్థానానికి భారత్
బాక్సర్లు, ఇతర అథ్లెట్ల అసాధారణ ప్రతిభతో భారత్ కామన్వెల్త్ గేమ్స్ పతకాల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకింది. ప్రస్తుతం భారత్ ఖాతాలో మొత్తం 39 పతకాలు (13 స్వర్ణాలు, 17 రజతాలు, 9 కాంస్యాలు) చేరాయి. క్రీడా రంగంలో మహిళలు, పురుషులు ఇద్దరూ సమానంగా రాణిస్తూ దేశకీర్తిని ప్రపంచ వేదికపై చాటుతుండటంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
Also Read: కామన్వెల్త్ గేమ్స్లో అద్భుతం..నీరజ్ చోప్రాకు రజతం..యశ్వీర్ సింగ్కు కాంస్య పతకం
Also Read: కామన్వెల్త్ గేమ్స్లో ఫైనల్కు చేరిన మరో భారత అథ్లెట్..బంగారం వేటలో బాక్సర్ ప్రీతి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
KTR: ఢిల్లీలో కదం తొక్కిన జెన్ జీ.. మెడలు వంచిన మోదీ
Hyderabad, Telangana:KTR Reacts On Gen Z Movement And Students Protest Watch VideoKTR: దేశ తలరాతను నిర్ణయించేది జెన్ జీ ఓటర్లే.. అప్రమత్తం కావాలి: కేటీఆర్
Hyderabad, Telangana:KTR Speech: దేశ తలరాతను నిర్ణయించేది జెన్జీ ఓటర్లేనని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. పత్రికా స్వేచ్ఛపై ఉక్కుపాదం.. నిజాలు చెప్పేవారిని జైల్లో పెడుతున్నారని గుర్తుచేశారు. హేట్ స్పీచ్ బిల్లు తెచ్చే ముందు పాలకులే విద్వేష ప్రసంగాలు మానాలని రేవంత్ రెడ్డికి హితవు పలికారు. మీడియా, రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు కొత్త తరాన్ని అర్థం చేసుకుని మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా తమను తాము మార్చుకోవాల్సిన అవసరం ఉందని గుర్తుచేశారు.
ఓ దినపత్రిక వార్షికోత్సవం సందర్భంగా శనివారం హైదరాబాద్లో నిర్వహించిన 'రాజ్యాంగం-ప్రజాస్వామ్యం-పత్రికా స్వేచ్ఛ' అనే అంశంపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక ప్రసంగం చేశారు. సీపీఐ, సీపీఐ(ఎం), కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్న సభా వేదికపై కేటీఆర్ ఆసక్తికర ప్రసంగం చేశారు. కొందరు సభపైన ఉన్న వారికే చురకలు అంటించారు. కచ్చితంగా కేసీఆర్ ముఖ్యమంత్రిగా తర్వాత జరిగే ఈ పత్రిక వార్షికోత్సవానికి వస్తారని ప్రకటించడం ఆసక్తికరంగా నిలిచింది.
కేసీఆర్ గారు నవతెలంగాణ పత్రిక పుట్టినప్పుడు వచ్చారు..
మళ్లీ 14వ వార్షికోత్సవానికి కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా వస్తారు.- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS pic.twitter.com/zm03lJSAtp
— BRS Party (@BRSparty) August 1, 2026
'వచ్చే 2029 ఎన్నికల నాటికి దేశంలో 50 శాతానికి పైగా ఓటర్లు జెన్ జీ యువతే ఉంటారు. దేశ తలరాతను నిర్ణయించేది వారే. దీంతో మీడియా, రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు కొత్త తరాన్ని అర్థం చేసుకుని మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మార్చుకోవాల్సిన అవసరం ఉంది' అని మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. దేశంలో పత్రికా స్వేచ్ఛ క్రమంగా హరిస్తున్నారని.. నిజాలు చెప్పేవారిని జైళ్లకు పంపుతున్నారని, ప్రభుత్వాలు మీడియాను నియంత్రించే ప్రయత్నాలు చేస్తున్నాయని విమర్శించారు.
'ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ఉనికి కోసం పోరాడుతుండగా, సోషల్ మీడియా ప్రభావం వేగంగా పెరుగుతోంది. ఓ సంస్థ అధ్యయనం ప్రకారం 18 నుంచి 24 ఏళ్ల యువతలో 56 శాతం మంది వార్తాపత్రికలు చదవడం లేదు. సోషల్ మీడియా ద్వారానే వార్తలు తెలుసుకుంటున్నారు. నేటి తరం వార్తలను తమకు అవసరమైనప్పుడు మాత్రమే వినియోగిస్తోంది. మీడియా కూడా కాలానికి అనుగుణంగా మారకపోతే వెనుకబడిపోతుంది' అని మీడియా రంగానికి మాజీ మంత్రి కేటీఆర్ హెచ్చరించారు.
A statesman who rises above petty politics. @KTRBRS pic.twitter.com/UK23fi3vra
— Prof Dasoju Sravan Kumar (@sravandasoju) August 1, 2026
'ఢిల్లీలో ఇటీవల యువత చేపట్టిన ఆందోళనలు సంప్రదాయ రాజకీయాలకు భిన్నంగా సాగాయి. కొత్త తరానికి దేశం, సమాజం పట్ల అపారమైన కమిట్మెంట్ ఉందని ఆ ఉద్యమం నిరూపించింది. ప్రధాన మీడియా పట్టించుకోకపోయినా యువత దేశవ్యాప్తంగా చర్చను మార్చగలిగింది' అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గుర్తుచేశారు. దేశంలో మీడియా స్వేచ్ఛపై ఆంక్షలు పెరుగుతున్నాయని, మీడియా మేనేజ్మెంట్, హెడ్లైన్ మేనేజ్మెంట్, నెరేటివ్ మేనేజ్మెంట్ ద్వారా ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
'వార్తను వార్తగా రాసే పరిస్థితి లేకుండా పోయింది. కేంద్రమంత్రి కుమారుడిపై వచ్చిన లైంగిక దాడి ఆరోపణలు, లగచర్ల ఘటన, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల అంశాలను ప్రధాన మీడియా నిర్లక్ష్యం చేసింది' అని మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రభుత్వంలో ఉన్నవారే ముందుగా విద్వేష ప్రసంగాలు మానేసిన తర్వాతే హేట్ స్పీచ్ బిల్లు తీసుకురావాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి సూచించారు. సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ న్యూస్తో పాటు ప్రధాన మీడియాలో వచ్చే తప్పుడు ప్రచారాలపై కూడా ఫ్యాక్ట్ చెక్ జరగాలని మీడియాకు కేటీఆర్ సూచనలు చేశారు.
ప్రగతి భవన్లో 152 బెడ్రూమ్లు ఉన్నాయనే ప్రచారం, కాళేశ్వరం ప్రాజెక్టుపై తప్పుడు ఆరోపణలు, ఫోన్ ట్యాపింగ్ అంశాల్లో జరిగిన ప్రచారాలను ఉదాహరణగా మాజీ మంత్రి కేటీఆర్ ప్రస్తావన చేశారు. మీడియా అధికారాన్ని చూసి భయపడడం ప్రారంభిస్తే ప్రజాస్వామ్యం బలహీనపడుతుందని పేర్కొన్నారు. మంచి జరిగితే మంచిగా, తప్పు జరిగితే తప్పుగా నిర్భయంగా రాయాలని సూచించారు.
Telangana: తెలంగాణ రైజింగ్-2047లో భాగస్వామ్యం కావాలి: ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు పిలుపు
Hyderabad, Telangana:Hyderabad: తెలంగాణ రైజింగ్- 2047 లక్ష్యసాధనలో భాగస్వామ్యం కావాలని కార్పొరేట్ సంస్థలకు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పిలుపునిచ్చారు. 'ఆర్థిక వృద్ధితోపాటు సామాజిక పురోగతి సమాంతరంగా సాగేలా.. ఆవిష్కరణల ద్వారా ఉపాధి అవకాశాలు సృష్టించేలా.. అభివృద్ధి ప్రతి నియోజకవర్గానికి, దాని ఫలాలు సమాజంలోని ప్రతి వర్గానికి చేరేలా ఈ బృహత్తర ప్రణాళికను రూపొందించాం' అని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.
ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా (ఐసీఎస్ఐ), హైదరాబాద్ ఛాప్టర్ ఆధ్వర్యంలో హైదరాబాద్ కొండాపూర్లోని తెలంగాణ కాంట్రాక్టర్స్ కల్చరల్ క్లబ్లో రెండ్రోజుల పాటు జరుగుతున్న ‘50వ సదరన్ ఇండియా రీజినల్ కాన్ఫరెన్స్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్’ను శనివారం మంత్రి శ్రీధర్ బాబు లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం కీలక ప్రసంగం చేశారు. 'కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) ద్వారా తెలంగాణ అభివృద్ధిలో భాగం కావాలి. ప్రభుత్వం, పరిశ్రమలు, సమాజం సమష్ఠిగా కృషి చేస్తేనే రాష్ట్ర సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుంది' అని ప్రకటించారు.
Inaugurated the 50th Southern India Regional Conference of Company Secretaries 2026, organised by the Hyderabad Chapter of The Institute of Company Secretaries of India (ICSI), at the Telangana Contractors Cultural Club, Kondapur.
Glad to interact with over 700 Company… pic.twitter.com/lE40jrBhnE
— Sridhar Babu Duddilla (@OffDSB) August 1, 2026
'తెలంగాణ రైజింగ్-2047' అనేది కేవలం ప్రభుత్వ కార్యక్రమం కాదని.. సమాజంలోని అన్ని వర్గాల భాగస్వామ్యంతో సాకారమయ్యే అభివృద్ధి విజన్ అని శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ఆర్థిక వృద్ధితో పాటు సామాజిక పురోగతి సమాంతరంగా సాగేలా.. ఆవిష్కరణల ద్వారా ఉపాధి అవకాశాలు సృష్టించేలా.. అభివృద్ధి ఫలాలు ప్రతి వర్గానికి చేరేలా ఈ బృహత్తర ప్రణాళికను రూపొందించినట్లు వెల్లడించారు. ఈ లక్ష్య సాధనలో ప్రభుత్వం... పరిశ్రమలు, విద్యాసంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ రంగం భాగస్వామ్యానికి అత్యంత ప్రాధాన్యమిస్తోందని తెలిపారు.
సీఎస్ఆర్ ద్వారా సమాజంలో మార్పు తెచ్చే కార్యక్రమాల అమలుకు, పరిశ్రమల స్థాపనకు సంబంధించి ప్రతి దశలోనూ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు భాగస్వామిగా, సహాయకారిగా ఉంటుందని మంత్రి శ్రీధర్ బాబు భరోసా ఇచ్చారు. ఏఐ, డేటా గవర్నెన్స్, సైబర్ భద్రత వంటి అంశాలు కార్పొరేట్ ప్రపంచంలో కొత్త సవాళ్లుగా మారుతున్న నేపథ్యంలో కంపెనీ సెక్రటరీలు.. కేవలం కంప్లయన్స్ నిపుణులుగా కాకుండా స్ట్రాటజిక్ బోర్డ్ అడ్వైజర్లుగా మారాల్సిన అవసరం ఉందని గుర్తుచేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో కంపెనీలు కేవలం లాభార్జనే కాకుండా సస్టైనబుల్, ఎథికల్ వ్యాపార వృద్ధిపై దృష్టి సారించాలని సూచించారు. మరిన్ని కార్పొరేట్ కంపెనీలు, సంస్థలు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
Traffic Alert: వాహనదారులకు బిగ్ అలర్ట్.. రేపు, ఎల్లుండి సికింద్రాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు
Secunderabad, Telangana:Secunderabad Traffic Diversions: వాహనదారులకు రేపు, ఎల్లుండి బిగ్ అలర్ట్. రెండు రోజుల పాటు హైదరాబాద్ నగరంలో భారీ ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి. ఈ మేరకు వాహనదారులతోపాటు ట్రాఫిక్ పోలీసులకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఆషాఢ మాసంలో ప్రతియేటా సికింద్రాబాద్ ప్రాంతంలో అంగరంగ వైభవంగా బోనాలు జరుగుతాయి. ఈ ఏడాది ఆషాఢ మాస బోనాల సందర్భంగా సికింద్రాబాద్ ప్రాంతంలో వాహనాల దారి మళ్లింపు చేయనున్నారు.
సికింద్రాబాద్లో ఆగస్టు 2వ తేదీ నుంచి 4 వరకు జరగనున్న ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర బందోబస్తు విధుల్లో పాల్గొంటున్న ట్రాఫిక్ పోలీస్ అధికారులకు, సిబ్బందికి హైదరాబాద్ ట్రాఫిక్-I డీసీపీ అవినాశ్ కుమార్ శనివారం సమగ్ర అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశంలో ట్రాఫిక్ అడిషనల్ డీసీపీ రాములు, ట్రాఫిక్ సికింద్రాబాద్ జోన్ ఏసీపీ శ్రీనివాస్, ట్రాఫిక్ ఖైరతాబాద్ జోన్ ఏసీపీ మోహన్ కుమార్, ఇతర అధికారులు లక్ష్మణ్, సీహెచ్ శోభన్ బాబు ఉన్నారు.
జాతర సందర్భంగా భక్తులకు, వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వేడుకలు ప్రశాంత వాతావరణంలో ముగిసేలా చూడాలని హైదరాబాద్ ట్రాఫిక్-I డీసీపీ అవినాశ్ కుమార్ అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర నేపథ్యంలో సిబ్బందికి పలు సూచనలు చేశారు. స్థానిక ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లతో జాతర పరిసర ప్రాంతాలను క్షేత్ర స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి కావాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు.
పోలీసులకు సూచనలు
==> బోనాల జరిగే ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ ఏర్పడకుండా ముందస్తుగా రూపొందించిన ట్రాఫిక్ మళ్లింపు ప్రణాళికలను పకడ్బందీగా అమలు చేయాలి.
==> భక్తుల రద్దీని నియంత్రించడంలో, పార్కింగ్ స్థలాల వద్ద వాహనాలను క్రమబద్ధీకరించడంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
==> లా అండ్ ఆర్డర్ పోలీసులు, ఇతర ప్రభుత్వ శాఖల అధికారులతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ విధులు నిర్వహించాలి.
==> జాతరకు వచ్చే భక్తులు, వాహనదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ వారికి అవసరమైన సహాయ సహకారాలు తక్షణమే అందించాలి.
==> ప్రజా సౌకర్యం, భద్రతే ధ్యేయంగా ప్రతి ఒక్క అధికారి అప్రమత్తంగా విధి నిర్వహణలో నిమగ్నం కావాలి.
Wines Close: మందుబాబులకు బిగ్ అలర్ట్.. రేపు, ఎల్లుండి వైన్స్ షాపులు బంద్
Secunderabad, Telangana:Wine Shops Close For Two Days: మందుబాబులకు బ్యాడ్న్యూస్. రెండు రోజుల పాటు మద్యం దుకాణాలు బంద్ ఉండనున్నాయి. రెండు రోజులు మద్యం దుకాణాలు మూసివేయాలని అధికార యంత్రాంగం ఉత్తర్వులు జారీ చేసింది. ఒక్క మద్యం దుకాణాలే కాకుండా బార్లు కూడా మూతపడనున్నాయి. హైదరాబాద్లోని ప్రధాన ప్రాంతమైన సికింద్రాబాద్ ప్రాంతంలో వైన్స్ మూసివేయనున్నారు. ఇంతకీ ఎందుకంటే సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల సందర్భంగా మద్యం విక్రయాలు బంద్ పెట్టారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఈ మేరకు మద్యం దుకాణాలు మూత వేయనున్నారు.
ఆషాఢమాసంలో రెండో ఆదివారం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి జాతర అంగరంగ వైభవంగా చేస్తుంటారు. సికింద్రాబాద్ బోనాలను పురస్కరించుకుని రెండు రోజులు మద్యం దుకాణాలు మూసివేయనున్నారు. ఆగస్టు 2వ తేదీ ఉదయం 6 గంటల నుంచి ఆగస్టు 4 ఉదయం 6 గంటల వరకు మద్యం దుకాణాలు మూసివేయాలని పోలీసులతోపాటు ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. బోనాల జాతర నేపథ్యంలో వైన్ షాపులు, కల్లు దుకాణాలు, బార్లకు రెండు రోజుల పాటు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు.
సికింద్రాబాద్ బోనాల సందర్భంగా మార్కెట్, గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని వైన్ షాపులు, కల్లు దుకాణాలు, రెస్టారెంట్లకు అనుబంధ బార్లు మూసివేయాలని పోలీసులు ఆదేశించారు. మల్కాజిగిరి జోన్ పరిధిలో ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. శాంతిభద్రతల పరిరక్షణ, బోనాల వేడుకలు ప్రశాంతంగా జరిగేందుకు ఈ మేరకు పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. పోలీసులకు ప్రజలు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. అయితే నిబంధనలు ఉల్లంఘించి మద్యం విక్రయాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికార యంత్రాంగం హెచ్చరికలు జారీ చేసింది.
