భద్రాద్రి కొత్తగూడెం:ఏసీబీ వలలో అవినీతి చేప
Mahabubabad, Telangana:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్లో ఏసీబీ అధికారులు రైడ్ చేసారు. ఈ రైడ్ లో రూ. లక్ష 14 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి హార్టికల్చర్ అధికారి సూర్యనారాయణ రెడ్ హ్యాండెండ్ గా పట్టుపడ్డారు. సూర్యనారాయణను అదుపులోకి తీసుకున్న ఏసిబి డిఎస్పి వై.రమేష్ విచారణను కొనసాగిస్తున్నారు. డ్రిప్ ఇరిగేషన్ కు సంబందించి సబ్సిడీ పొందేందుకు సర్టిఫై చేయడం కోసం లంచం డిమాండ్ చేసాడు.हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
Telangana: సర్పంచ్ భార్య.. సంతకం భర్తది! సిరిసిల్ల జిల్లాలో వింత ఘటన..
Sircilla, Telangana:Rajanna Sircilla News: రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలంలో ఒక వింతైన ఘటన వెలుగులోకి వచ్చింది. మహిళా సాధికారత కోసం ప్రభుత్వం రిజర్వేషన్లు కల్పించి మహిళలను పదవుల్లో కూర్చోబెడుతుంటే.. క్షేత్రస్థాయిలో మాత్రం భర్త పాలన కొనసాగుతోందని విమర్శలకు ఈ ఘటన నిదర్శనంగా నిలుస్తోంది. అధికార రిజిస్టర్లు సర్పంచ్కు బదులుగా ఆమె భర్త సంతకం చేయడం ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
మంగళవారం మండలంలోని రంగపేట గ్రామ అంగన్వాడీ కేంద్రంలో ఆఫ్టర్ కేర్ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ ప్రతినిధులతో పాటు అధికారులు హాజరయ్యారు. ఈ కార్యక్రమం విజయవంతంగా ముగిసిన అనంతరం.. నిబంధనల ప్రచారం విచ్చేసిన ఆధితులు వివరాలతో పాటు వారి అభిప్రాయాలను అంగన్వాడి అధికారిక రిజిస్టర్లు నమోదు చేయాల్సి ఉంటుంది. అయితే ఈ సమయంలోనే అసలు విషయం బయటపడింది..
అతిథుల సంతకాలు సేకరిస్తున్న క్రమంలో ప్రోటోకాల్ ప్రకారం.. ముందుగా గ్రామ సర్పంచ్ సంతకం చేయాల్సి ఉంటుంది.. అయితే, అక్కడ ఉన్న సర్పంచ్ భాగ్యలక్ష్మి కంటే ముందే ఆమె భర్త పరశురాములు చొరవ తీసుకున్నారు.. అధికారిక రిజిస్టర్లు సర్పంచ్ సంతకం చేయాల్సిన చోట ఆయన సంతకం చేసి.. పక్కన బ్రాకెట్లో సర్పంచ్ అని రాశారు.. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే భర్త సంతకం చేసిన తర్వాతే సర్పంచ్ భార్య దాని కింద సంతకం చేశారు. ఇది చూసిన అక్కడి సిబ్బందితో పాటు అతిధులు ఒక్కసారిగా ఆశ్చర్య పోయారట..
ప్రభుత్వ నిబంధనలు ప్రకారం ఏ అధికారిక పత్రం మీదైన సర్పంచ్ మాత్రమే సంతకం చేయాల్సి ఉంటుంది.. భర్తకు ఎటువంటి అధికారిక హోదా లేకపోయినప్పటికీ.. ఏకంగా రిజిస్టర్లోని సంతకం చేయడంపై అక్కడి అధికారులతో పాటు విపక్షాలు మండిపడుతున్నాయి. ప్రభుత్వ రికార్డుల్లో అనధికార వ్యక్తులు సంతకం చేయడం చట్ట విరుద్ధమని మేధావులు సైతం పేర్కొంటున్నారు. మహిళా సర్పంచులు ఉన్నచోట వారి భర్తలు షాడో సర్పంచులుగా వ్యవహరిస్తున్నారని చెప్పడానికి ఇదొక నిదర్శనమని గ్రామస్తులు గుసగుసలాడుతున్నారు..
Also Read: Samar Cobra Video: అత్యంత అరుదైన సమర్ కోబ్రా.. పడగ విప్పి ఏం చేస్తుందో చూడండి.. వీడియో!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Python Video: కాలువలో కొండచిలువ.. ప్రాణాలకు తెగించి బయటకు లాక్కొచ్చిన వృద్ధుడు! వీడియో..
Hyderabad, Telangana:Old Man Catching Python Viral Video Watch: సాధారణంగా పాము కనిపిస్తేనే ఆమడ దూరం పరిగెత్తే వారు ఎందరో ఉంటారు. అలాంటిది ఏకంగా ఒక భారీ కొండచిలువను అది కూడా ఒక వృద్ధుడు అత్యంత నిస్సహాయ స్థితిలో భయం లేకుండా పట్టుకోవడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అంతేకాకుండా ఆ వ్యక్తి ఒక పెద్ద కాలువలో నుంచి ఆ పామును పట్టుకొని రక్షించేందుకు బయటకు తీసుకురావడం ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ గా మారింది. దీనికి సంబంధించిన వీడియో చూసిన వారంతా ఆశ్చర్యానికి గురవుతున్నారు.
వృద్ధుడు కొండచిలువను ఎక్కడ పట్టాడు?
వైరల్ అవుతున్న వీడియో వివరాల్లోకి వెళ్తే.. ఒక లోతైన నీటి కాలువలు భారీ కొండచిలువ ఉన్నట్లు స్థానికులు గుర్తించారు.. అయితే దానిని పట్టుకోవడానికి ఎవరు సహించని తరుణంలో.. ఒక వృద్ధుడు రంగంలోకి దిగాడు. ఆ వృద్ధుడు ఆ కాలువలోకి దిగి ఆ భారీ సర్పాన్ని పట్టుకొని పైకి తీసుకొస్తున్న తీరును మీరు ఈ వీడియోలో కళ్ళకు కట్టినట్లు చూడొచ్చు.. సాధారణంగా వృద్ధులు ఇలాంటి పనులు చేసేందుకు వెనకాడుతూ ఉంటారు.
ఆ వృద్ధుడు చేసిన పనికి సోషల్ మీడియా వినియోగదారులంతా ఆశ్చర్యపోతున్నారు. ఆ వృద్ధుడు తన ఎడమ చేతిలో కొండచిలువ తలభాగం కదలకుండా బలంగా పట్టుకున్నాడు. మరో చేతిలో తోక భాగాన్ని పట్టుకొని ఆ భారీ జీవికి ఎలాంటి హాని కలిగించకుండా ఎంతో సులభంగా పట్టుకొని పనికి తీసుకురావడం మీరు చూడొచ్చు. వయస్సు పై పడినప్పటికీ ఆయన ఎంతో చురుకుగా కాలువ లోపలి నుంచి గట్టుపైకి ఆ కొండచిలువను పట్టుకొని తీసుకురావడం విశేషం.. సాధారణంగా ఇలాంటి స్థితిలో ఉన్నప్పుడు చాలామంది ఇంట్లో కదల లేకుండా మంచానికే పరిమితం అవుతారు. కానీ ఈ తాత మాత్రం అత్యంత ప్రమాదకరమైన కొండచిలువను రక్షిస్తున్న తీరు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
ఈ వీడియో ఎవరో మొబైల్ ఫోన్లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అధి కాస్త కొన్ని గంటల్లోనే లక్షలాది వ్యూస్ సంపాదించుకుంది. వయస్సు కేవలం అంకె మాత్రమే.. ధైర్యం ఉంటే ఏదైనా సాధ్యమే అంటూ సోషల్ మీడియా వినియోగదారులు కామెంట్లు చేస్తూ వస్తున్నారు. ఇక మరి కొంతమంది అంత పెద్ద పాముతో అప్రమత్తంగా ఉండాలని.. ఇది ప్రాణాలకే ప్రమాదం కావచ్చుని సూచిస్తున్నారు. ఏది ఏమైనా ఇప్పుడు ఈ వీడియో మాత్రం సోషల్ మీడియా వినియోగదారులను ఆకట్టుకుంటుంది..
Also Read: Samar Cobra Video: అత్యంత అరుదైన సమర్ కోబ్రా.. పడగ విప్పి ఏం చేస్తుందో చూడండి.. వీడియో!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Lakshmi Narayana Rajayoga: శుక్ర, బుధుల కలయికతో లక్ష్మీనారాయణ యోగం.. ఆ 4 రాశుల వారికి తిరుగుండదు ఇక!
Hyderabad, Telangana:Lakshmi Narayana Rajayoga Effect On Zodiac: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. అన్ని గ్రహాలు కదలికలు చేయడం కారణంగా కొన్ని రాశుల వారిపై ప్రత్యేకమైన ప్రభావం పడుతూ ఉంటుంది. అది జీవితంలో ఎన్నో రకాల మార్పులకు దారి తీయవచ్చు. ముఖ్యంగా కొన్ని రకాల శక్తివంతమైన రాజయోగాలు ఏర్పడడం వల్ల దాని ప్రభావంతో కొన్ని రాశుల వారు రాత్రికి రాత్రే కోటీశ్వరులయ్యే యోగం కూడా ఉంటుంది. లక్ష్మీనారాయణ రాజయోగం వంటి రాజయోగాల ప్రభావం వల్ల ఆయా రాశుల వారికి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం తెలివితేటలు వ్యాపారానికి కారకుడైన శుక్రుడితో పాటు బుధుడి కలయిక కారణంగా ఈ యోగం ఏర్పడబోతోంది. దీని ఫలితంగా నాలుగు రాశుల వారికి అదృష్టం తిరిగి వస్తుంది. అలాగే ఆర్థిక సమస్యలు కూడా ఎంతో సులభంగా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి.
మే 14వ తేదీన శుక్రుడు మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు.. అలాగే మే 29న బుధుడు కూడా ఈ రాశిలోకి సంచారం చేస్తాడు. దీని ఫలితంగా ఈ శుభయోగం ఏర్పడబోతోంది. ఈ యోగంతో నాలుగు రాశుల వారికి సంపాదన విపరీతంగా లభిస్తుంది. ముఖ్యంగా స్త్రీ, పురుషులకు ఈ సమయంలో అదృష్టం తిరిగి వస్తుంది. లక్ష్మీనారాయణ రాజయోగం ప్రభావం తో వృత్తిపరంగా అద్భుతమైన పురోగతి కూడా లభించే అవకాశాలు ఉన్నాయి.
ఈ రాజయోగం వల్ల ఎవరికి లాభం?
ధనుస్సు రాశి
లక్ష్మీనారాయణ రాజయోగ ప్రభావంతో అదృష్టం విపరీతంగా పెరుగుతుంది. ముఖ్యంగా కొత్త ఉద్యోగాలు కూడా లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. పాత ఉద్యోగాల్లో జీతాలు విపరీతంగా పెరుగుతాయి. వ్యాపారాలు చేస్తున్న వారికి ఈ సమయంలో భారీ లాభాలు కలిగే అవకాశాలున్నాయి. ముఖ్యంగా చాలా కాలంగా పెండింగ్లో ఉన్న కేసులు కూడా ఈ సమయంలో సులభంగా పరిష్కారమవుతాయి. అంతేకాకుండా విదేశాలకు వెళ్లాలనుకునే వ్యక్తులకు ఈ సమయంలో అద్భుతమైన అవకాశాలు కూడా లభించుతాయి. కాబట్టి ఆందోళన చెందకుండా కెరీర్ పై ప్రత్యేకమైన శ్రద్ధ వహించడం చాలా మంచిది.
మిధున రాశి
మిథున రాశిలో జన్మించిన వ్యక్తులకు ఈ సమయంలో ఉత్తమ ఫలితాలు కలుగుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఉద్యోగాల్లో గొప్ప అభివృద్ధి లభించడమే కాకుండా.. వ్యాపారాలు చేస్తున్న వారికి విశేషమైన ప్రయోజనాలు కలిగే అవకాశాలున్నాయి. నిలిచిపోయిన పనులు కూడా ఇప్పుడు సులభంగా పూర్తవుతాయి. అంతేకాకుండా డబ్బులు సమస్యలు కూడా ఎంతో సులభంగా తొలగిపోయి అవకాశాలు కనిపిస్తున్నాయి. వీరికి ఈ సమయంలో అనేక రకాల దీర్ఘకాలిక సమస్యలు దూరం అవుతాయి..
కన్య రాశి
కన్యారాశిలో జన్మించిన వ్యక్తులకు లక్ష్మీనారాయణ రాజయోగం కారణంగా ఉద్యోగాల్లో అద్భుతమైన పురోగతి కూడా లభించబోతోంది. వీరికి కొత్త బాధ్యతలు లభించడమే కాకుండా బాస్ మిమ్మల్ని అద్భుతంగా నమ్మి ప్రమోషన్స్ ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. పాత పనుల్లో ఏర్పడిన జాప్యం ఇప్పుడు పూర్తిగా తొలగిపోబోతోంది. దీని కారణంగా ఆపనుల్లో కూడా విజయాలు సాధించగలుగుతారు. అలాగే వ్యాపార రంగాల్లో ఉన్న వ్యక్తులకు వ్యాపారం విపరీతంగా పెరుగుతుంది. ఈ సమయంలో భారీ అభివృద్ధి కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా మానసిక సమస్యల నుంచి ఎంతో సులభంగా ఉపశమనం కలుగుతుంది.
తులారాశి
తులా రాశిలో జన్మించిన వ్యక్తులకు ఎంతో శక్తివంతమైన ఈ లక్ష్మీనారాయణ రాజయోగం కారణంగా అదృష్టం కలిసి రాబోతోంది. వ్యాపారాల్లో అద్భుతమైన విజయాలు కూడా కలుగుతాయి. కొత్త ఒప్పందా కుదుర్చుకోవడమే కాకుండా.. విపరీతమైన పెట్టుబడులు పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే డబ్బు గురించి ఆలోచించే వారికి కూడా ఈ సమయం చాలా అద్భుతంగా ఉండబోతోంది. ముఖ్యంగా కొత్త ఆదాయ మార్గాలు లభించి సంపాదన కూడా విపరీతంగా పెరుగుతుంది. అనుకున్న ధన లాభాలు పొంది.. ఊహించని విజయాలు సాధించగలుగుతారు..
NOTE: ఇది కేవలం జ్యోతిష్య నిపుణుల సమాచారం, నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది..
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Dharmapuri Temple: ధర్మపురి క్షేత్ర పునర్నిర్మాణానికి ప్రజలు సహకరించాలి.. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పిలుపు!
Hyderabad, Telangana:Dharmapuri Temple Latest News: దక్షిణ కాశీగా పేరుగాంచిన ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ సర్వతోముఖాభివృద్ధికి ప్రజలు, భక్తులు పూర్తిస్థాయిలో సహకరించాలని రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావుతో పాటు జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ తో కలిసి ఆలయాన్ని సందర్శించారు. స్వామివారికి ప్రత్యేకమైన పూజలు నిర్వహించిన అనంతరం.. ఆలయ మాస్టర్ ప్లాన్ పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించినట్లు సమాచారం. అంతేకాకుండా అధికారులతో గుడికి సంబంధించిన డెవలప్మెంట్ అంశాలను కూడా చర్చించినట్లు తెలుస్తోంది.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. గత ప్రభుత్వాలు ధర్మపురి ఆలయ అభివృద్ధిని పూర్తిగా విస్మరించాయని విమర్శించారు. ఎంతో చరిత్ర కలిగిన ఈ ఆలయ అభివృద్ధి అప్పట్లో కేవలం మాటలకే పరిమితం చేశారని.. సరైన నిధులు కేటాయించకుండా భక్తుల సౌకర్యాలను గాలికి వదిలేసారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా పోయిన ప్రభుత్వాన్ని ధర్మపురి ఆలయ అభివృద్ధికి ఏమాత్రం సహాయం చేయలేవని అన్నారు.. ధర్మపురి క్షేత్ర వైభవాన్ని చాటి చెప్పేలా.. భక్తులకు మెరుగైన వసతులు కల్పించడమే ప్రస్తుత ప్రభుత్వ ధ్యేయమని మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం ఆధ్యాత్మిక క్షేత్రాల అభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు. ముఖ్యంగా 2027 గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకొని. అప్పటికి వచ్చే లక్షలాదిమంది భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించినట్లు మంత్రి అడ్డూరి లక్ష్మణ్ తెలిపారు..
భక్తులకు గంటల తరబడి వేచి ఉండకుండా ఆధునిక క్యూలైన్ కాంప్లెక్స్ నిర్మాణాలను చేపడతామని మాస్టర్ ప్లాన్లు పేర్కొన్నారు. అంతేకాకుండా స్నాన గాట్లతో పాటు ప్రత్యేకమైన భద్రత, పరిశుభ్రతకు పెద్దపీట వెయ్యబోతున్నట్లు కూడా ఆ ప్లాన్లో వివరించారు. దీంతోపాటు ఆలయానికి వచ్చే రహదారుల విస్తరణతో పాటు పార్కింగ్ సదుపాయాలు, దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం తక్కువ ధరకే వసతి కల్పించబోతున్నట్లు కూడా తెలిపారు.
Also Read: Chandrababu: విశాఖ విశ్వనగరం అన్స్టాపబుల్.. ఎవరూ ఆపలేరు: చంద్రబాబు
దేవాదాయ శాఖ కమిషనర్తో పాటు కలెక్టర్ తో సమీక్ష నిర్వహించిన మంత్రి.. మాస్టర్ ప్లాన్ పనుల్లో నాణ్యత పాటించాలని సూచించారు. నిధుల కోరత లేకుండా చూస్తామని.. గడువులోగా పనులు పూర్తి చేయాలని ఆదేశాలు కూడా జారీ చేశారు. భక్తుల మనోభావాలకు అనుగుణంగా. ఆగమన శాస్త్రం నిబంధనలు పాటిస్తూనే అభివృద్ధి పనులు చేపట్టాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ ప్రజా ప్రతినిధులతో పాటు ఆలయ అర్చకులు, అధికారులు పాల్గొన్నారు..
Also Read: Chandrababu: విశాఖ విశ్వనగరం అన్స్టాపబుల్.. ఎవరూ ఆపలేరు: చంద్రబాబు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Singer Mangli: యూట్యూబ్ చానళ్లపై మంగ్లీ ఫిర్యాదు! మేనేజర్ తీవ్ర ఆరోపణలు
Hyderabad, Telangana:Mangli Micro Finance Scam: కొన్ని వారాలుగా మైక్రో ఫైనాన్స్ వ్యవహారంలో తీవ్ర ఆరోపణలు, వివాదాలు ప్రముఖ గాయని మంగ్లీ చుట్టూ తిరుగుతున్నాయి. ఈ వ్యవహారంలో తన ప్రమేయం లేదని.. జరుగుతున్న ప్రచారం అసత్యం.. దురుద్దేశంపూర్వకంగా తనపై ఆరోపణలు చేస్తున్నారని ఇప్పటికే మంగ్లీ కొట్టిపారేశారు. పోలీస్ కమిషనర్, డీజీపీని కలిసి నేరుగా ఫిర్యాదు చేశారు. తన సోషల్ మీడియా వేదికగా కూడా ప్రకటనలు చేస్తున్నారు. అయినా కూడా యూట్యూబ్ చానళ్లలో తనపై ప్రచారం జరుగుతూనే ఉంది. దీంతో యూట్యూబ్ చానళ్లపై ఆమె వ్యక్తిగత కార్యదర్శి సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Also Read: AP Summer Camps: విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్న్యూస్.. త్వరలో 1,389 సమ్మర్ క్యాంపులు
హైదరాబాద్ సైబర్ క్రైమ్లో ఫిర్యాదు చేసిన అనంతరం హైదరాబాద్లోని బషీర్బాగ్ ప్రెస్క్లబ్లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో వ్యక్తిగత మేనేజర్ మేఘ్ రాజు కీలక విషయాలు వెల్లడించారు. కొన్ని యూట్యూబ్ ఛానల్స్ సింగర్ మంగ్లీని టార్గెట్ చేస్తూ అసభ్యకర పోస్టులు పెడుతున్నారని ఆరోపించారు. అసభ్యకర పోస్టులు పెడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కావాలనే మంగ్లీని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారని మండిపడ్డారు.
Also Read: Chandrababu: విశాఖ విశ్వనగరం అన్స్టాపబుల్.. ఎవరూ ఆపలేరు: చంద్రబాబు
మంగ్లీపై మధు నాయక్, సుబ్బు, తిరుమలేష్, హిమకాంత్ రెడ్డిలతో పాటు కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కావాలనే బురద జల్లుతూ అసత్యపు ప్రచారాలు చేస్తున్నారని వ్యక్తిగత మేనేజర్ మేఘ్ రాజు తెలిపారు. దీనిని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. మంగ్లీతో పాటు కుటుంబాన్ని ఇందులోకి లాగి ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు. మంగ్లీ కూడా పలు సందర్భాల్లో స్పష్టంగా బాధితులకు అండగా ఉంటానని హామీ ఇచ్చిందని వ్యక్తిగత మేనేజర్ మేఘ్ రాజు గుర్తు చేశారు.
గాయని మంగ్లీపై ఆరోపణలు గుప్పించిన హిమకాంత్ రెడ్డి ప్రస్తుతం ఎక్కడ ఉన్నాడని వ్యక్తిగత మేనేజర్ మేఘ్ రాజు ప్రశ్నించారు. మంగ్లీపై కావాలనే గ్లోబల్ ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగ్లీ ఎక్కడ ఎండర్స్మెంట్ చేయలేదని తెలిపారు. త్వరలో నిజనిజాలు బహిర్గతం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కేసులో మంగ్లీ ప్రమేయం ఉందా లేదా అనేదానిపై విచారణ కొనసాగుతోందని వ్యక్తిగత మేనేజర్ మేఘ్ రాజు చెప్పారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Engineering Courses: ఈ 3 ఇంజనీరింగ్ కోర్సులకు విపరీతమైన డిమాండ్.. భవిష్యత్తును శాసించబోయే బెస్ట్ కోర్సులు ఇవే!
Lakshmapur, Telangana:Engineering Courses: ఇంజనీరింగ్ అనగానే ఇప్పటికీ చాలా మంది విద్యార్థులు, తల్లిదండ్రులు కళ్లు మూసుకుని కంప్యూటర్ సైన్స్ వైపు పరుగెత్తుతున్నారు. కానీ.. 2026 నాటికి టెక్నాలజీ ప్రపంచం పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు సివిల్, మెకానికల్ శకం ఉంటే, ఆ తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ రాజ్యమేలింది. అయితే, ఇప్పుడు కేవలం కోడింగ్ తెలిస్తే సరిపోదు. పరిశ్రమ ఇప్పుడు స్పెషలైజ్డ్ స్కిల్స్ ఉన్న నిపుణుల కోసం వెతుకుతోంది. ఈ ఏడాది 12వ తరగతి పూర్తి చేసుకుని ఇంజనీరింగ్లో చేరే విద్యార్థులు 2030లో గ్రాడ్యుయేట్లుగా బయటకు వస్తారు. ఆ సమయానికి ఏ కోర్సులకు డిమాండ్ ఉంటుంది? ఏ బ్రాంచ్ చదివితే కోట్లలో ప్యాకేజీ వస్తుంది? అనే అంశాలపై పూర్తి వివరాలు తెలుసుకుందాం.
1. ఏఐ, మెషిన్ లెర్నింగ్: ప్రస్తుతం గూగుల్ నుంచి మైక్రోసాఫ్ట్ వరకు ప్రతి టెక్ దిగ్గజం బిలియన్ల డాలర్లను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పైనే ఖర్చు చేస్తోంది. ఇందులో మీరు కేవలం ప్రోగ్రామ్స్ రాయడమే కాకుండా, ఒక యంత్రం మనిషిలా ఎలా ఆలోచించాలి? డేటాను విశ్లేషించి సొంతంగా నిర్ణయాలు ఎలా తీసుకోవాలి? అనే వినూత్న అంశాలను నేర్చుకుంటారు. ఏఐ ఇంజనీర్లకు ప్రస్తుతం మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంది. ఈ రంగంలో నైపుణ్యం ఉంటే, ఫ్రెషర్లు కూడా సులభంగా రూ. 12 నుండి 20 లక్షల ప్రారంభ ప్యాకేజీని అందుకుంటున్నారు. అనుభవం పెరిగే కొద్దీ ఇది కోట్లకు చేరువవుతుంది.
2. సైబర్ సెక్యూరిటీ: ప్రపంచం ఎంతలా డిజిటలైజ్ అవుతోందో, సైబర్ దాడులు, డేటా దొంగతనాలు కూడా అంతే వేగంగా పెరుగుతున్నాయి. బ్యాంకులు, ప్రభుత్వ సంస్థలు, కార్పొరేట్ కంపెనీలు తమ రహస్య డేటాను కాపాడుకోవడానికి నిరంతరం ఎథికల్ హ్యాకర్లు, సైబర్ సెక్యూరిటీ నిపుణుల కోసం వెతుకుతున్నాయి. ఆర్థిక మాంద్యం వచ్చినా, కంపెనీలు తమ భద్రత విషయంలో రాజీ పడవు. కాబట్టి, ఈ రంగంలో ఉన్నవారికి ఉద్యోగ ముప్పు చాలా తక్కువ. భారతదేశంలోనే కాకుండా అమెరికా, యూరప్ వంటి దేశాల్లో ఈ కోర్సు చేసిన వారికి అపారమైన డిమాండ్ ఉంది. డిజిటల్ భద్రత అవసరం ఉన్నంత కాలం ఈ ఇంజనీర్ల హవా కొనసాగుతూనే ఉంటుంది.
3. రోబోటిక్స్, ఆటోమేషన్: మీకు హార్డ్వేర్ (యంత్రాలు) సాఫ్ట్వేర్ (ప్రోగ్రామింగ్) రెండింటిపై ఆసక్తి ఉంటే, రోబోటిక్స్ మీకు సరైన వేదిక. ఇ-కామర్స్ గిడ్డంగుల్లో ప్యాకింగ్ చేసే రోబోల నుంచి, ఆసుపత్రుల్లో శస్త్రచికిత్సలు చేసే రోబోల వరకు ప్రతిచోటా వీటి అవసరం పెరుగుతోంది. అలాగే డ్రైవర్ లేని కార్లు కూడా ఈ విభాగం కిందకే వస్తాయి. కేవలం సాఫ్ట్వేర్ కంపెనీలే కాదు.. ఇస్రో (ISRO), నాసా (NASA) వంటి అంతరిక్ష సంస్థలు, రక్షణ రంగం ఈ రంగంలోని విద్యార్థులకు రెడ్ కార్పెట్ వేస్తున్నాయి.
ప్రవేశానికి ముందు విద్యార్థులు గుర్తుంచుకోవాల్సిన అంశాలు: భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మీరు ఈ కొత్త తరం బీటెక్ కోర్సుల్లో చేరాలనుకుంటే, కేవలం కాలేజీ పేరు చూసి మోసపోకండి. ప్రవేశానికి ముందు ఈ మూడు విషయాలను తప్పక తనిఖీ చేయండి:
ల్యాబ్ సౌకర్యాలు: ఏఐ లేదా రోబోటిక్స్ వంటి కోర్సులు కేవలం క్లాస్ రూమ్ లో చదివితే వచ్చేవి కావు. కాలేజీలో అత్యాధునిక ల్యాబ్లు, హార్డ్వేర్ ఎక్విప్మెంట్ ఉన్నాయో లేదో చూడండి.
అధ్యాపకులు: ఈ కొత్త టెక్నాలజీపై పట్టున్న నిపుణులైన ఫ్యాకల్టీ ఉన్న కాలేజీలకే ప్రాధాన్యత ఇవ్వండి.
పరిశ్రమలతో భాగస్వామ్యం: కాలేజీకి పెద్ద పెద్ద కంపెనీలతో ఒప్పందాలు ఉన్నాయా? రియల్ టైమ్ ప్రాజెక్టులపై పనిచేసే అవకాశం కల్పిస్తున్నారా? అనేది చాలా ముఖ్యం. ఇది మీకు ఇంటర్న్షిప్లు మరియు ప్లేస్మెంట్స్ సాధించడంలో ఎంతగానో తోడ్పడుతుంది.
గుడ్డిగా గొర్రెమందలా కంప్యూటర్ సైన్స్ వైపు వెళ్లకుండా, 2030 నాటి అవసరాలను గుర్తించండి. ఇప్పుడు మీరు తీసుకునే సరైన నిర్ణయం, నాలుగేళ్ల తర్వాత మీ కెరీర్ను ఉన్నత శిఖరాల్లో నిలబెడుతుంది. గుర్తుంచుకోండి, డిగ్రీ ఎవరైనా చేయొచ్చు, కానీ నైపుణ్యం ఉన్న వారికే లక్షల జీతాలు లభిస్తాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
Nagmani Video: పడగపై నాగమణితో దర్శనమిచ్చిన కింగ్ కోబ్రా.. వీడియో వైరల్..
Hyderabad, Telangana:Rare King Cobra Nagmani Video: ప్రకృతిలో మనకు తెలియని ఎన్నో రకాల వింతలతో పాటు విశేషాలు ఉన్నాయి. ముఖ్యంగా పాములకు సంబంధించి.. హిందూ పురాణాల్లో, జానపద కథల్లో నాగమణి గురించి మనం ఎన్నో కథలు విన్నాం.. అయితే, తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో ఇప్పుడు నెటిజన్లను ఆశ్యర్యానికి గురిచేసేలా చేస్తోంది. పచ్చని మైదానంలో ఒక చోట అత్యంత ప్రమాదకరమైన కింగ్ కోబ్రా పడగ విప్పి ఉండడం మీరు చూడొచ్చు. అలాగే దాని తలపై మెరుస్తున్న వజ్రం లాంటి వస్తువు కనిపించడం విశేషం.
వైరల్ అవుతున్న వీడియో వివరాల్లోకి వెళితే.. గడ్డి మైదానంలోని ఓ ప్రాంతంలో భారీ ఆకారంలో ఉన్న కింగ్ కోబ్రా పడగ విప్పి అటు ఇటు కదలడం మీరు గమనించవచ్చు..సాధారణంగా కింగ్ కోబ్రాలను చూడటమే చాలా అరుదు.. అలాంటి, ఈ వీడియోలో ఉన్న పాము అత్యంత భయానకంగా.. తల భాగంలో ఏదో ఉండడం మీరు చూడొచ్చు. దాని తల పైభాగంలో తెల్లటి రంగులో ధగధగ మెరిసిపోయే ఒక వజ్రం లాంటి ఆకారం స్పష్టంగా కనిపిస్తోంది. అలాగే అది సూర్యరశ్మికి మరింత కాంతివంతంగా కనిపిస్తోంది.
ఈ వీడియో చూసిన సోషల్ మీడియా వినియోగదారులు రకరకాలుగా స్పందిస్తూ వస్తున్నారు. ఈ వీడియో పోస్ట్ చేసిన కొద్దిసేపటికే లక్షలాది వ్యూస్తో పాటు వేలల్లో కామెంట్లతో ఇంటర్నెట్ను ఊపేస్తోంది. చాలా మంది సోషల్ మీడియా వినియోగదారులు దీనిని సాక్షాత్తూ ఆ పరమశివుని లీలుగా అభివర్ణిస్తూ వస్తున్నారు. అఅంతేకాకుండా ఈ నిజమైన నాగమణిని చూడటం మా అదృష్టం.. అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరికొంతమంది ఈ వీడియో చూసివారు ఈ ఇదంతా ఫేక్ అని చెబుతున్నారు.
ఈ వీడియో చూసిన కొంతమంది మాత్రం నమ్మడం లేదు.. ఇది ఫేక్ వీడియో అని.. ఎవరో కావాలని గ్రాఫిక్స్ లేదా ఏఐ (AI)ని వినియోగించి వీడియో తయారు చేసిన పోస్ట్ చేశారని కామెంట్స్ చేస్తున్నారు. శాస్త్రీయంగా చూస్తే పాము తలలో మణులు ఉంటాయనే దానికి ఎలాంటి ఆధారాలు లేవు. కానీ ఈ పాము తల భాగంలో ఈ మణి ఉండడం ఇప్పుడు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇప్పుడు దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో హాట్ టాఫిక్గా మారాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
POCO C81 Pro: కేవలం రూ.9 వేలకే 6000mAh బ్యాటరీ ఫోన్.. POCO C81 Pro ఫీచర్లు చూస్తే ఫిదా అవ్వాల్సిందే..
Hyderabad, Telangana:POCO C81 Pro Launched: ప్రముఖ స్మార్ట్ఫోన్ కంపెనీ పోకో (POCO) మార్కెట్లోకి అద్భుతమైన మొబైల్ విడుదల చేసింది. దీనిని కంపెనీ ఎంతో శక్తివంతమైన యునిసోక్ టి7250 చిప్సెట్తో అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఇందులో అద్భుతమైన కెమెరా సెటప్ను కలిగి ఉంది. అంతేకాకుండా మోస్ పవర్ఫుల్ బ్యాటరీ సెటప్ను కలిగి ఉంది. పోకో కంపెనీ సాధారణ మిడిల్ క్లాస్ వినియోగదారులను దృష్టి పెట్టుకుని ఈ స్మార్ట్ఫోన్ విడుదల చేసింది. ఇది అత్యంత చీప్ ధరలోనే అందుబాటులోకి వచ్చింది. అయితే, ఈ పోకో సి81 ప్రో స్మార్ట్ఫోన్కి సంబంధించిన అన్ని రకాల వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఈ పోకో సి81 ప్రో స్మార్ట్ఫోన్ 64GB ఇంటర్నల్ స్టోరేజ్తో పాటు 128GB స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. మొదటి స్టోరేజ్ వేరియంట్ ధర రూ.9 వేల నుంచి ప్రారంభమైంది. అలాగే రెండవ వేరియంట్ ధర రూ.10 వేలకు లభిస్తోంది. ఇది మూడు రంగుల్లో అందుబాటులో ఉంది. ఈ పోకో స్మార్ట్ఫోన్ నలుపు, బంగారంతో పాటు ఆకుపచ్చ రంగులలో అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్ఫోన్ గ్లోబల్ మార్కెట్లోకి కూడా అందుబాటులోకి వచ్చింది.
పోకో సి81 ప్రో ఫీచర్స్:
పోకో C81 ప్రో స్మార్ట్ఫోన్ ఎన్నో రకాల అద్భుతమైన ఫీచర్స్తో అందుబాటులో ఉంది. ఇది 6.9-అంగుళాల HD+ LCD డిస్ప్లేను కలిగి ఉంటుంది. అంతేకాకుండా 120Hz రిఫ్రెష్ రేట్తో పాటు హై బ్రైట్నెస్ మోడ్లో 800 నిట్స్ సపోర్ట్తో లభిస్తోంది. వీటికి తోడు ఈ డిస్ల్పే ప్రత్యేకమైన బ్లూ లైట్ సర్టిఫికేషన్ కూడా పొందింది. ఈ స్మార్ట్ఫోన్ ఆండ్రాయిడ్ ఆధారిత హైపర్ఓఎస్ 3పై రన్ అవుతుంది. ఇవే కాకుండా ఈ స్మార్ట్ఫోన్ ఎంతో శక్తివంతమైన మాలి-G57 GPUతో కూడిన 12nm ఆక్టా-కోర్ యూనిసోక్ T7250 ప్రాసెసర్పై రన్ అవుతుంది. అంతేకాకుండా ఇందులో మైక్రో SD కార్డ్ ద్వారా స్టోరేజ్ను పెంచుకునే అవకాశాన్ని కూడా అందిస్తోంది.
ఇక ఈ పోకో సి81 ప్రో స్మార్ట్ఫోన్ వెనక భాగంలో అద్భుతమైన కెమెరా సెటప్ను కూడా కలిగి ఉంటుంది. C81 ప్రో వెనుక భాగంలో 13-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను కూడా కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఫ్రంట్ భాగంలో 8-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా కూడా అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్ఫోన్ ప్రత్యేకమైన వెట్ టచ్ టెక్నాలజీ 2.0కి సపోర్ట్ కూడా చేస్తుంది. దీని వల్ల తడి వేళ్ళతో కూడా దీని డిస్ల్పే టచ్ అవుతుంది. అలాగే C81 ప్రో 15W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో 6,000mAh బ్యాటరీని కూడా కలిగి ఉంటుంది.
Also Read: Spray Fan Offer: అమెజాన్ బంపర్ ఆఫర్.. రూ.1,099కే AC లాంటి గాలినిచ్చే డబుల్ ఎండెడ్ స్ప్రే ఫ్యాన్!
అంతేకాకుండా ఈ పోకో సి81 ప్రో స్మార్ట్ఫోన్ ఎంతో శక్తివంతమైన 6,000mAh బ్యాటరీని కూడా కలిగి ఉంటుంది. కాబట్టి దీనిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు మూడు నుంచి నాలుగు రోజుల పాటు బ్యాటరీ లైఫ్ను కూడా అందిస్తోంది. ఇందులో బ్లూటూత్ 5.2, వై-ఫై, జీపీఎస్తో పాటు గ్లోనాస్, గెలీలియో, ఎన్ఎఫ్సీ వంటి ఫీచర్స్ కూడా కలిగి ఉంటుంది. ఇందులో 3.5mm హెడ్ఫోన్ జాక్ సపోర్ట్ను కూడా కలిగి ఉంటుంది. ఇందులో ప్రత్యేకమైన ఫింగర్ప్రింట్ సెన్సార్ కూడా లభిస్తోంది. ఇవే కాకుండా వర్చువల్ ప్రాక్సిమిటీ సెన్సార్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.
Also Read: Spray Fan Offer: అమెజాన్ బంపర్ ఆఫర్.. రూ.1,099కే AC లాంటి గాలినిచ్చే డబుల్ ఎండెడ్ స్ప్రే ఫ్యాన్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Trigrahi Yoga 2026: సూర్య, కుజ, బుధ గ్రహాల కలయిక.. త్రిగ్రాహి యోగం ప్రభావం ఏ రాశులపై ఎలా ఉండబోతోంది?
Hyderabad, Telangana:Trigrahi Yoga Effect On Zodiac 2026: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, మే నెలలో అనేక గ్రహాలు సంచారం చేయబోతున్నాయి. ముఖ్యంగా కొన్ని ప్రధాన గ్రహాలు ఒకే రాశిలో కలయిక జరపబోతున్నాయి. దీని కారణంగా ఎంతో శక్తివంతమైన యోగం కూడా ఏర్పడబోతోందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ప్రస్తుతం సూర్యుడు మేషరాశిలో సంచార దశలో ఉన్నాడు. అయితే, మే 11వ తేదిన కీడు గ్రహంగా పరిగణించే కుజుడు మేష రాశిలోకి సంచారం చేస్తాడు. అలాగే బుధుడు కూడా సంచారం చేయడంతో మూడు గ్రహాల కలయిక జరుగుతుంది.
దీని కారణంగా మే 11వ తేది నుంచి త్రిగ్రాహి యోగం ప్రభావం అన్ని రాశులవారిపై పడుతుంది. దీని కొన్ని రాశులవారికి అనేక సమస్యలు వస్తే.. మరికొన్ని రాశులవారు ఆర్థికంగా నష్టపోయే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అయితే, ఈ సమయంలో ఏయే రాశులవారిపై ఊహించని ప్రభావం పడబోతుందో? ఇప్పుడు మనం తెలుసుకుందాం..
మకర రాశి
త్రిగ్రాహి యోగం ఎఫెక్ట్తో మకర రాశివారికి ఈ సమయంలో అనేక సమస్యలు ఎదురవుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అంతేకాకుండా అనవసరమైన ఖర్చులు కూడా విపరీతంగా పెరుగుతాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఖరీదైన వస్తువులను కొనుగోలు చేయకపోవడం చాలా మంచిది.. దీంతో పాటు తల్లి ఆరోగ్యంపై కూడా దృష్టి పెట్టడం చాలా మంచిది. వీరు కొత్త ఆస్తులు లేదా కార్లు కూడా కొనుగోలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో పాటు శరీరంపై ప్రత్యేకమైన శ్రద్ధ వహించాల్సి ఉంటుంది.
వృషభ రాశి
వృషభ రాశివారికి 12వ స్థానంలో త్రిగ్రాహి యోగంతో అనేక రకాల సమస్యల వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా వీరికి చిరాకు స్వభావం కూడా విపరీతంగా పెరుగుతుంది. అలాగే ప్రధాన శత్రువు కూడా యాక్టివ్ అవుతారు. కార్యాలయంలో బాస్తో పాటు సహోద్యోగులతో అనవసరమైన వాదనలకు దూరంగా ఉండడం చాలా మంచిది. దీంతో పాటు ఈ సమయంలో శత్రువుల సంఖ్య కూడా విపరీతంగా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే పెద్ద పెద్ద తప్పులు కూడా చేయకపోవడం చాలా మంచిది.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
తులా రాశి
తులా రాశివారికి ఈ సమయంలో అనేక రకాల సమస్యలు కూడా రావచ్చు. ముఖ్యంగా దూకుడు స్వభావం వల్ల దీర్ఘకాలికంగా తీవ్ర సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండడం మేలు.. చిన్న చిన్న కారణాల వల్ల వైవాహిక కలహాలు రావచ్చని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అంతేకాకుండా దీర్ఘకాలిక సమస్యలు కూడా వచ్చే ఛాన్స్లు ఉన్నాయి. తులా రాశివారికి ఈ సమయంలో అనేక రకాల సమస్యలు వస్తాయి. దీంతో పాటు మానసికంగా కూడా అనేక రకాల సమస్యలు వస్తాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అలాగే భాగస్వామి జీవితంలో కూడా తీవ్ర సమస్యలు కూడా తలెత్తే ఛాన్స్లు ఉన్నాయి. కాబట్టి ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండడం చాలా మంచిదని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Budhaditya Rajayoga: బుధాదిత్య రాజయోగం ఎఫెక్ట్.. మే చివరి నుంచి ఈ రాశుల వారికి కాసుల వర్షం!
Hyderabad, Telangana:Budhaditya Rajayoga Effect On Zodiac Telugu: ఈ ఏడాదిలోని ఏప్రిల్ నెల చివరి వారికి ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఎందుకంటే ప్రధాన గ్రహాలు సంచారం చేయబోతున్నాయి. ముఖ్యంగా దీని బుధుడు లాంటి గ్రహం కదలికలు జరపబోతోంది. దీని కారణంగా మొత్తం 12 రాశులవారిపై ఊహించని ప్రభావం పడుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఈ గ్రమం తెలివితేటలకు, వ్యాపారంతో పాటు ఆనందానికి అధిపతిగా వ్యవహరిస్తుంది. అయితే, ఈ ఏప్రిల్ చివరి వారంలో మేష రాశిలోకి ప్రవేశించడం చాలా శుభప్రదమని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.
ముఖ్యంగా మేష రాశిలో బుధుడితో పాటు సూర్యగ్రహాల సంయోగం జరగబోతోంది. దీని కారణంగా బుధాదిత్య రాజయోగం కూడా ఏర్పడబోతోంది. దీని కారణంగానే అన్ని రాశులవారిపై ఊహించని ప్రభావం పడుతుంది. ఆయా రాశులవారికి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా ఉద్యోగాల్లో పదన్నతులు కూడా లభిస్తాయి. అయితే, ఈ సమయంలో అద్భుతమైన లాభాలు పొందే రాశువారి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
బుధుడి ప్రభావంతో ఈ రాశులవారికి బంపర్ లాభాలు:
మకర రాశి:
బుధ గ్రహ సంచారం ప్రభావంతో ఎక్కువగా మరక రాశివారు ప్రభావితమవుతారని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఈ సమయంలో అద్భుతమైన అదృష్టం కూడా సొంతం చేసుకుంటారు. అలాగే వీరికి పెండింగ్లో ఉన్న పనులు కూడా సులభంగా పూర్తవుతాయి. అలాగే అప్పుల నుంచి కూడా బయటపడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దీంతో పాటు ఆస్తి సంబంధిత కేసుల నుంచి కూడా అద్భుతమైన ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా మీకు ఆస్తుల్లో లాభాలు కూడా కలుగుతాయి. దీంతో పాటు కొత్త ఇళ్లతో పాటు వాహనాలు కూడా సులభంగా కొనుగోలు చేసే ఛాన్స్లు ఉన్నాయి. అలాగే పెద్ద మొత్తంలో వీరికి ఉద్యోగాల పరంగా ప్రమోషన్స్ కూడా లభిస్తాయి. ఈ సమయంలో స్నేహితుల నుంచి కూడా సహాయం కూడా లభిస్తుంది. కుటుంబ సభ్యులు మీకు అండగా నిలిచి.. అద్భుతమైన లాభాలు కూడా పొందుతారు.
మేష రాశి:
బుధ గ్రహం సంచారం ప్రభావంతో మేష రాశివారికి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. వీరికి కెరీర్ పరంగా అద్భుతమైన అవకాశాలు కూడా లభిస్తాయి. అంతేకాకుండా ఉద్యోగాలు మారాలని చూస్తున్నవారికి ఈ సమయం చాలా అద్భుతంగా ఉంటుంది. అంతేకాకుండా వీరు అద్భుతమైన శుభవార్తలు కూడా వింటారు. అలాగే ఎలాంటి నిర్ణయాలు తీసుకున్న విశేషమైన లాభాలు కూడా పొందుతారు. దీంతో పాటు భవిష్యత్కు సంబంధించిన కీలక నిర్ణయాలు కూడా తీసుకుంటారు. భారీ మొత్తంలో డబ్బులు కూడా ఖర్చులు చేస్తారు. ఈ సమయంలో ఇతర కుటుంబ సభ్యులతో మంచి సమయాన్ని గడిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీర్ఘాకలిక సమస్యల నుంచి కూడా ఉపశమనం కలుగుతుంది.
మిథున రాశి:
బుధుడితో పాటు సూర్యగ్రహాల కలయిక కారణంగా మిథున రాశివారికి గోల్డెన్ డేస్ ప్రారంభమవుతాయి. అంతేకాకుండా ఆర్థిక సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. అలాగే గతంలో చిక్కుకున్న డబ్బులు కూడా భారీ మొత్తంలో తిరిగి పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా పెద్ద మొత్తంలో ప్రమోషన్స్ కూడా పొందుతారు. కుటుంబంలో సంతోషంతో పాటు శాంతి కూడా నెలకొంటుంది. దీర్ఘకాలిక సమస్యలు కూడా సులభంగా ఉపశమనం కలుగుతుంది. ఈ సమయంలో కుటుంబ సభ్యులు అందరూ ఆరోగ్యంగా ఉంటారు. దీని కారణంగా మానసిక సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. ఆర్థికంగా కూడా విశేషమైన లాభాలు పొందుతారు.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Free Petrol In AP: ఏపీలో ఉచిత పెట్రోల్ వెనుక కథ ఏంటి? అస్సలు మేటర్ ఇదే!
Tirupati, Andhra Pradesh:Vande Bharat Derail: వందేభారత్ రైలుకు తృటిలో తప్పిన ప్రమాదం..పట్టాలు తప్పిన రన్నింగ్ ట్రైన్..అంతలోనే
Pune, Maharashtra:Vande Bharat Derail Pune: భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వందేభారత్ రైళ్లలో తొలి ప్రమాదం జరిగింది. ముంబై-సోలాపూర్ మధ్య నడిచే వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ప్రయాణిస్తుండగా.. మహారాష్ట్రలోని పూణే రైల్వే స్టేషన్లోకి వచ్చే సమయంలో పట్టాలు తప్పిందని అధికారులు తెలిపారు. అయితే ఈ ఘటనలో ప్రయాణికులెవరికీ గాయాలు కాలేదని సమాచారం.
సెంట్రల్ రైల్వే చీఫ్ పీఆర్ఓ డాక్టర్ స్వప్నిల్ నీలా ప్రకారం.. ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ (సీఎస్ఎంటీ) నుండి సోలాపూర్కు వెళ్తున్న వందే భారత్ రైలులోని నాలుగో కోచ్కు చెందిన ఒక ట్రాలీ, సోమవారం రాత్రి సుమారు 7:30 గంటలకు పూణే స్టేషన్లోని ప్లాట్ఫామ్లోకి ప్రవేశిస్తుండగా డైమండ్ క్రాసింగ్ వద్ద పట్టాలు తప్పింది. డైమండ్ క్రాసింగ్ అనేది ఒక రైల్వే ట్రాక్ లేఅవుట్, దీనిలో రెండు ట్రాక్లు ఒక కోణంలో ఖండించుకొని వజ్రాకారాన్ని ఏర్పరుస్తాయి, ఇది రైళ్లు లైన్లు మార్చకుండానే దాటుకోవడానికి వీలు కల్పిస్తుంది.
పుణెలోని రైల్వే స్టేషన్ యార్డ్ రీమోడలింగ్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయని అధికారి తెలిపారు. "ప్రయాణికులను మరో రైలులోకి తరలించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. డైమండ్ క్రాసింగ్ను ప్రాధాన్యతా క్రమంలో మారుస్తున్నాం. భారతీయ రైల్వే వ్యాప్తంగా ఉన్న ఇలాంటి ప్రామాణికం కాని డైమండ్ క్రాసింగ్లను కూడా మారుస్తున్నాం" అని చీఫ్ పీఆర్ఓ తెలిపారు.
పట్టాలు తప్పిన కోచ్ నుంచి ప్రయాణికులు రైలు నుంచి దిగి, తమ సామాను తీసుకుని సమీపంలోని ప్లాట్ఫామ్ వైపు నడుచుకుంటూ వెళ్తున్న ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటన తర్వాత పుణే మార్గంలో వెళ్లే ఎక్స్ప్రెస్ రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. అయితే వందేభారత్ రైలు పట్టాలు తప్పిన సంఘటన ఇదే తొలిసారి అని ఓ అధికారి వెల్లడించారు. ఇప్పటి వరకు వందే భారత్ రైళ్లకు అత్యంత సురక్షితమైన రైళ్లుగా పేరొందాయి. అయితే ఇందులో ప్రమాదాలను నివారించే కవచ్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేయడం విశేషం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Chandrababu: విశాఖ విశ్వనగరం అన్స్టాపబుల్.. ఎవరూ ఆపలేరు: చంద్రబాబు
Visakhapatnam, Andhra Pradesh:AU Centenary Celebrations: 'రెండు ప్రతిష్టాత్మక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు నేను విశాఖ వచ్చా. వందేళ్ల ఏయూ పండుగ ఒక చరిత్ర. రేపు ప్రపంచంలో నెంబర్ 1 టెక్నాలజీ దిగ్గజం గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు మరో చరిత్ర. ఆర్థిక సంస్కరణలు వచ్చాక 15 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెడుతున్నారంటే అది విశాఖ గొప్పతనం' అని సీఎం చంద్రబాబు తెలిపారు. గూగుల్ కంటే ముందుగానే ఏయూ ప్రపంచాన్ని విశాఖతో కనెక్ట్ చేసిందని.. 57 దేశాల విద్యార్థులు ఇక్కడ చదువుతున్నారంటే రాష్ట్రానికి, దేశానికి గర్వకారణం అని ప్రకటించారు.
Also Read: Chandrababu: కేంద్రానికి లేఖ.. మొక్కజొన్న రైతులకు అండగా సీఎం చంద్రబాబు
విశాఖపట్టణంలోని ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ధి ఉత్సవాల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక ప్రసంగం చేశారు. 'విశాఖ విశ్వనగరం... గ్లోబల్ సిటీ. ఇది అన్స్టాపబుల్ ఎవరూ ఆపలేరు. వందేళ్ల చరిత్ర ఒక బ్రాండ్. రాష్ట్ర విభజన తర్వాత కేబినెట్ సమావేశం ఏయూలో నిర్వహించాం. అది ఏయూ ప్రత్యేకత' అని వివరించారు. '53 యూనివర్సిటీలు రాష్ట్రంలో ఉండగా.. అన్నింటికీ ఏయూ దిక్సూచి, లీడర్. స్వాతంత్ర్య పోరాటం కంటే ముందే ఈ యూనివర్సిటీ వచ్చింది. జైపూర్ రాజ్ విక్రమ దేవ్, గజపతి రాజవంశం, పిఠాపురం రాజవంశం, బొబ్బిలి రాజులు ఈ యూనివర్సిటీ అభివృద్ధికి కృషి చేశారు. వారిని మనం స్మరించుకోవడం ధర్మం, బాధ్యత' అని చంద్రబాబు పేర్కొన్నారు.
Also Read: KKR vs LSG Highlights: బంతి బంతికి మలుపు.. సూపర్ ఓవర్లో గట్టెక్కిన కలకత్తా నైట్రైడర్స్
'కట్టమంచి రామలింగారెడ్డి ఏయూకు మొదటి వీసీగా చేసి బలమైన పునాది వేశారు. ఆయన కూడా చిత్తూరు జిల్లా వాసే. నేనూ చిత్తూరు జిల్లా నుంచి వచ్చి వందేళ్ల ఉత్సవంలో పాల్గొన్నా. 2వ వీసీ సర్వేపల్లి రాధాకృష్ణ దేశ రాష్ట్రపతి అయ్యారు. ఈ రోజు మన ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ తండ్రి సర్వేపల్లి అభిమాని. ఈయనకు రాధాకృష్ణన్ అని పేరు పెట్టారు' అని చంద్రబాబు వివరించారు. 'కేవలం చదువు చెప్పడమే కాదు... తెలుగు వైభవానికి ఏయూ కృషి చేస్తోంది. విద్య, సాహిత్య రంగాల్లో ప్రముఖులను కళా ప్రపూర్ణ అవార్డుతో అభినందిస్తున్నారు' అని తెలిపారు.
'ఎంతోమంది నాయకులను తయారు చేసిన గడ్డ ఏయూ. రాజకీయ ఉద్దండులు ఇక్కడ నుంచి వచ్చారు. వెంకయ్య నాయుడు ఏయూ నుంచే వచ్చారు. ప్రముఖ పారిశ్రామిక వేత్తలు కూడా ఇక్కడి నుంచే వచ్చారు. ప్రపంచంలోని చాలా యూనివర్సిటీల్లో ప్రొఫెసర్లుగా చేస్తున్నారు' అని చంద్రబాబు తెలిపారు. 'న్యాక్ ఏ ప్లస్ ప్లస్ సాధిస్తోంది. ఎన్ఐఆర్ఎఫ్లో 41వ ర్యాంక్, పబ్లిక్ సెక్టార్లో 5వ ర్యాంక్లో ఉంది. యూనివర్సిటీలు నేషనల్ స్ట్రాటజిక్ అసెట్స్ వాటిని కాపాడుకోవాలి' అని చంద్రబాబు పేర్కొన్నారు. అన్ని యూనివర్సిటీల్లో విద్యాశాఖామంత్రి, గవర్నర్ ప్రతిభ ఉన్నవారిని వీసీలుగా ఎంపిక చేస్తున్నారు. రూ.64 కోట్ల విలువైన ఏయూ ఐ ఫ్యాక్టరీ, నెట్వర్స్స్ ల్యాబ్ నెట్వర్క్ సెంటర్ ప్రారంభించుకున్నాం. రూ.112 కోట్లతో 9 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసుకున్నాం. బాలురు, బాలికల హాస్టల్, కాన్వకేషన్ హాలు, వీసీ భవన్ కు శంకుస్థాపన చేసుకున్నాం' అని వివరించారు.
'యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడా, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ట్రాఫికల్ మెట్రాలజీతో ఎంఓయూలు చేసుకున్నాం. నాకు 76 ఏళ్లయినా.. నేను 26 ఏళ్ల వ్యక్తిగానే ఆలోచిస్తా. ఒకప్పుడు ఐటీతో ప్రారంభించాం. నాలెడ్జ్ ఎకానమీకీ దోహదం చేశాం. నేడు డేటా సెంటర్, ఏఐ, క్వాంటం తీసుకొచ్చాం' అని చంద్రబాబు తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Kohli IPL 9000 Runs: మరో 11 పరుగుల దూరంలో విరాట్ కోహ్లీ ప్రపంచ రికార్డు..ఐపీఎల్ చరిత్రలో ఒకేఒక్క మొనగాడు!
Hyderabad, Telangana:Kohli IPL 9000 Runs Record: ఇండియన్ ప్రీమియర్ లీగ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టుకు విరాట్ కోహ్లీ మొదటి నుంచి వెన్నెముకగా నిలిచాడు. ఈ స్టార్ బ్యాటర్ ఇప్పుడు మరో అద్భుతమైన రికార్డుకు చేరువలో ఉన్నాడు. నేడు అనగా ఏప్రిల్ 27న ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ)తో జరగనున్న మ్యాచ్లో.. ఐపీఎల్ చరిత్రలో ఇంతవరకు ఎవరూ సాధించని ఘనతను కోహ్లీ అందుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు.
విరాట్ కోహ్లీ ప్రస్తుతం ఐపీఎల్లో అత్యధిక పరుగులు చేసిన వారి జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు. అతను నేడు జరిగే మ్యాచ్లో కేవలం 11 పరుగులు చేస్తే.. ఐపీఎల్ చరిత్రలో 9,000 పరుగులు పూర్తి చేసిన ప్రపంచంలోనే మొదటి బ్యాట్స్మన్గా నిలుస్తాడు. ఇప్పటివరకు 274 ఐపీఎల్ మ్యాచ్లు ఆడిన కోహ్లీ, 39.95 సగటుతో 8,989 పరుగులు సాధించాడు. ఇందులో 8 అద్భుతమైన సెంచరీలు, 66 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
ఐపీఎల్ పరుగుల రేసులో ప్రస్తుతం కోహ్లీకి ఎవరూ సాటిలేరు. రెండో స్థానంలో ఉన్న రోహిత్ శర్మ, 276 మ్యాచ్లలో 7,183 పరుగులు సాధించాడు. అంటే కోహ్లీ, రోహిత్ల మధ్య 1,800 పరుగులకు పైగా భారీగా గ్యాప్ ఉంది. ఈ లీగ్లో ఇప్పటివరకు ఏ ఇతర బ్యాట్స్మెన్ కూడా 8,000 పరుగుల మార్కును దాటకపోవడం కోహ్లీ ఆధిపత్యానికి నిదర్శనం.
ప్రస్తుతం జరుగుతున్న 2026 ఐపీఎల్లో విరాట్ కోహ్లీ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. అతను కేవలం 7 మ్యాచ్లలోనే 54.57 సగటుతో 328 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ రేసులో ముందున్నాడు. అతను ఇప్పటికే తన బ్యాట్తో 36 ఫోర్లు, 12 సిక్సర్లు బాది ప్రత్యర్థి బౌలర్లకు ముచ్చెమటలు పట్టిస్తున్నాడు.
ఇక్కడి ప్రత్యేకత ఏమిటంటే, నేటి మ్యాచ్ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతోంది. ఇది విరాట్ కోహ్లీ పెరిగిన సొంత మైదానం. ఇక్కడి పిచ్, ఫీల్డ్లోని ప్రతి మూల గురించి అతనికి క్షుణ్ణంగా తెలుసు. గత సీజన్లో ఢిల్లీలో ఆర్సీబీ తరఫున అద్భుతమైన ప్రదర్శన చేసిన కోహ్లీ, ఈరోజు కూడా జట్టుకు విజయాన్ని అందించేందుకు ఒక పెద్ద ఇన్నింగ్స్ ఆడతానని ధీమాతో ఉన్నాడు.
ఈ మ్యాచ్లో కోహ్లీ రికార్డుకు చేరువలో..
ఐపీఎల్లో 9,000 పరుగులు చేసిన తొలి బ్యాట్స్మన్గా నిలిచే అవకాశం. విరాట్ 274 మ్యాచ్లలో 8,989 పరుగులు చేశాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక సెంచరీలు (8) సాధించాడు. తమ అభిమాన ఆటగాడు ఈ అరుదైన మైలురాయిని చేరుకుని, జట్టును ప్లే-ఆఫ్స్కు చేర్చాలని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అభిమానులు ఆశిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Chitra Pournami 2026: అరుణాచలంలో గిరి ప్రదక్షిణకు అత్యంత శుభ ముహూర్తం..ఈ పవిత్ర ఘడియల్లో స్వామి దర్శనం అపూర్వం!
Tiruvannamalai, Tamil Nadu:Chitra Pournami 2026 Girivalam Timings: తమిళనాడులోని తిరువణ్ణామలై అరుణాచలేశ్వర స్వామి ఆలయంలో ప్రతి పౌర్ణమికి గిరి ప్రదక్షిణ రద్దీ సహజం. కానీ, ఈసారి రాబోతున్న చిత్ర పౌర్ణమి సందర్భంగా భక్తులు గిరివలయం చుట్టూ ప్రదక్షిణ చేసేందుకు శుభ ముహుర్తాన్ని పండితులు ప్రకటించారు. ఈ క్రమంలో ఆలయం వద్ద తగిన ఏర్పాట్లు చేస్తామని.. భక్తులకు అవసరమైన సౌకర్యాలను కల్పిస్తామని దేవాలయ పాలకమండలి వెల్లడించింది. అయితే ఎప్పటి కంటే ఈసారి చిత్ర పౌర్ణమికి భక్తుల రద్దీ భారీగా పెరిగే అవకాశం కనిపిస్తోంది.
ప్రతి నెలలో వచ్చే పౌర్ణమి, చిత్ర పౌర్ణమి, కార్తీక దీపం సందర్భంగా కొండపై మహాదీపం వెలిగించే కార్యక్రమాల రోజుల్లో శ్రీ అరుణాచలేశ్వర ఆలయానికి భక్తులు పెద్దఎత్తుల దర్శనానికి రావడం ఆనవాయితీగా వస్తుంది. ఈయా ప్రత్యేక సందర్భాల్లో స్థానిక భక్తులే కాకుండా పక్క రాష్ట్రాలు, విదేశాల నుంచి భక్తులు తరలివస్తారు. ఈ క్రమంలో తిరువణ్ణామలై ఆలయాన్ని తెల్లవారుజామున తెరుస్తారు. స్వామి వారి అభిషేకం, ఆరాధనలతో ప్రారంభమై.. ఆలయం చుట్టూ ఉన్న 14 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ మార్గాన్ని చుడుతూ భక్తులు తమ మొక్కులను చెల్లిస్తారు.
ఈ క్రమంలో తమిళనాట చిత్తరై మాస పౌర్ణమి మే నెల 1వ తేదీన శుక్రవారం రాబోతోంది. ఆ రోజున ఆలయాన్ని ఉదయాన్నే తెరిచి.. స్వామివారికి పాలు, పన్నీర్, పెరుగు, పంచామృతాలు, యాలకుల నీర, పవిత్ర జలం, తేనె వంటి వివిధ రకాల పూజా ద్రవ్యాలతో అభిషేకం చేస్తారు. ఈ విశిష్టాభిషేకం తర్వాత స్వామివారిని పుష్పాలతో అలంకరించి, ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు.
చిత్ర పౌర్ణమి నేపథ్యంలో భక్తులు గిరి ప్రదక్షిణ చేసేందుకు శుభ ముహూర్తాల వివరాలను పండితులు ప్రకటించారు. ఏప్రిల్ 30 అనగా గురువారం రాత్రి 9.52 గంటలకు ప్రారంభమై.. ఆ తర్వాతి రోజు మే 1 అనగా శుక్రవారం రాత్రి 11.08 గంటల వరకు ఈ శుభకాలం నడుస్తోంది. కాబట్టి, భక్తులు ఈ సమయంలో గిరివలయాన్ని ప్రదక్షిణ చేస్తే మంచిది. అయితే రాబోయే పౌర్ణమికి భక్తులు 30 లక్షల మందికి పైగా ఈ గిరి ప్రదక్షిణలో పాల్గొంటారని ఆలయ యంత్రాంగం అంచనా వేస్తోంది.
భక్తులు వేలాదిగా తరలిరానున్నానే అంచనా నేపథ్యంలో వారి సౌకర్యార్థ్యం ఎలాంటి ఇబ్బంది లేకుండా తాగునీరు, పార్కింగ్, మరుగుదొడ్లు వంటి సౌకర్యాలను కల్పిస్తున్నారు. దీంతో పాటు గిరి ప్రదక్షిణలో వైద్య బృందం, అగ్నిమాపక సిబ్బందితో పాటు పెద్ద సంఖ్యలో పోలీసు అధికారులు భద్రతా విధుల్లో అందుబాటులో ఉంటారు. అలాగే జిల్లా యంత్రాంగం కూడా భక్తులకు కావాల్సిన ప్రాథమిక అవసరాలకు ఎలాంటి ఆటంకం లేకుండా చర్యలు చేపడుతోంది.
ALso Read: Viral Potato Chips: ఆలూ చిప్స్ స్నాక్స్ లాగా తింటున్నారా? ఈ వైరల్ వీడియో చూస్తే జన్మలో ముట్టుకోరు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
