భద్రాద్రి కొత్తగూడెం:ఏసీబీ వలలో అవినీతి చేప
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
8th Pay Commission Fraud: ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్దారులు కొన్ని నెలలుగా ఎదురుచూస్తున్న కొత్త వేతన సంఘం మరింత ఆలస్యమవుతోంది. కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుండడంతో ఉద్యోగ వర్గాలు తీవ్రంగా ఎదురుచూస్తున్నారు. జనవరి 2026 నుంచి అమలు కావాల్సిన కొత్త వేతన సంఘం అతీగతీ లేదు. పాలకవర్గం నియమించి తర్వాత ప్రభుత్వం పట్టించుకోలేదు. త్వరలోనే వస్తుందని ఆశిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్దారులను కొందరు అమాయకంగా మోసం చేస్తున్నారు. ఉద్యోగుల ఆశలను తమ పెట్టుబడిగా చేసుకుని సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. ఏపీకే ఫైల్స్, వాట్సప్ సందేశాలతో మోసాలకు పాల్పడుతున్న ఘటనలు పెరిగిపోతుండడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఉద్యోగులు, పింఛన్దారులకు కేంద్ర ప్రభుత్వం కీలక హెచ్చరికలు జారీ చేసింది.
Also Read: Maha Shivaratri: మహా శివరాత్రి తర్వాతి రోజు ఏం చేయాలి? ఉపవాసం తర్వాతి రోజు ఏం తినాలి?
ఎనిమిదో వేతన సంఘంలో జీతాలు పెరుగుతాయని ఆశగా ఎదురుచూస్తున్న ఉద్యోగులు, పింఛన్దారులను సైబర్ నేరస్తులు సులువుగా మోసం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లే లక్ష్యంగా సైబర్ మోసగాళ్లు సరికొత్త మోసాలకు తెరలేపారు. 8వ వేతన సంఘం ప్రకారం జీతం ఎంత పెరుగుతుందో కచ్చితంగా అంచనా (క్యాలికులేట్) వేసి చెబుతామంటూ వాట్సప్లో సందేశాలు పంపుతున్నారు. మీకు పెరిగే జీతాన్ని అంచనా వేసి చెబుతామంటూ నేరగాళ్లు వాట్సప్లో సందేశం పెడుతూనే.. ‘8వ సీపీసీ శాలరీ కాలిక్యులేటర్’, ‘శాలరీ రివిజన్ టూల్’ పేరుతో ఏపీకే ఫైల్స్ను జత చేస్తున్నారు.
Also Read: BRS Clean Sweep: బీఆర్ఎస్ పార్టీ క్లీన్ స్వీప్.. కేసీఆర్కు గూడెం మహిపాల్ రెడ్డి గిఫ్ట్
ఆ ఏపీకే ఫైల్ను డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేయడంతో ఉద్యోగులు, పింఛన్దారులకు సంబంధించిన వివరాలు అన్నీ సైబర్ నేరస్తులకు చిక్కుతున్నారు. ఏపీకే ఫైల్స్ ఇన్స్టాల్ చేసుకున్న ఫోన్ మొత్తం సైబర్ నేరగాళ్ల ఆధీనంలోకి వెళ్తుంది. ఫోన్ యజమాని వ్యక్తిగత డేటా, బ్యాంకుల సమాచారం, ఎస్ఎంఎస్, ఓటీపీలు అన్నీ కూడా మోసగాళ్లకు చేరిపోతాయి. దీంతో ఉద్యోగులు, పింఛన్దారులకు తెలియకుండానే బ్యాంకుల నుంచి నగదు బదిలీ జరుగుతున్నాయి. తమ అకౌంట్లు ఖాళీ అవుతుండడంతో ఉద్యోగులు, పింఛన్దారులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు.
Also Read: Mahabubnagar: చరిష్మా లేని రేవంత్ రెడ్డి.. సొంత జిల్లాలో కాంగ్రెస్కు ఎన్ని స్థానాలు అంటే?
8వ వేతన సంఘం పేరిట మోసాలు పెరిగిపోతుండడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. చాలా చోట్ల పలు కేసులు నమోదవడంతోపాటు సైబర్ నేరాల నియంత్రణకు ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా ఉద్యోగులు, పింఛన్దారులకు కొన్ని ముఖ్యమైన సూచనలు ప్రభుత్వం చేసింది. కేంద్ర ప్రభుత్వం ఎట్టిపరిస్థితుల్లోనూ వాట్సాప్ ద్వారా ఎలాంటి ఏపీకే ఫైల్స్ పంపదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ కొత్త సైబర్ స్కామ్పై జాగ్రత్తగా ఉండాలంటూ కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులతోపాటు పింఛన్దారులను ప్రభుత్వం హెచ్చరించింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
IND vs PAK LIVE Updates: టీ20 ప్రపంచకప్ టైటిల్ ఫేవరేట్గా ఉన్న భారత జట్టు వరుస విజయాలతో దూకుడు మీద ఉండగా.. అదే ఉత్సాహంతో పాకిస్థాన్తో తలపడింది. కొలంబో వేదికగా జరిగిన మూడో టీ20 మ్యాచ్లో భారత్పై పాకిస్థాన్ ఆధిపత్యం ప్రదర్శించింది. దీంతో తక్కువ పరుగులు చేసి టీమిండియా అందరినీ విస్మయానికి గురిచేసింది. డబుల్ సెంచరీ కూడా సాధించకపోవడంతో భారత్పై పాకిస్తాన్ పైచేయి సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేసింది.
Also Read: KT Rama Rao: ఎవరు వచ్చినా.. రాకపోయినా సింగరేణి కోసం పోరాడుతాం: కేటీఆర్
పాకిస్థాన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడంతో భారత జట్టు బ్యాటింగ్కు దిగింది. భారీ ఇన్నింగ్స్ నిర్మించేందుకు బరిలోకి దిగిన భారత జట్టుకు తొలి ఓవర్లోనే భారీ షాక్ తగిలింది. ఇషాన్ కిషన్ దూకుడుగా ఆడుతుండగా.. నాలుగు బంతులు ఎదుర్కొన్న అభిషేక్ శర్మ ఒక్క పరుగు సాధించకుండానే క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. శతకం బాదుతాడని అందరూ లెక్కలు వేసుకుంటున్న సమయంలో ఒక్క పరుగు చేయకుండా ఔటవడం భారత అభిమానులను షాక్కు గురిచేసింది. దాన్నుంచి తేరుకున్న ఇషాన్ కిషన్ సంచలన ప్రదర్శన చేశాడు. 44 బంతుల్లో 77 పరుగులు చేశాడు. బాదిన షాట్లన్నీ బౌండరీ లైన్ దాటాయి. మూడు సిక్సర్లు బాదిన ఇషాన్ ఏకంగా పది ఫోర్లు బాది దూకుడుగా ఆడాడు.
Also Read: IND Vs PAK Playing 11: టీ20 వరల్డ్ కప్లో హైఓల్టేజ్ ఫైట్.. భారత్ Vs పాక్ తుది జట్లు ఇవే..!
అనంతరం వచ్చిన కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ నిలకడగా ఆడి 29 బంతుల్లో 32 పరుగులు సాధించగా.. యువ క్రికెటర్ తిలక్ వర్మ 25 పరుగులు చేశాడు. నిలకడగా సాగుతున్న వారి భాగస్వామ్యాన్ని సైమా విడగొట్టాడు. తిలక్ వర్మ తర్వాత మైదానంలోకి వచ్చిన స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా తొలి బంతికి భారీ షాట్ ఆడే ప్రయత్నం చేయగా.. బాబర్ ఆజమ్కు క్యాచ్ ఇచ్చేశాడు. దీంతో భారత అభిమానులు నిర్ఘాంతపోయారు. స్టార్ బ్యాటర్ గోల్డెన్ డకౌట్ అవడంతో భారీ స్కోర్ నమోదవుతుందనుకుంటే ఆశలు సన్నగిల్లాయి.
Also Read: Revanth Reddy: బంజారాలకు తెలంగాణ సీఎం శుభవార్త.. నల్లమలలో సేవాలాల్ మహరాజ్ పుణ్యక్షేత్రం
భారత స్కోర్ నిలకడగా ఆడుతుండగా.. పాకిస్థాన్ బౌలర్లు పొదుపుగా బంతులు వేసి స్కోర్ బోర్డును నియంత్రించారు. శివమ్ దూబే 27 పరుగులు చేసి రనౌట్ అవగా.. రింకూ సింగ్ 11 పరుగులు చేశాడు. అక్షర్ పటేల్ ఆఖరి బంతికి భారీ షాట్ ఆడే ప్రయత్నం చేసి ఔటయ్యాడు. సైమ్ ఆయూబ్ వరుసగా రెండు వికెట్లతో మరో వికెట్ తీయగా.. సల్మాన్, షాహిదీ అఫ్రిది, ఉస్మాన్ తారీఖ్ ఒక్కో వికెట్ తీశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Sevalal Maharaj In Nallamala Forest: నల్లమల అటవీ ప్రాంతంలో బంజారాల ఆరాధ్యదైవం సంత్ శ్రీ సేవాలాల్ మహరాజ్ పుణ్యక్షేత్రాన్ని నిర్మిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి ప్రకటించారు. వచ్చే ఏడాది సేవాలాల్ జయంతి ఉత్సవాలను అక్కడే నిర్వహించుకునేలా.. గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా అత్యద్భుతంగా పుణ్యక్షేత్రాన్ని నిర్మిస్తామని హామీ ఇచ్చారు. 'తెలంగాణలోని అన్ని తండాలు, గూడాలకు తప్పనిసరిగా బీటీ రోడ్డు ఉండాలి. దీనికోసం స్పష్టమైన ప్రణాళికలు రూపొందించాలి' అని అధికార యంత్రాంగానికి ఆదేశించారు. కనెక్టివిటీ కోసం బీటీ రోడ్డుతో పాటు ప్రతి గ్రామ పంచాయతీలో పాఠశాల, పంచాయతీ భవనం ఉండాలని తెలిపారు.
Also Read: Mahabubnagar: చరిష్మా లేని రేవంత్ రెడ్డి.. సొంత జిల్లాలో కాంగ్రెస్కు ఎన్ని స్థానాలు అంటే?
గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని బంజారా భవన్లో సేవాలాల్ మహరాజ్ జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎంపీ బలరాం నాయక్తో కలిసి ముఖ్యమంత్రి పాల్గొని కీలక ప్రసంగం చేశారు. 'ఆదివాసీలకు ఆదిలాబాద్లో నాగోబా దేవాలయం, మేడారంలో సమ్మక్క - సారలమ్మ పుణ్యక్షేత్రం ఉన్నట్టుగా బంజారాలకు ప్రత్యేక క్షేత్రం లేదు. దీనికోసం నల్లమల అటవీ ప్రాంతంలో 20 ఎకరాల భూమిని ఇప్పటికే కేటాయించడంతో అక్కడ బంజారాల సంస్కృతి, సంప్రదాయాలకు అనుగుణంగా ప్రపంచంలోనే బ్రహ్మాండమైన పుణ్యక్షేత్రంగా, గొప్ప పర్యాటక క్షేత్రంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలి' అని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.
Also Read: KT Rama Rao: ఎవరు వచ్చినా.. రాకపోయినా సింగరేణి కోసం పోరాడుతాం: కేటీఆర్
'మానవజాతి శాంతి మార్గంలో చెడును విడిచి, భక్తితో సన్మార్గంలో నడవాలని బోధించిన సంత్ సేవాలాల్ దేశంలో 15 కోట్ల మంది గిరిజనులకు ఆదర్శప్రాయంగా నిలిచారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో, పునర్నిర్మాణంలో లంబాడా సోదరుల పాత్ర ఎవరూ మరువలేనిది. వారికి సంక్షేమం, అభివృద్ధి, ప్రభుత్వంలో సముచిత స్థానం, గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత ఉంది' అని తెలంగాణ సీఎం గుర్తుచేశారు. 'ప్రతి తండాలో పాఠశాల భవనం, పంచాయతీ భవన నిర్మాణానికి స్పష్టమైన ప్రణాళిక సిద్ధం చేయాలి. తాగునీరు, విద్యుత్ అందించాలి. అటవీ ప్రాంతాల్లో ఉండే సమస్యలను దృష్టిలో ఉంచుకుని కరెంట్ లేని చోట సోలార్ పంపుసెట్లను ఏర్పాటు చేస్తూ గిరిజనులకు ప్రాధాన్యతనిస్తున్నాం' అని ముఖ్యమంత్రి తెలిపారు.
Also Read: Maha Shivaratri: మహా శివరాత్రి తర్వాతి రోజు ఏం చేయాలి? ఉపవాసం తర్వాతి రోజు ఏం తినాలి?
'తెలంగాణ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం పని చేస్తోంది. పేదలకు పంచడానికి ప్రభుత్వం వద్ద భూములు లేవు. చదువు లేని కారణంగా చాలా మంది పేదరికంలో మగ్గుతున్నారు. అందుకే నిరుపేదలు చదువుకోవడానికి కావలసిన అన్ని వసతులు, సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తోంది' అని తెలంగాణ సీఎం వివరించారు. నిర్దిష్టమైన ప్రణాళికలతో కష్టపడి చదువుకుని అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Sant Sevalal Maharaj Jayanthi: సింగరేణిలో జరుగుతున్న దోపిడీని అడ్డుకోవడమే తమ లక్ష్యమని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. సింగరేణి కార్మికుల ప్రయోజనాల కోసం తమ పార్టీ పోరాటం కొనసాగుతుందని ప్రకటించారు. సింగరేణి కార్మికుల ప్రయోజనాల దృష్ట్యా కొత్తగూడెంలో బీఆర్ఎస్ తన మద్దతు సీపీఐకి ప్రకటించిందని వెల్లడించారు. 'సింగరేణి దోచుకుంటున్న కాంగ్రెస్ను ఆపేందుకే సీపీఐకి మద్దతు ఇస్తామని చెప్పాం. కానీ వారిపై ఏమి ఒత్తిడి ఉందో తెలియదు. పొత్తుకు ఎందుకు ఒప్పుకుందో వాళ్లకే తెలియాలి' అని తెలిపారు.
Also Read: 8th Pay Commission: 8వ వేతన సంఘంపై సైబర్ మోసం.. ప్రభుత్వ ఉద్యోగులకు భారీ అలర్ట్
హైదరాబాద్లోని పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్లో సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు నిర్వహించారు. వాటిలో పాల్గొన్న అనంతరం మాజీ మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ సింగరేణి సంస్థలో జరుగుతున్న పరిణామాలు, మున్సిపల్ రాజకీయ పరిస్థితులపై స్పందించారు. బీజేపీ, కాంగ్రెస్ రెండూ కలిసి సింగరేణి దోపిడీలో భాగస్వాములై సంస్థను నష్టపరిచేలా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. సీపీఐ, కాంగ్రెస్ ఇప్పటికే పొత్తులో ఉన్నాయని కొత్తగూడెంలో మేయర్ పదవి పంచుకోవడంలో ఆశ్చర్యం ఏమీ లేదని పేర్కొన్నారు. ఏఐటీయూసీ వంటి సీపీఐకి అనుబంధ సంస్థ కూడా ఈ పొత్తును ఎందుకు అంగీకరించిందో తెలియదని.. దాని వెనుక ఏ ఒత్తిళ్లు పని చేశాయో తాను చెప్పలేనని మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు.
Also Read: Maha Shivaratri: మహా శివరాత్రి తర్వాతి రోజు ఏం చేయాలి? ఉపవాసం తర్వాతి రోజు ఏం తినాలి?
'ఎవరూ కలిసి వచ్చినా.. రాకపోయినా సింగరేణి సంస్థ ప్రయోజనాలు, కార్మికుల హక్కుల కోసం గతంలో ఎట్లా పోరాడామో భవిష్యత్తులో కూడా అలాగే పోరాడుతాం' అని మాజీ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. 'రాష్ట్రంలో దాదాపు 34 చోట్ల హంగ్ పరిస్థితులు ఉన్నాయి. ఆ ప్రాంతాల్లో కాంగ్రెస్ నాయకులు అరాచకాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ, కార్పొరేటర్లు, కౌన్సిలర్లను ఎత్తుకుపోవడం, ప్రలోభపెట్టడం, పోలీసులను ఇంటింటికి పంపించడం, గుండాలను ఉపయోగించడం వంటి చర్యలు జరుగుతున్నాయి' అని కాంగ్రెస్ దౌర్జన్యాలు కేటీఆర్ వివరించారు.
Also Read: BRS Clean Sweep: బీఆర్ఎస్ పార్టీ క్లీన్ స్వీప్.. కేసీఆర్కు గూడెం మహిపాల్ రెడ్డి గిఫ్ట్
'మా తండాల్లో మా రాజ్యం ఉండాలి అనేన నినాదాన్ని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కార్యరూపంలోకి తీసుకువచ్చి గిరిజనుల ఆత్మగౌరవానికి న్యాయం చేశారు. గిరిజన గూడాలు, కోయ గూడాలు, లంబాడా తండాలకు ప్రాధాన్యం ఇస్తూ 3,146 కొత్త గ్రామపంచాయతీలు ఏర్పాటు చేశారు. వేలాది గిరిజన యువతకు సర్పంచ్లు, వార్డు సభ్యులుగా అవకాశాలు కల్పించారు. దాదాపు 30 వేల మంది వార్డు సభ్యులు గిరిజన వర్గాల నుంచి ఎదిగారు. ఇదంతా కేసీఆర్ కృషితోనే సాధ్యమైంది' అని మాజీ మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు.
Also Read: Mahabubnagar: చరిష్మా లేని రేవంత్ రెడ్డి.. సొంత జిల్లాలో కాంగ్రెస్కు ఎన్ని స్థానాలు అంటే?
'ఒకే రోజు సుమారు నాలుగున్నర లక్షల ఎకరాల పోడు భూములకు పట్టాలు ఇచ్చి గిరిజనుల భూమి హక్కులను రక్షించింది బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. కొమురం భీమ్ నాయకత్వంలో జరిగిన జల్, జంగల్, జమీన్ పోరాట స్ఫూర్తిని కొనసాగిస్తూ అడవులు, భూములు, నీళ్ల విషయంలో న్యాయం చేస్తూ గిరిజనుల జీవన ప్రమాణాలను మెరుగుపరిచాం' అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు.
గిరిజన పిల్లల కోసం ఆశ్రమ పాఠశాలలు, గురుకులాలు, జూనియర్, డిగ్రీ కాలేజీలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం బీఆర్ఎస్ ప్రభుత్వ ఘనత అని ప్రకటించారు.
రిజర్వేషన్లను 6 శాతం నుంచి 10 శాతానికి పెంచి గిరిజన యువతకు మెరుగైన అవకాశాలు కల్పించామని మాజీ మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. 'గిరిజన యువతకు ప్రభుత్వ సబ్సిడీలు, వడ్డీ లేని రుణాలు అందించి వారిని వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దాం. ఓవర్సీస్ స్కాలర్షిప్లు కూడా అందించి ఉన్నత విద్యకు ప్రోత్సాహం ఇచ్చాం. బంజారాహిల్స్లో సేవాలాల్ బంజారా భవన్ నిర్మాణం ద్వారా గిరిజనుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టారని, రాష్ట్రవ్యాప్తంగా సేవాలాల్ భవనాల నిర్మాణానికి స్థలాలు మంజూరు చేశాం' అని కేటీఆర్ వివరించారు. బీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చాక.. కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి అయ్యాక గిరిజనులకు అండగా నిలబడతామని మాజీ మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Poco C81 Pro Price Cut: చైనీస్ స్మార్ట్ ఫోన్ కంపెనీ పోకో త్వరలో మార్కెట్లోకి తమ కొత్త సిరీస్ మొబైల్ విడుదల చేయబోతోంది. దీనిని కంపెనీ సీసీరీస్లో అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఇది పోకో c81 ప్రో పేరుతో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. గత ఏడాది పోకో సి85 తేడాది డిసెంబర్లో భారత్లో విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే, దీనికి అప్డేటెడ్ వెర్షన్లోనే ఈ కొత్త మొబైల్ సిరీస్ విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, దీనికి సంబంధించిన అన్ని వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..
పోకో C81 ప్రో స్మార్ఫోన్కు సంబంధించిన ఫీచర్స్ కంపెనీ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు.. కానీ ఇప్పటికే సోషల్ మీడియాలో లీకై విపరీతంగా వైరల్ అవుతున్నాయి.. దీనిని కంపెనీ 25128PC17G మోడల్ నెంబర్తో విడుదల చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇది అద్భుతమైన ఫీచర్లతో అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నట్లు సమాచారం.. ఈ స్మార్ట్ ఫోన్ HD+ రిజల్యూషన్తో 6.9-అంగుళాల LCD స్క్రీన్ను కలిగి ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ఎంతో శక్తివంతమైన Unisoc T7250 ప్రాసెసర్వై రన్ అవుతుంది. అంతేకాకుండా మరెన్నో అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉండబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఇక ఇప్పటికే అందుబాటులో ఉన్న Poco C85 5G స్మార్ట్ ఫోన్ కు సంబంధించిన ఫీచర్స్ వివరాల్లోకి వెళ్తే.. దీనిని కంపెనీ ఎంతో ప్రత్యేకమైన 120Hz రిఫ్రెష్ రేట్తో 6.9-అంగుళాల LCD ప్యానెల్ డిస్ప్లే ని కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇది ఎంతో శక్తివంతమైన 6,000mAh బ్యాటరీతో అందుబాటులోకి వచ్చింది. అలాగే ఫాస్ట్ ఛార్జింగ్ కోసం కంపెనీ 15W చార్జింగ్ సపోర్ట్ ను కూడా అందిస్తోంది. దీంతోపాటు Android 15 ఆధారంగా HyperOS 3 ఆపరేటింగ్ సిస్టంపై రన్ అవుతుంది. అలాగే త్వరలో విడుదల కాబోయే సిరీస్.. Redmi A7 Pro రీబ్రాండెడ్ వెర్షన్గా విడుదల అయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
Also Read: Redmi 14C 5G Offer: రెడ్మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్ఫోన్..అదిరిపోయే ఆఫర్!
ఈ Poco C81 Pro స్మార్ట్ఫోన్ వెనక భాగంలో అద్భుతమైన కెమెరా సెటప్ను కలిగి ఉంటుంది. ముఖ్యంగా ఇందులో 50-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాను కలిగి ఉంటుంది. అలాగే అదనంగా మరో కెమెరాను కలిగి ఉండబోతోంది. ఇక ఫ్రంట్ భాగంలో వీడియో కాలింగ్ కోసం.. కంపెనీ ఇందులో 8-మెగాపిక్సెల్ కెమెరాను కూడా అందించింది. అయితే, ఇప్పటికి పోకో సి85 మాత్రమే అందుబాటులో ఉంది.. అతి త్వరలోనే పోకో కంపెనీ పోకో ఎక్స్ 8 ప్రో మాక్స్తో పాటు ఎక్స్ 8 ప్రోను కూడా విడుదల చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. దీనిని ముందుగా చైనాలో విడుదల చేసి ఆ తర్వాత భారత మార్కెట్లో అందుబాటులోకి తీసుకువచ్చే ఛాన్సులు ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read: Redmi 14C 5G Offer: రెడ్మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్ఫోన్..అదిరిపోయే ఆఫర్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
OnePlus 13s Price Drop: ఎప్పటినుంచో మంచి స్మార్ట్ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అమెజాన్ మీకోసం అద్భుతమైన అవకాశాన్ని అందిస్తుంది. ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్లో వన్ప్లస్ కంపెనీ ఇటీవలే మార్కెట్లోకి విడుదల చేసిన వన్ ప్లస్ 13 సిరీస్ లో అందుబాటులోకి వచ్చిన OnePlus 13s మోడల్ అతి తక్కువ ధరలో అందుబాటులో ఉంది. ముఖ్యంగా ఈరోజే కొనుగోలు చేసే వారికి ఎన్నో రకాల ప్రత్యేకమైన స్పెషల్ ఆఫర్స్ లభిస్తున్నాయి. అయితే, దీనిపై ఉన్న ఆఫర్స్ వివరాలు, ఫీచర్స్తో పాటు స్పెసిఫికేషన్స్ ఇప్పుడు తెలుసుకుందాం..
OnePlus 13s స్మార్ట్ఫోన్ అద్భుతమైన ఫీచర్లతో అందుబాటులోకి వచ్చింది. దీనిని కంపెనీ ఎంతో శక్తివంతమైన 6.32 అంగుళాల 1.5K LTPO ProXDR డిస్ప్లేతో విడుదల చేసింది. అలాగే ఈ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్ను కలిగి ఉంటుంది. ముఖ్యంగా ఇందులో కంపెనీ ఎంతో శక్తివంతమైన Snapdragon 8 Elite చిప్సెట్ ప్రాసెసర్ను అందుబాటులో ఉంచింది. ఇక వెనక భాగంలోని కెమెరాకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. వన్ ప్లస్ కంపెనీ Sony LYT-700 సెన్సార్ తో కూడిన 50MP మెయిన్ కెమెరా కలిగి ఉంటుంది. దీంతోపాటు అదనంగా 50MP టెలిఫోటో లెన్స్ కెమెరాను కూడా లభిస్తుంది. అలాగే ఫ్రంట్ భాగంలో సెల్ఫీ కోసం ఇందులో కంపెనీ 32MP కెమెరాను కూడా అందుబాటులో ఉంచింది.
ఈ స్మార్ట్ఫోన్లో హైలెట్ ఏందంటే బ్యాటరీ తో పాటు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్.. ఈ మొబైల్లో కంపెనీ ఎంతో శక్తివంతమైన 5,850mAh బ్యాటరీని అందిస్తోంది. దీంతోపాటు 80W SUPERVOOC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా లభిస్తుంది. అలాగే ఇది ఎంతో ప్రత్యేకత తో కూడిన ఆండ్రాయిడ్ 15 ఆధారిత OxygenOS 15 ఆపరేటింగ్ సిస్టంపై రన్ అవుతుంది. ప్రస్తుతం మార్కెట్లో ఈ స్మార్ట్ఫోన్ ధర MRP రూ.57,999తో అందుబాటులో ఉంది. అయితే, దీనిని అమెజాన్లో ఇప్పుడే కొనుగోలు చేసే వారికి ఏకంగా 12 శాతం తగ్గింపుతో కేవలం రూ.50,999కే లభిస్తోంది. అలాగే మరింత తగ్గింపు ధరకు పొందడానికి బ్యాంకు డిస్కౌంట్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. ఇందులో భాగంగా కొనుగోలు చేసే వారికి మరింత తగ్గింపు ధరకే దీనిని సొంతం చేసుకోవచ్చు.
Also Read: Redmi 14C 5G Offer: రెడ్మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్ఫోన్..అదిరిపోయే ఆఫర్!
ఇక ఈ మొబైల్పై ఉన్న బ్యాంక్ ఆఫర్స్ వివరాల్లోకి వెళ్తే.. దీనిని హెచ్డిఎఫ్సి బ్యాంకు క్రెడిట్ కార్డు వినియోగించి పేమెంట్ చేసే వారికి రూ.3000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో పాటు అమెజాన్ పే ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డులను వినియోగించి పేమెంట్ చేస్తే.. పైన పేర్కొన్న డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో ఈ మొబైల్ కేవలం రూ.47,999కే పొందవచ్చు. అలాగే ఎక్స్చేంజ్ బోనస్ ఆఫర్ వినియోగించే వారికి ఈ మొబైల్ మరింత చీప్ ధరకు పొందవచ్చు.
మీ దగ్గర ఉన్న పాత వన్ప్లస్ స్మార్ట్ఫోన్ను ఎక్స్చేంజ్ ఆఫర్స్లో భాగంగా.. ఎక్స్చేంజ్ చేస్తే మొబైల్ కండిషన్ను బట్టి ఏకంగా రూ. 48 వేల వరకు బోనస్ లభిస్తుంది. ఇలా పొందిన బోనస్ని మొబైల్ ధర నుంచి మైనస్ చేస్తే.. ఈ మొబైల్ను కేవలం రూ.1,999 లోపే పొందవచ్చు.. అంతేకాకుండా మరిన్ని డిస్కౌంట్ ఆఫర్స్ను దీనిని తక్కువ ధరకే పొందే అవకాశం కూడా ఉంది.
Also Read: Redmi 14C 5G Offer: రెడ్మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్ఫోన్..అదిరిపోయే ఆఫర్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
BSNL Senior Executive Recruitment 2026: ప్రభుత్వరంగ టెలికాం దిగ్గజం భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) నిరుద్యోగులకు తీపి కబురు అందించింది. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ బ్రాంచ్లలో ఖాళీగా ఉన్న సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మంచి జీతం, ప్రభుత్వ ఉద్యోగం ఆశించే వారికి ఇది ఒక అద్భుతమైన అవకాశం. డైరెక్ట్ రిక్రూట్మెంట్ పద్ధతిలో భర్తీ చేయనున్న ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను బీఎస్ఎన్ఎల్ ఆహ్వానిస్తోంది.
ఖాళీల వివరాలు
మొత్తం 120 పోస్టులను రెండు ప్రధాన విభాగాల్లో భర్తీ చేస్తున్నారు.
సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (టెలికాం): 95 పోస్టులు
సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (ఫైనాన్స్): 25 పోస్టులు
అర్హతలు & వయోపరిమితి
టెలికాం కేటగిరీ కోసం కనీసం 60% మార్కులతో బీఈ (BE) లేదా బీటెక్ (B.Tech) పూర్తి చేసి ఉండాలి. అలాగే ఫైనాన్స్ కేటగిరీ కోసం కనీసం సీఏ (CA) లేదా సీఎంఏ (CMA) ఉత్తీర్ణత సాధించి ఉండాలి. నోటిఫికేషన్లో పేర్కొన్న విధంగా సంబంధిత విభాగంలో పని అనుభవం ఉండాలి.
అదే విధంగా వయస్సు (మార్చి 7, 2026 నాటికి) 21 నుండి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఓబీసీలకు 3 ఏళ్లు, ఎస్సీ/ఎస్టీలకు 5 ఏళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 15 ఏళ్ల వరకు వయోపరిమితిలో మినహాయింపు ఉంటుంది.
జీతభత్యాలు
ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.24,900 నుండి రూ.50,500 వరకు వేతనం అందుతుంది. దీనితో పాటు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇతర అలవెన్సులు కూడా ఉంటాయి. అభ్యర్థులను ఆన్లైన్ రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. పరీక్షలో ప్రతిభ కనబరిచిన వారికి తుది నియామక ఉత్తర్వులు అందజేస్తారు.
దరఖాస్తు రుసుము , విధానం
జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్: రూ. 2,500
ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ: రూ. 1,250
ముఖ్యమైన తేదీలు
| వివరం | తేదీ |
| దరఖాస్తుకు చివరి తేదీ | మార్చి 7, 2026 (రాత్రి 10 గంటల వరకు) |
| దరఖాస్తు సవరణ | మార్చి 8 నుండి మార్చి 15, 2026 వరకు |
| ఆన్లైన్ రాత పరీక్ష తేదీ | మార్చి 29, 2026 |
టెలికాం రంగంలో కెరీర్ ప్రారంభించాలనుకునే ఇంజనీరింగ్, ఫైనాన్స్ గ్రాడ్యుయేట్లకు ఇది గొప్ప అవకాశం. ఆసక్తి గల అభ్యర్థులు గడువు ముగిసేలోపు బీఎస్ఎన్ఎల్ అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
OnePlus Nord 5 Price Cut: వన్ ప్లస్ బ్రాండ్కి సంబంధించిన మంచి మొబైల్ తక్కువ ధరకే కొనుగోలు చేయాలనుకుంటున్నారా? 2025 సంవత్సరంలో జూలై నెలలో విడుదలైన వన్ ప్లస్ నార్డ్ 5 ఇప్పుడు అమెజాన్లో అత్యంత తక్కువ ధరకే లభిస్తుంది. ముఖ్యంగా చీప్ ధరకే ఈ మొబైల్ పొందాలనుకునే వారికి ఇది అద్భుతమైన అవకాశంగా భావించవచ్చు. ఇప్పుడు దీనిపై ఎన్నో రకాల డిస్కౌంట్ ఆఫర్స్తో పాటు కొన్ని రకాల స్పెషల్ ఆఫర్స్ లభిస్తున్నాయి. ఆ ఆఫర్స్ ఏంటో? దానికి సంబంధించిన ఫీచర్స్ వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
వన్ప్లస్ నార్డ్ 5 (OnePlus Nord 5) స్మార్ట్ఫోన్ అద్భుతమైన 6.83-అంగుళాల Swift AMOLED డిస్ప్లేను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇది చాలా ప్రత్యేకమైన 1.5K రిజల్యూషన్, 144Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్తో అందుబాటులోకి వచ్చింది. అలాగే ఇది ఎంతో శక్తివంతమైన Qualcomm Snapdragon 8s Gen 3 ప్రాసెసర్ ను కలిగి ఉంటుంది.
ఇది అద్భుతమైన ప్రాసెసర్ను కలిగి ఉండటం వల్ల.. గేమింగ్ చేసే యువతకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా మల్టీ టాస్కింగ్ చేయాలనుకున్న వ్యక్తులకు ఈ మొబైల్ చాలా బెస్ట్గా భావించవచ్చు. అంతేకాకుండా ఈ మొబైల్ స్క్రోలింగ్ కూడా చాలా అద్భుతంగా సున్నితంగా ఉంటుంది. దీనివల్ల ఎక్కువసేపు ఈ స్మార్ట్ ఫోన్ను వినియోగించినప్పటికీ ఇలాంటి అసౌకర్యం కలగదు. ఇక వెనక భాగంలో ఈ స్మార్ట్ఫోన్లో కంపెనీ ఎంతో ప్రత్యేకమైన Sony LYT-700, OIS సెన్సార్తో కూడిన 50MP ప్రధాన కెమెరాను కలిగి ఉంటుంది. ఇది అదనంగా 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాను కలిగి ఉంటుంది. దీంతో పాటు ఫ్రంట్ భాగంలో స్పెషల్గా 50MP సెల్ఫీ కెమెరాతో లభిస్తోంది.
OnePlus Nord 5 స్మార్ట్ఫోన్ ఎంతో శక్తివంతమైన 6,800 mAh భారీ బ్యాటరీతో పాటు 80W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టును కలిగి ఉంటుంది. దీంతోపాటు ఇది Android 15 ఆధారిత OxygenOS 15 ఆపరేటింగ్ సిస్టంపై రన్ అవుతుంది. ఇక ఈ మొబైల్ ఎంతో ప్రత్యేకమైన డిజైన్లు కలిగే ఉంటుంది. ఈ స్మార్ట్ఫోన్కు సంబంధించిన డిజైన్ వివరాల్లోకి వెళ్తే..ఇది వెనుక భాగంలో గ్లాస్తో ప్రత్యేకమైన ప్లాస్టిక్ ప్రేమ్తో వస్తోంది. అంతేకాకుండా ఇందులో అలర్ట్ స్లైడర్కు బదులుగా ప్లస్కి బటన్ను పరిచయం చేశారు. దీనివల్ల మొబైల్ వినియోగదారులకు కొన్ని రకాల ఆప్షన్స్ మరింత సులభతరం అయ్యాయి.
ఈ మొబైల్ కి సంబంధించిన ధర వివరాల్లోకి వెళ్తే.. దీనిని కంపెనీ మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంచింది.. అయితే, బేస్ వేరియంట్ పై ప్రత్యేకమైన డిస్కౌంట్ లభిస్తుంది. ఈ వేరియంట్ ధర MRP రూ.33,999 కాగా.. అమెజాన్లో HDFC బ్యాంకుతో పాటు యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులను వినియోగించి పేమెంట్ చేసే వారికి రూ.1,500 తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా దీనిని ఎక్స్చేంజ్ ఆఫర్ వినియోగించి పేమెంట్ చేసే వారికి రూ.32,000 బోనస్ లభిస్తుంది. అయితే, ఇది మీరు ఎక్స్చేంజ్ చేసే పాత మొబైల్ కండిషన్ను బట్టి ఆధారపడి ఉంటుంది. ఇక ఈ అన్ని రకాల ఆఫర్స్ పోను ఈ మొబైల్ కేవలం రూ.1,999లోపే పొందవచ్చు.
Also Read: Redmi 14C 5G Offer: రెడ్మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్ఫోన్..అదిరిపోయే ఆఫర్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
3 Hindu Candidates Won In Bangladesh Elections 2026: బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో ముగ్గురు హిందూ అభ్యర్థులు గెలిచి రికార్డు కైవసం చేసుకున్నారు. ప్రస్తుతం ఉన్న బంగ్లా పరిస్థితుల్లో ఇలా హిందూవులు గెలవడం మరింత ఆసక్తిని కలిగిస్తోంది. అయితే, ఈ ముగ్గురు అభ్యర్థులు కూడా బీఎన్పీ పార్టీ తరఫున గెలిచారు. ఇక ఈ బంగ్లాదేశ్ పార్లమెంటరీ ఎన్నికలు ఇటీవల జరిగిన సంగతి తెలిసిందే. మొత్తం బీఎన్పీ పార్టీ 212 స్థానాలు గెలుచుకొని మెజారిటీ సాధించింది. ప్రధాన ప్రత్యర్థి జమాత్ ఈ ఇస్లామి కేవలం 68 సీట్లతో సరిపెట్టుకుంది.
అయితే బంగ్లాదేశ్ ఎన్నికల్లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ముగ్గురు హిందూ అభ్యర్థులు. వారు బంగ్లా సార్వత్రిక ఎన్నికల్లో గెలిచారు. ప్రత్యర్థులపై భారీ ఓట్ల తేడాతో వీరు గెలుపొందారు. వీరు ముగ్గురు బీఎన్పీ పార్టీ తరఫున ఎన్నికల్లో బరిలోకి దిగారు. ఆ ప్రాంతాల్లో గెలిచి రికార్డు బ్రేక్ చేశారు. బంగ్లాదేశ్ ఎన్నికల్లో BNP పార్టీ తరఫున బరిలోకి దిగిన గయేశ్వర్ చంద్రరాయ్ ఢాకా-3 నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ఆయన జమాత్ ఈ ఇస్లామి పార్టీ అభ్యర్థి మహమ్మద్ షాహినూర్ ఇస్లాంపై గెలుపొందారు. మొత్తంగా 15,899 ఓట్ల తేడాతో గయేశ్వర్ గెలిచారు. గతంలో రాష్ట్ర మంత్రిగా , BNP స్టాండింగ్ కమిటీ సభ్యుడుగా పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది.
తర్వాత చెప్పుకోవాల్సింది లాయర్ దీపెన్ దేవాన్ ఆయన కూడా ఈ బంగ్లాదేశ్ పార్లమెంటరీ ఎన్నికల్లో బీఎన్పీ పార్టీ తరఫు నుంచి నిలబడి గెలిచారు. ప్రధానంగా రంగమతి పార్లమెంటు సీటు నుంచి ఈయన మొత్తంగా ప్రత్యర్థిపై 9678 ఓట్ల తేడాతో గెలిచారు.
బంగ్లాదేశ్ ఎన్నికల్లో చివరగా చెప్పుకోవాల్సింది నితాయ్ చౌదరి. ఆయన కూడా మగురా 2 పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగి విజయం సాధించారు. ప్రభావంతమైన మైనారిటీ వ్యక్తిగా పరిగణిస్తా.రు మొత్తంగా 30 వేలకు పైగా ఓట్ల తేడాతో జమాత్ ఇ ఇస్లాం అభ్యర్థి ముస్తార్షిత్ బిల్లా ను ఓడించారు. ఈ ఎన్నికల్లో జమాత్ కు చెందిన ఏకైక హిందూ అభ్యర్థి మాత్రం ఓడిపోయారు. ఖుల్నా1 స్థానంలో పోటీ చేసిన కృష్ణ నంది 70 వేలకు పైగా ఓట్లు సాధించినప్పటికీ BNP అభ్యర్థి చేతిలో ఓడిపోవడం గమనార్హం.
ఇదిలా ఉండగా బంగ్లాదేశ్ ప్రజల ప్రయోజనాలు తమ విదేశాంగ విధానాన్ని నిర్ణయిస్తాయని BNP చీఫ్ తారిఖ్ రెహమాన్ అన్నారు. ఇండియాతో సంబంధాలకు సంబంధించి మీడియా అడిగిన ప్రశ్నలకు ఆయన ఈ సమాధానం ఇచ్చారు. ఈ గెలుపు బంగ్లాది.. ఇప్పుడు మనం స్వేచ్ఛను పొందాం హక్కులను అసలైన అర్ధాన్ని తిరిగి సంపాదించుకున్నాం . ప్రజాస్వామ్యం కోసం పోరాడిన వారికి ఈ విజయాన్ని అంకితం ఇస్తున్న అన్నారు..
ఇక భారత్లో ఆశ్రయం పొందుతున్న బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనాను అప్పగించమని కోరుతామని అక్కడి తాజా ఎన్నికల్లో గెలుపొందిన BNP పార్టీ ప్రకటించింది. ఇప్పటికే పలుమార్లు తమ అభ్యర్థనను భారత్కు తెలియజేసినట్లు సమాచారం. పొరుగుదేశంలో ప్రధానంగా సత్సంబంధాలు ఏర్పరచుకోవడానికి విదేశాంగ శాఖ స్థాయిలో దీని పరిష్కరిస్తామని ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందన్నారు. ఇక 2024 ఆగస్టు లో బంగ్లాదేశ్ లో జరిగిన అంతర్గత అల్లర్ల కారణంగా హసీనా భారత్ కు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత బంగ్లాలో ఐసిజే కోర్టు ఆమెకు మరణశిక్ష కూడా విధించింది.
Also Read: 'ప్రగతిశీల బంగ్లాదేశ్కు అండగా నిలుస్తాం'.. తారిక్ చారిత్రాత్మక విజయంపై ప్రధాని మోదీ అభినందనలు..!
Also Read: ప్రపంచంలోనే అతిచిన్న 10 దేశాలు.. మ్యాప్లో వెతికినా కనిపించవు..! కాలినడకనే చుట్టేయొచ్చు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.
Nara Lokesh On Kova Bun Incident: కర్నూలుకు చెందిన 'కోవా బన్' వ్యాపారి షేక్ వలీకి జరిగిన అవమానంపై ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పందించారు. సోషల్ మీడియా వేదికగా వలీకి అండగా నిలుస్తామని హామీ ఇవ్వడమే కాకుండా, త్వరలోనే ఆయనను వ్యక్తిగతంగా కలుస్తానని ప్రకటించారు. కర్నూలులో కోవా బన్ విక్రయించే వలీపై కొందరు వ్యక్తులు తప్పుడు ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంపై మంత్రి లోకేష్ తీవ్రంగా స్పందించారు.
మంత్రి లోకేష్ తన 'ఎక్స్' (ట్విట్టర్) ఖాతాలో వలీకి మద్దతుగా పోస్ట్ చేస్తూ కింది విషయాలను పంచుకున్నారు. చిరు వ్యాపారి వలీపై జరిగిన ఆరోపణలు తనను కలచివేశాయని, ఆయనకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని స్పష్టం చేశారు. వలీ తయారు చేసే ప్రసిద్ధ 'కోవా బన్' రుచి చూసేందుకు తాను చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. కర్నూలు పర్యటనలో భాగంగా లేదా అమరావతిలో వలీని త్వరలోనే కలుస్తానని లోకేష్ పేర్కొన్నారు.
ఐక్యతకు భంగం కలిగిస్తే సహించేది లేదు
సమాజంలో మత సామరస్యాన్ని లేదా ఐక్యతను దెబ్బతీసే విధంగా ప్రవర్తించే వారిపై లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అకారణంగా ఒక వ్యక్తిని లక్ష్యంగా చేసుకుని దుష్ప్రచారం చేయడం సరికాదని హితవు పలికారు. ఇలాంటి ప్రవర్తనకు సభ్య సమాజంలో స్థానం లేదని ఆయన కుండబద్దలు కొట్టారు.
ఏం జరిగిందంటే?
కొద్దిరోజుల క్రితం కర్నూలులో కోవా బన్ విక్రయించే వలీ వ్యాపారంపై కొందరు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేశారు. దీనివల్ల ఆయన వ్యాపారం దెబ్బతినడమే కాకుండా మానసిక వేదనకు గురయ్యారు. ఈ విషయం మంత్రి లోకేష్ దృష్టికి రావడంతో ఆయన సానుకూలంగా స్పందించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook