అంగన్వాడీల ధర్నా: వేతనాల పెంపు, హామీల అమలుకు డిమాండ్
Mahabubabad, Telangana:ఖమ్మం కలెక్టరేట్ ముందు అంగన్వాడీలు ధర్నా నిర్వహించారు. కనీస వేతనాల పెంపు, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల హామీల అమలు కోరుతూ నిరసన తెలిపారు. తక్కువ వేతనాలతో పడుతున్న ఇబ్బందులపై ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సమస్యలు పరిష్కరించనట్లయితే దశలవారీగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. తమ డిమాండ్లు నెరవేరే వరకు పోరాటం కొనసాగిస్తామని అంగన్వాడీలు స్పష్టం చేశారు.
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
RCB Vs KKR Preview: బెంగళూరు Vs కోల్కతా..ఐపీఎల్ ప్లేఆఫ్స్ బెర్త్ కోసం హోరాహోరీ పోరు..
Hyderabad, Telangana:RCB Vs KKR Preview 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ తుది దశకు చేరుకుంది. ఇప్పటికే రెండు జట్లు ప్లేఆఫ్స్ రేసు నుంచి పూర్తిగా తప్పుకున్నాయి. నేడు జరగనున్న మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్కతా నైట్ రైడర్స్ జట్లు ప్లేఆఫ్స్లో వారి స్థానాన్ని పదిలం చేసుకునేందుకు ప్లాన్ చేస్తున్నాయి. ప్లేఆఫ్స్కు చేరాలంటే ఈ మ్యాచ్ ఇరుజట్లకు ఎంతో కీలకంగా మారనుంది. ఓ వైపు పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని నిలుపుకొని ప్లేఆఫ్స్కు చేరాలని ఆర్సీబీ చూస్తుంటే..ఎలాగైనా ఈ మ్యాచ్లో నెగ్గి విజయం సాధించాలనే పట్టుదలతో కేకేఆర్ ఉంది.
ముంబై ఇండియన్స్తో జరిగిన గత మ్యాచ్లో 167 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించడానికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఎంతో కష్టపడింది. లీగ్ ఆరంభంలో ఉన్న బ్యాటింగ్ లైనప్ ఇప్పుడూ కొనసాగుతున్నా.. అందరూ వైఫల్యం చెందడం ఆర్సీబీ టీమ్ను కలవరపరుస్తుంది. విరాట్ కోహ్లీ గత రెండు మ్యాచ్ల్లో డకౌట్గా నిలవగా.. కెప్టెన్ పాటిదార్ గత ఆరు ఇన్నింగ్స్లలో కేవలం ఒక అర్ధశతకం మాత్రమే చేసి ఫామ్ కోల్పోయినట్లు కనిపిస్తున్నారు. దేవదత్ పడిక్కల్, టిమ్ డేవిడ్ ఆదుకుంటున్నప్పటికీ, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్ వంటి లోయర్ ఆర్డర్ ఆటగాళ్లపై అతిగా ఆధారపడాల్సి వస్తోంది.
మరోవైపు కోల్కతా నైట్ రైడర్స్ వరుసగా నాలుగు విజయాలతో జోరు మీద ఉంది. ముఖ్యంగా వారి బౌలింగ్ విభాగం ప్రత్యర్థులను కట్టడి చేస్తోంది. సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తిల స్పిన్ ద్వయం ఆర్సీబీ బ్యాటర్లకు పెద్ద సవాలుగా మారనున్నారు. అలాగే పేస్ దళం వైభవ్ అరోరా, కార్తీక్ త్యాగి, మతీషా పతిరానా వంటి యువ బౌలర్లు నిలకడగా రాణిస్తున్నారు.
కేకేఆర్ బ్యాటింగ్ విభాగంలో అజింక్య రహానే తడబడుతున్నా, రింకు సింగ్, ఫిన్ అలెన్, అంగ్క్రిష్ రఘువంశీ అద్భుత ఫామ్లో ఉన్నారు. ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ కామెరాన్ గ్రీన్ పుంజుకోవడం జట్టుకు పెద్ద ప్లస్ పాయింట్. మరోవైపు ఆర్సీబీ బౌలర్లు జోష్ హేజిల్వుడ్, భువనేశ్వర్ కుమార్లు ప్రారంభ ఓవర్లలో కేకేఆర్ టాప్ ఆర్డర్ను దెబ్బతీయాలని భావిస్తున్నారు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ఆడిన 11 మ్యాచ్ల్లో 7 గెలిచి 14 పాయింట్లతో టేబుల్లో రెండో స్థానంలో నిలిచింది. అలాగే కోల్కతా నైట్రైడర్స్ జట్టు ఆడిన 10 మ్యాచ్ల్లో 4 గెలిచి, 1 డ్రాతో 9 పాయింట్లతో టేబుల్లో 8వ స్థానంలో కొనసాగుతోంది. ఐపీఎల్ ప్లేఆఫ్స్కు చేరాలంటే కోల్కతా నైట్రైడర్స్ జట్టుకు ఇది డూ-ఆర్-డై మ్యాచ్.. ఒకవేళ ఓడితే టోర్నీ నుంచి తప్పుకునే అవకాశం ఉంది. మరోవైపు ఈ మ్యాచ్ గెలిస్తే ఆర్సీబీ జట్టు ప్లేఆఫ్స్కు చేరే అవకాశం ఉంది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తుదిజట్టు అంచనా..
విరాట్ కోహ్లీ, జకోబ్ బెథెల్, దేవ్దత్ పడిక్కల్, రజత్ పటిదార్ (కెప్టెన్), జితేష్ శర్మ (వికెట్ కీపర్), కృనాల్ పాండ్యా, టిమ్ డేవిడ్, రొమారియో షెఫార్డ్, భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్ వుడ్, సుయాష్ శర్మ. (ఇంపాక్ట్ ప్లేయర్: రసిఖ్ సలామ్, వెంకటేష్ అయ్యర్)
కోల్కతా నైట్రైడర్స్ తుదిజట్టు అంచనా..
అజింక్య రహానే (కెప్టెన్), రింకూ సింగ్, రఘువంశీ, కెమెరూన్ గ్రీన్, సునీల్ నరైన్, అనుకూల్ రాయ్, వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరా, కార్తిక్ త్యాగి, మనీష్ పాండే, రోవ్మన్ పావెల్. (ఇంపాక్ట్ ప్లేయర్: ఫిన్ అలెన్).
Also Read: భగ్గుమన్న బంగారం ధరలు..ఒకే రోజులో రూ.13,910 పెరిగిన గోల్డ్ రేట్..ఆకాశానికి వెండి ధర!
Also Read: 'తల్లికి వందనం' డబ్బు విడుదలకు ముహూర్తం ఫిక్స్..డబ్బులు అకౌంట్లో పడేది ఆరోజే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Gold Import Duty: బంగారం, వెండి ప్రియులకు కేంద్రం మరో ఝలక్..భారీగా పెరగనున్న ధరలు!
Hyderabad, Telangana:Gold Import Duty Hike India: దేశంలో పసిడి, వెండి ధరలు సామాన్యుల నడ్డి విరుస్తున్నాయి. పసిడి దిగుమతులను కట్టడి చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. బంగారం, వెండి, ప్లాటినం లోహాలపై దిగుమతి సుంకాన్ని భారీగా పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఇప్పటివరకు ఈ లోహాలపై 5 శాతం విలువైన దిగుమతి సుంకాన్ని కేంద్రం ఏకంగా 10 శాతం పెంచింది. అంటే కస్టమ్స్ డ్యూటీని ఏకకాలంలో రెట్టింపు చేసింది. ఈ కొత్త నిబంధనలు నేటి అర్ధరాత్రి నుంచే అమల్లోకి వచ్చాయి. దీనివల్ల అంతర్జాతీయ మార్కెట్లో ధరలు స్థిరంగా ఉన్నా.. మన దేశంలో తులం బంగారంపై వేలల్లో భారం పడనుంది.
నిర్ణయానికి కారణాలు ఏంటి?
కేంద్రం ఈ కఠిన నిర్ణయం తీసుకోవడం వెనుక ప్రధానంగా 'రికార్డు స్థాయి దిగుమతులు' ఉన్నాయి. 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారత్ రికార్డు స్థాయిలో బంగారం దిగుమతులను నమోదు చేసింది. ఏకంగా 71.98 బిలియన్ విలువైన పసిడిని విదేశాల నుండి కొనుగోలు చేయడం ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతోంది.
బంగారంపై మోజు తగ్గించుకోవాలని, అనవసరంగా పసిడిని కొనుగోలు చేసి నిల్వ చేయకూడదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటీవల ప్రజలకు వివరించారు. అయినప్పటికీ డిమాండ్ తగ్గిన ప్రభుత్వం సుంకాల పెంపును అస్త్రంగా ఏంచుకుంది.
సామాన్యులపై ప్రభావం
ప్రపంచంలో చైనా తర్వాత అత్యధికంగా బంగారాన్ని వినియోగించే దేశం భారత్. మన దేశంలో పెళ్లిళ్లు, పండుగలకు బంగారం కొనడం ఒక సెంటిమెంట్గా మారింది. ప్రస్తుత పెంపుతో అటు వెండి, ఇటు బంగారం ధరలు ఆకాశాన్ని తాకనున్నాయి. ఇది సామాన్య, మధ్యతరగతి ప్రజల పొదుపుపై , వివాహ ఖర్చులపై తీవ్ర ప్రభావం చూపుతుంది.
ముఖ్యంగా వెండిపై కూడా సుంకం పెరగడంతో పారిశ్రామిక రంగానికి కూడా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. మొత్తం మీద కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం అటు నగల వ్యాపారులకు, ఇటు వినియోగదారులకు పెద్ద గండంగా మారింది.
Also Read: ప్రభుత్వ ఉద్యోగుల ఎగిరి గంతేసే వార్త..డీఏతో పాటు HRA పెంపునకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
Also REad: మహేష్ బాబు మేనకోడలిని చూశారా? హీరోయిన్లనే మించిన అందం..క్యూట్లో క్వీన్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Nagamani Video: వామ్మో.. నాగుపాము తల కట్ చేసిన నాగమణి తీసిన యువకుడు.. వీడియో..
Hyderabad, Telangana:Nagamani Video Watch: గ్రామీణ ప్రాంతాల్లో చాలా మంది ఇప్పటికీ పాము కాటుకు గురైనవారు నాటు వైద్యంపై ఆధాపడుతూ వస్తున్నారు. ముఖ్యంగా నాగమణి అని పిలిచే ఒక రకమైన అరుదైన రాయిని కాటు వేసిన చోట ఉంచితితే.. అది విషాన్ని పీల్చుకుంటుందని ఒక బలమైన నమ్మకం ఇప్పటికీ చాలా మంది గ్రామీణ ప్రాంతాల్లో జీవించే ప్రజల్లో ఉంది.. అయితే, తాజాగా దీనికి సంబంధించిన వీడియోనే సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ వస్తోంది. ఈ వీడియో చూసిన చాలా మంది సోషల్ మీడియా వివియోగదారులు ఆశ్చర్యపోతున్నారు.
పాము తల వెనుక భాగంలో ఒక రకమైన గట్టి పదార్థం తయారవుతుంది.. పాము చనిపోయిన తర్వాత లేదా దాని తలను చీల్చి ఆ రాయిని బయటికి తీస్తారు. అయితే, తాజాగా వైరల్ అవుతున్న ఈ ఘటన కూడా దీనికి సంబంధించిందే.. అయితే, తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో ఒక వ్యక్తి అత్యంత ప్రమాదకరమైన కోబ్రాను సంచిలో నుంచి తీసి.. అందరూ చూస్తుండగా.. ఒక ఛాక్తో ఆ కింగ్ కోబ్రా పాము తల భాగాన్ని కట్ చేయడం మీరు చూడొచ్చు..
అంతేకాకుండా ఆ పాము తల భాగాన్ని ఒక చేతితో నెమ్మదిగా పట్టుకుని.. మరో చేతితో కత్తి పట్టుకుని కట్ చేయడం మీరు చూడొచ్చు. అలాగే, అతను వెంటనే అందులో నుంచి రెండు రాళ్లను తీసి అక్కడే పరిచి పేపర్లో ఉంచారు. అయితే, దానిని అక్కడే ఉన్న కొంతమంది కొనుగోలు చేశారు. అలాగే అతను ఆ పాము తల భాగం నుంచి తీసిన మణి గురించి వివరించడం కూడా మీరు ఈ వీడియోలో చూడొచ్చు. దీనికి సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ వస్తున్నాయి.
ఈ రాయి విషాన్ని ఎలా లాగేస్తుందో వివరిస్తూ.. పాము కాటు వేసిన చోట చిన్నగా కోసి.. అక్కడ ఈ రాయిని ఉంచితే అది రక్తాన్ని, విషాన్ని పీల్చుకుని అతుక్కుపోతుందని.. విషం పూర్తిగా పోయాక అదే కింద పడిపోతుందని సదరు వ్యక్తి వివరించడం ఆశ్చర్యం కలిగిస్తోంది.. ఆ తర్వాత ఆ రాయిని పాలలో లేదా నీళ్లలో వేస్తే విషం విరిగిపోయి.. రాయి మళ్లీ శుద్ధి అవుతుందని అతను అక్కడున్నవారికి తెలిపారు. తాజా ఈ వీడియో ఊహించని స్థాయిలో వైరల్ అవుతూ వస్తోంది.
Also Read: Video Viral: సాయం ముసుగులో అరాచకం.. యువతి ప్రైవేటు పార్ట్ మీద చెయ్యి వేసి మరీ.!. వీడియోపై దుమారం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
- https://apple.co/3loQYe ఆపిల్ లింక్..
Thalliki Vandanam Scheme: 'తల్లికి వందనం' డబ్బు విడుదలకు ముహూర్తం ఫిక్స్..డబ్బులు అకౌంట్లో పడేది ఆరోజే!
Vijayawada, Andhra Pradesh:Thalliki Vandanam Amount 2026: ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 'తల్లికి వందనం' పథకానికి సంబంధించి కీలక అప్డేట్ వచ్చేసింది. గత ప్రభుత్వంలోని 'అమ్మఒడి' పథకంలో మార్పు చేస్తూ ఈ పథకం కింద, రెండో ఏడాది నిధులను విడుదల చేయడానికి ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది.
ప్రస్తుత అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ ఏడాది జూన్ 12న అర్హులైన తల్లుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు.. అర్హత ప్రమాణాలను ఇప్పుడు తెలుసుకుందాం.
రాష్ట్రవ్యాప్తంగా సుమారు 78 లక్షల మంది విద్యార్థుల వివరాలను విద్యాశాఖ సేకరించింది. ఈ వివరాలను సచివాలయాల ద్వారా క్షేత్రస్థాయిలో అధికారులు తనిఖీ చేస్తున్నారు. ఈ వెరిఫికేషన్ ప్రక్రియ మరో రెండు నుండి మూడు వారాల్లో పూర్తికానుంది. ఆ తర్వాతే తుది అర్హుల జాబితాను ప్రభుత్వం విడుదల చేస్తుంది. ఈ ఏడాది కూడా ప్రతి లబ్ధిదారురాలి ఖాతాలో రూ.13,000 జమ చేయనున్నారని సమాచారం.
కావాల్సిన అర్హతలు
పథకం ప్రయోజనం పొందాలంటే ఈ కింది నిబంధనలు పాటించడం తప్పనిసరిగా అధికారులు సూచిస్తున్నారు. తెల్ల రేషన్ కార్డు (వైట్ రేషన్ కార్డ్) తప్పనిసరిగా ఉండాలి. వ్యవసాయ భూమిమాగాణి అయితే 3 ఎకరాల లోపు, మెట్ట అయితే 10 ఎకరాల లోపు ఉండాలి. ఇంటి విద్యుత్ వినియోగంలో 300 యూనిట్ల కంటే తక్కువ కరెంటు వాడకం ఉండాలి. నివాస స్థలం పట్టణ ప్రాంతాలలో 1000 చదరపు అడుగుల లోపు విస్తీర్ణం ఉండాలి. అలాగే ఇంట్లో ప్రభుత్వ ఉద్యోగి ఉండకూడదు, ఆదాయ పన్ను (IT) చెల్లించే వారు కాకూడదు. ఈ అర్హతలు ఉన్నవారికి మాత్రమే 'తల్లికి వందనం' పొందేందుకు అర్హులుగా పరిగణిస్తారు.
గమనిక: 'తల్లికి వందనం' లబ్ధిదారులు తమ ఆధార్ కార్డుకు బ్యాంక్ ఖాతా లింక్ (e-KYC) అయి ఉందో లేదో ముందే సరిచూసుకోవడం ఉత్తమం. దీనివల్ల నగదు జమ సమయంలో ఎటువంటి సాంకేతిక ఇబ్బందులు తలెత్తాయి.
Also Read; ఒకే ఇంట్లో ఇద్దరికి రైతు భరోసా ఇస్తారా? ఏడాది రూ.12,000 పొందాలంటే ఏం చేయాలి?
Also Read: విడాకుల తర్వాత ఒకే వేదికపై సమంత, నాగచైతన్య..మాజీ భార్యభర్తల వీడియో వైరల్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Worlds Longest Cobra Video: ప్రపంచంలోనే అత్యంత పొడవైన కింగ్ కోబ్రా.. వామ్మో ఎలా ఉందో చూడండి.. వీడియో!
Hyderabad, Telangana:Worlds Longest King Cobra Video Watch Now: ప్రకృతిలో కొన్ని దృశ్యాలు చూస్తే ఒళ్లు గగుర్పొడవక మానదు..ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియా వినియోగదారులను వణికిస్తోంది. చాలా మంది దీనిని చూసి ఆశ్చర్యానికి గురవుతున్నారు. తాజాగా, ప్రపంచంలోనే అత్యంత పొడవైన, అత్యంత ప్రమాదకరమైన జాతికి చెందిన ఒక భారీ కింగ్ కోబ్రా వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అంతేకాకుండా దీనిని చూసిన సోషల్ మీడియా వినియోగదారులు వణికిపోతున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోలో.. ఒక ఎత్తైన గట్టుపై ఈ భారీ సర్పం కనిపిస్తోంది. సాధారణ పాముల కంటే చాలా భిన్నంగా కనిపించడం మీరు చూడొచ్చు. ఇది తన శరీరంలోని మూడో వంతు భాగాన్ని పైకి లేపి, పడగ విప్పి అటువైపు ఉన్న పరిసరాలను అత్యంత క్షుణ్ణంగా గమనించడం మీరు చూడొచ్చు. అంతేకాకుండా దాని శరీర పరిమాణం, పొడవు చూస్తుంటే అది కనీసం 25 నుంచి 35 అడుగుల వరకు పొడవు ఉన్నట్లు తెలుస్తోంది.
సాధారణంగా అన్ని కింగ్ కోబ్రాలు తన పడగను భూమి నుంచి దాదాపు 4 నుంచి 5 అడుగుల వరకు ఎత్తు వరకు లేపగలవు.. కానీ ఈ వీడియోలో మాత్రం.. అది ఒక మనిషి కంటే ఎక్కువ ఎత్తుకు సమానంగా పడగ విప్పి ఉండడం చూసి జనం భయాందోళకు గురవుతున్నారు. అంతేకాకుండా ఈ ఘటనను చిత్రీకరించిన విధానం కూడా చాలా అసక్తిగా ఉండడం మీరు గమనించవచ్చు. పాము ప్రమాదకరమైనది కావడంతో, కెమెరామెన్ చాలా దూరం నుంచి జూమ్ లెన్స్ వినియోగించి దీనిని షూట్ చేసినట్లు తెలుస్తోంది.. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ వస్తోంది.
ఈ వీడియో పోస్ట్ చేసిన కొద్ది గంటల్లోనే లక్షలాది వ్యూస్ను సొంతం చేసుకుంది. అంతేకాకుండా వేలల్లో షేర్ల కూడా అయిన్నట్లు తెలుస్తోంది.. అయితే, ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.. అది పాము కాదు.. సాక్షాత్తు ఆ యముడి పాశంలా కనిపిస్తుందని.. అని ఒకరు కామెంట్ చేయగా.. మరొకరు ప్రకృతిలో ఇంతటి భారీ జీవులను చూడడం.. ఇదే మొదటిసారి, అలాగే వాటికి దూరంగా ఉండటమే మంచిదని కామెంట్ చేస్తూ వస్తున్నారు. మరికొంతమంది ఈ వీడియోను ఏ ప్రాంతంలో తీశారని ఆరా కూడా తీస్తున్నారు.
Also Read: Video Viral: సాయం ముసుగులో అరాచకం.. యువతి ప్రైవేటు పార్ట్ మీద చెయ్యి వేసి మరీ.!. వీడియోపై దుమారం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
- https://apple.co/3loQYe ఆపిల్ లింక్
Venus Transit 2026: పుష్య నక్షత్రంలోకి శుక్రుడు.. ఈ 4 రాశుల వారికి అదృష్టం మామూలుగా ఉండదు!
Hyderabad, Telangana:Venus Transit In Pushya Nakshatra Effect On Zodiac: జ్యోతిష్య శాస్త్రంలో అత్యంత శుభగ్రహాల్లో శుక్ర గ్రహం ఒకటి.. ఈ గ్రహం ప్రభావంతో కొన్ని రాశులవారు రాత్రికి రాత్రే ధనవంతువులవుతారు. అంతేకాకుండా ఆర్థికండా కూడా బోలెడు ప్రయోజనాలు కలుగుతాయి. ఇదిలా ఉంటే శనిచే పాలించే పుష్య నక్షత్రంలో శుక్రుడు ప్రవేశించడం వల్ల కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. జూన్ 11న మధ్యాహ్నం 2:11 గంటలకు, శుక్రుడు శని పాలించే పుష్య నక్షత్రంలోకి సంచారం చేయబోతోంది. శుక్రుడు జూన్ 23 వరకు అదే రాశిలో కొనసాగుతాడు. కాబట్టి ఈ సమయంలో నాలుగు రాశులవారిపై ఊహించని ప్రభావం పడుతుంది. ఆయా రాశులవారికి సంపదతో పాటు ప్రేమ పరంగా అద్భుతమైన లాభాలు కలుగుతాయి. దీంతో పాటు అన్ని రంగాల్లో అద్భుతమైన విజయాలు సాధిస్తారు. కాబట్టి శుక్రుడి ప్రభావంతో ఏయే రాశులవారికి చాలా బాగుంటుందో ఇప్పుడు తెలుసుకుందాం..
మకర రాశి
శని నక్షత్రంలోకి శుక్రుడు వెళ్లడం వల్ల మకర రాశివారికి ఈ సమయం చాలా అద్బుతంగా ఉంటుంది. అంతేకాకుండా ప్రేమ జీవితంలో అపార్థాలు కూడా తొలగిపోయే ఛాన్స్లు ఉన్నాయి. వీరికి తప్పకుండా మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం కలుగుతుంది. ఆర్థిక పరిస్థితులు గతంలో కంటే ఇప్పుడు చాలా బాగుంటాయి. అంతేకాకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లడం వల్ల ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ఛాన్స్లు ఉన్నాయి. వృత్తిపరంగా కూడా మంచి నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే ఉద్యోగాలు చేసేవారికి మంచి పదోన్నతులు కూడా కలుగుతాయి.
వృషభ రాశి
శుక్రుని ప్రభావంతో వృషభ రాశివారికి అనేక మార్పులు వస్తాయి. అంతేకాకుండా ఈ సమయం ఎంతో శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అలాగే జీవితంలో సానుకూల శక్తితో ముందుకు వెళ్తూ ఉంటారు. అంతేకాకుండా ప్రేమ జీవితంలో ఆపారమైన విజయాలు సాధించే ఛాన్స్లు ఉన్నాయి. వృత్తిలో కూడా వేగవంతమైన పురోగతి లభిస్తుంది. కొత్త కొత్త అవకాశాలతో ముందుకు వెళ్లే ఛాన్స్లు ఉన్నాయి. దీర్ఘకాలిక సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి.
మిథున రాశి
మిథున రాశివారికి శుక్రుడు పుష్య నక్షత్రంలోకి వెళ్లడం వల్ల అనేక శుభ ఫలితాలు కలుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ప్రేమ సంబంధాలు కూడా చాలా వరకు బలంగా మారే ఛాన్స్లు ఉన్నాయి. అవగాహనతో కొన్ని రకాల సమస్యలు కూడా పరిష్కామవుతాయి. ఉద్యోగాలు చేసేవారికి కొత్త కొత్త బాధ్యతలు కూడా లభిస్తాయి. అంతేకాకుండా చాలా కాలంగా నిలిపోయిన డబ్బులు కూడా భారీగా తిరిగి వచ్చే ఛాన్స్లు ఉన్నాయి. అలాగే ఆదాయ వనరులు కూడా మెరుగుపడతాయి. మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది.
తులారాశి
శని నక్షత్రంలో శుక్రుడు ప్రవేశించడంతో తులా రాశివారికి ఈ సమయంలో అనేక సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. ఉద్యోగాలు చేస్తున్నవారికి ఉన్నత అధికారుల సపోర్ట్ కూడా అందుతుంది. దీంతో పాటు వ్యాపారాలు కూడా సక్రమంగా ముందుకు సాగే ఛాన్స్లు కూడా కనిపిస్తున్నారు. అంతేకాకుండా ఆర్థికపరమైన విషయాల్లో కూడా వీరు తప్పకుండా విజయాలు సాధిస్తారు. అంతేకాకుండా కుటుంబంలో విశేషమైన సంతోషం కూడా కలుగుతాయి.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Prateek Yadav Dies: ములాయం కుటుంబంలో తీవ్ర విషాదం.. అపర్ణా యాదవ్ భర్త 38 ఏళ్లకే కన్నుమూత..!
Hyderabad, Telangana:Mulayam Singh Yadavs younger son Prateek Yadav Passes Away: ములాయం సింగ్ యాదవ్ చిన్న కుమారుడు ప్రతీక్ యాదవ్ మరణ వార్త ఉత్తరప్రదేశ్ బీజేపీ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. ఆయన యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ సోదరుడు కూడా. ఆయన హఠాన్మరణం చెందారు. అయితే ములాయం సింగ్ యాదవ్ రెండో భార్య సాధన గుప్తా కుమారుడు. ఈరోజు ఉదయం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు సమాచారం. ఇటీవలే భార్య అపర్ణ యాదవతో కూడా మనస్పర్థలు వచ్చాయని విడాకులు కూడా తీసుకోబోతున్నట్లు ఇంస్టాగ్రామ్ లో కూడా పోస్ట్ ఒకటి సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఇంతలోనే ప్రతీక్ యాదవ్ (38) హఠాత్తుగా మరణించాలనే వార్త బయటకు వచ్చింది. ఈరోజు ఉదయం లక్నోలోని సివిల్ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. రాత్రి ఆయన ఆరోగ్యం క్షీణించడంతో వెంటనే ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తీసుకోవచ్చారు. మరణానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
నేషనల్ వార్త పత్రిక నివేదిక ప్రకారం ప్రతీక్ యాదవ్ ఈరోజు ఉదయం సివిల్ హాస్పిటల్ లో 5:30 గంటల సమయంలో తుది శ్వాస విడిచారు. ఆయన ఆరోగ్యం క్షీణించిన అంటూ వెంటనే కాల్ రావడంతో డాక్టర్ ఇతర సిబ్బంది వెంటనే ఆయన వద్దకు చేరుకున్నట్లు గుప్తా సివిల్ హాస్పిటల్ డైరెక్ట్ తెలిపారు. తాము వచ్చే వరకు ఆయన పరిస్థితి విషమించిందని చెప్పారు. తాము శ్రమించినా ఆరోగ్యం విషమించడంతో ఆయన ఉదయం 5:55 గంటలకు మృతి చెందినట్లు డాక్టర్ గుప్తా వెల్లడించారు. అయితే పోస్టుమార్టం తర్వాతే ఆయన మృతికి కారణం ఏంటో తెలుస్తుంది అని వెల్లడించారు.
ప్రతీక్ యాదవ్ ఎవరు?
ప్రతీక్ యాదవ్ దివంగత ములాయం సింగ్ యాదవ్ రెండో భార్య సాధన గుప్తా కుమారుడు. పొలిటికల్ గా అంత యాక్టివ్గా ఉండకున్నా సామాజిక వేత్త కూడా. ఉత్తరప్రదేశ్లోని మంచి పేరున వ్యక్తి యూకేలోని యూనివర్సిటీ ఆఫ్ లీడ్స్ లో ఆయన విద్యాభ్యాసం పూర్తి చేశారు. ప్రస్తుతం ఫిట్నెస్ రియల్ ఎస్టేట్ సంబంధించిన వ్యాపారాల్లో ఆయన ఉన్నారు. సొంతంగా లక్నోలో జిమ్ కూడా ఉంది దాని పేరు 'ఫిట్నెస్ ప్లానెట్'. అంతేకాదు ప్రతీక్ యాదవ్ జంతు సంక్షేమంలో యాక్టివ్ గా ఉంటాడు. జీవ్ ఆశ్రయ్ అనే సంస్థను కూడా నడిపారు. దీని వల్ల దీని ద్వారా వీధి కుక్కల రక్షణ, చికిత్స, ఆహారం సంరక్షణ కోసం కూడా ఆయన పని చేశారు.
Also Read: మళ్లీ మొదటికే.. నీట్ పేపర్ లీక్, పరీక్షను రద్దు చేస్తూ..
Also Read: నీట్ అభ్యర్థులకు ముఖ్య గమనిక.. పరీక్షకు వెళ్లేముందు ఈ చెక్లిస్ట్ ఒకసారి చూసుకోండి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
TTD Colleges: ఉచిత విద్య, భోజనం, హాస్టల్.. టీటీడీ స్కూళ్లు, కాలేజ్ల్లో అడ్మిషన్ల తేదీలు ఇవే!
Tirupati Urban, Andhra Pradesh:TTD College Admissions And Dates: విద్య అనేది ఖరీదు అవడంతో పేదలు తమ పిల్లలకు చదువు చెప్పించుకోలేకపోతున్నారు. మరికొందరు అప్పులు చేసి మరి తమ పిల్లలకు చదువు చెప్పిస్తున్నారు. ఈ సమయంలో ఉచితంగా భోజనం, వసతి అందిస్తూ.. ఉచితంగా విద్య అందిస్తున్న పాఠశాలలు, కళాశాలలు ఉన్నాయి. అవెక్కడో కాదు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యా సంస్థలు. టీటీడీ అనేది తిరుమల ఆలయానికే పరిమితం కాకుండా అనేక ధార్మిక, దాతృత్వ కార్యక్రమాలు చేస్తోంది. వాటిలోనే విద్యను కూడా పేదలకు అందిస్తోంది. ఒకటో తరగతి నుంచి డిగ్రీ వరకు.. అంతే కాకుండా శిల్పకళ, వేద విద్య వంటివి కూడా ఉచితంగా టీటీడీ నేర్పిస్తోంది.
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలో చాలా పాఠశాలలు, కళాశాలలు ఉన్నాయి. పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతి వరకు విద్య అందిస్తుండగా.. అనంతరం ఇంటర్మీడియట్, డిగ్రీ విద్యను కూడా టీటీడీ అందిస్తోంది. ఇక వేద విద్య, శిల్పకళ, లోహ కళ, చిత్రలేఖనం వంటి విద్య కూడా విద్యార్థులకు అందుబాటులో ఉంచింది. ఆయా కోర్సులకు సంబంధించిన అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. మరి పాఠశాలలు, కళాశాలల్లో చేరేందుకు అర్హులు ఎవరు? అడ్మిషన్లకు చివరి తేదీ? ఎలా దరఖాస్తు చేసుకోవాలో వంటి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
టీటీడీ కాలేజ్లు, కోర్సులు
ఎస్వీ బాలమందిరం
తరగతులు: 1 నుంచి 10వ తరగతి, ఇంటర్
అర్హులు: 5 నుంచి 10 ఏళ్ల అనాథ పిల్లలు
చివరి తేదీ: 16 మే 2026
సదుపాయాలు: ఉచిత వసతి, భోజనం, డ్రస్, పదో తరగతిలో 75 శాతం ఉత్తీర్ణత సాధిస్తే కార్పొరేట్ కాలేజ్
జూనియర్ కాలేజీలు
కళాశాలలు: ఎస్వీ జూనియర్ కాలేజ్ (తిరుమల), ఎస్పీడబ్ల్యూ జూనియర్ కాలేజ్ (తిరుమల)
కోర్సులు: ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్ఈసీ,
అర్హులు: పదో తరగతి పాసయి ఉండాలి.
చివరి తేదీ: 31 మే 2026
దరఖాస్తులు: వెబ్సైట్: http://admissions.tirumala.org
టీటీడీ డిగ్రీ కళాశాలలు
కోర్సులు: బీఏ, బీకామ్, బీఎస్సీ, బీబీఏ, హోం సైన్స్,
అర్హులు: ఇంటర్ ఉత్తీర్ణత పొందిన విద్యార్థులు
ఏపీ ఎప్సెట్/ డిగ్రీ అడ్మిషన్ నోటిఫికేషన్ ప్రకారం ఎస్వీ ఆర్ట్స్, ఎస్జీఎస్ ఆర్ట్స్, ఎస్పీడబ్ల్యూ డిగ్రీ కాలేజ్.
శ్రీ వేంకటేశ్వర శిల్ప కళాశాల
కోర్సులు: 4 ఏళ్ల డిప్లొమా. ఆలయ నిర్మాణం, శిల/ లోహ/ కొయ్య/ సుధా శిల్పం, చిత్రలేఖనంపై కోర్సులు ఉంటాయి.
రెండేళ్ల వ్యవధితో కలంకారి సర్టిఫికకెట్.
పదో తరగతి పాసయిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆఖరు తేదీ: జూన్ 20, 2026
కోర్సులో చేరితో సదుపాయాలు: ఉచిత వసతి, భోజనం. కోర్సు అయ్యాక టీటీడీ రూ.లక్ష ఫిక్స్డ్ డిపాజిట్తోపాటు వడ్డీ ఇస్తుంది. దక్షిణ భారత ఆలయాల టూర్ కూడా అదనంగా అందిస్తుంది.
వేద పాఠశాలలు
12 ఏళ్ల ఋగ్వేద, యజుర్వేద, సామవేద
ఏడేళ్ల కృష్ణ యజుర్వేద, అథర్వ వేద
అర్హులు: 12-14 ఏళ్ల బాలురు ఉపనయనం పొంది ఉండాలి.
చివరి తేదీ: మే 30, 2026
క్యాంపస్లు: తిరుమల, విజయనగరం, భీమవరం, కోటప్పకొండ, నల్లగొండ, కీసరగుట్ట (హైదరాబాద్)
ఎస్వీ బధిరుల పాఠశాల, జూనియర్ కాలేజ్
తరగతులు: 1వ తరగతి నుంచి ఇంటర్ వరకు
ఇంటర్ కోర్సులు: హెచ్ఈసీ, సీఈసీ
అర్హులు: చెవిటి/మూగ విద్యార్థులు
చివరి తేదీ: 1 జూన్ 2026
సదుపాయాలు: ఉచిత విద్య, వసతిగృహం, సంకేత భాషలో బోధన.
క్యాంపస్లు: తిరుపతి, భీమవరం, వరంగల్ క్యాంపస్ (తెలంగాణ)
ముఖ్యమైన లింకులు, ఫోన్ నంబర్లు
అన్ని అడ్మిషన్లు: http://www.tirumala.org
జూనియర్ కాలేజీలు: http://admissions.tirumala.org
శిల్ప కళాశాల: 0877-2264637
సాంకేతిక సమస్యలు: 8686939314, 9505123979
GT vs SRH Highlights: సన్రైజర్స్ ఘోర పరాభవం.. భారీ విజయంతో ప్లేఆఫ్స్కు గుజరాత్
Ahmedabad, Gujarat:Gujarat Titans Won By 82 Runs: బౌలింగ్లో తడబడి.. బ్యాటింగ్లో ఘోర విఫలమైన సన్రైజర్స్ హైదరాబాద్ ఘోర పరాభవాన్ని ఎదుర్కొంది. ఆల్ రౌండ్ ప్రదర్శన కనబర్చి గుజరాత్ టైటాన్స్ భారీ విజయం సాధించి ప్లేఆఫ్స్ బెర్త్ను దాదాపుగా ఖాయం చేసుకుంది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ను చిత్తు చేసి పాయింట్ల పట్టికలో గుజరాత్ ప్రథమ స్థానానికి దూసుకెళ్లింది. ఈ మ్యాచ్కు సంబంధించి విశేషాలు ఇలా ఉన్నాయి.
Also Read: GT vs SRH Live Updates: గుజరాత్ బౌలర్ల ప్రతాపం.. ఓటమి దిశగా సన్రైజర్స్
టాస్ గెలిచిన సన్రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ ఎంచుకోగా.. గుజరాత్ టైటాన్స్ తొలుత బ్యాటింగ్కు దిగింది. నిర్ణీత 20 ఓవర్లకు ఐదు వికెట్లు కోల్పోయి 168 పరుగులు చేసింది. సాయి సుదర్శన్, వాషింగ్టన్ సుందర్ అర్ధ సెంచరీలతో అదరగొట్టగా.. ప్రఫుల్ హింగే, షకీబ్ హుస్సేన్ తలా రెండు వికెట్లు తీశారు. సన్రైజర్స్ హైదరాబాద్ 14.5 ఓవర్లకు 86 పరుగులు చేసి కుప్పకూలింది. ఏ ఒక్క బ్యాటర్ కూడా 20 పరుగులు కూడా నమోదు చేయలేకపోయారు. గుజరాత్ టైటాన్స్ బౌలర్లు నిప్పులు చెలరేగేలా బంతులు వేసి హైదరాబాద్ నడ్డి విరిచారు. కగిసో రబడా, జేసన్ హోల్డర్ మూడేసి వికెట్లతో విజృంభించారు.
Also Read: DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు జాక్పాట్.. డీఏ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు
సొంతగడ్డపై గుజరాత్ తరఫున సాయి సుదర్శన్ 44 బంతుల్లో 61 పరుగులు చేసి అదరగొట్టాడు. ఐదు బౌండరీలు, రెండు సిక్సర్లతో రాణించగా.. వాషింగ్టన్ సుందర్ 33 బంతుల్లో 50 పరుగులు చేశాడు. నిలకడగా ఆడుతూనే 7 ఫోర్లు, ఒక సిక్సర్ నమోదు చేశాడు. కెప్టెన్ శుభమన్ గిల్ (5), జోస్ బట్లర్ (7), జేసన్ హోల్డర్ (11*), రాహుల్ తెవాటియా (4) తక్కువ పరుగులు చేశారు. యువ బ్యాటర్ నితీశ్ సింధూ 22 పరుగులతో పర్వాలేదనిపించాడు. సన్రైజర్స్ బౌలింగ్ను ఇంకాస్త పదును పెట్టాల్సి ఉంది. ప్రఫుల్ హింగే రెండు వికెట్లతో రాణించగా.. షకీబ్ హుస్సేన్ రెండు వికెట్లు పడగొట్టాడు. కెప్టెన్ పాట్ కమిన్స్ అద్భుతంగా బంతులు వేసి అతి తక్కువ పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు.
Also Read: Bandi Bageerath POCSO: బండి భగీరథను దేశం దాటించొద్దు.. లుకౌట్ నోటీస్ ఇవ్వాలి: మాజీ ఐపీఎస్
చూడడానికి తక్కువ స్కోర్ అయినా కూడా సన్రైజర్స్ హైదరాబాద్ ఛేదించలేక చతికిలపడిపోయింది. 14.5 ఓవర్లకు 86 పరుగులు చేసి కుప్పకూలి ఈ సీజన్లోనే భారీ ఓటమిని చవిచూసింది. ట్రావిస్ హెడ్ డకౌట్ కాగా.. అభిషేక్ శర్మ 6 వికెట్లకే ఔటయ్యాడు. ఇషాన్ కిషన్ (11), సమరన్ రవిచంద్రన్ (9), హెన్రిచ్ క్లాసెన్ (14), సలీల్ అరోరా (16), నితీశ్ కుమార్ రెడ్డి (2), శివాంగ్ కుమార్ (4), ప్రఫుల్ హింగే (3) తక్కువ పరుగులు చేశారు. కెప్టెన్ పాట్ కమిన్స్ చేసిన 19 పరుగులే భారీ స్కోర్ కావడం విశేషం. మ్యాచ్లో చెప్పుకోవాల్సింది గుజరాత్ టైటాన్స్ బౌలింగ్. మహ్మద్ సిరాజ్ తొలి ఓవర్కే ఒక వికెట్ తీసి సన్రైజర్స్ ఓటమికి బాటలు వేశాడు. కగిసో రబాడా, జేసన్ హోల్డర్ మూడేసి వికెట్లు తీసి సంచలనం సృష్టించారు. ప్రసిద్ కృష్ణ రెండు వికెట్లతో అదరగొట్టగా.. రషీద్ ఖాన్ ఒక వికెట్ పడగొట్టాడు. ఫలితంగా గుజరాత్ టైటాన్స్ 82 పరుగుల తేడాతో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.
సన్రైజర్స్ను చిత్తు చేసి గుజరాత్ టైటాన్స్ వరుసగా ఐదో విజయాన్ని సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని సొంతం చేసుకుంది. 12 మ్యాచ్లు ఆడిన గుజరాత్ 8 విజయాలు.. 4 ఓటములు పొంది 16 పాయింట్లు ఖాతాలో వేసుకుంది. ఈ విజయంతో దాదాపుగా ప్లేఆఫ్స్ బెర్త్ను గుజరాత్ ఖాయం చేసుకుంది. సన్రైజర్స్ హైదరాబాద్ 12 మ్యాచ్లు ఆడి.. 7 విజయాలు, 5 ఓటములతో మూడో స్థానంలో నిలిచింది. ఈ ఓటమితో సన్రైజర్స్ ప్లేఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.
Fact Check: 1967 ఇందిరా గాంధీ బంగారం కొనవద్దని చెప్పారా? వైరల్ అవుతున్న వార్తలో వాస్తవం ఎంత?
Secunderabad, Telangana:Indira Gandhi’s Appeal to Citizens in 1967: దేశ ప్రజలను ఉద్దేశించి ఇటీవల ప్రధాని మోదీ వ్యాఖ్యలు పెనుదుమారమే రేపుతున్నాయి. దేశ ప్రజలు పొదుపు పాటించాలని మోదీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగానే సంవత్సరం పాటు బంగారం కొనకూడదని ఆయన పిలుపునిచ్చారు. ఇది దేశవ్యాప్తంగా పెద్ద చర్చకే దారితీసింది. అంతేకాదు రాజకీయంగా కూడా పెనుదుమారం రేపుతోంది. అయితే ఈ సమయంలో ఓ పాత పేపర్ క్లిప్ తెరపైకి వచ్చింది. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇప్పుడు మోదీ పిలుపునిచ్చినట్లుగా 1967లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ బంగారం కొనకూడదని.. దేశ ప్రజలను కోరినట్లుగా ఆ వార్తాప్రతిక క్లిప్పింగ్ లో ఉంది.
ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న 1967 నాటి ది హిందూ పత్రిక క్లిప్పింగ్ వెనుక ఉన్న అసలు వాస్తవాలను పరిశీలిస్తే.. అది పూర్తిగా నకిలీదని స్పష్టమవుతోంది. బంగారం కొనవద్దు.. ప్రజలకు ఇందిర పిలుపు అంటూ సర్క్యులేట్ అవుతున్న ఆ పేపర్ క్లిప్పింగ్ డిజిటల్గా మార్ఫింగ్ చేసింది. జూన్ 6, 1967 నాటి ది హిందూ పత్రిక ముఖచిత్రంలో అసలు అలాంటి వార్తే లేదని ఫ్యాక్ట్ చెక్ నిపుణులు ప్రాథమిక విచారణలో తేల్చారు.
ఈ ప్రచారంపై ది హిందూ యాజమాన్యం కూడా అధికారికంగా స్పందిస్తూ.. తమ పత్రిక పేరుతో చలామణి అవుతున్న ఆ చిత్రం తమ ఆర్కైవ్స్కు చెందింది కాదని, ఎవరో కావాలని పత్రిక ట్యాగ్లైన్ను కూడా మార్చి (India’s కు బదులుగా Indian అని) సృష్టించారని వివరణ ఇచ్చింది. అప్పట్లో ఇందిరా గాంధీ విదేశీ మారక ద్రవ్య నిల్వల కోసం ఇలాంటి విజ్ఞప్తి చేశారనే వాదనలో ఏమాత్రం నిజం లేదని, ఆ రోజు విడుదలైన అసలైన పేజీని పత్రికా ప్రతినిధులు సాక్ష్యంగా బయటపెట్టారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలకు అనుగుణంగా పాత పత్రికల ముఖచిత్రాలను మార్చి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరిగిందని, ఇలాంటి తప్పుడు వార్తలను నమ్మవద్దని నిపుణులు సూచిస్తున్నారు.
Top Stories of the Day - May 12, 2026 (n/10)
PTI Fact Check: Fake front page of The Hindu newspaper shared to falsely claim Indira Gandhi ‘urged Indians not to buy gold in 1967’
READ: https://t.co/Ryf9zOUGAm#PTINews #PTIPhotos #BigStories #TopStories #TopNews pic.twitter.com/vFEfLKpOhF
— Press Trust of India (@PTI_News) May 12, 2026
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Vemulawada: దక్షిణ కాశికి పూర్వవైభవం.. CM రేవంత్ రెడ్డి నేతృత్వంలో వేములవాడ మాస్టర్ ప్లాన్ అమలు..
Hyderabad, Telangana:Vemulawada Temple Latest News: దక్షిణ కాశిగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థాన అభివృద్ధిపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టిని సారించింది. ఆలయ పునర్నిర్మాణంతో పాటు భక్తులకు అంతర్జాతీయ స్థాయి వసతులను కల్పించడమే లక్ష్యంగా వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీని ప్రభుత్వం భారీ మార్పులతో పునర్వ్యవస్థీకరించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైన ఉత్తర్వులను కూడా జారీ చేసింది. ఆలయ ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని కోరింది..
కొత్తగా నియామకమైన ఈ అథారిటీకి ముఖ్యమంత్రి A. రేవంత్ రెడ్డి స్వయంగా చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. ఆలయ అభివృద్ధిలో స్థానిక ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం ఉండాలనే ఉద్దేశంతో కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడికి కమిటీలో కీలక స్థానం కల్పించారు. అలాగే వేములవాడ తో పాటు సిరిసిల్ల నియోజకవర్గాల ఎమ్మెల్యేలను సభ్యులుగా నియమించారు. దీనివల్ల స్థానిక సమస్యలు నేరుగా ప్రభుత్వం దృష్టికి వెళ్లి నిధుల మంజూరు సులభతరం అవుతుంది..
అధారిటీలో కేవలం రాజకీయ నేతలకే కాకుండా పరిపాలనలో పారదర్శకత కోసం ఉన్నత అధికారులకు కూడా చోటు కల్పించారు.. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్తో పాటు ఎస్పీ జిల్లా అటవీశాఖ అధికారులను ఈ అథారిటీలో కీలకమైన మెంబర్లుగా ఉంచినట్లు తెలుస్తోంది.. అంతేకాకుండా రాష్ట్ర ఫైనాన్స్తో పాటు దేవాదాయ శాఖకు చెందిన ఉన్నత అధికారులు, ప్రభుత్వం తరఫున ఆరుగురు ప్రత్యేక ఆహ్వానిత సభ్యులను కూడా నియమించినట్లు తెలుస్తోంది. మీరు ఆలయ వాస్తు తో పాటు ఆగమన శాస్త్రం, పర్యాటక రంగంలో అనుభవం ఉన్న నిపుణులుగా ఉండే అవకాశం ఉంది..
Read more: BRS KTR Tweet: బేటా భగావో.. బేటా బచావో.. బండి సంజయ్ కొడుకు పోక్సోపై కేటీఆర్ సెటైరికల్ ట్విట్..
ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న ఆలయ మాస్టర్ ప్లాన్ పనులను వేగవంతం చేయడమే ఈ కమిటీ ప్రధాన ఉద్దేశ్యం.. కోనేరు అభివృద్ధితో పాటు భక్తుల కోసం క్యూ లైన్లు ఆధునీకరణ, వసతి గృహాల నిర్మాణం, ఆలయ విస్తరణ పనులపై ఈ అథారిటీ ప్రత్యేక కార్యాచరణను రూపొందించబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మహాశివరాత్రితో పాటు ఇతర పండగల సమయాల్లో వచ్చే లక్షలాదిమంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా మౌలిక సదుపాయాలను మెరుగుపరచబోతున్నట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయం పట్ల వేములవాడ ప్రజలతో పాటు భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి స్వయంగా చైర్మన్ గా ఉండడంతో రాజన్న క్షేత్రానికి పూర్వ వైభవం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Read more: BRS KTR Tweet: బేటా భగావో.. బేటా బచావో.. బండి సంజయ్ కొడుకు పోక్సోపై కేటీఆర్ సెటైరికల్ ట్విట్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
NEET 2026: మళ్లీ మొదటికే.. నీట్ పేపర్ లీక్, పరీక్షను రద్దు చేస్తూ NTA సంచలన నిర్ణయం!
Hyderabad, Telangana:NEET UG May 3 exam cancelled: నీట్ పరీక్ష 2026 దేశవ్యాప్తంగా వివిధ కేంద్రాలలో మే 3వ తేదీ ఆదివారం నిర్వహించారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దేశవ్యాప్తంగా 551 కేంద్రాలతో పాటు అంతర్జాతీయంగా సిటీలో 14 సెంటర్లలో నిర్వహించారు. మొత్తంగా 22.79 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. అయితే రాజస్థాన్ పరీక్ష కేంద్రంలో పేపర్ లీక్ అయిన వార్త కలకలం రేపుతోంది. దీంతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నీట్ పరీక్షను 2026 రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.
పరీక్ష జరిగిన మరుసటి రోజు నుంచి నీట్ పేపర్ లీక్ అయిందని వార్తలు బయటకు వచ్చాయి. తాజాగా నీట్ రాసిన విద్యార్థులకు ఎన్టీఏ షాక్ ఇచ్చింది. పరీక్ష రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. నీట్ యూజీ 2026 రీ ఎగ్జామ్ సంబంధించిన తేదీలను అతి త్వరలో ప్రకటిస్తామని తెలిపింది.
మన దేశంలో నీట్ అనేది ఒక కీలకమైన పరీక్ష. దేశవ్యాప్తంగా వివిధ మెడికల్ కోర్సుల్లో కాలేజీల ప్రవేశాలకు గాను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఈ పరీక్షల నిర్వహిస్తుంది. దీంతో MBBS, BDS, BAMS, BHMS, BVSC కోర్సుల్లో అడ్మిషన్ దొరుకుతుంది. ఈ సీట్ల కేటాయింపునకు నీట్ స్కోర్ తప్పనిసరి. అందుకే లక్షలాదిమంది విద్యార్థులు ప్రతి ఏడాది నీట్ పరీక్షకు హాజరవుతారు. ఈ పరీక్ష ఆఫ్ లైన్ విధానంలో ఓఎంఆర్ షీట్ పై జరుగుతుంది. మొత్తంగా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అంశాలపై 150 ప్రశ్నలు ఉంటాయి. సరైన సమాధానం టిక్ చేస్తే నాలుగు మార్కులు, తప్పుడు సమాధానానికి ఒక్క మార్కు తగ్గింపు కూడా ఉంటుంది. తెలుగుతో పాటు 13 భాషల్లో దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష నిర్వహించారు.
Also Read: ఉచితంగా ఆన్లైన్ క్లాసులు.. స్వయం ప్లాట్ఫామ్లో ఇంటర్ విద్యార్థుల కోసం సరికొత్త కోర్సులు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
King Cobra Video: నిధికి కాపలాగా నాగుపాములు.. ఒళ్లు గగుర్పొడిచే వైరల్ వీడియో!
Hyderabad, Telangana:King Cobra Video Watch Now: హిందూ పురాణాల్లోనూ.. జానపద కథల్లోనూ నిధుల దగ్గర పాములు కాపలాగా ఉంటాయని మనం వినే ఉంటాం.. అయితే సరిగ్గా అలాంటి దృశ్యమే నిజంగా వెలుగులోకి రావడం ఇప్పుడు సోషల్ మీడియా వినియోగదారులను ఆశ్చర్యపోయేలా చేస్తోంది. బంగారు నగలు కలిగిన ఒక నిండు బంగారు కొండపై రెండు అత్యంత ప్రమాదకరమైన నాగుపాములు చుట్టుకొని పహారా కాస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో వైరల్ అవుతూ వస్తోంది.
వైరల్ అవుతున్న ఈ వీడియోలో.. నేలపై ఒక పురాతనమైన రాగి కుండ కనిపిస్తూ ఉండడం మీరు చూడొచ్చు.. ఆ కుండ నిండా తళతళలాడే బంగారు ఆభరణాలతో పాటు భారీ గొలుసులు, ప్రాచీనం కాలం నాటి నగలు ఉండడం మీకు కనిపిస్తుంది.. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఆ కొండపై రెండు నల్లటి నాగుపాములు పడగవిప్పి కూర్చున్నాయి. ఎవరైనా ఆ బంగారాన్ని తాకడానికి ప్రయత్నిస్తే ప్రాణాలు తీస్తా అన్నట్లుగా అవి బుసలు కొడుతూ అక్కడే ఉండడం మీరు చూడొచ్చు.
ఈ వీడియో ఎక్కడ, ఎప్పుడు తీశారని దానిపై స్పష్టమైన ఆధారాలు లేనప్పటికీ.. ఇంస్టాగ్రామ్తో పాటు ఎక్స్ వేదికలపై ఇది మిలియన్లకు కొద్దిగా వ్యూస్ సంపాదించుకుంది. "నిజంగానే నిధుల దగ్గర పాములు ఉంటాయని ఈ వీడియో నిరూపిస్తోంది.'' అని కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు కూడా కామెంట్లు చేస్తూ వస్తున్నారు.. ఇది ఎవరైనా కావాలనే సెట్ చేసి షూట్ షూట్ చేసిన వీడియో కావచ్చు లేదా గ్రాఫిక్స్ ప్రభావం కావచ్చు అని మరి కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు కామెంట్లు చేస్తూ వస్తున్నారు.
Also Read: Video Viral: సాయం ముసుగులో అరాచకం.. యువతి ప్రైవేటు పార్ట్ మీద చెయ్యి వేసి మరీ.!. వీడియోపై దుమారం..
గతంలో కూడా ఇలాంటి వీడియోలు కొన్ని వెలుగులోకి వచ్చినప్పటికీ.. ఈ స్థాయిలో నాగుపాములు పడగవిప్పి నిధిని రక్షించడం మాత్రం ఇదే మొదటిసారి అని సోషల్ మీడియా వినియోగదారులు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా ప్రస్తుతం నిధి పాములకు సంబంధించిన వీడియో మాత్రం విపరీతంగా వైరల్ అవుతూ వస్తోంది.. అయితే ఈ వీడియోను ఫ్యాక్ట్ చెక్ చేసి చూడగా.. ఇది ఎవరో కావాలని ఇలా పాములను ముంచి వీడియో తీసి వ్యూస్ కోసం సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని తేలింది.
Also Read: Video Viral: సాయం ముసుగులో అరాచకం.. యువతి ప్రైవేటు పార్ట్ మీద చెయ్యి వేసి మరీ.!. వీడియోపై దుమారం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
- https://apple.co/3loQYe ఆపిల్ లింక్
Cobra Video: కింగ్ కోబ్రా పడగ కింద బుల్లి బాలుడు.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వీడియో!
Hyderabad, Telangana:Black King Cobra Viral Video Watch: సోషల్ మీడియా లో నిత్యం ఏదో ఒక వింత వీడియో నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేస్తూనే ఉంటుంది. కానీ తాజాగా వైరల్ అవుతున్న ఒక వీడియో మాత్రం ఆశ్చర్యాన్ని కలిగించడమే కాకుండా తీవ్రభయాందోళనకు గురిచేస్తుంది. ఒక చిన్న బాలుడు ఏకంగా ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన బ్లాక్ కింగ్ కోబ్రా తో పచ్చిక మైదానంలో ఆడుకుంటున్న దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఈ వీడియోను చూసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు..
వైరల్ అవుతున్న వీడియో వివరాల్లోకి వెళ్తే.. ఒక పచ్చిక మైదానంలో ఒక బాలుడు ఎంతో అమాయకంగా ఆడుకుంటూ ఉండటం మీరు గమనించవచ్చు. అయితే, ఆ బాలుడి వెనికే ఒక భారీ బ్లాక్ కింగ్ కోబ్రా పడక విప్పి నిలబడి ఉండడం మీరు చూడొచ్చు. ఆ పాము ఎంత భయానకరంగా ఉందంటే.. అది ఒక్కసారి కాటు వేస్తే ప్రాణాలు నిలవడం దాదాపు అసాధ్యం అన్నట్లు కనిపిస్తోంది. కానీ ఆ బాలుడు మాత్రం ఏ మాత్రం భయపడకుండా ఆ పాముకు మరింత దగ్గరగా అటు ఇటు కదలడం మీరు చూడొచ్చు.
ఈ వీడియో అక్కడే ఉన్న కొంతమంది వారి మొబైల్స్ ద్వారా చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తున్న ప్రధాన అంశం ఏంటంటే.. సాధారణంగా మనుషుల అలికిడి అయితేనే అటాక్ చేసే కింగ్ కోబ్రా.. ఆ బాలుడిపై దాడి చేయకపోవడం. బాలుడు పాముకు అంత దగ్గరగా వెళుతున్నప్పటికీ.. అది కేవలం తన పడగలను అటు ఇటు తిప్పుతూ చూస్తోంది తప్ప కాటు వేయడానికి ప్రయత్నించడం లేదు.. బాలుడు దాని తోకను తాకినప్పటికీ.. దగ్గరగా వెళ్లిన.. అది శాంతంగా ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోంది.. దీనిని చూసిన కొంత మంది దైవ లీల అంటుంటే మరి కొంతమంది అది పెంపుడుపామని చెబుతున్నారు..
Also Read: Video Viral: సాయం ముసుగులో అరాచకం.. యువతి ప్రైవేటు పార్ట్ మీద చెయ్యి వేసి మరీ.!. వీడియోపై దుమారం..
ఈ వీడియో మిలియన్ల కొద్ది వ్యూస్ సంపాదించుకున్నప్పటికీ.. సోషల్ మీడియా నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు కూడా వస్తున్నాయి. వ్యూస్ కోసం.. లైక్స్ కోసం చిన్న పిల్లల ప్రాణాలను పణంగా పెడతారా? అంటూ బాలుడి తల్లిదండ్రులపై సోషల్ మీడియా వినియోగదారులు ఊహించని స్థాయిలో మండిపడుతున్నారు. అత్యంత ప్రమాదకరమైన పాములు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాయో ఎవరికీ తెలియదని.. ఇలాంటి ప్రమాదకరమైన విన్యాసాలు ప్రాణాలకు ముప్పు కలిగిస్తాయని వన్యప్రాణి సంరక్షకులు చెబుతున్నారు. ఏది ఏమైనా ఇప్పుడు సోషల్ మీడియాలో వీడియో మాత్రం విపరీతంగా వైరల్ అవుతుంది.
Also Read: Video Viral: సాయం ముసుగులో అరాచకం.. యువతి ప్రైవేటు పార్ట్ మీద చెయ్యి వేసి మరీ.!. వీడియోపై దుమారం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Hyderabad: బాలుడిపై పది కుక్కల దాడి.. తల చర్మం ఊడిపోయేలా బీభత్సం!
Hyderabad, Telangana:Stray Dogs Attack Child Hyderabad: వీధి కుక్కల స్వైర విహారం మరో పసి ప్రాణాన్ని బలి తీసుకోబోయింది.. వేసవి సెలవుల కోసం సరదాగా చుట్టాల ఇంటికి వచ్చిన ఒక బాలుడిపై పదికి పైగా వీరి కుక్కలు ఏకకాలంలో దాడి చేసి మృత్యు అంచులకు తీసుకెళ్లాయి.. అత్యంత కిరాతకంగా జరిగిన ఈ దాడిలో బాలుడు తీవ్రంగా గాయపడి.. ప్రస్తుతం మృత్యుతో పోరాడుతున్నాడు.
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం బోటుమీదపల్లెకు చెందిన ఆద్విక్ అనే బాలుడు తన వేసవి సెలవులను గడిపేందుకు హైదరాబాదులోని బి ఎన్ రెడ్డి నగర్, టీచర్స్ కాలనీలో ఉన్న బంధువుల ఇంటికి వచ్చాడు. మంగళవారం సాయంత్రం ఇంటికి బయట తోటి పిల్లలతో కలిసి ఆడుకుంటుండగా.. ఒక్కసారిగా వీధి కుక్కల గుంపు అతనిపై విరుచుకుపడింది..
దాదాపు 10 కుక్కలు అద్విక్ను చుట్టుముట్టి.. విచక్షణ రహితంగా కరిచాయి. ఈ క్రమంలో కుక్కలు బాలుడి తలభాగాన్ని పీకేసే ప్రయత్నం చేశాయి. దీనివల్ల అతడి తలపై భాగంలోని చర్మం మొత్తం ఊడిపోయి రక్త ప్రవాహం ఏరులై పారింది. శరీరంపై ఇతర చోట్ల కూడా లోతైన గాయాలయ్యాయి. బాలుడి అరుపులు విని స్థానికులు పరుగున వచ్చి అక్కడున్న కుక్క లను వెళ్లగొట్టే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా వెంటనే రక్తపు మడుగులో ఉన్న అద్విక్ను సమీపంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాలుడు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది..
Also Read: Video Viral: సాయం ముసుగులో అరాచకం.. యువతి ప్రైవేటు పార్ట్ మీద చెయ్యి వేసి మరీ.!. వీడియోపై దుమారం..
గాయపడిన బాలుడు అద్విక్.. బోటుమీదపల్లె గ్రామ సర్పంచ్ కుమారుడిగా గుర్తించారు.. సెలవుల్లో ఆడుకోవడానికి పంపిన కొడుకు ఇలా కుక్కల దాడిలో గాయపడటం చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. ఈ ఘటనతో టీచర్స్ కాలనీ వాసులు తీవ్రభయాందోళనకు గురవుతున్నారు. నగరంలో కుక్కల బెడద రోజురోజుకు పెరుగుతున్న.. మున్సిపల్ అధికారులు పట్టించుకోవడంలేదని స్థానికులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీధిలో నడవాలంటే చిన్న పిల్లలతో పాటు వృద్ధులు వణికి పోతున్నారట. ఇప్పటికైనా యంత్రాంగం స్పందించి వీధి కుక్కలని నియంత్రణ చర్యలు తీసుకోవాలని వారి డిమాండ్ చేస్తున్నారు..
Also Read: Video Viral: సాయం ముసుగులో అరాచకం.. యువతి ప్రైవేటు పార్ట్ మీద చెయ్యి వేసి మరీ.!. వీడియోపై దుమారం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..Twitter, Facebook ..
