అంగన్వాడీల ధర్నా: వేతనాల పెంపు, హామీల అమలుకు డిమాండ్
Mahabubabad, Telangana:ఖమ్మం కలెక్టరేట్ ముందు అంగన్వాడీలు ధర్నా నిర్వహించారు. కనీస వేతనాల పెంపు, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల హామీల అమలు కోరుతూ నిరసన తెలిపారు. తక్కువ వేతనాలతో పడుతున్న ఇబ్బందులపై ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సమస్యలు పరిష్కరించనట్లయితే దశలవారీగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. తమ డిమాండ్లు నెరవేరే వరకు పోరాటం కొనసాగిస్తామని అంగన్వాడీలు స్పష్టం చేశారు.
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
Team India T20 Captain: టీమ్ఇండియా కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ తొలగింపు!! కొత్త కెప్టెన్ అతనే!
Hyderabad, Telangana:Shreyas Iyer T20 Captain: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) జాతీయ టీ20 జట్టులో కీలక నాయకత్వ మార్పుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో 2026 టీ20 ప్రపంచకప్ టైటిల్ టీమ్ఇండియా గెలిచినా.. తాజాగా ఐపీఎల్లో తాను ఫామ్ కోల్పోవడం వల్ల అతడ్ని ఆ బాధ్యతల నుంచి తప్పించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సీనియర్ ఆటగాడు ఇటీవల బ్యాటింగ్లో విఫలమవుతుండటంతో సెలక్షన్ కమిటీ ఆందోళన చెందుతున్నట్లు నివేదికలు సూచిస్తున్నాయి.
జాతీయ మీడియా నివేదిక ప్రకారం.. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ, సూర్యకుమార్ ఇటీవల పరుగులు చేయకపోవడంతో అతడ్ని పక్కకి పెట్టాలని యోచిస్తున్నట్లు సమాచారం అందుతోంది. అతడి స్థానంలో టీ20 జట్టుకు కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ను ఎంపిక చేయాలని బీసీసీఐ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2026 తర్వాత జరిగే ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనలకు అతడిని కెప్టెన్గా చేసే అవకాశం కూడా ఉంది.
మరోవైపు సూర్యకుమార్ యాదవ్కు కెప్టెన్గా అద్భుతమైన రికార్డు ఉన్నప్పటికీ.. వ్యక్తిగత ప్రదర్శన క్షీణించింది. ప్రస్తుత ఐపీఎల్ 2026 సీజన్లో ముంబై ఇండియన్స్ తరఫున పది మ్యాచ్లలో అతను కేవలం 195 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అదే విధంగా ఈ టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ మణికట్టు సమస్యతో బాధపడుతున్నట్లు.. అసౌకర్యంగా బ్యాటింగ్ చేస్తున్నట్లు నివేదికలు తెలిపాయి.
ఈ క్రమంలో శ్రేయస్ అయ్యర్ ఫామ్లో ఉండడం సహా కెప్టెన్గానూ రాణిస్తుండడం వల్ల అతడ్ని టీ20 జట్టులోకి తీసుకొనే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. పంజాబ్ కింగ్స్ ఆడిన తొలి ఏడు మ్యాచ్లలో ఆరు విజయాలు సాధించడంలో జట్టుకు నాయకత్వం వహించి, తొమ్మిది ఇన్నింగ్స్లలో 333 పరుగులు సాధించాడు.
అయితే ఈసారి టీ20 జట్టులోకి కొత్తదనాన్ని తీసుకురావాలని సెలెక్టర్లు చూస్తున్న తరుణంలో, అయ్యర్ నాయకత్వ లక్షణాలు, ఇటీవలి నిలకడ అతడిని ఆ పదవికి ప్రధాన పోటీదారుగా నిలిపాయని సమాచారం. కానీ, సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి టీమ్ఇండియా ఒక్క టీ20ఐ సిరీస్లో కూడా ఓడిపోకపోవడం ఒక ఆసక్తికరమైన పరిస్థితిగా మిగిలిపోయింది. అయితే, ఇప్పుడు కేవలం బ్యాటర్గా అతని స్థానమే పరిశీలనలో ఉంది.
మరోవైపు, శ్రేయస్ అయ్యర్ డిసెంబర్ 2023 నుండి ఏ T20I మ్యాచ్లోనూ ఆడలేదు. ఈ భారీ మార్పు రాబోయే 2028 ఒలింపిక్ క్రీడలపై ప్రభావం ఉంటుందని బీసీసీఐ సెలెక్షన్ టీమ్ భావిస్తుంది.
Also Read: మమతా బెనర్జీకి గవర్నర్ షాక్..సీఎంగా రాజీనామా చేయలేదని ప్రభుత్వాన్ని రద్దు చేశారు!
Also Read: వాహనదారులకు గట్టిదెబ్బ..పెండింగ్ చలాన్లు 45 రోజుల్లో చెల్లించకపోతే లైసెన్స్ రద్దు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Lakshmi Narayana Rajayoga: వ్యాపారం, ఉద్యోగాల్లో కాసుల వర్షం.. లక్ష్మీ నారాయణ రాజయోగంతో ఈ రాశుల వారికి పండగే!
Hyderabad, Telangana:Lakshmi Narayana Rajayoga May 2026 Effect On Zodiac: జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలకు అవేలికలు మానవ జీవితాలపై ఊహించని ప్రభావాలను చూపుతాయని మనందరికీ తెలిసిందే. ఈ క్రమంలో 2026 సంవత్సరం మే నెలలో అత్యంత శక్తివంతమైన గ్రహాల కదలికల కారణంగా ఎంతో ప్రత్యేకమైన లక్ష్మీనారాయణ రాజయోగం ఏర్పడబోతోంది. మే 14వ తేదీన శుక్రుడు మిథున రాశిలోకి ప్రవేశించగా.. మే 29వ తేదీన బుధుడు కూడా అదే రాశిలోకి చేరుకోబోతున్నాడు. దీని కారణంగా ఈ రెండు శక్తివంతమైన గ్రహాల కలయిక జరుగుతుంది.
ఏవైనా రెండు గ్రహాల కలయిక జరిగితే తప్పకుండా ఏదో ఒక రాజయోగం ఏర్పడుతుంది. అయితే మే 29వ తేదీన జరిగే శుక్ర, బుధ గ్రహాల కలయిక కారణంగా ఎంతో శక్తివంతమైన లక్ష్మీనారాయణ రాజయోగం ఏర్పడుతుంది. ఈ సమయంలో నాలుగు రాశుల వారికి ఆర్థికంగా, వృత్తిపరంగా అద్భుతమైన లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా జీవితంలో ఎప్పుడు పొందలేని డబ్బు పొందే అవకాశాలున్నాయి.
ఈ రాశులవారికి బంపర్ బెనిఫిట్స్:
మిథున రాశి
ఎంతో శక్తివంతమైన లక్ష్మీనారాయణ రాజయోగం ఏర్పడడం కారణంగా మిథున రాశి వారికి అత్యధిక ప్రయోజనాలు కలగబోతున్నాయి. ముఖ్యంగా వీరికి చేపట్టిన ప్రతి పని అదృష్టం తోడై విజయవంతం అవుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. అంతేకాకుండా పెండింగ్లో ఉన్న ప్రతి పని ఎంతో సులభంగా పూర్తవుతాయి. అలాగే తండ్రి నుంచి వచ్చి ఆస్తులు కూడా భారీ మొత్తంలో పొందే అవకాశాలున్నాయి. దీంతోపాటు కొత్త ఒప్పందాలు కలిసి వస్తాయని జ్యోతిష్యులు చెబుతున్నారు.
కన్యారాశి
కన్యారాశిలో జన్మించిన వ్యక్తులకు పదవ స్థానంలో ఈ రాజయోగం ఏర్పడుతుంది. దీనివల్ల కార్యాలయాల్లో పనికి తగ్గ ప్రశంసలు లభిస్తాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. అలాగే కష్టానికి తగిన ప్రతిఫలం కూడా ఎంతో సులభంగా లభించబోతోంది. సామాజికంగా గౌరవ మర్యాదలు కూడా విపరీతంగా పెరుగుతాయి. రాజకీయ రంగాల్లో ఉన్నవారికి మంచి గుర్తింపు కూడా లభించబోతోంది. ఉన్నత అధికారుల సపోర్టుతో కీలకమైన బాధ్యతను స్వీకరిస్తారు.
తులారాశి
ఎంతో శక్తివంతమైన లక్ష్మీనారాయణ రాజయోగ ప్రభావంతో తులారాశి వారికి మే చివరి వారం నుంచి ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా గత కొంతకాలంగా ఉన్న మానసిక ఒత్తిడి నుంచి సులభంగా ఉపశమనం కలగబోతోంది. పూర్వికులు ఆస్తులు కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకునే వారి విద్యార్థుల కల నెరవేరబోతోంది. అంతేకాకుండా ఉన్నత విద్య కోసం లోన్లు తీసుకునే వారికి ఈ సమయంలో మంచి లాభాలు కలిగే అవకాశాలున్నాయి. అలాగే తీర్థయాత్రల కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి.
ధనస్సు రాశి
ధనస్సు రాశి వారికి ఎంతో శక్తివంతమైన లక్ష్మీనారాయణ రాజయోగంతో ఈ సమయం ఎంతో అద్భుతంగా కలిసి రాబోతోంది. వైవాహికంగా అద్భుతమైన ప్రయోజనాలు చేకూరే అవకాశాలు ఉన్నాయి. దీంతోపాటు జీవిత భాగస్వామితో ఉన్న మనస్పార్దాలు కూడా ఎంతో సులభంగా పరిష్కారం కాబోతున్నాయి. దీని కారణంగా బంధం మరింత మెరుగుపడే అవకాశాలున్నాయి. కుటుంబంతో కలిసి విహారయాత్రలకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. సమాజంలో పరపతి తో పాటు గౌరవం కూడా విపరీతంగా పెరుగుతుంది.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Operation Sindoor: శత్రువుల స్థావరాల్లోకి దూరి కొడతాం.. ఆపరేషన్ సింధూర్ వార్షికోత్సవంలో లెఫ్టినెంట్ జనరల్..
Hyderabad, Telangana:Operation Sindoor Latest Telugu News: గతేడాది సరిహద్దుల అవతల ఉగ్రవాద స్థావరాలనే లక్ష్యంగా భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ గురించి పాకిస్థాన్ ప్రచారం చేస్తున్న అబద్ధాలపై మాజీ డిజిఎంఓ (DGMO) లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ తీవ్ర స్థాయిలో స్పందిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆపరేషన్ సింధూర్ మొదట వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పాక్ ఆరోపణలను ఆధారాలతో తిప్పి కొట్టారు. అంతేకాకుండా ఆయన వివిధ అంశాలపై మీడియాతో మాట్లాడారు..
ఆపరేషన్ సమయంలో భారత్ ఏమాత్రం నష్టపోలేదని.. పాకిస్తాన్ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి నిరాధారమైన వీడియోలతో పాటు కథనాలను సృష్టించిందని ఆయన స్పష్టం చేశారు. ఆపరేషన్ ముగిసిన వెంటనే ఆధారాలను మీడియాకు అందజేశామని.. పాకిస్తాన్ వద్ద నిజంగా ఏదైనా సాక్ష్యం ఉంటే ప్రపంచానికి ఎందుకు చూపించలేక పోయిందని?..ఘాయ్ ప్రశ్నించారు. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం పాకిస్తాన్ కు అలవాటుగా మారిందని ఆయన అన్నారు..
ఆపరేషన్ సింధూర్ అనేది కేవలం ఒక సైనిక చర్య మాత్రమే కాదని.. ఉగ్రవాదంపై భారత్ ఉక్కు పాదం మోపడానికి వచ్చిన పెను మార్పుని లెఫ్టినెంట్ జనరల్ పేర్కొన్నారు. భారత వాయుసేన ఈ ఆపరేషన్ ద్వారా పాకిస్తాన్లోని 11 ఎయిర్ ఫీల్డ్లను, 9 ప్రధాన ఉగ్రవాద శిబిరాలను విజయవంతంగా ధ్వంసం చేసిందని ఆయన వివరించారు. ఈ దాడుల్లో వందమందికి పైగా ఉగ్రవాదులు చనిపోయారని.. భారత సైనిక ఆస్తులకు ఎలాంటి నష్టం జరగలేదని ఆయన వెల్లడించారు.
Also Read: Bengal Governor: మమతకు బిగ్ షాక్.. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీని రద్దు చేసిన గవర్నర్..
కవి దుష్యంత్ కుమార్ కవితలను గుర్తు చేసుకుంటూ.. కేవలం కలకలం రేపడం నా ఉద్దేశం కాదు.. ఈ పరిస్థితిని మార్చడమే నా ప్రయత్నం.. అని ఆయన అన్నారు. ఆపరేషన్ సింధూర్ అనేది ఒక ముగింపు కాదని... ఉగ్రవాదంపై భారత్ పోరాటంలో ఇది ఒక ఆరంభం మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. స్వదేశీ రక్షణ వ్యవస్థలను వినియోగం ఈ ఆపరేషన్లో కీలక పాత్ర పోషించిందని.. ఇది సైన్యం శక్తి రెట్టింపు చేసిందని ఆయన అన్నారు.
భారత సార్వభౌమాధికారంతోపాటు భద్రతను కాపాడటంలో రాజీ పడే ప్రసక్తే లేదని ఘాయ్ హెచ్చరించారు.. ఉగ్రవాదులకు ఇకపై ఎక్కడ సురక్షిత స్థావరాలు ఉండవని.. అవసరమైతే శత్రువుల స్థావరాల్లోకి చొరబడి దాడులు చేయడానికి భారతీ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉందని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అంతేకాకుండా మీడియాతో ఆయన ఎన్నో అంశాలను కూడా మాట్లాడినట్లు సమాచారం..
Also Read: Bengal Governor: మమతకు బిగ్ షాక్.. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీని రద్దు చేసిన గవర్నర్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
LSG vs RCB: హ్యాట్రిక్ ఓటముల నుంచి లక్నోకు భారీ ఊరట.. కీలక మ్యాచ్లో బెంగళూరు బోల్తా
Lucknow, Uttar Pradesh:LSG vs RCB Highlights: ఓటముల్లో రికార్డులు నమోదు చేసిన లక్నో సూపర్ జియాంట్స్ అద్భుతం చేసింది. టాప్లో ఉన్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు భారీ షాక్ ఇచ్చింది. ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన పంత్ సేన మ్యాచ్ను సొంతం చేసుకుని వరుస ఓటములకు బ్రేక్ ఇచ్చింది. తప్పక గెలవాల్సిన మ్యాచ్లో బెంగళూరు తీవ్రంగా శ్రమించినా ఓటమి నుంచి తప్పించుకోలేకపోయింది. 9 పరుగుల తేడాతో లక్నో విజయం సాధించి హ్యాట్రిక్ ఓటముల నుంచి ఊరట పొందింది.
Also Read: Telangana Rains: తెలంగాణ జిల్లాల్లో వర్ష బీభత్సం.. పంట నష్టంతో రైతుల కన్నీటిపర్యంతం
పలుమార్లు వర్షం అంతరాయంతో ఆలస్యంగా జరిగిన ఈ మ్యాచ్ను 19 ఓవర్లకు కుదించగా.. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన లక్నో సూపర్ జియాంట్స్ 3 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. మిచెల్ మార్ష్ అద్భుతమైన సెంచరీతో అద్భుతం చేయగా.. అర్షిన్ కులకర్ణి 17 పరుగులు నమోదు చేశాడు. వర్షం పడినా.. పిచ్ ఎలా మారినా కూడా మార్ష్ మాత్రం చెలరేగి ఆడాడు. 56 బంతుల్లో 111 పరుగులు చేసి దుమ్మురేపగా.. వాటిలో 9 బౌండరీలు, 9 సిక్సర్లు బాదాడు. నికోలస్ పూరన్ 38, కెప్టెన్ రిషబ్ పంత్ 32 పరుగులతో రాణించి ప్రత్యర్థికి భారీ స్కోర్ను లక్ష్యం విధించారు. లక్నో స్కోర్ను కట్టడి చేయడంలో బెంగళూరు బౌలర్లు కొంత తడబడ్డారు. జోష్ హేజిల్వుడ్, కృనాల్ పాండ్యా, రసీక్ సలామ్ తలా ఒక్కో వికెట్ తీయగా.. మిగతా బౌలర్లు వికెట్ పడగొట్టడంలో విఫలమయ్యారు.
Also Read: Telangana Rains: తెలంగాణ జిల్లాల్లో వర్ష బీభత్సం.. పంట నష్టంతో రైతుల కన్నీటిపర్యంతం
టాపార్డర్ చేతులెత్తేసిన వేళ మిడిలార్డర్ గొప్పగా పోరాడంతో 19 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయిన బెంగళూరు 7 పరుగుల స్వల్ప తేడాతో మ్యాచ్ను చేజార్చుకుంది. జాకోబ్ బెతెల్ 4 పరుగులకు ఔటవగా.. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ డకౌట్ అవడంతో బెంగళూరు కష్టాల్లో పడింది. ఓపెనర్లు వెనుదిరిగిన వేళ దేవదత్ పడిక్కల్, కెప్టెన్ రజత్ పాటిదార్ అద్భుతంగా ఆడి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. పడిక్కల్ 34 పరుగులతో రాణించగా.. రజత్ 31 బంతుల్లో 61 స్కోర్ చేసి సత్తా చాటాడు. జితేశ్ శర్మ ఒక్క పరుగు మాత్రమే చేయగా.. టిమ్ డేవిడ్ గొప్పగా పోరాడి 40 పరుగులు తీశాడు. విజయం కోసం కృనాల్ పాండ్యా (28*), రొమారియో షెఫర్డ్ (23*) ఆఖరి బంతి వరకు పోరాటం చేశారు. ఒక దశలో గెలిచేస్తారనుకున్న సమయంలో బౌలర్లు కట్టడి చేయడంతో పరుగులు రాలేకపోయాయి. ఫలితంగా బెంగళూరు మ్యాచ్ను కోల్పోవాల్సి వచ్చింది. లక్నో బౌలర్లు ప్రారంభంలో అద్భుతంగా బౌలింగ్ చేయగా.. తర్వాత దాన్ని కొనసాగించలేకపోయారు.యువ బౌలర్ ప్రిన్స్ యాదవ్ అద్బుతంగా బంతులు వేసి కీలకమైన మూడు వికెట్లు తీశాడు. షాబాజ్ అహ్మద్ రెండు వికెట్లతో సత్తా చాటగా.. సీనియర్ బౌలర్ షమీ ఒక వికెట్ తీశాడు. వరుస వికెట్లు తీసిన అనంతరం మిగతా వికెట్లు తీయడంలో తడబడడమే కాకుండా స్కోర్ను కూడా నియంత్రించలేకపోయారు. ఫలితంగా ఓవర్లన్నీ ముగిసేవరకు మ్యాచ్ ఫలితం దోబుచులాడింది. కానీ ఆఖరి బంతికి ఊరటనిచ్చేలా మ్యాచ్ జరిగింది.
డబుల్ హ్యాట్రిక్ ఓటముల తర్వాత లక్నో సూపర్ జియాంట్స్ కీలక మ్యాచ్లో విజయం సాధించింది. పది మ్యాచ్లు ఆడిన లక్నో మూడు విజయాలు, 7 ఓటములు చవిచూసింది. బెంగళూరుతో మ్యాచ్లో గెలిచి రెండు పాయింట్లు ఖాతాలో వేసుకున్నా పాయింట్ల పట్టికలో చివరి స్థానంలోనే లక్నో కొనసాగుతోంది. ఇక బెంగళూరు జట్టు వరుసగా రెండో ఓటమి సాధించగా.. ఇప్పటివరకు 10 మ్యాచ్లు ఆడి ఆరు విజయాలు, నాలుగు ఓడిపోయింది. ఓడిపోయినా కూడా పాయింట్ల పట్టికలో టాప్ 3లోనే బెంగళూరు కొనసాగుతోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Operation Sindoor: ఆపరేషన్ సింధూర్కు ఏడాది.. ఉదయం 1.05 గంటకు ఏం జరిగిందో తెలుసా?
Wadgaon, Maharashtra:Operation Sindoor Anniversary: భారత సైనికులను బలిగొన్న ప్రత్యర్థి పాకిస్థాన్కు బుద్ధి చెప్పడానికి అర్ధరాత్రి భారత సైన్యం భారీ వ్యూహం రచించింది. ప్రపంచం మొత్తం నిద్రపోతున్న వేళ భారత సైనిక దళాలు ప్రత్యర్థిపై విరుచుకుపడ్డాయి. 7 మే 2025న ఆ రాత్రి శత్రు దేశానికి కాళరాత్రి.. మన దేశానికి శివరాత్రిగా మారింది. దేశ భద్రతకు సవాలు ఎదురైన సమయంలో సైన్యం సరిహద్దులో దాడులు చేసింది. ప్రత్యర్థి దేశానికి బుద్ధి చెప్పేందుకు విరుచుకుపడింది. ఆపరేషన్ సింధూర్ ఒక పదం కాదు పాకిస్తాన్కు ఊపిరి ఆడకుండా చేసిన ఒక దెబ్బ.
Also Read: AP Govt Jobs: నిరుద్యోగులకు భారీ గుడ్న్యూస్.. 3,220 ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రకటన
ఆపరేషన్ సింధూర్ వార్షికోత్సవం
ఏడాది కిందట భారత సైన్యం చేపట్టిన సైనిక చర్యకు ఆపరేషన్ సింధూర్ అని నామకరణం చేశారు. సరిహద్దుకు అవతలి వైపున ఉన్న ఉగ్రవాదులనే కాకుండా.. ఉగ్రవాదానికి ఆశ్రయం ఇస్తున్న పాకిస్తానీ వ్యవస్థను కూడా కుదిపేసింది. అత్యంత కచ్చితమైన, పరిమితమైన సైనిక చర్య ద్వారా భారతదేశం పాకిస్తాన్లోని ఉగ్రవాదుల స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది. దేశంలో ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్న ఉగ్రవాద స్థావరాలను కూల్చేసింది. ఆపరేషన్ సింధూర్ దెబ్బ ఎలా ఉందంటే పాకిస్థాన్ ఇప్పటివరకు కోలుకోలేకపోయింది. జాతీయ భద్రతకు భంగం కలిగితే సరిహద్దుకు అవతలి వైపు నుంచి కూడా దెబ్బతీయవచ్చని భారత సైన్యం ప్రపంచానికి చాటి చెప్పింది.
ఆపరేషన్ సింధూర్ ముఖ్యమైన అంశం ఏమిటంటే ఉగ్రవాద నెట్వర్క్ను, దానికి మద్దతు పలుకుతున్న వారి స్థావరాలను కూడా ప్రపంచం ముందు బహిర్గతం చేసింది. భారత సైన్యం చేపట్టిన ఈ వ్యూహాత్మక చర్యతో ఉగ్రవాదులకు, పాకిస్తాన్కు పెద్ద ఎదురుదెబ్బ. ఇది ఒక సైనిక చర్య మాత్రమే కాదు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారతదేశం నూతన విధానానికి, మారిన వైఖరికి స్పష్టమైన సమాధానం.
Also Read: SRH Vs PBKS Highlights: పంజాబ్ హ్యాట్రిక్ ఓటమి.. అద్భుత విజయంతో టాప్లోకి సన్రైజర్స్
మే 7వ తేదీ రాత్రి ఉదయం.. 1.05 గంటలకు
భారతదేశ సరిహద్దు వెంబడి మే 7వ తేదీ రాత్రి 1:05 గంటలకు అకస్మాత్తుగా ఆందోళన మొదలైంది. తెల్లవారేసరికి శత్రు దేశంలో అలజడి మొదలైంది. అంతటా నిశ్శబ్దం ఆవరించిన సమయంలో శత్రు స్థావరాలలో భారతదేశ సైన్యం ప్రకంపనలు సృష్టించింది. ఆ రాత్రి ప్రపంచమంతా గాఢ నిద్రలో ఉన్న సమయంలో భద్రతా దళాలు, సైన్యం మాత్రం శత్రు దేశానికి బుద్ధి చెప్పే పనిలో నిమగ్నమైంది. తెల్లవారుజామున 1:05 గంటలకు ఆపరేషన్ సింధూర్ ప్రారంభమైంది.
India’s resolute response calibrated and precise.
Committed to safeguarding sovereignty and its people.#JusticeServedJai Hind. pic.twitter.com/fegLXxMJjm
— ADG PI - INDIAN ARMY (@adgpi) May 7, 2026
సరిహద్దు ప్రాంతాల్లో పేలుళ్ల శబ్దాలు ప్రతిధ్వనించాయి. శత్రువుకు అప్రమత్తమై ప్రతి దాడి చేసే సమయంలో కూడా భారత సైన్యం ఇవ్వలేదు. లక్ష్య నిర్ధారణ ఎంత కచ్చితంగా అంటే నిమిషాల వ్యవధిలోనే ఉగ్రవాద స్థావరాలు నేలమట్టమయ్యాయి. ఆఖరి క్షణం వరకు ఎవరికీ తెలియకుండా ఈ మొత్తం ఆపరేషన్ను అత్యంత రహస్యంగా జరిగింది. ఆ రాత్రి క్షిపణులు, ఆయుధాలు పూర్తి స్థాయిలో విజయవంతంగా పనిచేశాయి. శత్రు దేశం ప్రతిస్పందించేలోపు మొత్తం శత్రుమూకల స్థావరాలు నేలమట్టమయ్యాయి.
శత్రు దేశానికి కాళరాత్రి
మే 7వ తేదీ రాత్రి ఒక తేదీ మాత్రమే కాదు దేశ భద్రతకు సవాలు ఎదురైతే ఎలా బదులిస్తామో స్పష్టంగా ప్రపంచానికి చాటిచెప్పింది. శత్రు దేశాలకు ఒక స్పష్టమైన సందేశాన్ని పంపింది. ఆపరేషన్ సింధూర్ పేరిట జరిగిన దాడి పాకిస్తాన్ను దిగ్భ్రాంతికి గురి చేసింది. యుద్ధం చేయకుండానే శత్రు దేశానికి తనదైన శైలిలో భారతదేశం బుద్ధి చెప్పింది. పహల్గామ్ దాడికి భారతదేశం ప్రతీకారం తీర్చుకుంది.
88 గంటల పాటు బీభత్సం
నిశీధిలో భారత క్షిపణులు పాకిస్తాన్ ఆకాశాన్ని చీల్చుకుంటూ వెళ్లి ఉగ్రవాదుల స్థావరాలను విధ్వంసం చేశాయి. ఈ దాడులతో ఉగ్రవాదానికి శాశ్వత సమాధి భారత సైన్యం చేసింది. ఆపరేషన్ సింధూర్తో భారతదేశ శౌర్యగాథ స్వర్ణాక్షరాలతో లిఖించవచ్చు. ఆపరేషన్ సింధూర్ 88 గంటల పాటు కొనసాగింది. ఇజ్రాయెల్, రష్యా దేశాలు నెలల తరబడి యుద్ధాలు చేసినా కూడా కలిగించలేని నష్టాన్ని భారతదేశం పాకిస్థాన్కు 88 గంటల్లో చేసి చూపించిది. పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని 9 కీలకమైన ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. జైష్-ఎ-మొహమ్మద్, లష్కర్-ఎ-తైబా ప్రధాన స్థావరాలు నేలమట్టమయ్యాయి. ఈ దాడిలో 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారని సమాచారం. పాకిస్థాన్లో కీలకమైన నూర్ ఖాన్, భోలారి వైమానిక స్థావరాలతో సహా 11 వైమానిక స్థావరాలు ధ్వంసమయ్యాయి.
కూలిన పాకిస్తానీ యుద్ధ విమానాలు
భారత దాడిలో కమాండ్ కంట్రోల్ సెంటర్లతో పాటు ఒక సీ30 హెర్క్యులస్ రవాణా విమానం, ఒక అత్యంత విలువైన అవాక్స్ (AWACS) విమానం ధ్వంసమయ్యాయి. పాకిస్తాన్ గొప్పగా చెప్పుకునే షాహీన్, బాబర్ క్షిపణులను తన సుదర్శన్ చక్రతో కూల్చేసింది. ఒకవైపు ఉగ్రవాద స్థావరాలు తగలబడిపోతే.. మరోవైపు పాకిస్తాన్ సైనిక వైమానిక స్థావరాలు నేలమట్టమయ్యాయి. మౌలానా మసూద్ అజార్ మదర్సాలో నాలుగు పేలుళ్లు జరిగాయి.
మే 7న భారత్ పాకిస్థాన్లోని తొమ్మిది ప్రాంతాల్లో దాడులు
==> జైష్ ప్రధాన కార్యాలయం బహవల్పూర్లో ఉంది. లష్కర్ ప్రధాన కార్యాలయం మురిద్కేలో ఉంది.
==> సర్జల్లో జైష్ ప్రయోగ వేదిక
==> మెహమూనా జోయా, హిజ్బుల్ ముజాహిదీన్ శిక్షణా కేంద్రం
==> భిబర్లో లష్కర్ శిక్షణా శిబిరం
==> కోట్లిలోని జైష్ కేంద్రం
==> కోట్లిలోని హిజ్బుల్ శిక్షణా కేంద్రం
==> ముజఫరాబాద్లో లష్కరే శిబిరం, మర్కజ్
ఈ 7 ఉగ్రవాద స్థావరాల నుంచే భారతదేశంపై ఉగ్ర దాడులకు ప్రణాళికలు రచించారు. ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చి ఆ స్థావరాల నుంచే ఉగ్రవాదులు భారతదేశంపై దాడి చేయడానికి వచ్చారని భారత సైన్యం గుర్తించింది. ఆపరేషన్ సింధూర్తో వాటిపై యుద్ధం చేసింది. పహల్గామ్ దాడికి ఇది ప్రతీకార చర్య. ఆపరేషన్ సిందూర్ ప్రభావంతో మసూద్ స్థావరం కూలిపోయింది. ఉగ్రవాదులు ఎక్కడ పుట్టారో అక్కడే మరణించారు. ఆపరేషన్ సింధూర్ మసూద్ కుటుంబాన్నే తుదముట్టించింది. ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలను నాశనం చేయడమే కాకుండా.. ఉగ్రవాద నెట్వర్క్ను కూల్చేసింది.
In moments that test a nation, courage is not spoken, it is demonstrated. A year since #OperationSindoor, and India stands united in strength, resolve and it's commitment to protect the nation and its citizens.
The operation reflects the courage of our forces, the preparedness… pic.twitter.com/OUkVUEeOma
— G Kishan Reddy (@kishanreddybjp) May 7, 2026
భారత సైన్యం శౌర్య గాథ
ఆపరేషన్ సింధూర్లో హతమైన ఉగ్రవాదుల అంత్యక్రియల ఊరేగింపులు జరిగినప్పుడు పాకిస్తాన్ సైన్యం స్వయంగా పాల్గొని పాకిస్తాన్ ఉగ్రవాదులకు ఎలా ఆశ్రయం కల్పిస్తుందో.. మద్దతు నిలుస్తుందో స్పష్టమైంది. ఆపరేషన్ సింధూర్ జరిగి ఏడాది పూర్తయినా దాని ప్రభావం మాత్రం ఇప్పటికీ పాకిస్థాన్పై ఉంది. భారత దెబ్బకు పాకిస్తాన్ సైన్యం ఇప్పటికీ తన వైమానిక స్థావరాలను బాగు చేసుకోలేకపోతున్నది. ఇది భారత సైన్యం శౌర్యగాథ. ఆపరేషన్ సింధూర్ గురించి ఎప్పుడు చెప్పుకున్నా భారత సైన్యం సాహసాలకు ప్రతీకగా నిలుస్తుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Bengal Assembly Dissolved: మమతా బెనర్జీకి గవర్నర్ బిగ్ షాక్..సీఎంగా రాజీనామా చేయలేదని ప్రభుత్వాన్ని రద్దు చేశారు!
Chhotobainan, West Bengal:West Bengal Assembly Dissolved: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఒక శకం ముగిసింది. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా నిరాకరించిన మమత బెనర్జీకి గవర్నర్ ఆర్.ఎన్.రవి గట్టి షాక్ ఇచ్చారు. రాజ్యాంగబద్ధమైన తన విచక్షణాధికారాలను ఉపయోగించి, ప్రస్తుత తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గవర్నర్ బర్తరఫ్ చేశారు.
మే 7 (నేడు) అర్ధరాత్రితో బెంగాల్ అసెంబ్లీ ఐదేళ్ల కాలపరిమితి ముగుస్తోంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైనప్పటికీ, మమతా బెనర్జీ రాజీనామాకు సమ్మతించలేదు. దీంతో గవర్నర్ అసెంబ్లీని రద్దు చేస్తూ.. మంత్రివర్గాన్ని బర్తరఫ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీనితో బెంగాల్పై దీదీకి ఉన్న 15 ఏళ్ల పట్టు సడలింది.
ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం
ఇటీవలే బెంగాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 294 స్థానాలల్లో ఊహించని ఫలితాలు వచ్చాయి. భారతీయ జనతా పార్టీ 207 స్థానాల్లో ఘనవిజయం సాధించి స్పష్టమైన మెజారిటీని సొంతం చేసుకుంది. మమతా బెనర్జీకి చెందిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కేవలం 80 స్థానాలకే పరిమితమై ప్రతిపక్ష హోదాకు పడిపోయింది. స్వయంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భవానీపూర్ నియోజకవర్గంలో బీజేపీ నేత సువేందు అధికారి చేతిలో ఓటమి పాలయ్యారు.
మరోవైపు ఓటమిని అంగీకరించని మమతా బెనర్జీ బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. కేంద్ర బలగాలు, ఎన్నికల సంఘం అండతో బీజేపీ అక్రమంగా గెలిచిందని, సుమారు 100 స్థానాల్లో తారుమారు చేసినట్లు ఆమె పేర్కొన్నారు. ఈ గెలుపు అనైతికమని వాదిస్తూ, పదవి నుంచి వైదొలగడానికి ఆమె నిరాకరించారు.
అయితే గవర్నర్ ప్రస్తుత ప్రభుత్వాన్ని రద్దు చేస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. మే 8న బీజేపీ తన శాసనసభా పక్ష నేతను (ముఖ్యమంత్రి అభ్యర్థిని) ఎన్నుకోనుంది. మే 9న పశ్చిమ బెంగాల్ చరిత్రలో తొలిసారిగా బీజేపీ ప్రభుత్వం అధికారికంగా కొలువుదీరనుంది. గవర్నర్ తీసుకున్న ఈ నిర్ణయం బెంగాల్ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన కొత్త ప్రభుత్వానికి బాధ్యతలు అప్పగించే గవర్నర్ తీసుకున్న ఈ చర్య రాజ్యాంగపరంగా అత్యంత కీలకంగా మారింది.
ALso Read: వాహనదారులకు గట్టిదెబ్బ..పెండింగ్ చలాన్లు 45 రోజుల్లో చెల్లించకపోతే లైసెన్స్ రద్దు!
Also Read: భారత క్రికెట్లో విషాదం..విరాట్ కోహ్లీ టీమ్మేట్ అమన్ప్రీత్ గిల్ మృతి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
TVK Vijay Oath: సీఎంగా విజయ్ ప్రమాణస్వీకారంపై వీడని సందిగ్ధత..కుర్చీలాటలో గెలుపు ఎవరిది?
Eragudi North, Tamil Nadu:TVK Vijay Oath Ceremony: తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత విజయ్ నేడు రాజ్భవన్లో గవర్నర్ రాజేంద్రను మరోసారి కలిశారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు తమకు అవకాశం ఇవ్వాలని ఆయన ఈ సందర్భంగా అభ్యర్థించారు. ఈ క్రమంలో టీవీకే విజయ్ను గవర్నర్ కొన్ని ప్రశ్నలను సంధించినట్లు సమాచారం.Suvendu Adhikari PA: బెంగాల్ కాబోయే ముఖ్యమంత్రి పీఏ హత్య..చివరి వీడియో వైరల్..
Hyderabad, Telangana:Suvendu Adhikari PA Chandra Shot Dead: ఇటీవలే జరిగిన పశ్చిమబెంగాల్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే బీజేపీ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా పరిగణిస్తున్న సువేందు అధికారి వ్యక్తిగత సిబ్బందిలోని చంద్రనాథ్ రథ్ హత్యకు గురయ్యాడు. అందుకు సంబంధించిన ఆయన చివరి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.Pending Challan News: వాహనదారులకు గట్టిదెబ్బ..పెండింగ్ చలాన్లు 45 రోజుల్లో చెల్లించకపోతే లైసెన్స్ రద్దు!
New Delhi, Delhi:Delhi Pending Challan News: ఢిల్లీలో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి రేఖా గుప్తా ప్రభుత్వం అత్యంత కఠినమైన, పారదర్శకమైన డిజిటల్ చలాన్ వ్యవస్థను అమలులోకి తెచ్చింది. వాహనదారుల్లో క్రమశిక్షణ పెంచడం, రోడ్డు ప్రమాదాలను అరికట్టడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేఖా గుప్తా ఏర్పాటు ఈ మార్పులను తీసుకొచ్చారు.
ఈ కొత్త నిబంధనల పూర్తి వివరాలు ఇవే..
చలాన్ జారీ అయినప్పటి నుండి వాహనదారులకు 45 రోజుల సమయం ఉంటుంది. ఈ లోపు వారు జరిమానా చెల్లించాలి. లేదా చలాన్ను సవాలు చేస్తూ డిజిటల్ పోర్టల్లో అభ్యర్థన పెట్టుకోవాలి. ఒకవేళ 45 రోజుల్లో ఎలాంటి స్పందన లేకపోతే, సదరు వ్యక్తి నేరాన్ని అంగీకరించినట్లుగా భావించి తదుపరి చర్యలు తీసుకుంటారు.
మరోవైపు గతంలో లాగా నేరుగా కోర్టును ఆశ్రయించడం ఇక కుదరదు. ముందుగా ఆన్లైన్ ఫిర్యాదుల పోర్టల్లో సమస్యను విన్నవించుకోవాలి. ఒకవేళ కోర్టులో చలాన్ను సవాలు చేయాలనుకుంటే, మొత్తంలో 50% ముందుగానే డిపాజిట్ చేయాలి. దీనివల్ల అనవసరమైన కేసులు తగ్గి, విచారణ వేగవంతమవుతుంది.
నిబంధనలు అతిక్రమిస్తే 'బ్లాక్ లిస్ట్'
నిర్ణీత గడువులో చెల్లుబాటు కాకుండా వారిపై కఠినమైన ఆంక్షలు విధించనున్నారు. వాహన నియామకం, ట్యాక్స్ పేమెంట్లు, డ్రైవింగ్ లైసెన్స్ పునరుద్ధరణ వంటి సేవలను నిలిపివేస్తారు. బకాయిలు ఎక్కువగా ఉంటే వాహనాన్ని అమ్మకాన్ని నిలిపేసే విధంగా.. ఫ్లాగ్ రైజ్ చేయడంతో పాటు, అధికారులు వాహనాన్ని స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది.
పదేపదే తప్పు చేస్తే లైసెన్స్ రద్దు
ఏడాదిలో 5 లేదా అంతకంటే ఎక్కువ సార్లు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే, వారిని తీవ్రమైన నేరస్థులుగా పరిగణిస్తారు. అలాంటి వారికి డ్రైవింగ్ లైసెన్స్ను శాశ్వతంగా రద్దు చేసే అధికారం ఉంటుంది. ఇకపై అంతా ఆటోమేటెడ్ వ్యవస్థే. కెమెరాల ద్వారా రికార్డైన ఉల్లంఘనలకు 3 రోజుల్లో ఈ-చలాన్, 15 రోజుల్లో ఫిజికల్గా నోటీసులు అందుతాయి. మిస్ కాకుండా ఉండాలంటే మొబైల్ నంబర్ నోటీసు, అడ్రస్ అప్డేట్ చేసుకోవాలని అధికారులు సూచించారు.
Also Read: గుడ్న్యూస్ చెప్పిన సూర్యకుమార్ యాదవ్..టీమ్ఇండియా కెప్టెన్కు తండ్రిగా ప్రమోషన్!
Also Read: పవర్స్టార్ ఫ్యాన్స్కు గుడ్న్యూస్..పవన్ కోసం నాని సినిమా పక్కనపెట్టిన సుదీప్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Suryakumar Yadav Baby: గుడ్న్యూస్ చెప్పిన క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్..టీమ్ఇండియా టీ20 కెప్టెన్కు తండ్రిగా ప్రమోషన్!
Hyderabad, Telangana:Suryakumar Yadav Baby Girl: భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ దంపతులు శుభవార్త చెప్పారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్కు ముంబై ఇండియన్స్కు చెందిన ఈ స్టార్ బ్యాటర్ తుదిజట్టు నుంచి పక్కకి తప్పుకోవడం పట్ల పెద్ద చర్చ జరిగింది. ఈ క్రమంలో ఆయన భార్య దేవిషా శెట్టిలకు పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిందని తెలిసి ముంబై ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. తన కుటుంబ అవసరాల కోసం సూర్యకుమార్ రాబోయే మ్యాచ్ నుంచి వైదొలగినట్లు తెలియడంతో ఫ్యాన్స్కు క్లారిటీ వచ్చింది.
సూర్యకుమార్ కెరీర్ పరంగా చెప్పాలంటే 2026 ఎంతో గొప్పగా సాగింది. ఆయన కెప్టెన్సీలో టీమ్ఇండియా జట్టు టీ20 ప్రపంచకప్ లో విజేతగా నిలవగా.. ఇప్పుడు ఆయన భార్య ఆడబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో సూర్యకుమార్ యాదవ్ ఆనందం రెట్టింపు అయ్యింది. మరోవైపు ఇండియన్ ప్రీమియర్ లీగ్లో సూర్యకుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్న ముంబై ఇండియన్స్ ప్లేఆఫ్స్ రేసులో అతికష్టం మీద సాగుతోంది. 10 మ్యాచ్ల తర్వాత కేవలం ఆరు పాయింట్లతో పట్టికలో తొమ్మిదో స్థానంలో ముంబై ఇండియన్స్ నిలిచింది. ఈ టీమ్ ప్లేఆఫ్స్కు చేరాలంటే ఆడే ఇకపై లీగ్లో ఆడాల్సిన ప్రతి మ్యాచ్ తప్పక గెలవడంతో పాటు నెట్ రన్రేట్ కూడా మెరుగ్గా ఉండాల్సిన అవసరం ఉంది.
అతని వ్యక్తిగత ఫామ్ ఏమాత్రం సంతృప్తికరంగా లేనప్పటికీ.. ఈ ఆటగాడికి 2026 ఏడాది అదృష్టాన్ని తెచ్చిపెట్టింది. ఎందుకంటే, దాదాపు రెండు నెలల క్రితం మార్చి 8న అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్లో న్యూజిలాండ్ను 96 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించి, అతను కెప్టెన్గా వ్యవహరించి భారత్కు 2026 టీ20 ప్రపంచ కప్ టైటిల్ను అందించాడు.
ఐపీఎల్ 2026లో తిరిగి ఫామ్లోకి రావాలని సూర్యకుమార్ ఆశిస్తున్నాడు. ఇప్పటివరకు జరిగిన 10 మ్యాచ్లలో అతను 19.50 సగటుతో, 145.52 స్ట్రైక్ రేట్తో కేవలం 195 పరుగులు మాత్రమే చేయగలిగాడు.
ఈ ఐపీఎల్ సీజన్లో ఆరోగ్య సమస్యల కారణంగా రెండు మ్యాచ్లకు ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా దూరమవ్వగా.. ఇప్పుడు సూర్య కుమార్ యాదవ్ కూడా ఆర్సీబీతో మ్యాచ్లో తప్పుకోవడంతో జట్టుకు జస్ప్రీత్ బుమ్రా లేదా రోహిత్ శర్మ కెప్టెన్సీ వ్యవహరించే అవకాశం ఉంది.
Also Read: ముంబై ఇండియన్స్ జట్టుకు భారీ ఝలక్..ఆర్సీబీతో మ్యాచ్కు ఇద్దరు స్టార్ ఆటగాళ్లు దూరం!
Also Read: భారత క్రికెట్లో విషాదం..విరాట్ కోహ్లీ టీమ్మేట్ అమన్ప్రీత్ గిల్ మృతి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
SVSN Varma Resign: ఇన్చార్జ్ పదవి తొలగింపు.. టీడీపీకి పిఠాపురం వర్మ రాజీనామా?
Pithapuram, Andhra Pradesh:Pithapuram Politics: ఆంధ్రప్రదేశ్లో అనూహ్య పరిణామాలు జరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఉన్నా కూడా పిఠాపురం నియోజకవర్గం ఇన్చార్జ్ ఎస్వీఎస్ఎన్ వర్మకు గుర్తింపు దక్కడం లేదు. వరుస అవమానాలు జరుగుతున్న నేపథ్యంలో అతడు తీవ్ర మనస్తాపానికి గురవుతున్నారు. తాజాగా టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ పదవి నుంచి తొలగించడంతో వర్మ దిగ్భ్రాంతికి లోనయ్యారు. పార్టీ తీసుకున్న నిర్ణయంతో అతడు భావోద్వేగానికి లోనయి.. కన్నీటి పర్యంతమయ్యారు. పార్టీ అవమానిస్తుండడంతో అతడు తెలుగుదేశం పార్టీని వీడే అవకాశాలు ఉన్నాయని చర్చ జరుగుతోంది.
Also Read: AP Govt Jobs: నిరుద్యోగులకు భారీ గుడ్న్యూస్.. 3,220 ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రకటన
పిఠాపురం బాధ్యతల నుంచి తొలగింపు
2024లో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా టీడీపీ, జనసేన పొత్తు కుదరడంతో పిఠాపురం నియోజకవర్గాన్ని పవన్కల్యాణ్కు దక్కింది. ఎన్నో ఏళ్లుగా అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వర్మను ఏమాత్రం సంప్రదించకుండా జనసేనకు టికెట్ ఇవ్వడంతో తీవ్ర వివాదం రాజుకుంది. ఎన్నికలు ముగిశాక.. కూటమి ప్రభుత్వం ఏర్పడింది. పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన అనంతరం వర్మకు పిఠాపురంలో ప్రాధాన్యం లేకుండాపోయింది. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లయినా వర్మకు ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వలేదు.
Also Read: SRH Vs PBKS Highlights: పంజాబ్ హ్యాట్రిక్ ఓటమి.. అద్భుత విజయంతో టాప్లోకి సన్రైజర
పవన్ కల్యాణ్ కోసం తన సీటును త్యాగం చేసిన ఎస్వీఎస్ఎన్ వర్మకు గౌరవం.. పెద్ద పదవి ఇవ్వాల్సి ఉండగా పట్టించుకోవడం లేదు. సొంత ప్రభుత్వంలో ప్రమోషన్ రావాల్సి ఉండగా.. ఉన్న పదవినే పీకేశారు. పిఠాపురం నియోజకవర్గ ఇన్చార్జ్ పదవి నుంచి టీడీపీ తొలగించడంతో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. నియోజకవర్గంపై నూతన కమిటీ ఏర్పాటు చేస్తూ పార్టీ నిర్ణయం తీసుకోవడంపై వర్మ కలత చెందారు. తనను పదవి నుంచి తొలగించడంతో వర్మ భావోద్వేగానికి లోనయి కన్నీళ్లు పెట్టుకున్నారు. అయితే పార్టీ అధిష్టానం నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానని ప్రకటించారు. కానీ లోలోపల మాత్రం వర్మ తీవ్ర మనోవేదన చెందుతున్నారు. ఈ క్రమంలోనే త్వరలో టీడీపీని వీడే అవకాశం కూడా లేకపోలేదని చర్చ జరుగుతోంది.
పదవి నుంచి తొలగించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. 'తెలుగుదేశం పార్టీ ఏ నిర్ణయం తీసుకున్న దానికి కట్టుబడి ఉన్నా. రకరకాల సమీకరణాలతో మార్పులు జరుగుతుంటాయి. ఫైనల్గా పార్టీ బాగుండాలనేదే చూడాలి. నారా లోకేష్ నాతో మాట్లాడిన తర్వాతే పిఠాపురం టీడీపీలో నూతన కమిటీ ఏర్పాటు నిర్ణయం తీసుకున్నారు. పార్టీలో నాయకులే ఇక్కడ నిర్వహణ చేస్తారు. పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి నేను పూర్తిగా సహకరిస్తా' అని మాజీ ఎమ్మెల్యే వర్మ తెలిపారు.
వరుస అవమానాలు
కూటమి ప్రభుత్వం వచ్చాక వర్మకు ఇంటా బయట ఘోర అవమానాలు జరుగుతున్నాయి. ప్రభుత్వ పరంగా వర్మకు గుర్తింపు లభించకపోగా.. మిత్రపక్షం జనసేన పార్టీ పవన్ కల్యాణ్ను పట్టించుకోవడం లేదు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పర్యటనలో.. ప్రభుత్వ కార్యక్రమాల్లో వర్మకు ప్రాధాన్యం లభించడం లేదు. జనసేన పార్టీ నాయకులు పిఠాపురంలో రెచ్చిపోతున్నారు. ఈ క్రమంలోనే వర్మ పలుమార్లు తన అసంతృప్తిని బహిరంగంగా వ్యక్తం చేశారు. కొన్నిసార్లు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే పొత్తు ధర్మం ప్రకారం టీడీపీ పిఠాపురం నియోజకవర్గాన్ని జనసేన పార్టీకి పూర్తిగా వదిలేసింది. ఈ నేపథ్యంలోనే వర్మకు నియోజకవర్గంలో పట్టించుకోవడం లేదు. వరుస వివాదాల నేపథ్యంలో వర్మను పక్కనపెట్టారు. ఈ క్రమంలో పదవి నుంచి తొలగించగా.. మనస్తాపానికి లోనయిన వర్మ టీడీపీకి రాజీనామా చేస్తారని చర్చ జరుగుతోంది. తన ఉనికి ప్రశ్నార్థకమైన సమయంలో ఆయన కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
OG Part 2 Shooting: పవర్స్టార్ అభిమానులకు గుడ్న్యూస్..పవన్ కోసం నాని సినిమా పక్కపెట్టిన సుదీప్..షూటింగ్ ఎప్పుడంటే?
Hyderabad, Telangana:OG Part 2 Shooting Update: నేచురల్ స్టార్ నాని అభిమానులకు ఇప్పుడు 'ఓజీ' డైరెక్టర్ సుదీప్ ఝలక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. హీరో నాని - సుజీత్ కాంబినేషన్లో అనౌన్స్ అయిన మోస్ట్ అవేటెడ్ మూవీ 'బ్లడీ రోమియో' షూటింగ్ వాయిదా పడింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కడానికి మరికొంత సమయం పట్టేలా ఉంది.
వాయిదాకు కారణం ఏంటి?
ప్రస్తుతం హీరో నాని శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో "ది పారడైజ్" అనే భారీ యాక్షన్ డ్రామాలో నటిస్తున్నారు. 'దసరా' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. క్వాలిటీ విషయంలో మేకర్స్ ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. మొదట 2026 వేసవిలో విడుదల చేయాలనుకున్నారు. కానీ, తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా 2026 ఆగస్టు 21కి వాయిదా పడింది. నాని తన పూర్తి కాల్షీట్లను "ది పారడైజ్" సినిమాకే కేటాయించాల్సి రావడంతో, సుజీత్ సినిమా ఆలస్యమైంది.
'OG 2'పై ఫోకస్
'బ్లడీ రోమియో' షూటింగ్ ప్రారంభానికి 2026 ఆఖరు లేదా 2027 ప్రథమార్థం వరకు సమయం పట్టే అవకాశం ఉంది. దీనితో దర్శకుడు సుజీత్ ఖాళీగా ఉండకుండా తన తదుపరి భారీ ప్రాజెక్ట్ పనుల్లో నిమగ్నమయ్యారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ అవేటెడ్ ఫిలిం 'OG' సీక్వెల్కు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ను సుజీత్ వేగవంతం చేశారని తెలుస్తోంది. 'OG' సినిమాపై ఉన్న క్రేజ్ను దృష్టిలో పెట్టుకుని, సీక్వెల్ను మరింత పవర్ఫుల్ యాక్షన్ ఎలిమెంట్స్తో రూపొందిస్తున్నారు.
పవన్ కళ్యాణ్ ప్రాజెక్ట్ పనులు పూర్తి చేస్తూనే, నాని డేట్స్ దగ్గరకి వచ్చినప్పుడు 'బ్లడీ రోమియో'ను పట్టాలెక్కించేలా సుజీత్ ప్లాన్ చేసుకున్నాడు. మొత్తానికి నాని లైనప్లో మార్పులు జరగడం వల్ల 'బ్లడీ రోమియో' కోసం ఫ్యాన్స్ మరికొన్నాళ్లు నిరీక్షించక తప్పదు. అయితే, 'ది పారడైజ్' నుంచి వస్తున్న అప్డేట్స్ నాని అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నాయి. నాని కెరీర్లోనే ఇది అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా నిలవబోతోంది.
Also Read: భారత క్రికెట్లో విషాదం..విరాట్ కోహ్లీ టీమ్మేట్ అమన్ప్రీత్ గిల్ మృతి..
Also REad: ముంబై ఇండియన్స్ జట్టుకు భారీ ఝలక్..ఆర్సీబీతో మ్యాచ్కు ఇద్దరు స్టార్ ఆటగాళ్లు దూరం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
AP Govt Jobs: నిరుద్యోగులకు భారీ గుడ్న్యూస్.. ఏపీలో 3,220 ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రకటన!
Nuzendla, Andhra Pradesh:AP Govt Job Notification: ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు భారీ శుభవార్త. భారీ ఎత్తున ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ జరగనుంది. రాష్ట్రంలో 3,220 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. విద్యార్థులకు విద్యా బుద్దులు నేర్పే అధ్యాపక పోస్టులను ప్రభుత్వం భారీగా భర్తీ చేయనుంది. రాష్ట్రంలోని విశ్వ విద్యాలయాలతోపాటు ఉన్నత విద్యాసంస్థల్లో అధ్యాపక పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. ఏయే యూనివర్సిటీల్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి? అర్హులు ఎవరు? జీతం ఎంత అనే వివరాలు తెలుసుకుందాం.
రాష్ట్రవ్యాప్తంగా విశ్వ విద్యాలయాలు, సాంకేతిక ఉన్నత విద్యా సంస్థల్లో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను భర్తీ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వర్సిటీల వారీ ఖాళీల వివరాలను వెల్లడిస్తూ ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ ఉత్తర్వులు జారీ చేశారు. గత నోటిఫికేషన్లలోని న్యాయపరమైన చిక్కులు, సాంకేతిక లోపాలను సవరించి, త్వరలోనే కొత్త నోటిఫికేషన్లు జారీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
అత్యధికంగా ఆర్జీయూకేటీలో 660 పోస్టుల భర్తీ చేయనుండగా.. అతి తక్కువగా 63 పోస్టులు ద్రవిడయన్ విశ్వవిద్యాలయంలో భర్తీ చేయనున్నారు. వీటికి సంబంధించి ప్రకటన త్వరలోనే రానున్నాయి. అర్హులు ఎవరు? జీతం ఎంత? తదితర వివరాలు ఆయా విశ్వవిద్యాలయాలతోపాటు ఉన్నత విద్యా శాఖ ప్రకటన విడుదల చేయనుంది. రాష్ట్రంలో ఎక్కడెక్కడ? ఎన్ని ఖాళీలు ఉన్నాయో తెలుసుకుందాం.
ఖాళీల వివరాలు
ఆర్జీయూకేటీ - 660
ఆంధ్ర విశ్వవిద్యాలయం- 523
శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం - 265
శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం- 219
జేఎన్టీయూ -ఎ - 203
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం- 175
వైఎస్సార్ ఆర్కిటెక్చర్ ఫైన్ ఆర్ట్స్ - 138
జేఎన్టీయూ (గురజాడ-విజయనగరం) 138
యోగి వేమన విశ్వవిద్యాలయం - 118
విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం -106
రాయలసీమ విశ్వవిద్యాలయం- 103
శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం - 103
ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం- 99
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ - 99
జేఎన్టీయూ(కె) - 98
కృష్ణా వర్సిటీ - 86
డాక్టర్ అబ్దుల్ హక్ - 63
ద్రవిడ - 24
మొత్తం ఖాళీలు 3,220
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Amanpreet Singh Gill: భారత క్రికెట్లో విషాదం..విరాట్ కోహ్లీ టీమ్మేట్ అమన్ప్రీత్ గిల్ మృతి..
Hyderabad, Telangana:Amanpreet Singh Gill Death: భారత క్రికెట్ రంగంలో తీవ్ర విషాదం నెలకొంది. భారత అండర్ 19 జట్టు మాజీ ఆటగాడు, మీడియం పేసర్ అమన్ప్రీత్ సింగ్ గిల్ (36) బుధవారం చండీగఢ్లో కన్నుమూశారు. ఇంత చిన్న వయసులో ఆయన మరణించడం క్రీడలోకాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన మరణానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
కోహ్లీ, యువరాజ్లకు సహచరుడు
అమన్ ప్రీత్ సింగ్ గిల్ తన కెరీర్ ఆరంభంలో భారత స్టార్ క్రికెటర్లతో డ్రెస్సింగ్ రూమ్ను షేర్ చేసుకున్నారు. 2007లో విరాట్ కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా అండర్-19లో సభ్యుడిగా ఉండేవాడు. రవీంద్ర జడేజా, మనీష్ పాండే వంటి వారితో కలిసి ఆయన ఆడారు. దేశవాళి క్రికెట్లో పంజాబ్ జట్టు తరుపున ఆడుతున్న సమయంలో దిగ్గజా ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ తో కలిసి డ్రెస్సింగ్ రూమ్ ను అమన్ ప్రీత్ సింగ్ పంచుకున్నారు. అమన్ ప్రీత్ సింగ్ అంతర్జాతీయ స్థాయికి చేరుకోకపోయినా, దేశవాళీ క్రికెట్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
Shocked and saddened to hear about Amanpreet Gill’s passing. Sending prayers and strength to his family and loved ones. Rest in peace. Om Shanti 🙏
— Virat Kohli (@imVkohli) May 7, 2026
అమన్ ప్రీత్ సింగ్ చేసేవాళ్ల క్రికెట్లో పంజాబ్ జట్టు తరఫున 2006 నుంచి 2008 మధ్యలో ఆరు ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడి 11 వికెట్లను పడగొట్టారు. ఆ తర్వాత ఇండియన్ ప్రీమియర్ లీగ్ తొలి సీజన్లో అప్పటి కింగ్స్ 11 పంజాబ్.. ప్రస్తుత పంజాబ్ కింగ్స్ జట్టులో సభ్యుడిగా ఉన్నారు. ఆటగాడిగా రిటైర్ అయిన తర్వాత పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ లో సీనియర్ సెలక్షన్ కమిటీ సభ్యుడిగా కూడా సేవలందించారు.
Deeply saddened to hear about Amanpreet Singh Gill’s passing. Shared the dressing room in our early days, he was a quiet, hardworking cricketer who loved the game. My heartfelt condolences to his family and loved ones. Rest in peace 🙏🏻 Om Shanti#AmanpreetSinghGill@pcacricket
— Yuvraj Singh (@YUVSTRONG12) May 6, 2026
అమన్ ప్రీత్ సింగ్ గిల్ మరణం వార్త తెలియగానే విరాట్ కోహ్లీ, యువరాజ్ సింగ్ సోషల్ మీడియా వేదికగా తమ సంతాపాన్ని ప్రకటించారు. "పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ (PCA) అమన్ ప్రీత్ మరణాన్ని ధ్రువీకరిస్తూ తాజాగా ఒక లేక విడుదల చేసింది. పంజాబ్ క్రికెట్ ఆటగాడిగా, సెలక్టర్గా అమన్ ప్రీత్ సింగ్ చేసిన సేవలు మరువలేనివి. ఆయన అంకితభావం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం" అని పేర్కొంది.
Also Read: RCB Vs MI 2026: ముంబై ఇండియన్స్ జట్టుకు భారీ ఝలక్..ఆర్సీబీతో మ్యాచ్కు ఇద్దరు స్టార్ ఆటగాళ్లు దూరం!
Also Read: CM Vijay Salary: రూ.600 కోట్ల ఆస్తి.. సీఎంగా టీవీకే విజయ్ నెలజీతం ఎంతో తెలుసా? ఎంత నష్టమో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Cobra Video: ప్రకృతి వింత.. ఆవు పాలు తాగుతున్న కింగ్ కోబ్రా.. షాక్ అవుతున్న నెటిజన్లు!
Hyderabad, Telangana:Cobra Drinking Cow Milk Viral Video: ప్రకృతిలో కొన్ని సంఘటనలు చూసినప్పుడు మన కళ్ళను మనమే నమ్మలేకపోతూ ఉంటాం.. సాధారణంగా పాము కనిపిస్తే మనుషులైన.. జంతువులైన భయంతో ఆ మెడ దూరం పరిగెడతాయి. ఇక క్రూరమైన విష సర్పం ఎదురైతే ప్రాణభయంతో వణికిపోవడం సర్వసాధారణమే.. కానీ సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్న ఒక వీడియో మాత్రం ఎందుకు భిన్నంగా కనిపిస్తూ ఉంది. ఒక ప్రమాదకరమైన కింగ్ కోబ్రా.. పచ్చిక మైదానంలో మేతమేస్తున్న ఆవు వద్దకు చేరి నేరుగా పొదుగు నుంచే పాలు తాగిన అరుదైన దృశ్యాలు అందర్నీ ఆశ్చర్యపోయేలా చేస్తున్నాయి..
ఒక మైదానంలో ఆవు ప్రశాంతంగా మేస్తోంది.. అదే సమయంలో అక్కడికి ఒక భారీ నాగుపాము వచ్చింది.. సాధారణంగా పామును చూసినప్పుడు పశువులు భయపడి అరుస్తూ ఉంటాయి.. లేదంటే అక్కడ నుంచి తప్పించుకొని వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ ఇక్కడ ఆవు మాత్రం భయపడకుండా తన పని తాను చేసుకుంటుండగా.. ఆ నాకు పాము మెల్లగా ఆవు వెనక కాళ్ల మధ్యలోకి వెళ్లి పొదుగు పట్టుకొని పాలు తాగడం మొదలుపెట్టింది..
ఈ దృశ్యంలో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. పాము ఆవును ఏమాత్రం కాటు వేయడానికి ప్రయత్నించలేదు.. అటు ఆవు కూడా పాము తన పాలు తాగుతున్నప్పటికీ ఎంతో సాధారణంగా నిలబడి మేతమేయడం మీరు చూడొచ్చు. సాధారణంగా నాగుపాము కాటు వేస్తే నిమిషాల్లో ప్రాణాలు పోతూ ఉంటాయి.. కానీ ఇక్కడ ఆ రెండు మూగజీవుల మధ్య ఒక వింతైన అనుబంధం కనిపిస్తుంది. ఈ ఆరుదైన దృశ్యాన్ని అక్కడే ఉన్న కొంతమంది తమ స్మార్ట్ ఫోన్స్ ద్వారా చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతే అప్పటినుంచి వైరల్ అవ్వడం ప్రారంభమైంది..
Also Read: Video Viral: సాయం ముసుగులో అరాచకం.. యువతి ప్రైవేటు పార్ట్ మీద చెయ్యి వేసి మరీ.!. వీడియోపై దుమారం..
ఈ వీడియో పోస్ట్ చేసిన కొద్ది గంటల్లోనే లక్షలాది వ్యూస్ తో పాటు వేళలో కామెంట్ లతో నెట్టింట వైరల్ గా మారింది. దీనిపై సోషల్ మీడియా వినియోగదారులు రకరకాలుగా స్పందిస్తూ వస్తున్నారు. సాధారణంగా రెండు మూగ జీవుల మధ్య ఉన్న ప్రేమ అంతో ఇంతో కాదని కొంతమంది కామెంట్స్ చేస్తుంటే.. మరి కొంతమంది ప్రకృతిలో ఇలాంటి అద్భుతాలు అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయని అభిప్రాయపడుతున్నారు. పురాణాల్లో పాములకు పాలు పోసే ఆచారాల గురించి విన్నాం కానీ ఇలా ప్రత్యక్షంగా ఆవు పాలు తాగడం చూడడం ఇదే మొదటిసారి అని కామెంట్స్ కూడా చేస్తున్నారు.
Also Read: Video Viral: సాయం ముసుగులో అరాచకం.. యువతి ప్రైవేటు పార్ట్ మీద చెయ్యి వేసి మరీ.!. వీడియోపై దుమారం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
