icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

PM Modi Melody Toffee: PM Modi Gifts Melody to Italian Prime Minister What Exactly Makes This Sweet So Special telugu news

BBhoomi48m ago
Lakshmapur, Telangana:

PM Modi Melody Toffee: సాధారణంగా దేశాధినేతల విదేశీ పర్యటనలు అంటే రొటీన్ రాజకీయాలు.. రక్షణ ఒప్పందాలు.. బిజినెస్ డీల్స్.. ఇవే గుర్తొస్తాయి. ఆ సమయంలో ఇచ్చిపుచ్చుకునే బహుమతులు కూడా అంతే ఖరీదైనవిగా ఉంటాయి. కానీ.. తాజాగా భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇటలీ పర్యటనలో ఇటలీ ప్రధాని జార్జియా మెలోనికి ఇచ్చిన ఒక చిన్న గిఫ్ట్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఆ గిఫ్ట్ మరేదో కాదు.. మన దేశంలో దశాబ్దాలుగా పిల్లలు, పెద్దలు ఎంతో ఇష్టంగా తినే ఒక రూపాయి మెలోడీ చాక్లెట్  ప్యాకెట్.

ద్వైపాక్షిక పర్యటన నిమిత్తం రోమ్ చేరుకున్న మోదీ.. మే 20న మెలోనితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఆమెకు ఈ తియ్యటి సర్ప్రైజ్ ఇచ్చారు. ప్రధాని మోదీ ఇచ్చిన ఈ క్రేజీ గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన జార్జియా మెలోని.. ఆ చాక్లెట్ ప్యాకెట్ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ థాంక్స్ చెప్పారు. దాంతో అటు ఇటలీలోనూ.. ఇటు ఇండియాలోనూ అసలు ఈ మెలోడీ చాక్లెట్ కథేంటి? ఒక సాధారణ చాక్లెట్ అంతర్జాతీయ దౌత్య నీతిలో ఎలా చోటు సంపాదించుకుంది? అనే చర్చ మొదలైంది. ఆ ఆసక్తికరమైన వివరాలు ఇప్పుడు చూద్దాం.

అసలు ఈ  మెలోడీ టాఫీ వెనకున్న కథేంటి?
ఇటలీ ప్రధాని మెలోని, భారత ప్రధాని మోదీల మధ్య మంచి ఆత్మీయ అనుబంధం ఉంది. వీరిద్దరూ అంతర్జాతీయ వేదికలపై కలిసినప్పుడల్లా నెటిజన్లు సోషల్ మీడియాలో  మెలోడీ  అనే హాష్ ట్యాగ్‌ను తెగ ట్రెండ్ చేస్తుంటారు. జార్జియా మెలోని పేరులోని మొదటి నాలుగు అక్షరాలు మెలో, నరేంద్ర మోదీ పేరులోని చివరి రెండు అక్షరాలు  డీ కలిపితే ఈ  మెలోడీ  అనే పదం పుట్టింది. ఇంగ్లీషులో మెలోడీ అంటేనే మాధుర్యం లేదా మధురమైన సంగీతం అని అర్థం. తమ ఇద్దరి కెమిస్ట్రీపై నెటిజన్లు చేసే ఈ అల్లరిని, మీమ్స్‌ను వీరిద్దరూ ఎప్పుడూ సీరియస్‌గా తీసుకోలేదు. పైగా చూసి సరదాగా నవ్వుకుంటారు. అందుకే ఈసారి ఏకంగా ప్రధాని మోదీనే స్వయంగా మెలోడీ టాఫీ ప్యాకెట్ పట్టుకెళ్లి ఇవ్వడంతో ఆ దౌత్య సంబంధాలకు మరింత మాధుర్యం అబ్బినట్లయింది.

రూ. 90,000 కోట్ల  పార్లే  సామ్రాజ్యం..:
ఈ మెలోడీ చాక్లెట్‌ను తయారు చేసేది మరెవరో కాదు.. మనందరికీ బాగా తెలిసిన స్వదేశీ సంస్థ  పార్లే ప్రొడక్ట్స్ . దేశ స్వాతంత్ర్యానికి ముందే, భారతదేశ స్వదేశీ ఉద్యమ స్ఫూర్తితో 1929లో ముంబైలోని విలే పార్లేలో మోహన్‌లాల్ దయాల్ చౌహాన్ ఈ సంస్థను స్థాపించారు. ప్రస్తుతం విజయ్ చౌహాన్.. ఆయన కుటుంబం ఈ కంపెనీ బాధ్యతలను చూసుకుంటున్నారు. పార్లే కుటుంబం కాలక్రమేణా విడిపోయినప్పటికీ.. మిగిలిన బ్రాండ్లు వేర్వేరు సభ్యుల చేతుల్లో ఉన్నాయి. ఉదాహరణకు ఫ్రూటీ, ఆపీ వంటి డ్రింక్స్ ఉన్న  పార్లే ఆగ్రో ను ప్రకాష్ చౌహాన్, ఆయన కుమార్తెలు షానా, అలీషా, నాడియా నడుపుతుండగా.. ప్రసిద్ధ వాటర్ బాటిల్ బ్రాండ్  బిస్లరీ ఇంటర్నేషనల్‌ ను రమేష్ చౌహాన్ చూసుకుంటున్నారు. పార్లే ప్రొడక్ట్స్ స్టాక్ మార్కెట్లో లిస్ట్ కాకపోయినప్పటికీ.. దీని మార్కెట్ విలువ దాదాపు 8 నుండి 10 బిలియన్ డాలర్లు  మన దేశీ కరెన్సీలో సుమారు రూ.80,000 కోట్ల నుండి రూ. 90,000 కోట్లు ఉంటుందని అంచనా.

 

 మెలోడీ ఇత్నీ చాక్లెటీ క్యూ హై? .. మార్కెట్‌ను షేక్ చేసిన మాస్టర్ స్ట్రోక్:
పార్లే సంస్థ 1983లో మెలోడీ టాఫీని మార్కెట్లోకి తీసుకొచ్చింది. అప్పట్లోనే చాక్లెట్ మార్కెట్‌లో రారాజుగా ఉన్న క్యాడ్‌బరీ వంటి పెద్ద బ్రాండ్‌లను ఢీకొట్టడం పార్లేకు అంత సులువు కాలేదు. ఎందుకంటే క్యాడ్‌బరీ అప్పట్లో ప్రీమియం బ్రాండ్. వారి చాక్లెట్ బాక్స్‌లు రూ.10 నుండి రూ.100 వరకు ఉండేవి. సామాన్యులు వాటిని కొనాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించేవారు. సరిగ్గా ఇక్కడే పార్లే ఒక అద్భుతమైన బిజినెస్ స్ట్రాటజీని వాడింది. సాధారణ చాక్లెట్ బార్స్‌లా కాకుండా.. బయట నమలడానికి వీలుగా ఉండే క్యారమెల్ లేయర్, లోపల రిచ్ చాక్లెట్ సిరప్   ఉండేలా ఈ టాఫీని డిజైన్ చేసింది. అన్నింటికీ మించి.. దీని ధరను కేవలం 50 పైసలు, రూపాయికే అందుబాటులో ఉంచింది.

దీనికి తోడు వారు వాడిన అడ్వర్టైజ్‌మెంట్ స్ట్రాటజీ ఒక మైండ్ బ్లోయింగ్ మాస్టర్ స్ట్రోక్ అని చెప్పాలి.  మెలోడీ ఇత్నా చాక్లెటీ క్యూ హై?  (మెలోడీ ఎందుకు ఇంత చాక్లెటీగా ఉంటుంది?) అనే ఒక ప్రశ్నను జనాల మైండ్‌లోకి వదిలారు. దానికి సమాధానంగా  మెలోడీ ఖావో ఖుద్ జాన్ జావో  (మెలోడీ తినండి, మీకే తెలుస్తుంది) అంటూ సరికొత్త ట్యాగ్‌లైన్‌తో టీవీ యాడ్స్ వదిలారు.

Also Read:  రూ.2లక్షల డౌన్‌పేమెంట్‌ కట్టండి.. తర్వాత EMI కట్టుకోండి

అప్పట్లో టీవీలకు విపరీతమైన డిమాండ్ ఉన్న కాలం కావడంతో.. ఇండియాలో క్రికెట్ మ్యాచ్‌లు జరుగుతున్నప్పుడు, పాపులర్ టీవీ సీరియల్స్, పిల్లల కార్టూన్ షోల మధ్యలో ఈ యాడ్‌ను విపరీతంగా టెలికాస్ట్ చేశారు. దాంతో ప్రతి ఒక్కరి నోటా ఈ డైలాగ్ నానేది. ప్రశ్న అడిగి వదిలేయడం వల్ల జనాలు క్యూరియాసిటీతో ఈ చాక్లెట్‌ను కొని రుచి చూడటం మొదలుపెట్టారు. అలా అది ఒక తరం బాల్య జ్ఞాపకంగా మారిపోయింది.

పల్లెటూరి కిరాణా కొట్టు వరకు తీసుకెళ్లిన నెట్‌వర్క్:
కేవలం ప్రకటనలు మాత్రమే కాదు, పార్లేకు ఉన్న బలమైన డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్ కూడా మెలోడీ విజయానికి ప్రధాన కారణమని చెప్పాలి. పార్లే-జి బిస్కెట్ల పుణ్యమా అని అప్పటికే దేశంలోని మారుమూల పల్లెటూరి కిరాణా దుకాణం వరకు పార్లేకు గట్టి పట్టుంది. అదే దారిలో మెలోడీ చాక్లెట్లను కూడా గ్రామీణ మార్కెట్లలోకి సులభంగా తీసుకెళ్లగలిగారు. నాడు 90 కిడ్స్ నుంచి నేటి తరం వరకు అందరి చేతుల్లోనూ ఆడుతున్న ఈ రూపాయి చాక్లెట్.. ఇప్పుడు ఏకంగా ఇద్దరు ప్రపంచ దేశాల అధినేతల మధ్య దౌత్య వేదికపైకి చేరి సరికొత్త టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచింది. ఇది మెలోడీ చాక్లెట్ వెనుకున్న కథ. 

Also Read: మిడిల్ క్లాస్ జేబుకు చిల్లు పడకుండా.. రూ. 10లక్షల లోపే బెస్ట్ ఫ్యామిలీ కార్లు

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

 

0
0
Report

Bank Strike 2026: బ్యాంకు కస్టమర్లకు విజ్ఞప్తి..వరుసగా 4 రోజులు ఆ బ్యాంకు బంద్..ఈ పనులుంటే వెంటనే పూర్తి చేసుకోండి!

Hyderabad, Telangana:

SBI Bank Strike 2026: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఖాతాదారులకు ముఖ్య గమనిక. ఈ నెల (మే) చివరి వారంలో వరుసగా నాలుగు రోజుల పాటు బ్యాంకింగ్ సేవలకు అంతరాయం కలిగే అవకాశం ఉంది. ఎస్‌బీఐ ఉద్యోగుల సంఘం రెండు రోజుల సమ్మెకు పిలుపునివ్వడం, దానికి ముందు వీకెండ్ సెలవులు రావడమే ఇందుకు కారణం. దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు 50 కోట్ల మంది ఎస్‌బీఐ వినియోగదారులు ఈ విషయాన్ని గమనించి తమ అత్యవసర బ్యాంకు పనులను ముందే ప్లాన్ చేసుకోవడం మంచిది.

వరుస సెలవుల షెడ్యూల్ ఎలా?
మే 23 (నాలుగో శనివారం): బ్యాంకులకు అధికారిక సెలవు.
మే 24 (ఆదివారం): జనరల్ హాలిడే.
మే 25 (సోమవారం): ఎస్‌బీఐ ఉద్యోగుల సమ్మె.
మే 26 (మంగళవారం): ఎస్‌బీఐ ఉద్యోగుల సమ్మె.

ఈ క్రమంలో మే 23 నుండి మే 26 వరకు వరుసగా నాలుగు రోజుల పాటు ఎస్‌బీఐ బ్రాంచ్‌లు మూతపడనున్నాయి.

ప్రభావితమయ్యే సేవలు ఇవే..
బ్యాంకు శాఖలు పూర్తి స్థాయిలో మూతపడటం వల్ల కింది సేవలకు తీవ్ర అంతరాయం కలగవచ్చు. కౌంటర్లలో నగదు డిపాజిట్లు, విత్‌డ్రాయల్స్, చెక్కుల క్లియరెన్స్ ప్రక్రియ, బ్యాంక్ డ్రాఫ్ట్‌ల (DD) జారీతో పాటు లోన్లకు సంబంధించిన భౌతిక పత్రాల పరిశీలన, ఇతర ప్రాసెసింగ్ పనులు నిలిపోనున్నాయి.

ఈ నాలుగు రోజులు బ్యాంకు బ్రాంచ్‌లు పనిచేయకపోయినప్పటికీ.. ఏటీఎంలు (ATMs), ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ (UPI) వంటి డిజిటల్ సేవలు యథావిధిగా అందుబాటులో ఉంటాయి. అయితే, బ్యాకెండ్ సిబ్బంది లేకపోవడం వల్ల కొన్ని రకాల ఆన్‌లైన్ లావాదేవీల ప్రాసెసింగ్‌లో స్వల్ప జాప్యం జరగొచ్చు.

ఎస్‌బీఐ ఉద్యోగుల ప్రధాన డిమాండ్లు ఏమిటి?
సిబ్బంది కొరత, పెన్షన్లు, నియామకాలతో పాటు మొత్తం 16 డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఎస్‌బీఐ ఉద్యోగుల సంఘం ఈ సమ్మెకు పిలుపునిచ్చింది. వాటిలో ముఖ్యమైన వాటిని ఇప్పుడు ప్రస్తావిస్తున్నాం. 

సిబ్బంది నియామకాలు: ఎంట్రీ-లెవల్ ఉద్యోగాలు, సహాయక సిబ్బంది, సెక్యూరిటీ గార్డుల నియామకాలను తక్షణమే పెంచడం.

వేతన వ్యత్యాసాలు: ఉద్యోగుల మధ్య ఉన్న వేతన వ్యత్యాసాలను తొలగించి, మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించడం.

పెన్షన్ నిబంధనల మార్పు: నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) కింద మెరుగైన ప్రయోజనాలు అందించడం, పెన్షన్ లెక్కింపు పద్ధతులను మార్చడం.

5 వర్కింగ్ డేస్ డిమాండ్!
ఇవి కేవలం ఎస్‌బీఐ ఉద్యోగుల డిమాండ్లు అయినప్పటికీ.. బ్యాంకింగ్ రంగం మొత్తంలో "వారానికి 5 రోజుల పని దినాల" (5-Day Week) విధానాన్ని తీసుకురావాలనే డిమాండ్ మరింత బలంగా వినిపిస్తోంది. ఆర్‌బీఐ, స్టాక్ మార్కెట్, కమోడిటీ మార్కెట్లతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలన్నీ శని, ఆదివారాలు పూర్తిగా మూతపడుతుంటే.. బ్యాంకులకు మాత్రం నెలకు రెండు శనివారాలు ఎందుకు మినహాయింపు ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.

Also Read: ఏపీ నుంచి రాజ్యసభకు అన్నామలై..జనసేన, టీడీపీ లిస్టు కూడా రెడీ..రేపే నోటిఫికేషన్?!

Also REad: జూన్ 30 వరకు స్కూళ్లకు వేసవి సెలవులు..పండగ చేసుకుంటున్న విద్యార్థులు..ఎక్కడంటే?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

 

0
0
Report
Advertisement

AP Rajya Sabha Elections: ఏపీ నుంచి రాజ్యసభకు అన్నామలై..జనసేన, టీడీపీ లిస్టు కూడా రెడీ..రేపే నోటిఫికేషన్?!

Nuzendla, Andhra Pradesh:

AP Rajya Sabha Nominations 2026: ఆంధ్రప్రదేశ్ నుంచి ఖాళీ అవుతున్న నాలుగు రాజ్యసభ స్థానాలకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ తుది దశకు చేరింది. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి సామాజిక, ప్రాంతీయ సమీకరణాల ఆధారంగా అభ్యర్థులను దాదాపు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. రేపు (గురువారం) రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ జాబితా ఆసక్తి రేపుతోంది.

బీజేపీ నుంచి అన్నామలై ఖరారు?
ఎన్డీఏ కూటమి ఒప్పందంలో భాగంగా ఒక స్థానాన్ని దక్కించుకున్న బీజేపీ.. తమ అభ్యర్థిగా తమిళనాడు బీజేపీ ఫైర్ బ్రాండ్ నేత కె.అన్నామలై పేరును ఖరారు చేసినట్లు సమాచారం. ఈ విషయమై ఇప్పటికే అధిష్ఠానం నుంచి కూటమిలోని భాగస్వామ్య పక్షాలకు స్పష్టమైన సమాచారం అందినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

టీడీపీ రేసులో ఉన్న సీనియర్లు వీరే..
మిగిలిన మూడు స్థానాల్లో టీడీపీ, జనసేనలు సామాజిక సమీకరణాలకు పెద్దపీట వేయనున్నాయి. టీడీపీ తరఫున పలువురి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ప్రస్తుతం రాజ్యసభలో టీడీపీ తరఫన సిట్టింగ్ ఎంపీగా ఉన్న సానా సతీశ్‌కు మరోసారి రెన్యూవల్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఒకవేళ ఎస్సీ వర్గానికి ప్రాతినిధ్యం ఇవ్వాలనుకుంటే టీడీపీ తరఫున వర్ల రామయ్యను ఎంపిక చేసే అవకాశం ఉంది.  అలాగే బీసీ వర్గానికి ఇవ్వాలనుకుంటే సీనియర్ నేత యనమల రామకృష్ణుడు పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. 

అయితే అదే విధంగా భాష్యం విద్యాసంస్థల అధినేత భాష్యం రామకృష్ణ కూడా టీడీపీ తరఫున రాజ్యసభ సీటు కోసం గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం అందుతోంది. ఒకవేళ ముస్లిం మైనారిటీ కోటాలో అవకాశం ఇవ్వాలని భావిస్తే.. ప్రస్తుతం ప్రభుత్వ మైనార్టీ వ్యవహారాల సలహాదారుగా ఉన్న ఎంఏ షరీఫ్ పేరును పరిశీలించవచ్చు.

జనసేన నుంచి ఊహించని ట్విస్ట్!
జనసేన కోటా స్థానానికి సంబంధించి ఇప్పటివరకు పార్టీ సీనియర్ నేత లింగమనేని రమేశ్ పేరు బలంగా వినిపించింది. అయితే, తాజా సమాచారం ప్రకారం రేసులోకి మరో ఇద్దరు అనూహ్యంగా వచ్చారు. ప్రముఖ పారిశ్రామికవేత్త బండారు నరసింహరావుతో పాటు టాలీవుడ్‌లో వరుసగా క్రేజీ సినిమాలు తీస్తున్న ఒక ప్రముఖ స్టార్ ప్రొడ్యూసర్‌ను కూడా జనసేన నుంచి రాజ్యసభకు పంపనున్నారని సమాచారం అందుతోంది. 

చివరి నిమిషంలో అధిష్ఠానం పెద్దలు ఏవైనా అనూహ్య నిర్ణయాలు తీసుకుంటే తప్ప.. దాదాపు పైన పేర్కొన్న పేర్లలో నుంచే ఏపీ కూటమి రాజ్యసభ తుది జాబితా వెలువడే అవకాశం ఉందని సమాచారం అందుతోంది.

Also Read: జూన్ 30 వరకు స్కూళ్లకు వేసవి సెలవులు..పండగ చేసుకుంటున్న విద్యార్థులు..ఎక్కడంటే?

Also Read: బక్రీద్ పండగ ఎప్పుడు? మే 27 లేదా మే 28 ప్రభుత్వ సెలవు ఎప్పుడంటే?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

EV Cars discounts Offers: ఇలాంటి లక్కీ ఛాన్స్ మళ్లీ రాదు బ్రో.. ఎల‌క్ట్రిక్ కార్ల‌పై ఏకంగా రూ. 3 ల‌క్ష‌ల డిస్కౌంట్..ఏ మోడల్ పై ఎంతంటే?

BBhoomi4h ago
Lakshmapur, Telangana:

EV Cars discounts Offers: భారత ఆటో మొబైల్ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలు దుమ్మురేపుతున్నాయి. దేశవ్యాప్తంగా డీజీల్, పెట్రోల్ ధరలు భారీగా పెరగడంతో ఈవీలకు గిరాకీ పెరిగింది. దేశవ్యాప్తంగా చాలా మంది ఈవీలను కొనుగోలు చేసేందుకు మొగ్గుచూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో వినియోగదారులను ఆకట్టుకునేందుకు కంపెనీలు సైతం రకరకాల డిస్కౌంట్ ఆఫర్లను తీసుకువస్తున్నాయి. ఈ నేపథ్యంలో టాటా మోటార్స్ తమ ఈవీలపై భారీ డిస్కౌంట్ ఆఫర్ ను ప్రకటించింది. మే నెలకు సంబంధించి కొన్ని కార్లపై ఏకంగా 3. 80లక్షల వరకు డిస్కౌంట్స్ అందిస్తున్నాయి. 

టాటా మోటార్స్ తన ఈవీ కార్ల రేంజ్ పై స్పెషల్ ఆఫర్స్ అందిస్తోంది. ఈ ఆఫర్లలో ఎక్స్చేంజ్ బోనస్, స్క్రాప్ బోనస్, గ్రీన్ బోనస్, లాయల్టీ బోనస్ వంటి బెనిఫిట్స్ ఎన్నో ఉన్నాయి. మోడల్, మాన్యుఫ్యాక్చరింగ్ ఇయర్ ఆధారంగా ఈ డిస్కౌంట్ ఆఫర్ అనేది మారుతుంది. ఈవీ కొనాలనుకునేవారికి నిజంగా ఇది లక్కీ ఛాన్స్ అనే చెప్పాలి. 

నెక్సాన్ ఈవీపై రూ. 1.2లక్షలు డిస్కౌంట్ :

టాటా నెక్సాన్ ఈవీపై రూ. 1.2లక్షల వరకు డిస్కౌంట్ అందిస్తోంది. MY24, MY25మోడల్స్ పై గ్రీన్ బోనస్, ఎక్స్చేంజ్ బోనస్, స్క్రాప్ బోనస్, లాయల్టీ బోనస్ ఇవన్నీ కలిపి డిస్కౌంట్ రూపంలో అందిస్తుంది. ఎంఐ26 మోడల్ పై మాత్రం 50వేల వరకు డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఇది మిడ్ రేంజ్ ఈవీ కొనాలనుకునేవారికి మంచి ఆప్షన్ అవుతుంది. 

హారియర్ ఈవీపై రూ. 1.5లక్షల డిస్కౌంట్ :

టాటా ఫ్లాగ్ సిప్ ఎలక్ట్రిక్ ఎస్ యూవీ అయిన హారియర్ ఈవీపై భారీ ఆఫర్లను ప్రకటించింది. ఎంవై 25, ఎంవై 26 మోడల్స్ పై ఏకంగా రూ. 1.5లక్షల డిస్కౌంట్ లభిస్తోంది. దీనిలో ఎక్స్చేంజ్ బోనస్, స్క్రాప్ బోనస్, లాయల్టీ బోనస్ వంటి బెనిఫిట్స్ ఉన్నాయి. ఈవీకి అప్ గ్రేడ్ అయ్యే కస్టమర్లకు మరిన్ని బెనిఫిట్స్ కూడా అందిస్తోంది. 

Also Read: మిడిల్ క్లాస్ జేబుకు చిల్లు పడకుండా.. రూ. 10లక్షల లోపే బెస్ట్ ఫ్యామిలీ కార్లు

టాటా పంచ్, టియోగో ఈవీ భారీ తగ్గింపు:

టాటా కంపెనీకి చెందిన తక్కవ ధర ఈవీలు అయిన టియాగో, పంచ్ కూడా భారీ డిస్కౌంట్స్ అందుబాటులో ఉంటాయి. టియాగో ఈవీపై వేరియంట్ 1.5లక్షల నుంచి 2.1 లక్షల వరకు డిస్కౌంట్ అంిస్తోంది. పంచ్ ఈవీపై కూడా 2.1 లక్షల వరకు అందుబాటులో ఉన్నాయి. 

కర్వ్ ఈవీపై 3 లక్షల వరకు డిస్కౌంట్:

ఈ భారీ ఆఫర్లలో కర్వ్ ఈవీ కొన్నవారికి భారీ మొత్తంలో డిస్కౌంట్ అందుబాటులో ఉంది. ఎంవై 24,ఎంవై 25 మోడల్స్ పై ఏకంగా 3.8లక్షల వరకు డిస్కౌంట్ అందిస్తోంది. ఎంవై 26 మోడల్స్ కూడా 2.8లక్షల నుంచి 3.3 లక్షల వరకు తగ్గింపు అందుబాటులో ఉంది. మిడ్ సైట్ ఎస్ యూవీ స్టైల్ ఈవీ కొనేవారికి ఈ డీల్ ప్రస్తుతం బెస్ట్ ఆప్షన్ గా మారింది. 

Also Read:  రూ.2లక్షల డౌన్‌పేమెంట్‌ కట్టండి.. తర్వాత EMI కట్టుకోండి

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report

Budget Cars: రూ.4 లక్షలకే టాటా టిగోర్, బెలేనో, ఫోర్డ్ ఎకోస్పోర్ట్.. హైదరాబాద్‌లో ఎక్కడో తెలుసా?

Hyderabad, Telangana:

Budget Cars Under 4 Lakhs In Hyderabad: ప్రతి ఒక్కరికి సొంత కారు కల ఉంటుంది. దానిని సాకారం చేసుకోవాలకునే మధ్యతరగతి కుటుంబాలకు హైదరాబాద్‌లోని కొన్ని సెకండ్‌ హ్యాండ్‌ కార్ల షోరూమ్స్‌ సువర్ణావకాశం అందిస్తుంది. ముఖ్యంగా నగరంలోని ప్రముఖ ఐటీ హబ్ అయిన మాదాపూర్‌లో ప్రీ-ఓన్డ్ వాహనాలపై అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి.  ఢిల్లీ మార్కెట్ కంటే అత్యంత తక్కువ ధరలకే అద్భుతమైన కార్లు అందుబాటులో ఉండడం విశేషం.. 100 శాతం నాన్-యాక్సిడెంట్,  గ్యారెంటీ కలిగిన కార్లను ఇక్కడ చీప్‌ ధరలకే విక్రయిస్తున్నారు. అంతేకాకుండా కేవలం రూ. 2.4 లక్షల బడ్జెట్ నుంచి ప్రారంభమై రూ. 7.5 లక్షల లోపు వివిధ బ్రాండ్లతో పాటు మోడళ్ల కార్లు ఇక్కడ లభిస్తున్నాయి. 

ఇందులో భాగంగా పెట్రోల్, డీజిల్ ఇంజన్లతో పాటు మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ కలిగిన మంచి కండీషన్‌ కలిగిన కార్లు అత్యంత చీప్‌ ధరలకేలభిస్తున్నాయి. ముఖ్యంగా 2018 మోడల్ హోండా అమేజ్ కారు కేవలం 45,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగిన పెట్రోల్ మాన్యువల్ వేరియంట్‌ రూ.4.40 లక్షలకే అందిస్తున్నారు. అంతేకాకుండా 2018 మోడల్‌ టాటా టిగోర్ డీజిల్ 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌తో పాటు లీటరుకు 25 కిలోమీటర్ల మైలేజీని ఇచ్చే ఈ టాప్-ఎండ్ ఎక్స్‌జెడ్ ప్లస్ మోడల్ కారు ధరను రూ.3.50 లక్షల నుంచి రూ. 3.60 లక్షలతో విక్రయిస్తున్నారు. 

అలాగే 2017 మోడల్‌ మారుతి బెలేనో ఆటోమేటిక్ జీటా పెట్రోల్ ఆటోమేటిక్ పుష్-బటన్ స్టార్ట్ ఫీచర్ కలిగిన ఈ కారును రూ. 4.20 లక్షలకే అందిస్తూ వస్తున్నారు. అంతేకాకుండా 6 ఎయిర్‌బ్యాగ్‌లు కలిగి టైటానియం ప్లస్ పెట్రోల్ ఆటోమేటిక్ 2017 మోడల్‌ ఫోర్డ్ ఎకోస్పోర్ట్ కారు భద్రత కలిగిన కారు రూ.4.15 లక్షల నుంచి రూ. 4.30 లక్షల లోపే అందుబాటులో ఉంది. దీంతో పాటు 7-సీటర్ ప్రీమియం లగ్జరీ  2016 మోడల్‌ టయోటా ఇన్నోవా 2.4G కారు రూ. 7.20 లక్షలతో అందుబాటులో ఉంది. ఇది జెన్యూన్ రీడింగ్‌తో, షోరూమ్ కండిషన్‌లో ఉంది.

 అలాగే నాలుగు అద్భుతమైన సీల్ టైర్లతో 2013 మోడల్‌ స్విఫ్ట్ డిజైర్ డీజిల్ వేరియంట్‌ రూ. 3.50 లక్షలకే విక్రయిస్తున్నారు. అంతేకాకుండా  2018 మోడల్‌ హుండాయ్ వెర్నా 1010 VIP ఫ్యాన్సీ నెంబర్ కలిగి ఎస్‌ఎక్స్ టాప్-ఎండ్ డీజిల్ కారు ఇక్కడ కొనుగోలు చేసేవారికి కేవలం రూ.6 లక్షలలోపే అందుబాటులో ఉండడం విశేషం..అలాగే 2013 రిజిస్ట్రేషన్ హ్యుందాయ్ i20 డీజిల్ కారు కేవలం రూ. 2.40 లక్షలకే లభిస్తోంది. అంతేకాకుండా ఇక్కడ డీజిల్‌ వేరియంట్‌ కార్లు అత్యంత చీప్‌ ధరలకే లభిస్తున్నాయి. ఇక్క కొనుగోలు చేసే ప్రతి వాహనం షోరూమ్ ట్రాక్ రికార్డు కలిగి ఉంటుందని.. అంతేకాకుండా ఇంజన్‌ చెక్ చేసుకోవడానికి ప్రత్యేకమైన సదుపాయం కూడా అందిస్తున్నట్లు తెలిపారు. 

Also Read: సెకండ్ హ్యాండ్ ధరకే కొత్త కార్లు.. అన్‌రిజిస్టర్డ్ డెమో వాహనాలపై అదిరిపోయే ఆఫర్లు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report
Advertisement

Virat Kohli IPL Salary: ఐపీఎల్‌లో విరాట్‌ కోహ్లీ సంపాదన ఎంతో తెలుసా? రూ.12 లక్షల నుండి రూ.230 కోట్లకు ఎదిగిన ఏకైక ఆటగాడు!

Hyderabad, Telangana:

Virat Kohli IPL Salary 2026: ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన క్రికెట్ క్రీడా పండుగ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL). 2008లో ప్రారంభమైన ఈ క్యాష్ రిచ్ లీగ్, ప్రస్తుతం 19వ సీజన్‌ను (ఐపీఎల్ 2026) విజయవంతంగా జరుపుకుంటోంది. ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఐపీఎల్ ద్వారా అత్యధిక పారితోషికం అందుకున్న ఆటగాడిగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) స్టార్ బ్యాటర్, 'రన్ మెషీన్' విరాట్ కోహ్లీ సరికొత్త చరిత్ర సృష్టించాడు.

'ఫ్యానాటిక్ స్పోర్ట్స్', 'హురున్' సంయుక్తంగా విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం.. కోహ్లీ తన ఐపీఎల్ కెరీర్‌లో కేవలం ఫ్రాంచైజీ పారితోషికం రూపంలోనే ఏకంగా రూ.230.2 కోట్లు ఆర్జించాడు.

కోహ్లీ ఐపీఎల్ ప్రయాణం!
2008లో కేవలం 19 ఏళ్ల వయసులో అండర్-19 వరల్డ్ కప్ గెలిచి వచ్చిన కోహ్లీని ఆర్‌సీబీ తొలి వేలంలో కేవలం రూ.12 లక్షల బేస్ ప్రైస్‌కు కొనుగోలు చేసింది. 18 ఏళ్లుగా ఒకే ఒక్క ఫ్రాంచైజీకి ఆడుతూ, అత్యధిక పారితోషికం అందుకుంటున్న ఆటగాడిగా కోహ్లీ ఎదిగిన తీరు అద్భుతం. ఆయన ఐపీఎల్‌లో సంపాదన ఎలా సాగిందో ఇప్పుడు చూద్దాం.

2008 - 2010: ఏడాదికి రూ.12 లక్షల చొప్పున.. ఆ మూడేళ్లకు గానూ మొత్తం రూ.36 లక్షలు

2011 - 2013: ఏడాదికి రూ.8.28 కోట్ల చొప్పున.. మొత్తం రూ.24.84 కోట్లు

2014 - 2017: ఏడాదికి రూ.12.5 కోట్ల చొప్పున.. మొత్తం రూ.50 కోట్లు

2018 - 2021: ఏడాదికి రూ.17 కోట్ల చొప్పున.. మొత్తం రూ.68 కోట్లు

2022 - 2024: ఏడాదికి రూ.15 కోట్ల చొప్పున.. మొత్తం రూ.45 కోట్లు

2025 - 2026: ఏడాదికి రూ.21 కోట్ల చొప్పున.. మొత్తం రూ.42 కోట్లు

ఈ క్రమంలో విరాట్ కోహ్లీ మొత్తం ఐపీఎల్ సంపాదన రూ.230.2 కోట్లుగా లెక్క తేలింది. అయితే ఈ డబ్బు ఆయన కేవలం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ ద్వారానే సంపాదించడం విశేషం. 

టాప్-3లో రోహిత్, ధోనీ!
ఐపీఎల్‌లో అత్యధికంగా సంపాదించిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లీ తర్వాత భారత సీనియర్ ఆటగాళ్లే ఆధిపత్యం చలాయిస్తున్నారు.

విరాట్ కోహ్లీ (RCB): రూ.230.2 కోట్లు

రోహిత్ శర్మ (MI): రూ.227.2 కోట్లు

ఎంఎస్ ధోనీ (CSK): రూ.200 కోట్లు

రూ.1.63 లక్షల కోట్లకు ఐపీఎల్ బ్రాండ్!
ఈ నివేదిక కేవలం ఆటగాళ్ల సంపాదననే కాదు, ఐపీఎల్ జట్ల మార్కెట్ విలువను కూడా వెల్లడించింది. ప్రస్తుతం ఐపీఎల్‌లోని 10 ఫ్రాంచైజీల మొత్తం బ్రాండ్ విలువ అక్షరాలా రూ.1.63 లక్షల కోట్లకు చేరుకుంది.

అత్యంత విలువైన జట్లు ఇవే..
కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR): బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్‌కు చెందిన కేకేఆర్ రూ.19,200 కోట్లకు పైగా మార్కెట్ విలువతో నెం.1 స్థానంలో నిలిచింది.

ముంబై ఇండియన్స్ (MI), చెన్నై సూపర్ కింగ్స్ (CSK): ఈ రెండు జట్లు చెరో రూ.18,400 కోట్ల విలువతో సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నాయి.

Also Read: కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు నేడు చావో రేవో మ్యాచ్..కేకేఆర్ ఆశలు ముంబై గల్లంతు చేస్తుందా

ALso Read: రేపే ధోనీ చివరి మ్యాచ్..చెపాక్‌లో ఫ్యాన్స్ మధ్య వీడ్కోలు పలకనున్న దిగ్గజం?!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Cars In Delhi: మధ్యతరగతి వారికి గుడ్ న్యూస్.. కేవలం రూ.2 లక్షలకే హ్యుందాయ్, టాటా టాప్ మోడల్ కార్లు!

Hyderabad, Telangana:

Cheapest Second Hand Cars In Delhi: ఎప్పటి నుంచో సొంత కారు కొనుగోలు చేయాలని అనుకుంటున్నారా? కానీ ధరల కారణంగా కొనుగోలు చేయాలేకపోతున్నారా? మధ్యతరగతి ప్రజలకు డిల్లీలోని రోహిణి సెక్టార్-16లో ఉన్న సెకండ్‌ హ్యండ్‌ కార్ల షోరూమ్స్‌ అద్భుతమైన డిస్కౌంట్‌ ఆఫర్స్‌తో మంచి మంచి కార్లను విక్రయిస్తూ వస్తున్నాయి. మార్కెట్ ధరల కంటే అత్యంత తక్కువ ధరలకే, లక్షల రూపాయల వరకు డిస్కౌంట్‌లను అందిస్తూ మంచి మంచి కార్లను విక్రయిస్తున్నారు. అయితే, ఇక్కడున్న మార్కెట్‌లో ఏయే కార్లు ఎంతెంత ధరల్లో అందుబాటులో ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

ఈ సెకండ్‌ హ్యాండ్‌ షోరూమ్‌లో మూడేళ్ల పాటు తిరిగిన హ్యుందాయ్ i10 కార్లు కేవలం రూ.1,29,000 లకే అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా 2014 మోడల్ కేవలం 26,000 కిలోమీటర్లు మాత్రమే వినియోగించిన సింగిల్ ఓనర్ హ్యుందాయ్ గ్రాండ్ i10 మ్యాగ్నా కారు ఇప్పుడే కొనుగోలు చేసేవారికి రూ.1,99,000కే అందుబాటులో ఉంది. అలాగే టాప్ ఎండ్ పెట్రోల్ మోడల్ టాటా జెస్ట్ కేవలం రూ.1,69,000 లకే లభిస్తున్నాయి. ఇవే కాకుండా చాలా బ్రాండ్‌లకు సంబంధించిన కార్లు అత్యంత చీప్‌ ధరల్లో అందుబాటులో ఉన్నాయి. 

విపరీతంగా పెరుగుతున్న పెట్రోల్ ధరల భారం నుంచి ఉపశమనం పొందేందుకు ఆన్-పేపర్ సిఎన్‌జి సదుపాయం కలిగిన ఎన్నో కార్లను ఇక్కడ విక్రయిస్తూ వస్తున్నారు. 2020 మోడల్ టాటా టియాగో ఆన్-పేపర్ సిఎన్‌జి కారును మార్కెట్ ధర రూ.3.5 లక్షలు కాగా.. ఇక్కడ కేవలం రూ.2,69,000 లకే అందిస్తున్నారు. అంతేకాకుండా 2016 టాప్ మోడల్  ఫోర్డ్ ఎకోస్పోర్ట్ (Ford EcoSport) ఆటోమేటిక్, పుష్-బటన్ స్టార్ట్ కలిగిన అద్భుతమన కారును రూ.2,89,000 ధరకే ఇక్కడ విక్రయిస్తున్నారు. అలాగే 7-సీటర్ కారును కొనుగోలు చేయాలనుకునేవారి కోసం రెనాల్ట్ ట్రైబర్ (Triber) టాప్ మోడల్, పుష్ బటన్, అలాయ్ వీల్స్‌తో పాటు సిఎన్‌జి సపోర్ట్‌ కలిగి కారు కేవలం రూ.2,99,000 లకే అందుబాటులో ఉంది. అలాగే హోండా సిటీతో పాటు హోండా అమేజ్, మహీంద్రా KUV, రెనాల్ట్ క్విడ్ వంటి కార్లు కూడా రూ.1.39 లక్షల నుండి రూ.1.99 లక్షల లోపు అందుబాటులో ఉండడం విశేషం..

Also Read: సెకండ్ హ్యాండ్ ధరకే కొత్త కార్లు.. అన్‌రిజిస్టర్డ్ డెమో వాహనాలపై అదిరిపోయే ఆఫర్లు!

అలాగే ఇక్కడ అనేక బ్రాండ్‌లకు సంబంధించిన కార్లు అత్యంత చీప్‌ ధరల్లో అందుబాటులో ఉండడం విశేషం.. ఇక్కడ కొనుగోలు చేసే కస్టమర్స్‌కి ఢిల్లీ, హర్యానా, యూపీ వంటి ఏ ప్రాంత వాహనాలకైనా ఓనర్ షిప్ ట్రాన్స్‌ఫర్, ఎన్‌ఓసి (NOC)తో పాటు వివిధ రకాల సర్టీఫికేషన్ ఈ షోరూమ్స్‌కి సంబంధించిన నిర్వాహకులే చూసుకుంటామని హామి కూడా ఇస్తున్నారు. అంతేకాకుండా భారతదేశంలో ఏ నగరంలో ఉన్నవారికైనా డోర్-టు-డోర్ ట్రాన్స్‌పోర్ట్ సదుపాయాన్ని కూడా అందిస్తూ వస్తున్నారు.  

Also Read: సెకండ్ హ్యాండ్ ధరకే కొత్త కార్లు.. అన్‌రిజిస్టర్డ్ డెమో వాహనాలపై అదిరిపోయే ఆఫర్లు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report

KKR vs MI Prediction: కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు నేడు చావో రేవో మ్యాచ్..కేకేఆర్ ఆశలను ముంబై గల్లంతు చేస్తుందా?

Kolkata, West Bengal:

KKR vs MI Match Prediction: ఐపీఎల్ 2026లో బుధవారం ఈడెన్ గార్డెన్స్‌ వేదికగా అత్యంత ఉత్కంఠభరితమైన పోరు జరగనుంది. మూడుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), ఇప్పటికే టోర్నమెంట్ నుండి నిష్క్రమించిన ముంబై ఇండియన్స్ (MI)తో తలపడనుంది. కేకేఆర్ ప్లేఆఫ్ ఆశలు దాదాపు సన్నగిల్లన నేపథ్యంలో ఈ మ్యాచ్‌లో ఓడితే డైరెక్ట్‌గా ఎలిమినేట్ అవుతుంది. 

అజింక్య రహానే సారథ్యంలోని కేకేఆర్‌కు ఈ మ్యాచ్‌ 'చావో రేవో' లాంటిది. శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలో గతంలో టైటిల్ గెలిచిన కేకేఆర్, 2025లో ఎనిమిదో స్థానానికి పడిపోయింది. ఇప్పుడు ఈ మ్యాచ్‌లో ఓడిపోతే, వరుసగా రెండో సీజన్‌లోనూ ప్లేఆఫ్ చేరకుండానే నిష్క్రమిస్తుంది. చివరి వరకు ప్లేఆఫ్స్ రేసులో ఉండాలంటే కేకేఆర్ ఈ మ్యాచ్‌లో తప్పకుండా గెలవాల్సి ఉంటుంది. అయితే కేకేఆర్ ఆడబోయే రెండు మ్యాచ్‌ల్లో గెలిచినా ఉపయోగం లేదు. ఇతర జట్లు ప్రదర్శన బట్టి ప్లేఆఫ్ అవకాశాలు ఉంటాయి. ఈ వారం చివర్లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) చేతిలో పంజాబ్ కింగ్స్ (PBKS) ఓడిపోవాల్సి ఉంటుంది. అప్పుడే కేకేఆర్ ఆశలు సజీవంగా ఉంటాయి. 

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇప్పటికే ప్లేఆఫ్ బెర్త్‌లను ఖరారు చేసుకోగా.. మిగిలిన ఏకైక స్థానం కోసం పంజాబ్, రాజస్థాన్, చెన్నై, ఢిల్లీలతో పాటు కేకేఆర్ రేసులో పోటీ పడుతున్నాయి.

కేకేఆర్ బలాలు - బలహీనతలు
సీజన్ ఆరంభంలో వరుస ఓటములతో వెనుకబడిన కేకేఆర్, చివరి ఆరు మ్యాచ్‌లలో ఐదింటిలో గెలిచి ఆలస్యంగా పుంజుకుంది. ఓపెనర్ ఫిన్ అలెన్ (గత 3 ఇన్నింగ్స్‌ల్లో ఒక సెంచరీ, 35 బంతుల్లో 93 పరుగులు), అంగక్రిష్ రఘువంశీ, రూ.25.20 కోట్ల ఆటగాడు కామెరాన్ గ్రీన్, ఫినిషర్ రింకు సింగ్, మిస్టరీ స్పిన్నర్ సునీల్ నరైన్ జట్టుకు పెద్ద బలంగా మారారు. 

కెప్టెన్ రహానే ఫామ్ లేమితో ఇబ్బంది పడుతుండటం, వరుణ్ చక్రవర్తి (కాలికి హెయిర్‌లైన్ ఫ్రాక్చర్), మతీషా పతిరానా (కండరాల గాయం) గాయాలతో సతమతమవ్వడం జట్టును కలవరపెడుతోంది. మతీషా పతిరానా గాయం నుంచి కోలుకోకపోతే, బ్లెస్సింగ్ ముజరబాని తుది జట్టులోకి వస్తాడని అంచనా వేస్తున్నారు.

ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్‌కు ఈ సీజన్ ఘోర నిరాశను మిగిల్చింది. అయితే, కేకేఆర్ ప్లేఆఫ్ ఆశలను దెబ్బతీసి, టోర్నీని బలంగా ముగించాలని ముంబై భావిస్తోంది. గాయం కారణంగా గత మూడు మ్యాచ్‌లకు దూరమైన కెప్టెన్ హార్దిక్ పాండ్యా, వ్యక్తిగత కారణాలతో దూరమైన సూర్యకుమార్ యాదవ్ ఈ మ్యాచ్‌తో తిరిగి జట్టులోకి రానున్నారు.

ఈ సీజన్‌లో హార్దిక్ (సగటు 20.85, ఎకానమీ 12), సూర్యకుమార్ యాదవ్ (11 ఇన్నింగ్స్‌ల్లో 195 పరుగులు, హాఫ్ సెంచరీ లేదు), రోహిత్ శర్మ, తిలక్ వర్మలు నిలకడ లేమితో ఇబ్బంది పడ్డారు. బుమ్రాకు మిగిలిన బౌలర్ల నుంచి సరైన మద్దతు లభించలేదు. ర్యాన్ రికెల్టన్, షెర్ఫేన్ రూథర్‌ఫర్డ్, దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్, అల్లా గజన్‌ఫర్‌లతో ముంబై ఇప్పటికీ బలంగానే ఉంది.

ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఏకపక్ష పోరు ఏదైనా ఉందంటే అది కేకేఆర్ వర్సెస్ ఎంఐ మ్యాచ్‌లే. వీరిద్దరి మధ్య ఐపీఎల్ చరిత్రలో 36 మ్యాచ్‌లు జరగ్గా.. అందులో ముంబై 25 సార్లు గెలిచి ఆధిపత్యం చలాయిస్తుండగా.. కోల్‌కతా జట్టు కేవలం 11 విజయాలతో సరిపెట్టుకుంది. అయితే ఈ సీజన్ ఆరంభంలో వాంఖెడే స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లోనూ కేకేఆర్‌పై ముంబై విజయం సాధించింది.

ఈడెన్ గార్డెన్స్ పిచ్, వాతావరణం
ఈ మ్యాచ్ 'పిచ్ నెం. 4' పై జరగనుంది. ఈ సీజన్‌లో దీనిపై ఒకే ఒక్క మ్యాచ్ జరగ్గా.. అందులో రాజస్థాన్ రాయల్స్‌పై కేకేఆర్ సునాయాసంగా ఛేజింగ్ చేసింది. ఇక్కడ మొదట బ్యాటింగ్ చేసిన జట్లు, ఛేజింగ్ చేసిన జట్లు సమానంగా గెలిచాయి. అయితే బుధవారం సాయంత్రం మ్యాచ్ జరిగే సమయంలో కోల్‌కతాలో ఆకాశం మేఘావృతమై ఉండే అవకాశం ఉంది.

కోల్‌కతా నైట్‌రైడర్స్ తుది జట్టు అంచనా..
అజింక్య రహానే (కెప్టెన్), ఫిన్ అలెన్, అంగక్రిష్ రఘువంశీ (వికెట్ కీపర్), కామెరాన్ గ్రీన్, మనీష్ పాండే, రింకు సింగ్, సునీల్ నరైన్, అనుకుల్ రాయ్, వరుణ్ చక్రవర్తి, సౌరభ్ దూబే, కార్తీక్ త్యాగి, బ్లెస్సింగ్ ముజరబాని.

ముంబై ఇండియన్స్ తుది జట్టు అంచనా..
ర్యాన్ రికెల్టన్ (వికెట్ కీపర్), రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, నమన్ ధీర్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), విల్ జాక్స్, కార్బిన్ బాష్, దీపక్ చాహర్, జస్ప్రీత్ బుమ్రా, రఘు శర్మ, ఏఎం ఘజన్‌ఫర్.

Also Read: రేపే ధోనీ చివరి మ్యాచ్..చెపాక్‌లో ఫ్యాన్స్ మధ్య వీడ్కోలు పలకనున్న దిగ్గజం?!

Also Read: చెన్నై Vs హైదరాబాద్.. ఐపీఎల్‌లో నేడు చావో రేవో మ్యాచ్..ధోనీ ఆడతాడా?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement

Lenovo: మార్కెట్లోకి లెనోవో పవర్‌ఫుల్ రీ-ఎంట్రీ.. అరాచకమైన ఫీచర్లు, తక్కువ ధరకే Lenovo Legion Y70!

Hyderabad, Telangana:

Lenovo Legion Y70 Price: గతంలో లెనోవో స్మార్ట్‌ఫోన్స్‌కి అద్భుతమైన డిమాండ్‌ ఉండేది. కానీ పోను పోను మార్కెట్‌లోకి కొత్త బ్రాండ్‌లకు సంబంధించిన మొబైల్స్‌ లాంచ్‌ కావడంతో వీటి డిమాండ్‌ తగ్గిపోతూ వచ్చింది. అయితే, మళ్లీ మార్కెట్‌లోకి కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఇది లెనోవో లెజియన్ Y70 స్మార్ట్‌ఫోన్‌ పేరుతో మార్కెట్‌లోకి అందుబాటులోకి వచ్చింది. దీనిని కంపెనీ మొదట చైనా మార్కెట్‌లోకి అందుబాటులోకి వచ్చింది. ఇది వెనక భాగంలోని ఎంతో శక్తివంతమైన కెమెరాతో పాటు అద్భుతమైన డిజైన్‌ను కూడా కలిగి ఉంటుంది. ఇందులో కంపెనీ చాలా ప్రత్యేకమైన  50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో పాటు 8-మెగాపిక్సెల్ ఆటోఫోకస్ అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరాను అందిస్తూ వస్తోంది. ఇవే కాకుండా ఇందులో  ఆక్టా-కోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 చిప్‌సెట్‌ ప్రాసెసర్‌తో పాటు ఎన్నో రకాల కొత్త కొత్త ఫీచర్స్‌ను కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్‌తో పాటు స్పెషిఫికేషన్‌ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

లెనోవో లెజియన్ Y70 ధర వివరాలు..
లెనోవో లెజియన్ Y70 2026 స్మార్ట్‌ఫోన్‌ చాలా ప్రత్యేకమైన స్టోరేజ్‌ ఆప్షన్స్‌లో అందుబాటులోకి వచ్చింది. ఇందులోని మొదటి స్టోరేజ్‌ వేరియంట్‌ 12GB ర్యామ్‌, 256GB స్టోరేజ్‌ కలిగిన వేరియంట్‌  రూ.36,895తో ప్రారంభమవుతుంది. అంతేకాకుండా 12GB+512GB స్టోరేజ్ వేరియంట్‌ ధర రూ.45,410 నుంచి లభిస్తోంది. ఇక మరో వేరియంట్‌  16GB ర్యామ్‌తో పాటు 512GB స్టోరేజ్ కలిగినది రూ.51,090తో అందుబాటులో ఉంది. ఇక ఇందులోని చివరి వేరియంట్ 16GB+1TB స్టోరేజ్ ధర రూ. 62,455తో అందుబాటులో ఉంది. ఇప్పటికే చైనా మార్కెట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ప్రీ-ఆర్డర్లు కూడా చైనాలో ప్రారంభమయ్యాయి. ఈ మొబైల్స్‌కి సంబంధించిన సేల్స్‌ జూన్ 9 నుంచి ప్రారంభం కాబోతోంది. 

ఫీచర్లు, స్పెసిఫికేషన్లు..
ఈ లెనోవో లెజియన్ Y70 స్మార్ట్‌ఫోన్‌ అద్భుతమైన ఫీచర్స్‌తో అందుబాటులో ఉన్నాయి.. ఇందులో కంపెనీ చాలా ప్రత్యేకమైన 6.82-అంగుళాల 2K AMOLED LTPO డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. అంతేకాకుండా 144Hz రిఫ్రెష్ రేట్‌తో పాటు 7000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ సపోర్ట్‌తో లభిస్తోంది. అంతేకాకుండా ఇది డాల్బీ విజన్‌కు సపోర్ట్‌తో పని చేయడం విశేషం.. ఇవే కాకుండా ఇందులో కంపెనీ GPUతో కూడిన ఆక్టా-కోర్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 చిప్‌సెట్‌ ప్రాసెసర్‌ను కూడా కలిగి ఉంటుంది. కాబట్టి ఎంత పెద్ద గేమ్స్‌ అయిన ఎంతో సులభంగా ఆడొచ్చు. అంతేకాకుండా ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది.

Also Read:  Spray Fan Offer: అమెజాన్ బంపర్ ఆఫర్.. రూ.1,099కే AC లాంటి గాలినిచ్చే డబుల్ ఎండెడ్ స్ప్రే ఫ్యాన్!

ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన కెమెరా సెటప్‌ వివరాల్లోకి వెళితే..  OIS సపోర్ట్‌తో కూడిన 50-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాను కలిగి ఉంటుంది. అంతేకాకుండా అదనంగా 8-మెగాపిక్సెల్ ఆటోఫోకస్ అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా కూడా అందుబాటులో ఉంది. ఇందులో కంపెనీ సెల్ఫీలతో పాటు వీడియో కాల్స్ కోసం..32-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. అలాగే సెక్యూరుటీని దృష్టిలో పెట్టుకుని ఇందులో కంపెనీ ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను కూడా అందిస్తోంది. ఇందులో 5G, డ్యూయల్ 4G VoLTE, Wi-Fi 7, బ్లూటూత్ 6.0, GPS, NFC కనెక్టివిటీ ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇక ఈ స్మార్ట్‌ఫోన్‌ ఎంతో శక్తివంతమైన 8000mAh బ్యాటరీతో పాటు 90W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ కూడా లభిస్తోంది.

Also Read:  Spray Fan Offer: అమెజాన్ బంపర్ ఆఫర్.. రూ.1,099కే AC లాంటి గాలినిచ్చే డబుల్ ఎండెడ్ స్ప్రే ఫ్యాన్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report

Swapna Dutt NTR: "ఎన్టీఆర్ వల్లే నా పెళ్లి జరిగింది.." టాలీవుడ్ లేడీ ప్రొడ్యూసర్ ఎమోషనల్!

Hyderabad, Telangana:

Swapna Dutt Marriage NTR: టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు (మే 20) సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు, సినీ ప్రముఖులు ఆయనకు సామాజిక మాధ్యమాల వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఆర్ఆర్ఆర్ (RRR) సినిమాతో అంతర్జాతీయంగా తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకున్న తారక్.. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'డ్రాగన్' అనే భారీ పాన్-ఇండియా చిత్రంలో నటిస్తున్నారు. 

తాజాగా ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ప్రశాంత్ నీల్ 'డ్రాగన్' సినిమా నుంచి గ్లింప్స్ రిలీజ్ చేసింది చిత్రబృందం. ఈ క్రమంలో తారక్ గతంలో చేసిన కొన్ని అరుదైన సాయం గురించి ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. ప్రముఖ నిర్మాత అశ్వినిదత్ కుమార్తె, స్టార్ ప్రొడ్యూసర్ స్వప్నా దత్ పంచుకున్న ఆసక్తికర విషయాల గురించి అభిమానులు తెగ చర్చించుకుంటున్నారు. 

షూటింగ్ ఆపేసి.. నాన్నతో మాట్లాడారు!
టాలీవుడ్ నిర్మాత స్వప్నా దత్ 2010లో ప్రసాద్ వర్మను ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే, వీరిద్దరి పెళ్లి వెనుక హీరోయిన్ జూనియర్ ఎన్టీఆర్ కీలక పాత్ర పోషించారనే విషయం చాలామందికి తెలియదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్వప్న ఆనాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.

"నేను ప్రేమలో ఉన్న సమయంలో ఆ విషయాన్ని మొదట తారక్‌కు (హీరో జూనియర్ ఎన్టీఆర్) చెప్పాను. దాంతో ఆయన ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ఇంట్లో మాట్లాడమన్నారు. కానీ, మా ఇంట్లో అప్పట్లో ప్రేమ వివాహానికి ఒప్పుకునే పరిస్థితి లేదని తారక్‌తో అన్నాను. దాంతో ఆయన స్పందిస్తూ.. 'ఇలాంటి విషయాల్లో అస్సలు లేట్ చేయకూడదు, మీ నాన్నగారితో నేనే స్వయంగా మాట్లాడతాను' అని ధైర్యం చెప్పారు" అని స్వప్నా దత్ చెప్పుకొచ్చారు.
Swapna marriage NTR

స్వప్నా దత్ అన్నట్లుగానే ఎన్టీఆర్ ఆ సమయంలో జరుగుతున్న తన సినిమా షూటింగ్‌ను కాసేపు పక్కన పెట్టి, నేరుగా అశ్వినిదత్ గారి ఇంటికి వెళ్లి స్వప్న ప్రేమ విషయం గురించి మాట్లాడారట. అశ్వినిదత్ కుటుంబానికి, నందమూరి కుటుంబానికి దశాబ్దాలుగా ఉన్న అనుబంధం వల్ల తారక్ మాటను ఆయన కాదనలేకపోయారు. అలా ఎన్టీఆర్ చొరవతోనే తమ పెళ్లి జరిగిందని, ఆ సాయాన్ని జీవితంలో మర్చిపోలేనని స్వప్నా దత్ ఎమోషనల్ అయ్యారు.

కెరీర్ పరంగా దూసుకుపోతున్న స్వప్న..నాడు ఎన్టీఆర్ సాయంతో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన స్వప్నా దత్, నేడు టాలీవుడ్‌లో సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్‌గా రాణిస్తున్నారు. 'వైజయంతీ మూవీస్', 'స్వప్న సినిమాస్' బ్యానర్లపై వైవిధ్యమైన, భారీ చిత్రాలను నిర్మిస్తూ నిర్మాతగా తనదైన ముద్ర వేస్తున్నారు.

Also Read: ఏకంగా 10 కిలోల బరువు తగ్గిన కీర్తి సురేష్..స్టార్ నటి అస్సలు నిజం బయటపెట్టింది!

Also Read; 'పెద్ది' ట్రైలర్ వచ్చేసింది! క్రికెట్-కుస్తీలో రఫ్ఫాడించిన చరణ్..పక్కా బ్లాక్‌బస్టర్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Realme 15 Pro: అమెజాన్ ధమాకా ఆఫర్.. కేవలం రూ.1,999కే Realme 15 Pro 5G స్మార్ట్‌ఫోన్.. ఎలా పొందాలో చూడండి!

Hyderabad, Telangana:

Realme 15 Pro 5g Huge Offer On Amazon: ప్రముఖ చైనీస్‌ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ మార్కెట్‌లోకి అద్భుతమైన స్మార్ట్‌ఫోన్స్‌ను విడుదల చేస్తూ వస్తోంది. ముఖ్యంగా అత్యంత తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్సతో లభించే మొబైల్స్‌కి మంచి డిమాండ్‌ ఉంది. అయితే, మీరు కూడా ఇలాంటి కోవాలోకి వచ్చే స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఇదే మంచి అవకాశంగా భావింవచ్చు. రియల్‌మీ కంపెనీ గతంలో విడుదల చేసిన realme 15 Pro 5G మొబైల్‌ అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్స్‌తో లభిస్తోంది. ముఖ్యంగా దీనిని అమెజాన్‌లో కొనుగోలు చేసేవారికి బ్యాంక్‌ ఆఫర్స్‌తో పాటు ఎక్చేంజ్‌ బోనస్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి.

realme 15 Pro 5G మొబైల్‌ ఎన్నో రకాల ప్రీమియం ఫీచర్స్‌తో విడుదలైంది. ఇది 6.8 ఇంచుల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. అంతేకాకుండా  144Hz హైపర్‌గ్లో 4D కర్వ్డ్ డిస్‌ప్లే (HyperGlow 4D Curve+) చూడటానికి ఎంతో ప్రీమియంగా ఉంటుంది. ఇందులో కంపెనీ 6500 నిట్స్ (Peak Brightness) గరిష్ట బ్రైట్‌నెస్ కలిగి ఉంటుంది. దీని వల్ల ఎండలో కూడా ఎంతో అద్భుతంగా ఈ డిస్ల్పే కనిపిస్తుంది. అలాగే ఇందులో కంపెనీ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రోటక్షన్‌తో పాటు కంటిపై ఒత్తిడి పడకుండా 4608Hz PWM డిమ్మింగ్ సపోర్ట్‌ను కూడా కంపెనీ అందిస్తోంది. 

దీంతో పాటు ఇందులో కంపెనీ శక్తివంతమైన క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 (Snapdragon 7 Gen 4) 4nm ప్రాసెసర్‌ను కూడా అందిస్తోంది. ఇది మల్టీటాస్కింగ్‌తో పాటు గేమింగ్‌కు అద్భుతంగా పనిచేస్తుంది. ఈ realme 15 Pro 5G స్మార్ట్‌ఫోన్‌ ఆండ్రాయిడ్ 15 ఆధారిత రియల్‌మీ UI 6.0 సాఫ్ట్‌వేర్‌పై రన్‌ అవుతుంది. అలాగే గేమింగ్‌ చేసే క్రమంలో ఫోన్‌ వేడి కాకుండా వేపర్ ఛాంబర్ (VC) కూలింగ్ సిస్టమ్‌ను కూడా అందిస్తున్నారు. ఇందులో కంపెనీ వెనక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కూడా అందిస్తున్నారు. ఇందులోని ప్రధాన కెమెరా Sony IMX896 సెన్సార్, OIS సపోర్ట్‌తో 50MPతో లభిస్తోంది.

అదేవిధంగా ఇందులో కంపెనీ అదనంగా 50MP అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరాను కూడా అందిస్తోంది. ఇందులో AI మ్యాజిక్ గ్లో ఫ్లాష్ సెన్సార్ కూడా అందుబాటులో ఉంది. ఇవే కాకుండా ఫ్రంట్‌ భాగంలో 50MP సెల్ఫీ కెమెరా లభిస్తోంది. దీని ప్రత్యేకత ఏంటంటే.. ఫ్రంట్‌తో పాటు బ్యాక్ కెమెరాలతో 4K 60FPS హై-క్వాలిటీ వీడియోలను రికార్డ్ చేయవచ్చు. AI పార్టీ మోడ్ వంటి కెమెరా ఫీచర్స్ కూడా లభిస్తున్నాయి.. ఇందులో కంపెనీ ఎంతో శక్తివంతమైన భారీ 7000mAh బ్యాటరీతో పాటు 80W సూపర్‌వూక్ (SUPERVOOC) ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌ను కూడా కలిగి ఉంటుంది.

ఇక ఈ realme 15 Pro 5G స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ధర వివరాల్లోకి వెళితే.. ఇది మార్కెట్‌లో MRP ధర రూ.39,999తో అందుబాటులో ఉండగా.. దీనిని ఇప్పుడే ప్రముఖ ఈ కామర్స్‌ కంపెనీ అమెజాన్‌లో కొనుగోలు చేసేవారికి 10 శాతం వరకు తగ్గింపుతో కేవలం రూ.35,999 లోపే సొంతం చేసుకోవచ్చు. ఇవే కాకుండా అదనంగా బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. Amazon Pay బ్యాలెన్స్‌ వినియోగించి పేమెంట్ చేసేవారికి రూ.1,079 తగ్గింపుతో పొందవచ్చు. అలాగే ఈ స్మార్ట్‌ఫోన్‌పై ప్రత్యేకంగా నో కాస్ట్‌ EMI ఆప్షన్‌ కూడా లభిస్తోంది. అదేవిధంగా ఏదైన స్మార్ట్‌ఫోన్‌ ఎక్చేంజ్‌ చేస్తే రూ.34,000 బోనస్ లభిస్తుంది. దీంతో ఈ కొత్త మొబైల్‌ కేవలం రూ.1,999కే సొంతం చేసుకోవచ్చ. ఇవే కాకుండా దీనిపై ఎన్నో రకాల ప్రత్యేకమైన ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి.  

Also Read:  Spray Fan Offer: అమెజాన్ బంపర్ ఆఫర్.. రూ.1,099కే AC లాంటి గాలినిచ్చే డబుల్ ఎండెడ్ స్ప్రే ఫ్యాన్!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report
Advertisement

8th Pay Commission: ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్‌ అప్‌డేట్‌.. భారీగా జీతాల పెంపు అప్పుడే!

Wadgaon, Maharashtra:

Govt Employees Salary Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు 8వ వేతన సంఘం నుంచి బిగ్‌ అప్‌డేట్‌ వచ్చిందని తెలుస్తోంది. వేతన సంఘం కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఉద్యోగులు, పింఛన్‌దారులు ఇంకాస్త ఎదురుచూడాల్సిన పరిస్థితి ఉందని స్పష్టమవుతోంది. జీతాల పెంపు, పింఛన్‌ సవరణ అనేది ఇప్పట్లో ఉండకపోవచ్చని.. 2027 నుంచే అమలవుతుందని వార్తలు వస్తున్నాయి. 8వ వేతన సంఘం జీతాల సవరణ తక్షణమే అమలులోకి వచ్చే అవకాశం లేదని సమాచారం.

Also Read: Hyderabad Police: పోలీసుల మెరుపు వేగం.. గంటల్లోనే రూ.లక్షా 20 వేల నగదు బ్యాగు సీజ్

8వ వేతన సంఘంపై కేంద్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇప్పటికే కమిటీ ప్రకటించి.. ఉద్యోగుల నుంచి అభిప్రాయాలు, వారి వినతులు స్వీకరించింది. త్వరలో వేతన సంఘం అమలవుతుందని కొండత ఆశల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్‌దారులకు భారీ షాక్‌ ఇచ్చే వార్త ఇది. కొత్త వేతన విధానం 2026 జనవరి 1 నుంచే అమల్లోకి రానున్నప్పటికీ.. సవరించిన జీతాలు 2027లో మాత్రమే అమలులోకి రావచ్చని ఓ నివేదిక సూచిస్తోంది.

Also Read: AP Govt Gift: ఉచిత విద్యుత్‌కు ఎలా దరఖాస్తు ఎలా? ఏపీ ప్రభుత్వం మరో శుభవార్త!

జనవరి 2026 నుంచి 8వ వేతన సంఘం అమల్లోకి వచ్చినా కూడా దాని ప్రయోజనాలు అంటే సవరించిన జీతాలు, పింఛన్‌ కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 2027 వరకు వేచి ఉండాల్సి రావచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వేతన సవరణ సంఘం అమలులో జాప్యం జరిగితే బకాయిలు పెరిగే అవకాశం ఉంది. వేతన చెల్లింపు, భత్యాలు, పింఛన్లపై వేతన సంఘం అధ్యయనం చేసి.. కేంద్రానికి తన తుది సిఫార్సులను సమర్పించడానికి మరికాస్త సమయం పట్టే అవకాశం ఉండడంతో ఇది అమలయ్యే సమయం పెరిగే అవకాశాలు ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

Also Read: Tirumala VIPs Darshan: వేసవి సెలవుల ఎఫెక్ట్‌.. తిరుమల ఆలయానికి వీవీఐపీల రద్దీ

8వ వేతన సంఘం వివరాలు
కేంద్ర మంత్రివర్గం 2025 జనవరిలో 8వ వేతన సంఘానికి ఆమోదం తెలిపింది. అనంతరం ఈ కమిటీకి అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది. గత వేతన సంఘాల మాదిరిగానే సంప్రదింపులు పూర్తి చేసి.. నివేదికను సిద్ధం చేయడానికి ప్రభుత్వం ఈ సంస్థకు సుమారు 18 నెలల సమయం ఇచ్చింది. వస్తున్న సమాచారం ప్రకారం వేతన సంఘం సిఫార్సులు 2027 మధ్యలో సమర్పించే అవకాశం ఉంది. సమర్పించిన నివేదికను ప్రభుత్వం సమీక్ష చేసి.. సవరించిన జీతాలు, పెన్షన్ల తుది అమలును ప్రకటించనుంది. దీనికి సమయం పట్టేలా ఉంది.

వేతన సంఘం అమలులో ఏ మాత్రం ఆలస్యమైనా.. అర్హులైన ఉద్యోగులు, పెన్షనర్లకు పెండింగ్‌లో ఉన్న బకాయిలు పెరిగే అవకాశం ఉంది. 8వ వేతన సంఘం చర్చలలో ఫిట్‌మెంట్ అంశం కీలక సమస్యగా మారింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల మూల వేతనాన్ని సవరించడానికి ఈ సూత్రాన్ని ఉపయోగిస్తారు. 7వ వేతన సంఘం కింద ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను 2.57గా నిర్ణయించగా.. కనీస మూల వేతనం రూ.18,000కు పెరిగింది. ఈసారి ఉద్యోగ సంఘాలు ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను 3.68 నుంచి 3.83 మధ్య ఉంచాలని డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. దీనికి ఆమోదం లభిస్తే కనీస ప్రాథమిక వేతనం రూ.51,000 నుంచి రూ.69,000 మధ్య గణనీయంగా పెరగవచ్చని ఊహాగానాలు వస్తున్నాయి. ఇప్పటివరకు దీనిపై ఇంకా స్పష్టత రాలేదు.

8వ వేతన సంఘం సమీక్షించే అంశాలు ఇవే..
కరువు భత్యం (డీఏ)
ఇంటి అద్దె భత్యం (హెచ్‌ఆర్‌ఏ)
రవాణా భత్యం (టీఏ)
పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు పెన్షన్ సవరణలు

0
0
Report

Petrol Price Hike: వైఎస్‌ జగన్, చంద్రబాబు కలిసి ఏపీని భ్రష్టు పట్టించారు: వైఎస్‌ షర్మిల

Vijayawada, Andhra Pradesh:

Petrol And Diesel Price Hike: 'ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ పరువు దిగజార్చారు. మోదీ పిలక ట్రంప్ చేతికి చిక్కింది. అమెరికా ఎదుట ఇందిరాగాంధీకి ఉన్న తెగువ .. మోదీకి లేదు' అని కాంగ్రెస్‌ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పెట్రోల్‌పై వ్యాట్ భారాన్ని మోపిన వారు ధర్నాలు చేయడానికి సిగ్గుండాలని పరోక్షంగా వైఎస్సార్‌సీపీని విమర్శించారు. భారతదేశాన్ని మళ్లీ నిలబెట్టాలి అంటే రాహుల్ గాంధీతోనే సాధ్యమని షర్మిల ప్రకటించారు.

Also Read: LSG vs RR Highlights: ప్లేఆఫ్స్ రేసులో రాజస్థాన్ రాయల్స్‌ ముందడుగు.. లక్నోపై విజయం

విజయవాడలో జరిగిన కాంగ్రెస్‌ పార్టీ సమావేశంలో వైఎస్‌ షర్మిల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్భంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపుపై కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశానికి కాంగ్రెస్ అవసరం ఉందని తెలిపారు. ⁠నేడు దేశం దారుణ స్థితిలో ఉందనని.. ⁠పెట్రోల్ వాడొద్దు అంటున్నారు, బయట తిరగొద్దు అని అంటున్నారు. ⁠బంగారం కొనొద్దు అంటున్నారు. ⁠దీనికి కారణం ప్రధాని మోదీ' అని వైఎస్‌ షర్మిల ఆరోపించారు.

'⁠ఆనాడు క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగితే జనాల మీద పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ⁠ఒక భారం ప్రభుత్వం , ఒక భారం ఆయిల్ కంపెనీలు, మూడో భారం మాత్రమే ప్రజల మీద వేశారు. ⁠నేడు భారం అని చెప్పి మొత్తం ప్రజల నెత్తిన వేస్తున్నారు' అని ఏపీ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల తెలిపారు. '⁠క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినప్పుడు లాభం పొందారు. ఇప్పుడు ధరలు పెరిగితే జనాల మీద రుద్దుతున్నారు' అని మండిపడ్డారు.

Also Read: YS Sharmila: వైఎస్‌ జగన్, చంద్రబాబు కలిసి ఏపీని భ్రష్టు పట్టించారు: వైఎస్‌ షర్మిల

'⁠ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్ చార్జీలు దారుణం. ⁠దేశంలో ఎక్కడ లేని ఛార్జీలు మనదగ్గర ఉన్నాయి. ⁠వ్యాట్ అని సెస్ అని జనాలను దోచేస్తున్నారు. ⁠పెట్రోల్ ధరలు ఏపీలో ఎక్కువగా ఉన్నాయని ధర్నాలు చేయడం సిగ్గుచేటు. ⁠మీ హయాంలో లీటర్ ధరపై 4 రూపాయల వ్యాట్ ఎందుకు వసూలు చేశారు? ⁠వ్యాట్ తగ్గిస్తామని చెప్పిన చంద్రబాబు మాట మార్చారు. ⁠మ్యానిఫెస్టోలో పెట్టి మోసం చేశారు' అని జగన్‌, చంద్రబాబు లక్ష్యంగా వైఎస్‌ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు.

'ప్రధానమంత్రి మోదీ దేశ పరువు దిగజార్చారు. ⁠ఆనాడు ఇందిర హయాంలో ఒక మహిళగా అమెరికాను ఎదుర్కొన్నారు. ⁠మా దేశంపై మీ జోక్యం అనవసరం అని ధైర్యంగా చెప్పారు' అని వైఎస్‌ షర్మిల తీవ్ర ఆరోపణలు చేశారు. '⁠నేడు మోదీ ట్రాంప్ దగ్గర సాగిలపడ్డాడు. ⁠మోదీ పిలక ట్రాంప్ చేతికి చిక్కింది. ⁠అదానీ కోసం ట్రంప్ కి మోదీ బానిస అయ్యాడు. ⁠భారతీయులను సంకెళ్లు వేసి అమెరికా దేశానికి పంపితే కళ్ళప్పగించి చూశాం' అని వైఎస్‌ షర్మిల గుర్తుచేశారు. 'ప్రస్తుతం పాకిస్తాన్, చైనా మళ్లీ అమెరికాకు దగ్గర అవుతున్నాయి. ⁠దేశ గౌరవాన్ని మోదీ దారుణంగా దిగజార్చారు. ⁠దేశాన్ని మళ్లీ నిలబెట్టాలి అంటే రాహుల్ తోనే సాధ్యం. ⁠రాహుల్ దాచుకున్నది ఏమీ లేదు . దోచుకున్నది ఏమీ లేదు' అని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల తెలిపారు.

Also Read: 8th Pay Commission: ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్‌ అప్‌డేట్‌.. భారీగా జీతాల పెంపు అప్పుడే

0
0
Report

YS Sharmila: వైఎస్‌ జగన్, చంద్రబాబు కలిసి ఏపీని భ్రష్టు పట్టించారు: వైఎస్‌ షర్మిల

Vijayawada, Andhra Pradesh:

YS Sharmila vs YS Jagan: '⁠విభజన హామీలకు అన్యాయం జరుగుతుంటే చంద్రబాబు , జగన్ ఒక్క మాట కూడా బీజేపీని అడగలేదు. ⁠చంద్రబాబు, జగన్ ఇద్దరు కలిసి అభివృద్ధిని ఖూనీ చేశారు. ⁠11 ఏళ్లు దాటుతున్న రాజధాని లేని రాష్ట్రం అంటే అది ఏపీనే. రాష్ట్రాన్ని దోచుకు తిన్నారు' అని కాంగ్రెస్‌ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ధ్వజమెత్తారు. '⁠బీజేపీ రాష్ట్రానికి అన్యాయం చేస్తే బాబు, జగన్, పవన్ కల్యాణ్‌ ముగ్గురు మోదీకి ఊడిగం చేస్తున్నారు. ⁠పోటీలు పడి మద్దతు ఇస్తున్నారు. ⁠బీజేపీ బిల్లులకు గొర్రెల్లా మద్దతు ఇస్తున్నారు. ⁠జగన్ నవరత్నాలు, ⁠చంద్రబాబు సూపర్ సిక్స్‌లు మోసాలే' అని వైఎస్‌ షర్మిల విమర్శించారు. పదేళ్లలో ఉద్యోగాలు లేవని.. ⁠జలయజ్ఞం కింద పెండింగ్ ప్రాజెక్టులని పూర్తి చేయలేదని.. ⁠బీజేపీ అంటే రాష్ట్రంలో బాబు, జగన్, పవన్ అని వైఎస్‌ షర్మిల అభివర్ణించారు.

Also Read: AP Govt Gift: ఉచిత విద్యుత్‌కు ఎలా దరఖాస్తు ఎలా? ఏపీ ప్రభుత్వం మరో శుభవార్త!

విజయవాడలో కాంగ్రెస్‌ పార్టీలోకి వివిధ పార్టీల నాయకులు చేరడంతో వారికి ఆహ్వానం పలికిన అనంతరం షర్మిల కీలక ప్రసంగం చేశారు. వైఎస్‌ జగన్‌, చంద్రబాబుతోపాటు కేంద్ర సర్కార్‌పై నిప్పులు చెరిగారు. 'పాదయాత్రలు చేసినంత మాత్రాన వైఎస్సార్ వారసులు కారు. వైఎస్సార్‌ పేరు చెప్పి అధికారంలోకొచ్చి మెడలు, మిద్దెలు కట్టుకున్నారు. ⁠ఇంట్లో కూర్చొని బటన్ నొక్కడం కాదు వైఎస్సార్ వారసత్వం. ⁠ప్యాలెస్‌లో బతికితే కాదు వైఎస్సార్ వారసత్వం. వైఎస్సార్‌ ఆశయాలు, ఐడియాలజీ పాటించే వారే నిజమైన వారసులు. ⁠కాంగ్రెస్ పార్టీని బలపరచడం అంటే ఆయన ఆశయాలను నిలబెట్టడం' అని వైఎస్‌ షర్మిల తెలిపారు.

Also Read: 8th Pay Commission: ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్‌ అప్‌డేట్‌.. భారీగా జీతాల పెంపు అప్పుడే

తన తండ్రి వైఎస్సార్‌ సులువుగా ముఖ్యమంత్రి కాలేదని.. ⁠ముఖ్యమంత్రి అయ్యాక కూడా ఎంతో కష్టపడ్డాడని షర్మిల చెప్పారు. ⁠ప్రజల కోసం వెళ్లి చనిపోయాడని గుర్తుచేసుకున్నారు. ⁠ఈ మధ్య నాయకులు ఒకసారి ముఖ్యమంత్రి అయితే ప్రజలకు అందుబాటులో లేరు. ⁠సొంత పార్టీ నాయకులకు కూడా కనపడలేదు. ⁠మంత్రులకు, ఎమ్మెల్యేలకు కూడా కలవడానికి వీలు లేదు' అని తన సోదరుడు వైఎస్‌ జగన్‌ను ఉద్దేశించి షర్మిల వ్యాఖ్యానించారు.

ప్రజానాయకుడు వైఎస్సార్‌ అని.. ⁠ఇలాంటి నాయకుడు మళ్లీ పుట్టడు. ⁠ముఖ్యమంత్రి అయ్యాక కూడా రచ్చబండ పెట్టాడు. వైఎస్సార్‌ ప్రవేశ పెట్టిన పథకాలు ప్రతిదీ అద్భుతం. ⁠ఇతర పార్టీల ఐడియాలజీకి , కాంగ్రెస్ ఐడియాలజీకి చాలా భిన్నం. ⁠రాష్ట్ర ప్రజలు మళ్లీ కాంగ్రెస్ ఐడియాలజీ కోరుకుంటున్నారు' అని వైఎస్‌ షర్మిల పేర్కొన్నారు. '⁠దేశంలో, రాష్ట్రంలో రాజ్యాంగం బతికి ఉండాలి అంటే మళ్లీ కాంగ్రెస్ అధికారంలో రావాలి. ⁠దేశంలో రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి అవ్వాలి' అని ఆకాంక్షించారు. 'వైఎస్సార్‌ రాహుల్‌ను ప్రధాని చేయాలని కోరుకున్నారు. వైఎస్సార్‌ కలను నిజం చేయడానికి నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా' అని వివరించారు.

Also Read: India Squad: అఫ్ఘానిస్తాన్ సిరీస్‌కు భారత జట్టు ప్రకటన.. హిట్‌మ్యాన్‌ రీఎంట్రీ

'⁠విభజన తర్వాత ఆంధ్రరాష్ట్రం చితికి పోయింది. ⁠మళ్లీ రాష్ట్రం బాగుపడాలి అంటే కాంగ్రెస్ రావాలి. ⁠తెలంగాణ ఉద్యమంలో ఎక్కువమంది చనిపోవద్దని రాష్ట్రాన్ని కాంగ్రెస్ విభజించింది. ⁠ఆంధ్రకు అన్యాయం చేయాలని విభజన చేయలేదు. విభజిత రాష్ట్రాన్ని నిలబెట్టాలని ఎన్నో హామీలు చట్టంలో పెట్టారు. విభజించిన తర్వాత రాష్ట్రం వెంటనే బాగుపడేలా హామీలు ఇచ్చారు. ⁠ప్రత్యేక హోదా కాంగ్రెస్ చట్టంలో పెట్టింది. ⁠హోదా వచ్చి ఉంటే పన్నుల రాయితీ ఉండేది. ⁠వేల సంఖ్యలో పరిశ్రమలు వచ్చేవి. ⁠పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చారు. ⁠కేంద్రమే నిర్మించి 35 లక్షల ఎకరాలను సస్యశామలం చేయాలని అనుకున్నారు. ⁠రాజధాని నిర్మాణం కేంద్రమే అని హామీ ఇచ్చారు. ⁠కడప స్టీల్ , దుగరాజపట్నం, మెట్రో రైల్, వెనుకబడిన ప్రాంతాలకు నిధులు ఇలా ఎన్ని హామీలు. ⁠ఆనాడే కేంద్రం ఇచ్చిన హామీల విలువ అక్షరాల రూ.5 లక్షల కోట్లు' అని వైఎస్‌ షర్మిల చిట్టా విప్పారు.

కానీ విభజన తర్వాత ఒక్క హామీ నేటికి నెరవేరలేదని.. ⁠కాంగ్రెస్ అధికారంలో వచ్చి ఉంటే ఇచ్చిన ప్రతి హామీ నెరవేరి ఉండేదని వైఎస్‌ షర్మిల పేర్కొన్నారు. ⁠బీజేపీ ఆంధ్రప్రదేశ్‌కి 11 ఏళ్లుగా వెన్నుపోటు పొడుస్తుంది. ⁠అధికారంలో వచ్చిన టీడీపీ, వైఎస్సార్‌సీపీలు స్వార్థ రాజకీయాలు చేసుకున్నాయి. హోదా మీద ఇద్దరు మాట్లాడలేదు. ⁠పోలవరానికి అన్యాయం జరుగుతుంటే నోరు విప్పలేదు' అని జగన్‌, చంద్రబాబుపై మండిపడ్డారు.

0
0
Report
Advertisement
Advertisement
Back to top