రెవెన్యూ సంబందిత సమస్యలు త్వరగా పరిష్కారించాలి: కలెక్టర్
Khammam, Telangana:ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, కలెక్టరేట్లో రెవిన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ధరణి, ప్రజావాణి, ధృవీకరణలు, ప్రభుత్వ భూముల పరిరక్షణపై చర్చించారు. మండల స్థాయిలో రెవిన్యూ వ్యవస్థ పటిష్టంగా ఉండాలని, ప్రజల సమస్యలు మండల స్థాయిలోనే పరిష్కరించాలన్నారు. డిటి, ఆర్ఐ, సీనియర్, జూనియర్ అసిస్టెంట్లకు చట్టాలపై శిక్షణ అందించాలని సూచించారు. రెవిన్యూ అధికారులకు పూర్తి నాలెడ్జ్ ఉండాలని, తహసీల్దార్ కార్యాలయం స్పందించకపోవడం అంగీకరించలేమని స్పష్టం చేశారు.
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
Tirumala Laddu: తిరుమల లడ్డూ విక్రయాల్లో సరికొత్త రికార్డు
Dharmavaram, Andhra Pradesh:Tirumala Laddu Prasadam Record Sales In 2025 26 Financial Year Watch VideoSreeleela Video: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న శ్రీలీల
Dharmavaram, Andhra Pradesh:Actress Sreeleela Tirumala Darshan With Srivani Trust Quota Watch VideoGas Cylinder Theft: ఖమ్మంలో సరికొత్త దొంగతనం.. బంగారం కన్నా గ్యాస్ సిలిండర్ ఎక్కువ
Penuballi, Telangana:LPG Gas Cylinder: గ్యాస్ సిలిండర్ల సమస్య దేశంలో తీవ్రంగా వేధిస్తుండగా దొంగలు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దాని ప్రభావం ఎంతలా బంగారం, వెండి ఆభరణాలకు తగ్గట్టు అంతటి విలువ గ్యాస్ సిలిండర్ పొంది ఉంది. ఖమ్మం జిల్లాలో జరిగిన దొంగతనంలో బంగారు, వెండి ఆభరణాలతోపాటు గ్యాస్ సిలిండర్ను దొంగతనం చేశాడు. అంతేకాకుండా ఇంట్లో ఉన్న వంటనూనె క్యాన్ను కూడా తస్కరించాడు. వైరల్గా మారిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
Also Read: Cyber Fraud: వికసిత్ భారత్ పేరిట మోసం.. సైబర్ నేరగాళ్ల చేతిలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే
ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో పట్టపగలు జరిగిన చోరీ కలకలం రేపింది. దొంగలు బంగారం, వెండి ఆభరణాలతో పాటు వంట నూనె, గ్యాస్ సిలిండర్ను కూడా ఎత్తుకెళ్లడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. జార్ఖండ్ నుంచి వచ్చి లంకపల్లి గ్రామంలోని మసీద్లో నాలుగు సంవత్సరాలుగా మహమ్మద్ కమాలుద్దీన్ మౌల్వీ సాబ్గా పని చేస్తున్నాడు. మసీద్ ఆవరణలోనే నివాసం ఉంటూ లంకపల్లి సెంటర్లో ఫ్యాన్సీ షాపు నిర్వహించుకుంటూ జీవిస్తున్నాడు.
Also Read: Voice And SMS Packs: మొబైల్ వినియోగదారులకు తీపి కబురు.. డేటా లేకుండా రీచార్జ్ ప్లాన్స్
యథావిధిగా గురువారం తన ఇంటికి తాళం వేసి మౌల్వీ సాబ్ తన భార్యతో కలిసి దుకాణానికి వెళ్లారు. తర్వాత మధ్యాహ్నం ఇంటికి వచ్చే సరికి ఇంటి తాళాలు పగలకొట్టి.. ఇంట్లోని వస్తువులు చిందరవందరగా పడి ఉన్నాయి. లోపలికి వెళ్లి చూడగా బీరువా తాళాలు పగలకొట్టి ఉంది. పరిశీలించగా రూ.10 వేల నగదుతో పాటు 5.195 గ్రాముల బంగారు ఆభరణాలు, 454.74 గ్రాముల వెండి ఆభరణాలను దొంగతనానికి గురయ్యాయి. దీంతోపాటు ఇంట్లో ఉన్న నిత్యావసర వస్తువులు, 15 లీటర్ల వంట నూనె, గ్యాస్ సిలిండర్ను దొంగలు ఎత్తుకెళ్లారు. గ్యాస్ కనెక్షన్ను తీసేసి మరీ గ్యాస్ సిలిండర్ను దొంగలించడం గమనార్హం. బాధిత కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దొంగతనం జరిగిన విధానాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
మేడిపల్లిలో దొంగతనం
మల్కాజిగిరి కమిషనరేట్ మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధి పర్వతాపూర్ మల్లికార్జున్ నగర్ ఓ ఇంట్లో చోరీ జరిగింది. బంధువు మరణించాడని కుటుంబసభ్యులు వెళ్లి వచ్చేలోపు ఇంట్లో దొంగతనం చోటుచేసుకుంది. ఇంట్లోని బంగారం, వెండి ఆభరణాలు దుండగులు అపహరించారు. ఐదు తులాల బంగారు ఆభరణాలు, కొంత నగదు చోరీకి గురైందని బాధితురాలు రేణుక తెలిపారు.
సికింద్రాబాద్లో చైన్స్నాచింగ్
హైదరాబాద్ సికింద్రాబాద్లో చైన్ స్నాచింగ్కు పాల్పడుతున్న నిందితుడిని రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జీఆర్పీ, ఆర్పీఎఫ్ సంయుక్తంగా చేపట్టిన దర్యాప్తులో దొంగ చిక్కాడు. అతడి 50 గ్రాముల బంగారు నగలు స్వాధీనం చేసుకున్నారు. షేర్ మార్కెట్ నష్టాలు, ఆన్లైన్ బెట్టింగ్ కారణంగా ఈ నేరాలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. రెండు కేసులు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Telangana Ration Card: రేషన్కార్డుదారులకు షాకింగ్ న్యూస్..త్వరలోనే వాళ్లందరికీ రేషన్ కార్డులు కట్!
Hyderabad, Telangana:Telangana Ration Card News: రేషన్ కార్డుదారులకు దిమ్మతిరిగే వార్త ఇది. తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటికే 1.40 లక్షల రేషన్ కార్డులను తొలగించిన ప్రభుత్వం ఇప్పుడు అనర్హులను గుర్తించే పనిలో పడింది. అనర్హులకు నోటీసులు ఇవ్వడమే కాకుండా.. ఏఐ సాఫ్ట్వేర్ ఆధారంగా పనిచేసే ప్రక్రియను మరింత వేగవంతం చేస్తున్నారు.Bellamkonda Srinivas Marriage: హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పెళ్లి ఫిక్స్..పెళ్లి జరిగేది ఆరోజే..లగ్నపత్రిక రెడీ!
Hyderabad, Telangana:Bellamkonda Srinivas Marriage Invitation: టాలీవుడ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. హైదరాబాద్కు చెందిన కావ్యా రెడ్డి అనే వ్యాపారవేత్తను పెళ్లాడనున్నాడు. ఏప్రిల్ 29న వీరిద్దరి పెళ్లి జరగనుంది.Cyber Fraud: వికసిత్ భారత్ పేరిట మోసం.. సైబర్ నేరగాళ్ల చేతిలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే
Jangaon, Telangana:Viksit Bharat Scheme Cyber Fraud: సైబర్ నేరగాళ్లు సాధారణ ప్రజలను వదిలిపెట్టి వీవీఐపీలను పట్టుకుంటున్నారు. ఇప్పటికే ఏపీలో పలువురు ప్రజాప్రతినిధులను బురిడీ కొట్టి మోసం చేసిన సైబర్ మోసగాళ్లు ఇప్పుడు తెలంగాణ ఎమ్మెల్యేను కూడా తమ వలలో వేసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ పేరు చెప్పి ఎమ్మెల్యేతో మాట్లాడి రూ.లక్ష తన్నుకుపోయారు. తీరా అసలు విషయం తెలుసుకుని ఎమ్మెల్యే విస్తుపోయాడు. ఆ ఎమ్మెల్యే ఎవరో కాదు బీఆర్ఎస్ పార్టీ జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి. ఈ ఘటనపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
Also Read: Voice And SMS Packs: మొబైల్ వినియోగదారులకు తీపి కబురు.. డేటా లేకుండా రీచార్జ్ ప్లాన్స్
జనగామ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఫోన్కు ఒకరు ఫోన్ చేసి 'ఫైనాన్స్ అడిషనల్ సెక్రటరీ మాట్లాడుతున్నా. కేంద్ర ప్రభుత్వ పథకం వికసిత్ భారత్ ద్వారా నిరుద్యోగ యువతకు రూ.10 లక్షల వరకు రుణాలు ఇచ్చే అవకాశం ఉంది. దీనికి ఒక్కొక్కరికి రూ.2,500 ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాల్సి ఉంది' అని వివరించాడు. ఈ పథకంతో తన జనగామ నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతకు ఆర్థిక ప్రయోజనం లభిస్తుందని భావించిన పల్లా రాజేశ్వర్ రెడ్డి తనకు ఫోన్ చేసిన వ్యక్తికి రూ.లక్ష ఫోన్పే ద్వారా చెల్లించాడు. అనంతరం అసలైన ఫైనాన్స్ అడిషనల్ సెక్రటరీకి ఫోన్ చేసి డబ్బులు అందాయా? అని ఎమ్మెల్యే అడిగారు.
Also Read: Nayanthara: తిరుమలలో హీరోయిన్ నయనతారపై ఎగబడ్డ అభిమానులు
డబ్బులు ఎక్కడివి? ఏం మాట్లాడుతున్నారు? తాను ఫోనే చేయలేదని ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శి బదులివ్వడంతో పల్లా రాజేశ్వర్ రెడ్డి అవాక్కయ్యారు. తాను మోసపోయానని గ్రహించి వెంటనే జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సైబర్ క్రైమ్ విభాగంలో ఈ ఘటనపై కేసు నమోదైంది. సైబర్ మోసగాళ్ల చేతిలో ఎమ్మెల్యే మోసపోవడం ఇది తొలిసారి కాదు. గతంలో ఏపీకి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు కూడా మోసపోయారు.
సైబర్ నేరగాళ్లు, మోసగాళ్లు వీవీఐపీలనే ఈ స్థాయిలో మోసం చేస్తుంటే ఇక సాధారణ ప్రజల పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవాలి. అసలు నేరాల కంటే సైబర్ మోసాలు భారీగా పెరిగిపోతుండడంతో పోలీసులు వీటిపై ప్రత్యేకంగా దర్యాప్తు చేపడుతున్నారు. అయితే ఎంత చేసినా ముందు ప్రజలు సైబర్ మోసగాళ్లపై అవగాహన పెంచుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. అవగాహన ఉంటే మోసపోయే అవకాశం ఉండదని చెబుతున్నారు.
Also Read: YSR Death Reason: తండ్రి వైఎస్సార్ మరణం వెనుక వైఎస్ జగన్ హస్తం: అచ్చెన్నాయుడు తీవ్ర ఆరోపణలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
YS Sharmila: అన్న వైఎస్ జగన్ వైఎస్ షర్మిల ఆగ్రహం.. వైఎస్సార్ ఆశయాలకు వారసుడు కాదు
Vijayawada, Andhra Pradesh:YS Jagan MAVIGUN: మావిగన్ అంటూ రాజధానిపై కొత్త ప్రతిపాదన తీసుకువచ్చిన మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అతడు మావిగన్ జోకర్ అని ప్రకటించారు. 3 రాజధానుల పేరుతో రుషికొండ మింగేసి సొంతానికి ప్యాలెస్లు కట్టుకున్నారని మండిపడ్డారు. వారసులం అని చెప్పుకునే జగన్ వైఎస్సార్ పేరును వాడుకున్నారు తప్పిస్తే.. ఆయన ఆశయాలకు వారసులు కాలేదని ప్రకటించారు.
Also Read: YSR Death Reason: తండ్రి వైఎస్సార్ మరణం వెనుక వైఎస్ జగన్ హస్తం: అచ్చెన్నాయుడు తీవ్ర ఆరోపణలు
వైఎస్సార్ చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్రకు నేటికి 23 ఏళ్లు పూర్తవడంతో వైఎస్ షర్మిల 'ఎక్స్' వేదికగా స్పందించారు. 'వైఎస్సార్సీపీలో నిజంగా వైఎస్సార్ ఐడియాలజీ ఉంటే జగన్ సీఎం అయ్యి కూడా వైఎస్సార్ జలయజ్ఞాన్ని ఎందుకు పూర్తి చేయలేదు? వైఎస్సార్ వ్యతిరేకించిన బీజేపీకి దత్తపుత్రుడుగా ఎందుకు మారారు? దళితులపై, క్రిస్టియన్లపై దాడులు జరుగుతుంటే మౌనంగా ఎందుకున్నారు? అని వైఎస్ షర్మిలా రెడ్డి ప్రశ్నించారు. వైఎస్సార్ ఐడియాలజీ కాంగ్రెస్తోనే సాధ్యమని ప్రకటించారు.
Also Read: Tirumala Laddu: తిరుమలలో సరికొత్త రికార్డు.. రూ.13.95 కోట్ల లడ్డూ విక్రయాలతో రూ.567 కోట్ల ఆదాయం
'ఏప్రిల్ 9, 2003లో తెలంగాణలోని చేవెళ్ల నుంచి ఇచ్చాపురం దాక ప్రజాహితమే పరమావధిగా సాగిన 1,457 కిలోమీటర్ల పాదయాత్ర కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలోనే కాదు.. దేశంలోనూ అధికారంలో తెచ్చిన ఒక శాశ్వత జ్ఞాపకం. కాంగ్రెస్ నాయకుడు, నాన్న వైఎస్సార్ ప్రజాప్రస్థానం తెలుగు ప్రజల గుండెల్లో ఈరోజుకు పదిలం' అని వైఎస్ షర్మిల తెలిపారు. ప్రతిపక్ష నాయకుడిగా ఆనాటి పాదయాత్ర నేటి అభివృద్ధికి నిర్వచనం.. 23 ఏళ్లుగా సంక్షేమానికి మహానేత పెట్టిన చెక్కుచెదరని సంతకం అని కొనియాడారు. ప్రజలకు నేనున్నాననే భరోసా కల్పించిన అభయహస్తం.. రాష్ట్ర దుర్భర పరిస్థితులను అంతమొందించిన స్వర్ణయుగం అని తన తండ్రి పాలనపై వైఎస్ షర్మిల ప్రశంసలు కురిపించారు.
Also Read: Nayanthara: తిరుమలలో హీరోయిన్ నయనతారపై ఎగబడ్డ అభిమానులు
'వారసులం అని చెప్పుకునే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైఎస్సార్ పేరును వాడుకున్నారు తప్పిస్తే ఆయన ఆశయాలకు వారసులు కాలేదు. మాట తప్పం మడమ తిప్పం అనే వైఎస్సార్ లైన్ వాడుకోవడం తప్పిస్తే పూర్తి మద్యపాన నిషేధమని మాట ఇచ్చి.. కల్తీ మద్యం అమ్మి ఓన్లీ క్యాష్ మాఫియా ఎందుకు చేశారు?' అని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ప్రశ్నించారు. 'వైఎస్సార్ తన జీవిత కాలం వ్యతిరేకించిన బీజేపీకి దత్తపుత్రుడుగా ఎలా మారారు? ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తే మౌనంగా ఎందుకున్నారు? దేశ వ్యాప్తంగా క్రిస్టియన్ మైనారిటీలపై ఆర్ఎస్ఎస్ వాదులు దాడులు చేస్తుంటే వైఎస్సార్ వారసుడిగా జగన్ ఎందుకు ఖండించలేదు?' అని నిలదీశారు.
Also Read: Voice And SMS Packs: మొబైల్ వినియోగదారులకు తీపి కబురు.. డేటా లేకుండా రీచార్జ్ ప్లాన్స్
సంక్షేమానికి సారథి వైఎస్సార్. ఆయన ప్రతీ పథకం ప్రజల కష్టం కన్నీళ్ల నుంచి పుట్టిందే. ఉచిత కరెంటు, రైతు రుణమాఫీ, రాజీవ్ ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్ మెంట్, జలయజ్ఞం, ఇందిరమ్మ పక్కా ఇండ్లు, పావుల వడ్డీకే రుణాలు, 108/104 అంబులెన్స్ సేవలు ఇలా ప్రతీది ఒక చరిత్ర' అని వైఎస్ షర్మిల వెల్లడించారు. వైఎస్సార్ ఐడియాలజీ బతికి ఉంది కేవలం కాంగ్రెస్ పార్టీలోనే.. ఆయన ఆశయాలు మళ్లీ కాంగ్రెస్తోనే సాధ్యమని చెప్పారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Free House: వార్నీ.. ఇల్లు ఫ్రీ, ఉద్యోగం కూడా ఇస్తారట! యూరప్లో ఉన్న ఆ ఊరికి వెళ్తారా? ఓ కండిషన్ ఉందోయ్!
Hyderabad, Telangana:Free House And Job In Spain Village: ఎంతో మంది కలల దేశం యూరప్లో ఉచిత ఉద్యోగం, ఉండటానికి ఇల్లు ఉంటే ఎలా ఉంటుంది? ఉదయం లేవగానే చుట్టూ కొండలు, ట్రాఫిక్, ఎలాంటి శబ్దం లేకుండా ఉండే వాతావరణం ఎవరికి ఇష్టం ఉండదు? స్పెయిన్లోని అరెనిల్లా అనే గ్రామం ఆ ఊళ్లో ఉంటే ఇల్లు, జాబ్ కూడా ఉచితంగా ఇస్తున్నారు. ఇది కేవలం ఫ్రీ హాలిడే కాదు.. సీరియస్ డీల్. రీయల్గా మీరు ఫ్రీగా ఇల్లు, ఉద్యోగం పొందుతారు. కానీ, దీనికి ఒక కండీషన్ ఉంది.
అరెనిల్లాస్ ఉచితంగా ఇల్లు, జాబ్కు కండీషన్స్ ఏంటంటే?
అరెనిల్లాస్ స్పెయిన్లోని అత్యంత జనాభాల ఉండే సోరియా ప్రాంతానికి దూరంగా ఉన్న మారుమూల గ్రామం. దాదాపు అక్కడ ఓ 40 నివాసాలు ఉంటాయి. ఈ గ్రామానికి ఇంకో పేరు 'Empty Spain'. ఎందుకంటే కొన్ని దశాబ్దాలుగా ఇక్కడే ఉండే ప్రజలు కనుమరుగైపోతున్నారు. ఈ సమస్యను అధిగమించడానికే లోకల్ కౌన్సిల్ ఈ ఆఫర్ చేస్తోంది.
ఈ ఆఫర్ కేవలం ఫ్యామిలీస్కు మాత్రమే
అయితే, వారికి స్కూలుకు వెళ్లే పిల్లలు కూడా ఉండాలి
వారు శాశ్వతంగా అక్కడే నివాసం ఉండాలి
అక్కడ ఓ విలేజ్ బార్ కూడా తప్పకుండా నడపాలి
స్థానిక మున్సిపల్లో కూడా వారు పనిచేయాలి అని కండీషన్స్ పెడుతోంది.
ప్రధానంగా 40 మందే ఉండటంతో ఆ ఊరి జనాభా పెంచడానికి ఈ ఉచిత ఇల్లు, జాబ్ ఆఫర్ అందిస్తోంది. అయితే, ఈ ప్రకటన చేసిన వెంటనే దాదాపు 100 దరఖాస్తులు కూడా ఇప్పటికే వచ్చాయట. ఈ ఇల్లు రినోవేట్ చేసిన ఏడు ఇళ్లలో ఒకటి కేటాయిస్తారు. మిగతా ఇల్లు ఒక్కోక్కటి నెలకు 100 యూరోలు. బాధ్యత ఎక్కువ ఉంటాయి కాబట్టి ఉచితంగా అందిస్తున్నారు.
Also Read: ఇరాన్కు డొనల్డ్ ట్రంప్ చివరి హెచ్చరిక.. ఈరోజు రాత్రి ఏం జరుగుతుందో..?
అరెనిల్లాస్ ఎందుకు ప్రత్యేకం..?
2026 ప్రారంభంలోనే ఈ ఆఫర్ ప్రకటించారు. దీంతో కేవలం వారంలోనే 100 అప్లికేషన్స్ కూడా వచ్చాయి. ఎందుకుంటే యూరప్లో ఫ్రీ ఇల్లు అంటే అది కలే.. దీనికి తోడు జాబ్ కూడా లభిస్తుంది. అది కూడా లైఫ్టైమ్ ఆఫర్.
అయితే ఇక్కడ సులభంగా బతకవచ్చు. ఇది కొండ ప్రాంతంలో ఉంటుంది కాబట్టి ఉష్ణోగ్రతలు కూడా కాస్త వెచ్చగానే ఉంటుంది. ఏప్రిల్ నెలలో 24 డిగ్రీలు నమోదు అవుతాయి.
అయితే, ఇక్కడ ఉన్న మరో కండీషన్ ఏంటంటే తాత్కాలికంగా కాదు.. ఇక్కడ శాశ్వతంగా నివాసం ఉండాల్సిందే.
ఇవి మర్చిపోకండి..
ఇది కల కాదు.. ఒకసారి నిజంగా ఆలోచించండి. శాశ్వతంగా అక్కడే మీరు ఉండిపోలరా? అని గుర్తుంచుకోండి. అరెనిల్లా ఊళ్లో జీవనం ఏకాంతంగా చాలా బాగుంటుంది. చలికాలంలో కాస్త ఇబ్బంది తప్పదు. అంతేకాదు ఈ ఊరికి రవాణా కూడా అంతంత మాత్రమే. కచ్చితంగా సొంత వాహనం ఉండాల్సిందే. ఇక్కడ స్కూళ్లు కూడా 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ప్రతిరోజూ ఉచితంగా రవాణా కూడా ఉంటుంది. కేవలం ప్రాథమికస్థాయిలో మాత్రమే ఆరోగ్య సేవలు లభిస్తాయి. అత్యవసర సీరియస్ సమయంలో టౌన్కు వెళ్లాల్సిందే. ఇక్కడ ఉద్యోగాలు కూడా అంత ఈజీగా దొరకవు.
ఇక్కడ మీరు విలేజ్ బార్ నడిపించినా అవి పెద్దగా లాభాలు ఇవ్వవు. సామాజిక బంధాలను సజీవంగా ఉంచడానికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తారు. మున్సిపల్ వర్క్, ఇటుకలు పేర్చే పని కూడా చేయాల్సి ఉంటుంది. దీనికి శారీరక శ్రమ ఎక్కువ. ఆ గ్రామంలో ప్రస్తుతం చాలా ఇల్లు రెనోవెట్ చేస్తున్నారు. కాబట్టి ఈ పని ఎంతో ముఖ్యం. మీరు గుర్తుంచుకోవాల్సిన మరీ ముఖ్యమైన అంశం ఏంటంటే వీళ్లు మీకు ఉచితంగా వీసా ఏమీ ఇవ్వరు. మీరు దరఖాస్తు చేసుకోవాలంటే ఇప్పటికే స్పెయిన్ వీసా ఉంటేనే అక్కడ ఉండగలరు.. పనిచేయగలరు.
అరెనిల్లాస్ ఎందుకు ఈ ఆఫర్ చేస్తోంది?
అరెనిల్లాస్ గ్రామం ఈ ఆఫర్ వెనుక పెద్ద కథ ఉంది. 1950 నుంచి ఇక్కడి ప్రజలు స్పెయిన్లోని వివిధ సిటీలోకి వలస వెళ్లిపోతున్నారు. గ్రామంలో కేవలం వయస్సు మళ్లిన వృద్ధులు మాత్రమే ఉంటున్నారు. మరికొన్ని ఇళ్లు అయితే, ఖాళీగానే మిగిలిపోయాయి. ఒక్కో సీజన్లో అయితే, ఈ అరెనల్లాస్ గ్రామంలో 300 మంది జనాభా ఏవైనా పండుగలు ఉన్నప్పుడు కనిపిస్తారు. కానీ, ఏడాదిలో ఎక్కువ రోజులు ఈ ఊరంతా ఖాళీగానే కనిపిస్తుంది. కొత్తగా ఎవరైనా ఇక్కడ ఉందామని వచ్చిన ఈ సమస్యలు చూపి వెళ్లిపోతున్నారు.
మీరు దరఖాస్తు చేసుకుంటారా?
మీకు కూడా సైలెంట్, ప్రకృతికి దగ్గరగా, కాంక్రీట్ జంగిల్కు దూరంగా ఉండాలంటే ఇవేం పెద్ద సమస్యలు కావు. కొంతమంది గ్రామంలో ఉండటం అంటే ఇష్టం వారికి బెస్ట్ ఛాన్స్. ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ కేఫ్స్ అందుబాటులో ఉండవు. సాధారణ యూరోపియన్ లైఫ్స్టైల్ ఇక్కడ కష్టం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
YSR Death Reason: తండ్రి వైఎస్సార్ మరణం వెనుక వైఎస్ జగన్ హస్తం: అచ్చెన్నాయుడు తీవ్ర ఆరోపణలు
Amaravathi, Andhra Pradesh:Amaravati: '2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎం అయ్యే నాటికి ఆ కుటుంబం ఆర్థిక పరిస్థితి అందరికీ తెలిసిందే. తండ్రిని అడ్డం పెట్టుకుని జగన్ డబ్బులు సంపాదించారనే విషయం కూడా అందరికీ తెలుసు. తండ్రిని కూడా జగన్ మోహన్ రెడ్డిని మానసిక క్షోభకు గురి చేశాడు. రాష్ట్రంలో జగన్ ఉంటే తనకు రాష్ట్రానికి నష్టమని నాడు వైఎస్సార్ ఆయన్ను బెంగళూరుకు పంపారు. ఈ విషయం రోశయ్యే చెప్పారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని జగన్ కలలు గన్నారు.. వైఎస్ ఉంటే తాను సీఎం కాలేరు. 2009లో వైఎస్సార్ తిరిగి సీఎంగా ఎన్నికయ్యారు. చిత్తూరు జిల్లా పర్యటనకు వెళ్తే హెలికాప్టర్ మిస్ అయింది.. అందరూ ఆందోళనలో ఉన్నారు' అని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.
Also Read: Tirumala Laddu: తిరుమలలో సరికొత్త రికార్డు.. రూ.13.95 కోట్ల లడ్డూ విక్రయాలతో రూ.567 కోట్ల ఆదాయం
నిన్న వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలపై అమరావతిలోని సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో అచ్చెన్నాయుడు స్పందించారు. ప్రెస్ కాన్ఫరెన్స్లో కీలక వ్యాఖ్యలు చేశారు. 'వైఎస్సార్ చనిపోయిన సమయంలో జగన్ ఇతర రాష్ట్రాల్లో ఉండాల్సిన అవసరం ఏమొచ్చింది? వైఎస్సార్ చనిపోయిన రోజునే పోలవరం టెండర్లను ఆన్లైన్లోకి ఎక్కించాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇంకా వైఎస్ మరణం నిర్ధారణ కాకముందే సీఎం పదవి కోసం జగన్ సంతకాల సేకరణ చేపట్టారు. వైఎస్ మరణం మీద చాలా మంది నాడే అనుమానాలు వ్యక్తం చేశారు. వైఎస్ మరణం వెనుక జగన్ హస్తం ఉందని ప్రస్తుతం వైసీపీలో ముఖ్యనేతగా ఉన్న బొత్స కామెంట్ చేశారు. ఆ రోజు మేం నమ్మలేదు.. సభ్య సమాజంలో ఇలా ఎందుకు చేస్తారని అనుకున్నాం. కానీ సైకోకు పదవీ వ్యామోహం ఉంటే తండ్రిని, తల్లిని, చెల్లిని, బాబాయినైనా వదలరని ఇప్పుడు జగన్ ప్రవర్తన చూస్తుంటే అర్థమవుతోంది' అని అచ్చెన్నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైఎస్ మరణానికి రిలయెన్స్ సంస్థలే కారణమంటూ ఆ సంస్థల మీద జగన్ దాడులు చేయించారు.. తిరిగి వాళ్లకే రాజ్యసభ కట్టబెట్టారని గుర్తుచేశారు.
Also Read: Voice And SMS Packs: మొబైల్ వినియోగదారులకు తీపి కబురు.. డేటా లేకుండా రీచార్జ్ ప్లాన్స్
'2014లో తండ్రి మరణం నుంచి సింపతీ పొంది.. ముఖ్యమంత్రి పదవి కోసం ప్రయత్నించాడు. 2019లో అధికారం కోసం సొంత బాబాయిని చంపారు. అధికారం దక్కించుకున్నారు. వివేకాను ఎవరు చెప్పారంటే రాష్ట్రంలో ఏ చిన్నపిల్లవాడిని అడిగినా చెబుతారు. ఇప్పుడు తల్లి, చెల్లి కూడా జగన్ అసలు నైజం గురించి చెబుతున్నారు. తండ్రి ఇచ్చిన మాటను నిలబెట్టాలని తల్లి అడిగితే తల్లిని కూడా బయటకు పంపిన నైజం జగన్ మోహన్ రెడ్డిది. రోశయ్య చెప్పినా.. బొత్స చెప్పినా.. మాకు అనుమానాలున్నా మేం నిజం కాదేమో అనుకున్నాం. కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవన్నీ నిజమేనని అనిపిస్తోంది' అని అచ్చెన్నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Also Read: YS Jagan Padayatra: చంద్రబాబు పాలనలో ఏపీ మొత్తం తిరోగమనం: వైఎస్ జగన్
'సైకోకు పదవీ వ్యామోహం వస్తే ఎలా ఉంటారో జగన్ మోహన్ రెడ్డిని చూస్తే అర్థమవుతుంది. రాష్ట్రం ఎలా ఉన్నా... కుటుంబం ఎలా ఉన్నా? సమాజం ఎలా ఉన్నా జగన్కు పర్వాలేదు.. అతనికి పదవే ముఖ్యం. నిలకడలేని వ్యక్తిత్వం ఉన్నవాళ్లని సైకో అంటారు. సీఎం పదవి కోసం కాంగ్రెస్ మీద దాడి చేశారు. బెయిల్ కోసం సోనియా కాళ్ల మీద పడ్డారు. రాష్ట్రానికి రాజధానిగా అమరావతికి అంగీకారం తెలిపారు. అమరావతిలో ఇల్లు కట్టుకున్నానని చెప్పారు. అధికారంలోకి వచ్చాక అమరావతిని పక్కన పడేసి మూడు రాజధానులని చెప్పారు. ప్రాంతాల మధ్య, కులాల మధ్య తగువు పెట్టడం జగన్ నైజం' అని వైఎస్ జగన్పై అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రం మీద, తెలుగు ప్రజల మీద జగన్ మోహన్ రెడ్డికి ఎందుకింత కక్ష? రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు సమగ్రాభివృద్ధి జరిగేలా పరిపాలన సాగిస్తున్నాం. పరిశ్రమలు తెస్తున్నాం, ఇరిగేషన్ ప్రాజెక్టులు చేపడుతున్నాం. సీమకు నీళ్లు ఇస్తున్నాం. ఇంత మంచి జరుగుతుంటే రాష్ట్రం మీద జగన్ కక్ష పెట్టుకున్నట్టు వ్యవహరిస్తున్నాడు' అని మాజీ సీఎం వైఎస్ జగన్పై మంత్రి అచ్చెన్నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Cobra Video: కొండను మించిన పొడవు.. ప్రపంచంలోనే అతిపెద్ద కింగ్ కోబ్రా ప్రత్యక్షం.. వీడియో!
Hyderabad, Telangana:World's Longest King Cobra Viral Video: పకృతిలో ఎన్నో వింతలతో పాటు విశేషాలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా అడవిలో జంతువులకు సంబంధించిన వీడియోలతో పాటు కొన్ని పాముల వీడియోలు విపరీతంగా సోషల్ మీడియాల్లో కనిపిస్తూ ఉంటాయి. తాజాగా కూడా ఓ పాముకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతూ వస్తోంది. ఈ వీడియోలో అడవి మార్గంలో కొండ రాళ్ల మధ్య సంచరిస్తున్న ఒక భారీ కింగ్ కోబ్రాను వీడియో చూడొచ్చు. అంతేకాకుండా ఈ వీడియోను చూసిన సోషల్ మీడియా వినియోగదారులంతా ఒక్కసారిగా షాక్ అవుతున్నారు.
సాధారణంగా పాము కనిపిస్తేనే.. ఆమడ దూరం పారిపోయే జనం.. ఇంత పెద్ద పామును చూసి అక్కడే ఉంటూ ఆశ్చర్యపోయి చూస్తున్నారు.. ఈ వీడియోలో కనిపిస్తున్న కింగ్ కోబ్రా సుమారు 15 నుంచి 25 అడుగుల పొడవు ఉండవచ్చని అంచనా.. కొండ రాళ్ల గుండా నెమ్మదిగా పాకుతూ వస్తున్న ఈ భారీ పాము, ఒక సందర్భంలో పడగను పైకి విప్పి చుట్టుపక్కల పరిసరాలను గమనిస్తున్న తీరు చూసి అక్కడున్నవారంతా ఆశ్చర్యానికి గురవుతున్నారు. దాని శరీరంపై ఉన్న చారలతో పాటు, మెరిసే నలుపు రంగు అది ఎంతటి శక్తివంతమైనదో ఎంతో సులభంగా తెలియజేస్తోంది.
జీ ఫాక్ట్ అనే యూట్యూబ్ ఛానెల్లో అప్లోడ్ అయిన ఈ వీడియోను చూసిన నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తూ వస్తెన్నారు. చాలా మంది బాబోయ్.. ఇది పామా లేక కొండచిలువనా? అని అంటుంటే, ఇంత పెద్ద కోబ్రాను ఎప్పుడూ చూడలేదని మరికొందరు కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. అటవీ ప్రాంతాల్లో ఇలాంటి అరుదైన సర్పాలు సంచరించడం సహజమే అయినప్పటికీ.. ఇంత భారీ పరిమాణంలో ఉండటం మాత్రం విశేషమని వన్యప్రాణి నిపుణులు సైతం చెబుతున్నారు.
Also Read: Samar Cobra Video: అత్యంత అరుదైన సమర్ కోబ్రా.. పడగ విప్పి ఏం చేస్తుందో చూడండి.. వీడియో!
ఈ వీడియోలో కనిపిస్తున్న కింగ్ కోబ్రా ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన, పొడవైన సర్ప జాతికి చెందినదని కొంతమంది స్నేక్ క్యాచర్స్ అభిప్రాయ పడుతున్నారు. ఇవి ప్రధానంగా ఆగ్నేయాసియాతో పాటు భారతదేశంలోని దట్టమైన అడవులలో జీవిస్తూ ఉంటాయి.. ఇతర పాములను ఆహారంగా తీసుకోవడంతో పాటు నదుల్లోని నీటిని తాగడం వీటి ప్రత్యేకత.. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియో ఏ ప్రాంతానికి సంబంధించిందో తెలిదు.. కానీ కొండలతో పాటు అటవీ నేపథ్యం చూస్తుంటే ఇది భారతదేశంలోని ఏదో ఒక ప్రదేశంలో జరిగి ఉండొచ్చని సమాచారం.
Also Read: Samar Cobra Video: అత్యంత అరుదైన సమర్ కోబ్రా.. పడగ విప్పి ఏం చేస్తుందో చూడండి.. వీడియో!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Nayanthara: తిరుమలలో హీరోయిన్ నయనతారపై ఎగబడ్డ అభిమానులు
Tirupati Urban, Andhra Pradesh:Tirumala Temple VVIPs Darshan: తిరుమలలో సాధారణ భక్తులు పోటెత్తుతుండగా.. వీవీఐపీల తాకిడి కూడా పెరుగుతోంది. రోజువారిగా దర్శించుకునే భక్తుల సంఖ్య పెరుగుతుండగా.. అదే స్థాయిలో ప్రముఖులు ఆలయాన్ని సందర్శించడానికి వస్తున్నారు. గురువారం తిరుమలలో సినీ సందడి నెలకొంది. దక్షిణాది లేడీ సూపర్ స్టార్ నయనతార, ఆమె భర్త ప్రముఖ దర్శకుడు విఘ్నేష్ శివన్ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ ఎంపీ అప్పలనాయుడు కలిశెట్టి, తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి, ఫిరాయింపు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, సినీ నటుడు సప్తగిరి, ఆంధ్రప్రదేశ్ పేపర్ లీడ్స్ కమిటీ చైర్మన్ రవీంద్ర బాబు తదితర ప్రముఖులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.
Also Read: Tirumala Laddu: తిరుమలలో సరికొత్త రికార్డు.. రూ.13.95 కోట్ల లడ్డూ విక్రయాలతో రూ.567 కోట్ల ఆదాయం
ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో నయనతార దంపతులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చున్నారు. ఆలయ అర్చకులు వారికి వేదాశీర్వచనం అందించి పట్టు వస్త్రం తో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు. నయనతార దంపతులు వచ్చారని తెలియడంతో భక్తులు, వారి అభిమానులు అక్కడికి చేరుకున్నారు. తమ అభిమాన నటిని దగ్గర నుంచి చూసేందుకు.. సెల్ఫీలు దిగేందుకు ఎగబడ్డారు. నయనతార దంపతులు తరచుగా తిరుమల శ్రీవారిని దర్శించుకుంటూ ఉంటారు. పెళ్లయినప్పటి నుంచి ప్రతి ముఖ్య సందర్భంలోనూ ఈ జంట తిరుమల వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు పొందుతున్నారు.
Also Read: Voice And SMS Packs: మొబైల్ వినియోగదారులకు తీపి కబురు.. డేటా లేకుండా రీచార్జ్ ప్లాన్స్
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎంపీ అప్పలనాయుడు కలిశెట్టి, తెలంగాణ ఎమ్మెల్యేలు అనిరుధ్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, నటుడు సప్తగిరి వేరువేరుగా దర్శించి మొక్కులు తీర్చుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం కల్పించారు. దర్శనం అనంతరం ధ్వజస్తంభం వద్ద నమస్కరించి రంగనాయక మండపంలో వేద అర్చకులు వేద ఆశీర్వచనం చేసి పట్టు వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందించారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం ఆలయం వెలుపల ఎమ్మెల్యేలు, ఎంపీ సందడి చేశారు.
Also Read: Hyderabad: 14 సార్లు జీవన్ రెడ్డికి కాంగ్రెస్ బీఫామ్ ఇచ్చాం.. రేవంత్ రెడ్డిపై విమర్శలు సరికాదు
తిరుమల లడ్డూ రికార్డు
2025–26 వార్షిక సంవత్సరంలో తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ విక్రయాల్లో మునుపెన్నడూ లేని ఘనతను నమోదు చేసింది. రోజుకి 4 లక్షల లడ్డూలు విక్రయం చేస్తుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో 13.95 కోట్ల లడ్డూలను విక్రయించి.. సుమారు రూ.567 కోట్లు టీటీడీకి లభించింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Tirumala Laddu: తిరుమలలో సరికొత్త రికార్డు.. రూ.13.95 కోట్ల లడ్డూ విక్రయాలతో రూ.567 కోట్ల ఆదాయం
Tirupati Urban, Andhra Pradesh:Tirumala Laddu Record Sales: ఎన్ని వివాదాలు ఉన్నా.. ఎంత రాజకీయం నడిచినా తిరుమల లడ్డూకు ఉన్న పవిత్రత ఏమాత్రం తగ్గడం లేదు. అందుకే భక్తులు భారీగా లడ్డూలను కొనుగోలు చేస్తూ స్వామివారి ప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు.కలియుగ ప్రత్యక్ష దైవం, ఆపదమొక్కులవాడు తిరుమల వేంకటేశ్వర స్వామి ప్రసాదం అంటే భక్తులకు అమితమైన విశ్వాసం. శ్రీవారి లడ్డూ రుచి, దానికున్న ప్రాముఖ్యత ప్రపంచ ప్రసిద్ధి. తాజాగా 2025-26 ఆర్థిక సంవత్సరానికి టీటీడీ లడ్డూ విక్రయాల్లో సరికొత్త చరిత్ర సృష్టించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో లడ్డూలు అమ్ముడయ్యాయి.
Also Read: Voice And SMS Packs: మొబైల్ వినియోగదారులకు తీపి కబురు.. డేటా లేకుండా రీచార్జ్ ప్లాన్స్
ఏడుకొండల స్వామి దర్శనానికి వెళ్లే ప్రతి భక్తుడు తిరిగి వచ్చేటప్పుడు తనతో పాటు పవిత్రమైన లడ్డూ ప్రసాదాన్ని తీసుకెళ్లడం ఒక ఆనవాయితీ. కొండపై ఎంత రద్దీ ఉన్నా.. స్వామి లడ్డూ కోసం భక్తులు గంటల తరబడి వేచి ఉంటారు. అయితే ఈ భక్తి విశ్వాసమే ఇప్పుడు సరికొత్త రికార్డులకు వేదికైంది. 2025–26 వార్షిక సంవత్సరంలో తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ విక్రయాల్లో మునుపెన్నడూ లేని ఘనతను నమోదు చేసింది. రోజుకి 4 లక్షల లడ్డూలు విక్రయం చేస్తుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో 13.95 కోట్ల లడ్డూలను విక్రయించి.. సుమారు రూ.567 కోట్లు టీటీడీకి లభించింది.
Also Read: Hyderabad: 14 సార్లు జీవన్ రెడ్డికి కాంగ్రెస్ బీఫామ్ ఇచ్చాం.. రేవంత్ రెడ్డిపై విమర్శలు సరికాదు
తిరుమలలో భక్తుల రద్దీ ఏ స్థాయిలో ఉందో ఈ గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి. ప్రతి రోజూ లక్షలాది మంది భక్తులు తిరుమల స్వామిని దర్శించుకుంటుండటంతో.. వారి అవసరాలకు అనుగుణంగా టీటీడీ అత్యంత నాణ్యమైన లడ్డూలను అందిస్తోంది. సుమారు 200 ఏళ్ల నాటి చారిత్రక నేపథ్యం ఉన్న ఈ లడ్డూ ప్రసాదం కాలానుగుణంగా భక్తుల మన్ననలను పొందుతూనే ఉంది. 1790 నుంచి 1840 మధ్య కాలంలో తిరుమలలో లడ్డూ తయారీ ప్రక్రియ ప్రారంభమైంది. మరాఠా రాజు రఘోజి భోంస్లే పాలనలో స్వామివారికి లడ్డూను నివేదించే సాంప్రదాయం మొదలైందని చరిత్ర చెబుతోంది. అప్పటి నుంచి నేటి వరకు ఈ ప్రసాదం విశిష్టత ఏమాత్రం తగ్గలేదు.
Also Read: YS Jagan Padayatra: చంద్రబాబు పాలనలో ఏపీ మొత్తం తిరోగమనం: వైఎస్ జగన్
సాంకేతికత పెరుగుతున్నా.. భక్తుల సంఖ్య లక్షలు దాటుతున్నా లడ్డూ రుచిలో, నాణ్యతలో రాజీ పడకుండా టీటీడీ ప్రత్యేక శ్రద్ధతో తయారుచేస్తోంది. నెయ్యి, శనగపిండి, చక్కెర, ఇలాచి, పచ్చకర్పూరం వంటి దినుసులను ఉపయోగించి పొటులో అత్యంత పవిత్రంగా లడ్డూలను తయారు చేస్తారు. పెరిగిన డిమాండ్కు తగ్గట్టుగా సరఫరా చేయడంలో టీటీడీ యంత్రాంగం విజయం సాధించిందని ఈ రికార్డు విక్రయాలు నిరూపిస్తున్నాయి. మొత్తానికి శ్రీవారి లడ్డూ కేవలం ఒక ప్రసాదం మాత్రమే కాదు కోట్లాది మంది భక్తుల నమ్మకం. ఈ ఏడాది నమోదైన రికార్డు విక్రయాలు తిరుమల వైభవాన్ని మరోసారి చాటిచెప్పాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Hyderabad: 14 సార్లు జీవన్ రెడ్డికి కాంగ్రెస్ బీఫామ్ ఇచ్చాం.. రేవంత్ రెడ్డిపై విమర్శలు సరికాదు
Hyderabad, Telangana:Ponguleti Srinivas Reddy Land Scams: తెలంగాణలో జరుగుతున్న కీలక పరిణామాలపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి జీవన్ రెడ్డితోపాటు పొంగలేటి శ్రీనివాస రెడ్డి భూ కుంభకోణాలు, మంత్రివర్గ విస్తరణ తదితర వాటిపై మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. గాంధీభవన్లో ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి. 'జీవన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ 14 సార్లు బి ఫామ్ ఇచ్చింది. పరిస్థితులను బట్టి ముందుకి వెళ్లాలి. జీవన్ రెడ్డి విమర్శలు ప్రజలు పట్టించుకునే పరిస్థితిలో లేరు' అని పేర్కొన్నారు.
'ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి దిగిపోవాలని చెప్పడానికి జీవన్ రెడ్డి ఎవరు? కాంగ్రెస్ పార్టీని విమర్శించే ముందు జీవన్ రెడ్డి గతంలో బీఆర్ఎస్ పార్టీపై చేసిన విమర్శలకు సమాధానం చెప్పాలి' అని మహేశ్ కుమార్ రెడ్డి సూచించారు. బీజేపీ ఆధ్వర్యంలో ఎవరూ బాగుపడేది లేదు. మార్పు వచ్చింది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ పోయింది. పొంగులేటిపై వచ్చిన ఆరోపణలపై ప్రూఫ్ ఉంటే అప్పుడు కాంగ్రెస్ ఆలోచిస్తుంది. పొంగులేటిపై విమర్శలు కాదు. ఆధారాలు ఉంటే గాంధీ భవన్కు వచ్చి ఇవ్వండి. ఆధారాలు తీసుకొని చర్చకు రండి. నేను చర్చ సవాల్కు సిద్ధం' అని మహేశ్ కుమార్ గౌడ్ ప్రకటించారు.
'పస లేని ఆరోపణలు చేయొద్దు. నాదర్గుల్ భూముల కుంభకోణం గత హయాంలో జరిగింది. మా మీద బట్ట కాల్చివేస్తే ఊరుకునే ప్రసక్తే లేదు. మేము కట్టిన ప్రాజెక్టులకు ఇప్పటిదాకా ఎక్కడ గీత కూడా పడలేదు' అని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ తెలిపారు. 'మంత్రివర్గ విస్తరణ ముఖ్యమంత్రి పరిధిలోని అంశం. నాకున్న సమాచారం ప్రకారం మంత్రి వర్గ విస్తరణలో ఇప్పట్లో ఉండదు' అని స్పష్టం చేశారు.
తామంతా కూడా ఎన్ఎస్యూఐ నుంచి వచ్చిన వాళ్లమే. ఇక్కడ ఉన్న నాతోపాటు పొన్నం ప్రభాకర్, వంశీ చంద్రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, శంకర్ నాయక్ అందరం కూడా అక్కడ నుంచి వచ్చిన వాళ్లమే. నాయకత్వాన్ని అందిస్తున్న ఒక కంపెనీ యువజన కాంగ్రెస్. ఆ సంస్థ నుంచి మంచి అవకాశం వచ్చింది' అని మహేశ్ కుమార్ వివరించారు. 'జీవన్ రెడ్డికి 14 సార్లు బీఫామ్లు తీసుకున్న సీనియర్ నాయకులు. కాంగ్రెస్ మీద విమర్శలు చేస్తున్న జీవన్ రెడ్డి గతంలో బీఆర్ఎ్పై చేసిన విమర్శలను ఒకసారి గుర్తు చేసుకోవాలి' అని సూచించారు.
'రేవంత్ రెడ్డిపై జీవన్ రెడ్డి విమర్శలు చేయడం సరికాదు. ఆయనను ఎమ్మెల్యేలు అంతా ఎన్నుకున్న వ్యక్తి సీఎం. మంత్రులపై విమర్శలు చేసేవాళ్లు ఆధారాలు తీసుకురండి. నిందలు వేస్తాం బట్టకాల్చి వేస్తాం అంటే సరికాదు' అని తెలిపారు. పొంగులేటిపై చేస్తున్న విమర్శలపై ఆధారాలు ఉంటే తీసుకుని వస్తే గాంధీభవన్ వేదికగా చర్చిస్తామని ప్రకటించారు.
KKR vs LSG Preview: నేడే కేకేఆర్ Vs లక్నో మ్యాచ్..ప్లేయింగ్ 11 జట్లు ఇవే..వాళ్లిద్దరూ జట్టులో నుంచి ఔట్!
Kolkata, West Bengal:KKR vs LSG Match Preview: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా లక్నో సూపర్ జెయింట్స్తో ఆతిథ్య కోల్కతా నైట్రైడర్స్ జట్టు తలపడనుంది. సోమవారం ఇదే స్టేడియంలో పంజాబ్ కింగ్స్తో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దవ్వగా.. నేడు గురువారం మరో మ్యాచ్ జరిగేందుకు మస్తాబయ్యింది.
కోల్కతా నైట్ రైడర్స్ తమ ప్రధాన స్పిన్నర్ల దళం వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్ లేకుండానే ఈ మ్యాచ్ ఆడనుంది. వేలికి గాయం కావడంతో ప్రపంచ నంబర్ 1 టీ20ఐ బౌలర్ వరుణ్ చక్రవర్తి ఈ మ్యాచ్ దూరం కానుండడంతో ఆ జట్టులో స్పిన్నర్ కొరత ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో అభిషేక్ శర్మ క్యాచ్ పడుతున్నప్పుడు వరుణ్ ఎడమ చేతి చిటికెన వేలికి గాయమైంది. చికిత్స చేసిన వైద్యులు అతడికి విశ్రాంతి అవసరమని సూచించారు.
మరోవైపు వెస్టిండీస్ మాజీ ఆల్-రౌండర్ సునీల్ నరైన్ కూడా అనారోగ్యం కారణంగా పంజాబ్ కింగ్స్తో ఆడాల్సిన మ్యాచ్కు దూరమయ్యాడు. అయితే నేడు జరగబోయే మ్యాచ్కు కూడా అతను పూర్తిగా ఫిట్నెస్ సాధించలేదని సమాచారం. దీంతో లక్నో సూపర్ జెయింట్స్తో జరగనున్న మ్యాచ్లోనూ సునీల్ నరైన్ ఆడడం డౌట్గానే కనిపిస్తుంది.
ఇలాంటి పరిస్థితుల్లో స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి స్థానంవలో భారీ షాట్లు కొట్టే సామర్థ్యం ఉన్న అనుకూల్ రాయ్ను జట్టులోకి తీసుకునేందుకు కోల్కతా నైట్రైడర్స్ సన్నాహాలు చేస్తోంది. ఐపీఎల్ 2026 కోసం జరిగిన మినీ వేలంలో రూ.25.2 కోట్లకు అమ్ముడుపోయిన ఆస్ట్రేలియా క్రికెటర్ కామెరాన్ గ్రీన్.. గురువారం రాత్రి జరిగే మ్యాచ్ నుంచి బౌలింగ్ చేసేంత ఫిట్గా ఉండవచ్చని కూడా వార్తలు వస్తున్నాయి.
మరోవైపు రిషబ్ పంత్ సారథ్యంలోని లక్నో సూపర్ జెయింట్స్ జట్టులోని పేస్ బౌలింగ్ విభాగంలో ఆవేశ్ ఖాన్, మోసిన్ ఖాన్ల మార్పు జరిగే అవకాశం కనిపిస్తోంది. ఈ సీజన్ కోసం ముంబై ఇండియన్స్ నుంచి లక్నో జట్టులోకి ట్రేడ్ అయిన అర్జున్ టెండూల్కర్ కంటే సిద్ధార్థ్ను జట్టులోకి తీసుకునేందుకు ఆ టీమ్ ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది. లక్నో టీమ్లో ఎవరికైనా గాయాల కారణంగా వైదొలగితే తప్పా.. అర్జున్ టెండూల్కర్ను జట్టులోకి తీసుకునే అవకాశం కనిపించడం లేదు.
నేడు జరగబోయే మ్యాచ్లో తుదిజట్ల అంచనా ఇదే..
లక్నో సూపర్ జెయింట్స్: మిచెల్ మార్ష్, ఐడెన్ మార్క్రామ్, రిషబ్ పంత్ (కెప్టెన్, వికెట్ కీపర్), నికోలస్ పూరన్, ఆయుష్ బదోని, అబ్దుల్ సమద్, ముకుల్ చౌదరి, M సిద్ధార్థ్, అవేష్ ఖాన్, మహమ్మద్ షమీ, దిగ్వేష్ రాఠి, ప్రిన్స్ యాదవ్.
కోల్కతా నైట్ రైడర్స్: ఫిన్ అలెన్, అజింక్యా రహానే (కెప్టెన్), కామెరాన్ గ్రీన్, అంగ్క్రిష్ రఘువంశీ, రింకు సింగ్, రమణదీప్ సింగ్, సునీల్ నరైన్, అనుకూల్ రాయ్, నవదీప్ సైనీ, వైభవ్ అరోరా, కార్తీక్ త్యాగి, బ్లెస్సింగ్ ముజారబానీ.
Also REad: 8th Pay Commission Hike: ఉద్యోగులు ఎగిరిగంతేసే వార్త..రూ.46,000కు పెరగనున్న జీతం..పండగే పండగ!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Youtuber Vaishnavi: శ్వేతనాగు రూపంలో వైష్ణవి? దశదిన కర్మలో జరిగిన ఆ వింత ఏంటి.. వీడియో..
Karimnagar, Telangana:Youtuber Vaishnavi Viral Video Watch: ప్రముఖ యూట్యూబర్ వైష్ణవి అకాల మరణంతో ఒక్కసారిగా ఆమె కుటుంబాన్ని తీరని శోకంలోకి ముంచేసింది.. అయితే, ఆమె చనిపోయిన తర్వాత జరుగుతున్న కొన్ని వింత సంఘటనలు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమవుతున్నాయి.. అలాగే ఇటీవలే వైష్ణవి తన సోదరుడి కలలోకి వచ్చిందని..తాను ఆత్మ రూపంలో ఆమెను చూశామని ఆమె సోదరులు షాకింగ్ విషయాలను ఓ యూట్యుబ్ ఛానెల్ ఇంటర్య్వూలో తెలిపారు.
వైష్ణవి సోదరుడు సాగర్ మాట్లాడుతూ.. నిన్న రాత్రి చెల్లి నా కలలోకి వచ్చిందని.. అన్నా.. నువ్వు ఎందుకు అంతగా బాధపడుతున్నావు? నేను చనిపోలేదు, మీతోనే ఉన్నాను. మన ఊరిలోనే తిరుగుతున్నాను. నేను మళ్లీ తిరిగి వస్తాను.. అని చెప్పింది. అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. అంతేకాకుండా తన బట్టలతో పాటు చీరలు ఎవరికీ ఇవ్వవద్దని.. తాను మళ్లీ జన్మిస్తానని వైష్ణవి కలలో కోరినట్లు సోదరులు తెలిపారు.
వైష్ణవి దశదిన కర్మల సమయంలో ఒక తెల్లటి నాగుపాము ఇంటి పరిసరాల్లోకి తిరగడం అందరినీ అశ్చర్యపరిచేలా చేసింది.. మా అమ్మ శివయ్యను ప్రార్థిస్తూ.. నా బిడ్డను ఏ రూపంలోనైనా పంపించు అని వేడుకుందని.. సరిగ్గా అదే సమయంలో ఒక తెల్లటి పాము అక్కడికి వచ్చిందని.. అది మమ్మల్ని ఏమీ చేయకుండా చాలా సేపు అక్కడే ఉండి.. వెల్లిపోయిందని.. అది చూశాక మా చెల్లి పాము రూపంలో వచ్చిందని మాకు అనిపించిందని సోదరులు తెలిపారు.
Also Read: Road Accident: వనస్థలిపురంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకులు స్పాట్ డెడ్
వైష్ణవి మరణానికి కారణమైన వారికి కఠిన శిక్ష పడాలని.. తమకు న్యాయం జరగాలని ఆమె సోదరులు డిమాండ్ చేస్తున్నారు. పాలకోవ ఇష్యూ జరిగితే.. ఇండస్ట్రీ అంతా స్పందించింది. కానీ.. ఒక ఆడబిడ్డ ప్రాణం పోతే ఎవరూ మాట్లాడటం లేదు. మా చెల్లికి జరిగిన అన్యాయం మరే ఇతర ఆడబిడ్డకూ జరగకూడదు అని వారు అన్నారు. ప్రభుత్వంతో పాటు ప్రజలు తమ న్యాయ పోరాటానికి మద్దతు ఇవ్వాలని కోరారు.
Also Read: Road Accident: వనస్థలిపురంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకులు స్పాట్ డెడ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
