అభివృద్ది పనులకు మంత్రి పొంగులేటి శంకుస్థాపన
Khammam, Telangana:ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో అభివృద్ది కార్యక్రమాలకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శంకుస్థాపనలు చేసారు. పలు గ్రామాలలో రోడ్లు, సైడ్ డ్రైనేజ్ తదితర పనులను ప్రారంభించారు. పనులను త్వరగా పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని మంత్రి పొంగులేటి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, పలువురు స్థానిక కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
2028లో బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి రావడం ఖాయం: ఆయిల్ పామ్ రైతులతో కేటీఆర్
Bhupalpally, Telangana:2028 CM Is KCR: మళ్లీ తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ 2028లో అవుతారని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాగానే మరిన్ని ప్రోత్సాహకాలు అందిస్తామని.. మలేషియాకు రైతుల అధ్యయన పర్యటనలు చేయిస్తామని హామీ ఇచ్చారు. కేసీఆర్ వచ్చాక తెలంగాణను దేశంలోనే అత్యధిక ఆయిల్ పామ్ సాగు చేసే రాష్ట్రంగా తీర్చిదిద్దే లక్ష్యాన్ని పూర్తి స్థాయిలో సాధిస్తామని మాజీ మంత్రి కేటీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఆయిల్ పామ్ సాగు చేస్తున్న రైతులతో ఆదివారం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశమై వారి సమస్యలు, అనుభవాలు, సూచనలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులతో సుదీర్ఘంగా ముచ్చటించిన కేటీఆర్ గత బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవసాయ రంగంలో చేపట్టిన పంటల వైవిధ్యీకరణ కార్యక్రమం ఫలితాలను సమీక్షించడంతో పాటు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు.
రైతులతో సమావేశం జరిగిన అనంతరం మాజీ మంత్రి కేటీఆర్ కీలక ప్రసంగం చేశారు. 'తెలంగాణలో 20 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగును విస్తరించాలన్నది తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు దూరదృష్టితో రూపొందించిన లక్ష్యం. మలేషియా, ఇండోనేషియా దేశాల తరహాలో ఆయిల్ పామ్ సాగును అభివృద్ధి చేసి దేశంలో వంటనూనెల దిగుమతులపై ఆధారపడే పరిస్థితిని తగ్గించడమే కాకుండా రైతులకు వరి వంటి సంప్రదాయ పంటలతో పోలిస్తే మూడు రెట్లు అధిక ఆదాయం వచ్చేలా చేయడమే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ లక్ష్. ఈ పంటకు కేసీఆర్ హయాంలో ప్రోత్సాహాన్ని అందించాం' అని కేటీఆర్ వివరించారు.
'బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో తెలంగాణ రాష్ట్రంలో సుమారు లక్షన్నర ఎకరాల్లో మాత్రమే ఆయిల్ పామ్ సాగు ఉంది . ప్రస్తుతం దాదాపు 3 లక్షల ఎకరాలకు విస్తరించింది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ సహకారం కొనసాగితే అది ఏడు లక్షల ఎకరాలకు చేరుకునే అవకాశం ఉంది' అని కేటీఆర్ వివరించారు. 'బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయిల్ పామ్ రైతులకు మరింత ప్రోత్సాహం అందిస్తాం' అని మాజీ మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. ట్రాక్టర్లు, స్లాషర్లు వంటి వ్యవసాయ యంత్రాల కొనుగోలుపై అధిక రాయితీలు అందించి యాంత్రీకరణను మరింత ప్రోత్సహిస్తామని ప్రకటించారు. పంట పూర్తిస్థాయిలో ఎదిగిన తర్వాత అవసరమయ్యే రెండో దశ డ్రిప్ ఇరిగేషన్ లైన్ల ఏర్పాటుకు ప్రత్యేక సహాయం అందిస్తామని రైతులకు కేటీఆర్ భరోసా ఇచ్చారు.
'ప్రపంచ స్థాయి ఆయిల్ పామ్ సాగు పద్ధతులను రైతులు ప్రత్యక్షంగా అధ్యయనం చేసేలా మలేషియాకు ప్రత్యేక అధ్యయన పర్యటనలను నిర్వహిస్తాం' అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. 'కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని సమర్థవంతంగా వినియోగించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదిలేస్తూ రైతుల పంటలను ఎండబెడుతున్నారు' అని రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు.
'ఇంట్లో ఒక చోట చిన్న లీకేజీ వచ్చిందని మొత్తం ఇంటినే కూల్చేస్తారా?' అని రేవంత్ రెడ్డిని మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. మేడిగడ్డ బ్యారేజీలో ఒక భాగంలో సమస్య తలెత్తిందనే కారణంతో మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టును పక్కన పెట్టడం రైతుల ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కలిగిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే కన్నెపల్లి పంప్హౌస్ను ప్రారంభించి నీటిని ఎత్తిపోసి రిజర్వాయర్లను నింపాలని, నిలువ పంటలను కాపాడాలని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. '2028లో బీఆర్ఎస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావడం ఖాయం. ఆ తర్వాత తెలంగాణను దేశంలోనే అత్యధిక ఆయిల్ పామ్ సాగు చేసే రాష్ట్రంగా తీర్చిదిద్దే లక్ష్యాన్ని పూర్తి స్థాయిలో సాధిస్తాం' అని కేటీఆర్ తెలిపారు.
స్టూడెంట్ నోటిలో పెన్ను క్యాప్ తోసిన విద్యార్థినులు
Kagaznagar, Telangana:School Friends Throws Pen Cap Into Mouth In Kagaznagar Gurukul Watch Videoతెలంగాణలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం: రేవంత్ రెడ్డి
Secunderabad, Telangana:Balamrutham New Plant: 'ప్రజా ప్రభుత్వంలో 2 కోట్లకు పైగా మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాం. ఇందిరమ్మ ఇండ్లను మహిళ పేరుతోనే ఇస్తున్నాం. 200 యూనిట్ల ఉచిత కరెంటు అందిస్తున్నాం. 3 కోట్ల 28 లక్షల తెలంగాణ బిడ్డలకు ప్రభుత్వం సన్నబియ్యం అందిస్తున్నాం. పట్టణ ప్రాంతంలో పేదలను ఆదుకునేందుకు లక్ష ఇండ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. వెయ్యి బస్సులకు మహిళలను యజమానులను చేశాం. వెయ్యి మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసే ప్రాజెక్టును మహిళకు అప్పగించాం. 2034లోగా కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయడమే నా లక్ష్యం' అని రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆ దిశగా చర్యలు చేపడుతూ ముందుకు వెళుతున్నామని తెలిపారు.
హైదరాబాద్ నాచారం ఐడీఏ ప్రాంతంలో తెలంగాణ ఫుడ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో బాలామృతం కొత్త ప్లాంటును ప్రారంభించిన ముఖ్యమంత్రి కీలక ప్రసంగం చేశారు. 'గర్భిణీలను ఆదుకోవాలని ఆనాడు ఇందిరాగాంధీ మహబూబ్ నగర్ జిల్లాలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అంచెలంచెలుగా ఇది ఒక పరిశ్రమగా ఎదిగింది. ఇవాళ నూతన బాలామృతం ప్లాంట్ను ప్రారంభించుకున్నాం' అని గుర్తుచేశారు.
'ఆడబిడ్డలను ఆర్థికంగా నిలబెట్టడమే కాదు. గర్బిణీ ఆడబిడ్డలకు పౌష్టిక ఆహారం అందించాలనే బాలామృతం కొత్త ప్లాంటు ప్రారంభించుకున్నాం. అభివృద్ధి చెందిన ఆరోగ్య తెలంగాణ ఏర్పాటు చేయాలనే ఈ కార్యక్రమాన్ని చేపట్టాం' అని రేవంత్ రెడ్డి వివరించారు. పేదల బిడ్డలు ఆకలితో ఉండకూడదనే ప్రభుత్వ పాఠశాలల్లో బ్రేక్ ఫాస్ట్ స్కీమ్ను తీసుకొచ్చామని.. విద్యార్థులతోపాటు ఉపాధ్యాయులకు బ్రేక్ ఫాస్ట్, లంచ్ స్కీం మొదలు పెట్టామని వెల్లడించారు. కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నట్లు చెప్పారు.
'విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. ఇది మేం ఖర్చుగా భావించడం లేదు. విద్యార్థుల ఆరోగ్యం, చదువు పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఓటు బ్యాంకు పథకాలు కాదు.. విద్యార్థుల భవిష్యత్ బాగు కోసమే ప్రభుత్వం పనిచేస్తోంది' అని తెలంగాణ సీఎం తెలిపారు. 'పిల్లల భవిష్యత్తే, తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు. పేద పిల్లల ఆరోగ్యం, చదువుపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది. పిల్లలకు నాణ్యమైన భోజనమే కాకుండా నాణ్యమైన విద్యను అందించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడొద్దు' అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
'ఆడబిడ్డలను ఆర్థికంగా నిలబెట్టడమే కాకుండా వారికి పుట్టబోయే బిడ్డ ఆరోగ్యకరంగా ఉండాలి. పిల్లలు ఆరోగ్యకరంగా ఉన్నప్పుడే తల్లిదండ్రుల్లో ఆనందం ఉంటుంది. తల్లి గర్భం దాల్చినప్పటి నుంచి బిడ్డకు ఆరు సంవత్సరాల వరకు బలవర్థకమైన పోషకాహారం పేద పిల్లలకు ఇవ్వాలనే ఈ నూతన బాలామృతం ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించాం' అని రేవంత్ రెడ్డి వివరించారు. 'గతంలో ప్రభుత్వ పాఠశాలల్లో నర్సరీ, ఎల్ కేజీ, యూకేజీ విధానం లేదు. పట్టణాల్లో వలస వచ్చిన వారి పిల్లలు చదువుకోవాలంటే ప్రైవేటు స్కూళ్లకు పంపిస్తున్నారు. పేదలు తాము సంపాదించిందంతా పిల్లల చదువు కోసం ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి' అని ఆవేదన వ్యక్తం చేశారు.
'హైదరాబాద్ నగరంలో భూముల ధరలు వజ్రాల ధర పలుకుతున్న పరిస్థితుల్లో నిరుపేదల కోసం లక్ష ఇండ్లు కట్టాలని నిర్ణయం తీసుకున్నట్టు' తెలంగాణ సీఎం ప్రకటించారు. 2034 నాటికి కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలను పెంచడంతోపాటు వ్యాపార రంగంలో విస్తరించడానికి అన్ని రకాల ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు.
ఎగువన భారీ వర్షాలు.. పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి వరద ఉగ్రరూపం
Polavaram, Andhra Pradesh:Polavaram Project: మహారాష్ట్రలో కురుస్తున్న కుండపోత వర్షాలతో గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. ఎగువ నుంచి వస్తున్న భారీ వరద నీటితో పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి వరద నీరు పోటెత్తుతోంది. ఈ ఏడాది సీజన్లోనే తొలిసారిగా పోలవరం ప్రాజెక్టు వద్దకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. మహారాష్ట్రతో పాటు ముంబై పరిసర ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రాజెక్టు వద్ద నీటిమట్టం వేగంగా పెరుగుతోంది. ప్రస్తుతం పోలవరం స్పిల్వే వద్ద నీటిమట్టం 26.69 మీటర్లకు చేరింది. అటు ఎగువ కాపర్ డ్యామ్ వద్ద నీటి మట్టం 26.80 మీటర్లుగా నమోదైంది.
వరద ఉధృతి క్షణక్షణానికి పెరుగుతుండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. పోలవరం ప్రాజెక్ట్ స్పిల్వేలో ఉన్నటువంటి మొత్తం 48 గేట్లను ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ సీజన్లో ఒకేసారి 48 గేట్లను ఎత్తేయడం ఇదే తొలిసారి. స్పిల్ ఛానల్ మీదుగా ప్రవాహం అత్యంత భీకరంగా సాగుతుండగా.. ఈ ఉధృత ప్రవాహానికి కింద పనుల రవాణా కోసం తాత్కాలికంగా ఏర్పాటు చేసిన మట్టి రోడ్డు పూర్తిగా కొట్టుకుపోయింది. దీంతోపాటు నీటి ప్రవాహం కోసం వేసిన భారీ ఐరన్ తూరలు, ఐరన్ పైపులు వరద నీటిలో కొట్టుకుపోయాయి.
తాత్కాలిక రోడ్డు కొట్టుకుపోవడంతో స్పిల్ ఛానల్ కింద నుంచి పనుల కోసం వెళ్లే మార్గం పూర్తిగా మూసుకుపోయింది. రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. ప్రస్తుతానికి కేవలం స్పిల్వే మీదుగా వెళ్లే రోడ్డు మార్గం మాత్రమే అందుబాటులో ఉంది. అక్కడ ఎర్త్ కమ్ రాక్ఫిల్ డ్యామ్ పనులు జరగాల్సి ఉన్న నేపథ్యంలో ఈ వరద ప్రభావం ఆ పనులపై పడే అవకాశం కనిపిస్తోంది. దీంతో అప్రమత్తమైన అధికారులు లీకేజ్ లేదా సీపేజ్ నీటిని తోడేందుకు డీ-వాటరింగ్ పనులను యుద్ధప్రాతిపదికన ప్రారంభించారు.
'పోలవరం ప్రాజెక్ట్ పనుల్లో కూటమి ప్రభుత్వం సరికొత్త వేగాన్ని అందుకుంది. 2027 నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి, ప్రధానమంత్రి చేతుల మీదుగా జాతికి అంకితం చేస్తాం' అని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టు పనులను క్షేత్రస్థాయిలో మంత్రి పరిశీలించారు. పనుల పురోగతిపై అధికారులతో సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. అనంతరం వైఎస్ జగన్ పాలనపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
'గొడ్డలి పార్టీ విధ్వంసకర పాలనలో సర్వనాశనమైన పోలవరాన్ని మళ్లీ తాము గాడిలో పెట్టాం' అని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఐదేళ్లలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం కేవలం 2 శాతం పనులు మాత్రమే చేస్తే కూటమి ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన ఈ రెండు ఏళ్లలోనే ఏకంగా రూ. 6,970 కోట్లు ఖర్చు చేసి 15 శాతం పనులు పూర్తి చేసిందని గణాంకాలతో సహా వివరించారు. ధ్వంసమైన పాత డయాఫ్రం వాల్ స్థానంలో కేవలం 440 రోజుల్లోనే రూ.990 కోట్లతో కొత్త డయాఫ్రం వాల్ను నిర్మించి రికార్డు సృష్టించామని వెల్లడించారు.
'ఏడాది కాలంలోనే మెయిన్ డ్యామ్ గ్యాప్-1 పనులు 48 శాతం, గ్యాప్-2 పనులు 29 శాతం పూర్తి చేశాం. సీఎం చంద్రబాబు నిరంతర పర్యవేక్షణ, పలుమార్లు ఢిల్లీ పర్యటనలతోనే కేంద్రం నుంచి నిధులు త్వరితగతిన మంజూరవుతున్నాయి' అని మంత్రి రామనాయుడు వివరించారు. 2027లో పోలవరం పూర్తయ్యే నాటికి తొలిదశ ఆర్అండ్ఆర్ ప్రక్రియను కూడా వంద శాతం పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని స్పష్టం చేశారు. 2027 పుష్కరాల నాటికి ప్రాజెక్ట్ పూర్తి చేసి ఏపీ జీవనాడీ అయిన పోలవరాన్ని జాతికి అంకితం చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.
కాళేశ్వరంపై CBI విచారణ ఎందుకు ఆపారు? అడ్లూరి లక్ష్మణ్ కుమార్ బహిరంగ సవాల్..
Hyderabad, Telangana:Minister Adluri Laxman Kumar News: తెలంగాణ రాజకీయాల్లో కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి వ్యవహారం మరోసారి తీవ్ర దుమారం రేపుతోంది. భారతీయ జనతా పార్టీతో పాటు బీఆర్ఎస్ రెండు వేర్వేరు కాదని.. ఆ రెండు పార్టీలు లోపాయికారీ ఒప్పందంతో ఒకటయ్యాయని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తీవ్ర ఆరోపణలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం లంబాడి తండాలో మంగళవారం నిర్వహించిన బంజారాల సాంప్రదాయ శీత్ల పండుగకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి అడ్లూరి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ తీరుపై, ముఖ్యంగా కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డిపై విమర్శల వర్షం కురిపించారు..
కాళేశ్వరం తీర్మానంపై కేంద్రం మౌనం ఎందుకు?
రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుపై సమగ్ర విచారణ జరగాలని స్పష్టమైన నిర్ణయంతో ఉందని మంత్రి మీడియా ముందు స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే ప్రాజెక్టు అవినీతిపై సీబీఐ (CBI) విచారణ జరిపించాలంటూ.. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిందని ఆయన గుర్తు చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం పంపి.. ఇన్ని రోజులవుతున్నా.. కేంద్ర ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని..? కాళేశ్వరంపై సీబీఐ విచారణను ఎందుకు ముందుకు తీసుకెళ్లడం లేదని మంత్రి లక్ష్మణ్ కుమార్ ప్రశ్నించారు. బీజేపీ నాయకులు కేవలం ప్రగల్భాలు పలుకుతూ.. ప్రజా ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారే తప్ప.. నిజంగా అవినీతిని వెలికితీయాలనే.. చిత్తశుద్ధి వారికి లేదన్నారు.
కిషన్ రెడ్డికి దమ్ముంటే ఆ పని చేయాలి...
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి నిజంగానే దమ్ముంటే.. తెలంగాణపై ప్రేమ ఉంటే.. రాష్ట్ర ప్రభుత్వం పంపిన కాళేశ్వరం సీబీఐ విచారణ ఫైలుపై వెంటనే సంతకం చేయించి విచారణకు ఆదేశించాలని.. మంత్రి సవాల్ విసిరారు. కేంద్రం తక్షణమే సీబీఐ దర్యాప్తునకు ఆదేశిస్తేనే.. బీజేపీ, BRS వేర్వేరు పార్టీలని తాము భావిస్తామని.. లేనిపక్షంలో ఆ రెండు పార్టీలు ఒకటేననే విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తామని హెచ్చరించారు. కేసీఆర్ హయాంలో జరిగిన అవినీతిని కప్పిపుచ్చడానికే కేంద్రంలోని BJPప్రభుత్వం కాలేశ్వరం దర్యాప్తును తొక్కిపెడుతోందని మంత్రి ఆరోపించారు.
Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!
గిరిజన సంస్కృతికి పెద్దపీట..
రాజకీయ విమర్శల అనంతరం మంత్రి లంబాడి తండాలో జరిగిన శీత్ల పండుగ వేడుకల్లో పాల్గొన్నారు. గిరిజనుల సంస్కృతి, సాంప్రదాయాలు తెలంగాణకు గర్వకారణమని, తండాల అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులతో పాటు పెద్ద సంఖ్యలో గిరిజన మహిళలు పాల్గొన్నారు.
Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
కుడాలో భారీ కుంభకోణం.. వరంగల్లో కాంగ్రెస్ భారీ అవినీతికి పాల్పడుతోంది: బీఆర్ఎస్ పార్టీ
Warangal, Telangana:KUDA Scam: 'తెలంగాణలోనే రెండో పెద్ద నగరం వరంగల్లో భారీ అవినీతి జరుగుతోందని.. కుడాకు చెందిన అత్యంత ఖరీదైన స్థలాలు అప్పనంగా విక్రయించుకుని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దోపిడీ చేస్తున్నారు' అని మాజీ ఛీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ తీవ్ర ఆరోపణలు చేశారు. రూ.70 కోట్ల వరకు అవినీతి జరిగిందని ఆరోపించారు. వెంటనే రేవంత్ రెడ్డి కుడా టెండర్లు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వరంగల్లో ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి అవినీతికి పాల్పడుతున్నారని తెలిపారు.
తెలంగాణలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోంది. స్టేట్ నుంచి స్ట్రీట్ వరకు అవినీతి పెరిగిపోయింది. కాంగ్రెస్ వాళ్లు హౌలే మాటలు మాట్లాడుతూ గలీజు పనులు చేస్తున్నారు. కుడా (కాకతీయ పట్టణ అభివృద్ధి సంస్థ)లో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోంది' అని మాజీ ఛీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ తీవ్ర ఆరోపణలు చేశారు. తోడు దొంగలు రాజేందర్ రెడ్డి, వెంకట్రామిరెడ్డి అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు.
'కుడా స్థలాలను అప్పనంగా పెద్దలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. సుమారు రూ.70 కోట్ల అవినీతి కుడాలో జరిగింది. దేవుడి భూమి 5 ఎకరాల స్థలాన్ని స్టార్ హోటల్కు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కుడా ఆధ్వర్యంలో కుంటలను కబ్జాలు చేసి బిల్డర్లకు కట్టబెడుతున్నారు' అని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దాస్యం వినయ్ భాస్కర్ ఆరోపణలు చేశారు. హెచ్సీయూలో మాదిరి వరంగల్లో అదే విధంగా చేస్తున్నారని తెలిపారు. 'వెంకట్రామిరెడ్డి భుజంపై తుపాకీ పెట్టి రాజేందర్ రెడ్డి కాలుస్తున్నారు. రాజేందర్ రెడ్డి నాలుగు ఫీట్లు ఉంటారు.ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. కుడా టెండర్లను రేవంత్ రెడ్డి రద్దు చేయాలి' అని మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ డిమాండ్ చేశారు. తాము తెలంగాణ ఉద్యమంలో రాజేందర్ రెడ్డి గూండాలతో దాడి చేసే ప్రయత్నం చేశారని గుర్తుచేశారు.
కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ మాజీ చైర్మన్ మర్రి యాదవ రెడ్డి మాట్లాడుతూ.. 'కుడా స్థలాలను వేలం పెట్టి విలువైన భూములను తమ వారికి ఇప్పించుకున్నారు. రెండున్నర ఎకరాల ప్రైమ్ ల్యాండ్ అప్పటి కలెక్టర్ ఆమ్రపాలి కుడాకు అప్పగించారు. ఇప్పుడు ఆ స్థలాన్ని ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి, కుడా చైర్మన్ 8 ప్లాట్లుగా చేసి వేలం పెట్టారు. గజం రూ.65 వేలకు ఫిక్స్ చేశారు. ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి సిండికేట్ ఏర్పాటు చేసి అదనంగా డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు' అని ఆరోపించారు.
'6,697 గజాలను వేలంలో పెట్టారు.100 కోట్ల ఆదాయం కుడాకు రావాలి.కానీ 49 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చింది. నర్సంపేట రోడ్డులో కమర్షియల్ ఫ్లాట్ కు గజం రూ.85 వేలు నిర్ణయించారు. కుడాకు రూ.70 కోట్ల నష్టం చేశారు' అని కుడా మాజీ చైర్మన్ యాదవ రెడ్డి వివరించారు. కుడా చైర్మన్గా నేను ఉన్నప్పుడు ఒక్క గజం తక్కువ రేటుకు విక్రయించలేదని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు తోడేళ్లలా దోచుకుంటున్నారని ఆరోపించారు. కుడా వేలాన్ని రద్దు చేసి ఆన్ లైన్ టెండర్ల ద్వారా వేలం ప్రక్రియ నిర్వహించాలని మర్రి యాదవ రెడ్డి డిమాండ్ చేశారు.
''గజం రూ.70 వేలు ఇవ్వడానికి ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి ఎవరు? కుడా ఏమైనా రాజేందర్ రెడ్డి సొంత స్థలమా? కుడాపై రాజేందర్ రెడ్డికి ఏం అధికారం ఉంది?' అని కుడా మాజీ చైర్మన్ యాదవ రెడ్డి ప్రశ్నించారు. ఇష్టం వచ్చినట్లు ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపై కేసులు పెడుతున్నారని తెలిపారు. రాజేందర్ రెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత వరంగల్ పశ్చిమలో ఒక్క ఇంచు అభివృద్ధి జరగలేదని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ హయాంలో జరిగిన కుడా అభివృద్ధిపై చర్చకు సిద్దమని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నాయకులకు సవాల్ చేశారు.
Ashwagandha: రోజుకు ఒక చెంచా అశ్వగంధ.. మీ ఆరోగ్యానికి శ్రీరామరక్ష!
Hyderabad, Telangana:Ashwagandha Benefits: ఆధునిక జీవనశైలితో పాటు పని ఒత్తిడి, సరిగ్గా నిద్రలేని రాత్రులు.. ప్రస్తుతం చాలా మంది ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు.. వీటన్నింటికీ వంటిట్లోనే ఒక అద్భుతమైన పరిష్కారం ఉందంటున్నారు ఆరోగ్య నిపుణులు.. అదే మన పూర్వీకులు కాలం నుంచి వినియోగిస్తున్న అశ్వగంధ.. ఆయుర్వేదంలో దీనిని మూలికల రాజు(King of Herbs)గా కూడా భావిస్తారు. ప్రతిరోజూ కేవలం ఒక చెంచా అశ్వగంధ పొడిని తీసుకోవడం వల్ల శరీరంలో ఊహించని ఆరోగ్య మార్పులు వస్తాయని పరిశోధనల్లో సైతం స్పష్టమైంది.
ఒత్తిడి, ఆందోళనలకు చెక్..
అశ్వగంధ ప్రాథమికంగా ఒక శక్తివంతమైన అడాప్టోజెన్ (Adaptogen)గా పనిచేస్తుందని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. అంటే ఇది శరీరం మానసిక, శారీరక ఒత్తిడిని తట్టుకునేలా చేస్తుంది. శరీరంలో ఒత్తిడిని పెంచే కార్టిసోల్ (Cortisol) అనే హార్మోన్ స్థాయిలను తగ్గించడానికి అశ్వగంధ తిరుగులేని పాత్ర పోషిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. రోజూ క్రమం తప్పకుండా దీనిని తీసుకోవడం వల్ల నాడీ వ్యవస్థ ప్రశాంతంగా మారి.. తీవ్రమైన ఆందోళనతో పాటు డిప్రెషన్ వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
నిద్రలేమి సమస్యకు చెక్..
రాత్రంతా బెడ్పై అటు ఇటు దొర్లుతూ.. నిద్రకోసం చూసేవారికి అశ్వగంధ ఒక వరప్రసాదంగా భావించవచ్చు.. ఇది మనస్సును ప్రశాంత ఉంచి.. సహజమైన, గాఢమైన నిద్ర (Restful Sleep) అందించేందుకు సహాయపడుతుంది. రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని పాలలో పావు లేదా అర చెంచా అశ్వగంధ పొడి కలిపి తాగడం వల్ల నిద్రలేమి (Insomnia) శాశ్వతంగా దూరమవుతుందని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు.
జ్ఞాపకశక్తి పెరుగుదలకు సహాయపడుతుంది..
అశ్వగంధలో ఉండే యాంటీఆక్సిడెంట్ గుణాలు మెదడు కణాలను ఫ్రీ రాడికల్స్ దెబ్బతీయకుండా ఎంతగానో రక్షిస్తాయని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. దీనివల్ల జ్ఞాపకశక్తి, ఏకాగ్రతతో పాటు ఆలోచనా శక్తి గణనీయంగా మెరుగుపడతాయి. అల్జీమర్స్, పార్కిన్సన్స్ వంటి ప్రమాదకరమైన నరాల బలహీనత వ్యాధుల బారిన పడకుండా ఇది మెదడును రక్షిస్తుంది.
READ Also: వర్షాకాలంలో వారానికి ఒక్కసారైనా ముఖానికి ఆవిరి పడుతున్నారా? ఈ 7 అద్భుత ప్రయోజనాలు తెలిస్తే?!
రోగనిరోధక శక్తి..
శరీరంలో రోగనిరోధక కణాల (Immune Cells) క్రియాశీలతను పెంచి.. సీజనల్ వ్యాధులు, ఇన్ఫెక్షన్ల నుంచి అశ్వగంధ ఎంతగానో రక్షిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా నీరసం, అలసటగా అనిపించే వారికి ఇది తక్షణ శక్తి అందించడమే కాకుండా.. శారీరక దృఢత్వాన్ని (Stamina) అందిస్తుంది.. ముఖ్యంగా గేమ్స్ అడేవారికి శారీరక సామర్థ్యాన్ని పెంచేందుకు కూడా ఇది ఎంతగానో తోడ్పడుతుంది.
పురుషుల్లో హార్మోన్ల సమతుల్యతకు..
మగవారి ఆరోగ్యానికి అశ్వగంధ ఎంతో మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇది శరీరంలో టెస్టోస్టెరాన్ (Testosterone) హార్మోన్ స్థాయిలను సహజంగా ఎంతో సులభంగా పెంచుతుంది.. సంతానలేమి సమస్యలతో బాధపడే పురుషులలో వీర్యకణాల సంఖ్యను, నాణ్యతను పెంచడానికి ఇది అద్భుతంగా సహాయపడుతుందని పలు వైద్య అధ్యయనాలు క్లుప్తంగా తెలిపాయి..
READ Also: వర్షాకాలంలో వారానికి ఒక్కసారైనా ముఖానికి ఆవిరి పడుతున్నారా? ఈ 7 అద్భుత ప్రయోజనాలు తెలిస్తే?!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
వయానాడ్లో వర్ష బీభత్సం.. కొండచరియలు విరిగి ఐదుగురు మృతి
Wayanad, Kerala:Kalladi Tunnel Project: కేరళలో భారీ వర్షాలు పడుతుండడంతో బీభత్సం జరిగింది. కుండపోత వర్షాలతో భారీ ఎత్తున ప్రాణనష్టం.. ఆస్తినష్టం సంభవించింది. వయానాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడి తీవ్ర విషాదం ఏర్పడింది. కొండలు విరిగిపడడంతో భారీ ఎత్తున ప్రమాదం సంభవించింది. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం ఐదు మంది కార్మికులు మృతి చెందినట్లు.. పదుల సంఖ్యలో గాయాలపాలైనట్లు తెలుస్తోంది. వెంటనే అప్రమత్తమైన కేరళ ప్రభుత్వం సహాయ చర్యలకు ఆదేశించింది.
వయనాడ్లో కొండచరియలు విరిగిపడ్డాయి. వయనాడ్ జిల్లాలోని కల్లాడి, మెప్పాడి ప్రాంతాల్లో భారీగా కొండచరియలు విరిగిపడటంతో ఘోర ప్రమాదం జరిగింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంతో భయపడిన ప్రజలు ప్రాణ భయంతో పరుగులు పెట్టుకున్నారు. వాటికి సంబంధించిన వీడియోలు వైరల్గా మారాయి. అయితే వర్షం తగ్గాక పరిస్థితి మరింత భయానకంగా మారింది. బురదలో పెద్ద ఎత్తున కార్మికులు చిక్కుకున్నట్లు సమాచారం.
మలప్పురం, వయనాడ్ జిల్లాలను కలిపే ప్రతిష్టాత్మకంగా 'అనక్కోంపోయిల్-మెప్పాడి' సొరంగ ప్రాజెక్టు జరుగుతోంది. ఈ సొరంగ ప్రాజెక్టు పనులు జరుగుతున్న మీనాక్షి వంతెన సమీపంలో కొండచరియలు విరిగిపడ్డాయి. సొరంగం పనులతోపాటు రహదారి నిర్మాణ పనుల్లో నిమగ్నమైన వందలాది మంది కార్మికులు ఆ ప్రాంతంలో ఉన్నట్లు సమాచారం. కొండచరియ విరిగిపడిన తీవ్రతకు కార్మికులు బస చేస్తున్న తాత్కాలిక షెడ్లు పూర్తిగా నీట మునిగిపోయాయి. అనేక వాహనాలు బురద కింద కూరుకుపోయాయి.
బురద, వరదల్లో కార్మికులు కొట్టుకుపోయి ఉంటారని అక్కడి స్థానికులు చెబుతున్నారు. బురదను తొలగిస్తే అందులో కూరుకున్న కార్మికులను వెలికితీయవచ్చని.. వరదలో కొట్టుకుపోయిన వారి ఆచూకీ తెలుసుకోవాల్సి ఉంది. కొండచరియలు విరిగిపోవడంతో పెద్ద ఎత్తున ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. వర్షాలు తగ్గాక తక్షణమే స్థానిక పోలీసులు, అధికారులతోపాటు ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయ చర్యలు చేపట్టారు. ముఖ్యమంత్రి సతీశన్ వెంటనే స్పందించి ప్రమాదంపై వివరాలు ఆరా తీశారు. ఇక వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ ఈ ఘటనపై స్పందిస్తూ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. వెంటనే ముఖ్యమంత్రితోపాటు స్థానిక ప్రజాప్రతినిధులు వెంటనే సహాయ చర్యల్లో నిమగ్నమవ్వాలని ప్రియాంక గాంధీ సూచించారు.
యాదాద్రి పవర్ ప్లాంట్ ప్రైవేటీకరణపై భగ్గుమన్న విద్యుత్ ఉద్యోగులు..
Jagtial, Telangana:YTPS Privatization Latest News: యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ (YTPS)లోని కీలక విభాగాలను ప్రైవేటుపరం చేయాలనే ప్రభుత్వ ఆలోచనపై విద్యుత్ ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్లాంట్లోని కోల్తో పాటు యాష్ హ్యాండ్లింగ్ విభాగాల నిర్వహణ బాధ్యతలను ప్రైవేట్ సంస్థలకు అప్పగించేందుకు ప్రభుత్వం టెండర్లు పిలవడాన్ని నిరసిస్తూ.. జగిత్యాలలో విద్యుత్ కార్మికులు, ఉద్యోగులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణ ముగింపునకు తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ (TGPEJAC) రాష్ట్ర నాయకత్వం ఇచ్చిన పిలుపు మేరకు ఈ మంగళవారం జగిత్యాలలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు.
నల్ల బ్యాడ్జీలతో విధులకు..
మంగళవారం ఉదయం జగిత్యాలలోని TGNPDCL డివిజన్ కార్యాలయ ఆవరణకు చేరుకున్న విద్యుత్ ఉద్యోగులు, అధికారులతో పాటు కార్మికులు అందరూ నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. ప్రభుత్వ నిర్ణయం పట్ల తమకున్న తీవ్ర వ్యతిరేకతను ఈ సందర్భంగా వ్యక్తం చేశారు. అనంతరం కార్యాలయ ప్రాంగణంలో అందరూ.. ప్రభుత్వ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ.. పెద్ద పెద్ద నినాదాలు చేశారు.
ప్రభుత్వ రంగ సంస్థల మనుగడకు ముప్పు..
ఈ నిరసన ప్రదర్శనను ఉద్దేశించి TGPEJAC రాష్ట్రతో పాటు స్థానిక నాయకులు మాట్లాడారు. ఎంతో కష్టపడి లాభాల బాటలో నడుపుకుంటున్న ప్రభుత్వ రంగ విద్యుత్ సంస్థలను.. ప్రైవేట్ వ్యక్తుల లాభాల కోసం ధారాదత్తం చేయడం దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు.
యాదాద్రి పవర్ ప్లాంట్లో అత్యంత కీలకమైన కోల్.. యాష్ హ్యాండ్లింగ్ విభాగాలను ప్రైవేట్ చేతుల్లో పెడితే.. అది భవిష్యత్తులో మొత్తం సంస్థ మనుగడకే ముప్పుగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల ఉద్యోగుల హక్కులు కాలరాస్తాయని, ప్రభుత్వ రంగానికి తీవ్ర నష్టం వాటిల్లుతుందని వారు స్పష్టం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి.. తక్షణమే ఈ టెండర్ల ప్రక్రియను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
తనని కరిచిన పామును కొరిక యువకుడు.. వైరల్ వీడియో!
Hyderabad, Telangana:Snake Video Viral: తాజాగా సోషల్ మీడియాలో ఓ యువకుడికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది. ఈ వీడియోలో పాము తనని కాటేసిందని.. ఆ వ్యక్తి ఆ పాముని పట్టుకొని మరి కొరికిన ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు చూడొచ్చు. ఇది చూసిన సోషల్ మీడియా వినియోగదారులు ఆశ్చర్యపోతున్నారు..మెడలో నాగుపాముతో తాత హల్చల్!
Hyderabad, Telangana:Cobra Video Viral: నాగుపామును మెడలో వేసుకుని ఓ తాత హల్చల్ చేశాడు. దీనికి సంబంధించిన ఘటన ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ ఘటన ఎక్కడ జరిగిందనేది ఇంకా తెలియలేదు. కానీ తాత నాగుపాముని మెడలో వేసుకుని కనిపించిన దృశ్యాలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి..ఒకటో తేదీన జీతాలు.. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు తెలంగాణ సీఎం తీపి కబురు
Hyderabad, Telangana:Telangana Employees: కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త వినిపించింది. వారి సమస్యల పరిష్కారానికి తెలంగాణ ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఒకటో తారీఖున జీతాలు అందించేందుకు వివరాలను పూర్తిగా డిజిటలైజ్ చేయాలని ఆదేశించారు. వివిధ విభాగాలలోని కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, జీతాలు, బ్యాంక్ అకౌంట్ వివరాలను డిజిటలైజ్ చేయాలని సూచించారు.
'డిజిటల్ గవర్నెన్స్ దిశగా ప్రణాళికలు సిద్ధం చేసి, అవసరమైన చట్టాలను రూపొందించండి. పరిపాలన వ్యవస్థను పూర్తి స్థాయిలో డిజిటలైజ్ చేస్తూ ముందుకు వెళ్లాలి. ప్రజలకు మెరుగైన సేవలను అందించడంతో పాటు సంక్షేమ పథకాలు నేరుగా లబ్ధిదారులకు చేర్చేందుకు డిజిటల్ గవర్నెన్స్' అని సీఎం తెలిపారు. డిజిటల్ గవర్నెన్స్ పై పూర్తిస్థాయి కసరత్తు చేసేందుకు ఒక కమిటీని నియమించాలని నిర్ణయించారు. ఈ కమిటీ 100 రోజుల్లో నివేదిక సమర్పించి ఒక కొలిక్కి తీసుకురాలని రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రభుత్వం చెల్లింపులు చేసినా సమయానికి ఉద్యోగులకు జీతాలు చెల్లించని కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
హైదరాబాద్లోని ఎంసీఆర్ హెఆర్డీలోని బోధి పెవిలియన్లో మంగళవారం కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై తెలంగాణ సీఎం ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై చర్చించారు. పరిపాలనలో మరింత పారదర్శకతకు డిజిటల్ గవర్నెన్స్ దిశగా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. దీనికి సంబంధించి ప్రణాళికలు సిద్ధం చేయడంతో పాటు అవసరమైన చట్టాలను రూపొందించాలని ఆదేశించారు.
ప్రజలకు మెరుగైన సేవలను అందించడంతో పాటు సంక్షేమ పథకాలు నేరుగా లబ్ధిదారులకు చేర్చేందుకు డిజిటల్ గవర్నెన్స్ ఉపయోగపడుతుందని సీఎం అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఒకటో తారీఖున జీతాలు అందించేందుకు వివరాలను పూర్తిగా డిజిటలైజ్ చేయాలని అధికారులకు చెప్పారు. రాష్ట్రంలో దాదాపు 4800 కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలు ఉండగా.. వాటిలో 4,300 ఏజెన్సీలు ఉద్యోగులకు ఈఎస్ఐ, పీఎఫ్ చెల్లించడం లేదని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఏజెన్సీలకు ప్రభుత్వం చెల్లింపులు చేసినా ఉద్యోగులకు సమయానికి జీతాలు చెల్లించడం లేదని వివరించారు. అలాంటి ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.
డిజిటల్ గవర్నెన్స్ తో సమస్యకు చెక్ పెట్టాలని.. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఒకటి నుంచి 5వ తేదీలోగా పారదర్శకంగా జీతాలు చెల్లింపులు జరిపేందుకు డిజిటల్ గవర్నెన్స్ ఉపయోగపడుతుందని తెలంగాణ సీఎం తెలిపారు. హెల్త్ కార్డులు, ఇతర బెనిఫిట్స్ అమలు చేసేందుకు ప్రభుత్వ ఉద్యోగుల వివరాలను కూడా డిజిలైజ్ చేయాలని చెప్పారు. నిరంతరం మానీటరింగ్ చేసేందుకు ఆర్థిక శాఖ విభాగం ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
దొడ్డిదారిన రాజన్న ఆలయ ఉద్యోగాల నియామకం.. మంత్రుల సిఫార్సులపై చల్మెడ ఫైర్!
Hyderabad, Telangana:Vemulawada: ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ తీవ్ర వివాదాలకు దారితీస్తూ వస్తోంది.. రాజన్న గుడిలోని ఔట్ సోర్సింగ్ పోస్టుల్లో కేవలం స్థానిక నిరుద్యోగ యువతీ, యువకులకే తొలి ప్రాధాన్యత ఇవ్వాలని.. స్థానికేతరుల నియామకాలను తక్షణమే నిలిపివేయాలని BRS పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన స్థానిక నిరుద్యోగుల పక్షాన ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
దొడ్డిదారిన నియామకాలు..?
రాజన్న ఆలయంలోని పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ కోసం గతంలో కలెక్టర్ సందీప్కుమార్ ఝా ఆధ్వర్యంలో అర్హులైన స్థానిక అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించిన విషయాన్ని చల్మెడ ఈ సందర్భంగా గుర్తుచేశారు.. అయితే, గతంలో స్థానికులకు నిర్వహించిన ఇంటర్వ్యూల ప్రక్రియను ప్రస్తుత ప్రభుత్వం పూర్తిగా పక్కనబెట్టడం దురదృష్టకరమన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో వేలాది మంది చదువుకున్న, అన్ని అర్హతలు ఉన్న నిరుద్యోగ యువతీ యువకులు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారని.. అలాంటిది స్థానికులను కాదని.. పలువురు మంత్రుల సిఫారసు లేఖలతో దొడ్డిదారిన ఇతర ప్రాంతాల వారికి పోస్టులు కట్టబెట్టడం తీవ్రంగా ఖండించదగిన విషయమని.. చల్మెడ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఉద్యోగాల భర్తీ ఏదైనా సరే.. అందులో పూర్తిస్థాయి పారదర్శకత ఉండాలని ఆయన డిమాండ్ చేశారు. ఆలయంలో ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలను అధికారికంగా గుర్తించి.. ప్రముఖ పత్రికల ద్వారా నోటిఫికేషన్ విడుదల చేయాలని సూచించారు. అలా కాకుండా రహస్యంగా.. రిఫరెన్స్లతో భర్తీ చేయడం వల్ల ప్రతిభ గల స్థానిక యువత ఉపాధి అవకాశాలను కోల్పోతుందన్నారు.
Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!
ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఏం చేస్తున్నారు..?
జిల్లా నిరుద్యోగులకు ఇంత పెద్ద అన్యాయం జరుగుతుంటే స్థానిక శాసనసభ్యుడు, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఎందుకు మౌనంగా ఉన్నారని చల్మెడ లక్ష్మీనరసింహారావు ప్రశ్నించారు. అక్రమ నియామకాలను అడ్డుకోవాల్సిన బాధ్యత విప్పై లేదా అని నిలదీశారు. జిల్లా యువతపై నిజంగా ఆది శ్రీనివాస్కు చిత్తశుద్ధి.. ప్రేమ ఉంటే.. ఇప్పటివరకు మంత్రుల సిఫారసులతో జరిగిన ఔట్ సోర్సింగ్ నియామకాలపై తక్షణమే పూర్తిస్థాయి విచారణకు ఆదేశించాలని సవాల్ విసిరారు.
Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
రూ.20,000 బడ్జెట్లో బెస్ట్ 5G ఫోన్.. Poco M8 5Gపై ఫ్లిప్కార్ట్లో కళ్లు చెదిరే ఆఫర్స్!
Hyderabad, Telangana:Poco M8 5G Offers News: ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ నిర్వహిస్తోన్న గోట్ సేల్ (GOAT Sale) కస్టమర్స్కి అద్భుతమైన పండగలాంటి ఆఫర్లను అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఈ సేల్లో స్మార్ట్ఫోన్లు, టాబ్లెట్లు, ల్యాప్టాప్లతో పాటు స్మార్ట్ టీవీలపై భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి.. ముఖ్యంగా రూ.20,000 బడ్జెట్లో అదిరిపోయే ఫీచర్లు ఉన్న అద్బుతమైన 5G స్మార్ట్ఫోన్ కొనుగోలు చేయాలనుకునేవారికి ఇదే అద్భుతమైన అవకాశంగా భావించవచ్చు.. పోకో M8 5G (Poco M8 5G) స్మార్ట్ఫోన్ ఇప్పుడు అద్భుతమైన ఫీచర్స్తో అందుబాటులోకి వచ్చింది. అయితే, ఇది ఇప్పుడు చీప్ ధరకే లభిస్తోంది. దీనిపై అందుబాటులో ఉన్న పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
భారీ డిస్కౌంట్..
పోకో M8 5G స్మార్ట్ఫోన్కు సంబంధించిన 6GB ర్యామ్తో పాటు 128GB స్టోరేజ్ వేరియంట్ సాధారణ ధర రూ.19,999 కాగా.. ఇప్పడే కొనుగోలు చేసేవారికి భారీ తగ్గింపు అందుబాటులో ఉంది. అయితే, ఈ సేల్లో భాగంగా యాక్సిస్ బ్యాంక్ (Axis Bank) క్రెడిట్ కార్డ్ను వినియోగించి కొనుగోలు చేసే వారికి రూ.1,000 వరకు డిస్కౌంట్ పొందవచ్చు. అలాగే దీనిపై అదనంగా ఎక్చేంజ్ బోనస్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. దీంతో ఈ స్మార్ట్ఫోన్ను ధర కేవలం రూ.18,999కే సొంతం చేసుకోవచ్చు.
అంతేకాకుండా అదనంగా ఎక్చేంజ్ ఆఫర్ కూడా లభిస్తోంది. ఇందులో భాగంగా ఈ ఫోన్పై రూ.14,550 వరకు భారీ ఎక్స్ఛేంజ్ ఆఫర్ను కూడా ఫ్లిప్కార్ట్ అందిస్తోంది. ఈ ఆఫర్ వినియోగించాలనుకునేవారు తమ పాత ఫోన్ను ఎక్స్ఛేంజ్ చేస్తే.. మీరు ఈ మొబైల్ను కేవలం రూ.4,449 లోపే సొంతం చేసుకోవచ్చు. అయితే, ఈ ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ అనేది మీరు ఇచ్చే పాత మొబైల్ కండిషన్తో పాటు మోడల్పై ఆధారపడి ఉంటుంది..
పోకో M8 5G ఫీచర్లు, స్పెసిఫికేషన్లు..
ఈ స్మార్ట్ఫోన్ 6.77 అంగుళాల 3D కర్వ్డ్ అమోలెడ్ (3D Curved AMOLED) డిస్ప్లేను కలిగి ఉంటుంది.. ఇది ఫుల్ HD+ రెజల్యూషన్తో పాటు 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్తో, 3,200 నిట్స్ పీక్ బ్రైట్నెస్తో అందుబాటులోకి వచ్చింది. దీనివల్ల ఎండలో కూడా స్క్రీన్ చాలా స్పష్టంగా, ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది.. ఈ ఫోన్ ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 6 జెన్ 3 (Snapdragon 6 Gen 3) ప్రాసెసర్తో అందుబాటులోకి వచ్చింది.. ఇది మల్టీటాస్కింగ్తో పాటు గేమింగ్కు చక్కగా ఉపయోగపడుతుందని కంపెనీ క్లైమ్ చేస్తోంది..
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
ఇక ఈ స్మార్ట్ఫోన్ అద్భుతమైన లేటెస్ట్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత HyperOS 2 ఆపరేటింగ్ సిస్టమ్పై రన్ అవుతుంది. ఫోన్ వెనుక భాగంలో 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో పాటు 2 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరాలు అందుబాటులో ఉన్నాయి. అలాగే, సెల్ఫీలతో పాటు వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 20 మెగాపిక్సెల్ అద్భుతమైన ఫ్రంట్ కెమెరా కూడా అందుబాటులో ఉంది.. ఈ డివైజ్లో ఎంతో శక్తివంతమైన 5,520mAh భారీ బ్యాటరీని కూడా కలిగి ఉంటుంది. ఇది 45W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్కు సపోర్ట్ చేస్తుంది.
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
హర్పిక్తో భర్త హత్య.. బంటితో కలిసి భార్య సంధ్య పన్నిన కుట్ర ఫోన్కాల్ లీక్
Nizamabad, Telangana:Harpic Murder Case Phone Call: వివాహేతర సంబంధం ఏర్పరచుకున్న భార్య తాను ప్రేమించి పెళ్లాడిన భర్తను అతి కిరాతకంగా హత్య చేసిన సంఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం రేపింది. దుబాయ్ నుంచి వచ్చిన భర్తను మూడు రోజులకే భర్త దారుణ హత్యకు పాల్పడింది. పథకం ప్రకారం ప్రేమించి పెళ్లి చేసుకొని పదేళ్లు కాపురం చేసిన భర్తను ప్రియుడితోపాటు మరో యువకుడి సహాయంతో నాటకీయ పరిణామాల మధ్య ఆమె హత్య చేసింది. ప్రియుడితో కలిసి భర్తను చంపేందుకు ప్రణాళిక రచించిన భార్య భర్తకు డాబాపైన పీకలదాకా మద్యం తాగించి అనంతరం భవనంపై నుంచి తోసేసింది. అప్పటికి భర్త చనిపోక ఆస్పత్రిలో చికిత్స పొందుతుండడంతో సెలైన్లో హార్పిక్ ఎక్కించి హత్యకు పాల్పడడం యావత్ సమాజాన్ని విస్తుగొలిపింది. తెలంగాణలోని నిజామాబాద్లో జరిగిన ఈ సంఘటనలో భార్య ఆడియో కాల్ వైరల్గా మారింది.
ఫోన్ కాల్ ఆడియో
నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం న్యాల్కల్ గ్రామంలో జరిగిన ప్రశాంత్ హత్య కేసులో ఫోన్ కాల్ ఆడియో సంభాషణ బయటకు వచ్చింది. మృతుడి భార్య సంధ్యకు హత్యకు సహకరించి మద్యం తాగించిన వెంకట సాయి అలియాస్ బంటికి మధ్య జరిగిన సంభాషణ వైరలైంది. బంటి సంధ్య మధ్య సంభాషణ ఇలా జరిగింది.
సంధ్య: హలో.. అరేయ్ ఎట్ల ఒర్లుతుంది వాడేనా ఒర్లేది.
బంటి: కాదు.
సంధ్య: తాగి ఏది ఏమైనా కానీ తాగి డిచ్చ కావాలి
బంటి: కాదు.. వేరోడు. ఆయన నాతో మంచిగానే ఉన్నాడు.
సంధ్య: కాదు రా. అరేయ్ ఏం చేత్తవో నాకు తెల్వదు మొత్తానికి డిచ్చ తాగి పండాలి
సంధ్య: 'అరె బంటి ఎలాగైనా మందు తాగిస్తూనే ఉండురా. అరె వాడు కిందికి వస్తే నాకు బాధ రా. నమ్మినారా నిన్ను. నీదే రా బాధ్యత. మందు తాగించడం సగం వరకు రాగానే మళ్లీ తెప్పించి తాగించురా బంటి: సరే
సంధ్య: డిచ్చ తాగి పండాలి. కిందకు దిగొద్దు.
బంటి: ససరే.. నాకు తాగిపిత్తుండు
సంధ్య: వాడు కిందకు దిగొద్దు. వాడికే తాగిపియి.
బంటి: నీయమ్మ నేను కూడా పండాల్న ఏంది ఈడ్నే. వాడితో పాటు నేను పడుకోవాలా? నా చావుకు వచ్చింది సంధ్య
సంధ్య: ఏమైనా చేయి రా కిందకు రానివ్వకు. అన్నే పండనియ్యి. అబ్బా ప్లీజ్ రా. నీకు దండం పెడతా.. కాళ్లు మొక్కుతారా
జరిగింది ఇదే..
నిజామాబాద్ జిల్లా మోపాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని న్యాల్కల్ గ్రామానికి చెందిన దాయిని ప్రశాంత్ దుబాయ్లో పనిచేసేవాడు. పదేళ్ల కింద సంధ్యను ప్రేమించి పెళ్లి చేసుకోగా వీరికి ఇద్దరు పిల్లలు కలిగారు. జూన్ 27వ తేదీన గల్ఫ్ నుంచి ప్రశాంత్ స్వగ్రామానికి వచ్చాడు. ఇంద్రాపూర్కు చెందిన అనిల్తో సంధ్యకు అక్రమ సంబంధం ఏర్పడింది. తమ బంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించి అతడి హత్యకు భార్య పథకం రచించింది. సంధ్య, అనిల్ కలిసి అదే గ్రామానికి చెందిన బంటి అనే యువకుడి సహకారంతో కుట్ర పన్నారు.
ప్లాన్ ఏ, ప్లాన్ బీ, ప్లాన్ త్రీ
పథకం ప్రకారం 29వ తేదీన బంటి ప్రశాంత్ ఇంటికి వెళ్లి డాబాపైన అతడితో మద్యం తాగాడు. స్థాయికి మించి ప్రశాంత్కు బంటి మద్యం తాగించాడు. తర్వాత అతడిని డాబాపై నుంచి అతడి భార్య సంధ్యతో కలిసి కిందకు నెట్టి వేశారు. కిందపడిన ప్రశాంత్ తీవ్ర గాయాలవడంతో ఓ ఆస్పత్రిలో చేర్పించారు. భర్త తిరిగి బతికితే తమకు కష్టం.. తామే చంపేశామని చెబుతారని భయపడిన సంధ్య, బంటి, ప్రియుడు అనిల్ ముగ్గురు కలిసి సంధ్య మరో పథకం రచించింది. ముందుగా దాచిపెట్టుకున్న మత్తు ఇంజెక్షన్లు, మత్తు మాత్రలతో తయారుచేసిన ఇంజక్షన్, టాయిలెట్ క్లీనర్ (హార్పిక్)ను ప్రశాంత్ చేతికి ఎక్కించారు. ఆ తర్వాత మంచంపై నుంచి కిందకు తోసివేయడంతో అతడు మరణించాడు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు ఎస్ఐ సుస్మిత విచారణ చేసి తమదైన శైలిలో విచారణ చేయడంతో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
