ఖమ్మం గ్రీవెన్స్ భారీగా బాధితుల ఫిర్యాదులు
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
America Warns India: భారత్, చైనా మధ్య అరుణాచల్ ప్రదేశ్ కు సంబంధించిన వివాదం నడుస్తోంది. అరుణాచల్ ప్రదేశ్ తమ భూభాగమని చైనా వాదిస్తోంది. కాదు.. కాదు.. అరుణాచల్ ప్రదేశ్.. అప్పటికీ.. ఇప్పటికీ.. ఎప్పటికీ భారత భూభాగమే అని విదేశాంగ శాఖ తేల్చి చెప్పింది. అయితే చైనా ..ఈ విషయంలో తరచుగా భారత్ ను కెలికే ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఈ తరుణంలోనే ఈ అంశానికి సంబంధించి చైనా నుంచి భారత్ కు ప్రమాదం పొంచి ఉందని అగ్రరాజ్యం అమెరికా హెచ్చరించింది.
అగ్రరాజ్యం అమెరికా తాజాగా విడుదల చేసిన ఓ కీలక రిపోర్టులో భారత్ కు హెచ్చరిక జారీ చేసింది. చైనా, అరుణాచల్ ప్రదేశ్ ను తైవాన్ స్థాయిలోనే అత్యంత కీలకమైన ప్రాంతంగా భావిస్తుందని.. రానున్న కాలంలో ఇదే అంశం భారత్, చైనా మధ్య యుద్ధానికి కారణం కావచ్చని యూఎస్ పెంటగాన్ తన నివేదికలో పేర్కొంది. ఈ రిపోర్టు ప్రకారం.. చైనా తన దీర్ఘకాలిక వ్యూహంలో భాగంగానే తైవాన్, దక్షిణ చైనా సముద్రం, అరుణాచల్ ప్రదేశ్ ను ఒకే సరసన పెట్టి చూస్తోంది. అయితే పెంటగాన్ అంచనాల ప్రకారం.. 2019 నాటికి గ్రేట్ నేషనల్ రిజువనేషన్ అనే లక్ష్యాన్ని సాధించాలన్న సంకల్పంతో చైనా ఉంది. ఆ లక్ష్యంలో భాగంగానే..ప్రపంచంలోనే ప్రధాన శక్తిగా ఎదగడంతోపాటు.. అవసరమైతే యుద్ధాలను గెలిచే శక్తివంతమైన సైన్యాన్ని నిర్మించడంపై బీజింగ్ ఫోకస్ పెట్టింది.ఈ క్రమంలోనే.. సరిహద్దు వివాదాలు ఉన్న ప్రాంతాలను చైనా తన కోర్ ఇంటరెస్ట్స్ గా ప్రకటిస్తూ.. వాటిపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తోంది. అరుణాచల్ ప్రదేశ్ కూడా అందులో ఒకటిగా ఉందని అమెరికా నివేదిక స్పష్టం చేసింది.
అరుణాచల్ ప్రదేశ్ భారత భాగమేనని.. గతంలోనూ.. ఇప్పుడూ.. భవిష్యత్తులోనూ అలాగే ఉంటుందని భారత్ పదేపదే ప్రకటిస్తోంది. అయితే చైనా మాత్రం దీన్ని పెడచెవిన పెడుతోంది. 1914లో బ్రిటిష్ ఇండియా, టిబెట్ మధ్య కుదిరిన మెక్మహాన్ లైన్ను చైనా అధికారికంగా ఒప్పుకోలేదు. అందుకే అరుణాచల్ ప్రదేశ్ను దక్షిణ టిబెట్ లేదా జాంగ్నాన్ అని పిలుస్తోంది. మొదట్లో ఈ వాదన తవాంగ్ ప్రాంతానికే పరిమితమై ఉంది. కానీ.. క్రమంగా మొత్తం అరుణాచల్ ప్రదేశ్ను తనదిగా పేర్కొనే స్థాయికి చైనా వెళ్లిందని నివేదిక చెబుతోంది.చైనా తరచూ అరుణాచల్ ప్రదేశ్లోని గ్రామాలు, పట్టణాలకు కొత్త పేర్లు పెట్టి ప్రకటించడం కూడా ఈ ఒత్తిడి వ్యూహంలో భాగమేనని అమెరికా అభిప్రాయపడుతోంది. ఇది కేవలం మాటల యుద్ధం మాత్రమే కాదు.. భవిష్యత్తులో సరిహద్దు వద్ద ఉద్రిక్తతలను మరింత పెంచే అవకాశం ఉందని నివేదిక హెచ్చరిస్తోంది.
ఇటీవల జరిగిన కొన్ని ఘటనలు కూడా ఈ వివాద తీవ్రతను చూపిస్తున్నాయి. అరుణాచల్ ప్రదేశ్కు చెందిన భారత పౌరురాలు ప్రేమా థాంగ్డోక్ను షాంఘై విమానాశ్రయంలో దాదాపు 18 గంటల పాటు నిర్బంధించారు. ఆమె పాస్పోర్ట్లో జన్మస్థలంగా అరుణాచల్ ప్రదేశ్, ఇండియా అని ఉండటమే దీనికి కారణం. ఆ సమయంలో ఆమెకు ఆహారం, ఇతర సౌకర్యాలు కూడా కల్పించలేదని సమాచారం. భారత కాన్సులేట్ జోక్యం చేసుకున్న తర్వాత మాత్రమే ఆమెను విడుదల చేశారు. అలాగే.. అరుణాచల్ ప్రదేశ్ భారతదేశంలో భాగమని చెప్పిన ఒక యూట్యూబర్ను కూడా చైనా అధికారులు అదుపులోకి తీసుకోవడం చర్చనీయాంశమైంది.
ఈ మొత్తం వ్యూహంలో పాకిస్తాన్ పాత్ర కూడా ఉందని అమెరికా నివేదిక పేర్కొంది. భారత్పై ఒత్తిడి పెంచేందుకు చైనా పాకిస్తాన్ను ఒక సాధనంగా ఉపయోగిస్తోందని.. సరిహద్దులో శాంతి పేరుతో ఒకవైపు, పాకిస్తాన్ ద్వారా మరోవైపు ఒత్తిడి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తోందని అంచనా వేసింది. ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్ చైనా తయారీ ఆయుధాలను ఉపయోగించిందన్న అంశాన్ని కూడా నివేదిక ప్రస్తావించింది.
మొత్తంగా.. అరుణాచల్ ప్రదేశ్పై చైనా చేస్తున్న దావాలు కేవలం భూభాగ వివాదం మాత్రమే కాదని.. అది చైనా ప్రపంచ వ్యూహంలో భాగమని అమెరికా స్పష్టం చేస్తోంది. ఇదే కారణంగా.. రాబోయే కాలంలో అరుణాచల్ ప్రదేశ్ భారత్–చైనా మధ్య పెద్ద ఘర్షణకు కేంద్ర బిందువుగా మారే ప్రమాదం ఉందని ఈ నివేదిక హెచ్చరిస్తోంది.
Also Read: China Gen-Z: చైనా Gen-Z విషపూరిత పాములను ఎందుకు కొంటున్నారు? ఈ పైత్యానికి కారణమేంటి..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Giant Anaconda Video Watch: సోషల్ మీడియా యుగంలో వింతలు విశేషాలకు సంబంధించిన దృశ్యాలు మనం రోజు చూస్తూ ఉంటాం. ముఖ్యంగా కొన్ని పాములతో పాటు జంతువులకు సంబంధించిన వింత వీడియోలు ఎంతో ఆసక్తిగా చూస్తాం. అలాగే కొంతమంది జంతువులను పట్టుకుంటున్న సమయంలో కూడా తీసిన వీడియోలు ఎక్కువగా వైరల్ అవుతూ ఉంటాయి. మరి కొంతమంది పాములను పట్టుకుంటున్న సందర్భంలో తీసిన వీడియోలను కూడా పోస్ట్ చేస్తే జనాలు వైరల్ చేస్తున్నారు. ఇలా పాములకు సంబంధించిన వీడియోలైతే జనాలు ఎంతో ఇష్టంగా చూస్తున్నారు.. తాజాగా కూడా ఇలాంటి పాములకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
వైరల్ అవుతున్న వీడియో వివరాల్లోకి వెళితే ద రెప్టైల్ జూ (The Reptile Zoo) అనే యూట్యూబ్ ఛానల్ నుంచి షేర్ చేసిన వీడియో ఇప్పుడు అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసేలా చేస్తుంది. చాలామంది చిన్న పాములను చూసి వాటికి ఆమెడ దూరం పరిగెడతారు.. అలాంటిది ఈ వీడియోలో ఓ మహిళ ఏకంగా ప్రపంచంలోనే అత్యంత భారీ అనకొండ పాములను నీటిలో నుంచి బయటికి తీస్తోంది. అంతేకాకుండా వాటితో ఆమె ముద్దు ముద్దుగా ఆడుకుంటుంది. ఇప్పుడు ఈ దృశ్యాలే సోషల్ మీడియాలో నెటిజన్స్ను ఆకట్టుకుంటున్నాయి.
వీడియో వివరాల్లోకి వెళితే..జూ కీపర్ జూలియట్ బ్రూవర్ పాములకు ప్రత్యేకంగా తయారుచేసిన ఎన్క్లోజర్ నుంచి అత్యంత భారీ అనకుండా లను ఒక్కొక్కటిగా బయటికి తీసుకురావడం మీరు చూడొచ్చు. ఆమె మొదటగా ఆ ఎన్క్లోజర్లో ఉన్న నీటిలో నుంచి అత్యంత భారీ అనకుండాను బయటికి తీసింది. అంతేకాకుండా బయటికి తీస్తున్న సమయంలో వీడియోకి చూపించడం కూడా మీరు గమనించవచ్చు. అలాగే ఆ వెంటనే ఆశ్చర్యకరంగా మరో పామును బయటకు తీసింది. ఇలా ఆ యువతి వెంట వెంటనే వరుసగా ఐదు అనకొండ పాములను బయటికి తీసి నేలపై ఉంచింది. ఆమె వాటిని అందులో నుంచి ఎత్తి బయటికి తీయడం ఎంతో శ్రమతో కూడుకున్న పని అని తెలుస్తోంది.
అయితే, ఇదే సమయంలో ఆమె అనకొండ గురించి చెబుతూ వచ్చింది.. అనకొండల చర్మం కొంచెం నీలిరంగులో మెరుస్తూ ఉంటుందని.. అలాంటి సమయంలోనే కుబుసం విడిచేందుకు సిద్ధమైందని ఆమె వీడియోలో వివరించింది. వీడియో చివరిలో.. ఆ ఐదు పాములు ఒకే చోట పెద్ద కుప్పగా ఏర్పడడం చూస్తుంటేనే..ఒళ్లు గగుర్పొడుస్తుంది. ఇవి చూడడానికి చాలా భయంకరంగా ఉన్నప్పటికీ ఆ యువతి ఏ మాత్రం భయపడకుండా స్వీట్ గర్ల్ అంటూ పిలుస్తూ ఎంతో ప్రేమగా చూసుకోవడం విశేషం. ఇప్పుడు ఈ దృశ్యాలు చూసిన చాలా మంది సోషల్ మీడియా వినియోగదారులు వారి అభిప్రాయాలు రకరకాలుగా కామెంట్ల రూపంలో పంచుకుంటున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Motorola Signature Series Launch Date In India: ప్రముఖ స్మార్ట్ఫోన్ కంపెనీ మోటోరోలా మరోసారి మార్కెట్ను కుదిపేసేందుకు సిద్ధమైంది. తమ కొత్త సిగ్నేచర్ సిరీస్ను త్వరలోనే విడుదల చేయబోతున్నట్లు వార్తలు విపరీతంగా వస్తున్నాయి. దీనిని కంపెనీ ఫ్లాగ్షిప్ ఫీచర్లతో అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇది మోటార్లకు మొట్టమొదటి ఫ్లాగ్షిప్ ఫోన్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు కూడా సోషల్ మీడియాలో పెద్ద ప్రచారం జరుగుతోంది. అయితే, కంపెనీ దీని గురించి ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోయినా.. కొన్ని లీకైన ఫీచర్లు మాత్రం ఇది ప్రీమియం ఫీచర్లతో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలియజేస్తోంది. అంతేకాకుండా ఇటీవల ఈ స్మార్ట్ఫోన్ బెంచ్మార్క్ ప్లాట్ఫామ్లలో కూడా కనిపించడంతో విడుదలకు సిద్ధమైందని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ స్మార్ట్ఫోన్కు సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
మోటరోలా సిగ్నేచర్ సిరీస్ మొబైల్స్ ఫ్లాగ్షిప్ డిజైన్తో పాటు ఫీచర్లతో లాంచ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కంపెనీ ఈ స్మార్ట్ ఫోన్ కు సంబంధించిన టీజర్ను ఫ్లిప్కార్ట్లో రన్ చేస్తోంది. అంతేకాకుండా ఈ మొబైల్ సిరీస్కు సంబంధించిన డిజైన్ కూడా త్వరలో వెల్లడించబోతున్నట్లు వార్తలు కూడా వస్తున్నాయి. ఈ సిగ్నేచర్ సిరీస్తో పాటు కంపెనీ మరికొన్ని పరికరాలను కూడా విడుదల చేసేందుకు యోచిస్తోందని సమాచారం.. ముఖ్యంగా ఇప్పటికే ఈ స్మార్ట్ఫోన్కి సంబంధించిన కొన్ని ఫీచర్లు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.. ఇక ఈ స్మార్ట్ఫోన్కు సంబంధించిన ఫీచర్స్ వివరాల్లోకి వెళితే.. దీనిని కంపెనీ ఎంతో శక్తివంతమైన క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 జెన్ 5 చిప్సెట్ ప్రాసెసర్తో విడుదల చేయబోతోంది.
Also Read: Honor Power 2 5G మొబైల్ త్వరలో వచ్చేస్తోంది.. ఫీచర్స్ మొత్తం అదుర్స్!
అంతేకాకుండా ఈ స్మార్ట్ఫోన్ 8జిబి ర్యామ్ బేస్ వేరియంటులో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇది 6.7-అంగుళాల OLED డిస్ప్లేను కూడా కలిగి ఉంటుంది. అంతేకాకుండా దీని స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్టును కూడా కలిగి ఉంటుంది. అలాగే ఈ మొబైల్ డిజైన్ చూడడానికి ఇటీవల మార్కెట్లోకి విడుదలైన మోటరోలా ఎడ్జ్ 70 మొబైల్ మాదిరిగానే ఉండబోతున్నట్లు తెలుస్తోంది. వెనక భాగంలో త్రిపుల్ కెమెరా సెటప్ను కలిగి ఉంటుంది. ఇందులోని మూడు కెమెరాలు 50MPతో అందుబాటులోకి రాబోతున్నట్లు సమాచారం. దీనిని కంపెనీ ప్రపంచవ్యాప్తంగా జనవరిలో విడుదల చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా డిసెంబర్ చివరి వారంలో లేదా జనవరి మొదటి వారంలో ఈ మొబైల్కు సంబంధించిన ఫీచర్స్ ను కూడా అధికారికంగా వెల్లడించబోతున్నట్లు తెలుస్తోంది.
ఈ సిగ్నేచర్ సిరీస్ మొబైల్ ఫ్లాగ్ షిప్ ఫీచర్లతో అందుబాటులోకి రాబోతోంది. కాబట్టి ధరలు కూడా కాస్త ఎక్కువగానే ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇది విడుదలైన వెంటనే ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్కార్ట్లో సేల్కి అందుబాటులో ఉంటుంది. అలాగే ఈ మొబైల్ ధరపై ప్రత్యేకమైన ఫ్లాట్ డిస్కౌంట్తో పాటు బ్యాంకు డిస్కౌంట్ ఆఫర్స్ కూడా అందించే అవకాశాలు ఉన్నాయని టెక్ నిపుణులు చెబుతున్నారు. ఈ స్మార్ట్ఫోన్ మార్కెట్లోకి విడుదల అయితే సాంసంగ్, రెడ్మీ, రియల్ మీ, వన్ ప్లస్ ప్రీమియం ఫీచర్స్ కలిగిన మొబైల్స్తో పోటీపడే అవకాశాలున్నాయి.
Also Read: Honor Power 2 5G మొబైల్ త్వరలో వచ్చేస్తోంది.. ఫీచర్స్ మొత్తం అదుర్స్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
30-foot Python Video Watch Here: ప్రకృతిలో కొన్ని దృశ్యాలు నిత్యం సోషల్ మీడియా వినియోగదారులను ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి. తాజాగా ఓ అటవీ ప్రాంతంలో బయటపడిన అత్యంత భారీ కొండచిలువకు సంబంధించిన వీడియో ఇప్పుడు ఊహించని స్థాయిలో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వస్తోంది. ఈ వీడియోలో భారీ కొండచిలువను జెసిబి సహాయంతో తరలిస్తున్న దృశ్యాలు నెటిజన్లు చూసి సోషల్ మీడియా వినియోగదారులు ఆశ్చర్యపోతున్నారు. ముఖ్యంగా ఈ వీడియోలో ఆ ప్రాణంతో ఉన్న కొండచిలువ అటు ఇటు కదులుతుండడం చూసి భయాందోళన చెందుతున్నారు. అయితే ఈ వీడియోకు సంబంధించిన పూర్తి వివరాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
వీడియోకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఎక్కడో కానీ ఓ నిర్మాణ స్థలంలో కార్మికులు పనిచేస్తున్న సమయంలో అకస్మాత్తుగా ఓ భారీ కొండచిలువ కనిపించింది. దీని పరిమాణం చూసి వారంతా ఒక్కసారిగా షాక్ అయిపోయారు. అంతేకాకుండా అక్కడ ఉన్న కొంతమంది భయాందోళనకు కూడా గురైనట్లు సమాచారం. ఈ వీడియోలో ఉన్న కొండచిలువ దాదాపు 30 అడుగుల కంటే ఎక్కువగానే పడుకున్నట్లు తెలుస్తోంది. దీంతో పనిచేస్తున్న కార్మికులు అక్కడినుంచి ఒక్కసారిగా పరుగులు తీశారు. ఇది అసాధారణమైన అనకొండ అని.. ఇలాంటి అరుదైన పాములు ప్రపంచంలో కొన్ని చోట్లనే జీవించగలుగుతాయని వీడియో చూసిన వన్యప్రాణి సంరక్షకులు చెబుతున్నారు.
అయితే అక్కడి నుంచి పారిపోయిన కార్మికులు వెంటనే వారికి సంబంధించినపై అధికారులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి రెస్క్యూ బృందం చేరుకొని.. ప్రత్యేకమైన ఆపరేషన్ చేపట్టింది. అక్కడికి చేరుకున్న రెస్క్యూ టీం కూడా ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురైయ్యారు. చేసేదేం లేక చేతులతో పట్టుకోవడం అసాధ్యమని భావించి.. జెసిబి కి సంబంధించిన బకెట్ తో ఆ కొండచిలువని ఎంతో జాగ్రత్తగా పైకి ఎత్తి.. రెస్క్యూ చేసేందుకు అక్కడి నుంచి తరలించారు. అయితే, ఈ సమయంలో ఆ భారీ అనకుండా జెసిబి బాకెట్తో ఎత్తినప్పటికీ నేలకు అంటుతూ ఉండడం విశేషం. దీన్ని చూస్తే ఇది ఎంత బరువు ఉంది అనేది మీరు క్లియర్గా చెప్పొచ్చు.
ఈ ఘటనను అక్కడే ఉన్న కొంతమంది కార్మికులు వారి స్మార్ట్ఫోన్స్లో చిత్రీకరించి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతేకాకుండా కొంతమంది ఈ వీడియో ను యూట్యూబ్ షార్ట్ వీడియోలో కూడా పోస్ట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోనే ఇప్పుడు వైరల్గా మారింది. ఈ వీడియోను కొన్ని లక్షలమంది వీక్షించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇలా పోస్ట్ చేసిన వీడియోకు ప్రపంచంలోనే అతిపెద్ద కొండచిలువ పామని క్యాప్షన్ రాశారు. ఈ భారీ కొండచిలువను చూసిన వన్యప్రాణి సంరక్షకులు సైతం ఆశ్చర్యానికి గురవుతున్నారు. కేవలం ఇలాంటి పాములు అమెజాన్ అడవికి దగ్గరగా ఉండే ప్రాంతాల్లో జీవించగలుగుతాయని వారి అభివర్ణిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Budget 2026 aam aadmi expectations: బడ్జెట్ 2026 సమీపిస్తున్న వేళ.. దేశవ్యాప్తంగా సామాన్యులు, మధ్యతరగతి ఆశతో ఎదురు చూస్తున్నారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, నెలనెలా పెరుగుతున్న EMIల భారం, స్థిరంగా లేని ఉద్యోగ పరిస్థితులు.. వీటన్నింటి మధ్య ప్రభుత్వం ఈసారి నేరుగా తమ జీవితాలపై ప్రభావం చూపే నిర్ణయాలు తీసుకుంటుందా అనే ప్రశ్న ప్రజల మనసుల్లో మెదులుతోంది. జీతాలు పెరగకపోయినా ఖర్చులు మాత్రం పెరుగుతున్న ఈ కాలంలో.. బడ్జెట్ 2026 సామాన్యుల జేబుకు ఎంత ఉపశమనం ఇస్తుందన్నదే ఆసక్తి నెలకొంది.
ఈసారి బడ్జెట్లో ప్రధానంగా చర్చకు వచ్చే అంశం ఆదాయపు పన్ను ఉపశమనం. ముఖ్యంగా 30 శాతం పన్ను స్లాబ్పై చాలా కాలంగా మధ్యతరగతి నుంచి డిమాండ్ వినిపిస్తోంది. ప్రస్తుతం వార్షిక ఆదాయం రూ. 24 లక్షలు దాటితేనే నేరుగా 30 శాతం పన్ను వర్తిస్తోంది. ద్రవ్యోల్బణం, పిల్లల విద్య, వైద్య ఖర్చులు, గృహ రుణాలు పెరిగిన నేపథ్యంలో ఈ పరిమితి పాతదైందన్న భావన బలంగా వినిపిస్తోంది. అందుకే ప్రభుత్వం ఈ స్లాబ్ను రూ. 40 నుంచి రూ. 50 లక్షల వరకు పెంచవచ్చన్న అంచనాలు ఉన్నాయి. ఇది అమలైతే, మధ్యతరగతిలోని జీతం పొందే వర్గానికి ప్రతి ఏడాది వేల రూపాయల మేర ప్రత్యక్ష లాభం చేకూరుతుంది. వారి చేతిలో మిగిలే డబ్బు పెరిగి, వినియోగం కూడా పెరుగుతుంది.
అదేవిధంగా.. కొత్త పన్ను విధానంలో ప్రామాణిక మినహాయింపును మరింత పెంచే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పరిమితిని రూ. 1 లక్ష వరకు పెంచితే, జీతం పొందే వారికి స్పష్టమైన ఉపశమనం లభిస్తుంది. ఆరోగ్య ఖర్చులు పెరుగుతున్న నేపథ్యంలో, సెక్షన్ 80D కింద ఆరోగ్య బీమా ప్రీమియం మినహాయింపు పరిమితిని కూడా పెంచవచ్చన్న చర్చ జరుగుతోంది. ఇవన్నీ కలిసి ఒక సాధారణ కుటుంబానికి సంవత్సరానికి గణనీయమైన పొదుపు అందించగలవు.
మధ్యతరగతికి మరో పెద్ద కల ఏంటంటే.. సొంత ఇల్లు. అయితే పెరిగిన వడ్డీ రేట్లు, ఖరీదైన ఇళ్ల ధరలు ఈ కలను మరింత దూరం చేస్తున్నాయి. బడ్జెట్ 2026లో ప్రభుత్వం సరసమైన గృహనిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టవచ్చని అంచనా వేస్తున్నారు. కొత్త పన్ను విధానంలో స్వీయ నివాస గృహాలపై గృహ రుణ వడ్డీ మినహాయింపును తిరిగి తీసుకురావడం, దాని పరిమితిని పెంచడం వంటి నిర్ణయాలు తీసుకుంటే, అది ఇల్లు కొనుగోలు చేయాలనుకునే వారికి పెద్ద ఊరట అవుతుంది. తక్కువ, మధ్య ఆదాయ వర్గాలకు వడ్డీ సబ్సిడీ లేదా ప్రత్యేక రుణ పథకాలు ప్రవేశపెడితే, రియల్ ఎస్టేట్ రంగం కూడా చైతన్యం పొందుతుంది.
ఉపాధి సృష్టి కూడా ఈ బడ్జెట్లో కీలక అంశంగా మారనుంది. యువతకు ఉద్యోగాలు, చిన్న వ్యాపారాలకు మద్దతు.. ఇవి ప్రభుత్వ ప్రాధాన్యాలుగా ఉండే అవకాశముంది. శ్రమాధారిత రంగాలకు ప్రోత్సాహం, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, MSMEలకు సులభ రుణాలు అందిస్తే, కొత్త ఉద్యోగాలు ఏర్పడటంతో పాటు స్వయం ఉపాధి కూడా పెరుగుతుంది.
మొత్తానికి.. బడ్జెట్ 2026 సామాన్యులు, మధ్యతరగతి ఆశలను కేంద్రంగా చేసుకుని రూపొందే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. పన్ను ఉపశమనం, గృహనిర్మాణ సౌలభ్యం, ఆరోగ్య భద్రత, ఉపాధి అవకాశాలు.. ఈ నాలుగు అంశాలపై ప్రభుత్వం గట్టి నిర్ణయాలు తీసుకుంటే, అది కోట్లాది కుటుంబాల జీవితాల్లో నిజమైన మార్పును తీసుకురాగలదు. బడ్జెట్ రోజు ఏ నిర్ణయాలు వెలువడతాయో చూడాల్సిందే. కానీ ఆశలు మాత్రం బలంగానే ఉన్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
Gold Rate Today: అమెరికా కేంద్ర బ్యాంక్ అయిన యూఎస్ ఫెడరల్ రిజర్వ్ తీసుకుంటున్న నిర్ణయాల ప్రభావం ప్రపంచవ్యాప్తంగా బంగారం.. వెండి మార్కెట్లపై స్పష్టంగా కనిపిస్తోంది. ఇటీవల ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గించడంతో పసిడి ధరలు ఇప్పటికే చరిత్రలో ఎన్నడూ లేని స్థాయికి చేరాయి. ఇప్పుడు మరోసారి రేట్ల కోతకు అవకాశం ఉందనే అంచనాలు వెలువడటంతో బంగారం, వెండి ధరలు మరింత వేగంగా పైకి దూసుకెళ్తున్నాయి. గత వారం రోజులుగా ఈ రెండు లోహాల ధరలు రోజుకో కొత్త రికార్డును సృష్టిస్తూ ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
డిసెంబర్ 27న బంగారం.. వెండి ధరలు మరోసారి భారీగా పెరిగి ఆల్ టైమ్ హైలను తాకాయి. ఫెడ్ వచ్చే ఏడాదిలో కూడా వడ్డీ రేట్లను తగ్గించే అవకాశముందని సంకేతాలు రావడమే దీనికి ప్రధాన కారణంగా భావిస్తున్నారు. వడ్డీ రేట్లు తగ్గినప్పుడు డాలర్ బలం తగ్గుతుంది. అలాగే ట్రెజరీ బాండ్లపై వచ్చే రాబడులు కూడా పడిపోతాయి. ఇలాంటి పరిస్థితుల్లో పెట్టుబడిదారులు భద్రత కోసం బంగారం వైపు మొగ్గు చూపుతారు. దీంతో బంగారంపై డిమాండ్ పెరిగి ధరలు ఎగబాకుతున్నాయి.
అంతర్జాతీయ మార్కెట్ను పరిశీలిస్తే.. స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు 4,533 డాలర్ల స్థాయిలో ట్రేడవుతోంది. గత రోజు వరకు ఇది 4,500 డాలర్ల దిగువన ఉండటం గమనార్హం. మరోవైపు వెండి ధర మరింత వేగంగా పెరుగుతూ ఔన్సుకు 79.38 డాలర్లకు చేరుకుంది. అంతర్జాతీయంగా చోటుచేసుకున్న ఈ పెరుగుదల ప్రభావం దేశీయ మార్కెట్పై కూడా శనివారం ఉదయం నుంచి స్పష్టంగా కనిపిస్తోంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ ప్రస్తుతం పెద్దగా మార్పులేకుండా రూ. 89.93 వద్ద స్థిరంగా కొనసాగుతోంది.
దేశీయంగా చూస్తే హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు మళ్లీ గణనీయంగా పెరిగాయి. 22 క్యారెట్ల బంగారం ధర తులానికి రూ. 700 పెరిగి ప్రస్తుతం రూ. 1,28,350 వద్ద ఉంది. దీనికి ముందు కూడా వరుసగా కొన్ని రోజులు రూ. 300, రూ. 350, రూ. 1,800, రూ. 2,200 చొప్పున పెరుగుదల నమోదైంది. అదే విధంగా 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 770 పెరిగి రూ. 1,40,020కు చేరుకుంది. ఇవి దేశీయ మార్కెట్లో నమోదైన అత్యధిక ధరలుగా నిలిచాయి.
బంగారాన్ని మించి వెండి ధరలు మరింత దూకుడుగా పెరుగుతున్నాయి. హైదరాబాద్లో ఒక్క రోజులోనే వెండి ధర కిలోకు ఏకంగా రూ. 9,000 పెరగడంతో ప్రస్తుతం రూ. 2.54 లక్షల స్థాయికి చేరుకుంది. గత నెల రోజుల గమనిస్తే వెండి ధర దాదాపు రూ. 70 వేల వరకు పెరగడం విశేషం. గత నెల ఇదే సమయంలో కిలో వెండి ధర సుమారు రూ. 1.60 లక్షల వద్ద ఉండగా, ఇప్పుడు రూ. 2.30 లక్షలు దాటడం వెండి వేగాన్ని స్పష్టంగా చూపిస్తోంది.
బంగారం ధరలు ఇలా ఆకాశాన్ని తాకుతుండటంతో ఆభరణాల కొనుగోలు సామాన్యులకు భారంగా మారింది. గత కొన్ని రోజులుగా బంగారు దుకాణాల్లో కొనుగోలుదారుల సంఖ్య గణనీయంగా తగ్గిందని వ్యాపారులు చెబుతున్నారు. అయితే పెట్టుబడి కోణంలో చూస్తే బంగారం భవిష్యత్తులో కూడా బలంగా కొనసాగుతుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. బ్యాంక్ ఆఫ్ అమెరికా వంటి ప్రముఖ ఆర్థిక సంస్థలు 2026 వరకూ బంగారం ధరల్లో బుల్లిష్ ధోరణి కొనసాగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాయి.
ఇటీవల ఫెడ్ వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించడం కూడా బంగారం ధర పెరుగుదలకు కీలక కారణంగా మారింది. ట్రెజరీ బాండ్లపై రాబడులు తగ్గడంతో ఇన్వెస్టర్లు ఆ పెట్టుబడుల నుంచి బయటకు వచ్చి బంగారంలో పెట్టుబడి పెడుతున్నారు. భద్రమైన ఆస్తిగా గుర్తింపు పొందిన బంగారం ఇలాంటి అనిశ్చిత కాలాల్లో మరింత ఆకర్షణీయంగా మారుతోంది.
దీనికి తోడు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న విధాన నిర్ణయాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అలాగే అమెరికా ఆర్థిక వ్యవస్థ మాంద్యం వైపు వెళ్లవచ్చన్న భయాలు కూడా ఇన్వెస్టర్లను బంగారం వైపు నడిపిస్తున్నాయి. ఈ అన్ని అంశాలు కలసి బంగారం, వెండి ధరలను రోజురోజుకు కొత్త ఎత్తులకు తీసుకెళ్తున్నాయని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
KCR Assembly Session: కృష్ణా జలాలపై భారీ మోసం చేస్తున్న రేవంత్ రెడ్డి.. రాష్ట్రానికి రావాల్సిన నదీ జలాలపై తీవ్ర అన్యాయం చేస్తుండడంపై ఇటీవల తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన ఆరోపణలు, విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రకటించినట్టు 'ఐ యామ్ ద ఫీల్డ్'లో భాగంగా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరు కాబోతున్నట్లు సమాచారం. ఈ మేరకు పార్టీ నాయకుల సమావేశంలో సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Also Read: DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ జాక్పాట్! 5 శాతం డీఏ పెంపునకు ప్రభుత్వం నిర్ణయం
సిద్దిపేట జిల్లా ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్లో శుక్రవారం మహబూబ్నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, నల్లగొండ జిల్లాలకు చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కేసీఆర్ సమావేశం అయ్యారు. పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తూ మూడు జిల్లాల్లో భారీ బహిరంగ సభలను నిర్వహిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిం.దే ఈ సందర్బంగా ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి, నల్లగొండ, హైదరాబాద్ జిల్లాలకు చెందిన నాయకులతో సమావేశమై సభలను ఎప్పుడు? ఎక్కడ? ఏర్పాటు చేయాలనే దానిపై కేసీఆర్ దిశా నిర్దేశం చేశారు.
Also Read: GHMC Gift: హైదరాబాద్ ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం భారీ గిఫ్ట్! ఏమిటో తెలుసా?
పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించి తదుపరి కార్యాచరణపై పార్టీ ముఖ్య నాయకులతో గులాబీ బాస్ కేసీఆర్ చర్చించారు. అసెంబ్లీ సమావేశాల అనంతరం బహిరంగ సభలు నిర్వహించే అంశాన్ని సమావేశంలో చర్చించారు. ఈ క్రమంలోనే 29వ తేదీన శాసనసభకు కేసీఆర్ హాజరయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి కారణంగా తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతోందని పార్టీ నాయకులతో కేసీఆర్ పునరుద్ఘాటించారు.
Also Read: Govt Employees: ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం భారీ గిఫ్ట్.. వారికి కొత్త ఉద్యోగాలు
కాంగ్రెస్ నాటి నుంచీ తెలంగాణకు ఎప్పుడు ద్రోహమేనని తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ప్రకటించారు. తెలంగాణ కోసం బీఆర్ఎస్ పార్టీ తప్ప మరే ఇతర పార్టీకి పట్టింపు ఉండదని స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని ఎండగట్టాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రజల్లోకి వెళ్దాం.. ఉద్యమాన్ని నిర్మిద్దామని పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు. తెలంగాణ నీటి హక్కులను పరిరక్షించుకునే బాధ్యత బీఆర్ఎస్ పార్టీ పైనే ఉందని ప్రకటించారు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని అసెంబ్లీ వేదికగా వివరిద్దామని పార్టీ నాయకులకు చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ద్రోహం, అన్యాయాన్ని సభా వేదికగా ప్రజలకు చెబుదామని కేసీఆర్ తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
8th Pay Commission latest: 8 వేతన సంఘం ఏర్పాటుతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లలో ఒక్కసారిగా ఆసక్తి పెరిగింది. వేతనాలు ఎప్పుడు పెరుగుతాయి? సిఫార్సులు ఎప్పుడు అమలవుతాయి? తమకు ఇప్పటివరకు అందుతున్న ముఖ్యమైన పథకాల భవిష్యత్తు ఏమవుతుంది? వంటి ప్రశ్నలు సహజంగానే ఉత్పన్నమవుతున్నాయి. ముఖ్యంగా ఆరోగ్యం, గృహానికి సంబంధించిన పథకాలపై ఉద్యోగులు ఎక్కువగా దృష్టి పెట్టారు.8వ వేతన సంఘం నివేదిక వచ్చిన తర్వాతే పూర్తి స్పష్టత వస్తుంది కానీ.. ప్రస్తుతం అమలులో ఉన్న కీలక పథకాలపై ఎలాంటి ప్రభావం ఉండబోతుందో తెలుసుకుందాం.
కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం (CGHS)
CGHS అనేది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు.. పెన్షనర్లు.. వారి మీద ఆధారపడిన కుటుంబ సభ్యుల కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన ఆరోగ్య సంరక్షణ పథకం ఇది. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న వెల్నెస్ సెంటర్లు, ప్రభుత్వం గుర్తింపు పొందిన ప్రైవేట్, ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా వైద్య సేవలు అందిస్తుంది. సాధారణ వైద్య పరీక్షలు.. నిపుణుల సంప్రదింపులు.. ల్యాబ్ టెస్టులు.. చికిత్సలు.. శస్త్రచికిత్సలు.. అవసరమైన మందులు ఈ పథకం కింద కవర్ అవుతాయి.
అంతేకాదు. CGHSలో మరో ప్రత్యేకత ఏమిటంటే.. దీనికి గరిష్ట బీమా పరిమితి ఉండదు. ప్యాకేజీ ఆధారిత విధానంలో చికిత్స అందిస్తుంది. లబ్ధిదారులు ఆన్లైన్లో e-CGHS కార్డును సులభంగా పొందవచ్చు. తక్కువ ఖర్చుతో.. నాణ్యమైన వైద్యం అందుబాటులో ఉండటం వల్ల ఈ పథకం కేంద్ర ఉద్యోగులకు ఎంతో కీలకంగా మారింది.
కేంద్ర ప్రభుత్వ గృహ నిర్మాణ అడ్వాన్స్ (HBA)
ఇల్లు కొనడం లేదా నిర్మించుకోవడం అనేది ప్రతి ఉద్యోగి కల. ఈ లక్ష్యాన్ని సులభం చేయడానికి కేంద్ర ప్రభుత్వం హౌసింగ్ బిల్డింగ్ అడ్వాన్స్ (HBA) పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మార్కెట్ వడ్డీ రేట్లతో పోలిస్తే చాలా తక్కువ వడ్డీకి గృహ రుణాన్ని పొందవచ్చు. ఇల్లు కొనుగోలు చేయడం.. ప్లాట్ నిర్మాణం.. ఇంటి పునరుద్ధరణ లేదా విస్తరణ వంటి అవసరాల కోసం ఈ రుణాన్ని ఉపయోగించుకోవచ్చు.
Also Read: Copper Price: బంగారం కాదు, వెండి అంతకన్నా కాదు.. మార్కెట్లో ఇప్పుడు ఈ లోహమే కింగ్..!!
HBA కింద ఒక ఉద్యోగి తన ప్రాథమిక జీతం, డియర్నెస్ అలవెన్స్ (DA) కలిపిన మొత్తానికి గరిష్టంగా 34 రెట్లు లేదా గరిష్టంగా రూ. 25 లక్షల వరకు లోన్ పొందవచ్చు. ఈ లోన్ పై వడ్డీ రేటు సాధారణంగా 6 శాతం నుంచి 7.5 శాతం మధ్యలో ఉంటుంది. ఇది బ్యాంకు రుణాల కంటే చాలా తక్కువగా ఉంటుంది. ఈ పథకం ప్రధానంగా శాశ్వత ఉద్యోగులకు వర్తిస్తుంది. అయితే కొన్ని షరతులతో తాత్కాలిక ఉద్యోగులకు కూడా అవకాశం ఉంటుంది. ఈ లోన్ పొందాలంటే ఉద్యోగి కనీసం ఐదు సంవత్సరాల ప్రభుత్వ సర్వీసు పూర్తి చేసి ఉండాలి. అలాగే.. గతంలో ప్రభుత్వ గృహాన్ని పొందకూడదు లేదా ఇల్లు సంబంధిత ఇతర ప్రభుత్వ ప్రయోజనాలను ఉపయోగించుకుని ఉండకూడదు.
మొత్తంగా.. CGHS, HBA పథకాలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆరోగ్య భద్రతతో పాటు గృహ భరోసాను అందిస్తున్న కీలక ఆధారాలుగా ఉన్నాయి. 8 వేతన సంఘం సిఫార్సులు వచ్చిన తర్వాత వీటిలో ఏవైనా మార్పులు జరుగుతాయా? అనే విషయం స్పష్టంగా తెలుస్తోంది. అప్పటివరకు ఈ పథకాలు ఉద్యోగుల జీవితాల్లో కీలక పాత్ర పోషిస్తూనే ఉంటాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
CEO Gives rs.2,000 Crore in Bonus to Employees: ఉద్యోగులకు బోనస్ ఇవ్వడం అనేది సాధారణంగా అన్ని కంపెనీల్లో జరిగే వ్యవహారమే. కానీ తాజాగా ఒక సీఈవో తీసుకున్న నిర్ణయం మాత్రం ప్రపంచం ఆశ్చర్యపోయేలా చేసింది. తన ఉద్యోగులకు బోనస్ ఇచ్చేందుకు ఆయన చేసిన త్యాగం తెలిస్తే..మీరు గ్రేట్ సార్ అనక తప్పరు. ఏం చేశారో తెలుసా? ఏకంగా తన కంపెనీని అమ్మేశారు. అందులో వచ్చిన మొత్తంలో భారీ భాగాన్ని ఉద్యోగుల కోసం కేటాయించారు. ఫలితంగా వందలాది మంది ఉద్యోగులు ఒక్కసారిగా కోట్లాది రూపాయలు బోనస్ అందుకున్నారు. ఇది వినేందుకు కలలా అనిపించినా.. జరిగింది మాత్రం నిజమే.
ఈ సంఘటన జరిగింది అమెరికాలోని లూసియానాకు చెందిన ఫైబర్ బాండ్ అనే సంస్థలో. ఈ కంపెనీకి గ్రాహమ్ వాకర్ సీఈవోగా ఉన్నారు. ఆయన తండ్రి క్లాడ్ వాకర్ 1982లో ఈ సంస్థను స్థాపించారు. దశాబ్దాలుగా ఈ కంపెనీతో కలిసిన ఎదిగిన ఉద్యోగులను తమ కుటుంబమని గ్రాహమ్ భావిస్తుండేవారు. అదే భావన ఆయన తీసుకున్న ఈ చారిత్రాత్మక నిర్ణయానికి కారణం అయ్యింది.
అయితే ఇటీవల ఫైబర్ బాండ్ ను ప్రముఖ సంస్థ ఈటన్ సుమారు 1.7 బిలియన్ డాలర్లకు కొన్నది. అయితే ఈ డీల్ పూర్తయ్యే ముందు గ్రాహమ్ వాకర్ ఓ కీలక కండిషన్ పెట్టారు. కంపెనీ అమ్మకపు మొత్తంలో 15 శాతం వాటా.. అంటే దాదాపు రూ. 2,000 కోట్లను.. కంపెనీలో పనిచేస్తున్న 540 మంది ఉద్యోగులకు బోనస్గా కేటాయించాలని స్పష్టంగా పేర్కొన్నారు. ఉద్యోగులు లేకుండా ఈ కంపెనీ ఇంత దూరం రాలేదని ఆయన అభిప్రాయం. ఆశ్చర్యకరంగా.. ఈటన్ సంస్థ కూడా ఆ షరతుకు అంగీకరించింది.
దీంతో వచ్చే ఐదేళ్ల కాలంలో ప్రతి ఉద్యోగికి సగటున రూ. 4 కోట్ల వరకు బోనస్ అందే అవకాశం ఏర్పడింది. ఇప్పటికే కొందరి ఖాతాల్లో బోనస్ మొత్తం జమ అవుతుండగా.. కొత్త యాజమాన్యంలో ఉద్యోగంలో కొనసాగితే ఈ మొత్తం మరింత పెరిగే అవకాశం కూడా ఉంది. మొదట ఈ వార్త బయటకు వచ్చినప్పుడు చాలామంది నమ్మలేకపోయారు. ఇది లాటరీ గెలిచినట్లే ఉంది అని ఒక ఉద్యోగి వ్యాఖ్యానించగా.. మరికొందరు ఈ డబ్బుతో తమ అప్పులు తీర్చుకోవచ్చని భావోద్వేగానికి లోనయ్యారు.
1990ల నుంచి ఈ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు ఈ నిర్ణయాన్ని తమ జీవితంలో మర్చిపోలేని క్షణంగా అభివర్ణిస్తున్నారు. క్రిస్మస్ సందర్భంగా ఇంతటి గిఫ్ట్ వస్తుందని ఎవరూ ఊహించలేదని వారు చెబుతున్నారు. డిసెంబర్ 31తో గ్రాహమ్ వాకర్ సీఈఓ పదవికి వీడ్కోలు పలకనున్నారు. అయితే ఆయన తీసుకున్న ఈ నిర్ణయం మాత్రం ఎప్పటికీ ఉద్యోగుల హృదయాల్లో నిలిచిపోతుంది.
ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇలాంటి బాస్ ప్రతి ఉద్యోగికి కావాలి.. ఇది నిజమైన లీడర్షిప్.. ఉద్యోగులను కుటుంబంలా చూసే వ్యక్తి అంటూ గ్రాహమ్ వాకర్పై ప్రశంసల వర్షం కురుస్తోంది. లాభాలకంటే మనుషుల విలువను ముందు పెట్టిన ఈ కథ ఇప్పుడు ప్రపంచానికి ఒక గొప్ప ఉదాహరణగా నిలిచింది.
Also Read: Copper Price: బంగారం కాదు, వెండి అంతకన్నా కాదు.. మార్కెట్లో ఇప్పుడు ఈ లోహమే కింగ్..!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
Bangladesh Hindu Killed: బంగ్లాదేశ్లో హిందూ మైనారిటీల పరిస్థితి రోజురోజుకూ ఆందోళనకరంగా మారుతోంది. ఇటీవల మైమెన్సింగ్లో దైవదూషణ ఆరోపణలతో దీపు చంద్ర దాస్ అనే హిందూ యువకుడిని దారుణంగా హత్య చేయడాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) ప్రతినిధి రణధీర్ జైస్వాల్ శుక్రవారం న్యూఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు.
మైనారిటీలే లక్ష్యంగా దాడులు..
బంగ్లాదేశ్లో ప్రస్తుత తాత్కాలిక ప్రభుత్వ హయాంలో మైనారిటీలపై జరుగుతున్న దాడుల తీవ్రతను భారత్ ఎత్తిచూపింది. తాత్కాలిక ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి హిందువులు, క్రైస్తవులు, బౌద్ధులు సహా మైనారిటీలపై 2,900 కంటే ఎక్కువ హింసాత్మక సంఘటనలు నమోదయ్యాయి.
దీపు చంద్ర దాస్ హత్యను ఖండిస్తూ, బాధ్యులకు కఠిన శిక్ష పడేలా చూడాలని బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. బంగ్లాదేశ్ ప్రభుత్వం చెబుతున్నట్లుగా ఇవి కేవలం మీడియా సృష్టి లేదా రాజకీయ హింస కాదని, ఇవి మైనారిటీలపై జరుగుతున్న వ్యవస్థీకృత దాడులని జైస్వాల్ స్పష్టం చేశారు.
పొరుగు దేశంలో నెలకొన్న అస్థిరతపై భారతదేశం తన వైఖరిని స్పష్టంగా వివరించింది. తమ దేశంలోని మైనారిటీల ప్రాణాలకు, ఆస్తులకు, మతపరమైన స్థలాలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత పూర్తిగా బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వానిదే అని భారత్ పునరుద్ఘాటించింది. బంగ్లాదేశ్లో ప్రచారంలో ఉన్న తప్పుడు భారత వ్యతిరేక కథనాలను భారత్ నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. బంగ్లాదేశ్లో శాంతి, స్థిరత్వం నెలకొనాలని.. అక్కడ స్వేచ్ఛాయుతమైన, న్యాయమైన, అందరినీ కలుపుపోయే ఎన్నికలు జరగాలని భారతదేశం ఆకాంక్షిస్తోంది.
బంగ్లాదేశ్ ప్రజలతో సంబంధాలు
బిఎన్పి (BNP) నాయకుడు తారిక్ రెహమాన్ 17 ఏళ్ల తర్వాత బంగ్లాదేశ్కు తిరిగి రావడంపై స్పందిస్తూ.. బంగ్లాదేశ్ ప్రజలతో తమ సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి భారత్ కట్టుబడి ఉందని జైస్వాల్ పేర్కొన్నారు. అక్కడి పరిణామాలను భారతదేశం నిశితంగా గమనిస్తోందని ఆయన తెలిపారు.
చివరిగా.. పొరుగు దేశంలో మైనారిటీలపై జరుగుతున్న నిరంతర శత్రుత్వం చాలా ఆందోళనకరమైన విషయమని, తక్షణమే శాంతిభద్రతలను పునరుద్ధరించాలని భారతదేశం బంగ్లాదేశ్కు స్పష్టమైన హెచ్చరిక జారీ చేసింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook