icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

Hyderabad Real Estate: కుత్బుల్లాపూర్, మేడ్చల్, శామీర్‌పేటలో ఇళ్ల స్థలాల రేట్లకు రెక్కలు.. ఇన్వెస్టర్లకు కోట్లు కురిపిస్తున్న భూములు..!!

BBhoomi3m ago
Secunderabad, Telangana:

Hyderabad Real Estate: హైదరాబాద్ నగరంలో రియల్ ఎస్టేట్ రంగం మూడు పువ్వులు ఆరు కాయలుగా విలసిల్లుతోంది. గతంలో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ చుట్టూ తిరిగినటువంటి రియల్ ఎస్టేట్ మార్కెట్ ఇప్పుడు క్రమంగా హైదరాబాద్లోని తూర్పు ప్రాంతాల్లో కూడా విస్తరించి ఇన్వెస్టర్లకు బంగారం లాంటి లాభాలను అందిస్తోంది. హైదరాబాద్ నగరానికి తూర్పు ప్రాంతంలో ఉన్నటువంటి మేడ్చల్ రంగారెడ్డి జిల్లా ప్రాంతం ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగానికి ఒక బెస్ట్ డెస్టినేషన్ గా మారింది అని చెప్పవచ్చు. హైదరాబాద్ నగరానికి పడమర వైపు ఉన్నటువంటి కోకాపేట గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి ప్రాంతాలు ఇప్పటికే దాదాపు పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందిన నేపథ్యంలో, ఇప్పుడు విస్తరణ మొత్తం కూడా హైదరాబాద్ నగరానికి తూర్పు వైపు ఉన్నటువంటి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కేంద్రంగా అభివృద్ధి జరుగుతుంది అని చెప్పవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాను అభివృద్ధి చేసేందుకు అనేక పారిశ్రామిక క్లస్టర్లను ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయడంతో పాటు భవిష్యత్తులో రాబోతున్న రీజినల్ రింగ్ రోడ్డు, రీజినల్ రింగ్ రైలు ప్రాజెక్టుల ద్వారా ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తోంది. 

తాజాగా రాష్ట్ర ప్రభుత్వం భూముల ధరలను పెంచుతూ తీసుకున్న నిర్ణయం ద్వారా మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో భూముల ధరలు అమాంతం పెరిగాయి.  ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్‌ఆర్) కనెక్టివిటీ, వేగంగా అభివృద్ధి చెందుతున్న మౌలిక సదుపాయాల కారణంగా ఈ ప్రాంతం రియల్ ఎస్టేట్ పెట్టుబడిదారులకు ఒక చక్కటి డెస్టినేషన్ గా మారింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం భూముల మార్కెట్ విలువలను భారీగా సవరించి అమల్లోకి తీసుకురావడంతో రిజిస్ట్రేషన్ ఖర్చులు గణనీయంగా పెరుగుతున్నాయి. 

క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవ ధరలకు ప్రభుత్వ మార్కెట్ విలువలను దగ్గర చేయాలనే ఉద్దేశంతో రిజిస్ట్రేషన్ శాఖ 25%, 50%, 75%, 100% శ్లాబుల ప్రకారం కొత్త ధరలను నిర్ణయించింది. రిజిస్ట్రేషన్ ఫీజుల శాతంలో మార్పులు లేకపోయినా, భూముల విలువలు పెరగడంతో, కస్టమర్లు చెల్లించాల్సిన మొత్తం భారీగా పెరగనుంది.

కుత్బుల్లాపూర్, మేడ్చల్, శామీర్‌పేటలో భారీ పెంపు
మేడ్చల్ జిల్లాలో అత్యధిక డిమాండ్ ఉన్న కుత్బుల్లాపూర్, మేడ్చల్, శామీర్‌పేట సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలో భూముల ధరలు అత్యధికంగా పెరిగాయి. కుత్బుల్లాపూర్ పరిధిలోని చింతల్, గాజులరామారం, సూరారం, కొంపల్లి ప్రాంతాల్లో మార్కెట్ విలువలు 50 శాతం నుంచి 100 శాతం వరకు పెరిగాయి. కొంపల్లి పరిసరాల్లో చదరపు గజం విలువ రూ.20,000 నుంచి రూ.25,000 వరకు చేరగా, చింతల్, గాజులరామారం ప్రాంతాల్లో రూ.15,000 నుంచి రూ.18,000 వరకు నమోదైంది.

మేడ్చల్ ఎస్‌ఆర్‌వో పరిధిలోని మేడ్చల్ టౌన్, అత్వెల్లి, గుండ్లపోచంపల్లి ప్రాంతాల్లో 75 శాతం నుంచి 100 శాతం వరకు పెంపు జరిగింది. జాతీయ రహదారి-44, ఓఆర్‌ఆర్ వెంబడి ఉన్న కమర్షియల్ స్థలాల ధరలు దాదాపు రెట్టింపు కాగా, ప్లాట్ల ధరలు చదరపు గజానికి రూ.18,000 నుంచి రూ.22,000కు పైగా నిర్ణయించారు.

శామీర్‌పేటలో రియల్ మార్కెట్ జోరు
ఓఆర్‌ఆర్ కనెక్టివిటీ, కొత్త విల్లా ప్రాజెక్టుల ప్రభావంతో శామీర్‌పేట, తూంకుంట, అలియాబాద్ ప్రాంతాల్లో వ్యవసాయ, నివాస భూముల విలువలు 75 శాతం నుంచి 100 శాతం వరకు పెరిగాయి. హెచ్‌ఎండీఏ పరిధిలోని వ్యవసాయ భూముల కనీస విలువను ఎకరాకు రూ.10 లక్షలుగా ప్రభుత్వం ఖరారు చేసింది. అభివృద్ధి, డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుంటే మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా రాష్ట్రంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న రియల్ ఎస్టేట్ హబ్‌గా కొనసాగుతుందని నిపుణులు చెబుతున్నారు.

Also Read:  ఉద్యోగులకు అలర్ట్.. మీ అకౌంట్‌లో PF Interest ఇంకా పడలేదా? అసలు కారణం ఇదే..!!

Also Read: LPG Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. మళ్లీ పెరిగిన వంటగ్యాస్

Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. దయచేసి దీన్ని పెట్టుబడి, ఆర్థిక లేదా వ్యాపార సలహాగా భావించవద్దు. గుర్తుంచుకోండి స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టోకరెన్సీలు, రియల్ ఎస్టేట్, విలువైన లోహాలు వంటి అన్ని రకాల పెట్టుబడులు మార్కెట్ ఆటు పోటులు రిస్కులకు లోబడి ఉంటాయి. దీని అర్థం, మీరు లాభపడవచ్చు లేదా నష్టపోవచ్చు. మీరు తీసుకునే ఎలాంటి పెట్టుబడి నిర్ణయాలు లేదా వ్యాపార కార్యకలాపాల వల్ల కలిగే నష్టాలు లేదా లాభాలకు మా సంస్థ జీ తెలుగు వెబ్ పోర్టల్ ఎట్టి పరిస్థితుల్లోనూ బాధ్యత వహించదు. ఏదైనా ఆర్థిక నిర్ణయం తీసుకునే ముందు, తప్పకుండా ఒక రిజిస్టర్డ్ లేదా సర్టిఫైడ్ ఆర్థిక నిపుణుడిని సంప్రదించి, వారి సలహా తీసుకోమని పాఠకులకు సిఫార్సు చేస్తున్నాము.

 

 

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Karimnagar: కరీంనగర్ ప్రగతిపై బురదజల్లొద్దు.. విమర్శలు ఆపండి: మంత్రి పొన్నం సీరియస్!

Hyderabad, Telangana:

Minister Ponnam Prabhakar Latest News: కరీంనగర్ నగరానికి సంబంధించిన అభివృద్ధిపై ప్రతిపక్షాలు చేస్తున్న రాజకీయ ఆరోపణలు ఎంతమాత్రం తగవని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. నగరానికి సంబంధించిన ప్రగతిపై బురదజల్లే ప్రయత్నాలను ఆపాలని ఆయన అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కరీంనగర్ నగర రూపురేఖలను మార్చే ప్రతిష్టాత్మక మానేరు రివర్ ఫ్రంట్ (MRF) ప్రాజెక్టుపై కీలక వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా నగరానికి సంబంధించిన వివిధ అంశాలపై కూడా చర్చించిన్నట్లు తెలుస్తోంది.

మానేరు రివర్‌ ఫ్రంట్‌ రెండో విడుత పనులు కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలోనే మంజూరయ్యాయని మంత్రి పొన్నం ప్రభాకర్‌.. ఈ సందర్భంగా ఆధారాలతో సహా స్పష్టం చేశారు. గత ప్రభుత్వ పాలకులు చేసిన అనాలోచిత నిర్ణయాల వల్ల ప్రాజెక్టులు ఆగిపోయాయని.. వారు గతంలో పెట్టిన పెండింగ్ బకాయిలను కూడా ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రజా ప్రభుత్వమే చెల్లిస్తూ.. ప్రాజెక్ట్‌కు సంబంధించిన పనులను ముందుకు తీసుకెళ్తోందని ఆయన వెల్లడించారు. జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకుంటూ.. అనవసర విమర్శలు చేయడం రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనమని ఆయన మండిపడ్డారు.

డంప్ యార్డ్ తరలింపునకు కేంద్రం సహకరించాలి...
కరీంనగర్‌ ప్రజల ఆరోగ్యంతో పాటు పర్యావరణ పరిరక్షణే తమ ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యతని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. నగర అభివృద్ధికి, ప్రజల ఆరోగ్యానికి పెద్ద సమస్యగా ఉన్న స్థానిక డంప్‌ యార్డ్‌ తరిలింపుపై ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ విషయంపై తప్పకుండా కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని.. నిధుల మంజూరుతో పాటు తరలింపు ప్రక్రియకు అవసరమైన చర్యలు తీసుకోవాలని మంత్రి కోరారు.

Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!

కరీంనగర్‌ సమగ్ర శ్రేయస్సు కోసం రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి రావాలని.. నగర అభివృద్ధిని కాంగ్రెస్ ప్రభుత్వం పరుగులెత్తిస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్‌ ధీమా వ్యక్తం చేశారు. విమర్శలు పక్కన పెట్టి.. కేంద్రం నుంచి రావాల్సిన నిధుల సాధన కోసం స్థానిక ప్రజాప్రతినిధులు కృషి చేయాలని ఆయన సూచించారు. అంతేకాకుండా పార్టీల తేడా లేకుండా ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి కరీంనగర్‌ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు..

Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

0
0
Report

Best Fuel Cards: IndianOil, BPCL, HPC..పెట్రోల్ కొడితే భారీ క్యాష్‌బ్యాక్.. ఫ్రీగా సినిమా టికెట్లు, ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సెస్.. క్రేజీ కార్డ్ ఇదిగో..!!

BBhoomi3h ago
Secunderabad, Telangana:

Best Fuel Cards: పెరుగుతున్న పెట్రోల్, డీజీల్ ధరల నేపథ్యంలో డబ్బు సేవ్ చేసుకునేందుకు ఫ్యూయల్ క్రెడిట్ కార్డులు బెస్ట్ ఆప్షన్ గా నిలుస్తున్నాయి.  ఇండియన్ ఆయిల్, బీపీసీఎల్, హెచ్ పీసీఎల్ వంటి కార్డులతో సహా 7 ప్రధాన ఫ్యూయల్ క్రెడిట్ కార్డులు క్యాష్ బ్యాక్ తోపాటు పలు డిస్కౌంట్స్ అందిస్తున్నాయి. మీరు కూడా ఈ ద్రవ్యోల్బణంతో ఇబ్బంది పడుతుంటే ఫ్యూయల్ క్రెడిట్ కార్డ్స్ మీకు ఎంతో సహాయపడతాయి. చాలా ఫ్యూయల్ కార్డులు రెండు ప్రధాన ప్రయోజనాలను అందిస్తాయి.  రివార్డ్ పాయింట్లు లేదా క్యాష్‌బ్యాక్, 1శాతం ఫ్యూయల్ సర్‌చార్జ్ మినహాయింపును అందిస్తాయి.  అయితే కొన్ని ఫ్యూయల్ కార్డులు క్యాష్‌బ్యాక్,  రివార్డులతో పాటు, అనేక ఇతర ప్రయోజనాలను కూడా అందిస్తాయి. ఇప్పుడు మీరు ఇంధనం నింపుకున్నప్పుడు మీకు బెనిఫిట్స్ అందించే కార్డుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

1. BPCL SBI కార్డ్ ఆక్టేన్: 

-BPCL పంపుల వద్ద ఫ్యూయల్ రీఫిల్స్‌పై 3.75శాతం వరకు ఆదా చేసుకోవచ్చు. 

-రెస్టారెంట్లు, కిరాణా సామాగ్రినపై కూడా 1.25శాతం క్యాష్ బ్యాక్ ఫ్రీ

-గోల్ఫ్ కోర్సు, ఎయిర్ పోర్టు లాంజ్ ఎంట్రీ వంటి ప్రీమియం బెనిఫిట్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. 

-నెలకు రూ. 4000 వరకు ఇంధన ఖర్చులపై పూర్తి ప్రయోజన ఉంటుంది.

-వార్షిక రుసుము రూ. 1,499 + GST ​​(సంవత్సరానికి రూ.2 లక్షలు ఖర్చు చేస్తే ఈ ఫీజు మాఫీ అవుతుంది).

-చమురుపై అధికంగా ఖర్చు చేసేవారికి ఇది బెస్ట్.   సర్‌చార్జ్ మినహాయింపులు, ప్రీమియం ఫీచర్లు.

-దీని పూర్తి ప్రయోజనం కేవలం బీపీసీఎల్ పంపుల వద్ద మాత్రమే లభిస్తుంది.

2. ఇండియన్ ఆయిల్ ఆర్‌బిఎల్ బ్యాంక్ ఎక్స్‌ట్రా క్రెడిట్ కార్డ్: 

-ఇండియన్‌ఆయిల్ పంపుల వద్ద 8.5శాతం వరకు భారీ ఆదా. ప్రతి రూ 100 ఖర్చుపై 15 ఫ్యూయల్ పాయింట్లు (7.5% విలువ) + 1% సర్‌చార్జ్ మినహాయింపు పొందండి.

-నెలకు 2000 పాయింట్ల పరిమితి ఉంది.

-ఇతర ఖర్చులపై రివార్డులు కొద్దిగా తక్కువగా ఉంటాయి. కానీ ఇంధనం విషయంలో ఇది బెస్ట్.

-అత్యధిక రాబడులు, దేశవ్యాప్తంగా 20,000కు పైగా ఇండియన్‌ఆయిల్ పంపుల వద్ద చెల్లుబాటు అవుతుంది.

-దీని ప్రయోజనాలు కూడా ఇండియన్‌ఆయిల్ అవుట్‌లెట్‌లకు మాత్రమే పరిమితం.

3. హెచ్‌పిసిఎల్ ఎనర్జీ బూబ్ క్రెడిట్ కార్డ్: 

HPCL పంపుల వద్ద మీరు 6.5% వరకు ప్రత్యక్ష పొదుపును పొందుతారు.

ఇది చాలా సులభమైన, సరళమైన కార్డ్, ఇది ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచి క్యాష్‌బ్యాక్‌ను అందిస్తుంది.

ఈ కార్డు వార్షిక రుసుము ₹499+పన్ను.

ఈ కార్డు సంవత్సరానికి 4 ఉచిత లాంజ్ ప్రవేశాలను కూడా అందిస్తుంది.

4. ఐసిఐసిఐ బ్యాంక్ హెచ్‌పిసిఎల్ కోరల్ క్రెడిట్ కార్డ్:

HPCL పై 3.5% ఆదా చేసుకోండి (2.5% రివార్డులు + 1% సర్‌చార్జ్ మినహాయింపు).

హీన్‌లో ₹200 వరకు ఫ్యూయల్ రివార్డ్ (నెలకు సుమారు ₹8,000 ఇంధన ఖర్చులకు ఉత్తమమైనది).

దీని వార్షిక రుసుము కేవలం ₹199 మాత్రమే, దీనిని చాలా తక్కువ ఖర్చుతో సులభంగా మాఫీ చేయించుకోవచ్చు.

5. ఇండియన్ ఆయిల్ హెచ్‌డిఎఫ్‌సి క్రెడిట్ కార్డ్:

ఇండియన్‌ఆయిల్, కిరాణా,  యుటిలిటీ బిల్లుల చెల్లింపులపై 5% ఇంధన పాయింట్లు.

వార్షిక రుసుము ₹500, అయితే మీరు సంవత్సరానికి ₹50,000 ఖర్చు చేస్తే ఈ రుసుము మాఫీ అవుతుంది. 

ఈ కార్డుతో ఇంధనం నింపడంపై 6% వరకు ఆదా లభిస్తుంది.

6. ఇండియన్ ఆయిల్ కోటక్ క్రెడిట్ కార్డ్: 

ఇండియన్‌ఆయిల్‌పై 5% వరకు ఆదా చేసుకోండి (4% పాయింట్లు + 1% మినహాయింపు).

మీరు దీని RuPay వెర్షన్ తీసుకుంటే, దానిని UPIకి లింక్ చేయడం ద్వారా రివార్డ్ పాయింట్లను కూడా సంపాదించవచ్చు.

భోజనం, కిరాణా కొనుగోళ్లపై కూడా మంచి పాయింట్లు లభిస్తాయి. రుసుము ₹500, దీనిని సులభంగా మాఫీ చేయించుకోవచ్చు.

7. యాక్సిస్ బ్యాంక్ ఇండియన్ ఆయిల్ క్రెడిట్ కార్డ్: 

ఇండియన్‌ఆయిల్‌లో మొత్తం 5% ఆదా (4% + 1% సర్‌చార్జ్ మినహాయింపు).

ఈ కార్డుతో, మీరు BookMyShow నుండి సినిమా టిక్కెట్లు బుక్ చేసుకుంటే 15% తగ్గింపు, అలాగే భాగస్వామ్య రెస్టారెంట్లలో భోజనంపై కూడా తగ్గింపు పొందుతారు.

Also Read:  ఉద్యోగులకు అలర్ట్.. మీ అకౌంట్‌లో PF Interest ఇంకా పడలేదా? అసలు కారణం ఇదే..!!

Also Read: LPG Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. మళ్లీ పెరిగిన వంటగ్యాస్

Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. దయచేసి దీన్ని పెట్టుబడి, ఆర్థిక లేదా వ్యాపార సలహాగా భావించవద్దు. గుర్తుంచుకోండి స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టోకరెన్సీలు, రియల్ ఎస్టేట్, విలువైన లోహాలు వంటి అన్ని రకాల పెట్టుబడులు మార్కెట్ ఆటు పోటులు రిస్కులకు లోబడి ఉంటాయి. దీని అర్థం, మీరు లాభపడవచ్చు లేదా నష్టపోవచ్చు. మీరు తీసుకునే ఎలాంటి పెట్టుబడి నిర్ణయాలు లేదా వ్యాపార కార్యకలాపాల వల్ల కలిగే నష్టాలు లేదా లాభాలకు మా సంస్థ జీ తెలుగు వెబ్ పోర్టల్ ఎట్టి పరిస్థితుల్లోనూ బాధ్యత వహించదు. ఏదైనా ఆర్థిక నిర్ణయం తీసుకునే ముందు, తప్పకుండా ఒక రిజిస్టర్డ్ లేదా సర్టిఫైడ్ ఆర్థిక నిపుణుడిని సంప్రదించి, వారి సలహా తీసుకోమని పాఠకులకు సిఫార్సు చేస్తున్నాము.

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement

Chandrababu: ఎన్డీయే సమావేశంలో కీలక ప్రసంగం.. ప్రధాని మోదీపై చంద్రబాబు ప్రశంసల వర్షం

New Delhi, Delhi:

NDA Conclave: 'ప్రపంచంలోని ఏ నాయకుడితోనైనా ప్రధాని మోదీ సమానంగా నిలబడగలరు. ఇది నేను ఎంతో స్పష్టంగా చెప్పగలను. ఇది దేశానికే గర్వకారణం' అని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. సాధారణంగా రాజకీయ కూటములు ఎన్నికల కోసం ఏర్పడతాయి... కానీ ఎన్డీఏ కూటమి ఎన్నికల కోసం కాదు దేశం కోసం ఏర్పడిందని తెలిపారు. అధికారం కోసం కాదు దేశ ప్రయోజనాల కోసం ఎన్డీయే ప్రయాణం సాగిస్తోందని చెప్పుకొచ్చారు. దీనికి రాష్ట్రాల్లో వరుసగా ఎన్డీఏ సాధిస్తోన్న విజయాలే సాక్ష్యమని వివరించారు.

చంద్రబాబు ప్రశంసలు
నరేంద్ర మోదీ 12 సంవత్సరాల పాలన, దేశ చరిత్రలో అత్యంత సుదీర్ఘ కాలం పాటు ప్రధానిగా సేవలందించడంపై చంద్రబాబు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ప్రధానమంత్రి నాయకత్వ ప్రతిభ, పరిపాలనా సామర్ధ్యం, ప్రపంచస్థాయిలో దేశానికి తెచ్చిన పేరు ప్రఖ్యాతలపై చంద్రబాబు ప్రశంసలు కురిపించారు. దేశాభివృద్ధికి నిరంతరం శ్రమిస్తూనే రాష్ట్రాల అభ్యున్నతికి, ముఖ్యంగా ఏపీ అభివృద్ధికి మద్దతుగా నిలుస్తున్నందుకు సీఎం చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు.

మోదీకి కృతజ్ఞతా తీర్మానం
నరేంద్ర మోదీకి కృతజ్ఞతా తీర్మానాన్ని గౌరవ సభలో ప్రవేశపెట్టిన అనంతరం సీఎం చంద్రబాబు కీలక ప్రసంగం చేశారు. 'సరైన సమయంలో, సరైన స్థానంలో, సరైన నాయకుడిగా దేశానికి ప్రధానిగా మోదీ ఉన్నారు. ఒకవైపు దేశానికి స్థిరత్వాన్ని ఇచ్చే మార్గదర్శిగా.. కొత్త ఆలోచనలకు, నవ కల్పనలకు ప్రేరణనిచ్చే నాయకుడిగా పనిచేయడం మోదీ గొప్పతనం' అని ప్రశంసించారు. మోదీ ఎప్పుడూ ‘నేషన్ ఫస్ట్’ అనే అజెండాతో పనిచేస్తారని చెప్పారు.

ముఖ్యమంత్రి నుంచి ప్రధాని వరకు
'2001లో ముఖ్యమంత్రిగా ఎన్నికైన నాటి నుంచి నేటి ప్రధాని పదవి వరకు 25 ఏళ్లుగా మోదీ ప్రజా జీవితంలో విశేషంగా సేవలు అందించారు. ప్రజల అంచనాలకు తగ్గట్టుగా నిలబడటం మోదీ నాయకత్వానికి ఉన్న ప్రత్యేకత. నేడు ప్రపంచం అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. యుద్ధాలు, సరఫరా వ్యవస్థల అంతరాయాలు, ఇంధన మార్కెట్ల అస్థిరత, ప్రధాన ఆర్థిక వ్యవస్థల మందగమనం, నెలకొన్న అనిశ్చితి ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్నాయి' అని టీడీపీ అధినేత చంద్రబాబు వివరించారు.

విజయవంతమైన పాలన
'మోదీ సమర్ధవంతమైన పాలనతో భారతదేశంలో ద్రవ్యోల్బణం సుమారు 3.5 శాతం వద్దే కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల మధ్య భారత ఆర్థిక వ్యవస్థకు స్థిరత్వాన్ని తెచ్చారు. సీఎంగా విజయవంతమైన పాలన అందించిన మోదీ ప్రధానమంత్రిగా కూడా అదే స్ఫూర్తి, సృజనాత్మకత, నూతనత్వాన్ని అనుసరించడం విశేషం' అని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. 'మోదీ ఎప్పుడూ అలిసిపోరు... నిత్యం ఉత్సాహంగా ఉంటారు. మిగిలిన వారిని ఉత్సాహపరుస్తారు' అని పేర్కొన్నారు.

'బీహార్‌లో 243 స్థానాల్లో 202 స్థానాల్లో గెలుపు ఎన్డీయేపై ప్రజల విశ్వాసానికి నిదర్శనం. అసోంలో, పుదుచ్చేరిలో వరుస గెలుపుల ద్వారా ప్రజల ఆదరణను చాటుకుంది. ఇవి కేవలం ఎన్నికల ఫలితాలు కావు... సుపరిపాలనకు ప్రజలు ఇచ్చిన తీర్పు' అని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. భారతీయత పునరుజ్జీవం పొందడం పన్నెండేళ్లలో మోదీ నాయకత్వంలో వచ్చిన అతిపెద్ద మార్పు అని చెప్పారు. వికాస్ బీ... విరాసత్ బీ నూతన భారత నిర్మాణానికి మార్గదర్శకమని పేర్కొన్నారు.

భారత్ బలం అదే
ప్రాచీన జ్ఞానం, డిజిటల్ పరిపాలన, ఆవిష్కరణల సమన్వయమే నూతన భారత్ బలం అని టీడీపీ అధినేత చంద్రబాబు వివరించారు. ప్రధాని మోదీ దేశానికి ఉన్న అడ్డంకులు తొలగించి, స్పష్టమైన విధానాలతో, లక్ష్యాలతో ముందుకు తీసుకెళ్తున్నారని చెప్పారు. వ్యవస్థను పారదర్శకంగా, అందరికీ అందుబాటులో ఉండేలా తీర్చిదిద్దుతున్నారని అభినందించారు. 'ప్రతీ భారతీయుడి మనోభావాలను అర్థం చేసుకున్న నాయకుడు ప్రధాని మోదీ. మన కాలంలో అత్యుత్తమ రాజకీయవేత్తల్లో ప్రధాని మోదీ ఒకరు' అని ప్రశంసించారు.

భారత ఆత్మవిశ్వాసానికి ప్రతిబింబం
ప్రధానిగా మోదీ పన్నెండేళ్ల ప్రయాణం భారత ఆత్మవిశ్వాసానికి ప్రతిబింబం అని ఏపీ సీఎం చంద్రబాబు కొనియాడారు. ప్రతీ అంతర్జాతీయ సర్వే మోదీని అత్యంత ప్రజాదరణ కలిగిన ప్రపంచ నాయకుడిగా గుర్తిస్తోందని.. ఇది దేశ ప్రజలందరికీ గర్వకారణం అని ప్రకటించారు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా భారతీయులకు, భారతదేశానికి గౌరవం లభిస్తోందంటే దానికి కారణం మోదీ నాయకత్వం అని వివరించారు. ప్రపంచంలోనే నంబర్ వన్ ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదగాలన్నది మన లక్ష్యమని.. అది మోదీ నాయకత్వంతోనే సాకారం అని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. మోదీ నాయకత్వంలో దేశం మరిన్ని విజయాలు సాధిస్తుందని.. 2047 నాటికి వికసిత్ భారత్ నిర్మాణం సాధించాలన్న అందరి సంకల్పం నెరవేరుతుందని చంద్రబాబు అభిలషించారు.

0
0
Report

TMC Merge In Congress: మమతా బెనర్జీ సంచలన నిర్ణయం.. కాంగ్రెస్ పార్టీలో తృణమూల్ విలీనం?

New Delhi, Delhi:

TMC Merge In Congress: అధికారం కోల్పోయిన అనంతరం మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నారు. దాదాపుగా రెండున్నర దశాబ్దాలు పార్టీని నడుపుతూ తిరుగులేని నాయకురాలిగా నిలిచిన మమతా బెనర్జీకి ఇప్పుడు కష్టాలు ఎదురవుతున్నాయి. గ్రూపు రాజకీయాలు ఒక్కసారిగా భగ్గుమనడంతోపాటు గ్రూపుల చొప్పున పార్టీ నిలువునా చీలిపోయింది. అసెంబ్లీలో, లోక్‌సభ, రాజ్యసభ ఇలా పార్టీ మూడు ముక్కలైంది. ఈ నేపథ్యంలో మమతా బెనర్జీ ఏం చేయాలో తెలియక గందరగోళంలో పడ్డారు. ఈ క్రమంలో కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి, ఎంపీ సోనియా గాంధీతో మమతా బెనర్జీ సమావేశమయ్యారు. ఈ భేటీలో తృణమూల్‌ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయాలనే ప్రతిపాదన వచ్చినట్లు తెలుసతోంది.

కొన్ని నిమిషాల పాటు చర్చలు
న్యూఢిల్లీలోని కాంగ్రెస్‌ ఎంపీ సోనియాతో మమతా బెనర్జీ సమావేశమై కొన్ని నిమిషాల పాటు చర్చలు జరిపారు. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీ భవిష్యత్తుపై సమాలోచనలు జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. రాజకీయంగా ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటున్న మమతా బెనర్జీ తిరిగి కాంగ్రెస్‌ పార్టీలో చేరబోతున్నట్లు చర్చ జరుగుతోంది. సోనియా గాంధీతో జరిగిన వ్యక్తిగత సమావేశంలో మమతా బెనర్జీ కీలక విషయాలు మాట్లాడినట్లు సమాచారం. తృణమూల్‌ కాంగ్రెస్‌లో విలీనం చేసే అంశాన్ని పరిశీలించాలని సూచించినట్టు వార్తలు వస్తున్నాయి.

విలీనం ప్రతిపాదన
తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీలో కుమ్ములాట.. గ్రూపు రాజకీయాలు.. పార్టీ చేజారిపోయే అవకాశం ఉండడంతో కాంగ్రెస్‌లో విలీనం అనే ప్రతిపాదన వచ్చినట్లు తెలుస్తోంది. తృణమూల్‌ పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మారిన పరిస్థతుల్లో విలీనం ప్రతిపాదన వచ్చినట్టు సమాచారం. తిరిగి కాంగ్రెస్‌లోకి రావాలని సోనియా గాంధీ ఆహ్వానించినట్లు జాతీయా మీడియా చెబుతోంది. బీజేపీ చేస్తున్న రాజకీయంతో తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ విచ్ఛిన్నమవుతోంది.

ఒంటరిగా ఉంటే మరిన్ని వేధింపులు తప్పవని.. అసలు ఉనికి ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉండడంతో బీజేపీకి ఆ అవకాశం ఇవ్వకుండా కాంగ్రెస్‌ పార్టీలో తృణమూల్‌ విలీనం చేయాలనే ప్రతిపాదన వచ్చింది. తృణమూల్‌ విలీనం అయితే ప్రతిపక్ష బలం పెరుగుతుందని.. అందరూ కలిసికట్టుగా ఉంటే బీజేపీతో పోరాడే శక్తి వస్తుందని సోనియా గాంధీ చెప్పినట్లు తెలుస్తోంది. భవిష్యత్‌ సవాళ్లను దృష్టిలో పెట్టుకుని విలీనంపై ఆలోచన చేయాలని కాంగ్రెస్‌ పార్టీ ప్రతిపాదన చేసినట్లు తెలుస్తోంది.

కాంగ్రెస్‌ లో గౌరవం ఎలా?
కాంగ్రెస్ పార్టీ చేసిన విలీన ప్రతిపాదనపై మమతా బెనర్జీ అప్పటికప్పుడు ఏం చెప్పలేకపోయారు. విలీనంపై వెంటనే నిర్ణయం తీసుకోలేమని.. ఈ ప్రతిపాదనను పరిశీలించేందుకు కొన్ని రోజుల సమయం అడిగినట్లు తెలుస్తోంది. ఒకవేళ తృణమూల్‌ విలీనమైతే మమతా బెనర్జీకి కాంగ్రెస్‌ పార్టీలో ఎలా గౌరవించాలి? ఏ పదవి ఇవ్వాలనేది? కూడా ఇప్పటికే హస్తం పార్టీ సమాలోచనలు చేస్తున్నాయని జాతీయ మీడియా చెబుతోంది. కాంగ్రెస్‌ పార్టీలో జాతీయ ఉపాధ్యక్షురాలి పదవి మమతకు ఇవ్వవచ్చని తెలుస్తోంది. ఇక ఆమె మేనల్లుడు, తృణమూల్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీకి ప్రధాన కార్యదర్శి బాధ్యతలు అప్పగించవచ్చనే వార్తలు వస్తున్నాయి.

అభిషేక్ బెనర్జీ- రాహుల్ గాంధీ భేటీ
పరిస్థితి ఇలా ఉంటే మమత మేనల్లుడు అభిషేక్‌ బెనర్జీ, సోనియా గాంధీ కుమారుడు రాహుల్‌ గాంధీ సమావేశమయ్యారు. అభిషేక్‌, రాహుల్‌ భేటీలో కూడా పార్టీ విలీనంపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుత రాజకీయ పరిణామాలు, పశ్చిమ బెంగాల్‌లో పరిస్థితులు ఇలా అన్నింటినీ వీరిద్దరూ కొన్ని నిమిషాలు చర్చించినట్లు సమాచారం.

0
0
Report

YS Jagan: స్టీల్‌ ప్లాంట్‌ బాధితులకు చంద్రబాబు ఇచ్చేది ఏంది బోడి? వైఎస్‌ జగన్‌

Visakhapatnam, Andhra Pradesh:

Vizag Steel Plant Accident: 'వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా పరిహారం రావడం లేదు' అని మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆరోపించారు. బాధితులకు న్యాయబద్దంగా రావాల్సినవే ఇస్తున్నారు తప్ప రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీరు ఇచ్చేది ఏంది బోడి? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. '2025 ఏప్రిల్ నెలలో ఓ వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మికుడు చనిపోతే కూటమి ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి పరిహారం ఇవ్వలేదు. చనిపోయిన కార్మికుడి పిల్లలకు ఒక్క నెలలోనే ఉద్యోగాలు ఇస్తామని చెప్పి, ఇప్పుడు అడిగితే ఫైల్ పోయిందని చెబుతున్నారు' అని వివరించారు. 'చంద్రబాబు కొడుకు మాటలు వింటే ఇలాంటి మానవత్వం లేని మనుషులు కూడా ఉంటారా అనిపించింది' అని మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ తెలిపారు.

పరామర్శ
స్టీల్ ప్లాంట్ బాధితులను విశాఖపట్టణంలోని సెవెన్ హిల్స్ ఆస్పత్రిలో వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పరామర్శించారు. చికిత్స పొందుతున్న కార్మికుల ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్న అనంతరం బాధితులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. చనిపోయిన కార్మిక కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. 

జీతాలు లేవు
'స్టీల్ ప్లాంట్ కార్మికులు బతుకులు రోడ్ల మీద పెట్టేశారు. తప్పుడు మాటలతో నమ్మించి చివరకు కార్మికులు మృత్యువాత పడుతున్నారు. ప్రధానమంత్రి సభ సమక్షంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని నేరుగా సభలోనే కోరాను. స్టీల్ ప్లాంట్‌లో 28 వేల మంది కార్మికులు పనిచేస్తుంటే.. 10,500 మంది కార్మికులను తీసేశారు. ఇప్పుడు కార్మికుల సంఖ్య 16 వేల మందికి పడిపోయింది. కార్మికులకు నాలుగున్నర నెలల జీతాలు లేవు' అని మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ వివరించారు.

మీరు ఇచ్చింది ఏంటి బోడి?
'ఈ ప్రమాదం జరగడం చాలా బాధాకరం. లిక్విడ్ బకెట్లలో పోసింది పొంగి బ్లాస్ట్ అయింది.. ఇందులో కార్మికుల తప్పులేదు. ఇలాంటి ఘటనలో మానవత్వం చూపించాల్సిన సమయంలో రాజకీయ చేయడం దురదృష్టకరం' అని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ తెలిపారు. 'చనిపోయిన మృతుల కుటుంబాలకు ఇవ్వాల్సిన పరిహారంలో పెద్ద డ్రామా. స్టీల్ ప్లాంట్ కర్మాగారం నుంచే రూ.25 లక్షలు ఇస్తారు.. ఇంకా మీరు ఇచ్చింది ఏంటి బోడి?' అని చంద్రబాబుపై వైఎస్‌ జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఉపేక్షించేది లేదు..
'నా ప్రభుత్వం ఉన్నప్పుడు ఎల్జీ పాలిమర్స్ ఘటనలో బాధితులకు రూ.కోటి పరిహారం ఇచ్చా. స్టీల్‌ ప్లాంట్‌ ఘటనలో బాధితులకు రావాల్సిన డబ్బులు వస్తున్నాయి అంతే. చంద్రబాబు చేసింది ఏమి లేదు' అని వైఎస్‌ జగన్‌ స్పష్టం చేశారు. బాధితులకు చంద్రబాబు న్యాయం చేయకపోతే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. చంద్రబాబు ఇవ్వకపోతే మళ్లీ వైఎస్సార్ ప్రభుత్వం వస్తే తప్పకుండా మీకు కోటి రూపాయలు ఇస్తానని మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ ప్రకటించారు.

అసెంబ్లీలో తీర్మానం చేయాలి
'విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ కాపాడేందుకు అన్ని విధాలా మేం కృషి చేశాం. అందుకే ఆ 5 ఏళ్లలో ప్లాంట్‌ ప్రైవేటీకరణ ఆగిపోయింది. రెండుసార్లు ప్రధానమంత్రికి లేఖ రాశాం. ప్రత్యక్షంగా విజ్ఞప్తి చేశాం. అసెంబ్లీలో తీర్మానం కూడా చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాం' అని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ గుర్తుచేశారు. స్టీల్‌ ప్లాంట్‌పై చంద్రబాబు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందా? అని ప్రశ్నించారు. చిత్తశుద్ధి ఉంటే వెంటనే అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని డిమాండ్‌ చేశారు.

ప్యాకేజీ పక్కదారి
విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్యాకేజీపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ కీలక విషయాలు వెల్లడించారు. 'స్టీల్‌ ప్లాంట్‌కు కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.11,440 కోట్ల ప్యాకేజీ సాధించామని చంద్రబాబు, మంత్రులు గొప్పగా చెప్పుకున్నారు. నిజానికి ఆ ప్యాకేజీ ఇక్కడ నిర్వహణ కోసమో.. భద్రత మెరుగపర్చడం కోసమో.. సామర్థ్యం పెంచడం కోసమో వాడలేదు. ఉద్యోగులకు వీఆర్‌ఎస్‌ అమలు, జీఎస్టీ బకాయిల చెల్లింపు, ఇంకా బ్యాంక్‌ రుణాలు కొంత తీర్చడం కోసం వాడారు' అని చంద్రబాబు మోసాన్ని బయటపెట్టారు.

0
0
Report
Advertisement

Cobra Video: స్నానం చేసి ప్యాంట్ వేసుకున్నాడు.. కట్ చేస్తే జేబులో కింగ్ కోబ్రా.. వీడియో..

Hyderabad, Telangana:

  Baby King Cobra In Pocket Viral Video Watch: మనం రోజు వేసుకునే దుస్తుల్లోకి పాము దూరితే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకుంటూనే ఎంతో భయం కలుగుతుంది.. సరిగ్గా అలాంటి ఘటనే ఒక యువకుడికి ఎదురైంది.. స్నానం ముగించుకొని ప్యాంట్ వేసుకున్న ఒక యువకుడి జేబులో ఏకంగా ప్రమాదకరమైన కింగ్ కోబ్రా పిల్ల దర్శనం ఇచ్చింది. దీనికి సంబంధించిన ఒళ్లు గగుర్పొడిచే వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే, ఆ పాము అతడు జేబులోకి ఎలా వచ్చింది? అతను ఎలా గుర్తించాడు? దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

అసలు ఏం జరిగిందో తెలుసా?
వైరల్ అవుతున్న వీడియో వివరాల ప్రకారం.. ఒక యువకుడు ఉదయాన్నే స్నానం పూర్తిచేసుకుని.. పక్కన ఉన్న ప్యాంటును తీసుకొని వేసుకున్నాడు. అయితే ప్యాంటు వేసుకున్న కొద్దిసేపటికే జేబు భాగంలో ఏదో కదులుతున్నట్టు అతడికి అనిపించింది.. అనుమానంతో ప్యాంటు ప్యాకెట్ సైడ్ పరిశీలించగా.. అందులో ఒక చిన్న నాగుపాము పిల్ల నక్కి ఉండటం చూసి అతడు ఒక్కసారిగా షాక్ గురయ్యాడు.. భయంతో వణికి పోతున్నప్పటికీ.. సదర్ యువకుడు ఏమాత్రం కంగారు పడకుండా.. చాకచక్యంగా వ్యవహరించాడు.. వెంటనే స్నేక్ క్యాచర్స్‌కి సమాచారం అందించారు..

 
 
 
 
 
 

సురక్షితంగా బయటకు తీసిన స్నేక్ క్యాచర్..
సమాచారం అందుకున్న వెంటనే స్నేక్ క్యాచర్ అక్కడికి చేరుకొని.. ఆ యువకుడి ప్యాంటులో ఉన్న నాగుపాముని పరిశీలించి చూసాడు. అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తూ.. ప్యాంట్ జేబును ఒక చిన్న కర్ర సహాయంతో తెరిచి.. అందులో ఉన్న చిన్న నాగుపాము పిల్లను బయటికి ఎలా తీసుకురావాలని పరిశీలించి చూసాడు.. వెంటనే ఆ స్నేక్ క్యాచర్.. జేబుపై భాగం కదిలించగానే అందులో నుంచి నాగుపాము పిల్ల బయటికి వచ్చేసింది.. వెంటనే అతను దాని తలభాగాన్ని పట్టుకొని.. జేబులో నుంచి బయటికి తీసేసాడు. 

Also Read:  Video Viral: సాయం ముసుగులో అరాచకం.. యువతి ప్రైవేటు పార్ట్ మీద చెయ్యి వేసి మరీ.!. వీడియోపై దుమారం..

నెటిజన్లు హడల్.. 
ఈ షాకింగ్ వీడియో చూసిన సోషల్ మీడియా వినియోగదారులు భయాందోళనలు వ్యక్తం చేస్తూ వస్తున్నారు.. ఇకపై బట్టలు వేసుకునే ముందు 100 సార్లు చెక్ చేసుకోవాలి.. అంటూ కొంతమంది కామెంట్ పెడుతున్నారు. ముఖ్యంగా వర్షాకాలంతో పాటు ఎండాకాలం ఎక్కువగా ఉన్న రోజుల్లో చల్లదనం కోసం పాములు ఇళ్లలోకి, ఆరుబయట ఆరేసిన బట్టల్లోకి, బూట్లలోకి నక్కుతాయని.. కాబట్టి ప్రజలు వీటిని ధరించే క్రమంలో తప్పకుండా ఒకటికి రెండుసార్లు దులపడం మంచిదని.. దులిపిన తర్వాత చెక్ చేసుకోవడం మరింత మంచిదని వన్యప్రాణి సంరక్షకులు సూచిస్తూ ఉన్నారు.

Also Read:  Video Viral: సాయం ముసుగులో అరాచకం.. యువతి ప్రైవేటు పార్ట్ మీద చెయ్యి వేసి మరీ.!. వీడియోపై దుమారం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్.. - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..Twitter, Facebook 

  

  

0
0
Report

Nagamani Video: వామ్మె.. నాగమణికి నాలుగు నాగుపాముల పహారా.. వీడియో ఇదే..

Hyderabad, Telangana:

Nagamani Viral Video Watch: పురాణాలతో పాటు జానపద కథల్లో మనం ఎంతో ఆసక్తిగా విన్న నాగమణి గురించి చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో మళ్లీ ఊపందుకుంది. అత్యంత అరుదైన, పవిత్రమైన నాగమణిని పోలిన ఒక వస్తువుకు.. నాలుగు ప్రమాదకరమైన నాగుపాములు చుట్టూ ముట్టి రక్షణగా నిలిచినట్లు ఉన్న దృశ్యాలు సోషల్ మీడియాలో నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తూ వస్తున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ వింత దృశ్యం చూసి చాలామంది ఆశ్చర్యపోతూ ఉన్నారు. కొంతమంది అయితే ఈ వీడియో చూసి ఆ నాలుగు పాములు నిజమైన నాగమణికి కాపలాక ఉన్నాయా.? లేదా ఇది ఫేక్ వీడియోనా అని కామెంట్లు చేస్తూ వస్తున్నారు..

పురాణాల్లో నాగమణి విశిష్టత..
మన పురాణాల ప్రకారం.. నాగమణి అనేది కేవలం కొన్ని వందల ఏళ్ల వయస్సున్న విశిష్టమైన సర్పాల తల భాగంలో మాత్రమే పెరుగుతుందని నమ్ముతూ ఉంటారు.. పూర్వకాలంలో ఈ మనీని కేవలం చక్రవర్తులతో పాటు రాజులు మాత్రమే ధరించే వారని కథలు ఉన్నాయి.. నాగమణి ధరించిన వారికి ఊహించని విజయాలు దక్కుతాయని.. సకల ఐశ్వర్యాలు కలుగుతాయని.. ఎలాంటి ప్రాణాపాయం జరగదని నాటి ప్రజల బలమైన నమ్మకం.. ఈ నేపథ్యంలోనే తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో వెలుగులు చిమ్ముతున్న ఒక మని చుట్టూ నాలుగు నాగు పాములు పడగవిప్పి పహార కాస్తున్నట్లు కనిపించడం తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. 

3D గ్రాఫిక్స్?
ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియో పై సోషల్ మీడియా వినియోగదారులు భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు దీనిని దైవిక శక్తులకు నిదర్శనం అని నమ్ముతుండగా.. మెజారిటీ సోషల్ మీడియా వినియోగదారులు మాత్రం ఇదంతా ఫేక్ అని కొట్టి పారేస్తున్నారు.. ప్రస్తుతం అందుబాటులో ఉన్న అధునాతన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ టూల్స్ లేదా 3dడీ గ్రాఫిక్స్ సహాయంతో ఈ వీడియోను తయారు చేశారని సాధారణ పాముల వీడియోలకు డిజిటల్ లైటింగ్ తో కూడిన మణిని జోడించి.. ప్రజలను భ్రమల్లోకి నెడుతున్నారని కొంతమంది టెక్నాలజీ తెలిసిన నిపుణులు చెబుతున్నారు..

Also Read:  Video Viral: సాయం ముసుగులో అరాచకం.. యువతి ప్రైవేటు పార్ట్ మీద చెయ్యి వేసి మరీ.!. వీడియోపై దుమారం..

సైన్స్ చెబుతుంది ఇదే..
జీవశాస్త్ర నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. పాములు తలపై ఎలాంటి మణులు లేదా రత్నాలు పెరగవని.. పాము తలభాగం పై ఉండే చర్మం లేదా ఎముకల నిర్మాణం సాధారణ జంతువుల లాగే ఉంటుందని.. కేవలం సోషల్ మీడియాలో వ్యూస్‌తో పాటు లైకుల కోసం కొందరు ఇలాంటి గ్రాఫిక్స్ వీడియోలను సృష్టించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెబుతున్నారు. కాబట్టి ఇలాంటి మూఢనమ్మకాలను నమ్మి ప్రజలు మోసపోవద్దని నిపుణులు హెచ్చరిస్తూ వస్తున్నారు.. సాధారణంగా ఆర్టిఫిషియన్ ఇంటిలిజెన్సీ వచ్చిన తర్వాత ఇలాంటి వీడియోల సంఖ్య పెరుగుతూ వస్తోందని వారు చెబుతూ ఉన్నారు..

 
 
 
 
 

Also Read:  Video Viral: సాయం ముసుగులో అరాచకం.. యువతి ప్రైవేటు పార్ట్ మీద చెయ్యి వేసి మరీ.!. వీడియోపై దుమారం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్.. - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..Twitter, Facebook 

 

0
0
Report

Cobra Selfie Video: చావుతో చెలగాటం.. నాగుపాముతో సెల్ఫీ.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో వైరల్!

Hyderabad, Telangana:

 Vava Suresh Cobra Selfie Video Watch Now: సోషల్ మీడియాలో లైకులతో పాటు వ్యూస్ కోసం సోషల్ మీడియా వినియోగదారులు రకరకాల విన్యాసాలు చేయడం చూస్తూ ఉంటాం. కానీ ఏకంగా చావుతో చెలగాటమాడుతూ ఒక భయంకరమైన నాగుపాముతో సెల్ఫీ దిగితే ఎలా ఉంటుందో ఊహించడానికే భయం వేస్తుంది కదా.. గతంలో కేరళకు చెందిన ప్రముఖ స్నేక్ క్యాచర్ వావ సురేష్ అత్యంత ప్రమాదకరమైన పాముతో సెల్ఫీ దిగిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఈ వీడియోను చూసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు. 

ఒళ్ళు గగుర్పొడిచే దృశ్యం..
వైరల్ అవుతున్న ఈ వీడియోలో.. వావ సురేష్ ఒక పెద్ద నాగుపామును రక్షించి చేత్తో పట్టుకొని ఉండటం మీరు క్లియర్ గా చూడొచ్చు. అయితే ఎవరు ఊహించని విధంగా ఆయన ఒక చేతితో విషాదం నడుము భాగాన్ని పట్టుకొని.. మరో చేతితో తన మొబైల్ ఫోన్ను పట్టుకొని ఉన్నారు.. అంతటితో ఆగకుండా.. ఆ పామును నెమ్మదిగా తన ముఖం దగ్గరకు.. తలభాగం వైపుకు తీసుకువచ్చారు.. ఆ పాము ఎప్పుడు కాటేస్తుందో తెలియని అత్యంత ప్రమాదకరమైన స్థితిలో ఆయన ఎంతో కూల్ గా నాగుపాముతో సెల్ఫీ దిగాడు.. ఈ ఊహించని దృశ్యాన్ని చూసి సోషల్ మీడియా వినియోగదారులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు..

ఇదే సమయంలో అక్కడున్న కొంతమంది ఈ దృశ్యాన్ని తమ స్మార్ట్ ఫోన్స్ లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతే అప్పటినుంచి వైరల్ అవుతూ వస్తోంది. అయితే ఈ వీడియో పాతదే అయినప్పటికీ తాజాగా సోషల్ మీడియాలో మాత్రం రీ పోస్ట్ చేయడంతో విపరీతంగా వైరల్ అవుతుంది. షేర్ చేసిన కొద్ది రోజుల్లోనే లక్షలాది వ్యూస్ ను సంపాదించింది. సురేష్ ధైర్యాన్ని చూసి కొందరు సోషల్ మీడియా వినియోగదారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తుండగా.. వన్యప్రాణి ప్రేమికులతో పాటు నెటిజన్లలోని మెజారిటీ వర్గం మాత్రం ఆయన తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

 
 
 
 
 

వావ సురేష్ గతంలో ఎన్నోసార్లు పాముకాటుకు గురై ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న సంగతి అందరికీ తెలిసిందే. అంతేకాకుండా అతను పాముకాటుకు గురైన సందర్భానికి సంబంధించిన వీడియోలు కూడా అప్పట్లో సోషల్ మీడియాలో సంచలనంగా మారిన సంగతి మనందరికీ తెలుసు. అంత అనుభవం ఉండి కూడా.. కేవలం సోషల్ మీడియాలో పబ్లిసిటీ కోసం ఇలాంటి ప్రాణాంతక విన్యాసాలు చేయడం అస్సలు మంచిది కాదని.. ఇది చూసి వేరే వాళ్ళు కూడా ఇలాగే ప్రయత్నించి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని పలువురు సోషల్ మీడియా వినియోగదారులు హెచ్చరిస్తూ వస్తున్నారు.

Also Read:  Video Viral: సాయం ముసుగులో అరాచకం.. యువతి ప్రైవేటు పార్ట్ మీద చెయ్యి వేసి మరీ.!. వీడియోపై దుమారం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్.. - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..

  

0
0
Report
Advertisement

Jagtial: జగిత్యాల డిపోలో అద్దె బస్సు డ్రైవర్ల మెరుపు ధర్నా.. నిలిచిన సర్వీసులు..

Hyderabad, Telangana:

Jagtial RTC Bus Drivers Strike: జగిత్యాల ఆర్టీసీ డిపోలో అద్దె బస్సు డ్రైవర్లు ఒక్కసారిగా ఆందోళన బాట పట్టారు.. తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ డిపో ఎదుట మెరుపు ధర్నాకు దిగారు. డ్రైవర్లు హఠాత్ నిర్ణయంతో అద్దె బస్సులన్ని డిపోకే పరిమితం అవడంతో రవాణా రవాణా వ్యవస్థ పై తీవ్ర ప్రభావం పడింది.. ముఖ్యంగా జగిత్యాల్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే బస్సులన్నీ ఆగిపోయినట్లు తెలుస్తోంది. దీంతో చాలామంది ప్రయాణికులు బస్టాండ్ కి పరిమితమైనట్లు సమాచారం. అసలు ఈ ధర్నాకు గల కారణాలేంటి? వారి డిమాండ్ లేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

అధికారుల ఏకపక్ష నిర్ణయాలపై..
ఈ సందర్భంగా ఆందోళన చేస్తున్న డ్రైవర్లు ఆర్టీసీలోని కొందరు అధికారులు తీరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తున్నారు.. డిపోలోని కొందరు ఉన్నతాధికారులు బస్సు యజమానులతో చేతులు కలిపి.. వారికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. చిన్న చిన్న కారణాలను సాకుగా చూపిస్తూ.. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా డ్రైవర్లను విధుల్లోంచి పక్కన పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యాజమాన్యాల ఒత్తిళ్లకు లొంగి అధికారులు తమ పొట్ట కొడుతున్నారని.. డ్రైవర్ల హక్కులను కాలరాస్తున్నారని ధ్వజమెత్తుతూ వస్తున్నారు. అధికారులతో పాటు యజమానులు కలిపి వారిని కావాలనే ఇబ్బందులకు గురి చేస్తున్నారని.. విధుల నుంచి తొలగించిన డ్రైవర్లను వెంటనే తిరిగి విధుల్లోకి తీసుకోవాలని.. అప్పటివరకు వారి పోరాటం ఆగదని బస్ డ్రైవర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..

స్తంభించిన రవాణా..
అద్దె బస్సుల డ్రైవర్లు విధులను బహిష్కరించి నిరసనలకు దిగడంతో జగిత్యాల బస్టాండులో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే సర్వీసులతో పాటు పలు సుదూర ప్రాంతాల బస్సులు నిలిచిపోయాయి.. దీనితో ప్రయాణికులతో పాటు ముఖ్యంగా మహిళలు వృద్ధులు విద్యార్థులు బస్టాండ్లలో గంటల తరబడి వేచి చూడాల్సి వచ్చింది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో ఆర్టీసీ అధికారులు విఫలమయ్యారని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. తమకు ఉద్యోగ భద్రతను కల్పించాలని.. అధికారుల వేధింపులు ఆపాలని డ్రైవర్లు డిమాండ్ చేస్తున్నారు.. 

న్యాయమైన సమస్యలను పరిష్కరించే వరకు అద్దె బస్సులను నడిపించేది లేదని.. ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఈ విషయంపై ఆర్టీసీ ఉన్నతాధికారులు స్పందించి చర్చలు జరిపాలని.. డ్రైవర్లకు న్యాయం చేయాలని స్థానికులు సైతం కోరుతున్నారు. ఉద్యోగ భద్రతతో పాటు వేధింపులు ఆపే వరకు అసలు బస్సులు కదలవని డ్రైవర్లు చెబుతున్నారు. అధికారుల నిర్లక్ష్యంతో ఇప్పుడు సాధారణ ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా డ్రైవర్లతో చర్చలు జరిపి ఈ సమస్యలను పరిష్కరించుకోవడం చాలా మేలని కొంతమంది కార్మిక సంఘానికి సంబంధించిన నాయకులు చెబుతూ వస్తున్నారు..

Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

0
0
Report

Samsung Galaxy A27 ఫోన్‌ ధర, ఫీచర్స్‌ లీక్‌.. రూ. 25 వేల బడ్జెట్లో సూపర్ కెమెరా 5G ఫోన్!

Hyderabad, Telangana:

Samsung Galaxy A27 Price Leaked Ahead of Launch: ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ దిగ్గజం సాంసంగ్ తన గెలాక్సీ A సిరీస్‌లో మరో కొత్త మోడల్ ను మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు సర్వం సిద్ధం చేస్తోంది. సాంసంగ్ గెలాక్సీ A27 పేరుతో మార్కెట్లోకి మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్‌ అధికారికంగా విడుదల కావడానికి ముందే దీనికి సంబంధించిన కీలక వివరాలతో పాటు కొన్ని ఫీచర్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ప్రముఖ గ్యాడ్జెట్స్ వెబ్‌సైట్ కథనాల ప్రకారం.. ఈ ఫోన్ ధరతో పాటు డిజైన్, కెమెరా వివరాలు, ప్రాసెసర్ కు సంబంధించిన వివరాలు ఆన్లైన్‌లో లీకయ్యాయి.. వీటన్నిటికీ సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..

లీకైన ధరల వివరాలు..
సాంసంగ్ కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్‌ ముఖ్యంగా మధ్యతరగతి వినియోగదారులను లక్ష్యంగా చేసుకొని అత్యంత రీజనబుల్ ధరలో అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. మార్కెట్ వర్గాల అంచనాల ప్రకారం సాంసంగ్ గెలాక్సీ ఏ 27 భారత మార్కెట్లో సుమారు రూ.22 వేల నుంచి రూ.25 వేల బడ్జెట్లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం. ఇది విభిన్న స్టోరేజ్ వేరియంట్లను బట్టి ధరల్లో స్వల్ప మార్పులను కలిగి ఉంటుందని తెలుస్తోంది..

ఇటీవల సోషల్ మీడియాలో లీకైన వివరాల ప్రకారం.. ఈ మొబైల్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో కూడిన ఫుల్ హెచ్‌డీ ప్లస్ (FHD+) అమోలెడ్ (AMOLED) డిస్‌ప్లేను  కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇది గేమింగ్, వీడియో స్ట్రీమింగ్‌కు అద్భుతమైన అనుభూతిని ఇస్తుంది. అంతేకాకుండా మల్టీటాస్కింగ్, వేగవంతమైన పనితీరు కోసం  సాంసంగ్ ఇందులో శక్తివంతమైన ఆక్టా-కోర్ ఎక్సీనోస్ (Exynos) లేదా మీడియాటెక్ డైమెన్సిటీ సిరీస్ 5G ప్రాసెసర్‌ను ఉపయోగించినట్లు సమాచారం. అలాగే ఫోటోగ్రఫీ ప్రియుల కోసం వెనుకవైపు ట్రిపుల్ కెమెరా సెటప్ ఉండనుంది. ఇందులో మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ (OIS సపోర్ట్‌తో) ఉండే అవకాశం  ఉందని లీకైన వివరాలు చెబుతున్నాయి.. అలాగే సెల్ఫీల కోసం 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను ఇవ్వనున్నారు. రోజంతా నిరంతరాయంగా పనిచేసేందుకు వీలుగా ఇందులో 5,000mAh సామర్థ్యం గల భారీ బ్యాటరీని  కూడా అందిస్తున్నారు. ఇది 25W వేగవంతమైన ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని లీకైన వివరాలు చెబుతున్నాయి. 

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

అధికారికంగా లాంచ్ డేట్ అప్పుడే..
ఈ స్మార్ట్‌ఫోన్‌ సరికొత్త ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంతో సామ్సంగ్ సొంత One UI యూజర్ ఇంటర్‌ఫేస్‌తో అందుబాటులోకి రాబోతోంది. సెక్యూరిటీ పరంగా ఇండిపెండెంట్ సెన్సార్‌తో పాటు చాలా ప్రత్యేకమైన నాక్స్ సెక్యూరిటీ వంటి ఫీచర్లు కూడా ఇందులో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా రాబోయే కొద్ది రోజుల్లోనే అధికారికంగా samsung galaxy a27 స్మార్ట్‌ఫోన్‌ లాంచ్ తేదీని ప్రకటించే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంచనాలు వేస్తున్నారు. అద్భుతమైన కెమెరాతో పాటు డిస్ప్లే కలిగిన బడ్జెట్ ఫోన్ కోసం చూసేవారికి ఇది ఒక మంచి ఆప్షన్ గా భావించవచ్చు..

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report

CCTV Video: చార్జింగ్ పెట్టలేదు, వేడి కాలేదు.. అయినా జేబులోనే పేలిపోయిన ఫోన్!

Hyderabad, Telangana:

 Mobile Phone Explodes CCTV Video: స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారులను వనికించే మరో ఘోర ప్రమాదం వెలుగు చూసింది. ప్యాంట్ జేబులో పెట్టుకున్న మొబైల్ ఫోన్ ఒక్కసారిగా బాంబుల పేలడంతో ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.. ఈ నమ్మలేని ఘటన రాజస్థాన్‌లోని జోధ్పూర్ నగరంలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు అక్కడున్న సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారులంతా ఆశ్చర్యానికి గురవుతున్నారు.. 

ఏం జరిగిందో తెలుసా? 
జోధ్‌పూర్‌కు చెందిన గోపాల్ సోనీ అనే స్థానిక వ్యాపారి ఎప్పటిలాగే తన దుకాణంలో పనుల్లో నిమగ్నం అయిపోయాడు.. ఆ సమయంలోనే ఆయన ప్యాంట్ జేబులో ఉన్న మొబైల్ ఫోన్ నుంచి అకస్మాత్తుగా దట్టమైన పొగలు రావడం ప్రారంభమయ్యాయి. జేబులో ఏదో కాలుతున్నట్లు గమనించిన గోపాల్.. కంగారుగా ఫోనును బయటకు తీసేందుకు ప్రయత్నించాడు.. కానీ ఆయన చేతిలోకి తీసుకునే లోపలే ఆ ఫోన్ పెద్ద శబ్దంతో సడన్గా పేలిపోయింది. 

ఈ ఆకస్మిక పేలుడు కారణంగా గోపాల్ తొడ భాగంతో పాటు ఫోన్ తీయడానికి ప్రయత్నించిన చేతి వేళ్లకు తీవ్ర గాయాలయ్యాయి.. దుకాణంలో ఉన్న మిగతావారు వెంటనే స్పందించి ఆయనను ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నట్లు వైద్యులు తెలిపారు.. అంతేకాకుండా కొద్ది రోజుల పాటు రెస్ట్ తీసుకుంటే అంతా సెట్ అవుతుందని వివరించారు.

సాధారణ ఫోన్లు ఓవర్ హీట్ అవ్వడం వల్లనో.. లేదా చార్జింగ్ పెట్టి మాట్లాడడం వల్లనో పేలుతూ ఉంటాయి. కానీ ఈ ఘటన ఎలాంటి ముందస్తు సంకేతాలు లేవని బాధితుడు గోపాల్ తెలిపారు.. అతను రెండేళ్ల క్రితం వివో కంపెనీకి చెందిన ఫోన్ కొన్నారని.. ప్రమాదం జరగడానికి ముందు ఫోన్ అసలు వేడి కాలేదని.. కనీసం చార్జింగ్ కూడా పెట్టలేదని జేబులో ఉన్నప్పుడు 87 శాతం బ్యాటరీ ఉందని.. అందులో నుంచి పొగలు వస్తాయని అస్సలు ఊహించలేదని తెలిపారు..

 
 
 
 
 

ఈ ఘటనపై టెక్ నిపుణులు స్పందిస్తూ.. ఒక్కొక్కసారి లిథియం అయాన్ బ్యాటరీలపై ఒత్తిడి పడడం వల్ల కానీ.. లోపల షార్ట్ సర్క్యూట్ జరగడం వల్ల కానీ ఇలాంటి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయని.. కాబట్టి ఇలాంటి మొబైల్స్ వినియోగించేటప్పుడు తప్పకుండా జాగ్రత్తలు పాటించాలని తెలుపుతున్నారు. ఎంతో పాత ఫోన్ అయినా బ్యాటరీ ఉబ్బినట్లు అనిపించిన.. జేబులో గట్టిగా నలిగిన జాగ్రత్తగా ఉండాలి. బ్రాండెడ్ చార్జర్లను మాత్రమే వినియోగించాలని సూచిస్తున్నారు. కంపెనీ ఫోన్ జేబులోనే పేలిపోవడంతో స్థానిక వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు..

Also Read:  Video Viral: సాయం ముసుగులో అరాచకం.. యువతి ప్రైవేటు పార్ట్ మీద చెయ్యి వేసి మరీ.!. వీడియోపై దుమారం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్.. - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..Twitter, Facebook 

  

0
0
Report
Advertisement

Budha Gochar 2026: జూన్ 11న బుధుడి సంచారం.. ఈ 3 రాశుల వారికి దిమ్మతిరిగే ధన లాభం, బంపర్ జాక్‌పాట్!

Hyderabad, Telangana:

Budha Gochar 2026 Effect On Zodiac: జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారాలతో పాటు నక్షత్ర మార్పులకు చాలా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఎందుకంటే అవి ఒక వ్యక్తి జీవితంతో పాటు ఆలోచనలు విధిపై ప్రత్యక్షమైన ప్రభావాన్ని చూపుతూ ఉంటాయి. ముఖ్యంగా తెలివితేటలతో పాటు వాక్చాతుర్యం వ్యాపారానికి కారకుడిగా భావించే బుధుడు త్వరలో సంచారం చేయబోతున్నాడు. జూన్ 11వ తేదీ ఉదయం 11 గంటల సమయంలో బుధుడు ఆరుద్ర నక్షత్రాన్ని వదిలిపెట్టి పునర్వాసు నక్షత్రంలోకి సంచారం చేస్తాడు. ఆ తర్వాత బుధుడు జులై 8వ తేదీ వరకు అదే నక్షత్రంలో ఉండి అనంతరం ఇతర నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. బుధుడు, గురుడు నక్షత్రంలోకి ప్రవేశించడం చాలా శుభప్రదంగా భావిస్తూ ఉంటారు. దీని కారణంగా కొన్ని రాశుల వారందరికీ పురోగతి లభించడమే కాకుండా సమాజంలో గౌరవ మర్యాదలు అద్భుతమైన విజయాలు సాధించే అవకాశాలున్నాయి. ముఖ్యంగా ఈ సమయంలో వివిధ రాజయోగాలు ఏర్పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దీంతో ఆయారాశుల వారికి దిమ్మతిరిగే ధన లాభాలు కలుగుతాయి. అయితే, ఈ సమయంలో ఏ రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ రాశులవారికి బంపర్ జాక్‌పాట్..
మిథున రాశి 
బుధ గ్రహం సంచారం కారణంగా మిథున రాశి వారికి ఈ సమయం ఎంతో శుభప్రదంగా ఉండబోతుంది ముఖ్యంగా ఈ సమయంలో వీరి మానసిక సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. అలాగే ఒత్తిడి కూడా తగ్గి ఆందోళన వంటి సమస్యలు దూరం అవుతాయి.. ముఖ్యంగా దీనివల్ల కొన్ని అద్భుతమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. వృత్తిలో అనేక మార్పులు రావడం కారణంగా విశేషమైన లాభాలు కూడా పొందగలుగుతారు. అలాగే ఆఫీసుల్లో ప్రశంసలు కూడా లభిస్తాయి. మీతోటి ఉద్యోగులతో సమన్వయంగా మెరుగ్గా ఉండగలుగుతారు. విద్యారంగంలో కూడా పురోగతికి సంకేతాలు కనిపిస్తూ ఉంటాయి. ఏదైనా ప్రభుత్వ పని నిలిచిపోయి ఉంటే ఈ సమయంలో తప్పకుండా పూర్తవుతుంది. అలాగే వైవాహిక జీవితంలో మాధుర్యం కూడా కనిపిస్తుంది.

సింహరాశి 
సింహరాశిలో జన్మించిన వ్యక్తులందరికీ ఈ సమయంలో ఆత్మవిశ్వాసం విపరీతంగా పెరుగుతుంది. విజయాలు పొందడమే కాకుండా సమాజంలో మంచి గౌరవాన్ని పొందగలుగుతారు. వ్యాపారాలు చేస్తున్న వ్యక్తులందరికీ ఆకస్మిక ఆర్థికల లాభాలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి. అలాగే వివిధ రంగాల్లో పనులు చేస్తున్న ఉద్యోగస్తులకు తప్పకుండా ఈ సమయంలో విశేషమైన లాభాలు కలుగుతాయి. ఐటీ లేదా టెక్నాలజీ రంగాలకు చెందిన వారికి మంచి పదోన్నతులు కూడా కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కుటుంబ జీవితంలో తోబుట్టులతో సంబంధాలు మెరుగుపడతాయి. కొంతమందికి ఈ సమయంలో విదేశాలకు వెళ్లే ఆఫర్స్ కూడా లభిస్తాయి.

తులారాశి 
తులారాశిలో జన్మించిన వ్యక్తులందరికీ జీవితంలో సామాజికంగా ఎంతో మేలు జరుగుతుంది. బుధుడు శక్తివంతమైన ప్రభావంతో మాటలకు ఆదరణ కూడా పెరుగుతుంది. అంతేకాకుండా సామాజిక స్థాయిలో వీరికి అద్భుతమైన గుర్తింపు లభిస్తుంది. రాజకీయ రంగాల్లో లేదా ఏదైనా సామాజిక రంగాల్లో చెరుకుగా ఉంటే ప్రజాదరణ కూడా విపరీతంగా పెరుగుతుంది. ముఖ్యంగా వృత్తి జీవితం కొనసాగిస్తున్న వ్యక్తులందరికీ అద్భుతమైన విజయాలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్త ఉద్యోగాలు లేదా వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వ్యక్తులు తప్పకుండా ఈ సమయంలో విజయాలు సాధించగలుగుతారు. అలాగే మతపరమైన కార్యకలాపాలపై కూడా విపరీతమైన ఆసక్తి పెరుగుతుంది. ఈ సమయంలో ఆర్థికంగా కూడా ఎంతో బలపడతారు. కాబట్టి డబ్బులు కూడా ఎక్కువగా సంపాదించి బ్యాంకు బ్యాలెన్స్ పెంచుకునే అవకాశాలు కలిగి ఉంటారు.

గమనిక.. ఇక్కడ అందించిన సమాచారం సాధారణ నమ్మకాలతో పాటు సమాచారం పై ఆధారపడి ఉంటుంది. దీనిని జీ తెలుగు న్యూస్ అస్సలు ధ్రువీకరించరు..

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report

Kaal Sarp Yog: రాహు-కేతువుల సంచారంతో శక్తివంతమైన కాలసర్పదోషం.. జూన్ 23 వరకు ఆ రాశులకు కష్టాల కాలం..

Hyderabad, Telangana:

Powerful Kaal Sarp Yog Effect On Zodiac: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కాలసర్ప దోషాన్ని అత్యంత ప్రమాదకరమైన అశుభయోగంగా పరిగణిస్తూ ఉంటారు. అయితే పంచాంగం ప్రకారం 2026 సంవత్సరం జూన్ 9 నుంచి 23 మధ్య చంద్రుడితోపాటు రాహువు కేతువుల కలయిక జరగబోతోంది. దీని ఫలితంగానే కాలసర్పయోగం ఏర్పడింది. నిజానికి ఈ యోగానికి చాలా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. జాతకంలో ఈ యోగం ఏర్పడితే చాలా రాశుల వారికి ఎన్నో రకాల కష్టాలు కలుగుతాయి. ముఖ్యంగా జూన్ 9న చంద్రుడు కుంభరాశిలోకి ప్రవేశించడం కారణంగా అక్కడి ఇప్పటికే కేతువు గ్రహం సంచార దశలో ఉంది. ఆ తర్వాత రాహువు కలయిక కూడా జరగడం కారణంగా మొత్తం 14 రోజుల కాలంలో కొన్ని రాశుల వారికి మానసిక ఒత్తిడి పెరగడమే కాకుండా ఆర్థిక నష్టాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా వృత్తిలో అనేక రకాల అడ్డంకులు ఎదురవుతాయి. అయితే ఈ కాలసర్పయోగంతో ఏ రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ రాశులవారికి బంపర్..
వృషభ రాశి 
వృషభ రాశి వారికి ఎంతో శక్తివంతమైన కాలసర్ప యోగం కారణంగా కుటుంబంలో కలహాలు ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా వీరికి నాలుగవ స్థానంలో ఈ యోగం ఏర్పడడం వల్ల తల్లి ఆరోగ్యం క్షీణించే అవకాశాలున్నాయి. ముఖ్యంగా ఆందోళన వంటి సమస్యలు కూడా తలెత్తే అవకాశాలున్నాయి. అలాగే కుటుంబంలో ఆస్తులకు సంబంధించిన తగాదాలు కూడా రావచ్చు. ముఖ్యంగా పూర్వీకుల ఆస్తులు లేదా ఇంటికి సంబంధించిన ఏవైనా ప్రధాన సమస్యలు ఉంటే శాంతియుతంగా చర్చించుకోవడం మంచిది. లేదంటే ఎన్నో రకాల ఇబ్బందులు తలెత్తుతాయి. ముఖ్యంగా కొన్ని రకాల పనులను ఈ సమయంలో చేయకపోవడం మంచిది.

సింహరాశి 
సింహరాశిలో జన్మించిన వ్యక్తులకు ఈ సమయంలో ఒత్తిడి విపరీతంగా పెరుగుతుంది. భాగస్వామి పరంగా అనేక సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీరి లగ్నంలో కేతు, ఏడవ స్థానంలో అహువు ఉండడం వల్ల తీవ్రమైన సైద్ధాంతిక విభేదాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ సమయంలో మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్న అనేక సమస్యల బారిన పడాల్సి వస్తుంది. అలాగే ఎలాంటి కొత్త వ్యాపార ఒప్పందాలతో పాటు భాగస్వామ్య వ్యాపారాల్లోకి అడుగుపెట్టడం మంచిది కాదు. దీంతోపాటు అనుకున్న పనుల్లో ఆటంకాలు తీవ్రంగా ఎదురవుతాయి. 

వృశ్చిక రాశి 
వృశ్చిక రాశిలో జన్మించిన వ్యక్తులకు ఈ సమయంలో అనేక రకాల అడ్డంకులు ఎదురవుతాయి. ముఖ్యంగా రాహువు కేతువు గ్రహాలు వీరికి నాలుగవ స్థానంలోకి రావడం వల్ల రాజకీయంగా ఉన్న వ్యక్తులకు కొన్ని రకాల సమస్యలు ఎదురవుతాయి. అలాగే మీకు వ్యతిరేకంగా పెద్ద పెద్ద కుట్రలు జరిగే అవకాశాలున్నాయి. ఉద్యోగాలు మారాలని ఆలోచిస్తున్న వ్యక్తులకు.. కాస్త ఈ సమయం నష్టాలను తెచ్చిపెట్టే అవకాశాలున్నాయి. అంతేకాకుండా ఇంట్లో అశాంతి వాతావరణం నెలకొంటుంది. అలాగే ఉద్యోగస్తులకు ఇతర ఉద్యోగస్తుల నుంచి అనేక సమస్యలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

కుంభరాశి 
కుంభరాశిలో జన్మించిన వ్యక్తులకు ఈ సమయంలో ఆరోగ్యం చెరిపోవడమే కాకుండా.. ఆర్థికంగా అనేక నష్టానికి చవిచూసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కాలసర్పయోగంతో వ్యక్తిత్వం పై ఊహించని ప్రభావం పడుతుంది. అలాగే అకస్మాత్తుగా ఊహించని ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యం కూడా చాలా వరకు క్షీణించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వీరు ఈ సమయంలో గాయపడే ప్రమాదం కూడా ఉంది.. కాబట్టి వాహనాలు నడిపే క్రమంలో తప్పకుండా కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా కొన్ని నిర్ణయాలు తీసుకునే క్రమంలో పెద్దలతో చర్చించి తీసుకోవడం మంచిది. లేదంటే తీవ్ర సమస్యలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి..

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

గమనిక.. 

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report

Hyderabad Traffic: తొలి వానకే హైదరాబాద్ దిగ్బంధం.. రోడ్లపై నిలిచిన వాహనాలు

Hyderabad, Telangana:

Traffic Jam In IT Corridor: విశ్వనగరంగా గుర్తింపు పొందుతున్న హైదరాబాద్‌ ఒక్కవానకే వణికిపోయింది. అధికార యంత్రాంగం వైఫల్యంతో నగర ప్రజలు నరకం అనుభవించారు. వర్షం బీభత్సం సృష్టించడంతో నగరంపై వరదతోపాటు వాహనాల వరద కూడా కొనసాగింది. రోడ్లపై ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. నత్తకు పోటీపడుతూ నెమ్మదిగా కదిలాయి. నగరంలోని అన్నీ ప్రాంతాల్లో కుండపోత వర్షం పడడంతో హైదరాబాద్‌ చిగురుటాకులా వణికిపోయింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

Also Read: Hyderabad Rain Tragedy: పాతబస్తీలో ఇద్దరు యువకులు మృతి.. హైదరాబాద్‌లో విషాదం మిగిల్చిన వర్షం

నగరానికి వన్నె తీసుకువస్తున్న ఐటీ ప్రాంతం వర్షంతో.. వాహనాలతో నిండిపోయింది. మాదాపూర్‌, రాయదుర్గం, ఐకియా చౌరస్తా, నిలోఫర్‌ కేఫ్‌, నాలెడ్జ్‌ సిటీ, గచ్చిబౌలి, నానక్‌రామ్‌గూడ, కేబుల్‌ బ్రిడ్జి, జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌ ప్రాంతాల్లో భారీ ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. ఇక పంజాగుట్ట, బేగంపేట, సికింద్రాబాద్‌ ప్రాంతాలు వాహనాలతో కిటకిటలాడాయి. అటు మియాపూర్‌, కేపీహెచ్‌బీ కాలనీ, కూకట్‌పల్లి, జీడిమెట్ల, వై జంక్షన్‌ ప్రాంతాల్లో వాహనాలు నత్తతో పోటీపడుతూ మెల్లగా వెళ్తున్నాయి.

ఎందుకీ పరిస్థితి?
ఒక్క వర్షానికే హైదరాబాద్‌ అతలాకుతలం ఎందుకు అయ్యిందనే ప్రశ్న వ్యక్తమవుతోంది. కుండపోత వర్షం పడడంతో హైదరాబాద్‌లో ఎక్కడికక్కడ వరద రోడ్లపై నిలిచిపోయింది. కోటిన్నరకు పైగా జనాభా జీవించే ఈ నగరం ఒక్క వానకే ఇలా అయితే ఎలా అని హైదరాబాద్‌ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. వాస్తవంగా వర్షాకాలం ప్రారంభానికి ముందే అధికార యంత్రాంగం అప్రమత్తం కావాల్సి ఉంది. లోతట్టు ప్రాంతాలు.. వరద నిలిచే ప్రాంతాల్లో మరమ్మతు పనులు, డ్రైనేజీల పూడికతీత, కాలువల పునరుద్ధరణ, ప్రమాదకరంగా ఉన్న చెట్లు కొట్టివేయడం.. జలాశయాల్లో చెత్తాచెదారం తీసేయడం.. డ్రైనేజీ వ్యవస్థను పునరుద్ధరించడం వంటివి చేయాల్సి ఉంది. కానీ వర్షాకాలం ప్రారంభమైన తర్వాత కూడా అధికార యంత్రాంగం మేల్కొనలేదు. ట్రాఫిక్ విభాగం, పోలీస్ వ్యవస్థ, మున్సిపల్ శాఖ, విద్యుత్ శాఖ, హైడ్రా తదితర విభాగాలు అప్రమత్తం కాకపోవడంతో తొలి వానకే హైదరాబాద్ ప్రజలు నరకం చవిచూశారు. ఇక రానున్న వర్షాకాలంలో పరిస్థితులు ఎలా ఉంటాయోమోనని నగర ప్రజలు భయాందోళన చెందుతున్నారు.

Also Read: Hyderabad Rains: హైదరాబాద్‌లో విషాదం నింపిన వర్షం.. పాతబస్తీలో ఇద్దరు మృతి

విద్యుత్‌ అంతరాయం
వర్షాకాలం ప్రారంభమే తొలి వాన దంచికొట్టింది. కుండపోత వర్షం పడడంతో హైదరాబాద్‌లో చాలా చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. కొన్ని చోట్ల రోడ్లు కోతకు గురయ్యాయి. మరికొన్ని చోట్ల విద్యుత్‌ తీగలు తెగి పడిపోయాయి. దీంతో పాతబస్తీలో ఇద్దరు మృతి చెందారు. ఇక వర్షం కారణంగా నగరంలోని చాలా ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. విద్యానగర్‌, ముషీరాబాద్‌, ఆర్టీసీ క్రాస్‌ రోడ్డు, స్టీల్‌ బ్రిడ్జి, ఇందిరాపార్క్, కవాడిగూడ, నారాయణగూడ, సుందరయ్య పార్కు, బర్కత్‌పుర తదితర ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటల నుంచి దాదాపు 10.30 గంటలకు విద్యుత్‌ కోతలు వచ్చాయి. చెట్లు కూలడం.. ట్రాన్స్‌ఫార్మర్లు పేలడంతోనే విద్యుత్‌ అంతరాయం ఏర్పడిందని అధికారులు చెబుతున్నారు. ఎప్పటికప్పుడు మరమ్మతు పనులు చేసి విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరిస్తున్నట్లు విద్యుత్‌ అధికారులు చెబుతున్నారు. అధికారులకు ఫోన్ చేసినా స్పందించడం లేదంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు.

0
0
Report
Advertisement
Advertisement
Back to top