Back
Khammam507001blurImage

ఖమ్మం: పురుగుల మందుతాగి రైతు ఆత్మహత్య

Kotha Yakesh
Aug 07, 2024 07:56:33
Khammam, Telangana

ఖమ్మం రూరల్ మండలం జాన్ పహాడ్ తండాలో రైతు వెంకట్ రెడ్డి పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈనెల 4న పురుగుల మందుతాగి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నేడు మృతిచెందాడు. తన భూమిని జాటోత్ వీరన్న కబ్జా చేస్తున్నాడని ఆరోపిస్తూ, పొలంలో సెల్ఫీ వీడియో తీసి ఆత్మహత్య యత్నం చేశాడు. పోలీసు, రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించాడు. ఈ సంఘటన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పాలేరు నియోజకవర్గంలో చోటుచేసుకుంది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

1
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com