Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Khammam507003

ఖమ్మం: నకిలీ వైద్యుడి గుట్టు రట్టు

Jul 23, 2024 09:43:42
Khammam, Telangana

ఖమ్మం జిల్లా వేంసూరు మండలం మర్లపాడు గ్రామంలో నకిలీ వైద్యుడు పట్టుబడ్డాడు. ఫార్మసీ చదివిన డాక్టర్ కరుణ ప్రసాద్ ఓపీ ఫీజు తీసుకుని చికిత్స అందిస్తున్నారు. గత పదేళ్లుగా ఇదే తంతు కొనసాగుతున్నా వైద్యాధికారులు కన్నెత్తి చూడలేదు. ఎంబీబీఎస్ వైద్యులు రూ.300 ఓపీ వసూలు చేస్తూ మందులు, ఇంజక్షన్లు ఇస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
RKRavi Kumar Sargam
Dec 26, 2025 17:25:02
Erravalli, Telangana:

KCR Assembly Session: కృష్ణా జలాలపై భారీ మోసం చేస్తున్న రేవంత్‌ రెడ్డి.. రాష్ట్రానికి రావాల్సిన నదీ జలాలపై తీవ్ర అన్యాయం చేస్తుండడంపై ఇటీవల తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంచలన ఆరోపణలు, విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రకటించినట్టు 'ఐ యామ్‌ ద ఫీల్డ్‌'లో భాగంగా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్‌ హాజరు కాబోతున్నట్లు సమాచారం. ఈ మేరకు పార్టీ నాయకుల సమావేశంలో సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Also Read: DA Hike: ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్‌ జాక్‌పాట్‌! 5 శాతం డీఏ పెంపునకు ప్రభుత్వం నిర్ణయం

సిద్దిపేట జిల్లా ఎర్రవెల్లిలోని ఫామ్ హౌస్‌లో శుక్రవారం మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్, నల్లగొండ జిల్లాలకు చెందిన బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులతో కేసీఆర్‌ సమావేశం అయ్యారు. పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై కాంగ్రెస్‌ ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తూ మూడు జిల్లాల్లో భారీ బహిరంగ సభలను నిర్వహిస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిం.దే ఈ సందర్బంగా ఉమ్మడి పాలమూరు, రంగారెడ్డి, నల్లగొండ, హైదరాబాద్ జిల్లాలకు చెందిన నాయకులతో సమావేశమై సభలను ఎప్పుడు? ఎక్కడ? ఏర్పాటు చేయాలనే దానిపై కేసీఆర్ దిశా నిర్దేశం చేశారు.

Also Read: GHMC Gift: హైదరాబాద్‌ ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం భారీ గిఫ్ట్‌! ఏమిటో తెలుసా?

పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించి తదుపరి కార్యాచరణపై పార్టీ ముఖ్య నాయకులతో గులాబీ బాస్‌ కేసీఆర్‌ చర్చించారు. అసెంబ్లీ సమావేశాల అనంతరం బహిరంగ సభలు నిర్వహించే అంశాన్ని సమావేశంలో చర్చించారు. ఈ క్రమంలోనే 29వ తేదీన శాసనసభకు కేసీఆర్ హాజరయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి కారణంగా తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతోందని పార్టీ నాయకులతో కేసీఆర్‌ పునరుద్ఘాటించారు.

Also Read: Govt Employees: ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం భారీ గిఫ్ట్‌.. వారికి కొత్త ఉద్యోగాలు

కాంగ్రెస్ నాటి నుంచీ తెలంగాణకు ఎప్పుడు ద్రోహమేనని తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ప్రకటించారు. తెలంగాణ కోసం బీఆర్ఎస్ పార్టీ తప్ప మరే ఇతర పార్టీకి పట్టింపు ఉండదని స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని ఎండగట్టాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రజల్లోకి వెళ్దాం.. ఉద్యమాన్ని  నిర్మిద్దామని పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేశారు. తెలంగాణ నీటి హక్కులను పరిరక్షించుకునే బాధ్యత బీఆర్ఎస్ పార్టీ పైనే ఉందని ప్రకటించారు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని అసెంబ్లీ వేదికగా వివరిద్దామని పార్టీ నాయకులకు చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న ద్రోహం, అన్యాయాన్ని సభా వేదికగా ప్రజలకు చెబుదామని కేసీఆర్‌ తెలిపారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
RKRavi Kumar Sargam
Dec 26, 2025 16:56:52
Hyderabad, Telangana:

Hyderabad: నగర ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం భారీ శుభవార్త తెలిపింది. అధికారాన్నీ కేంద్రీకృతం చేయడంతో హైదరాబాద్‌ ప్రజలకు పట్టణ సేవలు సులభంగా లభించనున్నాయి. సులభంగా, వేగంగా పౌర సేవలు అందనుండడంతో ప్రజలు కష్టాలు తొలగిపోనున్నాయి. పరిపాలన వ్యవస్థీకరణతో హైదరాబాద్‌ మహానగరం అభివృద్ధి మరింత వేగిరం కానుంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌ (జీహెచ్ఎంసీ) పరిధిలో 20 పురపాలికలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లు కలిపి మొత్తం 27 పట్టణ స్థానిక సంస్థలను (యూఎల్‌బీలు) విలీనం చేయడంతో హైదరాబాద్ పుర పాలనలో ఒక నూతన దశ ప్రారంభం కానుంది.

జీహెచ్‌ఎంసీలో మున్సిపాలిటీలు, మున్సిపల్‌ కార్పొరేషన్ల విలీనంతో జీహెచ్ఎంసీ పరిధి విస్తృతం కానుంది. ఇప్పటివరకు ఉన్న జీహెచ్‌ఎంసీ పరిధి 650 చదరపు కిలోమీటర్ల నుంచి 2,053 చదరపు కిలోమీటర్లకు విస్తరించనుంది. ఈ నిర్ణయంతో విస్తీర్ణం, జనాభా పరంగా దేశంలోనే అతిపెద్ద మున్సిపల్ కార్పొరేషన్‌గా జీహెచ్ఎంసీ అవతరించనుంది. వార్డుల పునర్వ్యవస్థీకరణ 150 నుంచి 300కు పెరగనుంది. పునర్వ్యవస్థీకరణలో భాగంగా గెజిట్‌లో నోటిఫై చేసిన సమగ్ర డీలిమిటేషన్ ప్రక్రియ అనంతరం జీహెచ్ఎంసీ వార్డుల సంఖ్యను 150 నుంచి 300కు పెంచారు.

దీని ద్వారా ప్రజాప్రాతినిధ్యాన్ని మరింత బలోపేతం చేయడం, పరిపాలనా సామర్థ్యాన్ని పెంపొందించడం తద్వారా విస్తరించిన పట్టణ ప్రాంతాల్లో పౌర సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడం లక్ష్యంగా ప్రభుత్వం పెట్టుకుంది. వికేంద్రీకృత పాలనకు జోన్లు, సర్కిళ్ల పునర్నిర్మాణం జరగనుంది. విలీనంతో పెరిగిన పరిపాలనా బాధ్యతలను సమర్థంగా నిర్వహించేందుకు జీహెచ్ఎంసీని గత 6 జోన్లు, 30 సర్కిళ్ల నుంచి 12 జోన్లు, 60 సర్కిళ్లకు పునర్వ్యవస్థీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

జీహెచ్ఎంసీ జనాభా 1.34 కోట్లకు మించి ఉండడంతో ఈ మార్పులు వికేంద్రీకరణ, పరిపాలనా సమానత్వం, మెరుగైన సేవల అందించేందుకు దోహదం కానున్నాయని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా జోనల్ కమిషనర్ల నియామకం చేపట్టింది. నూతన పరిపాలనా నిర్మాణానికి అనుగుణంగా జీహెచ్ఎంసీకి 12 మంది జోనల్ కమిషనర్లను ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. డిసెంబర్‌ 26 వ తేదీన బాధ్యతలు స్వీకరించడంతో పునర్వ్యవస్థీకరించిన జోన్లలో పరిపాలన తక్షణమే అమల్లోకి రావడం గమనార్హం. దీంతో క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ, పాలన మరింత బలోపేతం కానుంది.

కొత్తగా విస్తరించిన జీహెచ్ఎంసీ పరిధితో భూలభ్యత, రవాణా, నివాసం, వర్షపు నీటి పారుదల, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాల్లో సమగ్ర మెట్రోపాలిటన్ ప్రణాళికలు అమలు చేసే అవకాశం లభించింది. విలీనమైన ప్రాంతాలకు జీహెచ్ఎంసీ  నిధులు, సాంకేతిక నైపుణ్యం, పారిశుధ్యం, ఘన వ్యర్థాల నిర్వహణ, ప్రజారోగ్యం, దోమల నివారణ, అత్యవసర సేవలు వంటి ప్రామాణిక పౌర సేవలు అందనున్నాయని ప్రభుత్వం తెలిపింది. విస్తృత పన్నుల ఆధారం, సరళీకృత పరిపాలనతో జీహెచ్ఎంసీ ఆర్థిక, సంస్థాగత సామర్థ్యం గణనీయంగా పెరిగింది. 

ఈ పునర్వ్యవస్థీకరణతో సమతుల్య పట్టణ అభివృద్ధి, మెరుగైన విపత్తుల,వరదల నిర్వహణ, నగర కేంద్రం నుంచి అంచు ప్రాంతాల వరకూ సమాన మౌలిక వసతుల అభివృద్ధి సాధ్యమవుతుందని అధికారులు చెబుతున్నారు. విస్తరించిన, పునర్వ్యవస్థీకరించిన జీహెచ్ఎంసీ సమర్థ పాలన, సమగ్ర అభివృద్ధి, సుస్థిర పట్టణ వృద్ధి అనే లక్ష్యాలతో హైదరాబాద్ భవిష్యత్తుకు ఒక ఏకీకృత విధానాన్ని ప్రతిబింబిస్తోంది. ప్రపంచస్థాయి మెట్రోపాలిటన్ నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దే దిశగా ఇది కీలక అడుగుగా  నిపుణులు భావిస్తున్నారు.

0
comment0
Report
BBhoomi
Dec 26, 2025 15:05:06
Secunderabad, Telangana:

8th Pay Commission latest: 8 వేతన సంఘం ఏర్పాటుతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లలో ఒక్కసారిగా ఆసక్తి పెరిగింది. వేతనాలు ఎప్పుడు పెరుగుతాయి? సిఫార్సులు ఎప్పుడు అమలవుతాయి? తమకు ఇప్పటివరకు అందుతున్న ముఖ్యమైన పథకాల భవిష్యత్తు ఏమవుతుంది? వంటి ప్రశ్నలు సహజంగానే ఉత్పన్నమవుతున్నాయి. ముఖ్యంగా ఆరోగ్యం,  గృహానికి సంబంధించిన పథకాలపై ఉద్యోగులు ఎక్కువగా దృష్టి పెట్టారు.8వ వేతన సంఘం నివేదిక వచ్చిన తర్వాతే పూర్తి స్పష్టత వస్తుంది కానీ.. ప్రస్తుతం అమలులో ఉన్న కీలక పథకాలపై ఎలాంటి ప్రభావం ఉండబోతుందో తెలుసుకుందాం. 

కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం (CGHS)

CGHS అనేది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు.. పెన్షనర్లు.. వారి మీద ఆధారపడిన కుటుంబ సభ్యుల కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన ఆరోగ్య సంరక్షణ పథకం ఇది. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న వెల్‌నెస్ సెంటర్లు, ప్రభుత్వం గుర్తింపు పొందిన ప్రైవేట్, ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా వైద్య సేవలు అందిస్తుంది.  సాధారణ వైద్య పరీక్షలు.. నిపుణుల సంప్రదింపులు.. ల్యాబ్ టెస్టులు.. చికిత్సలు.. శస్త్రచికిత్సలు.. అవసరమైన మందులు ఈ పథకం కింద కవర్ అవుతాయి.

అంతేకాదు. CGHSలో మరో ప్రత్యేకత ఏమిటంటే.. దీనికి గరిష్ట బీమా పరిమితి ఉండదు. ప్యాకేజీ ఆధారిత విధానంలో చికిత్స అందిస్తుంది. లబ్ధిదారులు ఆన్‌లైన్‌లో e-CGHS కార్డును సులభంగా పొందవచ్చు. తక్కువ ఖర్చుతో.. నాణ్యమైన వైద్యం అందుబాటులో ఉండటం వల్ల ఈ పథకం కేంద్ర ఉద్యోగులకు ఎంతో కీలకంగా మారింది.

కేంద్ర ప్రభుత్వ గృహ నిర్మాణ అడ్వాన్స్ (HBA)

ఇల్లు కొనడం లేదా నిర్మించుకోవడం అనేది ప్రతి ఉద్యోగి కల. ఈ లక్ష్యాన్ని సులభం చేయడానికి కేంద్ర ప్రభుత్వం హౌసింగ్ బిల్డింగ్ అడ్వాన్స్ (HBA) పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మార్కెట్ వడ్డీ రేట్లతో పోలిస్తే చాలా తక్కువ వడ్డీకి గృహ రుణాన్ని పొందవచ్చు. ఇల్లు కొనుగోలు చేయడం.. ప్లాట్ నిర్మాణం.. ఇంటి పునరుద్ధరణ లేదా విస్తరణ వంటి అవసరాల కోసం ఈ రుణాన్ని ఉపయోగించుకోవచ్చు.

Also Read:  Copper Price: బంగారం కాదు, వెండి అంతకన్నా కాదు.. మార్కెట్‌లో ఇప్పుడు ఈ లోహమే కింగ్‌..!!

HBA కింద ఒక ఉద్యోగి తన ప్రాథమిక జీతం, డియర్‌నెస్ అలవెన్స్ (DA) కలిపిన మొత్తానికి గరిష్టంగా 34 రెట్లు లేదా గరిష్టంగా రూ. 25 లక్షల వరకు లోన్ పొందవచ్చు. ఈ లోన్ పై వడ్డీ రేటు సాధారణంగా 6 శాతం నుంచి 7.5 శాతం మధ్యలో ఉంటుంది. ఇది బ్యాంకు రుణాల కంటే చాలా తక్కువగా ఉంటుంది. ఈ పథకం ప్రధానంగా శాశ్వత ఉద్యోగులకు వర్తిస్తుంది. అయితే కొన్ని షరతులతో తాత్కాలిక ఉద్యోగులకు కూడా అవకాశం ఉంటుంది. ఈ లోన్ పొందాలంటే ఉద్యోగి కనీసం ఐదు సంవత్సరాల ప్రభుత్వ సర్వీసు పూర్తి చేసి ఉండాలి. అలాగే.. గతంలో ప్రభుత్వ గృహాన్ని పొందకూడదు లేదా ఇల్లు సంబంధిత ఇతర ప్రభుత్వ ప్రయోజనాలను ఉపయోగించుకుని ఉండకూడదు.

మొత్తంగా.. CGHS,  HBA పథకాలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఆరోగ్య భద్రతతో పాటు గృహ భరోసాను అందిస్తున్న కీలక ఆధారాలుగా ఉన్నాయి. 8 వేతన సంఘం సిఫార్సులు వచ్చిన తర్వాత వీటిలో ఏవైనా మార్పులు జరుగుతాయా? అనే విషయం స్పష్టంగా తెలుస్తోంది. అప్పటివరకు ఈ పథకాలు ఉద్యోగుల జీవితాల్లో కీలక పాత్ర పోషిస్తూనే ఉంటాయి.

Also Read: PM Jan Aushadhi VS Dawa India: పీఎం జన ఔషధి వర్సెస్ దవా ఇండియా.. ఈ రెండింటి మధ్య తేడా ఏంటి? ఎందులో తక్కువ ధరకు ఔషధాలు లభిస్తాయి..!!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
Dec 26, 2025 14:34:35
0
comment0
Report
BBhoomi
Dec 26, 2025 13:44:19
Secunderabad, Telangana:

CEO Gives rs.2,000 Crore in Bonus to Employees: ఉద్యోగులకు బోనస్  ఇవ్వడం అనేది సాధారణంగా అన్ని కంపెనీల్లో జరిగే వ్యవహారమే. కానీ తాజాగా ఒక సీఈవో తీసుకున్న నిర్ణయం మాత్రం ప్రపంచం ఆశ్చర్యపోయేలా చేసింది. తన ఉద్యోగులకు బోనస్ ఇచ్చేందుకు ఆయన చేసిన త్యాగం తెలిస్తే..మీరు గ్రేట్ సార్ అనక తప్పరు. ఏం చేశారో తెలుసా? ఏకంగా తన కంపెనీని అమ్మేశారు. అందులో వచ్చిన మొత్తంలో భారీ భాగాన్ని ఉద్యోగుల కోసం కేటాయించారు. ఫలితంగా వందలాది మంది ఉద్యోగులు ఒక్కసారిగా కోట్లాది రూపాయలు బోనస్ అందుకున్నారు. ఇది వినేందుకు కలలా అనిపించినా.. జరిగింది మాత్రం నిజమే. 

ఈ  సంఘటన జరిగింది అమెరికాలోని లూసియానాకు చెందిన ఫైబర్ బాండ్ అనే సంస్థలో. ఈ కంపెనీకి గ్రాహమ్ వాకర్ సీఈవోగా ఉన్నారు. ఆయన తండ్రి క్లాడ్ వాకర్ 1982లో ఈ సంస్థను స్థాపించారు. దశాబ్దాలుగా ఈ కంపెనీతో కలిసిన ఎదిగిన ఉద్యోగులను తమ కుటుంబమని గ్రాహమ్ భావిస్తుండేవారు. అదే భావన ఆయన తీసుకున్న ఈ చారిత్రాత్మక నిర్ణయానికి కారణం అయ్యింది. 

అయితే ఇటీవల ఫైబర్ బాండ్ ను ప్రముఖ సంస్థ ఈటన్ సుమారు 1.7 బిలియన్ డాలర్లకు  కొన్నది. అయితే ఈ డీల్ పూర్తయ్యే ముందు గ్రాహమ్ వాకర్ ఓ కీలక కండిషన్ పెట్టారు. కంపెనీ అమ్మకపు మొత్తంలో 15 శాతం వాటా.. అంటే దాదాపు రూ. 2,000 కోట్లను.. కంపెనీలో పనిచేస్తున్న 540 మంది ఉద్యోగులకు బోనస్‌గా కేటాయించాలని స్పష్టంగా పేర్కొన్నారు. ఉద్యోగులు లేకుండా ఈ కంపెనీ ఇంత దూరం రాలేదని ఆయన అభిప్రాయం. ఆశ్చర్యకరంగా.. ఈటన్ సంస్థ కూడా ఆ షరతుకు అంగీకరించింది.

Also Read: PM Jan Aushadhi VS Dawa India: పీఎం జన ఔషధి వర్సెస్ దవా ఇండియా.. ఈ రెండింటి మధ్య తేడా ఏంటి? ఎందులో తక్కువ ధరకు ఔషధాలు లభిస్తాయి..!!

దీంతో వచ్చే ఐదేళ్ల కాలంలో ప్రతి ఉద్యోగికి సగటున రూ. 4 కోట్ల వరకు బోనస్ అందే అవకాశం ఏర్పడింది. ఇప్పటికే కొందరి ఖాతాల్లో బోనస్ మొత్తం జమ అవుతుండగా.. కొత్త యాజమాన్యంలో ఉద్యోగంలో కొనసాగితే ఈ మొత్తం మరింత పెరిగే అవకాశం కూడా ఉంది. మొదట ఈ వార్త బయటకు వచ్చినప్పుడు చాలామంది నమ్మలేకపోయారు.  ఇది లాటరీ గెలిచినట్లే ఉంది  అని ఒక ఉద్యోగి వ్యాఖ్యానించగా.. మరికొందరు ఈ డబ్బుతో తమ అప్పులు తీర్చుకోవచ్చని భావోద్వేగానికి లోనయ్యారు.

1990ల నుంచి ఈ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు ఈ నిర్ణయాన్ని తమ జీవితంలో మర్చిపోలేని క్షణంగా అభివర్ణిస్తున్నారు. క్రిస్మస్ సందర్భంగా ఇంతటి గిఫ్ట్ వస్తుందని ఎవరూ ఊహించలేదని వారు చెబుతున్నారు. డిసెంబర్ 31తో గ్రాహమ్ వాకర్ సీఈఓ పదవికి వీడ్కోలు పలకనున్నారు. అయితే ఆయన తీసుకున్న ఈ నిర్ణయం మాత్రం ఎప్పటికీ ఉద్యోగుల హృదయాల్లో నిలిచిపోతుంది.

ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.  ఇలాంటి బాస్ ప్రతి ఉద్యోగికి కావాలి..  ఇది నిజమైన లీడర్‌షిప్..  ఉద్యోగులను కుటుంబంలా చూసే వ్యక్తి  అంటూ గ్రాహమ్ వాకర్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. లాభాలకంటే మనుషుల విలువను ముందు పెట్టిన ఈ కథ ఇప్పుడు ప్రపంచానికి ఒక గొప్ప ఉదాహరణగా నిలిచింది.

Also Read:  Copper Price: బంగారం కాదు, వెండి అంతకన్నా కాదు.. మార్కెట్‌లో ఇప్పుడు ఈ లోహమే కింగ్‌..!!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
HDHarish Darla
Dec 26, 2025 12:33:52
Keraniganj, Dhaka Division:

Bangladesh Hindu Killed: బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీల పరిస్థితి రోజురోజుకూ ఆందోళనకరంగా మారుతోంది. ఇటీవల మైమెన్‌సింగ్‌లో దైవదూషణ ఆరోపణలతో దీపు చంద్ర దాస్ అనే హిందూ యువకుడిని దారుణంగా హత్య చేయడాన్ని భారత్ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) ప్రతినిధి రణధీర్ జైస్వాల్ శుక్రవారం న్యూఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు.

మైనారిటీలే లక్ష్యంగా దాడులు..
బంగ్లాదేశ్‌లో ప్రస్తుత తాత్కాలిక ప్రభుత్వ హయాంలో మైనారిటీలపై జరుగుతున్న దాడుల తీవ్రతను భారత్ ఎత్తిచూపింది.  తాత్కాలిక ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి హిందువులు, క్రైస్తవులు, బౌద్ధులు సహా మైనారిటీలపై 2,900 కంటే ఎక్కువ హింసాత్మక సంఘటనలు నమోదయ్యాయి.

దీపు చంద్ర దాస్ హత్యను ఖండిస్తూ, బాధ్యులకు కఠిన శిక్ష పడేలా చూడాలని బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. బంగ్లాదేశ్ ప్రభుత్వం చెబుతున్నట్లుగా ఇవి కేవలం మీడియా సృష్టి లేదా రాజకీయ హింస కాదని, ఇవి మైనారిటీలపై జరుగుతున్న వ్యవస్థీకృత దాడులని జైస్వాల్ స్పష్టం చేశారు.

పొరుగు దేశంలో నెలకొన్న అస్థిరతపై భారతదేశం తన వైఖరిని స్పష్టంగా వివరించింది. తమ దేశంలోని మైనారిటీల ప్రాణాలకు, ఆస్తులకు, మతపరమైన స్థలాలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత పూర్తిగా బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వానిదే అని భారత్ పునరుద్ఘాటించింది. బంగ్లాదేశ్‌లో ప్రచారంలో ఉన్న తప్పుడు భారత వ్యతిరేక కథనాలను భారత్ నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. బంగ్లాదేశ్‌లో శాంతి, స్థిరత్వం నెలకొనాలని.. అక్కడ స్వేచ్ఛాయుతమైన, న్యాయమైన, అందరినీ కలుపుపోయే ఎన్నికలు జరగాలని భారతదేశం ఆకాంక్షిస్తోంది.

బంగ్లాదేశ్ ప్రజలతో సంబంధాలు
బిఎన్‌పి (BNP) నాయకుడు తారిక్ రెహమాన్ 17 ఏళ్ల తర్వాత బంగ్లాదేశ్‌కు తిరిగి రావడంపై స్పందిస్తూ.. బంగ్లాదేశ్ ప్రజలతో తమ సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి భారత్ కట్టుబడి ఉందని జైస్వాల్ పేర్కొన్నారు. అక్కడి పరిణామాలను భారతదేశం నిశితంగా గమనిస్తోందని ఆయన తెలిపారు.

చివరిగా.. పొరుగు దేశంలో మైనారిటీలపై జరుగుతున్న నిరంతర శత్రుత్వం చాలా ఆందోళనకరమైన విషయమని, తక్షణమే శాంతిభద్రతలను పునరుద్ధరించాలని భారతదేశం బంగ్లాదేశ్‌కు స్పష్టమైన హెచ్చరిక జారీ చేసింది.

Also Read: School Holiday: విద్యార్థులకు గుడ్‌న్యూస్..స్కూళ్లకు 9 రోజులు సెలవులు..ఎప్పుడూ లేనంతగా ఈ సంక్రాంతికి భారీ సెలవులు!

Also Read: Prabhas Billa Actress: ప్రభాస్ సినిమాలో గ్లామర్ క్వీన్..12 సంవత్సరాల తర్వాత రీఎంట్రీ..బాంబు పేల్చిన హీరోయిన్!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
BBhoomi
Dec 26, 2025 12:30:57
Secunderabad, Telangana:

Govt employees cover medical treatment scheme upto 10 lakhs: కొత్త సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పేందుకు సిద్ధమవుతోంది మధ్యప్రదేశ్ ప్రభుత్వం. కొత్త ఏడాదిలో ప్రభుత్వ ఉద్యోగులకు కీలకమైన ఆరోగ్య భద్రతా పథకం అమలు చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.  హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాల్లో అమలులో ఉన్న ఆయుష్మాన్ తరహా నగదు రహిత వైద్య సేవలను 2026 నాటికి రాష్ట్రంలోని దాదాపు 15 లక్షల మంది ఉద్యోగులకు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఒక ప్రతిపాదనను సిద్ధం చేసింది. ఈ పథకం ద్వారా ఉద్యోగులు,  వారి కుటుంబాలకు ఆసుపత్రుల్లో ముందుగా డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేకుండా చికిత్స పొందే అవకాశం ఉంటుంది. 

ఈ ప్రతిపాదిత పథకానికి  ముఖ్యమంత్రి ఆయుష్మాన్ ఆరోగ్య బీమా పథకం  అనే పేరు పెట్టారు. ఉద్యోగి సంఘాల సూచనలు, దీర్ఘకాలిక డిమాండ్లను పరిగణలోకి తీసుకొని ఈ పథకాన్ని రూపొందించారు. ఆయుష్మాన్ భారత్ తరహాలోనే రాష్ట్రంలోపల, రాష్ట్రం వెలుపల ఉన్న ప్రైవేట్,  ఎంపిక చేసిన ఆసుపత్రులతో ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకోనుంది. దీని వల్ల ఉద్యోగులు ఎక్కడైనా చికిత్స పొందే సౌలభ్యం కలుగుతుంది.

ఈ పథకం కింద సాధారణ వైద్య చికిత్సలు, OPD సేవలకు రూ.5 లక్షల వరకు ఉచిత కవరేజ్ అందించనున్నారు. తీవ్ర అనారోగ్యాల విషయంలో ఈ పరిమితిని రూ.10 లక్షల వరకు పెంచే ప్రతిపాదన ఉంది. ఈ ప్రయోజనాలు ఉద్యోగులతో పాటు వారి కుటుంబ సభ్యులకు, అలాగే పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు కూడా వర్తించనున్నాయి.

ఈ ఆరోగ్య బీమా పథకానికి అవసరమైన నిధుల్లో ఒక భాగాన్ని ఉద్యోగులు, పెన్షనర్లు తమ జీతం లేదా పెన్షన్ నుండి నెలకు రూ.250 నుంచి రూ.1,000 వరకు విరాళంగా చెల్లించాల్సి ఉంటుంది. మిగిలిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. 2020లో రాష్ట్ర ఉద్యోగులకు ఉచిత వైద్య సేవలు అందిస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ, అప్పట్లో ఆ పథకం అమలుకు నోచుకోలేదు. ఈసారి మాత్రం స్పష్టమైన విధివిధానాలతో అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

Also Read: 8th Pay Commission: 8వ వేతన సంఘం తర్వాత ప్యూన్ నుండి IAS వరకు ఉద్యోగుల జీతాలు ఎంత పెరుగుతాయి? ఫిట్‌మెంట్‌ ఎంత డిమాండ్‌ చేస్తున్నారు?

ఈ పథకం ద్వారా శాశ్వత, తాత్కాలిక, కాంట్రాక్టు ఉద్యోగులు, బోధనా కేడర్, పదవీ విరమణ చేసిన ఉద్యోగులు, మున్సిపల్ సిబ్బంది, స్వయంప్రతిపత్తి సంస్థల ఉద్యోగులు, అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, గ్రామ ఉపాధి సహాయకులు, పంచాయతీ కార్యదర్శులు వంటి విభిన్న విభాగాల ఉద్యోగులు లబ్ధి పొందనున్నారు. వీరి సంఖ్య 15 లక్షలకుపైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.

ప్రస్తుతం రాష్ట్ర ఉద్యోగులు వైద్య ఖర్చులను ముందుగా స్వయంగా భరిచి, తర్వాత రీయింబర్స్‌మెంట్ కోసం దరఖాస్తు చేయాల్సిన పరిస్థితి ఉంది. తీవ్రమైన అనారోగ్యాల సమయంలో ఈ విధానం వారికి భారీ ఆర్థిక భారంగా మారుతోంది. ఈ నేపథ్యంలో, నగదు రహిత వైద్య సేవలు ఉద్యోగులకు పెద్ద ఉపశమనంగా మారనున్నాయి. ఉద్యోగి సంఘాలు ఈ పథకాన్ని స్వాగతిస్తున్నాయి.  పెన్షనర్లు, ఉద్యోగులు వైద్య ఖర్చుల కోసం తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకొని ఈ పథకాన్ని అమలు చేయాలి  అని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు కోరుతున్నారు. ఈ ప్రతిపాదన త్వరలో క్యాబినెట్ ముందుకు వెళ్లనుందని, ఆమోదం లభిస్తే 2026లో అమలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని సమాచారం.

Also Read: Encumbrance Certificate: ఏదైనా ఆస్తిని కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఈ డాక్యుమెంట్‌ సరిగ్గా లేకపోతే తిప్పలు తప్పవు!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

0
comment0
Report
BBhoomi
Dec 26, 2025 12:05:47
Secunderabad, Telangana:

Income Tax Slab 2026: బడ్జెట్ సమయం దగ్గరకు వస్తున్న ప్రతిసారీ దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది ట్యాక్స్ పేయర్స్ మనస్సుల్లో మెదిలే మొదటి ప్రశ్న..ఈసారి ఆదాయపు పన్నులో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి? ముఖ్యంగా జీతంపై ఆధారపడే వేతనజీవులు తమపై ఉన్న పన్ను భారం కొంతైనా తగ్గుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఇప్పుడు  బడ్జెట్ 2026 విషయంలోనూ ఇదే చర్చ ప్రధానంగా సాగుతోంది. ప్రభుత్వం ఆదాయపు పన్ను స్లాబ్‌లలో పెద్ద మార్పులు చేస్తుందా? లేక చిన్న సవరణలకే పరిమితమవుతుందా? అన్నదానిపై అంచనాలు కొనసాగుతున్నాయి.

ప్రస్తుతం దేశంలో రెండు ఆదాయపు పన్ను విధానాలు అమల్లో ఉన్నాయి. 1. పాత విధానం 2. కొత్త విధానం. ప్రభుత్వం కొత్త పన్ను విధానానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోంది. ఈ విధానంలో మినహాయింపులు తక్కువగా ఉండగా.. పన్ను రేట్లు క్రమంగా పెరుగుతాయి. ప్రస్తుతం వార్షిక ఆదాయం రూ. 24 లక్షలు దాటిన వారికి నేరుగా 30 శాతం పన్ను వర్తిస్తోంది. ఇక పాత పన్ను విధానంలో వివిధ రకాల మినహాయింపులు, తగ్గింపులు ఉన్నప్పటికీ, స్లాబ్ నిర్మాణం పాతదిగానే కొనసాగుతోంది.

బడ్జెట్ 2026లో సామాన్య పన్ను చెల్లింపుదారుడికి అసలు ఉపశమనం ఎక్కడ లభించగలదనే ప్రశ్న ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తోంది. ఇందులో ముఖ్యంగా 30 శాతం పన్ను స్లాబ్ అంశం ఎక్కువ చర్చకు దారి తీస్తోంది. ద్రవ్యోల్బణం, గృహ రుణ భారం, పిల్లల చదువు ఖర్చులు, వైద్య వ్యయాలు పెరిగిన నేపథ్యంలో రూ. 24 లక్షల పరిమితి ఇప్పటి పరిస్థితులకు సరిపోవడం లేదని మధ్యతరగతి,  ఉన్నత-మధ్యతరగతి వర్గాలు భావిస్తున్నాయి. అందుకే 30 శాతం పన్ను స్లాబ్‌ను రూ. 40 లక్షలు లేదా రూ. 50 లక్షల ఆదాయం నుంచి ప్రారంభించాలని డిమాండ్ చేస్తున్నారు.

అలా జరిగితే రూ. 24 లక్షల నుంచి రూ. 40 లక్షల మధ్య ఆదాయం పొందే వారికి నేరుగా లాభం చేకూరుతుంది. వారి చేతిలో మిగిలే డబ్బు పెరుగుతుంది. వినియోగ సామర్థ్యం మెరుగవుతుంది. ఇది ఆర్థిక వ్యవస్థకు కూడా ప్రోత్సాహకంగా మారవచ్చని నిపుణుల అభిప్రాయం. అయితే, ఈ అంశంపై ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పష్టమైన సంకేతాలు రాలేదు. ఆశలు ఉన్నప్పటికీ, ఖచ్చితత్వం మాత్రం లేదు.

Also Read: Encumbrance Certificate: ఏదైనా ఆస్తిని కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఈ డాక్యుమెంట్‌ సరిగ్గా లేకపోతే తిప్పలు తప్పవు!

ఇంకొకవైపు.. కొత్త పన్ను విధానంలో చిన్నచిన్న మార్పులు జరిగే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది. ఉదాహరణకు.. స్టాండర్డ్ డిడక్షన్‌ను కొంత పెంచడం, ఆరోగ్య బీమా లేదా పదవీ విరమణ పొదుపులకు పరిమిత ప్రయోజనాలు జోడించడం వంటి సవరణలు రావొచ్చని అంచనా. ఇవి పెద్ద సంస్కరణలుగా అనిపించకపోయినా, జీతం పొందే లక్షలాది మందిపై తక్షణ ప్రభావం చూపే అవకాశముంది.

పరిశ్రమల సంఘాలు కూడా తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి. PHDCCI ప్రకారం రూ. 50 లక్షల వరకు ఆదాయం ఉన్న వారికి పన్ను రేట్లలో ఉపశమనం ఇవ్వడం ద్వారా వినియోగాన్ని పెంచవచ్చని సూచిస్తోంది. డెలాయిట్ అయితే, TDS విధానాన్ని సరళీకృతం చేయడం, తయారీ రంగానికి ప్రోత్సాహకాలు ఇవ్వడం.. కొత్త పన్ను విధానాన్ని మరింత బలోపేతం చేయడం అవసరమని అంటోంది. ఈవై సంస్థ మాత్రం మూలధన లాభాల పన్ను, ఆదాయపు పన్ను స్లాబ్‌లు, పాత పన్ను విధానం భవితవ్యంపై మార్పులు రావచ్చని అంచనా వేస్తోంది.

పాత పన్ను విధానంపై గురించి చర్చిస్తే.. ప్రభుత్వం దాన్ని క్రమంగా పక్కకు నెట్టాలనే ఉద్దేశంతో ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. బడ్జెట్ 2026లో ఒక్కసారిగా దాన్ని రద్దు చేసే అవకాశం తక్కువగానే ఉన్నప్పటికీ, కొత్త మినహాయింపులు లేదా పెద్ద ఉపశమనం వచ్చే ఆశలు కూడా చాలా పరిమితంగానే ఉన్నాయి. అంటే.. పాత విధానంలో కొనసాగుతున్న వారు పెద్ద మార్పులు ఆశించకపోవడమే మంచిదని నిపుణులు అంటున్నారు.

మొత్తంగా చూస్తే.. బడ్జెట్ 2026లో ఆదాయపు పన్ను స్లాబ్‌లలో విప్లవాత్మక మార్పులు జరిగే అవకాశం తక్కువగానే కనిపిస్తోంది. అయినప్పటికీ, 30 శాతం పన్ను స్లాబ్‌పై ప్రభుత్వం పునరాలోచన చేస్తే.. అది మధ్యతరగతికి, లక్షలాది పన్ను చెల్లింపుదారులకు పెద్ద ఊరటగా మారుతుంది. ప్రస్తుతం ఆశలు కొనసాగుతున్నాయి. కానీ తుది నిర్ణయం మాత్రం బడ్జెట్ రోజునే స్పష్టమవుతుంది.

Also Read: 8th Pay Commission: 8వ వేతన సంఘం తర్వాత ప్యూన్ నుండి IAS వరకు ఉద్యోగుల జీతాలు ఎంత పెరుగుతాయి? ఫిట్‌మెంట్‌ ఎంత డిమాండ్‌ చేస్తున్నారు?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

0
comment0
Report
HDHarish Darla
Dec 26, 2025 11:26:38
Hyderabad, Telangana:

Telangana Sankranti Holidays 2026: సంక్రాంతి పండగ వచ్చిందంటే చాలు.. పిండి వంటలు, గాలిపటాలు, సొంతూరి ప్రయాణాలతో సందడి మొదలవుతుంది. ముఖ్యంగా విద్యార్థులు ఈ పండగ సెలవుల కోసం వేయికళ్లతో ఎదురుచూస్తుంటారు. అయితే, ఈసారి తెలంగాణలోని పాఠశాలలకు గత ఏడాది కంటే అదనంగా సెలవులు వచ్చే అవకాశం ఉండటంతో పిల్లలు అప్పుడే ప్లాన్లలో మునిగిపోయారు.

9 రోజుల సెలవుల లెక్క ఇదీ!
సాధారణంగా తెలంగాణలో సంక్రాంతికి తక్కువ రోజులే సెలవులు ఇస్తుంటారు. కానీ, ఈ ఏడాది క్యాలెండర్ కలిసొస్తుండటంతో సెలవుల సంఖ్య పెరిగేలా కనిపిస్తోంది. జనవరి 10 (రెండో శనివారం), జనవరి 11 (ఆదివారం), జనవరి 12 నుండి 17 వరకు: సంక్రాంతి పండగ సెలవులు (అంచనా) అదే విధంగా జనవరి 18న ఆదివారం కావడం వల్ల సెలవులు వచ్చే అవకాశం ఉంది.

ఇలా వరుసగా శని, ఆదివారాలు తోడవడంతో జనవరి 10 నుండి 18 వరకు వరుసగా 9 రోజులు స్కూళ్లకు సెలవులు వచ్చే ఛాన్స్ ఉంది. తిరిగి జనవరి 19 (సోమవారం) నాడు పాఠశాలలు పునఃప్రారంభం కావచ్చు. దీనిపై మరో రెండు మూడు రోజుల్లో విద్యాశాఖ నుండి అధికారిక ప్రకటన వెలువడనుంది.

ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.  జనవరి 10వ తేదీ నుంచి 18 వరకు 9 రోజుల పాటు రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రైవేట్ పాఠశాలలకు సెలవులను ప్రకటించారు. జనవరి 19న అనగా సోమవారం తిరిగి పాఠశాలలు ప్రారంభమవుతాయి. అయితే ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీలకు సెలవులపై స్పష్టత రావాల్సిఉంది.

ప్రయాణాలకు సిద్ధమవుతున్న జనం
ఈసారి లాంగ్ వీకెండ్స్, వరుస సెలవులు ఉండటంతో..అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణ ప్రజలు తమ సొంతూళ్లకు వెళ్లేందుకు ఇప్పటికే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పర్యాటక ప్రాంతాలకు వెళ్లాలనుకునే వారు కూడా ఈ 9 రోజుల విరామాన్ని అద్భుతంగా సద్వినియోగం చేసుకోవచ్చు.

గమనిక: ఇవి విద్యాశాఖ అంతర్గత వర్గాల సమాచారం ప్రకారం అంచనాలు మాత్రమే. అధికారిక తేదీల కోసం ప్రభుత్వం విడుదల చేసే జీవో (GO) కోసం వేచి చూడాల్సిందే.

Also Read: Samsung Galaxy S25 Ultra: శామ్‌సంగ్ లవర్స్‌కు పండగే..Galaxy S25 Ultraపై భారీ తగ్గింపు..కేవలం రూ.22,000 లకే?!

Also Read: Midday Meal Egg: స్కూల్ విద్యార్థులకు షాక్..మధ్యాహ్న భోజనంలో గుడ్లు బంద్! కొండెక్కిన కోడిగుడ్ల ధరలు!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
HDHarish Darla
Dec 26, 2025 10:26:11
Hyderabad, Telangana:

Samsung Galaxy S25 Ultra Offer Price: మీరు శామ్‌సంగ్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ కోసం ఎదురుచూస్తున్నారా? అయితే మీకు ఇది మంచి సమయం. ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ వెబ్‌సైట్, శామ్‌సంగ్ గెలాక్సీ S25 అల్ట్రా (Samsung Galaxy S25 Ultra) పై భారీ ధర తగ్గింపును ప్రకటించింది. ఇప్పుడు ప్రీమియం ఫీచర్లు కోరుకునే వారికి ఈ ఆఫర్ ఒక అద్భుత అవకాశంగా మారింది.

ధర, ఆఫర్ వివరాలు
లాంచ్ సమయంలో శామ్‌సంగ్ గ్యాలక్సీ ఎస్25 అల్ట్రా ధర రూ. 1,29,999 గా ఉండగా.. ఇప్పుడు అది భారీ తగ్గింపుతో లభించనుంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఇప్పుడు ఈ ఫోన్ రూ. 1,07,183 కే అందుబాటులో ఉంది. దీంతో నేరుగా రూ. 22,816 మేర ధర తగ్గింది. నెలకు కేవలం రూ. 3,769 నుండి ప్రారంభమయ్యే నో-కాస్ట్ EMI ఆప్షన్లు కూడా ఉన్నాయి.

ఎక్స్ఛేంజ్ ఆఫర్‌తో మరింత ఆదా!
మీ దగ్గర ఉన్న పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా ధరను ఇంకా తగ్గించుకోవచ్చు. మీ పాత ఫోన్ కండిషన్, మోడల్‌ను బట్టి గరిష్టంగా రూ. 57,400 వరకు ట్రేడ్-ఇన్ విలువ లభిస్తుంది. ఈ ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను కూడా వినియోగించుకుంటే, గెలాక్సీ S25 అల్ట్రాను అత్యంత తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు.

Samsung Galaxy S25 Ultra అదిరిపోయే ఫీచర్లు
ఈ ఫోన్ కేవలం ధరలో మాత్రమే కాదు, హార్డ్‌వేర్ విషయంలోనూ సూపర్ పవర్‌ఫుల్‌గా ఉంటుంది.

డిస్‌ప్లే: 6.9-అంగుళాల భారీ AMOLED స్క్రీన్ (120Hz రిఫ్రెష్ రేట్)

ప్రాసెసర్: అత్యంత వేగవంతమైన Qualcomm Snapdragon 8 Elite చిప్‌సెట్

మెమరీ: 16GB RAM, 1TB వరకు స్టోరేజ్ ఎంపికలు.

కెమెరా (క్వాడ్ సెటప్): 200MP మెయిన్ సెన్సార్ + 50MP అల్ట్రా-వైడ్ లెన్స్ + 50MP పెరిస్కోప్ కెమెరా + 10MP టెలిఫోటో లెన్స్ (3x ఆప్టికల్ జూమ్) + 12MP సెల్ఫీ కెమెరా 

బ్యాటరీ: 5000 mAh బ్యాటరీ (45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్)

OS: శామ్సంగ్ యొక్క సరికొత్త One UI 8 సాఫ్ట్‌వేర్.

కలర్స్: టైటానియం బ్లాక్, గ్రే, సిల్వర్ బ్లూ, వైట్ సిల్వర్ రంగుల్లో లభిస్తుంది.

నామమాత్రపు తగ్గింపుల కోసం కాకుండా, భారీ డిస్కౌంట్ కోసం ఎదురుచూసే కస్టమర్లకు ఇది బెస్ట్ డీల్. స్టాక్ ముగిసేలోపు ఈ ఆఫర్‌ను చెక్ చేసుకోండి.

Also Read: Prabhas Billa Actress: ప్రభాస్ సినిమాలో గ్లామర్ క్వీన్..12 సంవత్సరాల తర్వాత రీఎంట్రీ..బాంబు పేల్చిన హీరోయిన్!

Also Read: Midday Meal Egg: స్కూల్ విద్యార్థులకు షాక్..మధ్యాహ్న భోజనంలో గుడ్లు బంద్! కొండెక్కిన కోడిగుడ్ల ధరలు!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
RKRavi Kumar Sargam
Dec 26, 2025 09:13:22
Hyderabad, Telangana:

Telangana Bhavan: తన తండ్రిపై రేవంత్‌ రెడ్డి చేసిన బూతు వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు అన్నీ భాషలు.. అన్నీ భాషల్లో తాను మాట్లాడగలడనని.. కానీ తన నైజం అది కాదని కేటీఆర్‌ తెలిపారు. ఆ వ్యాఖ్యలు చూస్తుంటే ఎడమ కాలి చెప్పు తీసుకుని కొట్టాలని ఉంటది కానీ అలా చేయలేం కాదా? అని పేర్కొన్నారు. సీఎం పదవి వస్తే మంచిగా పని చేసుకో అని రేవంత్ రెడ్డికి హితవు పలికారు.

Also Read: Govt Employees: ప్రభుత్వ ఉద్యోగుల భారీ నిర్ణయం.. డీఏ, పీఆర్‌సీ, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ కోసం నిరసన

హైదరాబాద్‌లోని శేరిలింగంపల్లి నియోజకవర్గానికి చెందిన నాయకులు బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. జూబ్లీహిల్స్‌లోని పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కేటీఆర్‌ కీలక ప్రసంగం చేశారు. రేవంత్ రెడ్డి కొడంగల్‌ సభలో వాడిన భాషపై కేటీఆర్‌ మండిపడ్డారు. 'రేవంత్‌ను తిట్టాలని తనకు లేదు. తెలంగాణ తెచ్చిన నాయకుడు, రెండు సార్లు ప్రజలు గెలిపించిన ముఖ్యమంత్రి, మా నాయనను తిడితే కొడుకుకు ఆవేశం రాదా? రేవంత్ దొరికితే ఎడమ కాలి చెప్పు తీసుకు కొట్టాలని ఉంది. కానీ ఏం చేయాలి? ప్రజాస్వామ్యంలో ఉన్నాం' అని కేటీఆర్‌ తెలిపారు.

Also Read: Bandi Sanjay: నెల రోజుల్లో పంచాయతీలకు నిధులివ్వాల్సిందే! రేవంత్ రెడ్డికి బండి సంజయ్‌ సవాల్‌

'రేవంత్ రెడ్డి ఎక్కడి నుంచి వచ్చారు అసలు మీరు? మీ ప్రయాణం ఎక్కడ మొదలైంది? రోడ్ల మీద పెయింటింగ్స్ వేసుకునేటోడు రేవంత్ రెడ్డి. జీవితంలో ఎవరైనా చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయికి రావాలి, తప్పు లేదు. కానీ మంచి పనులు చేసి రావాలి. లంగ పనులు చేసి, దొంగ పనులు చేసి, బ్యాగులు మోసి, సంచులు మోసి, దొరికిపోయి, జైలుకు వెళ్లి మళ్లీ అదేదో పెద్ద గొప్ప విషయం అన్నట్టు  రేవంత్ రెడ్డి పోజులు కొడుతున్నారు' అని మాజీ మంత్రి కేటీఆర్‌ విమర్శించారు.

Also Read: Harish Rao: రైతులకు రేవంత్‌ రెడ్డి దగా.. 24 గంటల విద్యుత్‌ పచ్చి మోసం: హరీశ్ రావు

'ఢిల్లీలో పైసలు ఇచ్చి ముఖ్యమంత్రి పదవి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి సీఎం పదవిలో ఉన్నందుకు సంతోషపడాలి కానీ రోజూ ఈ ఏడుపు ఎందుకు?' అని రేవంత్ రెడ్డిని కేటీఆర్‌ ప్రశ్నించారు. 'హామీల అమలు  ఏమైంది అని అడిగితే 'నీ గుడ్లు పీకి గోటీలాడతా' అంటాడు. వీడెక్కడి ముఖ్యమంత్రి?' అని అసహనం వ్యక్తం చేశారు. 'రెండేళ్లల్లో  ఏం చేశావయ్యా అంటే 'లాగుల తోండలు విడిపిస్తా, పేగులు మెడలో వేసుకుంటా, గుడ్లు పీకి గోటీలాడతా'.. నీ అమ్మ, నీ అయ్య, గీదా నీ భాష? మాకు రాదా భాష? మాట్లాడమంటావా?' అని మాజీ మంత్రి కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

'నేను హైదరాబాద్ గల్లీల్లో పెరిగిన వాడిని. మాట్లాడమంటే ఉర్దూలో, హిందీలో, తెలుగులో, ఇంగ్లీషులో పొల్లు పోకుండా తిట్టే తెలివి నాకు కూడా ఉంది. కానీ నీకు కాదు, నీ కుర్చీకి గౌరవం ఇచ్చి ఊరుకుంటున్నాం. కనకపు సింహాసనమున శునకము కూర్చుండబెట్టినట్టుంది పరిస్ధితి' అని కేటీఆర్‌ పునరుద్ఘాటించారు. 'కాంగ్రెస్ నాయకులు బయటకు రా అంటే కేసీఆర్‌ వచ్చి ఒక ప్రెస్‌మీట్ పెట్టి పోయిండు. దానికే రేవంత్‌ రెడ్డికి ముచ్చెమటలు పట్టాయి, చలి జ్వరం వచ్చింది. దానికే అరుస్తున్న రేవంత్ రెడ్డి ఇప్పుడు అసెంబ్లీకి రా అంటున్నాడు. బయటకు వస్తేనే తట్టుకోలేకపోయాడు. ఇక కేసీఆర్‌ అసెంబ్లీకి వస్తే గుండె ఆగి రేవంత్ రెడ్డి చస్తాడు' అని కేటీఆర్‌ వివరించారు.

'నేను గుంటూరులో చదువుకున్నా అంటాడు. నేను గుంటూరులో చదువుకుంటే రేవంత్ కేమి నోప్పి .. నేను ప్రపంచమంతా చదువుకున్నా. రేవంత్  తల్లిదండ్రులు ఆయనకు చక్కటి తోవ చూపించలేదు నేనేం చేయాలి? నేను ఆంధ్రాకు పోయి ఇంటర్మీడియట్ చదువుకుంటే తప్పట! కానీ ఆయన ఆంధ్రాకెళ్లి అల్లుణ్ణి మాత్రం తెచ్చుకోవచ్చట' అని మాజీ మంత్రి కేటీఆర్‌ గుర్తుచేశారు. 'అందుకే ఇంకా రేవంత్ కు చిట్టి నాయుడి కాకుండా 'భీమవరం బుల్లోడు' అని పెడితే సరిపోతుంది' అని తెలిపారు.

'నేను మా నాయన (కేసీఆర్‌) పేరు చెప్పుకొని బతుకుతున్నా అంటాడు. అవును మా నాయన గొప్పోడు. మా నాయన తెలంగాణ తెచ్చిన మొగోడు, మొనగాడు. బరాబర్ చెప్పుకుంటా! తప్పేమున్నది? మా నాయన పేరు నేను కాకపోతే ఎవడు చెప్పుకుంటాడు నాకు అర్థం కాదు?' అని రేవంత్ రెడ్డి తీరుపై మాజీ మంత్రి కేటీఆర్‌ అసహనం వ్యక్తం చేశారు. 'నువ్వు సక్కటి పనులు చేస్తే నీ పిల్లలు కూడా నీ పేరు చెప్పుకుంటారు. నువ్వు లుచ్చా పనులు చేసినవనుకో నీ మనవడు కూడా నీ పేరు చెప్పడు' అని రేవంత్‌ రెడ్డికి చురుకులు అంటించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
Advertisement
Back to top