ఖమ్మం: నకిలీ వైద్యుడి గుట్టు రట్టు
Khammam, Telangana:ఖమ్మం జిల్లా వేంసూరు మండలం మర్లపాడు గ్రామంలో నకిలీ వైద్యుడు పట్టుబడ్డాడు. ఫార్మసీ చదివిన డాక్టర్ కరుణ ప్రసాద్ ఓపీ ఫీజు తీసుకుని చికిత్స అందిస్తున్నారు. గత పదేళ్లుగా ఇదే తంతు కొనసాగుతున్నా వైద్యాధికారులు కన్నెత్తి చూడలేదు. ఎంబీబీఎస్ వైద్యులు రూ.300 ఓపీ వసూలు చేస్తూ మందులు, ఇంజక్షన్లు ఇస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
Viral Video: ఫోన్లో మాట్లాడుతూ బిడ్డను ఫ్రిజ్లో పెట్టిన తల్లి..చివరికి బిడ్డ పరిస్థితి ఏమయ్యింది? వైరల్ వీడియో!
Hyderabad, Telangana:Baby In Fridge Video: స్మార్ట్ఫోన్ల వాడకం వచ్చిన తర్వాత ప్రపంచం మొత్తం మారిపోయింది. మన అరచేతిలో యావత్ ప్రపంచాన్ని చూసే అవకాశం వచ్చింది. కేవలం కాల్స్ మాట్లాడడమే కాకుండా.. మొబైల్ ఫోన్ల ద్వారానే మన పనుల్లో చాలా వరకు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మనలో చాలామంది దైనందికి జీవితంలో నేడు, చాలా మందికి మొబైల్ ఫోన్లు తప్పనిసరిగా మారాయి. ప్రస్తుతం మొబైల్స్ లేకుండా మన జీవితంలో ఒక్కపని కూడా ముందుకు సాగదు. చాలా మంది ఒక్క క్షణం కూడా తమ మొబైల్ ఫోన్లను వదిలిపెట్టలేని పరిస్థితి ఏర్పడింది.
మొబైల్ ఫోన్ల మితిమీరిన వాడకం మన ఆరోగ్యానికే కాక.. మన కళ్లకు కూడా హాని కలిగిస్తుంది. మొబైల్ వాడకం వల్ల చాలా మంది తీవ్రమైన ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈతరం చాలామంది పిల్లల నుంచి పెద్దల వరకు మొబైల్ ఫోన్ వాడకం వ్యసనంగా మారింది. స్మార్ట్ఫోన్ లేకుండా అస్సలు ఉండలేకపోతున్నారు. ఫోన్లను ఉపయోగిస్తూ.. ప్రపంచాన్నే మర్చిపోతున్నారు. మొబైల్ ఫోన్లకు బానిసలైన వారు తమ చుట్టూ ఏం జరుగుతుందో కూడా పట్టించుకోవడం లేదు. దీనికి ఉదాహరణగా ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వైరల్ అయిన వీడియో ప్రకారం.. ఒక మహిళ తన మొబైల్ ఫోన్లో మాట్లాడుతూ ఫ్రిజ్లో తన బిడ్డను ఉంచింది. అయితే ఫోన్లో కాల్ మాట్లాడుతూ నిమగ్నమైన ఆ మహిళ తన బిడ్డకు ఏం జరుగుతుందో అనే ధ్యాసే లేకుండా పోయింది. ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతూ తన బిడ్డను ఫ్రిజ్లో ఉంచే ఆ మహిళ తన మొబైల్ ఫోన్లో అలానే కొనసాగిస్తోంది.
ఫ్రిజ్లో బిడ్డను ఉంచిన ఆవిడ తన మొబైల్ ఫోన్లో మాట్లాడుతూనే ఉంది. ఆమె ప్రశాంతంగా సోఫాలో కూర్చుని మాట్లాడుతూనే ఉంది. ఈ సమయంలో అక్కడికి వచ్చిన ఆమె భర్త.. బిడ్డ అక్కడ లేకపోవడం చూసి ఖంగుతిన్నాడు. అతను ఆమెను, "బిడ్డ ఎక్కడ?" అని ప్రశ్నిస్తాడు. కానీ బిడ్డ గురించి ఏమాత్రం తెలియని ఆవిడ, తన మొబైల్ ఫోన్లో నిమగ్నమై ఉంది. ఈ సమయంలో మరింత ఆందోళనకు గురైన భర్త.. "ముందు, మొబైల్ ఫోన్లో మాట్లాడటం ఆపు" అని ఆమెను వారిస్తాడు. కానీ ఆవిడ తన భర్త మాట వినకుండా మొబైల్లో కాల్స్ మాట్లాడుతూనే ఉంటుంది. ఈ సమయంలో అతనికి కోపం వచ్చి తన భార్య చేతిలోంచి మొబైల్ ఫోన్ను లాక్కుంటాడు. ఈ సమయంలో బిడ్డ కనిపించకపోవడంతో తాను చేసిన తప్పుకు ఆవిడ తన తల బాదుకుంటుంది.
Horrible Addiction 😰 pic.twitter.com/D3Pl0a4rsv
— Prof cheems ॐ (@Prof_Cheems) March 30, 2024
ఈ సంఘటన ఎక్కడ జరిగిందో తెలియడం లేదు. కానీ @Prof_Cheems అనే ట్విట్టర్ ఖాతాలో ఈ వీడియో పోస్ట్ చేశారు. ఇప్పటికే ఈ వీడియోను లక్షలాది మంది వీక్షించగా.. వేలాది మంది కామెంట్స్ చేశారు. వైరల్ అయిన ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఈ విధంగా స్పందించారు. "మొబైల్ ఫోన్ను ఎక్కువగా వాడితే ఇలాగే జరుగుతుంది" అని కామెంట్ చేశారు. ఆ మహిళ చేసిన తప్పు పట్ల చాలా మంది ఆమెపై మండిపడ్డారు. మొబైల్ ఫోన్ను ఎక్కువగా వాడేవారు ఈ వీడియో చూసి చాలా నేర్చుకోవచ్చని కొందరు కామెంట్ చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Kondagattu: మతాలకతీతంగా..మారుతీ సేవలో.. హనుమాన్ దీక్ష చేపట్టిన ముస్లిం యువకుడు!
Kondagattu, Telangana:Kondagattu Telugu Latest News: కుల మతాలు వేరైనా దైవం ఒక్కటేనని.. మానవత్వమే మిన్న అని జగిత్యాల జిల్లాకు చెందిన ఒక ముస్లిం యువకుడు చాటి చెప్పారు. కొడిమ్యాల మండలం పూడూరు గ్రామానికి చెందిన మహమ్మద్ యూసుఫ్.. హనుమాన్ జయంతిని పురస్కరించుకొని 11 రోజులపాటు అత్యంత భక్తి శ్రద్దలతో హనుమాన్ దీక్షను చేపట్టి అందరి దృష్టిని ఆకర్షించారు.. మత సామరస్యానికి ప్రతీకగా.. నిలిచిన యూసుఫ్ ను గ్రామస్తులు అభినందనలతో ముంచేత్తుతున్నారు..
మహమ్మద్ యూసుఫ్ కేవలం దీక్షకే పరిమితం కాకుండా ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లోనూ.. చురుగ్గా పాల్గొన్నారు. ఇటీవల అయోధ్య నుంచి పూడూరు గ్రామం వరకు శ్రీరామచంద్రుడి పాదాలను పాదయాత్రగా తీసుకురావడంలో ఆయన కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా తన సొంత గ్రామమైన పూడూరులో నూతనంగా నిర్మిస్తున్న రామాలయ నిర్మాణ పనుల్లో స్వచ్ఛందంగా పాల్గొంటూ.. శ్రమదానం చేస్తూ తన భక్తిని చాటుకున్నారు..
హనుమాన్ జయంతి సందర్భంగా యూసుఫ్ కాళీ నడకన ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు అంజన్న సన్నిధిని చేరుకున్నారు.. 11 రోజులపాటు కఠిన నియమాలతో కూడిన దీక్షను పూర్తి చేసి.. స్వామివారిని దర్శించుకున్న అనంతరం మాలవిరమణ చేశారు.. కాషాయ వస్త్రాదరణలో.. నుదుట తిలకంతో హనుమాన్ నామస్మరణ చేస్తూ ఆయన కనిపిస్తుంటే.. అక్కడ ఉన్న భక్తులు ఆశ్చర్యంతో పాటు హర్షం వ్యక్తం చేశారు..
ఈ సందర్భంగా యూసుఫ్ మాట్లాడుతూ.. మతం ఏమైనా.. బోధించేది మంచినే.. మానవత్వంతో పాటు సోదర భావం కంటే మంచిది ఏదీ లేదు.. రాముడు, రహీం ఇద్దరు ఒకటేనన్న భావంతోనే నేను ఈ దీక్ష చేపట్టాను అని.. అన్నారు. గ్రామస్తులు స్పందిస్తూ.. మా గ్రామంలో యూసుఫ్ అందరితో కలిసి మెలిసి ఉంటాడు. ఇలాంటి వ్యక్తి సమాజానికి గొప్ప ఆదర్శం.. అన్ని మతాల సారాంశం ఒకటేనని ఆయన నిరూపించాడు. అని గ్రామస్తులు కొనియాడుతున్నారు.. ఇప్పుడు యూసుఫ్ జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారారు..
Read more: Scorpio, Ertiga సగం ధరకే.. ఢిల్లీ కార్ బజార్లో రూ.30 వేలకే కారు మీ సొంతం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Car Deals: రూ. 11 లక్షలకే మహీంద్రా థార్.. రూ. 3 లక్షలకే డిజైర్! ఎక్కడో తెలుసా?
Hyderabad, Telangana:Best Second Hand Car Showroom Delhi: సొంత కారు ఉండాలని ప్రతి సామాన్యుడి చిరకాల కల.. కానీ పెరుగుతున్న ధరల దృశ్య కొత్త కారు కొనడం అందరికీ సాధ్యం కావడం లేదు.. ముఖ్యంగా మధ్యతరగతి వారికైతే అస్సలు సాధ్యం అవడం లేదు. ఇలాంటి వారి కోసం దేశ రాజధాని ఢిల్లీలోని నేతాజీ సుభాష్ ప్లేస్ (NSP)లో ఉన్న సెకండ్ హ్యాండ్ కార్ షోరూమ్స్ అద్భుతమైన ఆఫర్స్తో ముందుకొస్తున్నాయి. అత్యంత తక్కువ ధరల్లోనే కార్లను విక్రయిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా కొన్ని కార్లు అయితే ఇక్కడ కేవలం రూ.40 వేల రూపాయలకే లభించడం విశేషం. మంచి కండిషన్ కలిగిన సెకండ్ హ్యాండ్ కార్లు కేవలం రూ.50 వేల లోపే అందుబాటులో ఉండి.. మధ్యతరగతి వినియోగదారుడు కలను నెరవేర్చుతున్నాయి. మీరు కూడా మంచి కారు కొనుగోలు చేయాలనుకుంటే ఇదే బెస్ట్ ప్లేస్..
ముఖ్యంగా ఈ ప్రాంతాల్లో ఉన్న సెకండ్ హ్యాండ్ కార్ల షోరూంలో బడ్జెట్ కార్ల నుంచి లగ్జరీ ఎస్యూవీల వరకు అన్నీ లభిస్తున్నాయి.. ముఖ్యంగా యువతను ఆకట్టుకునే మహింద్రా తార్ 2024 మోడల్ కేవలం రూ.11 లక్షల రూపాయల నుంచే ప్రారంభం అవ్వడం విశేషం. ఫ్యామిలీ కార్లలో టాప్ గేర్లో ఉన్న మారుతీ సుజుకి డిజైర్ సిఎన్జీ మోడల్ రూ.3.15 లక్షల నుంచే ప్రారంభమవుతోంది. ఇవే కాకుండా మల్టీ నేషనల్ బ్రాండ్లకు సంబంధించిన లగ్జరీ కార్లు కేవలం ఇక్కడ రూ.10 లక్షల నుంచి ప్రారంభమవుతున్నాయి. కాబట్టి మంచి కారు కొనాలనుకునేవారు తప్పకుండా ఒకసారి ఈ మార్కెట్ను సందర్శించండి..
ఢిల్లీలోని నేతాజీ సుభాష్ ప్లేస్లో ఉన్న కొన్ని సెకండ్ హ్యాండ్ కార్ల షోరూంలో మారుతి బ్రెజ్జా 2017 మోడల్ ZDI ప్లస్ వేరియంట్ కేవలం రూ.4 లక్షలకే లభిస్తోంది. అంతేకాకుండా దీనికి సర్వీస్ రికార్డ్స్ తో పాటు వివిధ రకాల స్పెసిఫికేషన్స్ ను అందిస్తున్నారు. ఇక డిజిటల్ ఆటోమేటిక్ వేరియంట్ టాటా నెక్సాన్ కేవలం ఇక్కడ రూ.5 లక్షల నుంచి అందుబాటులో ఉంది. దీంతోపాటు 2020 మోడల్ పనోరమిక్ సన్రూఫ్ కలిగిన కారు ఎంజీ హెక్టర్ కేవలం రూ.8 లక్షల నుంచి అందుబాటులో ఉంది. దీంతోపాటు మారుతి ఆల్టో కేవలం ఇక్కడ రూ.3 లక్షల లోపు.. టాటా టియాగో 2 లక్షల లోపు అందుబాటులో ఉండడం విశేషం..
Read more: Scorpio, Ertiga సగం ధరకే.. ఢిల్లీ కార్ బజార్లో రూ.30 వేలకే కారు మీ సొంతం!
ఇక్కడ లభించే ప్రతి కారు నాని యాక్సిడెంట్ అని.. ఇంజన్ కండిషన్ చాలా బాగుంటుందని ఈ షోరూమ్స్ను రన్ చేస్తున్న నిర్వాహకులు చెబుతూ ఉన్నారు. అంతేకాకుండా కొన్ని రకాల కార్లకు సంబంధించిన ఇంజన్లపై ప్రత్యేకమైన వారంటీని కూడా అందిస్తున్నారు. కేవలం తక్కువ ధరలకే కాకుండా కారు కొనుగోలు చేసిన తర్వాత ట్రాన్స్ఫర్ బాధ్యత కూడా ఈ షోరూంలదేనని వారు చెబుతున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారి కోసం ఎన్ఓసి సదుపాయాన్ని కూడా అందిస్తున్నారు. దీంతోపాటు రవాణా సౌకర్యంతో పాటు బ్యాంకు లోన్ సదుపాయాన్ని కూడా అందిస్తున్నారు. తక్కువ మార్జిన్తో ఎక్కువ మంది కస్టమర్లకు చేరువ కావాలనే లక్ష్యంతో ఈ ధరల్లో కార్లను విక్రయించుకున్నట్లు అక్కడి షో రూమ్స్ యజమానులు చెబుతున్నారు..
Read more: Scorpio, Ertiga సగం ధరకే.. ఢిల్లీ కార్ బజార్లో రూ.30 వేలకే కారు మీ సొంతం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Siddipet: ప్రేమ గెలిచింది.. కానీ ప్రాణాలు పోయాయి! ప్రేమకు బలైన నిండు ప్రాణాలు..
Hyderabad, Telangana:Lovers Death Within Two Days In Cherial: సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం ముస్త్యాల గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. ప్రాణంగా ప్రేమించుకున్న ఇద్దరు యువతి యువకులు.. తమ పెళ్లి జరగదన్న ఆందోళనతో మృతి చెందారు. రెండు రోజుల వ్యవధిలో ప్రేమికులిద్దరూ చనిపోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అసలు వీరిద్దరి మరణానికి ప్రధాన కారణం ఏంటి? పోలీసుల దర్యాప్తులో ఏం తేలింది? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..
ముస్త్యాల విలేజ్ కి చెందిన రాకేష్.. అదే గ్రామానికి చెందిన హారిక గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని భావించినప్పటికీ.. పెద్దలు అంగీకరిస్తారో లేదో నాన్న సందేహం వారిని వేధించింది.. తమ ప్రేమ వివాహం కాదేమోనని బెంగతో తీవ్ర మనస్థాపానికి గురైన రాకేష్.. రెండు రోజుల క్రితం ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకి పాల్పడ్డాడు.. గమనించిన కుటుంబ సభ్యుల ఆసుపత్రికి తరలించినప్పటికీ చికిత్స పొందుతూ రాకేష్ మృతి చెందాడు..
కళ్ళ ముందే ప్రియుడు విగత జీవిగా మారడాన్ని హారిక మనసు తట్టుకోలేకపోయింది.. రాకేష్ లేని జీవితం తనకు వద్దని భావించిన ఆ యువతి.. తీవ్ర విషాదంలో మునిగిపోయింది.. రాకేష్ మరణించిన బాధ నుంచి కోలుకోక ముందే.. హారిక గురువారం ఫ్యాన్ కు ఉరేసుకొని..ఆత్మహత్య చేసుకుంది. కొద్దిసేపటి తర్వాత గమనించిన కుటుంబ సభ్యులు కన్నీరు నీరయ్యారు.. ఒకే గ్రామంలో ఇద్దరు ప్రేమికులు మృతి చెందడంతో స్థానికులు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
సమాచారం అందుకున్న చేర్యాల పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీస్ అధికారులు తెలిపారు. ప్రేమ వ్యవహారంలో పెళ్లి కాదన్న భయంతోనే వీరిద్దరూ ఈ అఘాయిత్యానికి పాల్పడ్డట్లు ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసులు వెల్లడించారు..
Read more: Scorpio, Ertiga సగం ధరకే.. ఢిల్లీ కార్ బజార్లో రూ.30 వేలకే కారు మీ సొంతం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Hanuman Shobha Yatra 2026: హనుమాన్ శోభాయాత్రలో డ్యాన్స్ తో అదరగొట్టిన మహిళా మణులు
Hyderabad, Telangana:Hyderabad Hanuman Shobha Yatra 2026: హైదరాబాద్లో హనుమాన్ జయంతి సందర్భంగా శ్రీ వీర హనుమాన్ విజయ యాత్రకు ఘనంగా జరిగింది. ఈ శోభాయాత్రలో భాగంగా ఎటు చూసినా సందడిగా డ్యాన్స్లు చేస్తున్నారు.Samantha YMC Tattoo: రెండో పెళ్లైనా నాగచైతన్యని మర్చిపోలేని సమంత..తన గుర్తుగా ఇప్పటికీ అలాగే..వీడియో వైరల్!
Hyderabad, Telangana:Samantha YMC Tattoo News: చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా ఎదిగిన సమంత.. సినిమాలతో పాటు తన వ్యక్తిగత జీవితం గురించి తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. ఇటీవలే ఆమె తన రెండో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టగా.. అయితే తన మాజీ భర్త జ్ఞాపకాలను ఇప్పటికీ కొనసాగిస్తుందని సోషల్ మీడియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అక్కినేని నాగచైతన్యతో ఉన్న పచ్చబొట్టు జ్ఞాపకాన్ని ఇప్పటకీ తొలగించకపోవడంతో ఇప్పుడు అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
తెలుగు, తమిళంతో పాటు హిందీ, కన్నడ, మలయాళ చిత్రపరిశ్రమల్లోనూ హీరోయిన్ సమంత సుపరిచితమే. 'ఏమాయ చేశావే' సినిమాతో హీరోయిన్గా అరంగేట్రం చేసిన సమంత.. ఆ తర్వాత అనేక సినిమాలతో తెలుగుతో పాటు తమిళ ప్రేక్షకులకు దగ్గరైంది. 'ఏమాయ చేశావే' సినిమా హిట్ తర్వాత సమంత వరుసపెట్టి స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్గా ఛాన్స్ దక్కించుకుంది.
'ఏమాయ చేశావే', 'బృందావనం', 'దూకుడు', 'ఈగ', 'ఎటో వెళ్లిపోయింది మనసు', 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' వంటి తెలుగు హిట్ చిత్రాలలో నటించిన నటి సమంత.. ఆ తర్వాత తమిళంలో 'కత్తి', 'తేరి', 'మెర్సల్' వంటి అనేక పెద్ద హిట్ చిత్రాలలో నటించింది. 2017లో హీరో నాగచైతన్యని వివాహం చేసుకుంది. ఆ తర్వాత ఆ పెళ్లి మూడునాళ్ల ముచ్చటగా మారింది. 2021లో వీరిద్దరూ విడాకులు తీసుకొని విడిపోయారు.
సమంత - నాగ చైతన్యల విడాకుల వార్త వారి ఫ్యాన్స్, చిత్రసీమను షాకింగ్కు గురిచేసింది. ఈ విడాకుల తర్వాత సమంత హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ వచ్చింది. అయితే దాదాపుగా ఆ సినిమాలన్నీ బాక్సాఫీసు వద్ద విఫలం అయ్యాయి. ఆ తర్వాత, ఆమెకు మయోసైటిస్ అనే కండరాల క్షీణత వ్యాధి బారిన పడింది. అందుకు తగిన చికిత్స తీసుకున్న ఇప్పుడు ఆమె ఆరోగ్యంగానే ఉంది. ఈ చికిత్స తీసుకునే క్రమంలో ఆమె కొన్నిరోజుల పాటు విరామాన్ని తీసుకుంది. తాజాగా ఆమె 'మా ఇంటి బంగారం' సినిమాలో నటిస్తోంది.
రెండవ వివాహం..
సమంత గత ఏడాది డిసెంబర్ 1న ప్రముఖ దర్శకుడు, నిర్మాత రాజ్ నిడిమోరును రెండో పెళ్లి చేసుకుంది. సమంత నటించిన 'సిటాడెల్' అనే వెబ్ సిరీస్కు రాజ్ నిడిమోరు దర్శకత్వం వహించారు. అంతకు ముందు వీరిద్దరూ కలిసి 'ది ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్ సిరీస్లో నటించింది. ఆ సమయంలో వారిద్దరి మధ్య ఏర్పడిన స్నేహం.. ప్రేమకు దారితీసింది. తాజాగా గతేడాది కోయంబత్తూరులోని ఈశా యోగా సెంటర్లో కొందరు బంధువుల సమక్షంలో వారి వివాహం జరిగింది. దీనికి ముందు, సమంత మాజీ భర్త, నటుడు నాగ చైతన్య హీరోయిన్ శోభితను రెండో వివాహం చేసుకున్నారు. అయితే అది కూడా ప్రేమ వివాహం కావడం గమనార్హం.
నాగ చైతన్య జ్ఞాపకం!
సమంత ఒక ప్రేమ సంబంధంలో ఉన్నప్పుడు తన ఛాతీ, నడుముపై నాగ చైతన్య పేరును పచ్చబొట్టుగా వేయించుకుంది. ఆమె దానికి సంబంధించిన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ను కూడా ఇంకా తొలగించలేదు. అదేవిధంగా ఆమె మెడ వెనుక భాగంలో YMC (ఏమాయ చేశావే) టాటూ ఉంది. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలుగు రీమేక్లో సమంత, నాగ చైతన్య కలిసి నటించారు. అయితే వీరిద్దరికి ఇది తొలి హిట్ చిత్రం కావడం విశేషం. అందుకు గుర్తుగా ఆ సినిమా పేరును ఆమె మెడ భాగంలో టాటూ వేయించుకుంది. కొన్ని వారాల క్రితం.. ఆమె ఈ టాటూను తొలగించుకుందని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే, ప్రస్తుతం సమంతకు సంబంధించిన ఒక తాజా వీడియో ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. అందులో ఆమె మెడ వెనుక భాగంలో 'YMC' టాటూ ఇంకా ఉన్నట్లు కనిపిస్తోంది. నాగ చైతన్య జ్ఞాపకంగా వేయించుకున్న టాటూను ఆమె ఇంకా తొలగించుకోలేదనే విషయంపై ఇంటర్నెట్లో చాలా మంది మాట్లాడుకుంటున్నారు.
నటి సమంత ప్రస్తుతం రాజ్ నిడిమోరును వివాహం చేసుకుంది. అయితే వారిద్దరికీ ఇది రెండో పెళ్లి కావడం గమనార్హం. అతని మాజీ భార్య పేరు శ్యామిలి. వారు కలిసి ఉన్నప్పుడు సమంత అతనికి స్నేహితురాలిగా ఉండేదని చెబుతారు. వారు విడిపోయిన తర్వాతే అతను సమంతకు దగ్గరయ్యాడని సమాచారం. అయితే వారిద్దరూ ఈ విషయంపై బహిరంగంగా మాట్లాడకపోవడం గమనార్హం.
నటి సమంత ఇతర చిత్రాలలో నటించకపోయినా.. తన సొంత చిత్రంలో నటిస్తోంది. ఇటీవలే ఆమె నటించి, నిర్మించిన తెలుగు చిత్రం 'శుభం' విడుదలైంది. అందులో ఆమె అతిథి పాత్రలో కనిపించింది. ఆ తర్వాత ఆమె ప్రస్తుతం 'మా ఇంటి బంగారం' చిత్రంతో బిజీగా ఉంది. ఇది కూడా లేడీ ఓరియెంటెడ్ సినిమా. అంతేకాకుండా ఆమె పాడ్కాస్ట్లు, జిమ్, వర్కౌట్ వంటి కార్యకలాపాలలో కూడా పాల్గొంటోంది. ఆమెకు సొంతంగా పెర్ఫ్యూమ్ బ్రాండ్ కూడా ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Abhishek Sharma Fined: ఐపీఎల్లో అభిషేక్ శర్మకు ఎదురుదెబ్బ..మ్యాచ్ గెలిచినా తప్పని తిప్పలు..జరిమానా కట్టాల్సిందే!
Kolkata, West Bengal:Abhishek Sharma Fined In IPL 2026: ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా నిన్న ఏప్రిల్ 2న ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్కతా నైట్ రైడర్స్, సన్రైజర్స్ హైదరాబాద్ టీమ్ మధ్య ఆసక్తికర పోరు జరిగింది. ఈ మ్యాచ్లో హైదరాబాద్ 65 రన్స్ భారీగా తేడాతో ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ సీజన్లో సన్రైజర్స్ తొలి బోణీ కొట్టింది. అయితే తొలి గెలుపు ఆనందంలో ఉన్న ఎస్ఆర్హెచ్ ఓపెనర్ అభిషేక్ శర్మకు మాత్రం ఎదురుదెబ్బ తగిలింది. అభిషేక్ శర్మ మ్యాచ్ ఫీజులో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) గట్టి షాక్ ఇచ్చింది. ఐపీఎల్ నిబంధనలను ఉల్లఘించిన కారణంగా మ్యాచ్ ఫీజులో కోత విధిస్తున్న ఐపీఎల్ నిర్వాహకులు తెలిపారు.
ఏం జరిగిందంటే?
ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్కతా నైట్రైడర్స్తో జరిగిన మ్యాచ్లో అభిషేక్ శర్మ ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్లు ఐపీఎల్ నిర్వాహకులు తేల్చారు. అందుకు అనుగుణంగా అభిషేక్ మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధించేందుకు బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు అభిషేక్ శర్మకి కూడా తన ఖాతాలో ఒక డీమెరిట్ పాయింట్ బీసీసీఐ చేర్చింది. ఐపీఎల్ రూల్స్లోని ఆర్టికల్ 2.3 కింద లెవెల్ 1 నేరానికి పాల్పడినట్లు అభిషేక్ శర్మ అంగీకరించినట్లు తేలింది. మ్యాచ్ రిఫరీ విధించిన జరిమానాకు అభిషేక్ శర్మ స్వీకరించడంతో ఇందులో తదుపరి విచారణ లేకుండా పోయింది.
ఎందుకు ఈ జరిమానా?
అయితే అభిషేక్ శర్మ ఏ కారణంగా జరిమానా విధించారో అనే విషయాన్ని ఐపీఎల్ తన అధికారిక ప్రకటనలో స్పష్టంగా చెప్పలేదు. అయితే ఆర్టికల్ 2.3 అనేది సాధారణంగా మ్యాచ్ జరగుతున్న సమయంలో అనుచిత భాషను మాట్లాడినా.. లేదా అసభ్య పదజాలంతో దూషించే వంటి అంశాలు ఈ రూల్ కిందకి వస్తాయి. అయితే అభిషేక్ శర్మ వికెట్ పడిన క్రమంలో అది నాటౌట్ను అంపైర్ ఔట్గా ప్రకటించడంపై తీవ్ర నిరాశకు లోనయ్యాడు. దీంతో ఆ ఉద్వేగభరిత క్షణంలో అభిషేక్ శర్మ నోరు జారినట్లు చెబుతున్నారు. అయితే ఆ సంఘటన ఈ జరిమానాకు కారణం అయ్యిండొచ్చని చెబుతున్నారు.
ఓ వైపు జరిమానా విధించినా.. మరోవైపు అభిషేక్ శర్మ కోల్కతా నైట్రైడర్స్తో జరిగిన మ్యాచ్లో అద్భుతంగా రాణించాడు. కేవలం 21 బంతుల్లో 48 పరుగులు (4 సిక్సర్లు, 4 ఫోర్లు) రాబట్టి.. సన్రైజర్స్ హైదరాబాద్ భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. అయితే ఇదే తరుణంలో అభిషేక్ ఓ అరుదైన మైలురాయిని చేరాడు. సన్రైజర్స్ టీమ్ తరఫున 100 సిక్సర్లు బాదిన రికార్డు గతంలో డేవిడ్ వార్నర్ ఖాతాలో ఉండగా.. ఇప్పుడు దాన్ని అభిషేక్ శర్మ (మొత్తం 101 సిక్సర్లు) చేరుకున్నాడు. ఎంతో ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ నిర్దేశించిన 227 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించలేక కేకేఆర్ 16 ఓవర్లలోనే 161 పరుగులకే ఆలౌట్ అయ్యింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Mahabubnagar: ఒక చిన్న మార్పు.. ఎన్నో ప్రాణాలకు రక్షణ.. వెంకట్రాంపురం గ్రామస్తులకు హ్యాట్సాఫ్!
Hyderabad, Telangana:Mahabubnagar Latest Telugu News: సాధారణంగా గ్రామ పొలిమేరలో మా ఊరికి స్వాగతం అని రాసి ఉన్న బోర్డులను మనం తరచుగా చూస్తూ ఉంటాం..కానీ మహబూబ్నగర్ జిల్లా వయ్యారం మండలం వెంకట్రాంపురం గ్రామం శివారులోకి వెళ్తే మాత్రం పరిస్థితి భిన్నంగా కనిపిస్తుంది.. హెల్మెట్ లేని వాహనదారులకు మా గ్రామంలోకి ప్రవేశం లేదు అంటూ అక్కడ వెలసిన బ్యానర్లు ఇప్పుడు అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఇప్పుడు ఈ బ్యానర్లు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీ అంశానికి దారితీస్తున్నాయి. ఆ ఊరిలో ఈ బ్యానర్లు వెలవడానికి గల కారణాలేంటి? అసలు వీటిని ఎవరు పెట్టారు? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..
గత కొంతకాలంగా మండల వ్యాప్తంగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో హెల్మెట్ లేకపోవడం వల్లే అనేకమంది యువకులు ప్రాణాలు కోల్పోవడం.. తీవ్రమైన తల గాయాలతో మంచాన పడటం చూసి గ్రామస్తులు చలించి పోయారు.. ప్రాణ నష్టం జరిగినప్పుడు ఆ కుటుంబాలు పడే వేదనను కళ్లారా చూసిన ఊరి పెద్దలతో పాటు యువకులు కలిసి ఒక గట్టి నిర్ణయం తీసుకున్నారు.. కేవలం జరిమానాల కోసం కాకుండా.. ప్రాణ రక్షణ కోసమే హెల్మెట్ ధరించాలని స్పృహను కల్పించేందుకు ఈ వినూత్న నిరసనను చేపట్టినట్లు తెలుస్తోంది.
గ్రామ శివారులో బుధవారం గ్రామస్తులందరూ కలిసి ప్రధాన రహదారిపై ఒక భారీ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు హెల్మెట్ లేకుండా మా గ్రామంలోకి రావద్దు అంటూ స్పష్టమైన హెచ్చరికను అందులో పేర్కొన్నారు.. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని.. బయటి వ్యక్తులైన గ్రామస్తులైన ఈ రూల్ కు అతిథులు కారని.. నిబంధనలు పాటించని వారిని గ్రామస్తులు సరిహద్దుల పట్టే అడ్డుకోవడం జరుగుతుందని.. అక్కడి గ్రామస్తులు తెలిపారు..
గ్రామస్తులు స్వచ్ఛందంగా తీసుకున్న ఈ నిర్ణయం పై పోలీసు యంత్రాంగం హర్షం వ్యక్తం చేస్తోంది. సాధారణంగా పోలీసులు హెల్మెట్ పెట్టుకోమని చెబితే వినని ఈ రోజుల్లో.. ఒక గ్రామమే ఏకగ్రీవంగా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అభినందనీయమని అధికారులు పేర్కొన్నారు. చట్టం తన పని తాను చేస్తుంది.. కానీ ప్రజల్లో వచ్చే ఇలాంటి మార్పు శాశ్వత పరిష్కారాన్ని అందిస్తుందని.. స్థానికంగా ఉన్న పోలీస్ అధికారులు చెబుతూ వస్తున్నారు..
వెంకట్రాంపురం గ్రామస్తుల ఆలోచన ఇప్పుడు చుట్టుపక్కల గ్రామాలకు కూడా పాకుతోంది.. ఒక చిన్న మార్పు పెద్ద ప్రాణాలను కాపాడుతుందని నమ్మకంతో వారు చేస్తున్న ఈ ప్రయత్నం విజయవంతం కావాలని అందరూ కోరుకుంటున్నారు.. ఈ గ్రామం చూపిన బాటలో మరిన్ని గ్రామాలు పయనిస్తే రోడ్డు ప్రమాదాల రహిత సమాజం తప్పకుండా సాధ్యమవుతుందని కొంతమంది అధికారులు చెబుతున్నారు.
Read more: Scorpio, Ertiga సగం ధరకే.. ఢిల్లీ కార్ బజార్లో రూ.30 వేలకే కారు మీ సొంతం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Mangala Aditya Rajayoga 2026: ఈ 4 రాశుల వారికి రాజభోగాలు.. మంగళ ఆదిత్య రాజయోగం తెచ్చే అద్భుత ఫలితాలివే!
Hyderabad, Telangana:Mangala Aditya Rajayoga 2026 Effect On Zodiac Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహ గమనాలు మానవ జీవితం పై తీవ్ర ప్రభావాన్ని చూపుతూ ఉంటాయి. 2026 సంవత్సరంలో గ్రహాలు కలయిక వల్ల అత్యంత శక్తివంతమైన మంగళ ఆదిత్య రాజయోగం ఏర్పడబోతోంది. సూర్యుడు, కుజుడు ఒకే రాశిలో కలయిక జరపడం వల్ల ఏర్పడే ఈ రాజయోగం అన్ని రాశుల వారిపై సమాన ప్రభావం చూపుతుంది. కానీ ఈ సమయంలో నాలుగు రాశుల వారు అదృష్టవంతులు కాబోతున్నారని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఎందుకంటే ఈ సమయంలో అదృష్టం వరించడంతో కొన్ని రాశుల వారికి ఎన్నో రకాల సమస్యలు పూర్తిగా తొలగిపోతున్నాయి అంతేకాకుండా జీవితం కూడా చాలా అద్భుతంగా సాగిపోతోంది.. అయితే, ఈ సమయంలో అత్యధిక లాభాలు పొందబోతున్న రాశులేవో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ రాశులవారికి లాభాలే లాభాలు:
మేషరాశి
మేష రాశిలో జన్మించిన వ్యక్తులకు ఆదిత్య మంగళ రాజయోగం వల్ల అద్భుతమైన వృద్ధి కనిపిస్తుంది. అంతేకాకుండా నిలిచిపోయిన పనులు వేగవంతంగా పూర్తి అవుతాయి.. గతంలో నుంచి చేస్తున్న పనులు కూడా ఇప్పుడు చివరి స్థాయికి చేరుకుంటాయి. అలాగే ఉద్యోగులకు ప్రమోషన్స్ కూడా లభిస్తాయి. జీతాలు కూడా పెరుగుతాయి. అంతేకాకుండా అనుకోకుండా సమాజంలో గౌరవం విపరీతంగా పెరుగుతుంది.
సింహరాశి
సింహరాశిలో జన్మించిన వ్యక్తులకు ఆర్థిక పరిస్థితి ఊహించని విధంగా మెరుగుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది సరైన సమయంగా భావించవచ్చు. తండ్రి వైపు నుంచి ఉన్న ఆస్తులు కూడా భారీ మొత్తంలో పొందగలుగుతారు. అంతేకాకుండా విద్యార్థులు పోటీ పరీక్షల్లో అద్భుతమైన విజయాలు సాధించగలుగుతారు. అలాగే అనుకుంటున్న పనుల్లో విపరీతమైన ధన లాభాలు పొందే అవకాశాలు కూడా ఉన్నాయి.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో ఆదిత్య మంగళ రాజయోగం రాజభోగాలను తెచ్చి పెట్టబోతోందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా స్థిరాస్తి వివాదాలు పూర్తిగా పరిష్కారం కాబోతున్నాయి. కొత్త ఇళ్లతో పాటు వాహనాలు కూడా కొనుగోలు చేసే సూచనలు బలంగా ఉన్నాయి. అంతేకాకుండా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నప్పటికీ అద్భుతమైన ధన లాభాలు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఆర్థికంగా కూడా ఈ సమయంలో విశేషమైన ప్రయోజనాలు పొందుతారు.
ధనస్సు రాశి
ధనస్సు రాశిలో జన్మించిన వ్యక్తులకు విదేశీ ప్రయాణాలు చాలా అద్భుతంగా మారబోతున్నాయి. ముఖ్యంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి కూడా విపరీతంగా పెరుగుతుంది. పెట్టుబడిల నుంచి భారీ మొత్తంలో లాభాలు పొందగలుగుతారు. కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతోపాటు అనేక సమస్యలు పరిష్కారం కాబోతున్నాయని జ్యోతిష్యులు చెబుతున్నారు.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Hanumakonda: స్విమ్మింగ్ పూల్లో శవాలై తేలిన తల్లీకూతుళ్ల కేసులో వీడిన మిస్టరీ.. హతమార్చింది అతడే!
Hyderabad, Telangana:Mother And Two Children Swimming Pool Death Update: హనుమకొండ జిల్లాలో జరిగిన స్విమ్మింగ్ పూల్ మృతదేహాల ఘటనలో మిస్టరీ వీడింది. ఈ దారుణం మళ్ళీ ఆడపిల్ల పుడుతుందనే భయంతోనే భార్యా, ఇద్దరు కూతుర్లను హతమార్చింది భర్త అజారుద్దీన్ అని తేలింది. పోలీసుల ప్రకారం.. ఐనవోలు మండలం పున్నేలు గ్రామ శివారులో నిన్న స్విమ్మింగ్ పూల్ లో విగత జీవులుగా ఈ ఫర్హాత్ (26), ఆమె కుమార్తెలు పడి ఉన్నారు. భార్యకు రెండుసార్లు అబార్షన్ చేయించాడు భర్త అజారుద్దీన్. అయితే, 4 ఏళ్ల తర్వాత మళ్లీ భార్య గర్భం ధరించింది. దీంతో మళ్ళీ అమ్మాయే పుడుతుందనే భయంతో భార్యతో పాటు ఇద్దరు కూతురు ప్రాణాలు కూడా తీశాడు. అయితే స్విమ్మింగ్ పూల్లో ప్రమాదవశాత్తు పడ్డారని పోలీసులును నమ్మబలికాడు. తమదైన స్టైల్ లో పోలీసులు విచారంగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
ఆడపిల్ల పుడుతుందని మరోసారి స్కానింగ్ చేయించాడా? లేదా? అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతం పోలీసుల అదుపులో అజారుద్దీన్ ఉన్నాడు. విచారణ చేస్తున్నారు. అయితే కుటుంబీకుల ప్రకారం కొన్ని రోజులుగా వీరి మధ్య గొడవలు కూడా జరుగుతున్నాయని సమాచారం. అందుకే కూతురు, మనవరాళ్ల మృతి పై కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఫరాద్ తల్లిదండ్రులు.
Also Read: తిరుమలకు వెళ్తుండగా ఘోర విషాదం.. కుటుంబాన్ని చిదిమేసిన కారు ప్రమాదం, ముగ్గురి స్పాట్ డెడ్..!
Also Read: ఇన్స్టాగ్రామ్ ప్రేమ విషాదాంతం.. యువకుడితో కలిసి కాలువలోకి దూకి వివాహిత ఆత్మహత్య..!
ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. ఇక మృతదేహాలను నిన్న పోస్టుమార్టం నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అయితే మొదటగా వారిది ప్రమాదవశాత్తు మరణంగా బుకాయించాడు అజారుద్దీన్. తాను ఫోన్ లో మాట్లాడుతున్న సమయంలో ఈ సంఘటన జరిగింది. తిరిగి వచ్చేసరికి ముగ్గురు నీళ్లలో పడి ఉండటంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని చెప్పాడు. అయితే ఫర్హాత్ ,అజారుద్దీన్ కొన్ని రోజులుగా గొడవలు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే అబార్షన్లు కూడా జరిగిన విషయం తెలుసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆడపిల్ల పుడుతుందని కొన్ని రోజులుగా వేధిస్తున్నట్లు వారు పోలీసులకు తెలిపారు. ఘటన స్థలంలో ఉన్న సీసీటీవీ ఫూటేజీ కూడా నిన్న పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పిల్లలు స్విమ్మింగ్ పూల్ లో పడటంతో వారిని కాపాడే ప్రయత్నంలో తల్లి కూడా పడిపోయిందని అంత భావించారు. తాజాగా భర్త అజారుద్దీన్ వారిని హత్య చేశారని అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Hanuman Shobha Yatra 2026: హనుమాన్ శోభాయాత్రలో మహిళల సందడి..కోలాటంతో ఆకట్టుకున్న వనితలు!
Hyderabad, Telangana:Hyderabad Hanuman Shobha Yatra 2026: హైదరాబాద్లో హనుమాన్ జయంతి సందర్భంగా శ్రీ వీర హనుమాన్ విజయ యాత్రకు ఘనంగా జరిగింది. ఈ శోభాయాత్రలో పాల్గొన్న హిందూ మహిళలు కోలాటంతో సందడి చేశారు.Good Friday Holiday 2026: నేడు వారంలో రెండో సెలవు..నిలిచిపోనున్న స్టాక్ మార్కెట్లు..రేపు స్టాక్ ఎక్స్ఛేంజ్ ఉంటుందా?
Mumbai, Maharashtra:Stock Market Holiday Today: గుడ్ ఫ్రైడే సందర్భంగా భారత స్టాక్ మార్కెట్ ఈరోజు అనగా శుక్రవారం ఏప్రిల్ 3, 2026న మూతపడనుంది. ఈరోజు స్టాక్ మార్కెట్ సెలవుదినం కారణంగా ప్రధాన స్టాక్ ఎక్స్ఛేంజీలైన BSE, NSEలలో ట్రేడింగ్ కార్యకలాపాలు నిలిపివేయనున్నారు. ఈ వారంలో ఇది రెండవ మార్కెట్ సెలవు, అయితే అదే విధంగా ఏప్రిల్ నెలలో మొదటిది. ఈ వారం ప్రారంభంలో మహావీర్ జయంతి సందర్భంగా మార్చి 31న స్టాక్ మార్కెట్లకు సెలవు ప్రకటించారు. బీఎస్ఈ, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ) స్టాక్ మార్కెట్ సెలవుల క్యాలెండర్ ప్రకారం.. ఏప్రిల్ 3న గుడ్ ఫ్రైడే సందర్భంగా ట్రేడింగ్ సెలవుగా చూపిస్తున్నారు.
స్టాక్ మార్కెట్ సెలవుల జాబితా ప్రకారం.. ఈక్విటీ సెగ్మెంట్, కరెన్సీ డెరివేటివ్స్ సెగ్మెంట్స్ & NDS-RST, ఈక్విటీ డెరివేటివ్ సెగ్మెంట్, ట్రై పార్టీ రెపో సెగ్మెంట్లు, ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసీట్స్ (EGR) సెగ్మెంట్, కమోడిటీ డెరివేటివ్స్ సెగ్మెంట్లలో ఈరోజు ట్రేడింగ్ నిలిపివేయనున్నారు. అయితే గుడ్ఫ్రైడే తర్వాత శనివారం (ఏప్రిల్ 4), ఆదివారం (ఏప్రిల్ 5) కావడం వల్ల స్టాక్ మార్కెట్లకు వరుసగా 3 రోజులు సెలవులు వచ్చినట్లు అయ్యింది. ఈ క్రమంలో సాధారణ కార్యకలాపాలు ఏప్రిల్ 6 సోమవారం నాడు తిరిగి ప్రారంభమవుతాయి.
ఇదిలా ఉండగా గుడ్ ఫ్రైడే నేషనల్ హాలీడే కారణంగా కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొన్ని ప్రధాన మార్కెట్లు కూడా నేడు మూతపడనున్నాయి. ఆసియా, యూరోపియన్ దేశాల్లో కొన్ని మార్కెట్లతో పాటు ఈ శుక్రవారం యూఎస్ స్టాక్ మార్కెట్ కూడా ట్రేడింగ్ కోసం మూతపడనుంది.
కమోడిటీ మార్కెట్ సెలవుదినం
దేశంలోనే అతిపెద్ద కమోడిటీ ఎక్స్ఛేంజ్ అయిన మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX), గుడ్ ఫ్రైడే సెలవుదినం సందర్భంగా ఏప్రిల్ 3 తేదీన మూతపడనుంది. MCX ఉదయం, సాయంత్రం సెషన్లు రెండింటిలోనూ సెలవు పాటిస్తుంది. అందువల్ల MCXలో బంగారం, వెండి, రాగి, బేస్ మెటల్స్, ముడి చమురు వంటి కమోడిటీ ఫ్యూచర్స్ ట్రేడింగ్ రోజంతా సెలవుగా ఉండనుంది.
ఏప్రిల్లో రాబోయే సెలవులు
ఏప్రిల్ 3 అనగా నేటి గుడ్ఫ్రైడే సెలవుతో కలిపి ఏప్రిల్ నెలలో మొత్తం రెండు స్టాక్ మార్కెట్ సెలవులు ఉన్నాయి. ఈ నెలలో తదుపరి స్టాక్ మార్కెట్ సెలవు 14వ తేదీన డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా BSE, NSE సెలవుగా ఉండనున్నాయి. అందువల్ల వారాంతాలు కాకుండా ఈ నెలలో భారత స్టాక్ మార్కెట్ మరో రెండు రోజులు మూతపడనున్నాయి.
ఇదిలా ఉండగా.. ఈ ఏడాది స్టాక్ మార్కెట్కు 20 సెలవులు ఉండగా, వాటిలో నాలుగు వారాంతాల్లో అనగా శని, ఆదివారాల్లో వస్తున్నాయి. దీంతో సాధారణ పనిదినాల్లో మార్కెట్లు ట్రేడింగ్ కోసం మూతపడే సెలవు రోజుల సంఖ్య మొత్తం 16కి చేరింది. వీటిలో మార్కెట్లు ఇప్పటికే ఐదు సెలవులను పూర్తి చేసుకున్నాయి.
Also Read: Good Friday Wishes 2026: గుడ్ఫ్రైడే విషెస్ 2026, మెసేజెస్, గ్రీటింగ్స్, కోట్స్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
KKR vs SRH: కేకేఆర్కు రెండో ఓటమి.. 46 పరుగుల తేడాతో హైదరాబాద్ భారీ విజయం
Kolkata, West Bengal:KKR vs SRH Highlights: ఆల్ రౌండ్ ప్రదర్శనతో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు అదరగొట్టింది. బ్యాటర్లు దుమ్మురేపగా.. బౌలర్లు బంతులతో చెలరేగి కలకత్తా నైట్రైడర్స్ జట్టును చిత్తు చేశారు. తొలి మ్యాచ్లో డిఫెండింగ్ చాంపియన్ ఆర్సీబీ చేతిలో ఓడిపోయిన సన్రైజర్స్ రెండో మ్యాచ్కు గొప్పగా పుంజుకుని ఆడి మ్యాచ్ను సొంతం చేసుకుంది. కలకత్తాపై 65 పరుగుల భారీ తేడాతో సన్రైజర్స్ విజయం సాధించింది. అన్నింటిలో విఫలమైన కలకత్తా రెండో ఓటమిని చవిచూసింది.
Also Read: Harsha Veena: బ్రేకింగ్.. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలిపై జనసేన పార్టీ దాడి
ఐపీఎల్ 2026 సీజన్లో ఆరో మ్యాచ్ కలకత్తాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరగ్గా.. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు 8 వికెట్లు కోల్పోయి 226 పరుగులు చేసింది. భారీ లక్ష్యాన్ని ఛేదించలేక కలకత్తా జట్టు 16 ఓవర్లలోనే 161కి కుప్పకూలిపోయింది. సన్రైజర్స్ బ్యాటర్లు, బౌలర్లు అద్భుతంగా ఆడడంతో కలకత్తాను సునాయాసంగా ఓడించారు. ఆడిన రెండు మ్యాచ్ల్లో ఒక ఓటమి.. విజయంతో సన్రైజర్స్ ఉండగా.. కలకత్తా జట్టు మాత్రం ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ ఓటమిని చవిచూసింది.
Also Read: Chandrababu: అమరావతి అన్స్టాపబుల్.. ఇక రాజధానిపై ఎవరూ ఏం చేయలేరు: సీఎం చంద్రబాబు
తొలుత బ్యాటింగ్కు దిగిన సన్రైజర్స్ అద్భుతంగా ఆడి 226 పరుగులు సాధించింది. తొలి ఓవర్ నుంచి ఓపెనర్లు తుఫాన్ ఇన్నింగ్స్ ఆడడంతో పవర్ ప్లే ముగిసేసరికి స్కోర్ 80 పరుగులు దాటింది. పదో ఓవర్ వచ్చేసరికి సన్రైజర్స్కు కష్టాలు మొదలయ్యాయి. ఒక్క బ్యాటర్ కూడా భారీ హిట్టింగ్ చేయలేకపోయారు. అందరూ ఔటవుతున్న వేళ క్లాసెన్ అద్భుతంగా ఆడి జట్టుకు భారీ పరుగులు అందించాడు. 35 బంతుల్లో 52 పరుగులు చేయగా... వాటిలో నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్ ఉంది. అంతకుముందు ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ భారీ హిట్టింగ్లతో శుభారంభం చేశారు. హెడ్ 21 బంతుల్లో 46 చేసి 6 ఫోర్లు, 3 సిక్సర్లు బాదితే.. అభిషేక్ శర్మ 21 బంతుల్లో 48 చేసి కొద్దిలో అర్ధ శతకాన్ని కోల్పోయాడు. కెప్టెన్ ఇషాన్ కిషన్ 14 పరుగులు మాత్రమే చేయగా. అనికేత్ వర్మ ఒక్క పరుగుకే ఔటయ్యాడు. అనంతరం నితీశ్ కుమార్ 39 పరుగులతో విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. హర్ష్ దూబే (9), శివాంగ్ కుమార్ (4) కొన్ని పరుగులు జోడించారు. కలకత్తా బౌలర్లు పవర్ప్లేతోపాటు కొన్ని ఓవర్లు బ్యాటర్లకు అనుకూలంగా వేయగా.. తర్వాత తేరుకుని బ్యాటర్లను బంతికి దొరకబుచ్చుకుని మైదానం నుంచి పంపించారు. బ్లెస్సింగ్ ముజరబానీ 4 వికెట్లతో దుమ్మురేపగా.. వైభవ్ అరోరా రెండు, కార్తీక్ త్యాగి, అనుకూల్ రాయ్ తలా ఒక్కో వికెట్ తీశారు.
భారీ లక్ష్యాన్ని ఛేదనకు దిగిన కలకత్తా నైట్రైడర్స్ బ్యాటర్లు టపాటపా వికెట్లు కోల్పోయి 161 పరుగులకు మ్యాచ్ను 16 ఓవర్లలోనే ముగించారు. అంగ్క్రిష్ రఘువంశీ 29 బంతుల్లో 52 పరుగులు చేసి జట్టు విజయానికి మార్గం చూపించాడు. కెప్టెన్ అజింక్యా రహనే 8 పరుగులకే ఔటవగా.. ఫిన్ అలెన్ 28 పరుగులతో రాణించాడు. గ్రీన్ రెండు పరుగులకే ఔటయిన పరిస్థితుల్లో మిగతా బ్యాటర్లు కూడా అదే మార్గంలో నడించారు. రింకూ సింగ్ 35 పరుగులతో రాణించగా.. అనుకూల్ రాయ్ డకౌట్ అయ్యాడు. బ్యాటర్లు చేసిన భారీ స్కోర్ను ప్రత్యర్థి బ్యాటర్లు చేయలేక సన్రైజర్స్ బౌలర్లు పటిష్టంగా బంతులు వేశారు. ఈసారి బౌలర్లకు మంచి అవకాశాలు లభించడంతో వారు రెచ్చిపోతున్నారు. ఈ విజయంతో సన్రైజర్స్ పైకి దూసుకెళ్లగా.. కలకత్తా రెండో ఓటమితో తీవ్ర దిగాలుగా పట్టికలో ఆఖరు స్థానంలో నిలిచారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Hanuman Shobha Yatra 2026: లవ్ జిహాదీలకు అమ్మాయిలు వార్నింగ్.."మా వెనుక ఉన్నది హనుమాన్"
Hyderabad, Telangana:Hyderabad Hanuman Shobha Yatra 2026: హైదరాబాద్లో హనుమాన్ జయంతి సందర్భంగా శ్రీ వీర హనుమాన్ విజయ యాత్రకు ఘనంగా జరిగింది. అయితే ఈ శోభాయాత్రలో పాల్గొన్న హిందూ యువత లవ్ జిహాదీలకు వార్నింగ్ ఇచ్చారు.Harsha Veena: బ్రేకింగ్.. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలిపై జనసేన పార్టీ దాడి
Koduru, Andhra Pradesh:Janasena Attack On Harsha Veena: లోబర్చుకుని.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిన జనసేన పార్టీ ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై తీవ్ర ఆరోపణలు చేసిన బాధితురాలు హర్షవీణపై ఆకస్మిక దాడి జరిగింది. మార్కెట్లో పూలు కొనుగోలు చేస్తున్న ఆమెపై జనసేన పార్టీ నాయకులు దాడికి పాల్పడ్డారు. ఆమెతో పాటు ఆమె వెంట ఉన్న వ్యక్తిపై దాడికి పాల్పడడంతో అక్కడ కలకలం ఏర్పడింది. ఈ దాడిపై స్థానిక పోలీసులకు హర్షవీణ ఫిర్యాదు చేశారు. ఈ వార్తకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
Also Read: Chandrababu: అమరావతి అన్స్టాపబుల్.. ఇక రాజధానిపై ఎవరూ ఏం చేయలేరు: సీఎం చంద్రబాబు
తిరుపతి జిల్లా రైల్వే కోడూరు జనసేన పార్టీ ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై ఇటీవల ఓ వివాహిత తీవ్ర ఆరోపణలు చేయడమే కాకుండా వీడియోలు విడుదల చేసిన విషయం తెలిసిందే. అతడి అశ్లీల వీడియోలు సంచలనం సృష్టించాయి. తీవ్ర ఆరోపణలు చేసిన బాధితురాలు హర్షవీణ న్యాయం కోసం పోరాడుతున్నారు. ఈ వ్యవహారం విచారణ జరుగుతున్న సమయంలోనే ఆమెపై దాడి జరగడం శోచనీయం. రైల్వేకోడూరు టోల్గేట్ వద్ద గురువారం పూలు కొనేందుకు వెళ్లిన హర్షవీణపై జనసేన కార్యకర్తల దాడి చేశారు.
జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర ఆధ్వర్యంలో జనసేన పార్టీ నాయకులు హర్షవీణ వెంట ఉండే గోపి అనే వ్యక్తిని చితకబాదారు. ఎందుకు కొడుతున్నారని ప్రశ్నించినందుకు హర్షవీణపై కూడా దాడి చేశారు. అరవ శ్రీధర్ అరాచకాలు, రాసలీలలను ప్రశ్నిస్తున్నందుకు పథకం ప్రకారం దాడికి దిగినట్లు బాధితురాలు ఆరోపణలు చేశారు. అరవ శ్రీధర్పై ఎటువంటి చర్యలు తీసుకున్నారని హర్షవీణ ప్రశ్నిస్తున్నారు. పవన్ కల్యాణ్ దీనిపై చర్యలు తీసుకోవాలని బాధితురాలు కోరారు.
Also Read: Liquor Shops: రేపు హైదరాబాద్లో 24 గంటలు వైన్షాపులు, బార్లు బంద్
జనసేన పార్టీ ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే జనసేన పార్టీ అతడిని దూరం చేసి.. విచారణ కమిటీ నియమించిన విషయం తెలిసిందే. ఆ కమిటీ విచారణ చేసి నివేదికను పార్టీ నాయకత్వానికి సమర్పించింది. పలు పోలీస్ స్టేషన్లలో అరవ శ్రీధర్పై కేసు కూడా నమోదైంది. బాధితురాలు హర్షవీణపై కూడా కేసు నమోదు చేయడం గమనార్హం. ఇలా సంచలన పరిణామాలు జరుగుతున్న నేపథ్యంలో హర్షవీణపై దాడికి పాల్పడడం సంచలనం రేపుతోంది.
Also Read: Liquor Income:లిక్కర్తో తెలంగాణ ఖజానా గలగల.. ఏడాదిలో వచ్చిన ఆదాయం ఎంతంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
