ఖమ్మం: నకిలీ వైద్యుడి గుట్టు రట్టు
Khammam, Telangana:ఖమ్మం జిల్లా వేంసూరు మండలం మర్లపాడు గ్రామంలో నకిలీ వైద్యుడు పట్టుబడ్డాడు. ఫార్మసీ చదివిన డాక్టర్ కరుణ ప్రసాద్ ఓపీ ఫీజు తీసుకుని చికిత్స అందిస్తున్నారు. గత పదేళ్లుగా ఇదే తంతు కొనసాగుతున్నా వైద్యాధికారులు కన్నెత్తి చూడలేదు. ఎంబీబీఎస్ వైద్యులు రూ.300 ఓపీ వసూలు చేస్తూ మందులు, ఇంజక్షన్లు ఇస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
Viral Video: స్ట్రా వేసి స్టైల్గా జ్యూస్ తాగేసిన కొండముచ్చు.. వీడియో చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
Hyderabad, Telangana:Monkey Drinks Mango Juice Video Watch: జంతువుల తెలివితేటలు కొన్నిసార్లు మనుషులకే ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటాయి. ముఖ్యంగా కొండముచ్చు చేసే పనులు అచ్చం మనుషులను పోలి ఉండటం మనం తరచుగా అక్కడక్కడ చూస్తూ ఉంటాం. తాజాగా ఒక కొండముచ్చుకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ఎండల వేడికో ఏమో కానీ.. ఒక కొండముచ్చు స్ట్రా సహాయంతో ఎంతో స్టైల్గా మ్యాంగో జ్యూస్ తాగుతున్న దృశ్యాలు ఇప్పుడు వైరల్ అవుతున్న ఈ వీడియోలో మీరు చూడొచ్చు. ఈ వీడియోకు సంబంధించిన అన్ని రకాల వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..
వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక యువకుడు తన చేతిలో మాజా జ్యూస్ డబ్బా పట్టుకొని ఉండడం మీరు చూడొచ్చు. అందులో ఒక స్ట్రా వేసి.. జనాభాసాల్లో అటు ఇటు తిరుగుతూ ఒకచోట కూర్చున్న కొండముచ్చుకు అందించాడు. సాధారణంగా జంతువులకు ఏదైనా ఇస్తే అవి నోటితో లాక్కోవడం లేదా నేలపాలు చేయడం చేస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ కొండముచ్చు మాత్రం చాలా క్లాస్ గా వ్యవహరించింది. ఆ యువకుడు స్ట్రాను దాని నోటి దగ్గరకు తీసుకెళ్లగానే.. అది చాలా చాకచక్యంగా నోటితో పట్టుకొని లోపల ఉన్న జ్యూస్ ను జుర్రుకుంటూ తాగేసింది.
ఈ వీడియో చూస్తుంటే ఆ కొండముచ్చు స్ట్రా సహాయంతో తాగడం కొత్తేమీ కాదని అర్థమవుతుంది. ఒక చుక్క కూడా కింద పడకుండా.. ఆది జ్యూస్ ను చాలా ఎంజాయ్ చేస్తున్న తీరు చూసి సోషల్ మీడియా వినియోగదారులు సైతం ఆశ్చర్యానికి గురవుతున్నారు. దీని తెలివితేటలు మామూలుగా లేవు అని కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు కామెంట్లలో స్పందిస్తూ వస్తుంటే.. మరికొంతమంది మనుషులకు జంతువులకు మధ్య తేడా లేదని మళ్లీ నిరూపితమైందని అంటూ కామెంట్లతో హోరెత్తిస్తున్నారు..
ప్రస్తుతం ఈ వీడియో ఇంస్టాగ్రామ్తో పాటు ఎక్స్ వంటి ప్లాట్ఫార్మ్స్లో విపరీతంగా వైరల్ అవుతూ వస్తోంది. ఈ వీడియోను కొన్ని లక్షల మందికి పైగా సోషల్ మీడియా వినియోగదారులు వీక్షించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా జంతు ప్రేమికులంతా ఈ వీడియోను చూసి లైక్ కూడా చేసి ఇతరులకు షేర్ చేస్తున్నారు. మరి కొంతమంది మాత్రం జంతువులకు ఇలాంటి డ్రింక్స్ తాగించడం మంచిది కాదని.. దీనివల్ల అది ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు గురయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు..
Also Read: DA Hike: కేంద్ర ఉద్యోగులకు గుడ్ న్యూస్.. డీఎ 2% పెంపు మంజూరు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Viral Video: నగరంలో దోమల విలయతాండవం.. సెక్యూరిటీ గార్డ్ ఖతర్నాక్ ఐడియా.. వీడియో!
Hyderabad, Telangana:Mosquito Net Idea Viral Video Watch Here: సాధారణంగా రాత్రి వేళల్లో సెక్యూరిటీ గార్డులు చేతిలో టార్చ్ లైట్తో పాటు లాటీ పట్టుకొని అపార్ట్మెంట్ల వద్ద కాపలా కాయడం మనం చూస్తూ ఉంటాం.. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే సెక్యూరిటీ గార్డ్ మాత్రం వీటన్నిటికీ భిన్నంగా.. ఒళ్లంతా దోమల తెర కప్పుకొని డ్యూటీ చేస్తున్నాడు. హైదరాబాద్ నగరంలో దోమల బెడద ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి ఈ దృశ్యమే నిర్దర్శనంగా నిలుస్తోంది. ప్రస్తుతం ఈ వినూత్న ప్రయత్నానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ వస్తోంది. దీనికి సంబంధించిన అన్ని రకాల వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..
భాగ్యనగరంలోని ఒక అపార్ట్మెంటులో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డ్.. రాత్రి వేళల్లో విపరీతమైన దోమల ధాడిని ఎదుర్కోలేకపోతున్నాడు.. కాయిల్స్ వెలిగించినా.. ఆయింట్మెంట్ రాసుకున్న ఫలితం లేకపోవడంతో ఈ వినూత్న ఆలోచన చేశాడు.. తన కుర్చీ చుట్టూ తల నుంచి కాలి వరకు పూర్తిగా కవరియ్యలా ఒక తెల్లటి దోమతెరను ధరించాడు. దోమతెరలు కూర్చుని దర్జాగా తన పనిని తాను చేసుకుంటున్నాడు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియోనే సోషల్ మీడియా వినియోగదారులను ఆశ్చర్యపోయేలా చేస్తుంది.
అయితే, ఈ దృశ్యాలను అదే అపార్ట్మెంట్లో నివసిస్తున్న ఒక గృహిణి చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అధికాస్త వైరల్గా మారింది. ఈ వీడియో పై సోషల్ మీడియా వినియోగదారులు రకరకాలుగా స్పందిస్తూ వస్తున్నారు.. భయ్యా నీ ఐడియా అద్భుతం.. దోమల నుంచి రక్షణకు ఇంతకంటే మంచి మార్గం లేదు.. అంటూ కొందరు కామెంట్స్ చేస్తుంటే.. మరికొందరు పాపం ఆ సెక్యూరిటీ గార్డు పరిస్థితి చూస్తుంటే జాలేస్తోంది.. కనీసం దోమలు లేని వాతావరణాన్ని కూడా యాజమాన్యం కల్పించలేకపోతోంది అంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ వస్తున్నారు..
హైదరాబాద్ లో డెంగ్యూతో పాటు మలేరియా కేసులు పెరుగుతున్న తరుణంలో.. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడంలో తప్పు లేదని మరి కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు కామెంట్ చేస్తూ వస్తున్నారు. అయితే ఇంకొంతమంది మాత్రం రేవంత్ రెడ్డి ప్రభుత్వం దోమల నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని.. అందువల్లే నగరంలో దోమలు విపరీతంగా పెరిగిపోతున్నాయని ప్రభుత్వం పై ఫైర్ అవుతున్నారు. అంతేకాకుండా ఈ వీడియో నగరంలోని పారిశుద్ధ్య లోపాన్ని కూడా ఎత్తిచూపుతోంది.. మురుగునీరు నిలిచిపోవడంతో పాటు చెత్తాచెదారం పేరుకుపోవడం వల్ల దోమలు స్వైర విహారం చేస్తున్నాయని.. జీహెచ్ఎంసీ అధికారులు తక్షణమే స్పందించి ఫాగింగ్ చేయించాలని స్థానికులు కోరుతున్నారు.
Also Read: DA Hike: కేంద్ర ఉద్యోగులకు గుడ్ న్యూస్.. డీఎ 2% పెంపు మంజూరు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Open Ssc Exams: ఓపెన్ స్కూల్ విద్యార్థులకు అలర్ట్.. షెడ్యూల్ విడుదల!
Jagtial, Telangana:Toss Exams Jagtial Telugu News: జగిత్యాల జిల్లాలోని ఓపెన్ స్కూల్ 10వ తరగతితో పాటు ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల నిర్వహణకు సర్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈనెల 20వ తేదీ నుంచి 27వ తేదీ వరకు ఈ పరీక్షలు నిర్వహించబోతున్నట్లు విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. వివిధ కారణాలవల్ల రెగ్యులర్ విద్యకు దూరమైన విద్యార్థుల కోసం ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ పరీక్షలకు సంబంధించి జిల్లా యంత్రాంగం పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తోంది. అయితే దీనికి సంబంధించిన అన్ని రకాల వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..
పరీక్షలను రెండు సెషన్లలో నిర్వహించబోతున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఉదయం స్టేషన్ 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కొనసాగుతుంది. ఇక మధ్యాహ్నం సెషన్ రెండు గంటల 30 నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల 30 నిమిషాల వరకు కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు. విద్యార్థులు పరీక్ష కేంద్రానికి గంట ముందే చేరుకోవాలని.. నిమిషం నిబంధన అమల్లో ఉండే అవకాశం ఉన్నందున అభ్యర్థులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు..
ఈ ఏడాది జగిత్యాల జిల్లాలో ఓపెన్ స్కూల్ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థుల వివరాల్లోకి వెళ్తే.. మొత్తం జిల్లాలో ఓపెన్ పదవ తరగతి నాలుగు సెంటర్లలో నిర్వహిస్తుండగా.. దీనికి దాదాపు 659 విద్యార్థులు హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఓపెన్ ఇంటర్ కోసం అధికారులు ఐదు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయితే, ఈ పరీక్షలను దాదాపు 900 మందికి పైగా విద్యార్థులు రాయబోతున్నట్లు సమాచారం. మొత్తం కలిపి దాదాపు 1500 మందికి పైగా విద్యార్థులు ఈ పరీక్షలను రాయబోతున్నారు.
Also Read: DA Hike: కేంద్ర ఉద్యోగులకు గుడ్ న్యూస్.. డీఎ 2% పెంపు మంజూరు!
ఇప్పటికే అధికారులు పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసినట్లు తెలుస్తోంది. పరీక్షలు పారదర్శకంగా నిర్వహించేందుకు.. ఎటువంటి అక్రమాలకు తావు లేకుండా ఉండేందుకు విద్యాశాఖ ప్రత్యేకమైన చర్యలు చేపడుతోంది. అలాగే పరీక్ష కేంద్రాల పర్యవేక్షణకు ప్రత్యేకమైన ఫ్లయింగ్ స్కాడ్ బృందాలను కూడా ఏర్పాటు చేశారు. వేసవి కాలం విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా పరీక్షా కేంద్రాల్లోని తాగునీరు, ఇతర సౌలతులను ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి కేంద్రానికి ఒక చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్ను నియమించినట్లు తెలుస్తోంది.
Also Read: DA Hike: కేంద్ర ఉద్యోగులకు గుడ్ న్యూస్.. డీఎ 2% పెంపు మంజూరు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
EPFO 3.0 Update: ఉద్యోగులకు తీపికబురు..EPFO డబ్బు ATMలో విత్డ్రాకు ప్లాన్ రెడీ..ఎప్పటి నుంచి అమలు చేస్తారంటే?
Hyderabad, Telangana:EPFO 3.0 Update 2026: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) త్వరలో EPFO 3.0ను ప్రారంభించనుంది. ఇందులో భాగంగా పీఎఫ్ డబ్బు క్లెయిమ్ ప్రక్రియలోని ఇబ్బందులను తొలగించడంతో పాటు అత్యవసర పరిస్థితుల్లో PF ఖాతా నుండి నేరుగా డబ్బు విత్డ్రా చేసుకునేందుకు వెసులుబాటు కల్పించడం. వీటితో పాటు మరికొన్ని కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి.
EPFO 3.0 కొత్త విధానం ప్రకారం.. పీఎఫ్ ఖాతాదారులు తమ డబ్బును విత్డ్రా చేసుకోవడానికి ఇకపై ఎక్కువసేపు వేచి ఉండాల్సిన అవసరం లేదు. ఉద్యోగులు తమ ప్రావిడెంట్ ఫండ్ (PF) అంటే ఈపీఎఫ్ కార్పస్ను UPI (యూపీఐ) ద్వారా లేదా ATMలో విత్డ్రా చేసుకునే సౌకర్యం అందుబాటులోకి వస్తుంది.
ఈపీఎఫ్ఓ 3.0 అప్గ్రేడ్లో భాగంగా EPFO ప్రక్రియను పూర్తిగా డిజిటలైజ్ చేయనున్నారు. ఇది తన ఖాతాదారులకు తక్షణ బ్యాంకింగ్ లాంటి సేవలను అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది. గతంలో.. PF డబ్బు విత్డ్రా చేసుకునేందుకు ఆన్లైన్ క్లెయిమ్ అప్లికేషన్ నింపి.. దాని ఆమోదం కోసం వారాల పాటు ఎదురుచూడాల్సి వచ్చేది. ఇప్పుడీ కొత్త విధానం కింద ఈ మొత్తం ప్రక్రియ ఎంతో ఈజీగా పరిణవించనుంది.
EPFO 3.0లో అత్యంత ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. ఇది మీ PF ఖాతాను మీ రోజువారీ లావాదేవీలకు నేరుగా అనుసంధానిస్తుంది. ఇందుకోసం ఈపీఎఫ్ఓ తన ఖాతాదారులకు ఒక ప్రత్యేక "PF ATM కార్డు"ను జారీ చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. ఈ కార్డు ద్వారా వినియోగదారులు సాధారణ డెబిట్ కార్డులాగా PF డబ్బును విత్డ్రా చేసుకోవచ్చు. అదనంగా.. పీఎఫ్ ఖాతాను యూపీఐతో అనుసంధానించే సౌకర్యం అందుబాటులోకి రానుంది. ఇది కాకుండా.. ఇప్పటికే ఉన్న EPFO పోర్టల్, ఉమాంగ్ యాప్ ద్వారా బ్యాంకు ఖాతాకు డబ్బు బదిలీ చేసే ఎంపిక గతంలో కంటే సులభతరం అవుతుంది.
కొత్త EPFO 3.0 సౌకర్యం కింద ఎంత డబ్బును విత్డ్రా చేసుకోవచ్చు అన్నదే ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. UPI లేదా ATM ద్వారా PF విత్డ్రాకు ఈపీఎఫ్ఓ పరిమితిని నిర్దేశిస్తుంది. ప్రస్తుతం.. ఖాతాదారులు ఈ పద్ధతుల ద్వారా తమ మొత్తం నిధులలో 50 నుండి 75 శాతం మాత్రమే విత్డ్రా చేసుకోగలరని అంటున్నారు. అయితే ఇది ఒక ప్రారంభ పరిమితి మాత్రమే, భవిష్యత్తులో ఈ పరిమితిని పెంచే అవకాశం ఉంది. ఈ విషయమై ఈపీఎఫ్ఓ నుంచి వివరాణాత్మక ప్రకటన రావాల్సి ఉంది.
EPFO 3.0 ఏప్రిల్లో ప్రారంభిస్తారని గతంలో కొన్ని నివేదికల ద్వారా వెల్లడించారు. అయితే దాని అమలు ప్రస్తుతం ఆలస్యం అవుతోందని సమాచారం. EPFO త్వరలో ఒక కొత్త మొబైల్ యాప్ను ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తుందని సమాచారం. ఈ కొత్త యాప్ ద్వారా ఖాతాదారులు UPI ద్వారా డబ్బు విత్డ్రా చేసుకోవడంతో పాటు ఇతర అధునాతన ఫీచర్లను కూడా పొందగలరని భావిస్తున్నారు.
(గమనిక: పైన పేర్కొన్న సమాచారం కేవలం కొన్ని నివేదికల ఆధారంగా రూపొందించింది. దీన్ని పాటించే ముందు సంబంధిత వెబ్సైట్ను తనిఖీ చేయడం ఉత్తమం. దీన్ని జీ తెలుగు న్యూస్ ధ్రువీకరిచడం లేదు.)
Also Read: Maharashtra Exploitation: 350 అశ్లీల వీడియోలు..180 మంది మైనర్ బాలికలతో శృంగారం..కేటుగాడు అరెస్టు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Karimnagar: మున్సిపల్ ఖజానాకు కన్నం.. ట్రేడ్ లైసెన్సుల పేరిట కాసుల వేట!
Karimnagar, Telangana:Karimnagar Municipal Latest News: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ట్రేడ్ లైసెన్సుల వ్యవహారం అక్రమార్కులకు అక్షయపాత్రగా మారుతూ వస్తుంది. ప్రభుత్వ ఆదాయానికి గండికోడుతూ కొందరు అధికారులతో పాటు సిబ్బంది తమ జేబులను నింపుకుంటున్నారు.. ఆన్లైన్ విధానం అమరులో ఉన్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో ఆఫ్లైన్ వసూళ్లు జోరుగా సాగుతున్నాయి.. పారదర్శకతకు పాతరేస్తూ సాగుతున్న ఈ దంతాలు ఏట కోట్ల రూపాయల ప్రజాధనం పక్కదారి పడుతూ వస్తోంది. అయితే దీనికి ప్రధాన కారణం ఏంటి? ఉన్నత అధికారులు కూడా పట్టించుకోలేకపోవడానికి గల కారణాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఉమ్మడి జిల్లా పరిధిలోని రెండు కార్పొరేషన్లతో పాటు 13 మున్సిపాలిటీల్లో వేల సంఖ్యలో వ్యాపార సంస్థలు ఉన్నాయి.. నిబంధనల ప్రకారం ప్రతి దుకాణంతో పాటు వ్యాపార సంస్థ మున్సిపాలిటీ నుంచి ట్రేడ్ లైసెన్స్ పొందాల్సి ఉంటుంది.. అయితే క్షేత్రస్థాయిలో తనిఖీలు చేయాల్సిన సిబ్బంది వ్యాపారులతో కుమ్మక్కవుతున్నారు. అంతేకాకుండా కొంతమంది సిబ్బంది తనిఖీలు చేసినప్పటికీ చేతులు తడుపుకుంటూ ఉన్నారు.
థియేటర్లతో పాటు ఫంక్షన్ హాల్స్, భారీ హోటల్లో నుంచి వసూలు చేయాల్సిన పన్నులను నామమాత్రంగా చూపిస్తూ లోపాయి గారి ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు.. నిర్ణీత గడువులోగా పన్నులు చెల్లించాలని సంస్థలపై చర్యలు తీసుకోవాల్సింది పోయి.. వారికి అక్రమ మార్గాల్లో వెసులుబాటు కల్పిస్తూ వస్తున్నారు.. అంతేకాకుండా పలువురు వ్యాపారస్తులతో నేరుగా కుమ్మక్కై వారి నుంచి లక్షల రూపాయల్లో డబ్బులు పొందుతున్నారు.
ఈ గంధాలు అత్యంత ఆశ్చర్యం కలిగించే అంశం ఏమిటంటే.. పాత బకాయాలను కప్పిపుచ్చడం.. ఒక వ్యాపార సంస్థ పేరు మీద లక్షలాది రూపాయల పన్ను బకాయిలు ఉంటే.. వాటిని వసూలు చేయకుండా అదే సంస్థలు కొత్త పేరుతో రెండో లైసెన్స్ జారీ చేస్తున్నారు. దీనివల్ల పాత బకాయిలు రికార్డులోనే ఉండిపోతున్నాయి.. ప్రభుత్వం ఆ మొత్తాన్ని శాశ్వతంగా కోల్పోతూ వస్తోంది. సాంకేతిక కారణాలు చూపుతూ ఆన్లైన్ డేటాను తారుమారు చేస్తున్నారని ఆరోపణలు కూడా ఇప్పుడు బలంగా వినిపిస్తున్నాయి..
Also Read: Hyderabad News: గ్రేట్ అమ్మ.. 92 ఏళ్ల వయసులోనూ ఆపని సేవలు.. 2 లక్షల ప్రసవాల రికార్డు!
అవినీతిని అరికట్టేందుకు ప్రభుత్వం ట్రేడ్ లైసెన్స్ ప్రక్రియను పూర్తిగా ఆన్లైన్ చేసింది. కానీ క్షేత్రస్థాయిలో కొందరు సిబ్బంది వ్యాపారస్తులను భయభ్రాంతులకు గురిచేసి.. తనిఖీల పేరుతో వేధిస్తూ సెటిల్మెంట్కు తెర లేపుతున్నారు. లైసెన్స్ ఫీజు కంటే తక్కువ మొత్తానికి ఒప్పందం కుదుర్చుకొని.. ప్రభుత్వానికి దక్కాల్సిన ఆదాయానికి గండి కొడుతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గత మూడేళ్లలో సుమారు 10 కోట్లకు పైగా ట్రేడ్ లైసెన్స్ ఆదాయం పక్కదారి పట్టినట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఉన్నత అధికారులు స్పందించి సమగ్ర విచారణ జరిపితే తప్ప.. ఈ మున్సిపల్ లైసెన్స్ దందాకు అడ్డుకట్టుపడేలా లేదు. ఇప్పటికైనా నిఘవర్గాలు రంగంలోకి దిగి ఖజానాకు గండి కొడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కరీంనగర్ ఉమ్మడి జిల్లాల ప్రజలు కోరుకుంటున్నారు.
Also Read: Hyderabad News: గ్రేట్ అమ్మ.. 92 ఏళ్ల వయసులోనూ ఆపని సేవలు.. 2 లక్షల ప్రసవాల రికార్డు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
Hyderabad News: గ్రేట్ అమ్మ.. 92 ఏళ్ల వయసులోనూ ఆపని సేవలు.. 2 లక్షల ప్రసవాల రికార్డు!
Hyderabad, Telangana:Hyderabad Latest Telugu News: వైద్యో నారాయణో హరి.. ఈ మాటను అక్షరాల నిజం చేస్తూ.. ఆరు దశాబ్దాలుగా వేల కుటుంబాల్లో వెలుగును నింపుతున్నారు హైదరాబాద్కు చెందిన డాక్టర్ సూరి శ్రీమతి.. ప్రస్తుతం 92 ఏళ్ల వయసులోనూ.. ఏమాత్రం అలసట లేకుండా, వైద్యమే శ్వాసగా సాగుతున్న ఆమె ప్రస్థానం వివరించలేనిదే..తన సుదీర్ఘ కెరీర్లో దాదాపు రెండు లక్షల ప్రసవాలు చేసిన ఘనత ఆమె సొంతం.. రెండు లక్షల మంది పసికందుల తొలి కేకలను విన్న ఆ చెవులకు.. వారి తల్లులు కళ్ళలో ఆనందాన్ని చూసిన ఆ మనసుకు సాటి లేదు. ఇప్పటికీ ఆ డాక్టర్ ఏ మాత్రం తగ్గకుండాను ప్రసవాలు చేస్తూ వస్తోంది.. నిజంగా ఆమె చేస్తున్న పని చాలా గ్రేట్ అంటున్నారు పేషన్స్..
ఆమె ప్రయాణం నేటి ఆధ్యాధునిక ఆసుపత్రుల కాలంలో ప్రారంభం కాలేదు.. వైద్య సదుపాయాలు అంతంత మాత్రంగా ఉన్న రోజుల్లోనే డాక్టర్ శ్రీమతి సేవలు మొదలయ్యాయి.. అప్పట్లో రవాణా సౌకర్యం లేక.. కనీస వైద్య పరికరాలు అందుబాటులో లేని మారుమూల ప్రాంతాల్లో కూడా ప్రాణాలకు తెగించి ప్రసవాలు చేసిన రోజులు ఉన్నాయట.. ఒకవైపు మత శిశు మరణాలు ఎక్కువగా ఉన్న రోజుల్లో.. అంకిత భావంతో పనిచేసే ఎంతోమంది గర్భిణీలను మృత్యువు నుంచి కాపాడారు.. మారుతున్న కాలానికి అనుగుణంగా టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ.. నేటి హైటెక్ విద్య యుగంలోనూ తనదైన ముద్ర వేసుకున్నారు..
సాధారణంగా 60 ఏళ్లు వస్తే పదవి విరమణ చేసి విశ్రాంతి కోరుకుంటూ ఉంటారు.. అలాంటిది డాక్టర్ శ్రీమతికి మాత్రం రోగుల సేవలోనే విశ్రాంతి దొరుకుతుంది.. 92 ఏళ్ల వయసులోనూ వణుకు లేని చేతులతో.. స్పష్టమైన చూపుతో ఆమె నేటికీ ఆపరేషన్ థియేటర్లోకి అడుగు పెడుతుంటే.. తోటి వైద్యులు ఆశ్చర్యపోతూ ఉంటారు. మత శిశు సంరక్షణై ధ్యేయంగా.. ఆమె చేసిన కృషికి ఎన్ని అవార్డులు ఇచ్చిన చాలా తక్కువే.. వైద్యం అనేది వృత్తి కాదు.. అదొక బాధ్యత.. పసికందు ప్రాణం పోసుకున్నప్పుడు తల్లి కళ్ళలో కనిపించే ఆ కృతజ్ఞత ముందు ప్రపంచంలోని ఏ సంపదైనా సాటి రాదు.. అని ఆమె ఇప్పటికీ నీరాడంబరంగా చెబుతూ ఉంటుంది..
Also Read: Chandrababu YS Jagan: మహిళా బిల్లుపై ఇండి కూటమిని తప్పుబట్టిన చంద్రబాబు, వైఎస్ జగన్
వైద్యాన్ని కేవలం వ్యాపార కోణంలో చూస్తున్న నేటి కాలంలో.. డాక్టర్ సూరి శ్రీమతి లాంటి వ్యక్తులు ఒక వెలుగు దివ్వెలు.. వేల సంఖ్యలో సిజేరియన్లు.. మరెన్నో సాధారణ ప్రసవాలు చేస్తూ.. లక్షలాదిమందికి అమ్మగా మారిన ఆమె ప్రస్థానం చరిత్రలో నిలిచిపోతుంది.. నేటి యువ వైద్యులకు ఆమె ఒక రోల్ మోడల్.. నిబద్ధతతో పాటు నైతికత, సేవా గుణం ఉంటే వైద్యవృత్తికి ఎంతటి గౌరవం లభిస్తుందో ఆమె జీవితమే ఒక ఉదాహరణ..
Also Read: Chandrababu YS Jagan: మహిళా బిల్లుపై ఇండి కూటమిని తప్పుబట్టిన చంద్రబాబు, వైఎస్ జగన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
SRH Vs CSK Preview: హైదరాబాద్ Vs చెన్నై..మ్యాచ్లో ధోనీ ఎంట్రీ ఇస్తాడా? సన్రైజర్స్ మరోసారి సూపర్ విక్టరీ సాధిస్తుందా?
Hyderabad, Telangana:SRH Vs CSK Preview 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2026లో నేటి రెండో మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి. హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది. తమ గత సొంత గడ్డపై రాజస్థాన్ రాయల్స్పై 57 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించి సన్రైజర్స్ జోష్ మీద ఉంది. ప్రస్తుతం హైదరాబాద్ జట్టు ఆడిన ఐదు మ్యాచ్లలో రెండు విజయాలను నమోదు చేసి పాయింట్ల పట్టికలో ఐదవ స్థానంలో నిలిచింది.
మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కూడా చెపాక్లో కోల్కతా నైట్ రైడర్స్పై సాధించిన అద్భుత విజయంతో మరింత ఉత్సాహాంగా ఉంది. గత రెండు మ్యాచ్ల్లో విజయాల తర్వాత హ్యాట్రిక్ గెలుపును నమోదు చేయాలని చైన్నై సూపర్ కింగ్స్ జట్టు ప్లాన్ చేస్తుంది.
ఈ మ్యాచ్కు సంబంధించి ఇప్పుడో హాట్ టాపిక్గా మారింది. ఈ మ్యాచ్లో ఎంఎస్ ధోనీ ఆడతాడా? లేదా ఈ మ్యాచ్లో కూడా కేవలం విశ్రాంతికి పరిమితమవుతాడా? అనేది మరికొద్ది గంటల్లో తెలిసిపోతుంది. తాజాగా గాయం నుంచి కోలుకున్న ధోనీ, నెట్స్లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నప్పటికీ.. నేటి మ్యాచ్లో అతను బరిలోకి దిగే అవకాశం తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 23న ముంబై ఇండియన్స్తో జరిగే మ్యాచ్లో ధోనీ తిరిగి జట్టులోకి వచ్చే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు సూచిస్తున్నాయి.
చెన్నై, హైదరాబాద్..హెట్-టూ-హెడ్..
ఐపీఎల్ చరిత్రలో సన్రైజర్స్ హైదరాబాద్, చైన్నై సూపర్ కింగ్స్ జట్లు 22 సార్లు తలపడ్డాయి. అయితే ఇందులో చెన్నై సూపర్ కింగ్స్ 17 మ్యాచ్ల్లో గెలిచి పూర్తి ఆధిపత్యాన్ని చలాయిస్తుంది. అలాగే హైదరాబాద్ జట్టు కేవలం 7 మ్యాచ్ల్లో విజయం సాధించింది.
హైదరాబాద్లో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలోని పిచ్.. సాధారణంగా బ్యాట్, బంతి సమానంగా ప్రియారిటీ ఇస్తుందని సమాచారం. ఇన్నింగ్స్ ప్రారంభంలో పేసర్లు మంచి బౌన్స్ రాబట్టగలరని పిచ్ క్యూరెటర్లు చెప్పినట్లు సమాచారం. అయితే ఆట సాగేకొద్దీ ఎర్రమట్టి పిచ్ స్ట్రోక్ ప్లేకు అనుకూలిస్తుంది.
సన్రైజర్స్ హైదరాబాద్ తుదిజట్టు అంచనా..
అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్ (కెప్టెన్), హెన్రిక్ క్లాసెన్, సలీల్ అరోరా (వికెట్ కీపర్), అనికేత్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, హర్ష్ దూబే, శివాంగ్ కుమార్, ప్రఫుల్ హింగే, ఈషన్ మలింగ. ఇంపాక్ట్ ప్లేయర్: సాకిబ్ హుస్సేన్.
చెన్నై సూపర్ కింగ్స్ తుదిజట్టు అంచనా..
సంజు శాంసన్ (వికెట్ కీపర్), రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), ఆయుష్ మాత్రే, సర్ఫరాజ్ ఖాన్, శివం దూబే, డెవాల్డ్ బ్రెవిస్, జామీ ఓవర్టన్, అకీల్ హొసేన్, నూర్ అహ్మద్, అన్షుల్ కాంబోజ్, గుర్జప్నీత్ సింగ్. ఇంపాక్ట్ ప్లేయర్: ప్రశాంత్ వీర్.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Venus Transit 2026: ఏప్రిల్ 19 నుంచి వీరికి గోల్డెన్ డేస్.. మీ రాశి ఇందులో ఉందా?
Hyderabad, Telangana:Venus Transit 2026 Effect On Zodiac 2026: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహ కదలికలతో పాటు సంచారాలు, తిరోగమనలు, సంయోగాలు ఇవన్నీ మానవ జీవితాలపై ఎంతో ప్రత్యేకమైన ప్రభావాన్ని చూపుతూ ఉంటాయి.. ముఖ్యంగా ఈ సమయాల్లో ఏర్పడే శుభ ప్రభావంతో కొన్ని రాశుల వారికి సుఖసంతోషాలు కూడా విపరీతంగా పెరుగుతాయి అంతేకాకుండా ఐశ్వర్యంతో పాటు విలాసవంతమైన జీవితాన్ని కూడా గడపగలుగుతారు. ఇదిలా ఉంటే ఐశ్వర్యానికి కారకుడైన శుక్ర గ్రహం ఏప్రిల్ నెలలో సొంత రాశి అయిన వృషభంలోకి ప్రవేశించబోతుంది. ఇది ఏప్రిల్ 19వ తేదీన జరగబోతోంది. దీని కారణంగా కొన్ని రాశుల వారికి జాతకంలో అనేక మార్పులు రాబోతున్నాయి.. ముఖ్యంగా ఈ సమయంలో నాలుగు రాష్ట్రాల వారికి విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి సమాజంలో గౌరవ మర్యాదలు పెరగడమే కాకుండా.. ఎన్నో రకాల ఇబ్బందుల నుంచి పరిష్కారం లభించబోతోంది. అయితే, ఈ సమయంలో అత్యధికంగా లాభాలు పొందబోయే రాశులేవో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఈ రాశుల వారికి జాక్పాట్..
వృషభరాశి
శుక్రుడి సొంత రాశిలోకి ప్రవేశించడం వల్ల వృషభ రాశి వారికి ఇది గోల్డెన్ పీరియడ్గా మారబోతోంది. ముఖ్యంగా వీరికి సమాజంలో కీర్తి, ప్రతిష్టలు విపరీతంగా పెరుగుతాయి. నిలిచిపోయిన పనులు వేగవంతంగా పూర్తి అవ్వడమే కాకుండా.. వ్యాపారస్తులకు ఊహించని లాభాలు చేకూరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగస్తులకు ఈ సమయంలో తప్పకుండా పదోన్నతులు వరించబోతున్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా అనుకున్న పనుల్లో అద్భుతమైన విజయాలు సాధించబోతున్నారు..
మిథున రాశి
మిథున రాశి వారికి ఈ సంచార ప్రభావం వల్ల విదేశీ ప్రయాణాలు చాలా అనుకూలించబోతున్నాయి. ఆదాయ మార్గాలు విపరీతంగా పెరగడమే కాకుండా.. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి మంచి లాభాలు పొందగలుగుతారు. కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ఈ సమయంలో మానసిక ప్రశాంతత కూడా విపరీతంగా పెరిగి.. జీవితంలో అనుకున్న పనులు ఎంతో సులభంగా చేయగలుగుతారు.
కన్యారాశి
కన్యా రాశి వారికి అదృష్టం పూర్తిగా వరించబోతోంది. పెండింగ్లో ఉన్న కోర్టు కేసులు ఎంతో సులభంగా పరిష్కారం కాబోతున్నాయి. తండ్రి వైపు నుంచి ఆస్తులు కూడా కలిసి వచ్చే అవకాశాలున్నాయి. విద్యార్థులకు ఉన్నత చదువుల కోసం విదేశీ యోగం కూడా కూడా ఏర్పడబోతోంది. ముఖ్యంగా విదేశాలకు వెళ్లాలనుకునే వారి కోరికలు ఈ సమయంలో తప్పకుండా వరించబోతున్నాయి. కొత్త వ్యాపార ఒప్పందాలు కూడా కుదుర్చుకుంటారు..
కుంభరాశి
కుంభ రాశిలో జన్మించిన వ్యక్తులకు శుక్రుడి ప్రభావంతో వాహనాలతో పాటు కొత్త గృహాలు కూడా కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ సమయంలో పనితీరుపై అధికారుల ప్రశంసలు కూడా లభిస్తాయి. దీంతోపాటు ఉద్యోగస్తులకు ఈ సమయంలో తప్పకుండా జీతాలు పెరుగుతాయి. అంతేకాకుండా బోనస్ లభించే సూచనలు కూడా లభిస్తాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఆర్థిక ఇబ్బందుల నుంచి ఎంతో సులభంగా విముక్తి కలుగబోతోంది. అంతేకాకుండా ఆరోగ్యం చాలా అద్భుతంగా ఉండబోతోంది.

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
RCB Vs DC Preview: ఐపీఎల్లో మరో రసవత్తర పోరు..ఢిల్లీ క్యాపిటల్స్ గెలుస్తుందా? ఆర్సీబీ ఆధిపత్యం చలాయిస్తుందా?
Bengaluru, Karnataka:RCB Vs DC Match Preview 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో నేడు డబుల్ హెడర్ మ్యాచ్లు జరగనున్నాయి. ఇందులో భాగంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదిగకగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనుంది. గతేడాది నుంచి ఆర్సీబీ ఉన్న భీకర ఫామ్ను కంటిన్యూ చేస్తుంది. అలాగే ఈ సీజన్లో ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్ల్లో నాలుగింటిలో గెలిచి.. కేవలం ఒక్క మ్యాచ్లోనే ఓడిపోయింది. పాయింట్ల పట్టికలో ఆర్సీబీ ప్రస్తుతం రెండో స్థానంలో కొనసాగుతోంది. అలాగే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఆడిన 4 మ్యాచ్ల్లో 2 గెలిచి, 2 ఓటమి పాలయ్యి పాయింట్స్ టేబుల్లో 6వ స్థానానికి పరిమితమైంది.
ఆర్సీబీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్లో జట్టును ముందుండి నడిపిస్తూ.. ఆయన ఆడిన 5 ఇన్నింగ్స్ల్లో 2 హాఫ్ సెంచరీలతో 228 పరుగులు రాబట్టడం విశేషం. అదే విధంగా ఆర్సీబీ కెప్టెన్ కూడా పటిదార్ అద్భుతమైన ఫామ్ను కొనసాగిస్తుండగా.. దేవదత్ పడిక్కల్, టిమ్ డేవిడ్, ఫిల్ సాల్ట్ వంటి ఆటగాళ్లతో బ్యాటింగ్ దళంగా బలంగా ఉంది.
అలాగే ఆర్సీబీ బౌలింగ్ విషయానికి వస్తే.. భువనేశ్వర్ కుమార్, కృనాల్ పాండ్యా అద్భుతంగా రాణిస్తున్నారు. చెరో ఏడు వికెట్లు పడగొట్టి జట్టు బౌలింగ్ విభాగానికి వెన్నెముకగా నిలిచారు. కొత్తగా జట్టులోకి వచ్చిన జాకబ్ డఫీకి ఆడే అవకాశం వచ్చినప్పుడల్లా జట్టును ఆదుకుంటున్నాడు. ఈ న్యూజిలాండ్ పేసర్ ఆడిన మూడు మ్యాచ్లలో ఆరు వికెట్లు పడగొట్టడం విశేషం. అలాగే లక్నో సూపర్ జెయింట్స్ జట్టుపై 1/20 ప్రదర్శన చేసినందుకు జోష్ హేజిల్వుడ్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. అదే మ్యాచ్లో, రైట్ హ్యాండ్ మీడియం పేసర్ రసిఖ్ సలాం 4 వికెట్లు పడగొట్టాడు.
ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్ విషయానికొస్తే.. ఈ సీజన్లో ఆటుపోట్లు లోనయ్యింది. అక్షర్ పటేల్ కెప్టెన్సీలో ఈ జట్టు రెండు మ్యాచ్లలో ఓడిపోయి, మరో రెండు మ్యాచ్లలో విజయం సాధించింది. లక్నో, ముంబై టీమ్స్లో గెలుపుతో ప్రారంభంమైనా.. ఆ తర్వాత గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లపై జరిగిన మ్యాచ్ల్లో తేలిపోయింది. గడిచిన నాలుగు మ్యాచ్లను బట్టి చూస్తే, ఢిల్లీ జట్టు ఇప్పటివరకు సమీర్ రిజ్వీ ప్రదర్శించిన ఫామ్ ఒక ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
ఈ యువ ఆటగాడు వరుసగా రెండు అర్ధశతకాలు సాధించి భీకర ఫామ్లో ఉన్నాడు. ఈ జట్టులో లుంగీ ఎంగిడి, కేఎల్ రాహుల్, ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ మిల్లర్, కుల్దీప్ యాదవ్ వంటి మ్యాచ్ టర్న్ చేసే సత్తా కలిగిన ఆటగాళ్లు కూడా ఉన్నారు. అయితే ప్లేఆఫ్ రేసులో నిలవాలంటే ఢిల్లీ జట్టు ఈ మ్యాచ్లో కచ్చితంగా గెలవాల్సిందే. మరోవైపు ఆర్సీబీ ఈ మ్యాచ్లో గెలిస్తే.. ప్లేఆఫ్ రేసులో మరింత ముందుకు వెళ్తోంది.
హెడ్-టూ-హెడ్ మ్యాచ్లు..
M చిన్నస్వామి స్టేడియంలోని పిచ్లు చాలా సందర్భాలలో బ్యాటర్లకు అనుకూలంగా ఉంటాయి. కాబట్టి, ఈ మ్యాచ్ కోసం బ్యాటింగ్కు అనుకూలించే పిచ్ను ఆశించవచ్చు. ఐపీఎల్ చరిత్రలో ఆర్సీబీతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 33 సార్లు తలపడగా.. అందులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 20 మ్యాచ్ల్లో నెగ్గి పూర్తి ఆధిక్యాన్ని చలాయిస్తుంది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కేవలం 12 మాత్రమే విజయం సాధించగా.. ఒక మ్యాచ్ డ్రాగా నిలిచింది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తుదిజట్టు అంచనా..
ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్ (కెప్టెన్), జితేష్ శర్మ (వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, రషిక్ సలామ్, జోష్ హేజిల్వుడ్.
ఢిల్లీ క్యాపిటల్స్ తుదిజట్టు అంచనా..
కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), పాతుమ్ నిస్సాంక, సమీర్ రిజ్వీ, అక్షర్ పటేల్ (కెప్టెన్), డేవిడ్ మిల్లర్, ట్రిస్టియన్ స్టబ్స్, అశుతోష్ శర్మ, అక్విబ్ నబీ, కుల్దీప్ యాదవ్, లియుంగి ఎన్గిడి, టి.నటరాజన్.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Chandrababu YS Jagan: మహిళా బిల్లుపై ఇండి కూటమిని తప్పుబట్టిన చంద్రబాబు, వైఎస్ జగన్
Wadgaon, Maharashtra:Delimitation Bill: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన మహిళా రిజర్వేషన్ బిల్లు లోక్సభలో వీగిపోవడంపై ఎన్డీయే పక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇండి కూటమి వ్యవహార శైలిని కేంద్రంలోని భాగస్వామ్యపక్షాలు తీవ్రంగా ఖండించాయి. ఈ సందర్భంగా మహిళా బిల్లు వీగిపోవడంపై ఎన్డీయేలో కీలక భాగస్వామిగా ఉన్న టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబుతోపాటు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. ఇండి కూటమి తీరును ఖండించారు.
Also Read: Akshaya Tritiya Offers: అక్షయ తృతీయకు దుబాయ్ సంస్థలు బంపర్ ఆఫర్లు.. 40 నుంచి 70 శాతం డిస్కౌంట్
'కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్షం మహిళలను మోసగించింది. మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకోవడంతో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ప్రతిపక్షం మహిళా సాధికారత వైపు భారత్ వేయాల్సిన చారిత్రాత్మక అడుగును అడ్డుకుంది. ఇది కేవలం రాజకీయపరమైన అడ్డంకి మాత్రమే కాదు. సమాన హక్కులు, సముచిత ప్రాతినిధ్యం కోరుతున్న కోట్లాది మహిళలకు చేసిన ద్రోహం. కాంగ్రెస్ నేతృత్వంలోని పార్టీలు చేసిన ద్రోహాన్ని దేశం గుర్తుంచుకుంటుంది' అని సీఎం చంద్రబాబు 'ఎక్స్'లో పోస్టు చేశారు. ఈ సందర్భంగా అమిత్ షా ట్వీట్ను రీట్వీట్ చేశారు.
Also Read: Women Reservation Bill: ప్రధాని మోదీకి వరుస ఎదురుదెబ్బలు.. నల్ల చట్టాల నుంచి మహిళా రిజర్వేషన్ దాకా
‘నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ల బిల్లులను వ్యతిరేకించిన పార్టీలు, దానివల్ల తామేం సాధించామనేది గట్టిగా ఆత్మపరిశీలన చేసుకోవాలి. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాల్లో సీట్ల సంఖ్య తగ్గేవనేది వాస్తవం. అదే సమయంలో మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా వాయిదా పడింది. దీంతో అటు దక్షిణాది రాష్ట్రాలకు, ఇటు మహిళలకు న్యాయం జరగలేదు. ఒకవేళ 2026 జనాభా లెక్కలు అమలైతే దక్షిణాది రాష్ట్రాల పరిస్థితి మరింత దారుణంగా మారుతుంది. ఇప్పటికే కుటుంబ నియంత్రణ పాటించడంతో జనాభా పెరుగుదల తగ్గిన దక్షిణాది రాష్ట్రాల్లో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంటుంది’ అని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ఆందోళన వ్యక్తం చేశారు.
మహిళా శక్తిని దూరం చేశారు
'చట్ట సభల్లో మహిళా శక్తిని పెంపొందించే సదావకాశాన్ని ప్రతిపక్ష పార్టీలు దూరం చేశాయి. మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రతిపక్షాలు కూడా ఆమోదించి ఉంటే వారికీ గౌరవం దక్కేది. రానున్న రోజుల్లోనైనా మహిళా శక్తికి చట్ట సభల్లో సముచిత స్థానం దక్కుతుంది. నరేంద్ర మోదీ ఈ బిల్లును లోక్సభ ముందుకు తీసుకువచ్చిన ప్రక్రియను ఎన్డీయే భాగస్వామ్య పక్షంగా జనసేన పార్టీ స్వాగతిస్తుంది. ఈ బిల్లు ఆమోదం పొంది ఉంటే యావత్ భారత మహిళలు ఎంతో సంతోషించి ఉండేవారు' అని జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
IPL 2026: కలకత్తా ఐదో ఓటమి.. గిల్ దంచుడుకు గుజరాత్ టైటాన్స్ భారీ విజయం
Ahmedabad, Gujarat:Gujarat Titans Hattrick Win: గత రెండు సీజన్ల కిందట చాంపియన్గా నిలిచిన కలకత్తా నైట్రైడర్స్ జట్టు 2026 సీజన్లో పేలవ ప్రదర్శన కనబరుస్తోంది. అదే పేలవ ప్రదర్శన గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లోనూ మాజీ చాంపియన్ ప్రదర్శించింది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన కీలక మ్యాచ్లో 000 తేడాతో కలకత్తా నైట్రైడర్స్పై గుజరాత్ టైటాన్స్ విజయం సాధించింది. శుభమన్ గిల్ భారీ పరుగులు జట్టు విజయానికి దోహదం చేశాయి.
Women Reservation Bill: ప్రధాని మోదీకి వరుస ఎదురుదెబ్బలు.. నల్ల చట్టాల నుంచి మహిళా రిజర్వేషన్ దాకా
New Delhi, Delhi:Women Reservation Bill Falls: బంపర్ మెజార్టీతో మూడోసారి అధికారం దక్కించుకున్నా కూడా కీలకమైన బిల్లుల విషయంలో ఎన్డీయే ప్రభుత్వానికి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. తాజాగా మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో కూడా ఎదురుదెబ్బ తగిలింది. సంపూర్ణమైన మెజార్టీ ఉందని భావించి ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయింది. ఆమోదం పొందుతుందని అందరూ భావించగా ఊహించని విధంగా బిల్లు వీగిపోవడం సంచలనం రేకెత్తుతోంది.
Also Read: Govt Employees: ప్రభుత్వ ఉద్యోగుల ఆందోళనలతో దద్దరిల్లిన తెలంగాణ సెక్రటేరియట్, కలెక్టరేట్
వాస్తవంగా అయితే మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టి ఉంటే ఆమోదం పొంది ఉండేది. కానీ దీని చాటున డీలిమిటేషన్ బిల్లు కూడా ప్రవేశపెట్టడంతో ఎన్డీయే కూటమి మినహా మిగతా అన్ని పార్టీల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మహిళల రిజర్వేషన్ల బిల్లుకు సంపూర్ణ మద్దతు పలుకుతాం అని ప్రకటించి.. దాని చాటున డీలిమిటేషన్ బిల్లును పెట్టడాన్ని ఇండి కూటమితోపాటు మిగతా పార్టీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. ప్రధాని మోదీ మూడుసార్లు అధికారం చేపట్టిన తర్వాత కొన్ని కీలక అంశాల్లో ఎదురుదెబ్బ తగిలింది. వాటిలో వ్యవసాయానికి సంబంధించిన మూడు నల్ల చట్టాలు.. ఇప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లు.
Also Read: Bandi Sanjay: సోనియాగాంధీని రేవంత్ రెడ్డి బలిదేవత అనలేదా?: బండి సంజయ్
మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు అమలుచేసేలా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టారు. సుదీర్ఘ చర్చ జరిగిన అనంతరం శుక్రవారం సాయంత్రం ఓటింగ్ నిర్వహించగా.. ఊహించని రీతిలో ఆ బిల్లు వీగిపోయింది. మహిళా రిజర్వేషన్ చట్టం సవరణ బిల్లు అవసరమైన మెజారిటీ సాధించలేకపోవడం ఊహించనిది. ఓటింగ్ ప్రక్రియలో మొత్తం 528 మంది సభ్యులు పాల్గొనగా.. బిల్లుకు అనుకూలంగా 298 మంది ఓటు వేయగా.. వ్యతిరేకంగా 230 మంది ఓటు వేశారు. దీంతో ఆ బిల్లు మూడింట రెండొంతుల మెజార్టీ సాధించలేకపోయింది. బిల్లు వీగిపోవడంపై ఇండి కూటమి హర్షం వ్యక్తం చేసింది. జాతీయ విపత్తును అడ్డుకున్నామని ఇండి కూటమి పేర్కొంది.
కాంగ్రెస్ పార్టీ లోక్సభ పక్ష నేత రాహుల్ గాంధీ స్పందిస్తూ.. 'ఈ బిల్లులు రాజ్యాంగంపై దాడి చేయడమే. రాజ్యాంగ విరుద్ధమైన బిల్లులను ఓడించాం' అని ప్రకటించారు. ఇది మహిళా బిల్లు కాదని తాము స్పష్టం చెప్పామని.. మహిళా రిజర్వేషన్ బిల్లుకు తాము వ్యతిరేకం కాదని చెప్పినట్లు గుర్తుచేశారు. 'మహిళా బిల్లును డీలిమిటేషన్తో ముడిపెట్టారు. ఇది ముమ్మాటికీ మహిళా బిల్లు కాదు' అని తెలిపారు. ఇది దేశ రాజకీయ నిర్మాణంపై దాడి.. ఈ కుట్రను అడ్డుకున్నామని వెల్లడించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
Strait Of Hormuz Open: ఇజ్రాయెల్తో యుద్ధంలో ఇరాన్ కీలక ప్రకటన..ఈ యుద్ధంలో అమెరికా విజయం సాధించినట్టేనా? ఏం జరుగుతోంది?
Strait Of Hormuz Open News: పశ్చిమాసియాలో ఇటీవలే యుద్ధానికి బ్రేక్ పడింది. అయితే యుద్ధం తాలూకా కాల్పుల విరమణకు అమెరికా, ఇరాన్ దేశాలు ఒప్పందాలు చేసుకోగా.. ఆనాటి నుంచి 15 రోజుల వరకు హోర్ముజ్ జలసంధి 'పూర్తిగా తెరిచి ఉంటుందని' ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి ప్రకటించారు. ప్రపంచంలోని అన్ని వాణిజ్య నౌకల కోసం ఈ మార్గం తెరిచే ఉంటుందని ఆయన 'X' (ట్విట్టర్) వేదికగా స్పష్టం చేశారు.
లెబనాన్లో కాల్పుల విరమణకు అనుగుణంగా, ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్కు చేసిన ఒప్పందం ప్రకారం.. కాల్పుల విరమణలో మిగిలిన రోజులకు గానూ హోర్మూజ్ జలసంధి పూర్తిగా తెరిచే ఉంటుందని ఆయన ప్రకటించారు. ఇదిలా ఉండగా హోర్ముజ్ జలసంధి 'పూర్తిగా తెరిచి ఉందని' అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా తన సోషల్ మీడియాలో ధృవీకరించారు. "హోర్ముజ్ జలసంధి పూర్తిగా తెరిచి ఉందని, పూర్తి రాకపోకలకు సిద్ధంగా ఉందని ఇరాన్ ఇప్పుడే ప్రకటించింది. ధన్యవాదాలు!" అని ట్రంప్ చెప్పుకొచ్చారు.
అయితే మరో పోస్ట్లో ట్రంప్ స్పష్టం చేస్తూ, జలసంధి తెరుచుకున్నప్పటికీ, ఇరాన్తో 'లావాదేవీ' పూర్తయ్యే వరకు అమెరికా నౌకాదళ దిగ్బంధనం పూర్తి స్థాయిలో కొనసాగుతుందని తెలిపారు. అసోసియేటెడ్ ప్రెస్ ప్రకారం.. హోర్ముజ్ జలసంధిని తెరుస్తున్నట్లు ప్రకటించిన తర్వాత ముడి చమురు ధరలు 10 శాతం పడిపోయాయి.
లెబనాన్, ఇజ్రాయెల్ మధ్య 10 రోజుల కాల్పుల విరమణ ఒప్పందాన్ని ట్రంప్ గురువారం ప్రకటించారు. ఇరు దేశాల నాయకుల మధ్య మొట్టమొదటి సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి తాను ప్రయత్నిస్తున్నానని కూడా ట్రంప్ చెప్పుకొచ్చారు. ఇరాన్తో యుద్ధాన్ని ముగించేందుకు ఒక ఒప్పందానికి రావాలనే అమెరికా ప్రయత్నాలలో భాగంగానే ఈ రెండు యుద్ధ దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఏ ఒప్పందంలోనైనా లెబనాన్ కాల్పుల విరమణ తప్పనిసరిగా ఉండాలని టెహ్రాన్ పట్టుబట్టింది.
ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు, లెబనాన్ అధ్యక్షుడు జోసెఫ్ ఔన్లతో జరిపిన ఫోన్ సంభాషణల తర్వాతే ఈ ఘర్షణలను నిలిపివేసే ఒప్పందం కుదిరిందని అమెరికా అధ్యక్షుడు తెలిపారు. రాబోయే నాలుగు లేదా ఐదు రోజుల్లో నెతన్యాహు, ఔన్ వైట్ హౌస్ను సందర్శిస్తారని తాను ఆశిస్తున్నట్లు ఆయన ఆ తర్వాత చెప్పారు.
మరోవైపు హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరుస్తున్నట్లు ప్రకటించడాన్ని ఫ్రాన్స్, యూకే నాయకులు స్వాగతించారు. కానీ అది శాశ్వతం కావాలని వారు ఆశించారు. సముద్ర భద్రతను పునరుద్ధరించడానికి ఒక అంతర్జాతీయ మిషన్ను ప్లాన్ చేస్తూనే ఉంటామని, వచ్చే వారం లండన్లో సైనిక ప్రణాళికల నిపుణులతో సమావేశం కానున్నామని అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Monkey saves child Video: అరెవావ్.. బాల్కనీలో వేలాడుతున్న బాలుడ్ని కాపాడిన వానరం.. సంచలనంగా మారిన వీడియో..
Hyderabad, Telangana:Monkey saved a child from falling off a balcony Video: ప్రస్తుతం ఏఐ జనరేషన్ నడుస్తుంది. ప్రతిరోజు సోషల్ మీడియాలో కుప్పలు తెప్పలుగా వీడియోలు వైరల్గా మారుతున్నాయి. దీనిలో ఏవి నిజమైనవి మరీ ఏవి అసత్యమైనవి అని తెలుసుకొవడం పెద్ద సమస్యగా మారింది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఇటీవల వైరల్గా మారుతున్న వీడియోలను చూస్తుంటే కొన్ని చాలా డౌటానుమానం కల్గేలా ఉంటున్నాయి. కొంత మంది కావాలని పబ్లిసిటీ కోసం, ఫెక్ ప్రచారాంలు, వ్యూస్ కోసం ఏఐతో వీడియోలను జనరేట్ చేస్తున్నారు. దీంతో ఇది కాస్త తెలియని అమాయక జనాలు వైరల్ అవుతున్న వాటిని చూసి నిజమనుకుంటున్నాయి. ఈనేపథ్యంలో ప్రస్తుతం ఒక వీడియో నెట్టింట బాగా వైరల్గా మారింది.
దీనిలో ఒక బాలుడు బాల్కనీ నుంచి వేలాడుతున్నాడు. మరీ ఆడుకుంటూ అక్కడ వేలాడుతున్నాడో లేదా నిజంగానే అక్కడ దిగలేక ఇబ్బంది పడుతున్నాడో గానీ ఆ సమయంలోనే రెప్పపాటులో ఒక కొండెంగ అక్కడకు వచ్చింది. వెంటనే ఒక్క ఉదుటున దూకీ బాలుడ్ని బాల్కనీ నుంచి పట్టుకుని మరో చోట దూకి అతడి ప్రాణాలు కాపాడింది.
ఈ ఘటనను కొంతమంది వీడియో తీశారు. అది కాస్త నెట్టింట వైరల్గా మారింది. ఆ వానరం అచ్చం హనుమాన్ లో అక్కడకు వచ్చి ఆ బాలుడి ప్రాణాలు కాపాడింది.
Read more: Video Viral: అరె వావ్.. బైక్ ఎక్కి బుసలు కొడుతూ ఫోటోలకు ఫోజులిచ్చిన నాగు పాము.. వీడియో వైరల్..
పొరపాటున అతను లేకుంటే ఏమయ్యేది అని అందరు షాక్ అవుతున్నారు. ఈ వీడియో వైరల్ గా మారింది. కొంత మంది దీన్ని ఏఐ అని కొట్టిపారేస్తుండగా , మరికొంత మంది మాత్రం కొండెంగకు ఏదైన ట్రైనింద్ ఇచ్చుంటారని కూడా అంటున్నారు.
