ఖమ్మం: సెప్టెలిక్ ట్యాంకులతో ధర్నా
Dhamsalapuram, Telangana:ఖమ్మం నగర కార్పోరేషన్ పరిధిలోని సెప్టిక్ ట్యాంక్ కార్మికులు ధర్నా చేపట్టారు. ఈ క్రమంలో వారు సెప్టిక్ ట్యాంక్ వాహనాలతో కార్పోరేషన్ కార్యాలయం ఎదుట ధర్నా చేసారు. వ్యర్థాలను డంప్ చేయడానికి ఖమ్మం చుట్టుప్రక్కల సుమారు 20 కిలో మీటర్ల మేర ఎక్కడ డంప్ చేయనివ్వడం లేదని వారు ఆవేధన వ్యక్తం చేసారు. వరదలు వచ్చిన తరువాత ఈ సమస్య మరింత తీవ్రంగా మారిందన్నారు. తక్షణమే అధికారులు సమస్యను పరిష్కారించాలని డిమాండ్ చేస్తున్నారు.हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
మల్లారెడ్డి వైఖరిపై BRS కార్యకర్త ఆగ్రహం.. సొంత రక్తంతో బహిరంగ లేఖ!
Hyderabad, Telangana:Brs Malla Reddy: మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ప్రవర్తన ప్రస్తుతం బీఆర్ఎస్ (BRS) వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా నిలవాల్సింది పోయి.. కార్యకలాపాలకు దూరంగా ఉంటూ ప్రత్యర్థుల వేదికలపై దర్శనమివ్వడంపై స్థానిక నాయకులు, శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ BRS కార్యకర్త తీవ్ర మనస్తాపానికి గురై.. తన సొంత రక్తంతో మల్లారెడ్డికి బహిరంగ లేఖ రాయడం నియోజకవర్గంతో పాటు రాష్ట్ర రాజకీయాల్లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
రక్తంతో రాసిన లేఖ..
తన కోసం, పార్టీ విజయం కోసం పగలు, రాత్రి తేడా లేకుండా BRS జెండాను భుజాన మోసిన లక్షలాది మంది కార్యకర్తల విశ్వాసాన్ని మల్లారెడ్డి దెబ్బతీస్తున్నారని సదరు కార్యకర్త ఆ లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్నప్పుడు నిమిషం తీరిక లేకుండా పరుగులు తీసి.. పదుల సంఖ్యలో కార్యక్రమాలు చేపట్టిన మల్లారెడ్డి.. నేడు పార్టీకి అత్యంత అవసరమైన సమయంలో ఎందుకు దూరంగా ఉంటున్నారని నిలదీశారు.



కార్యకర్తలను తన విద్యాసంస్థల్లో పనిచేసే ఉద్యోగులుగా భావిస్తున్నారని.. ధనాహంకారంతో ప్రవర్తిస్తూ.. పార్టీ పునాదులను బలహీనపరుస్తున్నారని లేఖలో ఆగ్రహం వ్యక్తం చేశారు. BRS పార్టీ అనేది తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక అని.. అలాంటి పార్టీ సిద్ధాంతాలను, కార్యకర్తల త్యాగాలను తుంగలో తొక్కి.. ఆత్మగౌరవాన్ని అవమానించడం దారుణమని లేఖలో తెలిపారు.
కార్యకర్తల చెమటతో పాటు కష్టాన్ని మరచిపోయి.. స్వార్థ రాజకీయాలు చేసే ఏ నాయకుడైనా చరిత్రహీనుడిగా కాలగర్భంలో కలసిపోవడం ఖాయమని తీవ్ర హెచ్చరిక చేశారు. ఒక వైపు నాయకులు మారుతున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో గులాబీ జెండాను గుండెల్లో పెట్టుకున్న కార్యకర్త ఆవేదనకు ఈ రక్తంతో రాసిన లేక నిదర్శనంగా నిలిచింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
EPS-95 Pension Hike: ఉద్యోగులకు గుడ్న్యూస్..కనీస పెన్షన్ రూ.7,500కు పెంపు..పార్లమెంట్లో మంత్రి ప్రకటన!
Hyderabad, Telangana:EPS-95 Pension Hike 2026: ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ (EPS) కింద కనీస పింఛను మొత్తాన్ని ప్రస్తుతమున్న రూ.1,000 నుండి రూ. 7,500కు పెంచాలంటూ దేశవ్యాప్తంగా ఉద్యోగుల సంఘాలు సుదీర్ఘకాలంగా డిమాండ్ చేస్తున్నాయి. అయితే, ఈ పెంపుదలపై కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో స్పష్టతనిచ్చింది.
ప్రస్తుతం కనీస పింఛను పెంపుపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని, దానికి సంబంధించి ఎలాంటి కాలపరిమితి కూడా లేదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.ఈ మేరకు లోక్సభలో ఎంపీ భాసాహెబ్ రాజారామ్ వాక్చౌరే అడిగిన ప్రశ్నకు కార్మిక, ఉపాధి శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే లిఖితపూర్వక సమాధానమిచ్చారు.
లోక్సభలో కేంద్ర మంత్రి వివరణ
కనీస పింఛను రూ.1,000 నుంచి రూ.2,000 వరకు ఇస్తున్నారని, ఇది వృద్ధులకు సరిపోదని ఎంపీ లేవనెత్తిన ప్రశ్నకు మంత్రి స్పందిస్తూ.. "పింఛను నిధి సుస్థిరత, భవిష్యత్తు బాధ్యతలను దృష్టిలో ఉంచుకుని EPFO సభ్యులకు బలమైన సామాజిక భద్రత కల్పించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. EPFOకి అందించే 1.16% బడ్జెట్ మద్దతుకు అదనంగా, EPS-1995 కింద పెన్షనర్లకు నెలకు కనీసం రూ.1,000 లభించేలా బడ్జెట్ ద్వారా ప్రభుత్వం సహాయం అందిస్తోంది" అని పేర్కొన్నారు.
పింఛను నిధికి నిధులు ఎలా సమకూరుతాయంటే?
యజమాని వాటాగా ఉద్యోగి వేతనంలో 8.33% వంతు ఉండగా.. కేంద్ర ప్రభుత్వ వాటా నెలకు రూ. 15,000 వరకు ఉన్న వేతనంపై 1.16% బడ్జెట్ మద్దతు ఇస్తుంది. ఈ నిధి ఆధారంగానే పింఛను చెల్లింపులు జరుగుతాయని, ఏటా నిధి విలువను లెక్కిస్తారని ప్రభుత్వం తెలిపింది.
'EPS 2026' కీలకమైన మార్పులివే!
ప్రభుత్వం పాత 'EPS 1995', 'ఎంప్లాయీస్ ఫ్యామిలీ పెన్షన్ స్కీమ్ 1971' స్థానంలో 'కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ, 2020' కింద నూతన 'ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ (EPS) 2026'ను నోటిఫై చేసింది.
ఈ కొత్త పథకంలో ప్రవేశపెట్టిన ప్రధాన మార్పులు..
1) వేగవంతమైన పరిష్కారం అనగా..పెన్షన్ క్లెయిమ్లను గరిష్టంగా 20 రోజుల్లోపు పరిష్కరించాలి.
2) ఆలస్యమైతే వడ్డీ.. క్లెయిమ్ ఆలస్యమైతే లబ్ధిదారునికి 12% వడ్డీ చెల్లిస్తారు.
3) డిజిటల్ విధానం.. యాజమాన్యాల (Employers) కోసం డిజిటల్ వర్తింపు నిబంధనలను నిర్బంధం చేశారు.
4) అధిక పెన్షన్.. అధిక పెన్షన్కు సంబంధించిన స్పష్టమైన నిబంధనలను ఇందులో పొందుపరిచారు.
గమనిక: ఉద్యోగి నిష్క్రమించే ముందు చివరి 60 నెలల సగటు జీతాన్నే పెన్షన్కు అర్హత ఉన్న జీతంగా పరిగణిస్తారు.
Also Read: ఉద్యోగుల గ్రాట్యూటీ రూల్స్..5 ఏళ్లు పనిచేయకపోయినా గ్రాట్యుటీ ఎలా పొందవచ్చో తెలుసా?
Also Read: తెలుగు రాష్ట్రాల ప్రజలకు బిగ్ అలర్ట్.. సోమవారం భారీ వర్ష సూచన..ఈజిల్లాల్లో భారీవర్షం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
50MP Zeiss కెమెరా, 90W ఛార్జింగ్.. Vivo X300 E ప్రీ-సేల్స్ ప్రారంభం!
Hyderabad, Telangana:Vivo X300 E Launched: ప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ Vivo ప్రీమియం విభాగంలో మరో సరికొత్త మోడల్ను విడుదల చేయడానికి సిద్ధమైంది. దీనిని కంపెనీ Vivo X300 E స్మార్ట్ఫోన్ పేరుతో అందుబాటులోకి తీసుకు రాబోతోంది. ముఖ్యంగా ఈ స్మార్ట్ఫోన్ కోసం సంస్థ తన అధికారిక వెబ్సైట్లో ప్రీ-సేల్స్ (Pre-sales) ప్రక్రియను గురువారం నుంచి ప్రారంభించింది. అయితే, దీనిని కంపెనీ జులై 27వ తేదీన ఈ ఫోన్ అధికారికంగా మార్కెట్లోకి విడుదల చేయబోతోంది. ఈ స్మార్ట్ఫోన్కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఇటీవల భారత్లో విడుదలైన X300 FE మోడల్కు భిన్నమైన డిజైన్తో, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, మెటల్ ఫ్రేమ్తో ఈ ఫోన్ రెడీ అయిన్నట్లు తెలుస్తోంది. ఇది V2612A మోడల్ నంబర్తో వస్తోంది. ఈ ఫోన్ బ్లాక్, వైట్తో పాటు ఆరెంజ్ రంగుల్లో అందుబాటులో తీసుకు వచ్చింది..
అద్భుతమైన డిస్ప్లే..
ఈ Vivo X300 E స్మార్ట్ఫోన్ చాలా ప్రత్యేకమైన 6.59 అంగుళాల 1.5K ఫ్లాట్ AMOLED డిస్ప్లేను కలిగి ఉంటుంది. ఇది 2750×1260 పిక్సెల్స్ రెజల్యూషన్తో పాటు 120Hz రిఫ్రెష్ రేట్, HDR10+ సపోర్ట్, 5000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ సపోర్ట్తో లభిస్తోంది.. గేమింగ్, మల్టీటాస్కింగ్ కోసం క్వాల్కమ్ టాప్-ఎండ్ స్నాప్డ్రాగన్ 8 Gen 5 (3nm) చిప్సెట్తో పాటు అడ్రెనో 829 GPUతో అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఇది ఆండ్రాయిడ్ 16 ఆధారిత OriginOS 6 ఆపరేటింగ్ సిస్టమ్పై రన్ అవుతుందని కంపెనీ తెలిపింది..
పవర్ ఫుల్ బ్యాటరీ..
కెమెరా వివరాల్లోకి వెళితే.. వీవో జైస్ (Zeiss) ఇమేజింగ్ సిస్టమ్ను ఉపయోగించింది. దీని వెనక భాగంలో ఎంతో శక్తివంతమైన 50 MP ప్రధాన కెమెరా, 8 MP ఆల్ట్రా-వైడ్ లెన్స్, 50 MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరాతో అందుబాటులోకి వచ్చింది. ఫ్రంట్ భాగంలో సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 50 MP ఆటోఫోకస్ ఫ్రంట్ కెమెరాను కూడా అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఇందులో కంపెనీ ఏకంగా 7015mAh భారీ బ్యాటరీని అందుబాటులోకి తీసుకు వచ్చింది. దీనికి తోడు 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది.
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
ఇతర కీలక ఫీచర్లు..
ఈ ఫోన్కు ధూళి, వాటర్ రిసిస్టెంట్ కోసం IP68 + IP69 రేటింగ్ను కూడా అందించింది.. భద్రత కోసం ఇన్-డిస్ప్లే ఆల్ట్రాసోనిక్ ఫింగర్ప్రింట్ సెన్సార్ను అందించారు. ఇది కేవలం 7.99 మిమీ మందంతో పాటు 203 గ్రాముల బరువుతో ఉండే ఈ స్మార్ట్ఫోన్ 5G, వై-ఫై 7, బ్లూటూత్ 6.0, USB టైప్-సి, NFC వంటి అత్యాధునిక కనెక్టివిటీ ఆప్షన్లను కూడా కలిగి ఉంటుంది. ర్యామ్ విభాగంలో 12GB/16GB LPDDR5X ఆప్షన్లు, స్టోరేజ్ విభాగంలో 256GB నుంచి 1TB UFS 4.1 వరకు లభిస్తుంది..
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Abrar Ahmed Sunrisers: కావ్యా పాప కొంపముంచిన పాకిస్థాన్ స్పిన్నర్..రూ.2.45 కోట్లు దండగ..గెలిచే మ్యాచ్ ఇలా..!
England:Abrar Ahmed Sunrisers Leeds: ది హండ్రెడ్ లీగ్ 2026 సీజన్ తొలి మ్యాచ్లోనే కావ్య మారన్ యాజమాన్యంలోని సన్రైజర్స్ లీడ్స్ జట్టుకు చేదు అనుభవం ఎదురైంది. ఎంఐ లండన్తో జరిగిన ఈ ఓపెనింగ్ మ్యాచ్లో సన్రైజర్స్ లీడ్స్ 7 వికెట్ల తేడాతో ఘోర పరాజయం పాలైంది. కెప్టెన్ సామ్ కరన్, విద్వంసకర బ్యాటర్ నికోలస్ పూరన్ ధనాధన్ ఇన్నింగ్స్లతో ఎంఐ లండన్ సునాయాస విజయాన్ని నమోదు చేసింది.
మ్యాచ్ హైలైట్స్
ఎంఐ లండన్ టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్కు దిగిన సన్రైజర్స్ లీడ్స్ జట్టు 99 బంతుల్లో 143 పరుగులకు ఆలౌట్ అయ్యింది. అయితే 144 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఎంఐ లండన్ జట్టు 84 బంతుల్లో 3 వికెట్లు కోల్పోయి 144 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది (ఇంకా 16 బంతులు మిగిలి ఉండగానే విజయం).
మొదట బ్యాటింగ్ చేసిన సన్రైజర్స్ లీడ్స్కు ఓపెనర్లు మిచెల్ మార్ష్ (41), ర్యాన్ రికెల్టన్ (25) ఆకట్టుకునే ఆరంభాన్ని ఇచ్చారు. ఆ తర్వాత జాక్ క్రౌలీ (11 బంతుల్లో 29), టామ్ ఆల్సాప్ (18 బంతుల్లో 31) రాణించడంతో జట్టు 143 పరుగులు చేయగలిగింది. స్టార్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ (8) మాత్రం తీవ్రంగా నిరాశపరిచాడు. ఎంఐ లండన్ బౌలర్లలో రిచర్డ్ గ్లీసన్ 19 బంతుల్లో 4 వికెట్లతో చెలరేగగా, సామ్ కరన్ 2, రషీద్ ఖాన్ 1 వికెట్ పడగొట్టారు.
విరుచుకుపడ్డ పూరన్, సామ్ కరన్
144 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఎంఐ లండన్కు ఆరంభంలోనే గట్టి షాక్ తగిలింది. విల్ జాక్స్ (2), జేమ్స్ విన్స్ (0) త్వరగానే పెవిలియన్ చేరారు. అయితే, ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ సామ్ కరన్ (60), నికోలస్ పూరన్ (22 బంతుల్లో 58) సన్రైజర్స్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. సిక్సర్లు, ఫోర్ల వర్షం కురిపిస్తూ మ్యాచ్ను ఏకపక్షం చేశారు. పూరన్ కేవలం 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోవడం విశేషం.
పాక్ స్పిన్నర్ అబ్రార్ను చితక్కొట్టిన పూరన్-కరన్
వేలంలో ప్రత్యేకంగా కొనుగోలు చేసి, ఈ మ్యాచ్తో అరంగేట్రం చేసిన పాకిస్తాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్కు ఈ మ్యాచ్ ఒక పీడకలగా మారింది. 70 బంతుల తర్వాత బౌలింగ్కు వచ్చిన అబ్రార్ అహ్మద్ ఒకే ఓవర్లో 3 సిక్సర్లు సమర్పించుకున్నాడు. తొలి బంతికి సామ్ కరన్ మిడ్వికెట్ మీదుగా భారీ సిక్స్ బాదగా, ఆ తదుపరి 74, 75వ బంతులకు నికోలస్ పూరన్ వరుసగా రెండు సిక్సర్లు బాది విజయానికి చేరువ చేశాడు. ఈ మ్యాచ్ను వీక్షించేందుకు మైదానానికి వచ్చిన టీమిండియా స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ కూడా పూరన్, కరన్ ల విధ్వంసకర హిట్టింగ్ను ఎంతో ఆస్వాదిస్తూ కనిపించాడు.
ఇంగ్లండ్ వేదికగా జరిగే 'ది హండ్రెడ్ 2026' లీగ్లో సన్రైజర్స్ ఫ్రాంచైజీ (సన్రైజర్స్ లీడ్స్) పాకిస్తానీ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ను వేలంలో సొంతం చేసుకోవడం క్రికెట్ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. 2008 ఐపీఎల్ తర్వాత ఏ ఐపీఎల్ ఫ్రాంచైజీ కూడా పాకిస్తాన్ ఆటగాళ్లను తమ జట్లలోకి తీసుకోలేదు. ప్రపంచవ్యాప్తంగా వివిధ లీగ్స్లో జట్లను కలిగి ఉన్న భారతీయ ఫ్రాంచైజీలు కూడా ఇదే విధానాన్ని పాటిస్తాయని అందరూ భావించారు. అయితే, కావ్య మారన్ యాజమాన్యంలోని సన్రైజర్స్ లీడ్స్ మాత్రం అబ్రార్ అహ్మద్ను £190,000 (సుమారు ₹2.45 కోట్లు) వెచ్చించి కొనుగోలు చేసింది.
కావ్య మారన్ ఏమన్నారంటే?
పాకిస్తాన్ ఆటగాడిని ఎంపిక చేసుకోవడంపై 'ది టెలిగ్రాఫ్' ఇంటర్వ్యూలో కావ్య మారన్ను సూటిగా ప్రశ్నించగా, ఆమె దానికి దౌత్యపరంగా సమాధానమిచ్చారు. ప్రత్యక్షంగా వివాదాల జోలికి వెళ్లకుండా సమాధానాన్ని దాటవేస్తూ.. "మా పురుషుల, మహిళల జట్ల ఎంపిక పట్ల మేము పూర్తి సంతృప్తితో ఉన్నాము. ఒక జట్టును నిర్మించేటప్పుడు మేము చాలా రకాల అంశాలను పరిగణనలోకి తీసుకుంటాము" అని ఆమె పేర్కొన్నారు.
'ది హండ్రెడ్ 2026' ప్రత్యేకతలు
ఈసారి 'ది హండ్రెడ్' లీగ్లో కేవలం ఇద్దరు పాకిస్తానీ ప్లేయర్లు మాత్రమే వేలంలో ఎంపికయ్యారు. అబ్రార్ అహ్మద్ను సన్రైజర్స్ లీడ్స్ దక్కించుకోగా, ఉస్మాన్ తారిఖ్ను బర్మింగ్హామ్ ఫీనిక్స్ జట్టు రూ.1.80 కోట్లకు (£140,000) సొంతం చేసుకుంది. జూలై 21న ప్రారంభమైన లీగ్ తొలి మ్యాచ్లోనే సన్రైజర్స్ లీడ్స్ తమ తుది జట్టు (Playing XI)లో అబ్రార్ అహ్మద్కు అవకాశం కల్పించింది. ఈ లీగ్లోని 8 జట్లలో 4 జట్లు ఐపీఎల్ యాజమాన్యాల చేతిలోనే ఉన్నాయి. సన్రైజర్స్ లీడ్స్ (SRH), ఎంఐ లండన్ (ముంబై ఇండియన్స్), మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ (LSG), సదరన్ బ్రేవ్స్ (ఢిల్లీ క్యాపిటల్స్ సహ యజమాని GMR గ్రూప్) వారు ఉన్నారు. జూలై 21న ప్రారంభమైన 'ది హండ్రెడ్' టోర్నీ ఆగస్టు 16న జరిగే ఫైనల్ మ్యాచ్తో ముగుస్తుంది.
Also Read: రిటైర్మెంట్ ఊహాగానాలపై రోహిత్ శర్మ ఊహించని ట్విస్ట్..బీసీసీఐ సెలెక్టర్లకు మాటల్లేవు!
Also REad: ఫిఫా వరల్డ్కప్ ఫైనల్లో డొనాల్డ్ ట్రంప్ హల్చల్..ట్రోఫీ స్టేజ్పై వింత ప్రవర్తన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
మోస్ట్ పవర్ఫుల్ 10,000mAh బ్యాటరీ, 200MP కెమెరాతో Redmi Note 17 Pro Max త్వరలో విడుదల!
Hyderabad, Telangana:Redmi Note 17 Pro Max: ప్రముఖ చైనీస్ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ షామీ (Xiaomi) తన సబ్-బ్రాండ్ రెడ్మీ ఇటీవలే రెడ్మీ నోట్ 17 (Redmi Note 17 Pro Max) సిరీస్ను మార్కెట్లోకి విడుదల చేసిన సంగతి తెలిసిందే.. ప్రస్తుతం ఈ సిరీస్లో స్టాండర్డ్ మోడల్తో పాటు రెడ్మీ నోట్ 17 ప్రో అందుబాటులో ఉన్నాయి. ఇదిలా ఉంటే.. ఈ సిరీస్కు కొనసాగింపుగా సరికొత్త ఫ్లాగ్షిప్ ఎడిషన్ రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్ మోడల్ను త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి కంపెనీ సన్నాహాలు చేస్తున్నాయి.. ఇది విడుదలైన అన్ని మోడల్స్ కంటే చాలా అద్భుతంగా ఉంటుంది. అంతేకాకుండా ఎన్నో రకాల ప్రీమియం ఫీచర్స్తో అందుబాటులోకి రాబోతోంది.
థాయిలాండ్కు చెందిన నేషనల్ బ్రాడ్కాస్టింగ్ అండ్ టెలికమ్యూనికేషన్స్ కమీషన్ (NBTC) డేటాబేస్లో రెడ్మీ నోట్ 17తో పాటు రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్ అంతర్జాతీయ మోడల్ నంబర్లు 26081RA18G, 2609FRA74Gగా కనిపించడం విశేషం.. దీంతో ఈ ఫోన్ల గ్లోబల్ లాంచ్ అతిత్వరలోనే ఉండబోతోందని తెలుస్తోంది.. అంతేకాకుండా ఇవి ప్రీమియం డిజైన్స్తో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మాక్స్ మోడల్ ప్రీమియం లుక్లో కనిపించబోతోంది.
ఫీచర్లు, స్పెసిఫికేషన్ల వివరాలు..
లీకైన వివరాల ప్రకారం.. ఈ ప్రో మాక్స్ వేరియంట్లో అత్యుత్తమ టెక్నాలజీని వినియోగించిన్నట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్ఫోర్ వెనుక భాగంలో Samsung సెన్సార్కు సంబంధించిన 200 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో పాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్ అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక సెల్ఫీలతో పాటు వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 32 మెగాపిక్సెల్ హై-రిజల్యూషన్ కెమెరాలు కూడా అందుబాటులో ఉన్నాయి..
శక్తివంతమైన పర్ఫార్మెన్స్ కోసం ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 7500 (MediaTek Dimensity 7500) ప్రాసెసర్ను అందించనున్నట్లు సమాచారం. ఈ ఫోన్లో ఎంతో శక్తివంతమైన 10,000 mAh సామర్థ్యం గల భారీ బ్యాటరీని కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా లభించే ఫోన్లతో పోలిస్తే.. ఇది వినియోగదారులకు రోజులకు పైగా సుదీర్ఘమైన బ్యాటరీ లైఫ్ను అందిస్తుందని కంపెనీ వెల్లడించింది..
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
సిరీస్లోని స్టాండర్డ్ మోడల్ వివరాలు..
ఇటీవల చైనాలో విడుదలైన బేస్ మోడల్ రెడ్మీ నోట్ 17 స్మార్ట్ఫోన్లో 7-అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ OLED డిస్ప్లేను కలిగి ఉంటుంది. అంతేకాకుండా 120Hz రిఫ్రెష్ రేట్తో పాటు ఆండ్రాయిడ్ 16 ఆధారిత HyperOS 3, స్నాప్డ్రాగన్ 4 జెన్ 4 చిప్సెట్తో పాటు 8,000 mAh బ్యాటరీ వంటి అధునాతన హార్డ్వేర్ ఫీచర్లను కూడా అందుబాటులోకి తీసుకు వచ్చింది.. అత్యాధునిక 200MP కెమెరాతో పాటు పవర్-ప్యాక్డ్ డైమెన్సిటీ ప్రాసెసర్తో పాటు భారీ 10,000mAh బ్యాటరీతో రాబోతున్నట్లు రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్ మిడ్-రేంజ్ ప్రీమియం స్మార్ట్ఫోన్ మార్కెట్లో సరికొత్త సంచలనం సృష్టించడం ఖాయమని తెలుస్తోంది. త్వరలోనే దీని అధికారిక ధర, విడుదల తేదీలను కంపెనీ ప్రకటించబోతోంది.
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
పుష్య నక్షత్రంలోకి గురుడు.. ఆగస్టు 3 తర్వాత ఈ రాశుల జాతకం మారబోతోంది!
Hyderabad, Telangana:Jupiter Nakshatra Transit 2026 Telugu: నవగ్రహాలలో అత్యంత శుభ గ్రహంగా.. జ్ఞానం, సంపద, వివాహంతో పాటు ఆధ్యాత్మికతకు కారకుడైన బృహస్పతి త్వరలోనే తన నక్షత్ర పదాన్ని మార్చబోతున్నాడు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. 2026 ఆగస్టు 3వ తేదీ రాత్రి 11:17 గంటలకు గురు గ్రహం పుష్య నక్షత్రం 4వ పాదంలోకి ప్రవేశించబోతోంది. ఈ నక్షత్ర సంచారం ఆగస్టు 19 వరకు ఇదే పాదంలో కొనసాగుతుంది.. గురు గ్రహం ఈ కీలక మార్పు వల్ల ముఖ్యంగా 4 రాశుల వారి జాతకం పూర్తిగా మారబోతోంది. వీరి కెరీర్, ఆర్థిక పరిస్థితులు పూర్తిగా మారుతాయి.. అనుకోని ధన యోగం కలుగుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపునులు తెలుపుతున్నారు.
ఈ రాశులవారికి బంపర్ లాభాలు:
కన్యా రాశి
కన్యా రాశి వారికి గురు నక్షత్ర సంచారం అనేక విజయావకాశాలను తెచ్చిపెడుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. వీరికి సమాజంలో గౌరవ మర్యాదలు విశేషంగా పెరుగుతాయని నిపుణులు తెలుపుతున్నారు. ఉద్యోగంలో పదోన్నతులు లభించి.. కెరీర్లో కొత్త శిఖరాలను అధిరోహిస్తారు. కోర్టు కేసులతో పాటు సుదీర్ఘకాలంగా నడుస్తున్న వివాదాలు అనుకూలంగా పూర్తవుతాయి.. అనవసర ఖర్చులు అదుపులోకి వచ్చి.. బలమైన ఆర్థిక స్థిరత్వం లభిస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.
ధనుస్సు రాశి
గురుడు అనుకూల స్థానంలోకి రావడంలో ధనుస్సు రాశి వారికి సకల శుభాలు కలుగుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు.. ఒకదానికంటే ఎక్కువ మార్గాల నుంచి ఆదాయం లభిస్తుంది.. అంతేకాకుండా ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఊహించని అభివృద్ధిని పొందుతారు. ప్రేమ వ్యవహారాలు పెళ్లి పీటల వరకు వెళ్లే బలమైన అవకాశాలు ఉన్నాయి. అదృష్టం తోడ్పడటంతో నిలిచిపోయిన కష్టమైన పనులు కూడా సులభంగా పూర్తవుతాయి.
మకర రాశి
పుష్య నక్షత్రంలో గురు సంచారం మకర రాశి వారికి అత్యంత లాభదాయకంగా ఉండబోతోంది. ఆర్థిక అంశాల్లో తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో భారీ లాభాలను తెచ్చిపెడతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. పెద్ద బిజినెస్ డీల్స్ కుదిరే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కుటుంబ సమస్యలు, ఒత్తిడి తొలగిపోయి సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. ఇవే కాకుండా ఆర్థికంగా కూడా దిమ్మతిరిగే ధన లాభాలు కూడా పొందే అవకాశాలు ఉన్నాయి.
మీన రాశి
మీన రాశి వారికి ఈ గురు సంచారం అన్ని రంగాల్లోనూ తిరుగులేని విజయాలను అందిస్తుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ధన లాభం పెరిగి పాత అప్పులు, ఆర్థిక ఇబ్బందుల నుంచి శాశ్వత ఉపశమనం లభిస్తుంది. ఆరోగ్యం మెరుగుపడుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు దక్కడంతో పాటు వృత్తిపరంగా నూతన అవకాశాలు తలుపు తడతాయి. ఇవే కాకుండా దీర్ఘకాలికంగా ఉన్న ఆర్థిక సమస్యలు కూడా దూరమవుతాయి.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
గమనిక.. 
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..
ప్రొటెస్ట్ చేయడం ఎందుకు? స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు కదా!!: నీట్ ర్యాంకర్
Hyderabad, Telangana:NEET Ranker Reaction On CJP Protest: ఢిల్లీలో రాహుల్ గాంధీ, పలువురు కాంగ్రెస్ నేతలు పెద్ద ఎత్తున సీజేపీ మద్ధతుగా నిరసనలు చేపట్టారు. అక్కడ పెద్ద ఎత్తున అరెస్టులు కూడా జరిగాయి. టిపిసిసి కూడా ఈరోజు కూడా నిరసనలకు పిలుపునిచ్చింది. కాంగ్రెస్ నేతల అరెస్టులను సీఎం రేవంత్ రెడ్డి కూడా ఖండిస్తూ, ఇది ప్రజాస్వామ్య హక్కులపై దాడి అని మండిపడ్డారు. అయితే ఈ వివాదంపై నీట్ ఆల్ ఇండియా ర్యాంకర్ బన్సల్ కీలక వ్యాఖ్యలు చేశారు. పేపర్ లీక్ అయినప్పుడు తాను తీవ్రంగా బాధపడ్డానని, కానీ ఆ తర్వాత సానుకూలంగా ఆలోచించడం మొదలుపెట్టానని చెప్పారు. నిరసనల్లో వెళ్లడం కంటే ఇంట్లోనే ఉండి స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు కదా అనిపించిందని, అదే మోటివేషన్తో చదివి తన మార్కులను 706 నుండి 715కి పెంచుకోగలిగానని తెలిపారు. నెగటివిటీని పక్కన పెట్టి కేవలం తన లక్ష్యంపైనే ఫోకస్ చేశానని ఆయన పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా నీట్ వివాదం జరుగుతున్న సమయంలో ఈ సెకండ్ ర్యాంకర్ చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షించాయి.
దేశవ్యాప్తంగా నీట్ యూజీ 2026 పరీక్ష మే 3వ తేదీన జరిగిన సంగతి తెలిసిందే. పేపర్ లీకేజీ కారణంగా మే 13న పరీక్షను రద్దు చేస్తున్నట్లు ఎన్టీఏ ప్రకటించింది. అనంతరం జూన్ 21న రీనీట్ నిర్వహించగా, జూలై 16న ఫలితాలు వెలువడ్డాయి. న్యూఢిల్లీలోని గ్రేటర్ కైలాష్లోని కేఆర్ మంగళం వరల్డ్ స్కూల్కు చెందిన విద్యార్థి బన్సల్ ఆల్ ఇండియా 2వ ర్యాంక్ సాధించారు.
ఇటీవల ఆయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో దేశవ్యాప్తంగా జరుగుతున్న నిరసనలపై స్పందిస్తూ, నిరసనల్లో పాల్గొనడం కంటే ఇంట్లోనే ఉండి చదువుకు ప్రాధాన్యత ఇచ్చానని చెప్పారు. పరీక్షా విధానంలో మార్పులు వచ్చినప్పటికీ, తాను 99.99 శాతం పెర్సంటైల్ సాధించి ఆల్ ఇండియా ర్యాంక్ పొందానని వివరించారు. తన ప్రిపరేషన్ను మెరుగుపరుచుకోవడానికి తాను తీసుకున్న చర్యలను కూడా ఆయన పంచుకున్నారు. మొదటిసారి పరీక్ష రద్దయినప్పుడు రెండు గంటల పాటు తీవ్ర నిరాశకు గురైనప్పటికీ, ఆ తర్వాత మళ్ళీ సిద్ధమవ్వడం ముఖ్యం అని భావించి పునఃపరీక్షలో మెరుగైన మార్కులు సాధించగలిగానని చెప్పారు.
Also Read: NEET Re-Exam: నీట్ విద్యార్థులకు గుడ్న్యూస్.. చరిత్రలోనే తొలిసారి.. రంగంలోకి ప్రధాని మోదీ
Also Read: NEET Exam Cancel: పరీక్షల రద్దు పరంపర.. ఐదేళ్లలో NTA రద్దు చేసిన టాప్ పరీక్షలు ఇవే!
అదేవిధంగా, తన షెడ్యూల్ను మార్చుకోకుండా ఎప్పటిలాగే క్రమం తప్పకుండా చదువుకున్నానని, కేవలం ఒకే నెలలో 100 శాతం కృషి చేశానని చెప్పారు. మిగిలినదంతా దేవుడికి వదిలేశానని చెబుతూ, ప్రస్తుతం ప్రభుత్వ కళాశాలలో ప్రవేశం పొందడానికి ప్రయత్నిస్తున్నానని తెలిపారు. దేశవ్యాప్తంగా నీట్ పేపర్ లీకేజీపై నిరసనలు తీవ్రమవుతున్న తరుణంలో బన్సల్ చేసిన ఈ ప్రకటన సంచలనంగా మారింది. మరోవైపు వేలాది మంది విద్యార్థులు పరీక్షా విధానాన్ని ప్రశ్నిస్తూ వీధుల్లోకి వస్తున్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
తిరుమల శ్రీవారి భక్తులకు భారీ అలర్ట్.. రేపు ఎస్ఎస్డీ టోకెన్ల జారీ రద్దు
Tirupati Urban, Andhra Pradesh:Tirumala Darshan Tokens: కలియుగ వైకుంఠవాసుడు కొలువుదీరిన తిరుమల క్షేత్రానికి భక్తులు పోటెత్తుతున్నారు. వారాంతమే కాకుండా సాధారణ రోజుల్లో కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తుండడంతో తిరుమల పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. దీంతో శ్రీవారి దర్శనానికి భారీగా సమయం పడుతోంది. అనూహ్యంగా మంగళవారం భక్తుల సంఖ్య పెరగడంతో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. భక్తుల రద్దీ పెరగడంతో గురువారం దర్శనానికి సంబంధించిన ఎస్ఎస్డీ టోకెన్ల జారీని రద్దు చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది.
తిరుపతిలోని మూడు కేంద్రాల వద్ద బుధవారం జారీ చేయాల్సిన ఎస్ఎస్డీ టోకెన్లను రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటన చేసింది. ఒక్కరోజు విరామం తర్వాత అంటే శుక్రవారం దర్శనానికి సంబంధించిన ఎస్ఎస్డీ టోకెన్లు గురువారం మధ్యాహ్నం నుంచి యథావిధిగా జారీ చేయనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. వేసవి సెలవులు ముగిసిన తర్వాత కూడా తిరుమలకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఈ కారణంతో జూన్, జూలై నెలల్లో పలుమార్లు ఎస్ఎస్డీ టోకెన్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఎస్ఎస్డీ టోకెన్లు రద్దు చేయడం వరుసగా ఇది నాలుగో వారం. అయితే టోకెన్ల రద్దుతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాగా టోకెన్లు లేని భక్తులు నేరుగా తిరుమలలోని సర్వదర్శనం క్యూలైన్లలోకి వెళ్లాలని టీటీడీ సూచిస్తోంది.
దర్శనానికి సరికొత్త టెక్నాలజీ
తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండే భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు టీటీడీ సరికొత్త సాంకేతికతను వినియోగిస్తోంది. భక్తులకు అన్నప్రసాదం, తాగునీరు, పాలు వంటి నిత్యావసరాలను వేగంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేరవేసేందుకు సరికొత్త ఎక్స్ లిఫ్టర్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురాబోతున్నది. ఈ అత్యాధునిక వ్యవస్థ పనితీరును తాజాగా ట్రయల్ రన్ ద్వారా అధికారులు పరీక్షించారు. క్యూలైన్లలోని వివిధ ప్రాంతాలకు ఆహారం, నీరు, పాలు వంటి వస్తువులను ఎంత వేగంగా, ఎంత సమర్థవంతంగా చేరవేయగలదనే అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ట్రయల్ విజయవంతమైతే ఈ వ్యవస్థను శాశ్వతంగా అమల్లోకి తీసుకురావాలని టీటీడీ యోచిస్తోంది.
ఇప్పటికే కృత్రిమ మేధస్సు (ఏఐ) ఆధారిత సాంకేతికతతో భక్తులకు పలు సేవలను అందిస్తున్న టీటీడీ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత విస్తృతంగా వినియోగిస్తూ భక్తులకు నాణ్యమైన, వేగవంతమైన సేవలు అందించడంపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ఎక్స్ లిఫ్టర్ వ్యవస్థ అమల్లోకి వస్తే క్యూలైన్లలో వేచి ఉండే భక్తులకు సేవలు మరింత వేగంగా, సులభంగా అందే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
హైదరాబాద్ ప్రజలకు బిగ్ అలర్ట్.. రేపు యాపిడో, ఉబర్, జొమాటో, జెప్టో సేవలు బంద్
Hyderabad, Telangana:Tomorrow Bandh: హైదరాబాద్తోపాటు తెలంగాణ ప్రజలకు భారీ అలర్ట్. రేపు యాప్ ఆధారిత ఎలాంటి సేవలు అందవు. అంటే ఫుడ్ డెలివరీ చేసుకోవాలన్నా.. బైక్, కారు బుక్ చేసుకోవాలన్నా.. అత్యవసర సామగ్రి కొనుగోలు చేయాలన్నా రేపు కుదరదు. ఎందుకంటే రేపు అన్ని రకాల డెలివరీ సేవలు ఆగిపోనున్నాయి. డెలివరీ చేసే కార్మికులతోపాటు డ్రైవర్లు సమ్మెకు దిగుతున్నారు. డెలివరీ బాయ్లతోపాటు యాప్ ఆధారిత డ్రైవర్లు ఆందోళన చేపట్టనున్నారు. తమ డిమాండ్లు పరిష్కరించాలని.. రేవంత్ రెడ్డి తమకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలనే డిమాండ్తో రేపు బుధవారం నిరసనకు దిగనున్నారు.
రేపు తాము బంద్ చేపడుతున్నట్లు తెలంగాణ గిగ్ వర్కర్లు, యాప్ఖ ఆధారిత డ్రైవర్లు ప్రకటించారు. రేపు సమ్మె చేస్తున్నట్లు తెలంగాణ గిగ్, ప్లాట్ఫామ్ వర్కర్స్ యూనియన్ (టీజీపీడబ్ల్యూయూ), తెలంగాణ యాప్-బేస్డ్ డ్రైవర్స్ ఫోరమ్ (టీఏడీఎఫ్) సంఘాలు ప్రకటన చేశాయి. ఓలా, ఉబెర్, రాపిడో, స్విగ్గీ, జొమాటో, జెప్టో, బ్లింకిట్, పోర్టర్, ఇతర డిజిటల్ ప్లాట్ఫామ్ కంపెనీలకు చెందిన యాప్-బేస్డ్ క్యాబ్ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు, గూడ్స్ ఆటో రవాణా డ్రైవర్లు, డెలివరీ వర్కర్లు, గిగ్ ప్లాట్ఫామ్ వర్కర్లు విధులకు హాజరుకావడం లేదని ప్రకటించారు.
వారి ప్రధాన డిమాండ్లు
==> ప్రభుత్వం, ప్లాట్ఫామ్ కంపెనీలు అన్ని యాప్-ఆధారిత రవాణా సేవలకు కిలోమీటర్కు, నిమిషానికి ధరతోపాటు.. కనీస బేస్ ఛార్జీని తప్పనిసరిగా నిర్ణయించాలి.
==> గిగ్, ప్లాట్ఫామ్ వర్కర్స్ నిబంధనలను తక్షణమే నోటిఫై చేసి సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలి.
==> తెలంగాణ ప్రభుత్వం, అగ్రిగేటర్ కంపెనీలు ఏకపక్షంగా ఛార్జీలను నిర్ణయించడానికి అనుమతించకుండా మోటార్ వెహికల్ అగ్రిగేటర్ మార్గదర్శకాలు- 2025 ప్రకారం కనీస ఛార్జీలను తప్పనిసరిగా అమలు చేయాలి.
కాంగ్రెస్ పార్టీ తీరని మోసం
గిగ్ వర్కర్లకు కాంగ్రెస్ పార్టీ గతంలో హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ స్వయంగా గిగ్ వర్కర్లతో సమావేశమై వారి కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటుచేస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి దాదాపు మూడేళ్లవుతున్నా రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ నిలబెట్టుకోకపోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ రేపటి ఆందోళన చేస్తున్నారు. కాగా ఇదే డిమాండ్లపై ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్టణంలో ఇలాంటి సమ్మె జరిగింది. ఉబర్, ఓలా, రాపిడో డ్రైవర్ల సమ్మె విశాఖపట్టణంలో ఉదృతంగా జరుగుతుండగా.. తాజాగా ఇది హైదరాబాద్ను తాకింది. హైదరాబాద్లో విజయవంతమైతే వీరి ఆందోళన దేశంలోని ఇతర నగరాలకు పాకే అవకాశం ఉంది.
Nokia నుంచి అదిరిపోయే ఫోన్.. ఐఫోన్ కంటే పవర్ఫుల్ టార్చ్, 45 రోజుల బ్యాటరీ లైఫ్!
Hyderabad, Telangana:Nokia 300 4G Launched Latest News: మొబైల్ రంగంలో ఒకప్పటి రారాజు నోకియా (Nokia) మార్కెట్లోకి సరికొత్త ఫీచర్ ఫోన్ను విడుదల చేసింది. నోకియా 300 4G పవర్బ్యాంక్ (Nokia 300 4G Power Bank) పేరుతో ఈ పవర్ఫుల్ ఫోన్ను సంస్థ అధికారిక వెబ్సైట్లో కంపెనీ లిస్ట్ చేసింది. ప్రస్తుతానికి ఈ మొబైల్ ఫిలిప్పీన్స్ మార్కెట్లో లాంచ్ అయిన్నట్లు తెలుస్తోంది. ఇది అత్యంత శక్తివంతమైన బాడీతో పాటు అద్భుతమైన బ్యాటరీ బ్యాకప్తో వినియోగదారులను ఆకట్టుకునేలా దీనిని రూపొందించిన్నట్లు తెలుస్తోంది.
ధర, ఇతర వివరాలు..
ఫిలిప్పీన్స్ మార్కెట్లో నోకియా 300 పవర్బ్యాంక్ ఫోన్ ధరను PHP 1,990గా నిర్ణయించిన్నట్లు తెలుస్తోంది.. మన భారతీయ కరెన్సీలో దీని విలువ కేవలం రూ.3,000 మాత్రమే ఉంటుందని సమాచారం. అక్కడ ప్రముఖ ఈ-కామర్స్ వెబ్సైట్ Shopeeలో ఈ ఫోన్ను ప్రీ-ఆర్డర్ చేసుకోవచ్చని కంపెనీ ప్రకటించింది.. వినియోగదారుల కోసం ఈ మొబైల్ను బ్లాక్, గ్రీన్తో పాటు గోల్డ్ అనే మూడు ఆకర్షణీయమైన రంగుల్లో అందుబాటులోకి తీసుకు వచ్చింది.
అదిరిపోయే డిస్ప్లే..
ఈ నోకియా 300 4G ఫోన్ చూడటానికి ఎంతో స్టైలిష్గా ఉండటమే కాకుండా.. చేతిలో పట్టుకోవడానికి వీలుగా యాంటీ-స్లిప్ డిజైన్తో రగ్గడ్ బాడీని కలిగి ఉంటుందని కంపెనీ తెలిపింది.. ఇందులో 2.4 ఇంచుల QVGA డిస్ప్లేను తీసుకు వచ్చింది.. అంతేకాకుండా, దీనికి IP65 రేటింగ్ అందిచారు.. దీనివల్ల ఫోన్పై దుమ్ము పడినా లేదా నీటి చినుకులు పడినా ఫోన్ పాడవకుండా సురక్షితంగా ఉంటుందని సమాచారం.
45 రోజుల బ్యాటరీ లైఫ్..
ఈ ఫోన్లోని అత్యంత అద్భుతమైన ప్రత్యేకత దీని బ్యాటరీగా భావించవచ్చు.. ఇందులో చిన్న సైజు స్మార్ట్ఫోన్లలో ఉండేలాంటి 3700mAh భారీ బ్యాటరీని అందుబాటులోకి తీసుకు రావడం విశేషం. ఇది 18W ఫాస్ట్ ఛార్జింగ్ను సపోర్ట్ చేస్తుంది. ఒక్కసారి పూర్తి ఛార్జ్ చేస్తే.. ఈ ఫోన్ ఏకంగా 45 రోజుల పాటు స్టాండ్బై టైమ్ను ఇస్తుందని కంపెనీ చెబుతోంది. అంతేకాకుండా 26 గంటల పాటు నిరంతరాయంగా మాట్లాడుకోవచ్చని కంపెనీ తెలిపింది. ఈ ఫోన్లో మరో ప్రత్యేక బటన్ ఉంటుంది.. దాన్ని నొక్కితే, ఈ ఫోన్ను 5W వేగంతో ఇతర ఫోన్లను ఛార్జ్ చేసే పవర్బ్యాంక్ లాగా (Reverse Wired Charging) వినియోగించవచ్చు..
ఐఫోన్ కంటే శక్తివంతమైన టార్చ్ లైట్..
సాధారణ ఫీచర్ ఫోన్లతో పోలిస్తే.. ఈ ఫోన్లోని టార్చ్ లైట్ 5 రెట్లు ఎక్కువ కాంతిని ఇస్తుందని కంపెనీ తెలిపింది. చివరికి ప్రముఖ ప్రీమియం ఫోన్ ఐఫోన్ 16 ప్రో (iPhone 16 Pro) టార్చ్ లైట్ కంటే కూడా ఇది రెండింతలు ఎక్కువ ప్రకాశవంతంగా వెలుగుతుందని నోకియా సంస్థ సంచలన ప్రకటన చేయడం విశేషం. ఈ టార్చ్ లైట్ను వరుసగా 23 గంటల పాటు ఆన్ చేసి ఉంచినా బ్యాటరీ తట్టుకోగలిగే సామర్థ్యం కలిగి ఉంటుంది. ఇవే కాకుండా ఇందులో అనేక రకాల అద్భుతమైన ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి.
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Indian Army SSC Officers: పరీక్ష లేకుండా ఆర్మీ ఉద్యోగం..నెలకు రూ.లక్షన్నర జీతం..డిగ్రీ అభ్యర్థులకు గోల్డెన్ ఛాన్స్!
Hyderabad, Telangana:Indian Army SSC Officer Jobs 2026: భారత సైన్యంలో ఆఫీసర్ హోదాలో దేశానికి సేవ చేయాలనుకునే యువతీ యువకులకు ఇండియన్ ఆర్మీ అద్భుతమైన నోటిఫికేషన్ను విడుదల చేసింది. షార్ట్ సర్వీస్ కమిషన్ (SSC) ద్వారా మొత్తం 350 పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఎలాంటి రాత పరీక్ష లేకుండా, కేవలం ఇంటర్వ్యూ ద్వారానే అభ్యర్థులను ఎంపిక చేయనుండడం ఈ నోటిఫికేషన్ ప్రత్యేకతగా నిలుస్తోంది.
ముఖ్యమైన వివరాలు..
మొత్తం ఖాళీలు: 350
ఎంపిక విధానం: ఎస్ఎస్బీ (SSB) ఇంటర్వ్యూ & మెడికల్ టెస్ట్
ప్రారంభ వేతనం: నెలకు దాదాపు రూ.1,50,000/- వరకు (ఇతర అలవెన్సులు, క్వార్టర్స్ సౌకర్యం అదనం)
అర్హతలు & వయోపరిమితి..
విద్యార్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి సివిల్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ వంటి విభాగాల్లో BE లేదా B.Tech పూర్తి చేసి ఉండాలి.
వయోపరిమితి: ఏప్రిల్ 1, 2027 నాటికి అభ్యర్థుల వయసు 20 నుండి 27 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుంది?
గమనిక: ఈ ఉద్యోగాలకు ఎలాంటి రాత పరీక్ష ఉండదు. అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకున్న తర్వాత, వారి అకడమిక్ మెరిట్ ఆధారంగా షార్ట్లిస్ట్ చేస్తారు. షార్ట్లిస్ట్ అయిన వారికి SSB ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
ఇంటర్వ్యూలో క్వాలిఫై అయిన వారికి వైద్య పరీక్షలు (Medical Test) నిర్వహించి, తుది నియామకాలు చేపడతారు. ఎంపికైన వారికి ట్రైనింగ్ సమయం నుంచే జీతభత్యాలు అందుతాయి.
ముఖ్యమైన తేదీలు & అప్లికేషన్ లింక్..
దరఖాస్తుకు చివరి తేదీ: ఆగస్టు 7, 2026
అధికారిక వెబ్సైట్: అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు మరిన్ని వివరాల కోసం మరియు ఆన్లైన్ దరఖాస్తు కోసం www.joinindianarmy.nic.in ని సందర్శించవచ్చు.
Also Read: ఏటీఎంలో ఏసీలో దర్జాగా నిద్రపోతున్నాడు.. ఇలా కూడా ఉండారా గురూ!
Also REad: ఓటరు లిస్టులో పేరు లేకపోతే పౌరసత్వం పోయినట్టేనా? సుప్రీంకోర్టు సంచలన తీర్పు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
కేవలం రూ.18,999 లకే 7000mAh బ్యాటరీ 5G ఫోన్.. ఫ్లిప్కార్ట్లో Realme P4 Lite 5Gపై క్రేజీ డీల్!
Hyderabad, Telangana:Realme P4 Lite 5g Massive Discount: కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. మార్కెట్లో మంచి క్రేజ్ ఉన్న Realme కంపెనీకి సంబంధించిన రియల్మీ P4 లైట్ 5G (Realme P4 Lite 5G) స్మార్ట్ఫోన్పై ఊహించని స్థాయిలో భారీ డిస్కౌంట్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి.. ఏకంగా రూ. 17 వేల రూపాయల వరకు తగ్గింపు అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్ఫోన్ విశేషాలు, ఆఫర్ల వివరాలు కింది విధంగా ఉన్నాయి.
రూ. 17,000 పైగా తగ్గింపు..
రియల్మీ P4 లైట్ 5G (6GB ర్యామ్ + 128GB స్టోరేజ్) వేరియంట్ అసలు MRP ధర రూ.36,999 అందుబాటులో ఉంది. అయితే, ప్రస్తుతం ఫ్లిప్కార్ట్లో ఈ ఫోన్ ఏకంగా రూ.29,999కే పొందవచ్చు. దీంతో మీరు భారీ ధర తగ్గింపు లభిస్తుంది. దీనికి అదనంగా మరికొన్ని బ్యాంక్ ఆఫర్లను కూడా ఫ్లిప్కార్ట్ అందుబాటులో ఉంచింది.. ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్ లేదా SBI బ్యాంక్ కార్డ్లను వినియోగించి కొనుగోలు చేస్తే.. అదనంగా మరో రూ.1,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది.. ఈ ఆఫర్లన్నీ కలుపుకుంటే.. ఈ శక్తివంతమైన 5G ఫోన్ను కేవలం రూ.18,999 లకే సొంతం చేసుకునే గోల్డెన్ ఛాన్స్ లభిస్తుంది.
7000mAh భారీ బ్యాటరీ..
ఈ స్మార్ట్ఫోన్ ఎంతో శక్తివంతమైన బ్యాటరీతో అందుబాటులోకి వచ్చింది.. ఇందులో ఏకంగా 7000mAh భారీ బ్యాటరీని కలిగి ఉంటుంది.. ఇది 15W ఫాస్ట్ ఛార్జింగ్కు సపోర్ట్ చేస్తుందని కంపెనీ తెలిపింది.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే రెండు రోజుల పాటు వాడుకుని అవకాశం లభిస్తుంది.. ఇక డిస్ప్లే విషయానికి వస్తే.. 6.8 అంగుళాల HD+ IPS LCD స్క్రీన్ను కలిగి ఉంటుందని కంపెనీ తెలిపింది.. స్మూత్ పర్ఫార్మెన్స్ కోసం.. 144Hz రీఫ్రెష్ రేట్తో ఎండలో కూడా స్పష్టంగా కనిపించేలా 900 నిట్స్ పీక్ బ్రైట్నెస్ను కూడా అందుబాటులో ఉంది.
శక్తివంతమైన ప్రాసెసర్..
రియల్మీ P4 లైట్ 5G స్మార్ట్ఫోన్ ఎంతో శక్తివంతమైన ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్పై రన్ అవుతుంది.. కాబట్టి గేమింగ్, మల్టీటాస్కింగ్ చాలా స్మూత్గా సాగుతుందని కంపెనీ తెలిపింది. ఇందులోని 128GB ఇంటర్నల్ స్టోరేజ్ను మైక్రో SD కార్డ్ సహాయంతో 2TB వరకు పెంచుకోవచ్చు. సాఫ్ట్వేర్ పరంగా.. ఇది లేటెస్ట్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత రియల్మీ UI 7.0 పై రన్ అవుతుందని కంపెనీ తెలిపింది.. ఇక కెమెరాల విషయానికి వస్తే.. వెనుక భాగంలో 13 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో పాటు సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ముందు భాగంలో 5 మెగాపిక్సెల్ కెమెరాలు కూడా లభిస్తున్నాయి.
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
కనెక్టివిటీ ఫీచర్లు..
సెక్యూరిటీ కోసం ఫోన్లో సైడ్కు ఫింగర్ప్రింట్ సెన్సార్ను కూడా అందించారు. ధూళి, నీటి తుంపరల నుంచి రక్షణ కోసం IP64 రేటింగ్తో పాటు మిలిటరీ గ్రేడ్ (MIL-STD 810H) సపోర్ట్ కూడా ఉంది. దీనివల్ల ఫోన్ చాలా దృఢంగా ఉంటుందని కంపెనీ క్లైమ్ చేస్తోంది.. కనెక్టివిటీ పరంగా 5G, డ్యూయల్ 4G VoLTE, వై-ఫై, బ్లూటూత్ 5.3తో పాటు హెడ్ఫోన్ జాక్ వంటి అన్ని ఆధునిక ఫీచర్లు ఇందులో లభిస్తున్నాయి. ఇంత తక్కువ ధరలో 7000mAh బ్యాటరీతో పాటు 5G ఫీచర్లు ఉన్న ఫోన్ కావాలనుకునే వారికి ఇదొక బెస్ట్ డీల్గా భావించవచ్చు..
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Tirumala: తిరుమల ఘాట్ రోడ్డులో కారు బోల్తా..హైదరాబాద్ భక్తులకు తీవ్రగాయాలు.. వీడియో..
Hyderabad, Telangana:Tirumala Ghat road accident: తిరుమలకు చాలా మంది రోడ్డు మార్గంలో, నడక మార్గంలో అలిపిరి మెట్లు, శ్రీవారి మెట్టు గుండా వెళ్తుంటారు. ఈ క్రమంలో తిరుమలలో భక్తుల రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. అన్ని కంపార్ట్ మెంట్ లు భక్తులతో కిట కిట లాడుతున్నాయి. టోకెన్లు లేని సర్వదర్శనాలకు 24 గంటల వరకు సమయం పడుతుంది. మరోవైపు రూ. 300 దర్శనాలకు 2 నుంచి 4 గంటల సమయం పడుతుంది. అంతే కాకుండా ఎస్ఎస్ డీ టోకెన్లు ఉన్న భక్తుల దర్శనాలకు 4 గంటల సమయం పడుతుంది. ఈ క్రమంలో తిరుమల ఘాట్ రోడ్డులో ఆదివారం కారు అదుపు తప్పి బోల్తా పడింది.
తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం
రెండో ఘాట్ రోడ్డులోని 39వ మలుపు వద్ద అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న రక్షణ గోడను ఢీకొట్టిన కారు, సురక్షితంగా బయటపడ్డ ప్రయాణికులు
ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకుంటున్న పోలీసులు pic.twitter.com/gRhyHTzAWl
— Telugu Scribe (@TeluguScribe) July 19, 2026
ఈ ప్రమాదంలో హైదరాబాద్ కు చెందిన భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. భక్తులు తమకారులో తిరుమల శ్రీవారిని దర్శించుకొవడానికిి బయలు దేరారు. ఇంతలో తిరుమలలోని రెండో ఘాట్ రోడ్డులోని 39వ మలుపు వద్ద లింక్ రోడ్డుకు సమీపంలో కారు అదుపు తప్పి సెఫ్టీ గోడను బలంగా ఢీకొని కారు బోల్తా పడింది. ఈ ఘటనతో ఆ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
వెంటనే అక్కడున్న భక్తులు అంబులెన్స్ కు సమాచారం అందించారు. గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించారు. కారు బోల్తా పడటంతో ఆ మార్గంలో కొంచెంసేపు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఘాట్ రోడ్డులో ఉన్న సిబ్బంది కారును పక్కకు తొలగించి ట్రాఫిక్ ను క్లియర్ చేసే పనిలో నిమగ్నమయ్యారు.
Read more: తిరుమల భక్తులకు ముఖ్య గమనిక.. టికెట్ల కోసం ఆ వెబ్సైట్ మాత్రమే వాడండి!
ఈ ప్రమాదంలో ఆ మార్గంలో వెళ్తున్న భక్తులు సైతం తీవ్ర ఆందోళనలకు గురయ్యారు. మరోవైపు తిరుమలలో ప్రమాదం గాయపడ్డ భక్తుల వివరాలు తెలియాల్సి ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.
Japan Open 2026: జపాన్ ఓపెన్ విజేతగా పీవీ సింధు..2019 తర్వాత సింధు ఖాతాలోకి మరో రికార్డు!
Shinjuku City, Tokyo:Japan Open 2026 Winner: భారత బ్యాడ్మింటన్ ఛాంపియన్ పీవీ సింధు ఖాతాలో మరో ట్రోఫీ వచ్చి చేరింది. జపాన్ వేదికగా జరిగిన బ్యాడ్మింటన్ ఓపెన్ 2026లో పీవీ సింధు విజేతగా నిలిచింది. తాజాగా ఫైనల్లో జపాన్కు చెందిన అకానె యమగుచిని 21-17, 21-17 పాయింట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అయితే 2019 ప్రపంచ ఛాంపియన్షిప్ తర్వాత అంతటి స్థాయిలో అతిపెద్ద ట్రోఫీఇదే కావడం గమనార్హం.
గత రెండేళ్లుగా, పీవీ సింధు చుట్టూ వినబడుతున్న ఒకేఒక ప్రశ్న.. సింధు ఛాంపియన్గా నిలుస్తుందా? అయితే ప్రశ్న ఆమె ఇంకా అతిపెద్ద టైటిళ్లను గెలవగలదా లేదా అనే దాని గురించి కాదు, ఆమె తన అత్యుత్తమ ఫామ్ను తిరిగి పొందడానికి ఎంత సమయం పడుతుంది అనే దాని గురించే. నిరంతర గాయాలు, ఆధునిక క్రీడ కఠినమైన పరిణామం, 2024 వరకు కొనసాగుతున్న టైటిల్ కరువు వంటివి, రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత అయిన ఆమె, తనను ప్రపంచంలోనే అత్యుత్తమ క్రీడాకారిణులలో ఒకరిగా నిలిపిన నైపుణ్యాలను పునఃసృష్టించగలదా అని చాలా మందిని సందేహించేలా చేశాయి. ఇప్పుడు అలాంటి ఎన్నో ప్రశ్నలకు ఒక్క జపాన్ ఛాంపియన్షిప్తో సింధు సమాధానం చెప్పింది. ఆదివారం టోక్యో మెట్రోపాలిటన్ జిమ్నాసియంలో, సింధు దానికి సమాధానం ఇచ్చింది.
జపాన్ ఓపెన్లో అపారమైన శక్తి, వ్యూహాత్మక ప్రతిభ, ప్రచండ మానసిక స్థైర్యం కలగలిసిన ఒక అద్భుతమైన ప్రదర్శనతో.. 31 ఏళ్ల భారత స్టార్ క్రీడాకారిణి సింధు, జపాన్ క్రీడాకారిణి అకానె యమగుచిని వరుస గేమ్లలో 21-17, 21-17 తేడాతో ఓడించి, తన తొలి జపాన్ ఓపెన్ టైటిల్ను కైవసం చేసుకుంది. ఈ చారిత్రాత్మక విజయంతో ఎందుకంటే ఇది ఆమెకు మొట్టమొదటి సూపర్ 750 టైటిల్ కాగా, ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్ను గెలిచిన చరిత్రలోనే తొలి భారతీయురాలిగా ఆమె నిలిచింది.
సింధు చివరి టైటిల్ను 2024లో సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్లో గెలుచుకుంది. 2019లో ప్రపంచ ఛాంపియన్షిప్స్ కిరీటాన్ని గెలుచుకున్న తర్వాత జపాన్ ఓపెన్లో సాధించిన ఈ విజయమే ఆమెకు అతిపెద్ద టైటిల్.
స్టీప్ క్రాస్-కోర్ట్ డ్రాప్స్, అద్భుతమైన స్మాష్ల కాంబినేషన్ను ఉపయోగించి.. సింధు మొదటి గేమ్లో యమగుచి ఆటను నిరంతరం దెబ్బతీసింది. మొదటి గేమ్ చివరి వరకు హోరాహోరీగా సాగింది, కానీ ఒత్తిడి పెరిగినప్పుడు పీవీ సింధు అద్భుతమైన ప్రదర్శనతో కీలకమైన పాయింట్లను వరుసగా గెలుచుకుని మొదటి గేమ్ను 21-17 తేడాతో కైవసం చేసుకుంది. ఒక గేమ్ ఆధిక్యంలో ఉన్నప్పటికీ, సింధు తన గేమ్ను ఏ మాత్రం చేజారకుండా చూసుకుంది. ఆ తర్వాత స్పష్టమైన ఆధిక్యంతో రెండో గేమ్లోనూ దూకుడుగా ఆడి.. యమగుచి తప్పిదాలను విజయంగా మలచుకుంది.
2019 ప్రపంచ ఛాంపియన్షిప్లో తాను ప్రదర్శించిన అద్భుతమైన వ్యూహాత్మక పటిమను మరోసారి కనబరుస్తూ, ఆమె రెండో గేమ్ను 21-17తో గెలుచుకుని చారిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రపంచ మూడవ ర్యాంకర్ అయిన ప్రత్యర్థిని ఆమె సొంత గడ్డపైనే ఓడించడం ద్వారా, తాను తిరిగి సత్తా చాటానని సింధు బ్యాడ్మింటన్ ప్రపంచానికి గట్టిగా చాటిచెప్పింది.
Also REad: ఇంగ్లాండ్తో మూడో వన్డే ముందు జట్టులో కీలక మార్పులు.. సుందర్ స్థానంలో యంగ్ ప్లేయర్!
ALso REad: రూ.28 లక్షలకు చేరిన ఫైనల్ మ్యాచ్ టికెట్ ధర..అమెరికా చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఈవెంట్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
200MP కెమెరాతో Oppo Find X10 సిరీస్ త్వరలో లాంచ్.. ఫీచర్లు చూస్తే షాకే!
Hyderabad, Telangana:Oppo Find X10 Series Launch Soon: ప్రముఖ స్మార్ట్ఫోన్ దిగ్గజం ఒప్పో (Oppo) గ్లోబల్ మొబైల్ మార్కెట్లో అద్బుతమైన స్మార్ట్ఫోన్ విడుదల చేసేందుకు సిద్ధమైంది.. తన ఫ్లాగ్షిప్ సిరీస్లో భాగంగా అత్యంత శక్తివంతమైన ఒప్పో Find X10 (Oppo Find X10) స్మార్ట్ఫోన్ లాంచ్ చేసేందుకు సిద్ధమైన్నట్లు తెలుస్తోంది. అయితే, ఇది విడుదలకు ముందే టెక్ మార్కెట్లో అద్భుతమైన పేరును సంపాదించింది.. తాజాగా ఈ మొబైల్ చైనాకు చెందిన ప్రముఖ SRRC సర్టిఫికేషన్ వెబ్సైట్లో కనిపించడంతో ఈ ఫోన్ లాంచ్కు సర్వం సిద్ధమైనట్లు సమాచారం.. లీకైన వివరాల ప్రకారం..ఈ స్మార్ట్ఫోన్ ఊహించని ఫీచర్లు, కళ్లు చెదిరే కెమెరా సెటప్తో త్వరలోనే వినియోగదారుల ముందుకు రానుంది.
లాంచ్ ఎప్పుడంటే?
ప్రముఖ చైనీస్ టిప్స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఒప్పో Find X10 స్మార్ట్ఫోన్ చైనాలో SRRC సర్టిఫికేషన్ పొందిందని తెలిపాడు. ఈ సైట్లో ఫోన్ మోడల్ నంబర్ PMW110గా నమోదైనట్లు లీక్ చేసిన వివరాల్లో పేర్కొన్నాడు. ఈ సర్టిఫికేషన్ ద్వారా ఫోన్లో హై-స్పీడ్ కనెక్టివిటీ కోసం N79 5G బ్యాండ్ సపోర్ట్ ఉన్నట్లు తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఒప్పో కంపెనీ ఈ ఫ్లాగ్షిప్ సిరీస్ను ఈ ఏడాది సెప్టెంబర్ చివరి వారాల్లో మార్కెట్లోకి విడుదల చేసే అవకాశం ఉంది. ఈ సిరీస్లో భాగంగా మొత్తం నాలుగు మోడళ్లను అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది.
మొట్టమొదటి 2nm చిప్సెట్..
ఈ స్మార్ట్ఫోన్ పర్ఫార్మెన్స్ విషయంలో సరికొత్త రికార్డులను సృష్టించబోతున్నట్లు తెలుస్తోంది.. ఇందులో మీడియాటెక్ సంస్థకు సంబంధించిన అత్యంత శక్తివంతమైన, డైమెన్సిటీ 9600 ప్రో (MediaTek Dimensity 9600 Pro) ప్రాసెసర్ను వినియోగించిన్నట్లు తెలుస్తోంది. అత్యంత అధునాతనమైన 2nm ప్రాసెస్ టెక్నాలజీపై ఈ చిప్సెట్ రూపొందించిన్నట్లు తెలుస్తోంది. దీనివల్ల ఫోన్ ఫాస్ట్గా అద్భుతంగా ఉండటమే కాకుండా.. బ్యాటరీ వినియోగం చాలా తక్కువగా ఉంటుందని కంపెనీ తెలిపింది.. ముఖ్యంగా పెద్ద గేమ్స్ ఆడేవారికి, మల్టీటాస్కింగ్ చేసేవారికి ఇది అద్బుతమైన ఎక్పీరియన్స్ను అందిస్తుంది.
అదిరిపోయే కెమెరా..
ఫొటోగ్రఫీ ప్రియులను ఆకట్టుకునేందుకు ఒప్పో ఈ ఫోన్లో కెమెరాకు అత్యంత ప్రాధాన్యతనిచ్చిన్నట్లు తెలుస్తోంది.. ఇందులో ఏకంగా 200 మెగాపిక్సెల్ (200MP) HPC ప్రైమరీ కెమెరా సెటప్ను అందించే అవకాశాలు ఉన్నట్లు లీక్ అయిన వివరాలు చెబుతున్నాయి.. డిజిటల్ కెమెరాలను తలదన్నేలా.. అత్యంత స్పష్టమైన ఫొటోలు, 8K వీడియో రికార్డింగ్ ఫీచర్లు ఇందులో అందుబాటులో ఉండబోతున్నాయి..
డిజైన్, డిస్ప్లే హైలైట్స్..
ఈ సిరీస్ ఫోన్ల డిస్ప్లే 6.32 అంగుళాల నుంచి 6.89 అంగుళాల వరకు ఉండబోతున్నట్లు తెలుస్తోంది.. అంతేకాకుండా, ఫోన్ స్క్రీన్ బెజెల్స్ దాదాపు లేనట్లుగా కనిపించడానికి ఒప్పో ప్రత్యేకంగా LIPO బెజెల్ టెక్నాలజీ (LIPO Bezel Technology)ను వినియోగించిన్నట్లు తెలుస్తోంది. దీనివల్ల ఫోన్ లుక్ అత్యంత ప్రీమియంగా.. స్క్రీన్ చాలా పెద్దదిగా కనిపిస్తుందని సమాచారం. మార్కెట్లోకి విడుదల కాబోతున్న ఒప్పో Find X10.. ప్రీమియం విభాగంలో Apple, సాంసంగ్ వంటి దిగ్గజాలకు గట్టి పోటీగా రావడం ఖాయమని కనిపిస్తోంది.
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
