ఖమ్మం: సెప్టెలిక్ ట్యాంకులతో ధర్నా
Dhamsalapuram, Telangana:ఖమ్మం నగర కార్పోరేషన్ పరిధిలోని సెప్టిక్ ట్యాంక్ కార్మికులు ధర్నా చేపట్టారు. ఈ క్రమంలో వారు సెప్టిక్ ట్యాంక్ వాహనాలతో కార్పోరేషన్ కార్యాలయం ఎదుట ధర్నా చేసారు. వ్యర్థాలను డంప్ చేయడానికి ఖమ్మం చుట్టుప్రక్కల సుమారు 20 కిలో మీటర్ల మేర ఎక్కడ డంప్ చేయనివ్వడం లేదని వారు ఆవేధన వ్యక్తం చేసారు. వరదలు వచ్చిన తరువాత ఈ సమస్య మరింత తీవ్రంగా మారిందన్నారు. తక్షణమే అధికారులు సమస్యను పరిష్కారించాలని డిమాండ్ చేస్తున్నారు.हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
Jogulamba Temple: జోగులాంబ ఆలయం హుండీ లెక్కింపు.. ఎంత ఆదాయం వచ్చిందంటే?
Alampur (P), Telangana:Jubilee Hills: తప్పిపోయిన బాలుడిని కాపాడిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్
Hyderabad, Telangana:Jubilee Hills MLA Naveen Yadav Catches Missing Boy At Roadside ShaikpetTamil Politics: తమిళ రాజకీయాల్లో కీలక పరిణామం.. మాజీ ముఖ్యమంత్రి రాజీనామా?
Nagalapuram, Tamil Nadu:Tamil Nadu Politics: తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు ముగిసి ప్రభుత్వం కొలువుదీరి దాదాపు మూడు నెలలైనా ఇంకా రాజకీయాలు హాట్హాట్గానే కొనసాగుతున్నాయి. అధికారం కోల్పోయిన డీఎంకే పార్టీకి మరో భారీ షాక్ తగలనుందని తెలుస్తోంది. మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం రాజీనామా చేయబోతున్నారని.. ఎమ్మెల్యే పదవిని కూడా వదులుకోనున్నాడని సమాచారం. అనంతరం అధికార టీవీకే పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని జోరుగా చర్చ జరుగుతోంది.
అన్నాడీఎంకే పార్టీ తరఫున మూడుసార్లు తమిళనాడు ముఖ్యమంత్రిగా పన్నీర్సెల్వం సేవలు అందించారు. మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణం నుంచి పన్నీర్సెల్వం గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. తర్వాత ముఖ్యమంత్రి అయినా ఎన్నికల్లో ఓడిపోవడంతో ఏఐడీఎంకేలో కొనసాగారు. ఇటీవల 2026 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా డీఎంకే పార్టీలో చేరారు. ఆ ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యేగా గెలిచినా డీఎంకే పార్టీ అధికారం కోల్పోయింది. దీంతో అతడి రాజకీయ భవిష్యత్తు ప్రమాదకరంగా మారింది. ప్రస్తుతం పన్నీర్ సెల్వం రాజకీయంపై ఆసక్తికర చర్చ నడుస్తోంది.
2026 అసెంబ్లీ ఎన్నికలకు ముందు పన్నీర్సెల్వం డీఎంకే పార్టీలో చేరారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తేని నియోజకవర్గం నుంచి డీఎంకే పార్టీ తరఫున పన్నీర్ సెల్వం ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఆ ఎన్నికల్లో డీఎంకే పార్టీ ఓటమి పాలైంది. ప్రతిపక్ష పార్టీ డీఎంకేలో మాజీ ముఖ్యమంత్రిగా పన్నీర్ సెల్వానికి ఎలాంటి గుర్తింపు లేదు. ఇప్పటివరకు డీఎంకేలో ఆయనకు ఎలాంటి కీలక పదవి దక్కలేదు. దీంతో
పదవీ దక్కకపోవడం.. డీఎంకేలో ఎలాంటి గుర్తింపు లేకపోవడం తదితర కారణాల వల్ల పన్నీర్ సెల్వం రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. అధికారంలోకి వచ్చిన టీవీకే పార్టీలో చేరే అవకాశాలు ఉన్నట్లు చర్చ జరుగుతోంది. డీఎంకే తరఫున గెలిచిన పన్నీర్సెల్వం తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం (టీవీకే) పార్టీలో చేరడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
తమిళనాడులోని దక్షిణ జిల్లాల్లో పన్నీర్సెల్వమ్కు మంచి పట్టు ఉంది. దీంతో అక్కడ టీవీకే పార్టీ బలోపేతం కావడానికి పన్నీర్ సెల్వం దోహదం చేస్తుందని.. అందుకే ఆయన చేరికకు విజయ్ కూడా అంగీకరించినట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా తన కుమారుడు రవీంద్రనాథ్ ఠాగూర్ రాజకీయ భవిష్యత్ కోసం పన్నీర్సెల్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తన భవిష్యత్ కన్నా తన కుమారుడి భవిష్యత్ కోసం పార్టీ మారక తప్పని పరిస్థితి అని పన్నీర్సెల్వం వర్గం వివరిస్తోంది. రాబోయే ఉపఎన్నికల్లో పన్నీర్సెల్వం ‘విజిల్’ గుర్తుపై పోటీ చేయబోతున్నారని చర్చ జరుగుతోంది. 2029 పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన కుమారుడు రవీంద్రనాథ్ ఠాగూర్ను టీవీకే పార్టీ తరఫున బరిలోకి దించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నారని రాజకీయ వర్గాల్లో జోరుగా వార్తలు వస్తున్నాయి.
Ram Charan Surgery: సర్జరీ తర్వాత తొలిసారి కనిపించిన రామ్చరణ్..భార్యతో పాటు అయ్యప్ప దర్శనం, ప్రత్యేక పూజలు!
Coimbatore, Tamil Nadu:Ram Charan Surgery News: టాలీవుడ్ నటుడు మెగా పవర్స్టార్ రామ్చరణ్కు ఇటీవలే మణికట్టు సర్జరీ విజయవంతంగా పూర్తయ్యింది. ఇప్పుడు సర్జరీ విజయవంతంగా పూర్తవ్వడం వల్ల భార్య ఉపాసనతో కలిసి రామ్చరణ్ అయ్యప్ప స్వామి దేవాలయానికి వెళ్లారు. కోయంబత్తూరులోని అయ్యప్ప స్వామి దర్శనం కోసం రామ్చరణ్, ఉపాసన కలిసి వెళ్లారు. తాజాగా వైద్యులు విశ్రాంతిని సూచించిన క్రమంలో తాజాగా కోయంబత్తూరులోని గంగా ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆ వెంటనే అయ్యప్ప స్వామి ఆలయాన్ని సందర్శించిన అక్కడ మూలవిరాట్కు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కోయంబత్తూరులోని గంగా ఆసుపత్రిలో మణికట్టు సర్జరీ విజయవంతం కావడం వల్ల కుటుంబ సమేతంగా రామ్చరణ్ హైదరాబాద్ బయల్దేరారు. అయితే అంతకు ముందు స్థానిక అయ్యప్ప స్వామి ఆలయంలోని స్వామి వారిని దర్శనం చేసుకున్న ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
హీరో రామ్చరణ్ నలుపు రంగు దుస్తులలో, కుడి చేతికి కట్టుతో కనిపించారు. వారి సందర్శన సమయంలో దేవుడికి ప్రార్థనలు చేస్తుండగా, ఉపాసన ఆవుకు అరటిపండ్లు తినిపిస్తూ కనిపించారు.
ఇటీవలే మణికట్టు సర్జరీ కోసం మెగాస్టార్ చిరంజీవి కుటుంబం కోయంబత్తూరు చేరుకున్న సంగతి తెలిసిందే. హీరో రామ్చరణ్ సర్జరీ కోసం మెగాస్టార్ చిరంజీవితో పాటు ఆయన తల్లి సురేఖ, భార్య ఉపాసన కూడా అతనితో పాటు హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ప్రయాణించారు. సర్జరీ పూర్తయ్యే వరకు వీరంతా కోయంబత్తూరులోని ఆస్పత్రిలోనే ఉన్నారు.
కోయంబత్తూరు గంగా ఆసుపత్రి ఛైర్మన్ డాక్టర్ ఎస్.రాజశేఖరన్ నేతృత్వంలో రామ్చరణ్ మణికట్టుకు శస్త్రచికిత్స జరిగింది. గాయం తీవ్రత దృష్ట్యా, మయామికి చెందిన ప్రఖ్యాత చేతి, మణికట్టు నిపుణుడు డాక్టర్ అలెజాండ్రో బాడియా శస్త్రచికిత్స బృందంలో చేరారు. డాక్టర్ రాజశేఖరన్, డాక్టర్ బాడియా, డాక్టర్ ప్రవీణ్ భరద్వాజ్, వారి నిపుణుల బృందం ఈ ఆపరేషన్ను నిర్వహించారు.
వైద్య బృందం ప్రకారం.. శస్త్రచికిత్స విజయవంతమైంది, రామ్ చరణ్ బాగా కోలుకుంటున్నారు. తిరిగి పనిలోకి రావడానికి ముందు కొన్ని రోజులు విశ్రాంతి అవసరం. దాదాపుగా ఎనిమిది వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు ఆయనకు సలహా ఇచ్చారు. వైద్య అనుమతి లభించిన తర్వాతే ఆయన షూటింగ్ తిరిగి ప్రారంభిస్తారని భావిస్తున్నారు.
నటుడు ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన వెంటనే అయ్యప్ప స్వామి ఆలయ సందర్శన చేశారు. ఆయనను చూసేందుకు అభిమానులు పోటీ పడ్డారు. అందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి.
రామ్చరణ్ హీరోగా నటించిన 'పెద్ది' సినిమా షూటింగ్ సమయంలో మణికట్టుకు గాయమైంది. అప్పట్లో మైనర్ ఆపరేషన్ జరిగినా.. తరచూ ఆయనకు అసౌకర్యం కలగడం వల్ల మరో సర్జరీ అవసరమని వైద్యులు సూచించారు. దీంతో ఆయన తాజాగా మరో సర్జరీ చేయించుకున్నారు.
ఇక సినిమాల విషయానికొస్తే.. రామ్ చరణ్ చివరిగా బుచ్చి బాబు సానా దర్శకత్వంలో, జాన్వీ కపూర్తో కలిసి నటించిన 'పెద్ది' చిత్రంలో కనిపించారు. ఆయన కోలుకున్న తర్వాత దర్శకుడు సుకుమార్తో సినిమా చేయనున్నారు.
Also Read: బాలీవుడ్ హీరోయిన్ల బాడీ పార్ట్స్పై సీక్రెట్ టాటూలు..వాటిలో అర్థం అంత ఉందా?
Also REad: హీరోయిన్తో క్రికెటర్ అర్ష్దీప్ సింగ్ పెళ్లి..లగ్గం ఫిక్స్..ఆమె సంపాదన ఎంతో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
PRTU TS కామారెడ్డి జిల్లా శాఖ సర్వసభ్య సమావేశ ఆహ్వానము..!!
Secunderabad, Telangana:PRTUTS Kamareddy District General Body Meeting: ప్రోగ్రెసివ్ రికాగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ (PRTUTS) కామారెడ్డి జిల్లా సర్వసభ్య సమావేశం నిర్వహణ తేదీ మారింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ఆగస్టు 9, 2026లో మార్పులు చేసింది. సవరించిన తేదీ ప్రకారం వచ్చే నెల ఆగస్టు 8, 2026 (రెండవ శనివారం) ఉదయం 10:00 గంటలకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్లు సంఘ నాయకత్వం ఒక ప్రకటనలో తెలిపింది. కామారెడ్డిలోని బృందావన్ గార్డెన్స్ ప్రాంగణంలో, జిల్లా అధ్యక్షుడు అల్లాపుర్ కుశాల్ అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు.
ఈ ప్రతిష్ఠాత్మక జిల్లా సమావేశానికి శాసన మండలి సభ్యులు (ఎమ్మెల్సీ) పింగిలి శ్రీపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బి. మోహన్ రెడ్డిలతో పాటు PRTUTS రాష్ట్ర అధ్యక్షుడు పులగం దామోదర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సుంకరి బిక్షం గౌడ్, రాష్ట్ర అధికార ప్రతినిధి వంగ మహేందర్ రెడ్డి, సీనియర్ నాయకులు పేరి వెంకట్ రెడ్డి, గుండు లక్ష్మణ్, కులకర్ణి మనోహర్ రావు తదితరులు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు.
కీలక ఎజెండా..
సమావేశంలో భాగంగా జ్యోతి ప్రజ్వలన, అతిథుల సందేశాల అనంతరం 2025-26 సంవత్సరానికి సంబంధించిన వార్షిక కార్యదర్శి నివేదికను సమర్పించనున్నారు. అనంతరం వార్షిక కార్యదర్శి నివేదికకు సంబంధించి.. సుదీర్ఘ చర్చ అనంతరం ఆమోదించనున్నారు. ఈ చర్చ తర్వాత ప్రస్తుతం బాధ్యతల్లో ఉన్న జిల్లా కార్యవర్గాన్ని అధికారికంగా రద్దు చేసి, 2026-28 రెండేళ్ల కాలవ్యవధికి గాను నూతన జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకోనున్నారు. ఇక ఉపాధ్యాయుల ప్రధాన సమస్యలైన.. నిలిచిపోయిన డిఏ (DA) బకాయిల విడుదల, సీపీఎస్ (CPS) రద్దు, పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనపై ఈ సర్వసభ్య సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. ఉపాధ్యాయుల హక్కుల సాధన, సమస్యల పరిష్కారమే ధ్యేయంగా సాగే ఈ సర్వసభ్య సమావేశానికి జిల్లాలోని మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, కాంప్లెక్స్ ఇన్ఛార్జీలు, విద్యాధికారులు.. ప్రాథమిక సభ్యులందరూ పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా ప్రధాన కార్యదర్శి పుట్ట శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు.
Also Read: తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఒకేసారి 2 శుభవార్తలు..నెరవేరబోతున్న చిరకాల కోరిక..!!
Also Read: హెల్త్ కార్డులు, పీఆర్సీ కోసం రోడ్డెక్కిన పెన్షనర్లు..!!
Also Read: బ్రిక్స్ వేదికపై మెరిసిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Mercury Transit 2026: ఆగస్టు 9 నుంచి ఈ 4 రాశుల జాతకం మారబోతోంది.. జాక్పాట్ కొట్టేది వీళ్లే!
Hyderabad, Telangana:Mercury Transit Effect 2026: జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల రాకుమారుడుగా పిలిచే బుధ గ్రహం కదలికలకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది.. బుధుడి మార్పు కారణంగా ద్వాదశ రాశులపై శుభ, అశుభ ప్రభావాలు పడుతూ ఉంటాయి. ఇదిలా ఆగస్టు 9వ తేదీ ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో బుధుడు తన దిశను మార్చుకోబోతున్నాడు.. ఈ అరుదైన సంచారం వల్ల 4 రాశుల వారికి సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరగడంతో పాటు, ఆదాయం గణనీయంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. మాట తీరు కూడా పూర్తిగా మారుతుంది.. వ్యాపారాల్లో సరైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల విశేష ప్రయోజనాలు పొందనున్నారు. అయితే, ఈ సమయంలో ఏయే రాశులవారు అద్భుతమైన లాభాలు పొందుతారో ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ రాశులవారికి బంపర్ జాక్ఫాట్:
మిథున రాశి (Gemini)
మిథున రాశి అధిపతి బుధుడే కావడం వల్ల వీరికి మరిన్ని శుభఫలితాలు కలుగుతాయి. వ్యక్తిగత జీవితానికి, ఉద్యోగానికి మధ్య చక్కని సమతుల్యత లభిస్తుంది.. ఆఫీసులో పైఅధికారుల నుంచి ప్రశంసల లభించడమే కాకుండా అద్భుతమైన ధన లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా దీర్ఘకాలంగా నడుస్తున్న వివాదాలు సులువుగా పరిష్కారమవుతాయని నిపుణులు తెలుపుతున్నారు. కొత్త ఉత్సాహంతో పనిచేసేవారు ఈ సమయంలో తప్పకుండా ఆర్థికంగా బలంగా స్థిరపడే ఛాన్స్లు ఉన్నాయి..
వృశ్చిక రాశి (Scorpio)
వృశ్చిక రాశి వారికి కూడా ఈ సమయంలో సరికొత్త మార్గాలు చూసే ఛాన్స్లు ఉన్నాయి.. ఉద్యోగ, వ్యాపారాల్లో ఎదురవుతున్న అవాంతరాలు తొలగిపోతాయి. ప్రత్యర్థులతో పాటు శత్రువుల నుంచి కూడా విముక్తి లభిస్తుంది.. ఆఫీస్ పాలిటిక్స్ నుంచి కూడా వీరికి తప్పకుండా విముక్తి కలుగుతుంది. ఊహించని విధంగా అకస్మాత్తుగా ధనలాభాలు కూడా కలుగుతాయి..
కన్యా రాశి (Virgo)
కన్యా రాశి వారికి బుధుడి ప్రభావంతో అద్బుతమైన ప్రయోజనాలు కలిగే ఛాన్స్లు ఉన్నట్లు జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఎంతటి పెద్ద సమస్యలనైనా ఈ సమయంలో తప్పకుండా పరిష్కరమయ్యే ఛాన్స్లు ఉన్నాయి.. వ్యాపార, ఉద్యోగ రంగాల్లో మీరు పడ్డ కష్టానికి తగిన ప్రతిఫలం కూడా లభిస్తుంది. వృత్తిపరంగా మీ పనితీరు మెరుగ్గా మారి ప్రమోషన్ లేదా జీతం విపరీతంగా పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.
మేష రాశి (Aries)
మేష రాశి వారికి ఈ బుధుడి సంచారం ప్రభావంతో అత్యంత కీలకమైన అవకాశాలు కూడా లభిస్తాయి. సుదూర ప్రయాణాలు లాభదాయకంగా సాగే ఛాన్స్లు కూడా కనిపిస్తున్నాయి. కుటుంబంలో ఆహ్లాదకర వాతావరణం నెలకొని.. మానసిక ఒత్తిడి పూర్తిగా తొలగిపోతుంది. వ్యాపారవేత్తలకు కొత్త కాంట్రాక్టులు, ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఇది సువర్ణ సమయంగా భావించవచ్చు. మీ మాట తీరు కూడా పూర్తిగా మారిపోతుంది.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
గమనిక.. 
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..
Viral News: 'జోగులాంబాదేవీ.. ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించవమ్మా!'.. ఓ లేఖ వైరల్
Alampur (P), Telangana:Jogulamba Temple Letter Viral: జోగులాంబాదేవీ.. ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించవమ్మా.. అంటూ అమ్మవారి హుండీలో ఓ భక్తుడి లేఖ రాశాడు. తనకు ఉద్యోగాలు రావడం లేదని.. వచ్చేలా చేయాలని అమ్మవారికి మొక్కుకున్నాడు. ఆ లేఖ కాస్త వైరల్గా మారింది. తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్లోని ఐదో శక్తిపీఠం రాష్ట్రంలో ఏకైక శక్తిపీఠం జోగులాంబ, బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయం. ఈ ఆలయానికి సంబంధించిన హుండీని ఇటీవల లెక్కింపు చేపట్టారు.
హుండీ లెక్కిస్తుండగా జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలంలోని ఓ గ్రామానికి చెందిన భక్తుడు అమ్మవారి హుండీలో రాసిన లేఖ సిబ్బందికి కనిపించింది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎంత ప్రయత్నించినా ఉద్యోగం రావడం లేదని.. అమ్మవారి చల్లటి చూపు తనపై ఉండాలని ఆ భక్తుడు వేడుకున్నాడు. తనతోపాటు తన భార్య, తల్లిదండ్రులు, తమ్ముడిని కూడా అమ్మవారు కాపాడాలని కోరాడు. కుటుంబంలో ఎలాంటి గొడవలు రాకుండా.. దాంపత్య జీవితంలో భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకుంటూ సంతోషంగా జీవించేలా చూడాలని లేఖలో మొక్కుకున్నాడు.
ఎవరికీ ఇబ్బంది కలిగించకుండా.. ద్రోహం చేయకుండా ధర్మమార్గంలో నడిచేలా ఆశీర్వదించాలని జోగులాంబ అమ్మవారిని కోరాడు. ఇక ఈ లేఖతో పాటు భక్తుడు తన బయోడేటాను కూడా జత చేశాడు. పదో తరగతిలో 70 శాతం, ఇంటర్లో 68 శాతం, టీటీసీలో 85 శాతం, డిగ్రీలో 84 శాతం, బీఈడీలో 86 శాతం మార్కులు సాధించినట్లు బయోడేటాలో పేర్కొన్నాడు. ప్రస్తుతం బీపీఈడీ కూడా చదువుతున్నట్లు రాశాడు. అన్ని కోర్సుల్లో మంచి మార్కులు సాధించినా ఉద్యోగం దక్కకపోవడంతో.. చివరకు అమ్మవారినే నమ్ముకున్నానంటూ తన ఆవేదనను లేఖలో వ్యక్తం చేశాడు.
మరో లేఖ కూడా..
'చివరగా ఒక్క జాబ్ ప్రసాదించమ్మా.. చాలా ఇబ్బంది అయింది' అంటూ తన భార్యాభర్తల పేర్లతో లేఖను ముగించాడు. ఇక మరో భక్తుడు కూడా తన కోరికను లేఖ రూపంలో అమ్మవారికి సమర్పించాడు. కల్యాణం కావాలని.. భయం తగ్గాలని.. మనసు ప్రశాంతంగా ఉండాలని కోరుతూ లేఖతో పాటు తన పాస్పోర్ట్ సైజ్ ఫొటోతో పాటు తన పేరు, గోత్రాన్ని కూడా రాసి హుండీలో వేశాడు.
హుండీ ఆదాయం..
లేఖలు పక్కనపెడితే జోగులాంబ అమ్మవారి ఆలయ హుండీ లెక్కింపు చేపట్టగా రూ.90 లక్షల ఆదాయం సమకూరింది. జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాల 134 రోజుల హుండీ లెక్కింపును ఆలయ అధికారులు నిర్వహించారు. 134 రోజుల వ్యవధిలో భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించగా మొత్తం రూ.90 లక్షల 86 వేల 931 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో దీప్తి రెడ్డి వెల్లడించారు.
Tirumala: శ్రీనివాసుడి చెంతకు 'శ్రీనివాస మంగాపురం' చిత్రబృందం
Dharmavaram, Andhra Pradesh:Ghattamaneni Jayakrishna And Srinivasa Mangapuram Movie Team Visits Tirumala Temple Watch Videoవిక్రమార్కుడు సీన్ రిపీట్.. రూ.45 వేలు ఆశచూపి మహిళలకు గుండుకొట్టించిన వ్యక్తి..
Hyderabad, Telangana:Vikramarkudu Scene Recreated Video: సినిమా కథలను తలపించేలా.. ఒక ఆకతాయి చేసిన అల్లరి ఫోన్ కాల్.. అమాయక మహిళల జీవితాల్లో తీవ్ర అవమానాన్ని నింపింది. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన విక్రమార్కుడు సినిమాలో డబ్బు ఆశ చూపి.. మహిళలకు గుండు కొట్టించిన సందర్భం గుర్తుందిగా? సరిగ్గా అలాగే తమిళనాడులోని సేలం జిల్లా పుదుకొత్తంబాడి గ్రామంలో వెలుగు చూసింది.
అసలేం జరిగింది?
కొద్దిరోజుల క్రితం పుదుకొత్తంబాడి గ్రామానికి చెందిన పళనియమ్మాళ్ అనే మహిళకు ఒక తెలియని నంబర్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది.. అవతలి వ్యక్తి తాను తాలూకా కార్యాలయానికి చెందిన ఉన్నతాధికారినని పరిచయం చేసుకున్నాడు. రాష్ట్రంలో కొత్తరకం భయంకర వ్యాధి వేగంగా వ్యాపిస్తోందని.. దానిని నివారించడానికి ప్రభుత్వం ప్రత్యేకంగా గుండు విధానాన్ని అమల్లోకి తెచ్చిందని నమ్మించాడు..
ఈ పథకం కింద గుండు గీయించుకున్న సామాన్య మహిళలకు రూ.15,000.. చదువుకునే విద్యార్థినులకు రూ.45,000తో పాటు ఉచితంగా ల్యాప్టాప్ కూడా అందిస్తామని ఫోన్ కాల్ ద్వారా నమ్మించాడు.. అంతేకాకుండా ఈ పథకానికి సంబంధించిన మొదటి టోకెన్ మీకే వచ్చింది. ఈ విషయాన్ని ఇతరులకు చెబితే మీ గ్రామంలోని లబ్ధిదారులకు వెంటనే డబ్బులు జమ అవుతాయని నమ్మించాడు..
క్యూ కట్టిన అమ్మలక్కలు..
ఆ ఆకతాయి మాటలను పూర్తిగా నమ్మిన పళనియమ్మాళ్.. వెంటనే విషయాన్ని ఊరిలోని ఇతర మహిళలకు తెలిపింది. ఉచిత ల్యాప్టాప్తో పాటు భారీ మొత్తంలో నగదు వస్తుందనే ఆశతో గ్రామానికి చెందిన కావేరి, రామాయి, చిత్ర అనే మహిళలు ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే ఊరిలోని మగంళిని ఇళ్లకు పిలిపించుకుని గుండు చేయించుకున్నారు. మరికొందరు విద్యార్థినులు కూడా గుండు చేయించుకోవడానికి రెడీ అయ్యారు.
స్విచ్ఛాఫ్ అయిన ఫోన్..
గుండు చేయించుకున్న అనంతరం.. పథకం ప్రకారం రావాల్సిన డబ్బులు, ల్యాప్టాప్ గురించి సదరు వ్యక్తికి ఫోన్ చేయగా.. ఆ నంబర్ స్విచ్చ్ ఆఫ్ అని వచ్చింది. ఎంతసేపు ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో.. తాము ఒక ఆకతాయి చేతిలో దారుణంగా మోసపోయామని గ్రహించిన ఆ మహిళలు లబోదిబోమంటూ.. కన్నీరుమున్నీరవుతున్నారు.
Also Read: పోలీస్ వ్యాన్ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!
ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.. విషయం తెలుసుకున్న పోలీసులు, స్థానిక అధికారులు గ్రామాన్ని సందర్శించి విచారణ చేపట్టారు.. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. సోషల్ మీడియా ప్రాంక్లతో పాటు నకిలీ ఫోన్ కాల్స్, లాటరీ లేదా ఉచిత పథకాల పేరుతో వచ్చే మెసేజ్లను బ్లైండ్గా నమ్మవద్దని హెచ్చరించారు. ప్రభుత్వం ఏ పథకాన్ని ప్రవేశపెట్టినా అధికారికంగా సచివాలయాలు, పంచాయతీ కార్యాలయాల ద్వారానే సమాచారం ఇస్తుందని.. అపరిచితులు చేసే ఫోన్ కాల్స్ ఆధారంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని స్పష్టం చేశారు..
Also Read: పోలీస్ వ్యాన్ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Shukra Gochar 2026: నీచరాశిలోకి శుక్ర సంచారం..ఆగస్టు 1 నుంచి ఈ రాశుల వాళ్లకి కష్టాలే కష్టాలు..పరిహారం ఇదే!
Hyderabad, Telangana:Shukra Neech Gochar 2026: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సంపద, శ్రేయస్సు అధిపతి అయిన శుక్రుడు తన మిత్ర రాశి అయిన సింహరాశిని విడిచిపెట్టి 2026 ఆగస్టు 1న కన్యారాశిలోకి ప్రవేశించనున్నాడు. జోతిష్య శాస్త్రం ప్రకారం రాశీచక్రంలోని చివరి కన్యారాశిని నీచ రాశిగా పరిగణిస్తారు. ఈ శుక్రగ్రహం నీచరాశిలోకి ప్రవేశించినప్పుడల్లా.. దాని వల్ల కలిగే శుభ ఫలితాలు తగ్గుతాయి. ఈ సంచారం కారణంగా రాశీచక్రంలోని ఇతర రాశులకు ఆర్థిక నష్టంతో పాటు మానసిక, శారీరక ఆరోగ్య సమస్యలు దాపురించే అవకాశం ఉంది. ఆగస్టు 1న నుంచి ప్రారంభమయ్యే శుక్ర గ్రహ సంచారం కారణంగా ఏఏ రాశులు ప్రభావితం అవుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
మేషరాశి
ఈ రాశి ఆరవ ఇంట్లో శుక్రుని సంచారం కారణంగా ఆరోగ్య సంబంధిత సమస్యలు ఎదురుకావొచ్చు. శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండడం మంచిది. అలాగే అనవసరమైన ఖర్చులను నియంత్రించుకొని.. ఎవరికీ డబ్బు అప్పుగా ఇవ్వడం చేయకపోవడం మంచిది.
మిథున రాశి
మిథునరాశికి చెందిన నాలుగవ ఇంట్లో నీచ స్థితిలో ఉన్న శుక్రుడు కుటుంబ జీవితంలో అశాంతిని, మీ తల్లి ఆరోగ్యం క్షీణించడానికి కారణం కావచ్చు. వాహనం లేదా ఇంటికి సంబంధించిన నిర్ణయాలు ఆటంకం కలిగించే అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండండి.
తులా రాశి
తులా రాశికి అధిపతి అయిన శుక్రుడు 12వ ఇంట్లోకి ప్రవేశించడం వలన అనవసరమైన ఖర్చులు భారీగా పెరిగే అవకాశం ఉంది. అనవసరమైన ప్రయాణాలు, ఆర్థిక నష్టాలు సంభవించే అవకాశం ఉంది. బంధుమిత్రులతో అపార్థాలు పెరగవచ్చు.
మీన రాశి
మీన రాశికి చెందిన ఏడవ ఇంట్లో బలహీనమైన శుక్రుడు ఉండటం వలన వైవాహిక జీవితంలో చేదు అనుభవాలు లేదా మీ జీవిత భాగస్వామితో విభేదాలు ఏర్పడవచ్చు. వ్యాపార భాగస్వాములతో పారదర్శకంగా ఉండండి, లేకపోతే ఆర్థిక నష్టాలు సంభవించవచ్చు.
శుక్రుని ప్రతికూల ప్రభావాలను నివారించడానికి సులభమైన పరిహారాలు
1) కుదిరితే రోజూ లేదా ముఖ్యంగా శుక్రవారాల్లో లక్ష్మీదేవికి తెల్లని మిఠాయిలను సమర్పించి, కనకధారా స్తోత్రాన్ని పఠించాలి.
2) శుక్రవారాల్లో పేదలకు తెల్లని వస్తువులను దానం చేయండి.
3) 'ఓం శున్ శుక్రాయ నమః' మంత్రాన్ని 108 సార్లు జపించండి.
(గమనిక: ఇక్కడ పేర్కొన్న సమాచారం కేవలం హిందూ మత సంప్రదాయలు, నమ్మకాలు, జోతిష్యశాస్త్ర నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. దీన్ని పాటించే ముందు సంబంధిత నిపుణుడ్ని సంప్రదించడం మేలు. దీన్ని జీ తెలుగు న్యూస్ ధ్రువీకరించడం లేదు.)
Also Read: ఆగస్టు 12న అతిపెద్ద సంపూర్ణ సూర్యగ్రహణం.. ఈ 3 రాశుల వారికి
Also REad: శుక్ర-కుజుల కలయికతో కేంద్ర దృష్టి యోగం.. లక్ష్మీదేవి అనుగ్రహం పొందే లక్కీ రాశులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
తప్పిపోయిన ఆరేళ్ల బాలుడిని.. తల్లిదండ్రుల వద్దకు చేర్చిన MLA నవీన్ యాదవ్..
Hyderabad, Telangana:Mla Naveen Yadav: ప్రజాసేవే పరమావధిగా భావించే ప్రజాప్రతినిధులు సమాజంలో ప్రతికూల పరిస్థితుల్లో కూడా తమ మంచి మనుసును చాటుకుంటారు. సరిగ్గా అలాంటి ఘటనే హైదరాబాద్లోని షేక్పేట్ ప్రాంతంలో చోటుచేసుకుంది. రోడ్డుపక్కన దిక్కుతోచక ఏడుస్తున్న ఓ చిన్నారిని చూసి.. చలించిపోయిన జూబ్లీహిల్స్ శాసనసభ్యులు నవీన్ యాదవ్.. తక్షణమే స్పందించి ఆ బాలుడిని సురక్షితంగా తల్లిదండ్రుల వద్దకు చేర్చడంలో కీలక పాత్ర పోషించి.. తన ఉదారతను చాటుకున్నారు.
అసలు ఏం జరిగింది?
మంగళవారం రాత్రి షేక్పేట్ పరిధిలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్.. కార్యక్రమం ముగించుకుని తన కాన్వాయ్లో తిరిగి వెళ్తున్నారు. మార్గమధ్యలో రోడ్డు పక్కన సుమారు ఆరేళ్ల వయస్సున్న ఓ చిన్నారి ఒంటరిగా నిలబడి భయంతో ఏడుస్తూ ఉండటాన్ని ఆయన గమనించారు. వాహనాలు వేగంగా వెళ్తున్న ఆ రద్దీ రోడ్డుపై చిన్నారి ఏడుస్తుండటంతో ఎమ్మెల్యే వెంటనే తన వాహనాన్ని పక్కకు ఆపేశారు..
వాహనం దిగి స్వయంగా బాలుడి వద్దకు వెళ్లిన నవీన్ యాదవ్.. అతడిని ప్రేమతో దగ్గరకు తీసుకుని ఓదార్చారు. బాలుడికి ధైర్యం చెప్పి ఆరా తీయగా.. తాను ఇంటి దారి మరిచిపోయి తప్పిపోయినట్లు ఆ చిన్నారి అమాయకంగా తెలిపాడు. బాలుడి పరిస్థితిని అర్థం చేసుకున్న ఎమ్మెల్యే, ఆలస్యం చేయకుండా వెంటనే టోలిచౌకి పోలీసు స్టేషన్ అధికారులకు ఫోన్ ద్వారా సమాచారాన్ని అందించారు. సంఘటనా స్థలానికి చేరుకోవాల్సిందిగా కోరారు.
రంగంలోకి దిగిన టోలిచౌకి పోలీసులు..
ఎమ్మెల్యే సమాచారం అందించిన కొద్దిసేపటికే టోలిచౌకి పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. బాలుడి నుంచి వివరాలు సేకరించే ప్రయత్నం చేశారు. పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ కెమెరాలతో పాటు అంతకుముందే నమోదైన మిస్సింగ్ ఫిర్యాదుల ఆధారంగా పోలీసులు వేగంగా దర్యాప్తు జరిపారు. కొద్ది సమయంలోనే బాలుడి నివాసాన్ని.. అతడి తల్లిదండ్రుల వివరాలను గుర్తించారు.
కంటికి రెప్పలా చూసుకునే.. తమ కుమారుడు కనిపించకుండా పోవడంతో తీవ్ర ఆందోళనలో ఉన్న తల్లిదండ్రులకు.. పోలీసులు బాలుడిని సురక్షితంగా అప్పగించారు. తమ బిడ్డను క్షేమంగా తమ ఒడికి చేర్చడంలో ప్రధాన పాత్ర పోషించిన ఎమ్మెల్యే నవీన్ యాదవ్కు.. స్పీడ్గా స్పందించిన టోలిచౌకి పోలీసులకు బాలుడి కుటుంబ సభ్యులు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
Also Read: Revanth Reddy: కేటీఆర్ బర్త్డేపై రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు.. 'బర్త్డే దావత్ అడగాలి'
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
7,000 కేసులు నమోదు.. ఇకపై ప్రతీ విద్యార్థికి HIV పరీక్షలు..
Hyderabad, Telangana:Karnataka Mandates HIV Screening In Colleges: యువత భవిష్యత్తును కాపాడేందుకు కర్ణాటక ప్రభుత్వం ఒక ఊహించని నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు తప్పనిసరిగా హెచ్ఐవీ (HIV) నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో పాటు విద్యాసంస్థల్లో ప్రత్యేక అవగాహనతో పాటు కౌన్సెలింగ్లను కూడా ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది. ఇటీవలే 7000లకు పైగా కేసులు నమోదు కాగా.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
యువతలోనే ఎక్కువ కేసులు..
ఇటీవలి కాలంలో నిర్వహించిన సర్వేల్లో 15 నుంచి 25 సంవత్సరాల వయస్సు ఉన్న యువతీ, యువకుల్లో హెచ్ఐవీ పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నట్లు వెల్లడైంది. ఈ నివేదికలు వైద్య ఆరోగ్య శాఖను తీవ్ర కలవరానికి గురిచేశాయి. ముందస్తు అవగాహన లేకపోవడంతో పాటు సరైన సమాచారం లేకపోవడమే ఈ పరిస్థితికి ప్రధాన కారణమని అధికారులు భావిస్తున్నారు. అందుకే ముల్లును ముల్లుతోనే తీయాలన్నట్లు.. నేరుగా కాలేజీల స్థాయిలోనే దీనిపై ప్రత్యేకమైన అవగాహన కార్యక్రమాలను ప్రారంభించాలని సర్కార్ నిర్ణయించింది.
ప్రభుత్వం సూచిస్తుంది ఇదే..
హెచ్ఐవీని ప్రాథమిక దశలోనే గుర్తిస్తే.. సకాలంలో సరైన చికిత్స అందించి.. బాధితుల ప్రాణాలను కాపాడవచ్చు. మంచి జీవనశైలితో పాటు హెచ్ఐవీ సంక్రమించే విధానాలపై విద్యార్థులకు ఉన్న అపోహలను తొలగించడం ముఖ్య ఉద్ధేశ్యమని తెలిపింది.. బాధితులకు మానసికంగా కొండంత అండగా నిలుస్తూ.. భవిష్యత్తుపై ధైర్యాన్ని నింపడం ప్రభుత్వ పని అని వెల్లడించింది.. హెచ్ఐవీ బాధితులను సమాజం చూసే కోణంలో మార్పు తీసుకురావడంతో పాటు వివక్షను అరికట్టాలని ప్రభుత్వం భావిస్తోంది..
వ్యాధిని ప్రారంభంలోనే గుర్తించడం వల్ల ఆధునిక వైద్య విధానాల ద్వారా బాధితులు సుదీర్ఘకాలం పూర్తి ఆరోగ్యంతో జీవించవచ్చు. అంతేకాకుండా, ఇది ఇతరులకు వ్యాపించకుండా అరికట్టడానికి ఉపయోగపడుతుందని ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు తెలిపారు.. కాలేజీల్లో నిర్వహించే ఈ స్క్రీనింగ్ టెస్టుల విషయంలో విద్యార్థులు ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదని అధికారులు స్పష్టం చేశారు. పరీక్షల ఫలితాలు, విద్యార్థుల వ్యక్తిగత వివరాలను అత్యంత సిక్రెట్గా(Strict Confidentiality) ఉంచుతామని అధికారులు హామీ ఇచ్చారు.
ఒకవేళ ఎవరికైనా పాజిటివ్గా నిర్ధారణ అయితే.. వారికి ప్రభుత్వ ఖర్చుతోనే ఉచితంగా యాంటీరెట్రోవైరల్ థెరపీ (ART) చికిత్స, మందులు అందజేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వం తీసుకున్న ఈ సంచలనాత్మక నిర్ణయంపై సామాజిక వేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలలు, కళాశాలల స్థాయిలోనే ఇలాంటి విప్లవాత్మక అడుగులు వేయడం వల్ల రాబోయే తరాలను ఆరోగ్యకరంగా తీర్చిదిద్దవచ్చని అభిప్రాయపడుతున్నారు.
Also Read: Revanth Reddy: కేటీఆర్ బర్త్డేపై రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు.. 'బర్త్డే దావత్ అడగాలి'
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Telangana Rains: హైదరాబాద్తో సహా తెలంగాణలో దంచికొట్టిన వర్షాలు.. ఎక్కడ ఎంత పడిందంటే?
Baddipadaga, Telangana:Hyderabad Raifall: తెలంగాణలో వర్షాభావ పరిస్థితులు తొలగిపోయినట్టు కనిపిస్తోంది. ఈ సీజన్లో తొలిసారి వరుణుడు విజృంభిస్తున్నాడు. ఎల్నినో పరిస్థితుల కారణంగా ఇన్నాళ్లు తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనగా ఆ పరిస్థితులు పోయి మళ్లీ వర్షాలు జోరందుకున్నాయి. హైదరాబాద్తో సహా తెలంగాణలోని అన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. కొన్ని రోజులుగా వర్షాలు పడుతుండడంతో తెలంగాణ నేల తడిచి ముద్దవుతోంది. తెలంగాణలో విస్తృతంగా వర్షాలు కురుస్తుండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లు మండకొడిగా సాగిన వ్యవసయ పనులు ఇక జోరందుకోనున్నాయి. 24 గంటల్లో హైదరాబాద్తోపాటు అన్ని జిల్లాల్లో వర్షాలు పడ్డాయి. ఎక్కడెక్కడ ఎంత వర్షం పడిందో చూద్దాం.
Also Read: Heavy Rains: ఉత్తర తెలంగాణకు పొంచి ఉన్న ముప్పు.. రాబోయే 36 గంటలు అత్యంత కీలకం
ఉత్తర తెలంగాణ జిల్లాలతోపాటు హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి, వికారాబాద్, కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో మంగళవారం భారీగా వర్షాలు పడ్డాయి. ఉత్తర తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడ్డాయి. జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట తదితర జిల్లాల్లో వరుణుడు ప్రతాపం చూపించాడు. అటవీ ప్రాంత జిల్లాల్లో కుంభవృష్టి కురిసింది. అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం హీరాపూర్లో 5.8 సెం.మీ వాన పడగా.. తాంసి, తలమడుగు, ఇచ్చోడ, భోరజ్, మావల మండలాల్లో 4.2 సెం.మీ వర్షపాతం నమోదైంది.
==> వికారాబాద్ జిల్లా మోమిన్పేటలో 4 సెం.మీ
==> వరంగల్ జిల్లా చెన్నారావుపేటలో 3.8
==> కామారెడ్డి జిల్లా మొహమ్మద్నగర్ మండలం మొగ్దంపూర్లో 3.4 సెం.మీ
==> మెదక్ జిల్లా పాపన్నపేటలో 8.4 సెం.మీ
Also Read: Hyderabad Police: హైదరాబాద్లో భారీ వర్షం.. క్షేత్రస్థాయిలో ట్రాఫిక్ పోలీసుల తనిఖీ
రాగల కొన్ని గంటల్లో..
తీవ్ర వాయుగుండం ప్రభావంతో తెలంగాణలో వర్షాలు జోరందుకున్నాయి. ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ ప్రాంతాలపై ఏర్పడిన తీవ్ర వాయుగుండం బుధవారం వరకు పశ్చిమ- వాయవ్య దిశగా కదులుతుందని వాతావరణశాఖ తెలిపింది. ఈ ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో బుధ, గురువారాలు భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పది జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో రాగల కొన్ని గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మిగిలిన జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
ప్రభుత్వం అప్రమత్తం
వాతావరణ శాఖ భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. భారీ వర్షాలు పొంచి ఉన్న జిల్లాలకు అప్రమత్తం ప్రకటించింది. ఆయా జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్జాజు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. కలెక్టర్లు, ఎస్పీలతో మంగళవారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి వర్షాలపై సమీక్ష చేశారు. వివిధ శాఖలతో కలెక్టర్లు సమన్వయం చేసుకోవాలని.. ఎన్డీఆర్ఎఫ్ బృందాలను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.
వర్షాలకు సంబంధించి జీ తెలుగు న్యూస్ లైవ్ చూడండి
కొండగట్టు అంజన్న గిరి ప్రదక్షిణలో తెలంగాణ మంత్రుల బృందం..
Hyderabad, Telangana:Giri Pradakshina Kondagattu: తెలంగాణలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం, జగిత్యాల జిల్లాలోని కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం బుధవారం భక్తులతో కిటకిలాడిపోయింది.. స్వామివారి క్షేత్రంలో అత్యంత పవిత్రంగా భావించే గిరి ప్రదక్షిణ మహోత్సవం అద్భుతంగా సాగింది. ఈ వేడుకలో రాష్ట్ర రవాణాతో పాటు బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, నియోజకవర్గ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, ప్రజాప్రతినిధులతో పాటు నాయకులతో కలిసి రాష్ట్ర మంత్రులు అత్యంత భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు.. ఆలయ ప్రాంగణం నుంచి ప్రారంభమైన గిరి ప్రదక్షిణలో మంత్రులు, ప్రజాప్రతినిధులు భక్తులతో కలిసి నడిచారు. స్వామివారి నామస్మరణలతో కొండగట్టు గిరులు ప్రతిధ్వనించాయి.
రాష్ట్ర సంక్షేమం కోసం ప్రత్యేక పూజలు..
గిరి ప్రదక్షిణ అనంతరం మంత్రుల బృందం శ్రీ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకుని.. ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించింది. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురిసి, చెరువులు, జలాశయాలు జలకళతో ఉప్పొంగాలని ఆకాంక్షించారు. రైతన్నల పొలాలు పచ్చని పైర్లతో, పాడిపంటలతో వర్ధిల్లాలని.. ప్రతి ఒక్క కుటుంబం ఆయురారోగ్యాలు, సుఖశాంతులతో సుభిక్షంగా జీవించాలని అంజన్నను వేడుకున్నట్లు తెలిపారు.
వేదాశీర్వచనం ..
ఆలయానికి వచ్చిన ప్రజాప్రతినిధులకు అర్చకులతో పాటు అధికారులు ఘన స్వాగతం పలికారు. పూజా కార్యక్రమాల అనంతరం ఆలయ వేద పండితులు శ్లోకాలతో మంత్రులకు వేదాశీర్వచనం అందజేశారు. స్వామివారి శేషవస్త్రాలతో పాటు పవిత్ర తీర్థప్రసాదాలను ప్రధాన అర్చకులు ప్రజాప్రతినిధులకు బహూకరించారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, ఆలయ ఈవో, సిబ్బందితో పాటు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు.
Also Read: Revanth Reddy: కేటీఆర్ బర్త్డేపై రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు.. 'బర్త్డే దావత్ అడగాలి'
ప్రతి పౌర్ణమికి ఈ గిరి ప్రదక్షిణ..
కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి గిరి ప్రదక్షిణ ప్రతి పౌర్ణమికి ఎంతో ఘనంగా సాగుతోంది. చాలా మంది భక్తులు భక్తిశ్రద్దలతో ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అంతేకాకుండా చాలా మంది భక్తులు గిరి ప్రదక్షిణ సమయంలో కొండల్లో కోతుల ఆహారం కోసం పండ్ల చెట్లను కూడా నాటుతున్నారు. అలాగే మరికొంతమంది ఈ సమయంలో సీడ్స్ బాల్స్ను కూడా చల్లుతున్నారు.
Also Read: Revanth Reddy: కేటీఆర్ బర్త్డేపై రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు.. 'బర్త్డే దావత్ అడగాలి'
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
PM మోదీపై అసభ్యకర పోస్టులు పెట్టినవారికి బిగ్ షాక్!
Hyderabad, Telangana:NEET Controversy: నీట్ (NEET) పేపర్ లీక్ వివాదం నేపథ్యంలో దేశ రాజధానిలో విద్యార్థులు తీవ్ర నిరసనలు చేపట్టిన సంగతి అందరికీ తెలిసిందే. ఇందులో భాగంగా కాక్రోచ్ జనతా పార్టీ (CJP) కీలక పాత్ర పోషించింది. ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాల్లో ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి.. కొంతమంది తీవ్ర వ్యాఖ్యలతో పాటు అసభ్యకర పోస్టులు చేశారు. దీంతో పలువురు X ఖాతాదారులకు ఢిల్లీ పోలీసులు నోటీసులు జారీ చేశారు.
పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. నీట్ పేపర్ లీక్ ఘటనపై విద్యార్థులతో పాటు వివిధ సంఘాలు జంతర్ మంతర్లో నిర్వహించిన సంసద్ చలో ఆందోళనల సమయంలో సోషల్ మీడియా వేదికగా పెద్దఎత్తున పోస్టులతో పాటు వీడియోలు పోస్ట్ చేశారు.. ఈ క్రమంలో రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకుని.. అనుచిత పదజాలాన్ని ఉపయోగిస్తూ చేసిన పోస్టులను పోలీసులు తీవ్రంగా పరిగణించారు.
ఢిల్లీ పోలీసులకు చెందిన సైబర్ అండ్ సోషల్ మీడియా మానిటరింగ్ టీమ్ నిరంతరం డిజిటల్ ప్లాట్ఫారమ్లను పరిశీలిస్తోంది.. ఐటీ చట్టం (IT Act)తో పాటు కొత్తగా అమలులోకి వచ్చిన భారతీయ న్యాయ సంహిత (BNS) నిబంధనలకు విరుద్ధంగా ఉన్న పోస్టులను గుర్తించిన అధికారులు X యాజమాన్యానికి ప్రత్యేకంగా లేఖలు రాశారు.
ఆయా వివాదాస్పద పోస్టులను వెంటనే తొలగించాలని ఆదేశించడంతో పాటు, ఆ ఖాతాలు నిర్వహిస్తున్న వ్యక్తుల వివరాలు (పేరు, చిరునామాతో పాటు ఈమెయిల్ ఐడీ, ఫోన్ నంబర్లు, లాగిన్-లాగౌట్ ఐపీ వివరాలు) అందించాలని స్పష్టం చేశారు. ఇప్పటికే పలు అభ్యంతరకర పోస్టులను ప్లాట్ఫారమ్ నుంచి తొలగించినట్లు అధికారులు వెల్లడించారు..
Also Read: Revanth Reddy: కేటీఆర్ బర్త్డేపై రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు.. 'బర్త్డే దావత్ అడగాలి'
సామాజిక మాధ్యమాల్లో ప్రజాస్వామ్యబద్ధంగా అభిప్రాయాలు వ్యక్తం చేసే హక్కు ఉన్నప్పటికీ.. అసభ్యకర, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం చట్టరీత్యా నేరమని పోలీసులు తెలిపారు. నోటీసులకు ఖాతాదారులు ఇచ్చే సమాధానాలతో పాటు దర్యాప్తులో వచ్చే ఆధారాల ఆధారంగా న్యాయపరమైన చర్యలు ఉంటాయని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.
Also Read: Revanth Reddy: కేటీఆర్ బర్త్డేపై రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు.. 'బర్త్డే దావత్ అడగాలి'
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
