ఖమ్మం: సెప్టెలిక్ ట్యాంకులతో ధర్నా
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Iqoo Z11x 5g Price: ప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ ఐకూ మార్కెట్లోకి తమ కొత్త బడ్జెట్ స్మార్ట్ఫోన్ విడుదల చేసింది. ఇది iQOO Z11x 5G స్మార్ట్ఫోన్ పేరుతో లాంచ్ అయ్యింది. దీనిని కంపెనీ ఎంతో శక్తివంతమైన బ్యాటరీతో అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఈ స్మార్ట్ఫోన్ ఏకంగా 7200mAh భారీ బ్యాటరీని కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. బడ్జెట్ విభాగంలో ఇంత మంచి బ్యాటరీతో ఈ మొబైల్ లాంచ్ కావడం విశేషం.. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఈ స్మార్ట్ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7400 టర్బో (MediaTek Dimensity 7400 Turbo) 4nm ప్రాసెస్పై రన్ అవుతుంది. అంతేకాకుండా ఇది మల్టీ-టాస్కింగ్తో పాటు హెవీ గేమింగ్ చేసేవారికి ఇది ఎంతగానో సహాయపడుతుంది. దీంతో పాటు అద్భుతమైన స్మూత్ పెర్ఫార్మెన్స్ను కూడా అందిస్తుంది. అలాగే చాలా ప్రత్యేకమైన 6.76 అంగుళాల ఫుల్ హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లేతో లాంచ్ అయ్యింది. అంతేకాకుండా ఇది 120Hz రిఫ్రెష్ రేట్ను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో కంపెనీ 1200 నిట్స్ పీక్ బ్రైట్నెస్ సపోర్ట్ను అందించడం వల్లఎండలో కూడా స్క్రీన్ క్లియర్గా కనిపిస్తుంది.
ఫోటోగ్రఫీ కోసం కంపెనీ ఇందులో బ్యాక్ సెడ్ అద్బుతమైన డ్యూయల్ కెమెరా సెటప్ను కూడా అందిస్తోంది. అంతేకాకుండా 50 మెగాపిక్సెల్ సోనీ IMX852 ప్రధాన కెమెరాతో పాటు 2 మెగాపిక్సెల్ బొకే లెన్స్ కెమెరాతో ఈ స్మార్ట్ఫోన్ అందుబాటులోకి వచ్చింది. ఇక సెల్ఫీల కోసం ముందు భాగంలో 32 మెగాపిక్సెల్ కెమెరాను కూడా అందిస్తోంది. ఈ స్మార్ట్ఫోన్లో విశేషమేమిటంటే, ముందు, వెనుక కెమెరాలు 4K వీడియో రికార్డింగ్ చేసుకునే సదుపాయాన్ని కూడా అందిస్తోంది.
Also Read: Redmi 14C 5G Offer: రెడ్మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్ఫోన్..అదిరిపోయే ఆఫర్!
ఈ స్మార్ట్ఫోన్ అద్భుతమైన 7200mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. ఇది ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే దాదాపు 40 గంటల వీడియో స్ట్రీమింగ్ను కూడా అందిస్తోంది. గేమింగ్ చేసేవారికి 15 గంటల వరకు అడుకునే ప్రత్యేకమైన సపోర్ట్ కూడా లభిస్తోంది. ఈ స్మార్ట్ఫోన్ 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా అందిస్తోంది. ఇది నీరు, దుమ్ము నుంచి ప్రోటక్షన్ పొందండానికి IP69 రేటింగ్లను కూడా అందిస్తోంది. ప్రస్తుతం ఈ మొబైల్ మూడు స్టోరేజ్ వేరియంట్స్లో విడుదల అయ్యింది. మొదటి స్టోరేజ్ వేరియంట్ 6GB + 128GBతో అందుబాటులోకి రాబోతోంది.
Also Read: Redmi 14C 5G Offer: రెడ్మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్ఫోన్..అదిరిపోయే ఆఫర్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Motorola Edge 70 Fusion Price Cut: ప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీ కంపెనీ మోటోరోలా భారత మార్కెట్లోకి అద్భుతమైన స్మార్ట్ఫోన్ మోటోరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్ (Motorola Edge 70 Fusion)ను గ్రాండ్గా లాంచ్ చేసింది. మధ్యతరగతి వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని.. అద్భుతమైన ఫీచర్స్తో ఈ స్మార్ట్ఫోన్ను లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ఫోన్ పవర్ బ్యాంక్ అవసరం లేకుండా రోజులు తరబడి పని చేస్తుంది. అయితే, దీనిని కంపెనీ అద్భుతమైన డిజైన్తో అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఈ స్మార్ట్ఫోన్కి సంబంధించిన పూర్తి వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ స్మార్ట్ఫోన్ 6.78 అంగుళాల సూపర్ హెచ్డీ ప్లస్ ఎక్స్ట్రీమ్ ఎమోలెడ్ (AMOLED)డిస్ల్పేతో అందుబాటులోకి వచ్చింది.. ఇది 144Hz రిఫ్రెష్ రేట్తో పాటు 5200 నిట్స్ పీక్ బ్రైట్నెస్తో లాంచ్ అయ్యింది. కంటికి ప్రొటక్షన్ అందించేందుకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7iను కూడా అందించారు.. అలాగే స్టైలిష్ లుక్ కోసం ఫోన్ వెనుక భాగంలో ఫాబ్రిక్ ఫినిషింగ్తో కూడిన డిజైన్ను కూడా అందిస్తోంది..
ఇందులో కంపెనీ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 7s జెన్ 4 ప్రాసెసర్తో అందిస్తోంది. ఇది గేమింగ్తో పాటు మల్టీ టాస్కింగ్ను చాలా స్మూత్గా ఉంటుంది. ఈ స్మార్ట్ఫోన్కి సంబంధించిన బ్యాటరీ విషయానికొస్తే.. ఇందులో ఏకంగా 7000mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీ అందుబాటులో ఉంది.. దీనికి 68W టర్బోపవర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అందుబాటులో ఉండడం వల్ల, కేవలం నిమిషాల్లోనే రోజంతా సరిపోయే ఛార్జింగ్ లభిస్తుంది.
ముఖ్యంగా ఫోటోగ్రఫీ కోసమే మంచి మొబైల్ కొనుగోలు చేయాలనుకుంటే.. ఇది అద్భుతమైన మొబైల్గా భావించవచ్చు.. ఎందుకంటే ఇది సోనీ LYTIA 710 సెన్సార్తో కూడిన 50MP మెయిన్ కెమెరాతో లభిస్తోంది. దీనికి తోడు 13MP అల్ట్రా-వైడ్ లెన్స్ కెమెరా కూడా అందుబాటులో ఉంది.. ఇందులో కంపెనీ సెల్ఫీల కోసం 32MP ఫ్రంట్ కెమెరాను కూడా అందించారు. ఈ ఫోన్లో మోటో ఏఐ (Moto AI) టూల్స్ కూడా లభిస్తుంది. ఇది ఫోటోలను మరింత అందంగా ఎడిట్ చేసేందుకు సహాయపడుతుంది.. ఇందులో ప్రత్యేకంగా గూగుల్ జెమిని, మైక్రోసాఫ్ట్ కోపైలట్ వంటి ఏఐ అసిస్టెంట్లు కూడా ఇందులో లభించడం విశేషం..
Also Read: Redmi 14C 5G Offer: రెడ్మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్ఫోన్..అదిరిపోయే ఆఫర్!
మార్కెట్లో ఈ స్మార్ట్ఫోన్ మోటోరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్ మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది.. ఇందులోని మొదటి వేరియంట్ 8GB + 128GB స్టోరేజ్తో రూ. 26,999తో ప్రారంభమవుతుంది. ఇక రెండవ వేరియంట్ 8GB + 256GB స్టోరేజ్తో రూ. 29,999తో అందుబాటులో ఉంది. ఇక మూడవ వేరియంట్ 12GB + 256GB స్టోరేజ్తో రూ. 32,999లతో లభిస్తోంది. అలాగే ఈ స్మార్ట్ఫోన్పై స్పెషల్గా బ్యాంక్ ఆఫర్స్తో పాటు ఎక్చేంజ్ బోనస్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. వీటిని వినియోగించి కొనుగోలు చేస్తే దీనిని కేవలం రూ.24,999కే పొందవచ్చు.
Also Read: Redmi 14C 5G Offer: రెడ్మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్ఫోన్..అదిరిపోయే ఆఫర్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Bleed Lines On Currency Notes: రోజులో కనీసం ఒక్కసారైనా మనం 100 లేదా 200 రూపాయల నోటును చూస్తూనే ఉంటాము. మనలో చాలామందికి నకిలీ కరెన్సీ నోట్లకు అసలు నోట్లకు తేడా దాదాపుగా తెలిసే ఉంటుంది. అయితే మన భారత కరెన్సీ నోట్ల మీద ఉండే ఈ గుర్తును మీరు ఎప్పుడైనా గమనించారా? కొన్నిసార్లు దొంగనోట్లపై కూడా అన్ని రకాల గుర్తులు ఉండేలా కేటుగాళ్లు జాగ్రత్త పడుతున్నారు. అయితే కొన్ని సందర్భాల్లో ఉన్న ప్రత్యేకమైన గుర్తులను గమనించడంలో మనలో చాలా మంది వెనుకబడుతున్నారు. అలాంటి వాళ్లకు ఇప్పుడు ఇంకో స్పెషల్ న్యూస్ చెప్పనున్నాం.
మన భారత కరెన్సీ నోటుపై మీరు ఎప్పుడైనా చిన్న గీతలను గమనించారా? అదే 100, 200, 500 రూపాయల నోట్ల అంచున కొన్ని నల్లని గీతలను చూడండి. అయితే ఆ గీతలు ఎందుకు ఉన్నాయో ఎప్పుడైనా తెలుసుకున్నారా? అయితే భారత కరెన్సీ నోట్ల చివర ఉన్న గీతలు.. కేవలం దృష్టిలోపం ఉన్న వారి కోసం అనువుగా వీటిని తయారు చేశారు. కంటిచూపు లేని లేదా దృష్టిలోపం ఉన్నవారు కరెన్సీ నోట్లను గుర్తించే విధంగా సహాయపడేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ ప్రత్యేకమైన గుర్తులను కరెన్సీ నోట్లపై ప్రవేశపెట్టింది. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆర్బీఐ కొత్తగా జారీ చేసిన ప్రతి కరెన్సీ నోటు అంచున కొన్ని నల్లని గీతలు ఉంటాయి. ఈ గీతలను బట్టి నోటు విలువ తెలుసుకోవచ్చు. మనలో చాలామంది అవి ఓ డిజైన్ అని భావిస్తారు. కానీ, వాటి వెనుక పెద్ద రహస్యం దాగి ఉంది. ఈ రేఖలను బ్లీడ్ మార్క్స్ అని అంటారు.
ఈ పంక్తులు ఎవరి కోసం?
ఈ గీతల పంక్తులను దృశ్య చిహ్నాలు అని కూడా అంటారు. వీటిని దృష్టి లోపం లేదా కంటిచూపు లేని వారి కోసం ప్రత్యేకంగా రూపొందించారు. దృష్టి లోపం ఉన్నవారు ఈ కరెన్సీ నోట్లను తాకినప్పుడు ఆ గీతల వరుస, అమరిక ఆధారంగా కరెన్సీ నోటు విలువను సులభంగా గుర్తించవచ్చు.
ఏ నోటుకు ఎన్ని గీతలు ఉంటాయి?
100 రూపాయల నోటుకు రెండు సెట్లు రెండు గీతలు అనగా.. నాలుగు పంక్తులు ఉంటాయి. అదే విధంగా 200 రూపాయల నోటుకు రెండు వైపులా నాలుగు గీతలు ఉన్నాయి. కానీ దీనికి అదనంగా ఆ గీతల మధ్యలో రెండు చిన్న చుక్కల మాదిరి కనిపిస్తాయి. వాటి ఆధారంగా అది 200 రూపాయల నోటుగా గుర్తించవచ్చు. 500 రూపాయల నోటుకు మాత్రం 5 రేఖలు ఉంటాయి. 2000 రూపాయల నోటు (ప్రస్తుతం రూ.2000 నోటు వాడుకలో లేదు) వరుసగా ఏడు గీతలను కలిగి ఉంటుంది.
కేవలం రేఖలే కాదు..
కరెన్సీ నోట్లపై ఈ గీతలే కాకుండా అశోక చక్రంపై ఉన్న వివిధ రకాలైన ఆకారాలు ఆ నోటు విలువను తెలియజేస్తాయి.
రూ.100 నోటుపై త్రిభుజం, రూ.500 నోటుపై వృత్తం, రూ.2000 నోటుపై వజ్రపు ఆకారాలను కలిగి ఉంటాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకున్న ఈ నిర్ణయం లక్షలాది మంది దృష్టి లోపం, చూపు లేని వారికి కరెన్సీ నోట్లు గుర్తించేందుకు సహాయపడుతుంది. నోట్ల విలువ పెరిగే కొద్దీ ఈ గీతల సంఖ్య కూడా పెరుగుతుంది.
Also Read: IPL 2026 Postponed: ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా ఐపీఎల్ 2026 వాయిదా? బీసీసీఐ నుంచి బిగ్ అప్డేట్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Milk Adulteration Test In AP: రాజమండ్రిలో కల్తీపాలు తాగిన ఘటనలో 13 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా ఫుడ్ సేఫ్టీ (ఆహార భద్రత శాఖ) అధికారులు అప్రమత్తమయ్యారు. కల్తీపాలను ముందుగానే పసిగట్టే ప్రక్రియను ఆరోగ్య శాఖ అధికారులు ప్రజలకు వివరంగా తెలిపే ప్రయత్నం చేశారు. పాలు, పాల పదార్థాల్లో కల్తీని ఇంట్లోనే సులువుగా గుర్తించవచ్చని ఫుడ్ సేఫ్టీ అధికారులు స్పష్టం చేశారు.
మీ ఇంట్లో ఉన్న పాలలో కల్తీ జరిగిందా లేదా అనే విషయాన్ని గుర్తించేందుకు కొన్ని చిట్కాలు తెలిపారు. అందులో మొదటిది ముందుగా ఇంట్లోని స్టీల్ పళ్లెం తీసుకొని, దాన్ని ఏటవాలుగా ఉంచి దానిపై పాల చుక్క పడే విధంగా ఉంచాలి. అది స్వచ్ఛమైన పాలు అయితే అది తెల్లటి ధార లాగా అది కిందికి దిగుతుంది. ఒకవేళ పాలలో నీళ్లు కలిపితే ఆ పాల ధార వెంటనే కిందికి వెళ్లిపోతుంది. అయితే ఇది చిన్న చిట్కా అయినా ప్రాథమికంగా పాలలో కల్తీ జరిగిందా లేదా అనే విషయం తెలిసిపోతుంది.
కల్తీ జరిగిందా లేదా అనేది తెలిసిపోతుంది!
అయితే పాలలో అసలైన కల్తీ జరిగిందా లేదా అనే విషయాన్ని కొంచెం లోతుగా విశ్లేషించేందుకు రెండో చిట్కా గురించి తెలుసుకుందాం. ముందుగా ఓ గ్లాసులో 10 మిల్లీలీటర్ల పాలు, 10 మిల్లీలీటర్ల నీటిని మిశ్రమంగా కలిపి దాన్ని బాగా కదిలించాలి. అప్పుడు దాని పై భాగంలో మందమైన నురుగు లాగా ఏర్పడుతుంది. ఒకవేళ అది స్వచ్ఛమైన పాలు అయితే నురుగు రాకూడదు. నురుగు వస్తే మాత్రం కచ్చితంగా అది కల్తీ జరిగిందనే గుర్తించాలి.
పాలు రంగు మారితే..!
కొన్నిసార్లు కల్తీపాలు చిక్కదనం కోసం అందులో మొక్కజొన్న పిండి లేదా ఇతర పొడులను కలిపి చిక్కగా వచ్చేలా తయారు చేస్తారు. అలాంటి పరిస్థితుల్లో కల్తీ పాలను గుర్తించడానికి మరో ఉపాయం ఉంది. ముందుగా ఓ గ్లాసులో పాలు తీసుకొని అందులో రెండు లేదా ముండు చుక్కల ఆయోడిన్ ద్రావణాన్ని కలపాలి. ఆ తర్వాత ఆ పాలు తెలుపు నుంచి నీలిరంగులో మారితే కల్తీ జరిగిందని భావించాలి. ఒకవేళ పాలు రంగు మారకపోతే అవి స్వచ్ఛమైన పాలు అని పరిగణిస్తారు.
ఇవే కాకుండా పాలలో కల్తీతో పాటు పాల పదార్థాలలోనూ కల్తీ నానాటికి పెరిగిపోతుంది. ఈ కల్తీ ఇప్పుడు ప్రజల ప్రాణాలకు సంకటంలా మారిపోయింది. ఇప్పుడు పాలతో పాటు నెయ్యిలోనూ దళారులు కల్తీకి తెగబడ్డారు. ఒకవేళ నెయ్యిలో కల్తీ జరిగిందా అని తెలుసుకునేందుకు.. ముందుగా ఓ స్పూన్ నెయ్యిని చిన్న గాజు గ్లాస్ లేదా గిన్నెలో వేయాలి. ఆ వెంటనే రెండు లేదా మూడు చుక్కల అయోడిన్ ఉప్పు ద్రావణాన్ని కలపాలి. ఆ సమయంలో నెయ్యి నీలిరంగులోకి మారితే అది కల్తీ జరిగిందని భావించాలి.
ఒకవేళ నెయ్యిలో వనస్పతి లేదా ఇతర నూనెలు కలిపి కల్తీ చేసినట్లు మీరు భావిస్తే.. ముందుగా ఓ స్పూన్ నెయ్యిని తీసుకొని అందులో చిటికెడు చక్కెర కలిపి వేడి చేస్తే అది ఎరుపు లేదా గులాబి రంగులోకి మారితే ఆ నెయ్యిలో వనస్పతి ఆయిల్ కలిపినట్లు భావించాలి. అంతే కాకుండా ఓ గ్లాస్ వేడినీటిలో స్పూన్ నెయ్యి వేస్తే.. స్వచ్ఛమైన నెయ్యి వేడినీటిపై తేలిఆడుతుంది. వనస్పతి కలిపిన నెయ్యి అయితే చిన్నచిన్న ముద్దలుగా మారి కనిపిస్తుంది. సింపుల్గా చెప్పాలంటే ఓ స్పూన్ నెయ్యిని అరచేతిలో వేసుకొని గట్టిగా రుద్దితే అది సువాసన రావాలి అలా సువాసన రాకపోతే ఆ నెయ్యిలో కల్తీ జరిగినట్లే గుర్తించాలి.
కల్తీ గురించి తెలిస్తే ఫిర్యాదు చేయాలి!
ఒకవేళ మీరు పైన చిట్కాలతో కల్తీని గుర్తించిన పక్షంలో 1800 425 3857 (టోల్-ఫ్రీ నెంబరు), 08645 297245 (ఐపీఎం ప్రధాన కార్యాలయం)కు తెలియజేయాలని ఆరోగ్య శాఖ అధికారులు తెలియజేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
OPPO K14x 5G Price Cut: ప్రముఖ స్మార్ట్ఫోన్ కంపెనీ OPPO మార్కెట్లోకి అద్భుతమైన స్మార్ట్ఫోన్స్ను విడుదల చేస్తూ వస్తోంది. ముఖ్యంగా ప్రీమియం కెమెరా కలిగిన మొబైల్స్ను ఎక్కువగా విక్రయించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా K-సిరీస్ కలిగి స్మార్ట్ఫోన్ కొనుగోలు చేయాలనుకునేవారికి ఫ్లిప్కార్ట్ అద్భుతమైన అవకాశాలను అందిస్తోంది. ముఖ్యంగా OPPO K14x 5G మొబైల్ అద్భుతమైన డిస్కౌంట్తో లభిస్తోంది. ముఖ్యంగా దీనిపై బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. అయితే, దీనిపై ఉన్న ఆఫర్స్ ఏంటో? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
OPPO K14x 5G మొబైల్ అద్బుతమైన ఫీచర్స్తో అందుబాటులోకి వచ్చింది. ఇది ప్రీమియం కెమెరా సెటప్ను కలిగి ఉండడమే కాకుండా ప్రీమియం డిస్ప్లేను కలిగి ఉంటుంది. ఇది 6.75 అంగుళాల HD+ LCD డిస్ప్లేతో అందుబాటులో ఉంది. ముఖ్యంగా 120Hz రిఫ్రెష్ రేట్, 1125 నిట్స్ బ్రైట్నెస్తో అందుబాటులో ఉంది. ఇది ఎంతో శక్తివంతమైన MediaTek డైమెన్సిటీ 6300 (6nm చిప్సెట్) ప్రాసెసర్ను కూడా కలిగి ఉంటుంది. అలాగే ఇది 45W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో విడుదలైంది.
ఈ మొబైల్ వెనక భాగంలో అద్భుతమైన రియర్ కెమెరాను కలిగి ఉంటుంది. దీంతో పాటు ఇది ఎంతో శక్తివంతమైన 50 MP మెయిన్ కెమెరాతో పాటు 2 MP పోర్ట్రెయిట్ లెన్స్ కెమెరాను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది.. ఫ్రంట్ భాగంలో ప్రత్యేకమైన సెల్ఫీ కెమెరా కూడా అందుబాటులో ఉంది. ఇది 5 MP ఫ్రంట్ కెమెరాను కూడా కలిగి ఉంటుంది. దీంతో పాటు ఇది Android 16 ఆధారిత ColorOS 16 ఆపరేటింగ్ సిస్టమ్తో రన్ అవుతుంది.. ఈ మొబైల్ 64 GB స్టోరేజ్తో పాటు IP64 రేటింగ్ ప్రోటన్తో లాంచ్ అయ్యింది.
Also Read: Redmi 14C 5G Offer: రెడ్మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్ఫోన్..అదిరిపోయే ఆఫర్!
ఇది ఎంతో శక్తివంతమైన 6500mAh బ్యాటరీని కూడా కలిగి ఉంటుంది. ముఖ్యంగా ఇది భారీ బ్యాటరీని కలిగి ఉంటుంది. కాబట్టి చాలా ఎక్కువగా బ్యాటరీ లైఫ్ను అందిస్తుంది.. మార్కెట్లో ఇది 4 GB RAM + 64 GB స్టోరేజ్తో అందుబాటులో ఉంది. దీని ధర సుమారు రూ.12,999తో అందుబాటులోకి వచ్చింది. ఇక బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్ వివరాల్లోకి వెళితే.. ఫ్లిప్కార్ట్లో ICICI, HDFC, Axis ఫ్లిప్కార్ట్ అనుసంధాన బ్యాంక్లకు సంబంధించిన క్రెడిట్ కార్డ్లను వినియోగిస్తే.. దాదాపు రూ.750 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. ఇవే కాకుండా ఇతర ప్రత్యేకమైన ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. దీంతో ఈ మొబైల్ కేవలం రూ.12,199 వరకు పొందవచ్చు.
Also Read: Redmi 14C 5G Offer: రెడ్మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్ఫోన్..అదిరిపోయే ఆఫర్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Hardik Pandya Mahieka Sharma Flag Complaint: తాజాగా జరిగిన టీ20 ప్రపంచకప్ టోర్నీ ఫైనల్లో టీమ్ఇండియా విశ్వవిజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో చిరకాల ప్రత్యర్థి న్యూజిలాండ్ను మట్టికరిపించి వరుసగా రెండోసారి పొట్టికప్పు విజేతగా నిలిచింది భారత జట్టు. అయితే ఈ మ్యాచ్ విన్నింగ్ మూమెంట్స్లో ఓ సంఘటన ఇప్పుడు టీమ్ఇండియా ఫ్యాన్స్ను ఆగ్రహానికి గురిచేస్తోంది. టీ20 ప్రపంచకప్ ట్రోఫీ అందుకున్న తర్వాత భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యా తన ప్రేయసి మహికా శర్మతో కలిసి చేసిన డ్యాన్స్ ఇప్పుడు రాద్ధాంతంగా మారింది. ప్రస్తుతం ఇదే విషయమై హార్దిక పాండ్యాపై కేసు నమోదయ్యింది.
గుజరాత్లోని నరేంద్రమోదీ స్టేడియం వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో టీమ్ఇండియా విజేతగా నిలిచి ట్రోఫీ అందుకున్న తర్వాత ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది. క్రికెటర్లంతా ఉత్సాహంగా సెలబ్రేషన్స్ చేసుకుంటున్న క్రమంలో ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా తన ప్రేయసి మహికా శర్మతో కలిసి డ్యాన్స్ చేశారు. ఇలా డ్యాన్స్ చేస్తున్న క్రమంలో హార్దిక్ పాండ్యా భారత జాతీయ జెండా అయిన త్రివర్ణ పతాకాన్ని అగౌరవపరిచాడని ఇప్పుడు ఓ కేసు నమోదయ్యింది. సదరు క్రికెటర్ జాతీయ జెండాను అగౌరవపరిచాడని పుణెకు చెందిన ఓ న్యాయవాది ఆరోపణలు చేయడం సహా హార్దిక్ పాండ్యాపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
స్థానిక శివాజీ నగర్ పోలీస్ స్టేషన్లో వాజిద్ ఖాన్ అనే న్యాయవాది ఈ ఫిర్యాదును సమర్పించట్లు తెలుస్తోంది. హార్దిక్ పాండ్యా తన ప్రేయసి మహికా శర్మతో కలిసి గ్రౌండ్లో వేడుకలు చేసుకుంటున్న తరుణంలో.. సదరు క్రికెటర్ ప్రవర్తించిన తీరు త్రివర్ణ పతాకాన్ని అగౌరవపరిచినట్లు, దాని పవిత్రత దెబ్బతినే విధంగా ప్రవర్తించినట్లు న్యాయవాది వాజిద్ ఆరోపించారు. ఈ వేడుకల్లో హార్దిక్ పాండ్యా జాతీయ జెండాను తన శరీరం చుట్టూ చుట్టుకొని జెండాను అగౌరవపరిచాడని తెలిపారు.
న్యాయవాది వాజిద్ ఖాన్ జాతీయ మీడియాతో మాట్లాడుతూ తన వైఖరిని స్పష్టంగా వివరించారు. "అందరూ టీ20 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ చూసే ఉంటారు. కానీ, ట్రోఫీ అందుకున్న చివర్లో హార్దిక్ పాండ్యా మాత్రం తన సెలబ్రేషన్స్ నడుమ జాతీయ జెండాను తన వీపుకు కట్టుకున్నాడు. తన గర్ల్ఫ్రెండ్తో డ్యాన్స్ చేశాడు. అయితే 1971 జాతీయ జెండా చట్టంలోని సెక్షన్ 2 ప్రకారం.. మనమంతా జాతీయ జెండాను గౌరవించాలి. కానీ, ఆ సెలబ్రేషన్స్లో హార్దిక్ పాండ్యా జాతీయ జెండాను కట్టుకోవడం సహా తన ప్రేయసితో పడుకున్నాడు. అది జాతీయ జెండాకు తీవ్ర అవమానం అని నేను నమ్ముతున్నాను" అని న్యాయవాది వాజిద్ ఖాన్ తెలిపారు.
ఫ్యాన్స్ మద్దతు
అయితే ఈ విషయం తెలిసిన చాలా మంది టీమ్ఇండియా ఫ్యాన్స్ హార్దిక్ పాండ్యాకు సమర్ధించారు. టీ20 ప్రపంచకప్ టోర్నీలో విశ్వవిజేతగా నిలిచిన తర్వాత ఆటగాళ్లు తమ భావోద్వేగాలు కంట్రోల్లో ఉండవని.. ఆ క్రమంలో అది తెలియక జరిగిన పొరపాటు అయ్యిండొచ్చని ఫ్యాన్స్ అంటున్నారు. అయితే దీన్ని మరికొందరు ఖండిస్తున్నారు. జాతీయ జెండాను చుట్టుకున్నా.. తన ప్రేయసితో కలిసి పడుకోవడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏది ఏమైనా ఈ కేసు నిలుస్తుందా? లేదా కొట్టివేస్తారా? అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ ఇది అగౌరవంగా భావిస్తే మాత్రం క్రికెటర్ హార్దిక్ పాండ్యాపై జరిమానా లేదా జైలు శిక్ష పడే అవకాశం ఉంది.
చట్టం ఏం చెబుతోంది!
న్యాయవాది వాజిద్ ఖాన్ ఇచ్చిన ఫిర్యాదులో జాతీయ గౌరవానికి అవమానాల నిరోధక చట్టం గురించి ప్రస్తావించారు. దీని గురించి చెప్పాలంటే.. 1971 చట్టంలోని సెక్షన్ 2 ప్రకారం.. ఏదైనా బహిరంగ ప్రదేశంలో లేదా జనావాసాల్లోని మరేదైనా ప్రాంతంలో జాతీయ జెండా అయిన త్రివర్ణ పతాకాన్ని మంటల్లో కాల్చడం, చించివేయడం లేదా కట్ చేయడం, అసభ్యకరంగా వినియోగించడం, నాశనం చేయడం, కాళ్లతో తొక్కడం వంటి ఇతర అగౌరవ లేదా జాతీయ జెండా ధిక్కారానికి గురిచేయడం శిక్షార్హం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Mars Moon Conjunction 2026 Effect On Zodiac: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, గ్రహాల స్థితిగతుల్లో వచ్చే అనేక మార్పులు మానవ జీవితంపై ఊహించని ప్రభావాన్ని చూపుతాయని మనందరికీ తెలిసిందే.. ఇదిలా ఉంటే మార్చి 16న అత్యంత శుభప్రదమైన మహాలక్ష్మి రాజయోగం ఏర్పడబోతోంది.. అయితే, ఈ యోగం కుజ, చంద్ర గ్రహాల కలయిక ఏర్పడుతుంది. దీంతో మూడు రాశులవారిపై ఊహించని ప్రభావం పడుతుంది. ముఖ్యంగా ఈ సమయంలో అద్భుతమైన ఆర్థిక లాభాలు కూడా పొందుతారు. అలాగే వారు కోటీశ్వరులు అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే, ఈ సమయంలో ఏయే రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
మహాలక్ష్మి రాజయోగం అంటే ఏమిటి?
జాతక చక్రంలో కుజుడు, చంద్రుడు బలంగా ఉన్నప్పుడు ఈ అద్భుతమైన యోగం ఏర్పడుతుంది. దీనిని చాలా శుభప్రదమైనదిగా భావిస్తారు. అలాగే ఇది సంపద, వైభవం, సౌభాగ్యానికి చిహ్నంగా కూడా చెప్పుకుంటారు. కాబట్టి ఈ యోగం జాతకంలో ఏర్పడితే.. నిలిపోయిన పనులు కూడా ఎంతో సులభంగా పూర్తవుతాయి. అకస్మాత్తుగా ధన లాభాలు కూడా కలుగుతాయి. దీర్ఘకాలిక సమస్యలు కూడా ఎంతో సులభంగా దూరమవుతాయి.
లాభాలు పొందబోయే రాశులు ఇవే:
వృషభ రాశి:
ఎంతో శక్తివంతమైన మహాలక్ష్మి రాజయోగం ఎఫెక్ట్తో ఈ సమయంలో అద్భుతమైన లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా పాత పెట్టుబడుల నుంచి భారీ లాభాలు కూడా పొందుతారు. ఉద్యోగాలు చేస్తున్నవారికి ఈ సమయంలో మంచి పదోన్నతులు కూడా లభిస్తాయి. అలాగే కొత్త బాధ్యతలు కూడా పొందుతారు. దీంతో పాటు వ్యాపారాలు కూడా లాభసాటిగా మారుతాయి. ముఖ్యంగా అన్ని రంగాల్లో ఉన్న వ్యక్తులు అద్భుతమైన విజయాలు సాధిస్తారు. కుటుంబంలో సుఖశాంతులు కూడా లభిస్తాయి. వీరికి ఆత్మవిశ్వాసం కూడా లభిస్తుంది.
కర్కాటక రాశి:
మహాలక్ష్మి రాజయోగం ప్రభావంతో కష్టానికి తగిన ప్రతిఫలం కూడా లభిస్తుంది. అంతేకాకుండా ఆర్థిక పరిస్థితులు కూడా చాలా వరకు మెరుగుపడతాయి. గతంలో నిలిచిపోయిన ప్రాజెక్ట్లను కూడా తిరిగిపొందుతారు. అంతేకాకుండా పెట్టుబడులు పెట్టడం వల్ల ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. దీంతో పాటు కుటుంబ సభ్యుల సపోర్ట్తో కొత్త ఆస్తులను కూడా సులభంగా పొందుతారు. అంతేకాకుండా ధనం కూడా అద్భుతమైన మార్గాలను కూడా వెతికే అవకాశాలు కనిపిస్తున్నాయి.
వృశ్చిక రాశి:
ఈ శక్తివంతమైన ప్రభావంతో వృశ్చిక రాశి వారికి కూడా కెరీర్ పరంగా అద్భుతమైన మార్పులు వస్తాయి. అంతేకాకుండా నిరుద్యోగులకు కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా లభించే ఛాన్స్లు ఉన్నాయి. దీంతో పాటు వ్యాపారాలు చేసే వ్యక్తులు ఈ సమయంలో అద్భుతంగా వాటిని విస్తరించుకుంటారు. అంతేకాకుండా వీరికి సమాజంలో అద్భుతమైన గౌరవం కూడా లభిస్తుంది. ఎవైన వివాదాలు ఉంటే చాలా వరకు పరిష్కారం కూడా అవుతాయి. దీంతో పాటు సమాజంలో అనుకున్నంత గౌరవం కూడా తిరిగి పొందుతారు. అంతేకాకుండా వీరు ఓపికతో పనులు చేయడం వల్ల రాజభోగాలు అనుభవించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Telangana SSC exams to continue with OMR sheets: తెలంగాణ పదో తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు ఈ ఏడాది కూడా OMR షీట్ వ్యవస్థనే కొనసాగిస్తున్నట్లు డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ కన్ఫామ్ చేసింది. మార్చి 14వ తేదీ నుంచి ఏప్రిల్ 16వ తేదీ వరకు తెలంగాణలో పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఓఎంఆర్ వ్యవస్థ అంటే ఎలక్ట్రానిక్గా ఇది ఎగ్జామ్ షీట్ ఆన్సర్స్ చదువుతుంది. ఆన్సర్ బుక్లెట్ తో పాటు ఈ OMR షీట్ జత చేస్తారు. పరీక్ష సమయంలో ఇది విద్యార్థికి అందజేస్తారు.
ఇక అధికారిక వెబ్సైట్ https://bse.telangana.gov.in/ లో ఆ విద్యార్థుల అవగాహన కోసం ఈ ఓఎంఆర్ షీట్ ఆన్సర్ బుక్ లెట్ వీడియోను కూడా అప్లోడ్ చేశారు. విద్యార్థులు వెంటనే ఈ వీడియోను చూడగలరు.
1. మొదట https://bse.telangana.gov.in/ ఓపెన్ చేయాలి
2.అక్కడ హోం పేజీలోనే పదో తరగతి పరీక్షలు ఓఎంఆర్ వీడియో ఆప్షన్ కనిపిస్తుంది దానిపై క్లిక్ చేస్తే వీడియో ఓపెన్ అవుతుంది
3.వివరాలు ఇందులో క్షుణ్ణంగా ఉంటాయి. వీడియో చూసిన తర్వాత 3.విద్యార్థులకు ఓ అవగాహన కూడా వస్తుంది.
ఓఎంఆర్ షీట్ ఇంగ్లీష్, తెలుగు మీడియంలో అందుబాటులో ఉంటుంది. తెలంగాణ వ్యాప్తంగా వివిధ సెంటర్లలో పదో తరగతి పరీక్షలు మార్చి 14వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి. ఏప్రిల్ 16వ తేదీకి ఈ పరీక్షలు పూర్తవుతాయి. గతేడాది మాదిరి ఈసారి కూడా ఓఎంఆర్ షీట్ విధానం ఉండనుంది.
Also Read: రైతులకు భారీగుడ్ న్యూస్.. ఈ నెలలోనే రైతు భరోసా డేట్ ఫిక్స్..! ఎప్పుడంటే?
Also Read: ఇంటర్ పరీక్షల ఫలితాల డేట్ ఫిక్స్.. ఇప్పటికే మొదలైన వాల్యుయేషన్ ప్రక్రియ, ఎప్పుడుంటే?
ఈ లింక్ పై క్లిక్ చేసి ఓఎంఆర్ వీడియో వీక్షించండి..
తెలంగాణ పదవ తరగతి పరీక్షల టైమ్ టేబుల్ 2026..
| 2026 మార్చి 14 | ఫస్ట్ లాంగ్వేజ్ (గ్రూప్-ఏ), ఫస్ట్ లాంగ్వేజ్ పార్ట్-I, ఫస్ట్ లాంగ్వేజ్ పార్ట్-II |
| 2026 మార్చి 18 | సెకండ్ లాంగ్వేజ్ |
| 2026 మార్చి 23 | థర్డ్ లాంగ్వేజ్(Eng) |
| 2026 మార్చి 28 | మ్యాథ్స్ |
| 2026 ఏప్రిల్ 02 | సైన్స్ పార్ట్-I(Physics) |
| 2026 ఏప్రిల్ 07 | సైన్స్ పార్ట్-II(Biology) |
| 2026 ఏప్రిల్ 13 | సోషల్ స్టడీస్ |
| 2026 ఏప్రిల్ 15 | ఓఎస్ఎస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్-I, ఎస్ఎస్సీ వొకేషనల్ కోర్స్(Theory) |
| 2026 ఏప్రిల్ 16 | ఓఎస్ఎస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్-I |
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
TATA IPL 2026 First Schedule: టీ20 ప్రపంచకప్ ట్రోఫీతో ముగియడంతో క్రికెట్ అభిమానులు పండుగ చేసుకోగా.. ఆ పండుగ ఆనందం ముగియకపోక ముందే మరో క్రికెట్ సంబరం ప్రారంభం కానుంది. ప్రపంచవ్యాప్తంగా అత్యంత విజయవంతమైన క్రికెట్ లీగ్ ఐపీఎల్ 19వ ఎడిషన్కు సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీసీసీఐ దశల వారీగా టాటా ఐపీఎల్ 2026 నిర్వహించనుంది. అందులో భాగంగా మొదటి దశలో 20 మ్యాచ్లు నిర్వహించనున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన అనంతరం తదుపరి ఐపీఎల్ షెడ్యూల్ విడుదల చేస్తామని బీసీసీఐ ప్రకటన చేసింది. తొలి మ్యాచ్ డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, సన్రైజర్స్ హైదరాబాద్ మధ్య జరగనుండడం విశేషం. సాధారణంగా గత లీగ్లో చివరగా ఆడిన జట్ల మధ్య కొత్త సీజన్ తొలి మ్యాచ్ నిర్వహించాల్సి ఉండగా... అనూహ్యంగా ఎస్ఆర్హెచ్, ఆర్సీబీ మ్యాచ్ పెట్టడం గమనార్హం. టాటా ఐపీఎల్ 2026 మార్చి 28వ తేదీ నుంచి ప్రారంభమై ఏప్రిల్ 12వ తేదీ వరకు జరగనుంది.
Also Read: Tirupati: తిరుపతి ప్రజలకు భారీ అలర్ట్.. గరుడ వారధిపై బైక్లు, భారీ వాహనాలు నిషేధం
టాటా ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 మొదటి దశ షెడ్యూల్ను బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ఓ ప్రకటన ద్వారా విడుదల చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద టీ20 లీగ్ 19వ ఎడిషన్ మ్యాచ్ ఆర్సీబీ, ఎస్ఆర్హెచ్తో ప్రారంభం కానుంది. ఈ రెండు జట్లు మార్చి 28వ తేదీన బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో జరుగుతుంది. బెంగళూరు, ముంబై, గౌహతి, న్యూ చండీగఢ్, లక్నో, కోల్కతా, చెన్నై, ఢిల్లీ, అహ్మదాబాద్, హైదరాబాద్ మొత్తం 10 ప్రాంతాల్లో 20 మ్యాచ్లు జరుగుతాయి.
Also Read: KTR Press Meet: దేశంలోనే అతిపెద్ద జోకర్ రాహుల్ గాంధీ: కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు
మ్యాచ్ల సమయం: మొదటి దశ ఐపీఎల్లో నాలుగు రోజులు రెండేసి మ్యాచ్లు జరగనుండగా.. మధ్యాహ్నం మ్యాచ్ 3:30 గంటలకు ప్రారంభమవుతుంది.
రెండో మ్యాచ్ సాయంత్రం 7:30 గంటలకు మొదలవుతుంది.
సన్రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్లు ఇవే!
సన్రైజర్స్ హైదరాబాద్ ఈ సీజన్ తొలి దశలో ఒకటే మ్యాచ్ హోమ్ మ్యాచ్ ఆడుతోంది. ఏప్రిల్ 5వ తేదీన హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో మధ్యాహ్నం లక్నోతో సన్రైజర్స్ తలపడనుంది.
మార్చి 28: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు vs సన్రైజర్స్ హైదరాబాద్, వేదిక: బెంగళూరు
ఏప్రిల్ 2: కోల్కత్తా నైట్రైడర్స్ vs సన్రైజర్స్ హైదరాబాద్, వేదిక: కోల్కత్తా
ఏప్రిల్ 5: సన్రైజర్స్ హైదరాబాద్ vs లక్నో సూపర్ జియాంట్స్, వేదిక: హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం
ఏప్రిల్ 11: సన్రైజర్స్ హైదరాబాద్ vs పంజాబ్ కింగ్స్, వేదిక: చండీగడ్
హోం మ్యాచ్ లు ఇలా..
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బెంగళూరులో ఐదు హోమ్ మ్యాచ్లు ఆడనుండగా.. రాయ్పూర్లో రెండు మ్యాచ్లు ఆడుతుంది. పంజాబ్ కింగ్స్ న్యూ చండీగఢ్లో 4, ధర్మశాలలో మూడు ఆడనుండగా.. రాజస్థాన్ రాయల్స్ గౌహతిలో 3, జైపూర్లో 4 మ్యాచ్లు ఆడుతుంది.
బెంగళూరులో ట్విస్ట్
గతేడాది బెంగళూరులో జరిగిన తొక్కిసలాట కారణంగా ప్రస్తుత ఐపీఎల్ సీజన్కు కొంత ఇబ్బందికరి పరిస్థితి ఏర్పడింది. బీసీసీఐ బెంగళూరులో మ్యాచ్లకు షెడ్యూల్ విడుదల చేసింది. అయితే అక్కడ మ్యాచ్లు నిర్వహించడానికి ఇంకా అనుమతి రాలేదు. బెంగళూరులో ఖరారైన మ్యాచ్లు కర్ణాటక ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ నుంచి క్లియరెన్స్ చేస్తే మ్యాచ్లు జరుగుతాయి. ఈ కమిటీ మార్చి 13వ తేదీన చిన్నస్వామి స్టేడియం పరిశీలించి క్లియరెన్స్ ఇస్తే యథావిధిగా మ్యాచ్లు జరుగుతాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Youth Risky viral Video Watch: సోషల్ మీడియాలో లైకులు వ్యూస్ కోసం యువత ప్రాణాలను పణంగా పెడుతోంది. గత కొద్ది రోజుల నుంచి ఈ ట్రెండు కొనసాగుతూ వస్తోంది. సాహసోపేతమైన చర్యలకు పాల్పడుతూ రీల్స్ చేస్తూ తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న ఘటనలు ఎన్నో ఇప్పటికీ మనం సోషల్ మీడియాలో చూసాం.. అయినప్పటికీ కొందరిలో ఏం మాత్రం మార్పు రాలేకుండా పోతుంది. తాజాగా పరిగెడుతున్న రైలులో ప్రమాదకరమైన రీల్ చేయడానికి ప్రయత్నించిన ఓ వ్యక్తి రైలు పట్టాల పక్కనే ఉన్న విద్యుత్ స్తంభానికి బలంగా ఢీకొని కిందపడిపోయాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో వైరల్ అవుతూ వస్తోంది.
వైరల్ అవుతున్న వీడియో వివరాల్లోకి వెళ్తే.. ఓ యువకుడు వేగంగా వెళుతున్న రైలు భోగిలకుండే తలుపుల దగ్గర నిలబడి ఉన్నాడు. బయట గాలికి వేలాడుతూ స్టంట్ లు చేయాలని.. దానిని రియల్ గా చిత్రీకరించాలని ఆ యువకుడు నిర్ణయించుకున్నాడు. మొదట బయటకు వంగి ఎదురుగా ఏదైనా రైలు వస్తుందేమో అని చూసాడు.. ఏమి రావడం లేదని అనుకున్న వ్యక్తి.. రైలు మెట్ల పైకి దిగి ఒక చేత్తో హ్యాండిల్ పట్టుకొని శరీరాన్ని గాల్లోకి వచ్చి అటు ఇటు కదలడం ప్రారంభించాడు.. అయితే ఇదే సమయంలో రైల్లో ఉన్న తన స్నేహితుడు ఈ దృశ్యాలను చిత్రీకరించాడు..
అలా కొద్ది సెకండ్ల పాటు ఆ వ్యక్తి రైలు హ్యాండిల్ ని పట్టుకొని అటు ఇటు శరీరాన్ని గాల్లో కలపడం చూడొచ్చు.. అదృష్టవశాత్తు రైలు పట్టాల పక్కనే ఉన్న ఒక విద్యుత్ స్తంభాన్ని ఆ యువకుడు గమనించలేకపోయాడు.. వేగంగా వెళుతున్న ఆ రైలు నుంచి అతను బయటకు వంగిన సమయంలో అతని వీపు.. స్తంభానికి బలంగా ఢీకొంది. ఆ దెబ్బకు ఆ యువకుడు పట్టు తప్పి రైలులో నుంచి అక్కడే పడిపోయాడు. ఈ భయానక దృశ్యాలు చూసి అతని స్నేహితుడు ఒక్కసారి షాక్కు గురై కెమెరా పక్కకు తిప్పేసి వీడియో అక్కడితో ఎండ్ చేశాడు.
— 𝓛𝓭𝓾𝓽𝓿 𝓴𝓷𝓲𝓰𝓱𝓽 𝓬𝓸𝓶𝓶𝓮𝓷𝓽𝓸𝓻𝔂 (@Ldphobiawatch) March 6, 2026
Also Read: AI Boyfriends: చైనాలో AIతో అమ్మాయిల లవ్.. భయపడుతున్న కమ్యూనిస్టు ప్రభుత్వం?
ఈ ఘటన ఎక్కడ జరిగిందని విషయం ఇంకా స్పష్టంగా ఎవరికీ తెలియనప్పటికీ.. సోషల్ మీడియా మాధ్యమాల్లో మాత్రం విపరీతంగా వైరల్ అవుతూ వస్తోంది. కేవలం కొన్ని సెకండ్ల వీడియో రియల్ కోసం ఎంతటి సాహసం చేయాలా.. అని చాలామంది కామెంట్లు పెడుతూ వస్తున్నారు. ప్రాణం కంటే రీల్స్ గొప్పవా అంటూ సోషల్ మీడియా వినియోగదారులు మండిపడుతున్నారు. రైల్వే పోలీసులు ఇలాంటి వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కొంతమంది నెటిజన్లు కోరుతున్నారు. యువకుడి పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉందో అనే విషయం ఎవరికీ తెలియదు.
Also Read: AI Boyfriends: చైనాలో AIతో అమ్మాయిల లవ్.. భయపడుతున్న కమ్యూనిస్టు ప్రభుత్వం?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Vaikuntapali With Live Snakes Viral Video Watch: ప్రస్తుతమున్న యువత సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడానికి రకరకాల విన్యాసాలు చేస్తూ వీడియోలు పెడుతున్నారు. కొందరు డ్యాన్సులు.. మరికొందరు కామెడీ.. మరికొందరు సాహసోపేతమైన చర్యలకు పాల్పడుతూ అలరిస్తుంటే.. మరి కొంతమంది మాత్రం ప్రాణాలు మీదకు తెచ్చుకునే సాహసాలు చేస్తున్నారు. తాజాగా ఇలాంటి కోవాలోకి వచ్చే ఘటన సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ఈ వీడియోలో వైకుంఠ పాళీ అనే ఆటను నిజమైన పాములను పెట్టి ఆడడం మీరు చూడొచ్చు. సాధారణంగా పాము నిచ్చెన ఆటను మనం సరదాగా ఇంట్లో చిన్న బోర్డు పెట్టి ఆడుకుంటాం. కానీ ఈ వీడియోలో ఆ జంట చేసిన పని సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ వస్తుంది.
వైరల్ అవుతున్న వీడియో వివరాల్లోకి వెళ్తే.. ఒక గది మధ్యలో నేలపై నిచ్చెనలు అమర్చి ఉండడం మీరు గమనించవచ్చు. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. నిచ్చెన మధ్యలో బొమ్మ పాములు కాకుండా.. ప్రాణాలతో ఉన్న పాములు అటు ఇటు తిరుగుతూ ఉన్నాయి. ఈ సమయంలో ఒక యువకుడితో పాటు యువతి ఆ అత్యంత ప్రమాదకరమైన పాముల మధ్యలోనే అడుగులు వేస్తూ ఆటలాడడం మీరు ఈ వీడియోలో చూడవచ్చు. ఇప్పుడు ఈ దృశ్యాలే విపరీతంగా వైరల్ అవుతూ వస్తున్నాయి.
వారు ఒక మొబైల్ ఫోన్లో ఆన్లైన్ డైస్ వినియోగిస్తూ.. అందులో వచ్చిన నెంబర్ ప్రకారం పాముల మీద నుంచి.. వాటి పక్కన అడుగులు వేస్తూ ఆటను ముందుకు సాగించడం మీరు గమనించవచ్చు. ఆ పాములు వారి కాళ్ళ కిందికి వస్తున్నప్పటికీ.. అవి బుసలు కొడుతున్నప్పటికీ ఆ జంట ఏమాత్రం భయపడకుండా.. నవ్వుతో ఆటలాడడం మీరు గమనించవచ్చు. అయితే ఈ వీడియోను చూసిన సోషల్ మీడియా వినియోగదారులు రకరకాలుగా స్పందిస్తూ వస్తున్నారు..
Also Read: AI Boyfriends: చైనాలో AIతో అమ్మాయిల లవ్.. భయపడుతున్న కమ్యూనిస్టు ప్రభుత్వం?
ఈ వీడియో షేర్ చేసిన కొద్ది నిమిషాల్లోనే లక్షలాది వ్యూస్ ను సంపాదించుకుంది. అంతేకాకుండా ఈ వీడియోకు సోషల్ మీడియా వినియోగదారుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది ఇలా కామెంట్లు చేస్తూ వస్తున్నారు.. ఇది సాహసం కాదు వారి మూర్ఖత్వం అంటూ కొంతమంది కామెంట్లు చేస్తే.. ఒక్క పాము కాటేసిన ప్రాణాలు పోయే ప్రమాదముంది.. అంటూ మరికొందరు కామెంట్లు చేయడం విశేషం. అయితే, మరి కొంతమంది మాత్రం ఇవి గ్రాఫిక్స్ అయి ఉండొచ్చని.. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగించి ఈ పాములను తయారు చేసి ఉండొచ్చని కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా వీరు పాములతో ఆడడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది.
Also Read: AI Boyfriends: చైనాలో AIతో అమ్మాయిల లవ్.. భయపడుతున్న కమ్యూనిస్టు ప్రభుత్వం?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Telangana Speaker Clean Cheat: 'చేతిలో రాజ్యాంగం పట్టుకుని తిరుగుతూ ఉపన్యాసాలు ఇచ్చే రాహుల్ గాంధీ నేడు అదే రాజ్యాంగాన్ని ఉల్లంఘించారు. తుక్కుగూడలో ఫిరాయింపుల నిరోధక చట్టం గురించి మాట్లాడిన రాహుల్ గాంధీ మూర్ఖపు పని చేస్తున్నాడు. రాహుల్ గాంధీకి కొంచెమైనా సిగ్గు, గౌరవం ఉంటే దీనికి సమాధానం చెప్పాలి' అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ చేశారు. 'ఒక పార్టీ బీ-ఫారమ్ మీద ఎమ్మెల్యేగా గెలిచి, రాజీనామా చేయకుండానే మరో పార్టీ బి-ఫారమ్ మీద ఎంపీగా ఎలా పోటీ చేస్తారు? అని మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు.
Also Read: Hotels Close: బ్యాచిలర్స్ అలర్ట్! హైదరాబాద్లో హోటల్స్, హాస్టల్స్ క్లోజ్?
'స్వతంత్ర భారత చరిత్రలో ఏ స్పీకర్ కూడా ఇంత అద్భుతమైన నిర్ణయం తీసుకోలేదు. అందుకే వారిని చప్పట్లు, శాలువాలతో సత్కరించి మా కృతజ్ఞతలు తెలపాలనుకుంటున్నాం. ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ఏ బీ ఫారమ్ వాడారు, ఎంపీగా ఏ బీ-ఫారమ్ వాడుతున్నారో అక్కడ స్పష్టంగా ఉంది. ఇంత ఉన్నా స్పీకర్ అనర్హత పిటిషన్ను తిరస్కరించారంటే కచ్చితంగా ఆయనను, ఆయనను నడిపిస్తున్న కాంగ్రెస్ నాయకులను సత్కరించాల్సిందే' అని కేటీఆర్ ఎద్దేవా చేశారు.
Also Read: Harish Rao: ఢిల్లీలో నీతులు.. మరి తెలంగాణలో ఎందుకు ఉల్లంఘిస్తున్నారు?: హరీశ్ రావు
'అన్ని సాక్ష్యాలు ప్రజల ముందు ఉన్నప్పటికీ కూడా విచారణ చేయాల్సిన అవసరం ఏముంది? ఆలోచించాల్సిన అవసరం ఏముంది? అని మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. అందుకే చేసేవి అనైతిక కార్యక్రమాలు, చెప్పేవి నీతులు అన్న తీరుగా రాహుల్ గాంధీ తీరు ఉందని, అందుకే ఆయనను దేశంలోనే అతిపెద్ద జోకర్ అంటున్నానని కేటీఆర్ పునరుద్ఘాటించారు. ఇలాంటి రాహుల్ గాంధీ లాంటి జోకర్లకు తెలంగాణ ప్రజలే సమాధానం చెబుతారని కేటీఆర్ ప్రకటించారు.
Also Read: KTR Press Meet: దేశంలోనే అతిపెద్ద జోకర్ రాహుల్ గాంధీ: కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు
ఫిరాయింపుల సంస్కృతి గురించి మాట్లాడే నైతిక హక్కు రాహుల్ గాంధీకి, కాంగ్రెస్ పార్టీకి లేనే లేదని మాజీ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ నాయనమ్మ ఇందిరా గాంధీ హర్యానాలో మొదలుపెట్టిన ఫిరాయింపుల రాజకీయం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు పాకిందని చరిత్ర గుర్తుచేశారు. 2004లో అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో 26 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే.. 10 మందిని తీసుకున్నది కాంగ్రెస్ కాదా అనే విషయాన్ని కేటీఆర్ ప్రస్తావించారు.
'ఫిరాయింపుల అంశంపై దానం నాగేందర్, కడియం శ్రీహరి చేసిన కామెంట్స్ చూస్తే నవ్వు వస్తుంది. కడియం శ్రీహరి ఈరోజు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. కానీ ఎలాంటి పరిస్థితులలో బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చారు, ఆయనకు బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన గౌరవం, పదవులు ఏమిటో ఆయనకు ఆయన ప్రశ్నించుకోవాలి' అని మాజీ మంత్రి కేటీఆర్ హితవు పలికారు. 'కడియం శ్రీహరికి బీఆర్ఎస్ పార్టీ చేసిన అన్యాయం ఏమిటి? ఆయన 2013లో వచ్చినప్పుడు కేసీఆర్ ఆయనను ఎంపీని చేశారు. ఆ తర్వాత డిప్యూటీ సీఎం చేశారు. ఆపై ఎమ్మెల్సీని చేశారు. తర్వాత ఎమ్మెల్యేని చేశారు. ఆయన కూతురికి ఎంపీ టికెట్ ఇచ్చారు. ఈ వయసులో ఇలాంటి "మురికి" మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు? ఇంత సిగ్గులేకుండా ఎందుకు బతకాలి? మీరు ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారు? నేను ఇంకా బీఆర్ఎస్లోనే ఉన్నా. కేసీఆర్ నాయకత్వంతోనే ఉన్నాను అని మీరు చెప్పారు. అందుకే అడుగుతున్నాను ఈ థర్డ్ క్లాస్ మాటలు ఎందుకు? అని' అని కడియం శ్రీహరిపై మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Mercury Rise March 18 Effect On Zodiac Telugu: జ్యోతిష్య శాస్త్రం పరంగా గ్రహాల్లో స్థితిగతుల్లో మార్పుల కారణంగా మానవ జీవితాలపై ఊహించని ప్రభావం పడుతుంది. అయితే, ఇది ఇలా ఉంటే బుద్ధి, వ్యాపారం, సంభాషణకు కారకుడైన బుధ గ్రహం ప్రస్తుతం కుంభరాశిలో అస్తమించి ఉన్నాడు మార్చి 18వ తేదీన తెల్లవారుజామున 5 గంటల సమయంలో ఈ గ్రహం అదే రాశిలో ఉదయించబోతోంది. వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఏదైనా ఒక గ్రహం ఉదయించినప్పుడు దాని శక్తి రెట్టింపు అవుతుంది. అయితే, ఈ రెట్టింపైన శక్తి అన్ని రాశుల వారిపై పడుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. దీనివల్ల మూడు రాశుల వారి జీవితాల్లో అద్భుతమైన మార్పులు రాబోతున్నాయి. ఇది ఆయా రాశుల వారికి గోల్డెన్ పీరియడ్గా కూడా మారవచ్చు. బుధుడు ఉదయించడం వల్ల అద్భుతమైన లాభాలు పొందబోతున్న రాశులేవో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
మేషరాశి
మేష రాశి వారికి బుధుడి ప్రభావం వల్ల అత్యంత శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా వీరు పూర్వికులు ఆస్తులు కూడా పొందగలుగుతారు. అలాగే ఇప్పటికే కొనుగోలు చేసిన ఆస్తుల నుంచి భారీ లాభాలు పొందే.. అవకాశాలు కనిపిస్తున్నాయి. చాలా కాలంగా నిలిచిపోయిన కోరికలు కూడా నెరవేరుతాయి. అంతేకాకుండా ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో ప్రశంసలు లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే కొత్త ఉద్యోగాలు చేస్తున్న వారికి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. వ్యాపారస్తులు కొత్త ఆర్డర్లు పొందడమే కాకుండా మంచి ఆర్థిక లాభాలు పొందగలుగుతారు. వైవాహిక జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది.
తులారాశి
తులా రాశిలో జన్మించిన వ్యక్తులకు కూడా బుధుడు ఉదయించడం వల్ల అదృష్టం వెన్నంటే ఉండబోతోంది అంతేకాకుండా వీరికి ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఊహించని ఆసక్తి పెరగబోతోంది. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో కలిసి వీరు తప్పకుండా తీర్థయాత్రలకు కూడా వెళ్తారు. అలాగే ఉద్యోగాలు చేస్తున్నవారు జీతాల పెంపు వంటి సానుకూలమైన మార్పులు కూడా పొందగలుగుతారు. అలాగే వీరు డబ్బులను కూడా భారీగా పొదుపు చేసుకుంటారు. దీంతోపాటు సామర్థ్యం కూడా ఊహించని స్థాయిలో పెరుగుతుంది. ప్రేమికులకు ఈ ఈ సమయం చాలా అద్భుతంగా ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. అంతేకాకుండా ఆర్థిక స్థితిగతులు కూడా గతంలో కంటే ఇప్పుడు మరింత బలోపేతం అవుతాయి.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
కుంభరాశి
బుధుడి ప్రభావంతో కుంభరాశి వారిపై కూడా చాలా ప్రత్యేకమైన ప్రభావం పడబోతోంది.. వీరికి ఆత్మవిశ్వాసం ఊహించని స్థాయిలో పెరుగుతుంది సమాజంలో గౌరవంతో పాటు మర్యాదలు కూడా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్త వ్యాపారాలు చేయాలనుకునే వ్యక్తులకు అద్భుతమైన అవకాశాలు కూడా లభిస్తాయి. కోర్టు కేసులతో పాటు ఇతర సమస్యలు ఎదుర్కొంటున్న వ్యక్తులకు సమస్యలు పూర్తిగా పరిష్కారం అవుతాయి. పెళ్లికి ప్రయత్నాలు చేస్తున్న వ్యక్తులకు అద్భుతమైన భాగస్వామి లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ఆరోగ్యం గతంలో కంటే ఇప్పుడు మరింత నిలకడగా ఉంటుంది.. ప్రేమ వివాహాలు చేసుకోవాలనుకుంటున్న వ్యక్తులు పెద్దల అంగీకారంతో గ్రాండ్గా పెళ్లిళ్లు చేసుకోగలుగుతారు.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook