ఖమ్మం: విషపు నీటిని తాగి గొర్రెల మృతి
Khammam, Telangana:విషపు నీరు తాగి 20 గొర్రెలు మృతి చెందగా మరో 150 గొర్రెలు అస్వస్థతకు గురైన ఘటన ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం లంకాసాగర్ క్రాస్ రోడ్ వద్ద జరిగింది. రామచంద్రాపురం గ్రామానికి చెందిన బోలే రాంబాబుకు చెందిన 200 గొర్రెలను క్రాస్ వద్ద మేపుతున్నాడు. అయితే సింగరేణి నుండి వచ్చే విష రసాయనాలను సమీపంలోని గుంతల్లో డంప్ చేస్తున్నారు. నీటి కోసం వెళ్లిన గొర్రెలు వాటిని తాగి అస్వస్థతకు గురై చనిపోయినట్లు తెలుస్తుంది.हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
SSY Calculator: కూతురి పెళ్లి, చదువుల టెన్షన్ ఫ్రీ.. Sukanya Schemeలో రూ.50 లక్షల భారీ ఫండ్ కోసం నెలవారీ ప్లాన్ ఇదిగో..!!
Lakshmapur, Telangana:Sukanya Samriddhi Yojana : మీ కూతురు ఉజ్వల భవిష్యత్తు కోసం కొంత పెట్టుబడి పెట్టాలనుకుంటే.. సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ కంటే ఉత్తమమైన సేవింగ్స్ స్కీమ్ మరోకటి లేదని చెప్పాలి. ఇతర సేవింగ్స్ సేవింగ్స్ స్కీమ్స్ తో పోల్చి చూస్తే ఈ పథకం ఏడాదికి 8.2శాతం వడ్డీ రేటును అందిస్తుంది. అంతేకాదు ఈ స్కీములోని పెట్టుబడులు పాత ఆదాయపు పన్ను విధానంలోని సెక్షన్ 80C కింద రూ. 1.50 లక్షల వరకు పన్ను మినహాయింపుకు అర్హత పొందుతాయి. ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా మీ కూతురు పేరు మీద రూ. 50 లక్షల భారీ నిధిని ఎలా కూడబెట్టవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
సుకన్య సమృద్ధి యోజన:
సుకన్య సమృద్ధి యోజన నిబంధనల ప్రకారం..ఆడపిల్లకు 10 సంవత్సరాలు నిండక ముందే తల్లిదండ్రులు లేదా చట్టపరమైన సంరక్షకులు ఆమె పేరు మీద అకౌంట్ తీసుకోవచ్చు. ఖాతా తెరిచిన తేదీ నుండి 15 సంవత్సరాల వరకు పెట్టుబడులను పెట్టవచ్చు. అయితే 21 సంవత్సరాల తర్వాత ఖాతా మెచ్యూర్ అవుతుంది. ప్రతి ఆర్థిక సంవత్సరానికి సుకన్య సమృద్ధి యోజన కనీస వాటా రూ. 250 కాగా, గరిష్టంగా రూ. 1.5 లక్షలు ఉంటుంది.
50 లక్షల రూపాయలు ఎలా డిపాజిట్ చేయాలి?
ఒకవేళ తల్లిదండ్రులు సుకన్య సమృద్ధి యోజనలో 15 సంవత్సరాల పాటు ప్రతి సంవత్సరం రూ. 50,000 పెట్టుబడి పెడితే.. మొత్తం పెట్టుబడి రూ. 7.5 లక్షలు అవుతుంది. ప్రస్తుత వార్షిక 8.2శాతం వడ్డీ రేటు ప్రకారం, 21 సంవత్సరాల తర్వాత మెచ్యూరిటీ మొత్తం రూ. 23.94 లక్షలకు పైగా పెరగవచ్చు. సుకన్య సమృద్ధి యోజనలో మీరు 15 సంవత్సరాల పాటు పెట్టుబడి పెడతారు. కానీ మెచ్యూరిటీ కాలం 21ఏళ్లు కాబట్టి.. మీరు పెట్టుబడి పెట్టకుండానే మరో 6ఏళ్ల పాటు చక్రవడ్డీని పొందుతూనే ఉంటారు.
Also Read: ఎండితే 2 కేజీలు, మాడిపోతే 3 కేజీలు .. ఇదేంటో చెప్పగలరా? 99శాతం మంది తప్పు సమాధానమే
అదే సమయంలో, ప్రతి ఆర్థిక సంవత్సరానికి రూ. 1 లక్ష పెట్టుబడితో, 15 సంవత్సరాలలో మొత్తం పెట్టుబడి = రూ. 15 లక్షలు. సుకన్య సమృద్ధి యోజన ప్రస్తుత వడ్డీ రేటు ప్రకారం, 21 సంవత్సరాల తర్వాత మెచ్యూరిటీ ఫండ్ రూ. 47 లక్షలకు పైగా పెరుగుతుంది. మీరు ప్రతి ఆర్థిక సంవత్సరానికి రూ. 1.5 లక్షలు పెట్టుబడి పెడితే, 15 సంవత్సరాలలో మీ మొత్తం పెట్టుబడి రూ. 22.5 లక్షలు అవుతుంది. ప్రస్తుత 8.2శాతం వడ్డీ రేటు ప్రకారం, 21 సంవత్సరాల తర్వాత మెచ్యూరిటీ మొత్తం సుమారుగా రూ. 71 లక్షలకు పెరుగుతుంది.
Also Read: తక్కువ పెట్టుబడితో భారీ లాభాలు తెచ్చే Top 4 Super Business IDEAS ఇవిగో!
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. దయచేసి దీన్ని పెట్టుబడి, ఆర్థిక లేదా వ్యాపార సలహాగా భావించవద్దు. గుర్తుంచుకోండి స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టోకరెన్సీలు, రియల్ ఎస్టేట్, విలువైన లోహాలు వంటి అన్ని రకాల పెట్టుబడులు మార్కెట్ ఆటు పోటులు రిస్కులకు లోబడి ఉంటాయి. దీని అర్థం, మీరు లాభపడవచ్చు లేదా నష్టపోవచ్చు. మీరు తీసుకునే ఎలాంటి పెట్టుబడి నిర్ణయాలు లేదా వ్యాపార కార్యకలాపాల వల్ల కలిగే నష్టాలు లేదా లాభాలకు మా సంస్థ జీ తెలుగు వెబ్ పోర్టల్ ఎట్టి పరిస్థితుల్లోనూ బాధ్యత వహించదు. ఏదైనా ఆర్థిక నిర్ణయం తీసుకునే ముందు, తప్పకుండా ఒక రిజిస్టర్డ్ లేదా సర్టిఫైడ్ ఆర్థిక నిపుణుడిని సంప్రదించి, వారి సలహా తీసుకోమని పాఠకులకు సిఫార్సు చేస్తున్నాము.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Grah Gochar 2026: జూన్ నెలలో 5 గ్రహాల సంచారం.. ఈ 5 రాశుల వారు కుబేరులవ్వడం ఖాయం!
Hyderabad, Telangana:Grah Gochar Effect On Zodiac Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. 2026 జూన్ నెల చాలా ప్రత్యేకమైనదిగా భావిస్తూ ఉంటారు. ఈ నెలలో అత్యంత ప్రభావవంతమైన ఐదు గ్రహాలు సంచారం చేయబోతున్నాయి. ముఖ్యంగా గురు గ్రహంతో పాటు శుక్ర, సూర్య, కుజ, బుధ గ్రహాలు ఈ సమయంలో వాటి గమనాన్ని మార్చుకోబోతున్నాయి. ఈ గ్రహాల సంచారంతో అరుదైన యోగాలు కూడా ఏర్పడతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ సమయంలో 12 రాశుల వారిపై ఊహించని ప్రభావం పడుతుంది. కానీ ఐదు రాశుల వారికి మేలు జరగబోతోందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఈ సమయంలో అదృష్టం కూడా సహకరించి ధన సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. ఊహించని మానసిక ప్రశాంతత కూడా లభించబోతోంది..
జూన్ నెలలో ఈ సమయాల్లో సంచారాలు..
జూన్ రెండవ తేదీ తెల్లవారుజామున గురు గ్రహం సంచారం చేయబోతోంది. కర్కాటక రాశిలోకి ప్రవేశించబోతోంది. ఆ తర్వాత జూన్ 8వ తేదీన సాయంత్రం ఐదు గంటల సమయంలో శుక్రుడు కూడా కర్కాటక రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఇదిలా ఉంటే జూన్ 15వ తేదీ మధ్యాహ్నం 12 గంటల సమయంలో సూర్యుడు మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇక జూన్ 21 తెల్లవారుజామున 12 గంటలకు అంగారకుడు వృషభ రాశిలోకి ప్రవేశించడం విశేషం. అలాగే జూన్ 22వ తేదీ మధ్యాహ్నం మూడు గంటల సమయంలో బుధుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు.. ఇలా కొన్ని ప్రధాన గ్రహాలు సంచారం చేస్తాయి. ఇక ఇదే సమయంలో కొన్ని గ్రహాలు నక్షత్ర సంచారం కూడా చేయబోతున్నట్లు సమాచారం..
ఈ రాశులవారికి బంపర్ లాభాలు:
మేషరాశి
జూన్ నెల ఈ రాశి వారికి చాలా విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అన్ని గ్రహాల సంచారంతో వీరికి అన్నింటిలోనూ అద్భుతమైన విజయాలు సాధించే అదృష్టాన్ని సొంతం చేసుకోగలుగుతారు. ముఖ్యంగా డబ్బు సంబంధిత సమస్యలు పూర్తిగా పరిష్కారం కాబోతున్నాయి. మానసిక ప్రశాంతత కూడా విపరీతంగా లభిస్తుంది.. దీంతోపాటు శత్రువులు మీకు చాలా దూరంగా ఉండి సమాజంలో అద్భుతమైన పరిచయాలను పొందగలుగుతారు వృత్తి జీవితం మెరుగుపడడమే కాకుండా పెద్దపెద్ద సమస్యలు పరిష్కారమవుతాయి.
మిథున రాశి
మిథున రాశిలో జన్మించిన వ్యక్తులకు జూన్ నెల గ్రహసంచారాల ప్రభావంతో ఆర్థిక సమస్యలు పూర్తిగా పరిష్కారం కాబోతున్నాయి.. ముఖ్యంగా వ్యాపారంలో అద్భుతమైన పురోగతి లభించబోతోంది. ఉద్యోగంలో మంచి అభివృద్ధి సాధించడమే కాకుండా కొత్త బాధ్యతలు పొంది.. విశేషమైన లాభాలు సొంతం చేసుకోగలుగుతారు. వైవాహిక జీవితంలో అద్భుతమైన ఆనందం కూడా లభిస్తుంది మానసిక ప్రశాంతత కూడా విపరీతంగా పెరిగి ప్రమాదాలకు దూరంగా ఉంటారు.
కర్కాటక రాశి
కర్కాటక రాశిలో జన్మించిన వ్యక్తులకు వ్యాపారాలపరంగా ఈ సమయంలో అత్యంత అనుకూలంగా ఉండబోతోంది. అదేవిధంగా కెరీర్ పరంగా గొప్ప పురోగతి సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. డబ్బు సంబంధిత సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. బ్యాంకు బ్యాలెన్స్ కూడా విపరీతంగా పెరుగుతుంది కుటుంబంలో సంతోషం ఊహించని స్థాయిలో పెరిగి విశేషమైన ధన లాభాలు పొందుతారు. అంతేకాకుండా అంతులేని సంతోషం కారణంగా మానసికంగా అద్భుతంగా ముందుకు సాగుతారు ఎలాంటి పెద్ద ప్రమాదాలు ఈ సమయంలో రాకుండా ఉంటాయి..
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి ఆదాయం ఆకస్మాత్తుగా విపరీతంగా పెరుగుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా జీతం ఊహించని స్థాయిలో పెరిగి.. అధికారుల సపోర్టు కూడా పొందగలుగుతారు. కొత్త బాధ్యతలు లభించడమే కాకుండా ఈ సమయంలో వ్యాపారంలో గొప్ప పురోగతి లభించబోతోంది. దీంతోపాటు మానసిక స్థితి మెరుగుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యాపారంలో ప్రశాంతత కొనసాగి జీవితాన్ని ముందుకు నడుపుతారు.. అంతేకాకుండా ఇలాంటి ఆందోళన చెందకుండా ఈ సమయంలో ఉండడం చాలా మంచిదని జ్యోతిష్యులు చెబుతున్నారు..
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
గమనిక.. 
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Jupiter Transit 2026: ఈ రాశివారికి గురుబలం రెట్టింపు.. విదేశీ యోగం, ఊహించని ధన లాభాలు!
Hyderabad, Telangana:Jupiter Transit In Cancer Effect On Zodiac: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. గ్రహ కదలికలు చాలా కీలకమైనవిగా భావిస్తూ ఉంటారు. అంతేకాకుండా జూన్ నెల ఎన్నో గ్రహాల కదలికలతో పాటు తిరోగమనం, సంయోగం చేయబోతున్నాయి. దీని కారణంగా జూన్ నెల చాలా ప్రత్యేకమైనదిగా భావిస్తూ ఉంటారు. ఇదే సమయంలో శక్తివంతమైన శుభగ్రహంగా పరిగణించే గురు గ్రహం మిథున రాశిని విడిచి కర్కాటక రాశిలోకి ప్రవేశించబోతోంది. ఈ గ్రహం అక్టోబర్ 31వ తేదీ వరకు అదే రాశిలో కొనసాగడం చాలా విశేషం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. కర్కాటక రాశిని గురుడు ఉచ్చరాశిగా పరిగణిస్తూ ఉంటాడు. అలాగే సింహ రాశి వారికి జాతకంలో 12వ స్థానంలో ఈ సంచారం జరగబోతోంది. దీని కారణంగా ఎక్కువగా ఈ సమయంలో సింహ రాశి వారిపై ప్రభావం పడుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. అలాగే మరికొన్ని రాశుల వారికి కూడా విశేషమైన ధన లాభాలు కలుగుతాయి..
సింహరాశి కెరీర్ పై ప్రభావం..
సింహ రాశి వారికి గురువు జాతకంలో 12వ స్థానంలోకి సంచరించడం కారణంగా వీరికి కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. అంతేకాకుండా సొంత నగరాల్లో కూడా ఉద్యోగాలు సాధించి అన్ని పనుల్లో విజయాలు సాధించగలుగుతారు. అలాగే ఉద్యోగం మారాలని ఆలోచిస్తున్న వారికి కూడా మంచి మంచి అవకాశాలు లభించబోతున్నాయి. ముఖ్యంగా ఎగుమతి దిగుమతి లేదా విదేశీ వ్యాపార పరిశ్రమల్లో పనిచేస్తున్న వ్యక్తులు అందరికీ ఈ సమయంలో అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి. పనుల్లో ఎలాంటి నిర్లక్ష్యం వహించకుండా ముందుకు సాగితే అద్భుతమైన ధన లాభాలు కూడా కలుగుతాయి. వ్యాపారాలు చేస్తున్నవారు కూడా బాధ్యతను శ్రద్ధగా తీసుకోవాలని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు సూచిస్తూ ఉన్నారు..
గురు గ్రహం సింహరాశిలో 12వ స్థానంలోకి వెళ్లడం కారణంగా ఈ సింహ రాశి వారి జాతకం ప్రకారం ఆరోగ్యం పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ముఖ్యంగా అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లను మానుకుంటే నీ జీవితంలో రాణించగలుగుతారు.. లేదంటే ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు గురయ్యే అవకాశాలున్నాయి. దీంతోపాటు చిన్నపాటి నిర్లక్ష్యం కూడా మీ ఆరోగ్యం పై ఊహించని ప్రభావం చూపుతుంది. ఈ సమయంలో తప్పకుండా శరీరం ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా మంచిది లేదంటే దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.
ఆర్థిక ప్రభావం..
మీరు విదేశాల్లో పనులు చేస్తుంటే తప్పకుండా ఈ సమయంలో ఊహించని ధన లాభాలు పొందగలుగుతారు. ముఖ్యంగా కొత్త వ్యాపారాలు ప్రారంభించి అద్భుతమైన అవకాశాలు కూడా పొందుతారు. అజాగ్రత్తగా లేదా పనుల్లో తప్పుడు నిర్ణయాలు తీసుకోకపోవడం చాలా మంచిదని జ్యోతిష్యులు చెబుతున్నారు. తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం కారణంగా ఆర్థికంగా నష్టపోతారని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. పెట్టుబడుల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. ముఖ్యంగా పని విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలని వారు సూచిస్తున్నారు..
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
వ్యక్తిగత జీవితం ఇలానే ఉంటుంది..
ఈ సమయంలో సింహ రాశి వారికి ఎలాంటి సంఘర్షణలకైనా చాలా దూరంగా ఉండాల్సి ఉంటుంది.. ముఖ్యంగా అభిప్రాయ విభేదాలతో పాటు గొడవలకు, వాదనలకు దూరంగా ఉండటం వల్ల ఒత్తిడి చాలా వరకు తగ్గి అవకాశాలు కనిపిస్తున్నాయి. లేదంటే అనేక సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. మర్యాదపూర్వక ప్రవర్తనతో పాటు సంబంధాల మధ్య సమతుల్యతను పాటించడం చాలా మంచిది. ఇతరుల పట్ల శత్రుత్వం పెంచుకోకుండా.. విషయాలను ప్రశాంతంగా పరిష్కరించుకోవడం ఎంతో మంచిదని జ్యోతిష్యులు చెబుతున్నారు.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
గమనిక.. 
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
GK Quiz: ఎండితే 2 కేజీలు, మాడిపోతే 3 కేజీలు .. ఇదేంటో చెప్పగలరా? 99శాతం మంది తప్పు సమాధానమే చెబుతారు..!!
Lakshmapur, Telangana:GK Quiz: సాధారణంగా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవారు.. జనరల్ నాలెడ్జ్ పై కూడా ఫోకస్ పెడతారు. ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో జీకే కూడా ఒక విభాగంగా ఉంటుంది. ఈ కేటగిరిలో రకరకాల ప్రశ్నలు అడుగుతుంటారు. అయితే జీకేపై పరిజ్నానం పెంచుకున్నట్లయితే ఈ విభాగంలో మంచి మార్కులు సాధించుకోవచ్చు. అయితే ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాము. దానికి మీరు సమాధానం చెప్పడం అంత ఈజీ కాదు. ఖచ్చితంగా తప్పే చెబుతారు. అయితే ఆ ప్రశ్న ఏంటో ఇప్పుడు చూద్దాం.
ప్రశ్న:
పొడిగా ఉన్నప్పుడు 2 కిలోలు.. తడిగా ఉన్నప్పుడు 1 కిలో బరువు ఉండే ఆ వస్తువు ఏమిటి? అదే వస్తువును కాల్చితే, అది 3 కిలోగ్రాములు అవుతుంది?
సమాధానం : సల్ఫర్
Also Read: రక్తం లేని జీవి ఏదో తెలుసా? 99శాతం మందికి తెలియదు..!!
సల్ఫర్ అంటే ఏంటి?
సల్ఫర్ అనేది ఒక పసుపు రంగు రసాయన మూలకం. ఇది అలోహం. సల్ఫర్ గుర్తు S, పరమాణు సంఖ్య 16. ఈ రసాయన గంధకాన్ని కారు బ్యాటరీల తయారీ, ఎరువులు, చమురు శుద్ధి కర్మాగారం, నీటి శుద్ధి, ఖనిజాల వెలికితీతలో ఎక్కువగా ఉపయోగిస్తారు. సల్ఫర్ అనేది విషపూరితమైన రసాయనం. సల్ఫర్ను ఎక్కువగా తీసుకోవడం వల్ల గుండెల్లో మంట లేదా విరేచనాలు కలిగే అవకాశం ఉంటుంది. సల్ఫర్ కణాలు దగ్గుకు కారణం అవుతాయి. ఇది చర్మానికి, కళ్ళకు కూడా చికాకు కలిగించగలదు.
శరీరానికి సల్ఫర్ వల్ల కలిగే హాని ఏంటంటే?
-చర్మం పొడిబారడం, ఎర్రబడటం.. చాలా మందికి మంటగా కూడా అనిపిస్తుంది.
-చర్మం కూడా దురదగా లేదా పొలుసులుగా మారుతుంది.
-దద్దుర్లు లేదా దురద వంటి అసాధారణ అలెర్జీ ప్రతిచర్యలు.
Also Read: నెలకు లక్షల్లో సంపాదన.. Dairy Farming బిజినెస్లో సక్సెస్ అవ్వడానికి TOP 5 టిప్స్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Dairy Farming Business: నెలకు లక్షల్లో సంపాదన.. Dairy Farming బిజినెస్లో సక్సెస్ అవ్వడానికి TOP 5 టిప్స్ ఇవిగో..!!
Lakshmapur, Telangana:Dairy Farming Business: నేటికాలం యువత ఉద్యోగాల కంటే వ్యాపారాలపై వైపు మొగ్గు చూపుతున్నారు. అందులో పశుపోషణకు సంబంధించిన వ్యాపారానికి ఇప్పుడు చాలా డిమాండ్ ఉంది. మీరు కూడా పాడిపరిశ్రమను ఏర్పాటు చేయాలనుకుంటే.. ముందుగా దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలి. గత కొన్నిసంవత్సరాలుగా చాలా మంది ఈ వ్యాపారంలో రాణిస్తున్నారు. మంచి ఆదాయం పొందుతున్నారు. పాలు, పాల ఉత్పత్తులకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉండటం వల్ల ఈ వ్యాపారం అభివ్రుద్ధి చెందుతోంది. అయితే ఈ వ్యాపారం ప్రారంభించే ముందు కొన్ని మెళకువలు తెలుసుకోవాలి. అవేంటో చూద్దాం.
ఆవులు లేదా గేదెల వంటి పాడి జంతువులను పెంచి మంచి ఆదాయం సంపాదించాలనుకుంటే.. మీకు దాని గురించి మంచి పరిజ్ఞానం ఉండాలి. ఈ వ్యాపారంలోకి ప్రవేశించిన తర్వాత, సరైన పరిజ్ఞానం లేకపోవడం వల్ల చాలా మంది పారిశ్రామికవేత్తలు నష్టపోయారు. గుర్తుంచుకోవలసిన కొన్ని విషయాలు ఇక్కడ ఉన్నాయి.
మంచి జాతిని ఎంచుకోవడం:
పాడి జంతువులను పెంచేటప్పుడు.. వాటి జాతి, ఆరోగ్యం గురించి తప్పకుండా తెలుసుకోవాలి. అనారోగ్యంతో లేదా వ్యాధి సోకిన జంతువులను పెంచకూడదు. ఆవుల పెంపకందారులు గిర్ లేదా సాహివాల్ జాతిని ఎంచుకోవాలని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. గేదెల పెంపకందారులు ముర్రా, సూరతి, మెహసానా లేదా జాఫరాబాది వంటి జాతులు అయితే మంచి ప్రాఫిట్ ఉంటుంది. జంతువులను కొనుగోలు చేసేటప్పుడు, వాటికి గాయాలు లేదా ఇన్ఫెక్షన్ వంటివి ఏమైనా ఉన్నాయా లేదా అనేది జాగ్రత్తగా పరిశీలించాలి.
విశాలమైన షెడ్డు:
జంతువుల కోసం శుభ్రమైన, విశాలమైన, గాలి, వెలుతురు బాగా వచ్చే షెడ్డును నిర్మించాలి. దానిని ఎండ, వానల నుంచి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి. జంతువుల ఆవరణలో శుభ్రమైన, తాజా నీరు అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. వాటిని కట్టివేయడంతో పాటు, నడవడానికి కూడా తగినంత స్థలం ఉండటం ముఖ్యం. అనారోగ్యం లేదా ఇన్ఫెక్షన్ రాకుండా నిరోధించడానికి ఆవరణను క్రమం తప్పకుండా శుభ్రంగా ఉంచాలి.
ఖర్చు ఎంత?
పాడి పరిశ్రమను కేవలం రూ. 3 లక్షలతో ప్రారంభించవచ్చు. రూ. 3 లక్షలతో రెండు పశువులు.. ఒక మంచి షెడ్డును ఏర్పాటు చేసుకోవచ్చు. అయితే, మీరు 3-4 పశువులతో కూడా ప్రారంభించవచ్చు. దీనికి సుమారు రూ. 5 లక్షలు ఖర్చవుతుంది. క్రమంగా, మీరు లాభాలు ఆర్జించడం ప్రారంభించిన తర్వాత, పశువుల సంఖ్యను పెంచుకోవచ్చు.
ఆదాయం ఎలా సమకూరుతుంది?
ఉన్నత జాతి ఆవులు, గేదెలు రోజుకు 10 లీటర్ల వరకు పాలను ఇస్తాయి. మూడు జంతువులు ఒకేసారి పాలు ఇస్తే, మీరు రోజుకు 30-35 లీటర్ల పాలను అమ్మి, సగటున రోజుకు రూ. 2,000 సంపాదించవచ్చు. దీని ద్వారా నెలకు రూ. 60,000 ఆదాయం వస్తుంది. జంతువుల నిర్వహణ, దాణా ఖర్చులన్నీ పోనూ ఈ ఆదాయం మిగులుతుంది.
గుర్తుంచుకోవలసిన ముఖ్యమైన విషయాలు:
పాడి వ్యవసాయం ప్రారంభించిన తర్వాత కూడా, నిర్లక్ష్యం చేసే విషయాలు చాలా ఉంటాయి. చాలా మంది పాడి రైతులు మొదట్లో మంచి ఆదాయం సంపాదిస్తారు కానీ దానిని నిలబెట్టుకోలేక నష్టాలను చవిచూస్తారు. మీరు కూడా అలాంటి పొరపాట్లు చేయకుండా గుర్తుంచుకోవాల్సిన కొన్ని విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
జంతువులకు టీకాలు వేయించడం:
చాలా మంది రైతులు షెడ్డు నిర్మించిన మొదట్లో శుభ్రంగా ఉంచుతారు. కానీ కొన్ని రోజుల తర్వాత వాటిని పట్టించుకోవడం మానేస్తారు. ఫలితంగా షెడ్డు ఆవరణలు నీరు, మురికితో నిండి పోతాయి. ఒకవేళ క్రమం తప్పకుండా శుభ్రం చేసినప్పటికీ, వివిధ కాలానుగుణ, అంటువ్యాధుల ప్రమాదం ఉంటుంది. జంతువులలో గొంతువాపు వ్యాధి , ఆంత్రాక్స్ వంటి వ్యాధులు సర్వసాధారణం. ఇన్ఫెక్షన్ను నివారించడానికి, పశువైద్యుడిని సంప్రదించి, క్రమం తప్పకుండా టీకాలు వేయించాలి.
పాల ప్రాసెసింగ్ ద్వారా మీ ఆదాయాన్ని పెంచుకోవడం:
మీరు మీ పాడి పరిశ్రమ ఆదాయాన్ని పెంచుకోవాలనుకుంటే, కేవలం పాలు అమ్మడం మాత్రమే సరిపోదు. పాలను శుద్ధి చేసి నెయ్యి, మజ్జిగ, వెన్న, కోవా వంటి ఉత్పత్తులను అమ్మండి. ఈ రోజుల్లో పాల ఉత్పత్తులలో కల్తీ జరుగుతోంది. స్వచ్ఛమైన, శుద్ధి చేసిన ఉత్పత్తులను అమ్మడం ద్వారా మంచి లాభాలు వస్తాయి. అయితే, పాల ఉత్పత్తులను అమ్మే ముందు, మార్కెట్లో మంచి నెట్వర్క్ను ఏర్పరచుకుని, వాటిని ప్రజలకు ప్రచారం చేయండి. ఒక్కసారి మీ ఉత్పత్తులను ప్రజలకు చేరువైతే.. మీ బిజినెస్ కు ఢోకా ఉండదని చెప్పాలి.
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. దయచేసి దీన్ని పెట్టుబడి, ఆర్థిక లేదా వ్యాపార సలహాగా భావించవద్దు. గుర్తుంచుకోండి స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టోకరెన్సీలు, రియల్ ఎస్టేట్, విలువైన లోహాలు వంటి అన్ని రకాల పెట్టుబడులు మార్కెట్ ఆటు పోటులు రిస్కులకు లోబడి ఉంటాయి. దీని అర్థం, మీరు లాభపడవచ్చు లేదా నష్టపోవచ్చు. మీరు తీసుకునే ఎలాంటి పెట్టుబడి నిర్ణయాలు లేదా వ్యాపార కార్యకలాపాల వల్ల కలిగే నష్టాలు లేదా లాభాలకు మా సంస్థ జీ తెలుగు వెబ్ పోర్టల్ ఎట్టి పరిస్థితుల్లోనూ బాధ్యత వహించదు. ఏదైనా ఆర్థిక నిర్ణయం తీసుకునే ముందు, తప్పకుండా ఒక రిజిస్టర్డ్ లేదా సర్టిఫైడ్ ఆర్థిక నిపుణుడిని సంప్రదించి, వారి సలహా తీసుకోమని పాఠకులకు సిఫార్సు చేస్తున్నాము.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Palnadu Railway Projects: పల్నాడు జిల్లా అభివృద్ధికి మరో ముందడుగు..ఎంపీ చొరవతో రూ.84 కోట్ల రైల్వే నిర్మాణాలను గ్రీన్ సిగ్నల్!
Sattenapalle, Andhra Pradesh:MP Lavu Srikrishna Devarayalu: నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని సత్తెనపల్లి, పెదకూరపాడు నియోజకవర్గ ప్రాంతాల ప్రజలు ఎట్టకేలకు విముక్తి లభించనుంది. రైల్వే గేట్ల వద్ద నిత్యం ఎదుర్కొంటున్న ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారానికి మార్గం దొరికింది. నరసరావుపేట ఎంపీ శ్రీ లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రత్యేక చొరవతో కేంద్ర రైల్వే శాఖ రెండు భారీ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ల (ఫ్లైఓవర్ల) నిర్మాణానికి ఆమోదం తెలిపింది. మొత్తం రూ.84.09 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించేందుకు తలపెట్టిన ఈ పనులకు సంబంధించిన ఈ-టెండర్ నోటిఫికేషన్ను దక్షిణ మధ్య రైల్వే (గుంటూరు డివిజన్) శనివారం విడుదల చేసింది.
ఈ సందర్భంగా ఎంపీ శ్రీ లావు కృష్ణదేవరాయలు మాట్లాడుతూ.. పెదకూరపాడు, సత్తెనపల్లి పరిసర ప్రాంతాల ప్రజలు ఎదుర్కొంటున్న ట్రాఫిక్ కష్టాలను రైల్వే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిపారు. స్పందించిన రైల్వే శాఖ వెంటనే అనుమతిలిచ్చిందని వెల్లడించారు. పల్నాడు అభివృద్ధికి సహకరించిన రైల్వే అధికారులకు ఎంపీ శ్రీ కృష్ణ దేవరాయలు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.
నిర్మించనున్న ROBల వివరాలు..
పెదకూరపాడులోని రైల్వే స్టేషన్ యార్డ్ పరిధిలోని రైల్వే గేటు (LC నంబర్ 27) స్థానంలో 2-లేన్ల ఫ్లైఓవర్ నిర్మిస్తారు. అలాగే సత్తెనపల్లి - రెడ్డిగూడెం.. ఈ రెండు స్టేషన్ల మధ్య ఉన్న రైల్వే గేటు (LC నంబర్ 40) స్థానంలో మరో ఫ్లైఓవర్ నిర్మిస్తారు.
ఈ రెండు ప్రతిష్టాత్మక బ్రిడ్జిల నిర్మాణ పనులకు త్వరలోనే శంకుస్థాపన చేయనున్నట్లు నరసరావుపేట ఎంపీ స్పష్టం చేశారు. టెండర్ల ప్రక్రియ ముగిసిన వెంటనే పనులు ప్రారంభించి.. ఏడాదిన్నరలో వీటిని అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ బ్రిడ్జిలు అందుబాటులోకి వస్తే రైళ్లు వచ్చే సమయంలో వాహనాలు గంటల కొద్దీ ఆగాల్సిన అవసరం ఉండదు. అత్యవసర సమయాల్లో అంబులెన్స్లు, ప్రయాణికులు సురక్షితంగా, వేగంగా వెళ్లేందుకు వీలవుతుంది.
Also Read: MP Lavu Krishna Devarayalu: ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు మంచి మనసు ...
Also Read: రాత పరీక్ష లేకుండానే నెలకు రూ.1,80,000 జీతం..కేంద్రప్రభుత్వ ఉద్యోగాలు కొన్ని రోజులే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Dmart Offers: స్కూల్స్ రీపెన్ వేళ డీమార్ట్ భారీ ఆఫర్లు.. తక్కువ ఖర్చుకే ఎక్కువ వస్తువులు
Wadgaon, Maharashtra:Dmart School Shopping Offers: పాఠశాలలు కొన్ని రోజుల్లో తెరచుకోనున్నాయి. వేసవి సెలవులు దాదాపు ముగిసిపోతుండగా.. విద్యా సంవత్సరం కొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. దీంతో తల్లిదండ్రులు తమ పిల్లల కోసం షాపింగ్ చేయడం ప్రారంభించారు. అయితే విద్యార్థులకు సంబంధించి తక్కువ ఖర్చుకే ఎక్కువ వస్తువులు పొందాలంటే డీమార్ట్కు వెళ్లాల్సిందే. విద్యా సంవత్సరం ప్రారంభమవుతున్న సందర్భంగా డీమార్ట్ సంస్థ ప్రత్యేకంగా ఆఫర్లు, డిస్కౌంట్లతోపాటు ఒకటి కొంచే ఒకటి ఉచితం అనే పథకం అమలు చేస్తోంది.
Also Read: Tirumala: తిరుమల భక్తులకు భారీ శుభవార్త.. ఉచిత బస్సుకు మరో కానుక
విద్యా సంవత్సరం ప్రారంభమవుతుందంటే విద్యార్థులకు సంబంధించిన వస్తువులు కొనాల్సి ఉంది. పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు, స్కూల్ బ్యాగ్లతోపాటు వారికి బ్యాగ్లు, లంచ్బాక్స్లు, వాటర్ బాటిల్స్ వంటివి కొనుగోలు చేయాల్సిన అవసరం ఉంది. ఇక అంతేకాకుండా పిల్లలకు అందించాల్సిన ఆహార పదార్థాలు కూడా కొన్ని ముందే కొని పెట్టుకోవాల్సి ఉంది. ఇది గమనించిన డీమార్ట్ సంస్థ కొన్ని ఆఫర్లు, డిస్కౌంట్లతోపాటు ప్రత్యేకమైన రాయితీలు అందిస్తోంది. డీమార్ట్ అందిస్తున్న ఆఫర్ల వివరాలు కేటగిరి వారీగా ఇలా ఉన్నాయి.
స్టేషనరీ సామగ్రిపై భారీ డిస్కౌంట్లు
బ్రాండెడ్ లాంగ్బుక్, నోట్ పుస్తకాలపై 15-30 శాతం తగ్గింపు లభిస్తోంది.
పెన్నులు ఎంఆర్పీపై కనీసం 15 శాతం తగ్గింపు
రూ.139 నుంచి లంచ్ బ్యాగ్లు
రూ.49కు పెన్సిల్ పర్సులు
పిడిలైట్ గ్లూ ఎంఆర్పీపై కనీసం 15 శాతం తగ్గింపు
Also Read: Tirumala Darshan: తిరుమల దర్శనానికి భారీ రద్దీ.. రేపు కొండపైకి రాకపోవడమే మంచిది
డ్రాయింగ్ ఉపకరణాల ఎంఆర్పీపై కనీసం 15 శాతం తగ్గింపు
12 ఫోల్డర్ ఎగ్జిక్యూటివ్ ఫైల్ ఎంఆర్పీ రూ.250 కన్నా రూ.179 మాత్రమే. బుక్ లేబుల్ స్టిక్కర్ రూ.19 ధరకు.
38 సెం.మీ బ్రౌన్ బుక్ కవర్ ఎంఆర్పీ రూ.70 కాస్త రూ.55 మాత్రమే. రూ.400 ధర కలిగిన కాలిక్యులేటర్ రూ.219 మాత్రమే.
అన్ని రకాల కంగారూ ఉత్పత్తులపై 15 శాతం తగ్గింపు. రూ.49 నుంచి కత్తెర
అప్సర ఎరేజర్, షార్ప్నర్ ఎంఆర్పీపై 20 శాతం తగ్గింపు. రూ.290 ధర కలిగిన ఎగ్జిక్యూటివ్ ఫోల్డర్ 12 పాకెట్ ఫైల్ రూ.199 మాత్రమే
రూ.375 ధర కలిగిన జేకే కాపియర్ పేపర్ ఏ4 (21 సెం.మీ * 29.7 సెం.మీ), 70 జీఎస్ఎమ్ 500 షీట్లు రూ.275 ధరకే అందుబాటులో ఉంది. మెటల్ అండ్ మాగ్నెటిక్ పెన్సిల్ బాక్స్ రూ.99 నుంచి ప్రారంభం. స్టడీ టేబుల్ రూ.349 నుంచి ప్రారంభం.
బ్యాగ్లు, లంచ్బాక్స్పై ఆఫర్లు
లంచ్బాక్స్, వాటర్ బాటిల్ కాంబో రూ.169తో ప్రారంభం. లంచ్ బాక్స్ రూ.45 నుంచి ప్రారంభం.
స్కూల్ బ్యాగ్లు రూ.199 నుంచి ప్రారంభం. రూ.399 ధర కలిగిన స్టీల్ ప్లెక్సీ 2 లేయర్ లంచ్ బాక్స్ రూ.99 మాత్రమే లభిస్తోంది.
గొడుగు రూ.329 నుంచి, వర్షపు కోటు (రెయిన్ కోట్) రూ.149 లభిస్తోంది. పాలిమర్ క్రికెట్ బ్యాట్ రూ.229, స్కూల్ షూస్ రూ.179 నుంచి ప్రారంభం.
Also Read: IPL 2026: చాంపియన్ రేసులో గుజరాత్ టైటాన్స్.. వైభవ్ పోరాడినా రాజస్థాన్కు నిరాశ
రోజువారీ అవసరాలు, కిరాణ సామగ్రి
750 గ్రాములు కలిగిన రూ.415 ఉన్న బూస్ట్ రీఫిల్ ప్యాక్ రూ.335కు డీమార్ట్ అందిస్తోంది.
డాబర్ హనీ స్క్వీజీ ప్యాక్ ఒకటి కొంటే ఒకటి ఉచితం. 400 గ్రాముల రూ.420 ధర కలిగిన హనీ రూ.255కు లభిస్తోంది.
సన్ఫీస్ట్ యిప్పీ మ్యాజిక్ మసాలా న్యూడిల్స్ రూ.120 ఉండగా రూ.77కు మాత్రమే డీమార్ట్లో అందుబాటులో ఉంది.
రూ.280 ధర ఉన్న కిసాన్ మిక్స్ ఫ్రూట్ జామ్ (700 గ్రాములు) రూ.215కు డీమార్ట్ అందిస్తోంది.
రూ.225 ధర కలిగిన నుటెల్లా ఫెర్రెరో (180 గ్రాములు) రూ.190 మాత్రమే లభిస్తోంది.
PM Shram Mandhan Yojana: ప్రభుత్వ ఉద్యోగం లేకపోయినా నెలనెలా Pension.. కేవలం రూ. 55 పెట్టుబడితో ప్రతి నెలా రూ. 3,000 మీ అకౌంట్లోకి..!!
Lakshmapur, Telangana:PM Shram Mandhan Yojana: వయస్సులో ఉన్నప్పుడు బాధ్యతలన్నీ భుజనా మోసినవాళ్లు.. వృద్ధాప్యం తర్వాత తమ పరిస్థితి ఏంటన్న ఆందోళన చెందుతుంటారు. ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగం చేయకుండా రోజువారీ కూలీగా జీవించేవారికి ఈ ఆందోళణ మరింత ఎక్కువగా ఉంటుంది. వీధి వ్యాపారులు, రిక్షాలాగేవాళ్లు, కూలీలు, చిన్న దుకాణదారులు వయస్సు పైబడి, శరీరం సహకరించనప్పుడు తమ ఇంటి ఖర్చులతోపాటు కనీస అవసరాలను తీర్చుకోవడం ఎలా అని ఆలోచిస్తుంటారు.
అలాంటి వారిని అక్కున చేర్చుకునేందుకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రధాన మంత్రి శ్రమ్ యోగి మాంధన్ యోజన అనే ఒక అద్భుతమైన పథకాన్ని ప్రారంభించింది. ఈ స్కీమ్ అత్యంత ముఖ్యమైన లక్షణం ఏంటంటే.. మీరు ప్రతినెలా కేవలం ఒక చిన్న మొత్తాన్ని అంటే రూ. 55 జమ చేస్తే చాలు.. దానికి బదులుగా 60ఏళ్ల వయస్సు వచ్చిన తర్వాత మీకు నెలకు రూ. 3000 హామీతో కూడిన పెన్షన్ లభిస్తుంది.
2019లో ప్రారంభించిన.. ఈ పథకం ప్రధానంగా అసంఘటిత రంగంలోని కార్మికుల కోసం తీసుకువచ్చింది. ఈ పథకం సరళమైన సూత్రం ఏమిటంటే, మీరు ఎంత ఎక్కువ డబ్బు జమ చేస్తే, ప్రభుత్వం మీ ఖాతాలో అంత ఎక్కువ జమ చేస్తుంది. ఉదాహరణకు.. మీ వయస్సు ఆధారిత వాయిదా రూ. 100 అయితే, మీరు రూ. 100 చెల్లిస్తారు. ప్రభుత్వం రూ. 100 జతచేస్తుంది. అంటే, ప్రతి నెలా మీ ఖాతాలో రూ. 200 జమ అవుతాయి. మీకు 60 ఏళ్లు నిండినప్పుడు, మీరు ప్రతి నెలా కనీసం రూ. 3,000 పెన్షన్ అందుకోవడం ప్రారంభిస్తారు.
అర్హులు ఎవరు?
ఈ ప్రభుత్వ పథకం ప్రయోజనాలను పొందడానికి, ప్రభుత్వం కొన్ని షరతులను పెట్టింది. అవేంటంటే..
వృత్తి: మీరు వీధి వ్యాపారి, రిక్షా లాగేవారు, గృహ సహాయకులు, నిర్మాణ కార్మికులు, వ్యవసాయ కూలీలు, చిన్న దుకాణదారులు లేదా అటువంటి ఏదైనా అసంఘటిత రంగంలో పనిచేసేవారై ఉండాలి.
వయస్సు: దరఖాస్తుదారుని వయస్సు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉండాలి.
తక్కువ ఆదాయం: మీ నెలసరి ఆదాయం రూ. 15,000 లేదా అంతకంటే తక్కువ ఉండాలి.
పన్నులు, ఇతర పథకాలు: మీరు ఆదాయపు పన్ను చెల్లించకూడదు. మీరు EPFO, ESIC, లేదా నేషనల్ పెన్షన్ సిస్టమ్ వంటి ఏ ఇతర పథకంలోనూ సభ్యులుగా ఉండకూడదు.
Also Read: రక్తం లేని జీవి ఏదో తెలుసా? 99శాతం మందికి తెలియదు..!!
ప్రతి నెలా ఎంత మొత్తం జమ చేయాల్సి ఉంటుంది?
ఈ పథకం కింద మీ జేబు నుండి తీసివేసే మొత్తం మీ వయస్సుపై ఆధారపడి ఉంటుంది. మీకు 18 ఏళ్లు ఉంటే, మీరు నెలకు కేవలం రూ. 55 మాత్రమే జమ చేయాలి. మీరు గరిష్టంగా 40 ఏళ్ల వయస్సులో చేరితే, నెలకు రూ. 200 చెల్లించాల్సి ఉంటుంది. మీరు ఈ పథకంలో చేరిన తర్వాత, మీకు 60 ఏళ్లు వచ్చే వరకు మీ నిర్ణీత నెలవారీ వాయిదాను చెల్లిస్తూ ఉండాలి.
ఈ పథకం ఎన్ని ప్రయోజనాలను అందిస్తోంది?
జీవిత భాగస్వామి ప్రయోజనాలు: భార్యాభర్తలిద్దరూ ఈ పథకానికి అర్హులైతే, వారు విడివిడిగా పెట్టుబడి పెట్టవచ్చు. ఈ విధంగా, 60 ఏళ్ల వయస్సు తర్వాత, కుటుంబం నెలకు మొత్తం రూ. 6,000 పింఛను పొందవచ్చు.
కుటుంబ పింఛను: పింఛను ప్రారంభమైన తర్వాత లబ్ధిదారుడు మరణిస్తే, అతని/ఆమె జీవిత భాగస్వామి పింఛనులో సగం అంటే ప్రతి నెలా రూ. 1,500 పొందడం కొనసాగిస్తారు.
స్కీములో నుంచి మధ్యలోనే వైదొలగవచ్చా?
మీరు ఏ కారణం చేతనైనా పథకం నుండి వైదొలగాలనుకుంటే, ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేక నిబంధనలను ఏర్పాటు చేసింది. మీరు 10 సంవత్సరాల లోపు పథకం నుండి వైదొలిగితే, మీ సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలోని వడ్డీతో పాటు మీ డబ్బు మీకు తిరిగి వస్తుంది. అయితే, మీరు పథకం ప్రారంభించిన 10 సంవత్సరాల తర్వాత, 60 ఏళ్ల వయస్సు రాకముందే పథకాన్ని నిలిపివేస్తే, మీ పెన్షన్ ఫండ్పై వచ్చిన అసలు వడ్డీతో పాటు మీ డబ్బు మీకు వాపసు ఇస్తుంది. మీరు ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఒక వాయిదా చెల్లించడంలో విఫలమైతే, బకాయి ఉన్న మొత్తాన్ని వడ్డీతో పాటు చెల్లించి, దానిని తర్వాత మళ్లీ ప్రారంభించవచ్చు.
అకౌంట్ ఎలా తీసుకోవాలి?
మీ సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ (CSC)ని సందర్శించండి
మీ ఆధార్ కార్డు, మీ బ్యాంకు ఖాతా వివరాలను (పాస్బుక్ లేదా క్యాన్సిల్ చెక్కు వంటివి) మీతో పాటు తీసుకువెళ్లండి.
మొదటి వాయిదా మీ నుండి నగదు రూపంలో తీసుకుంటారు.
తదుపరి వాయిదాల కోసం ఆటో డెబిట్ సౌకర్యం ఉంటుంది.
ఈ పథకంలో పెట్టుబడులు సురక్షితమైనవి, ఎందుకంటే వీటికి కేంద్ర ప్రభుత్వ హామీ ఉంది. అయితే, 60 ఏళ్ల వయస్సు తర్వాత అందే రూ. 3,000 పింఛను మొత్తం స్థిరంగా ఉంటుందని, ద్రవ్యోల్బణంతో పాటు అది పెరగదు.
Also Read: రూ. 500 నోట్లపై ఆర్బీఐ బిగ్ అలర్ట్.. కీలక విషయం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Asian Games Cricket: ఎట్టకేలకు భారత జట్టులోకి వైభవ్ సూర్యవంశీ..ఆసియా క్రీడల్లో సూర్యకుమార్, గిల్కు నో ఛాన్స్!
Mumbai, Maharashtra:Asian Games Cricket Team India: జపాన్ వేదికగా ఈ ఏడాది ప్రతిష్టాత్మక ఆసియా గేమ్స్ను అట్టహాసంగా ప్రారంభించబోతున్నారు. అందుకోసం 30 మంది ఆటగాళ్లతో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) టీమ్ఇండియాను ప్రకటించింది. ఇందులో భాగంగా బీసీసీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మెగా టోర్నీ కోసం 30 మందిని ఎంపిక చేయగా..అందులో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి కూడా చోటుదక్కింది. అయితే టీమ్ఇండియాకు టీ20 ప్రపంచకప్ను అందించిన సూర్యకుమార్ యాదవ్, స్టార్ ప్లేర్ శుభ్మన్ గిల్కు చోటు దక్కకపోవడం గమనార్హం.
జపాన్లోని ఐచి-నగోయా వేదికగా సెప్టెంబరు 19 నుంచి అక్టోబరు 4 వరకు ఆసియా క్రీడలు జరగనున్నాయి. అయితే అదే సమయంలో అనగా సెప్టెంబరు 27 నుంచి అక్టోబరు 17 వరకు స్వదేశంలో వెస్టిండీస్తో వన్డే, టీ20 సిరీస్ ఉన్న కారంణంగా బీసీసీఐ రెండు వేర్వేరు జట్లను బరిలో దించేందుకు సన్నద్ధమైంది.
ప్రస్తుత ఐపీఎల్ 2026 సీజన్లో 16 మ్యాచ్ల్లో ఏకంగా 776 పరుగులు సాధించి దుమ్మురేపిన లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీని సెలెక్టర్లు ఈ ప్రతిష్టాత్మక జాబితాలో చేర్చారు. మరోవైపు వెస్టిండీస్ సిరీస్లో వన్డే జట్టుకు శుభ్మన్ గిల్ కెప్టెన్గా వ్యవహరించనుండటంతో అతనికి ఆసియా క్రీడల జాబితాలో చోటు దక్కలేదు. ఇక 2028 టీ20 ప్రపంచకప్, లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్ రేసులో సూర్యకుమార్ యాదవ్ లేకపోవడంతో, అతడిని ఆసియా క్రీడల జాబితా నుంచి మినహాయించడం గమనార్హం.
కెప్టెన్సీ రేసులో ముగ్గురు ఆటగాళ్లు..
టీ20ల్లో సూర్యకుమార్ యాదవ్ అందుబాటులో లేకపోవడంతో ఆసియా క్రీడల్లో భారత జట్టుకు నాయకత్వం వహించే రేసులో ముగ్గురు ఆటగాళ్లు ముందంజలో ఉన్నారు. శ్రేయస్ అయ్యర్, సంజు శాంసన్, తిలక్ వర్మ వంటి వారు కెప్టెన్సీ రేసులో పోటీ పడుతున్నారు.
గతంలో గాయపడిన పేసర్ హర్షిత్ రాణా పూర్తి ఫిట్నెస్ సాధిస్తాడనే నమ్మకంతో అతడిని అర్ష్దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణలతో పాటు జాబితాలోకి తీసుకున్నారు. జస్ప్రీత్ బుమ్రా పేరు ఈ 30 మందిలో ఉన్నప్పటికీ, వచ్చే ఏడాది జరిగే వన్డే ప్రపంచకప్ దృష్ట్యా అతనికి విశ్రాంతినిచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.
అలాగే స్పిన్ విభాగంలో కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, హర్ష్ దుబే వంటి వారిలో కేవలం ఇద్దరు మాత్రమే ఆసియా క్రీడల్లో ఎంపికవుతారు. మిగిలిన ఇద్దర్ని వెస్టిండీస్ సిరీస్ కోసం ఎంపిక చేసే అవకాశం ఉంది.
ఆసియా క్రీడల కోసం బీసీసీఐ రిలీజ్ చేసిన భారత జట్టు జాబితా ఇదే..
యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రింకు సింగ్, తిలక్ వర్మ, అర్ష్దీప్ సింగ్, జస్ప్రిత్ బుమ్రా, నితీష్ కుమార్ రెడ్డి, ప్రసిద్ధ్ కృష్ణ, వరుణ్ చక్రవర్తి, అనుకూల్ రాయ్, ఆయుష్ బదోని, హర్ష్ దూబే, ధ్రువ్ జురెల్, ఖలీల్ అహ్మద్, రుతురాజ్ గైక్వాడ్, రవి బిష్ణోయ్, షాబాజ్ అహ్మద్, శివం దూబే, విప్రజ్ నిగమ్, హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్.
Also REad: ఐపీఎల్ ఫైనల్లో పక్కా గెలుపు ఆర్సీబీదే! ఈ లెక్కలు చూస్తే నిజం తెలిసిపోతుంది!
Also Read: ఐపీఎల్ ఫైనల్ టికెట్ ధర ఒక్కొక్కటి రూ.2,20,000 మాత్రమే..ఖంగుతిన్న క్రికెట్ ఫ్యాన్స్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Hyper Aadi Marriage: స్టార్ యాంకర్తో హైపర్ ఆది పెళ్లి..ఎట్టకేలకు పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన స్టార్ కమెడియన్!
Hyderabad, Telangana:Hyper Aadi Varshini Marriage: తెలుగు బుల్లితెరపై తనదైన కామెడీ టైమింగ్, పంచ్ డైలాగ్లతో తిరుగులేని గుర్తింపు సంపాదించుకున్న కమెడియన్ హైపర్ ఆది. జబర్దస్త్ వేదికగా కెరీర్ ప్రారంభించి, ప్రస్తుతం టెలివిజన్ షోలు, సినిమాలతో బిజీగా ఉన్న ఆది కెరీర్ ఎంత హాట్ టాపికో.. ఆయన వ్యక్తిగత జీవితం, ముఖ్యంగా పెళ్లి గురించిన వార్తలు అంతే ఆసక్తికరంగా మారుతుంటాయి.
గతంలో యాంకర్ వర్షిణితో పాటు పలువురు నటీమణులతో ఆది పెళ్లి అంటూ సోషల్ మీడియాలో రకరకాల పుకార్లు షికార్లు చేశాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న హైపర్ ఆది, తన పెళ్లిపై వస్తున్న రూమర్లకు ఫుల్ స్టాప్ పెడుతూనే, అసలు తాను ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడనే విషయంపై సంచలన వ్యాఖ్యలు చేశాడు.
ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న కొన్ని సంఘటనలు చూస్తుంటే పెళ్లి అంటేనే భయం వేస్తోందని ఆది సంచలన నిజం పంచుకున్నాడు. "పెళ్లి అనేది కేవలం ఇద్దరు వ్యక్తుల కలయిక మాత్రమే కాదు. అది జీవితాంతం కొనసాగే ఒక పెద్ద బాధ్యత. అందుకే తొందరపడి నిర్ణయం తీసుకోకూడదు, జీవిత భాగస్వామిని ఎన్నుకునే విషయంలో ఎంతో ఆలోచన అవసరం" అని ఆది పేర్కొన్నాడు.
తన చిన్ననాటి రోజుల ప్రేమ గురించి కూడా మాట్లాడుతూ.. అప్పట్లో ఫోన్లు, సోషల్ మీడియా లేవని, కేవలం చూపులతోనే అమాయకమైన, స్వచ్ఛమైన ప్రేమ ఉండేదని గుర్తుచేసుకున్నాడు. తాను ఒక మంచి భర్తగా మారడానికి, తనలో కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉండాలని భావించిన తర్వాతే పెళ్లి పీటలు ఎక్కుతానని ఆది స్పష్టం చేశాడు. ఆయనకు ఉండాల్సిన ఆ క్వాలిటీస్ ఏంటంటే.. కోపాన్ని తగ్గించుకుని, ఓపికగా ఉండటం నేర్చుకోవాలి. స్వయంగా కష్టపడి కుటుంబాన్ని పోషించగలగాలి. ఇంటి సమస్యలను రచ్చకెక్కించకుండా, నాలుగు గోడల మధ్యే పరిష్కరించుకోవాలి. భార్య భావాలను గౌరవిస్తూ, ఆమెకు భర్తగానే కాకుండా ఒక మంచి స్నేహితుడిలా, కుటుంబ సభ్యుడిలా తోడుండాలి.
గతంలో యాంకర్ వర్షిణితో పెళ్లి అంటూ వచ్చిన వార్తల్లో ఎలాంటి నిజం లేదని, అవన్నీ కేవలం ఊహాగానాలేనని ఈ వ్యాఖ్యలతో తేలిపోయింది. ప్రస్తుతం కెరీర్పైనే పూర్తి దృష్టి పెట్టిన హైపర్ ఆది, తనకు తాను పెట్టుకున్న ఈ జీవిత ప్రమాణాలు, విలువలు నెరవేరినప్పుడే సరైన సమయం చూసి పెళ్లి చేసుకుంటానని క్లారిటీ ఇచ్చాడు. దీంతో "హైపర్ ఆది పెళ్లి ఎప్పుడు?" అనే ప్రశ్నకు ప్రస్తుతానికైతే సమాధానం దొరకలేదు కానీ, పెళ్లి పట్ల ఆయనకున్న బాధ్యతాయుతమైన ఆలోచనలు మాత్రం ఇప్పుడు అభిమానులను తెగ ఆకట్టుకుంటున్నాయి.
Also REad: బాలకృష్ణ చిన్న కూతురు ఒక్క వీడియోతో పాపులర్..ఆమె గురించి ఈ విశేషాలు తెలుసా?
Also Read: "నువ్వు హీరోయిన్ ఏంటి..ముఖం అద్దంలో చూస్కో" అన్నోళ్లే లేచి మరీ చప్పట్లు కొడుతున్నారు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
8th CPC Jobs: రాత పరీక్ష లేకుండానే నెలకు రూ.1,80,000 జీతం..కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కొన్ని రోజులే ఛాన్స్!
Hyderabad, Telangana:8th Central Pay Commission Jobs: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఓ అద్భుత అవకాశం వచ్చింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల వేతనాలు, అలవెన్సులు, పెన్షన్ వ్యవస్థలో కీలక మార్పులకు మార్గదర్శకంగా నిలిచే 8వ సెంట్రల్ పే కమిషన్ (8వ వేతన సంఘం) లో కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.
ప్రభుత్వ విధానాల రూపకల్పనలో భాగస్వామ్యం కావాలనుకునే వారికి ఇది అరుదైన అవకాశం. ఈ పోస్టులకు ఎటువంటి రాత పరీక్ష లేదు, కేవలం ఇంటర్వ్యూ ద్వారానే ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులు నెలకు రూ.90,000 నుండి రూ.1.80 లక్షల వరకు వేతనం పొందే అవకాశం ఉంది.
ఖాళీల వివరాలు, వయోపరిమితి
ఈ నియామకాలు కాంట్రాక్ట్ ప్రాతిపదికన జరుగుతాయి. ఫైనాన్స్, హ్యూమన్ రిసోర్స్, ఇండస్ట్రియల్ రిలేషన్స్, లీగల్ రీసెర్చ్ వంటి విభాగాల్లో నిపుణులను కింది పోస్టుల ద్వారా భర్తీ చేయనున్నారు. సీనియర్ కన్సల్టెంట్ విభాగంలో 10 ఉద్యోగాలు 10 ఏళ్ల అనుభవంతో 45 ఏళ్లు గరిష్ట వయసుగా నిర్ణయించారు. ఈ ఉద్యోగానికి నెలకు రూ.1,80,000 జీతం ఇస్తారు. అలాగే కన్సల్టెంట్ విభాగంలో 5 పోస్టు ఉండగా వారికి కనీసం 6 ఏళ్ల అనుభవంతో 40 ఏళ్లు గరిష్ట వయసుగా నిర్ణయించగా.. ఈ ఉద్యోగానికి నెలకు రూ.1,20,000 జీతం అందించనున్నారు. చివరిగా యంగ్ ప్రొఫెషనల్ విభాగంలో 10 ఖాళీలు ఉండగా.. వారికి కనీసం 4 ఏళ్ల అనుభవంతో గరిష్టంగా 32 ఏళ్ల వయసు ఉండాలి. ఇందులో ఎంపికైన వారికి నెలకు రూ.90,000 జీతం అందిస్తారు.
అలాగే పార్ట్టైమ్ అభ్యర్థులకు వారు పనిచేసిన రోజుల ప్రాతిపదికన చెల్లింపు ఉంటుంది. అయితే వీరికి DA, HRA, ట్రావెల్ అలవెన్స్, మెడికల్ రీయింబర్స్మెంట్ వంటి అదనపు ప్రభుత్వ ప్రయోజనాలు వర్తించవు.
అర్హతలు ఇవే..
ఫైనాన్స్, ఎకనామిక్స్, హ్యూమన్ రిసోర్స్, పబ్లిక్ పాలసీ, ఇండస్ట్రియల్ రిలేషన్స్ లేదా సంబంధిత విభాగాల్లో మాస్టర్స్ డిగ్రీ / MBA (Finance/HR) లేదా LLB/న్యాయశాస్త్రంలో ఉన్నత విద్య అభ్యసించి ఉండాలి. పే స్ట్రక్చర్, సర్వీస్ రూల్స్, పెన్షన్ వ్యవస్థ, ప్రభుత్వ పరిపాలన రంగాల్లో అనుభవం ఉన్న వారికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది.
అవసరమైన సాంకేతిక నైపుణ్యాలు..
పైన పేర్కొన్న రంగాల్లో అనుభవంతో పాటు కంప్యూటర్ నైపుణ్యాలైన.. MS Excel, Spreadsheet Analysis, PowerPoint Presentations, Data Interpretation, Policy Analysis, Financial Modelling, లీగల్ రీసెర్చ్లో పట్టు ఉండాలి.
ఈ ఉద్యోగాల బాధ్యతలు ఏమిటంటే?
కేంద్ర ఉద్యోగుల వేతన నిర్మాణాలు, అలవెన్సులు మరియు పెన్షన్ వ్యవస్థపై అధ్యయనం & విశ్లేషణతో పాటు అంతర్జాతీయ పే స్ట్రక్చర్లతో పోలికలు, వ్యయ ప్రభావ అంచనాలు రూపొందించడం వంటివి ఉన్నాయి. డేటా ఆధారిత విధాన నివేదికల తయారీ, ప్రభుత్వానికి కీలక సిఫార్సులు అందించడం వంటి ప్రక్రియలో భాగం కావాల్సి ఉంటుంది.
ఉద్యోగాల ఎంపిక ప్రక్రియ..
ఈ పోస్టులకు ఎలాంటి రాత పరీక్ష ఉండదు. ఎంపిక ప్రక్రియ పూర్తిగా కింది దశల్లో జరుగుతుంది. దరఖాస్తుల పరిశీలన (అర్హతలు, అనుభవం ఆధారంగా) చేసిన తర్వాత సరైన అభ్యర్థులను షార్ట్లిస్టింగ్ చేసి నేరుగా ఇంటర్వ్యూకి పంపిస్తారు. ఈ ప్రక్రియలో చివరిగా.. డాక్యుమెంట్ వెరిఫికేషన్ పూర్తవ్వగానే తుది ఎంపిక లిస్టు విడుదల చేస్తారు.
ఎలా దరఖాస్తు చేసుకోవాలి!
దరఖాస్తు ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్లోనే ఉంటుంది. ఆఫ్లైన్ దరఖాస్తులు స్వీకరించరు. తొలుత 8వ సెంట్రల్ పే కమిషన్ అధికారిక వెబ్సైట్ను సందర్శించండి. అందులో మీ వ్యక్తిగత వివరాలతో రిజిస్టర్ చేసుకోండి. విద్యా అర్హతలు, ఉద్యోగ అనుభవ వివరాలను తప్పులు లేకుండా నమోదు చేయండి. అవసరమైన సర్టిఫికెట్లను, పత్రాలను అప్లోడ్ చేసి.. డిక్లరేషన్ను అంగీకరించి, ఫారమ్ను సబ్మిట్ చేయాలి. అర్హత, ఆసక్తి గల నిపుణులు ఈ సువర్ణ అవకాశాన్ని వినియోగించుకోవడానికి వెంటనే అప్లై చేసుకోండి!
Also REad: ఏకంగా 11 రోజులు బ్యాంకులకు సెలవు..ఈ రోజుల్లో బ్యాంకులకు వెళ్లకపోవడమే మంచిది!
Also REad; 'ఆపరేషన్ సింధూర్ 2.0'కి త్రివిధ దళాలు రెడీ..ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది కీలక ప్రకటన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Telangana Free Bus: మహిళలకు అలర్ట్..ఇకపై ఆర్టీసీ బస్సుల్లో టికెట్టుకు ఆధార్ కార్డు చెల్లదు!
Hyderabad, Telangana:Mahalakshmi Smart Card: మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకంలో తెలంగాణ ప్రభుత్వం తాజాగా కొన్ని కీలక మార్పులు చేసింది. ఇంతకుముందు ఉచిత టికెట్ కోసం మహిళలు ఆధార్ కార్డు చూపిస్తే సరిపోతుంది. కానీ, జూన్ 2 నుంచి బస్సులో ఉచితంగా ప్రయాణించాలంటే స్మార్ట్ కార్డు తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.Balka Suman Arrest: బాల్క సుమన్ అరెస్టుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం!
Hyderabad, Telangana:KTR On Balka Suman Arrest: భారత రాష్ట్ర సమితి పార్టీ కీలక నేత బాల్క సుమన్ను నేడు తెలంగాణ పోలీసులు అరెస్టు చేశారు. బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో ఉన్న సుమన్ను అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. సింగరేణిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కారణంగా అతని పోలీసు కేసు నమోదవ్వడంతో అతడని అరెస్టు చేసి పోలీసులు నాంపల్లి కోర్టుకు తరలించారు. దీనిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ స్పందించారు.Tirumala Darshan: తిరుమల దర్శనానికి భారీ రద్దీ.. రేపు కొండపైకి రాకపోవడమే మంచిది
Tirupati Urban, Andhra Pradesh:Tirumala Devotees Rush: తిరుమలలో భక్తుల రద్దీ ఊహించని స్థాయిలో పెరుగుతోంది. వేసవి సెలవులు ముగిసిపోతుండడంతో ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుమలను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. వేసవి సెలవులకు తోడు వరుసగా సెలవులు లభించడంతో భక్తులు తిరుమలకు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. తిరుమల గిరులు భక్తజన సంద్రంతో నిండిపోయాయి. ఎటు వైపు చూసినా భక్తులు తండోపతండాలుగా కనిపిస్తున్నారు. దీంతో రేపు ఆదివారం కొండపైకి మరింత తీవ్ర స్థాయిలో రద్దీ కొనసాగే అవకాశం ఉంది.
Also Read: Tirumala: తిరుమల భక్తులకు భారీ శుభవార్త.. ఉచిత బస్సుకు మరో కానుక
వేసవి సెలవులు, వారాంతపు సెలవులు కావడంతో వైకుంఠనాథుడిని దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. కాలినడక మార్గం, రోడ్డు మార్గాల ద్వారా భక్తులు తిరుమలకు పోటెత్తుతున్నారు. దీంతో కొండపై వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని 31 కంపార్టుమెంట్లు పూర్తిగా నిండిపోయి.. క్యూలైన్లు వెలుపలికి వచ్చేశాయి. శ్రీవారి ఉచిత దర్శనానికి ఏకంగా 24 గంటల సమయం పడుతోంది.
తిరుమల గిరులు గోవింద నామస్మరణతో మారుమోగుతున్నాయి. శని, ఆదివారాలు.. వారాంతపు సెలవులు కావడంతో భక్తుల తాకిడి ఊహించని స్థాయిలో పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని మొత్తం 31 కంపార్టుమెంట్లు భక్తులతో పూర్తిగా నిండిపోయాయి. క్యూలైన్లు కాంప్లెక్స్ వెలుపలకి వచ్చి కిలోమీటర్ల మేర భక్తులతో నిండిపోయాయి. నారాయణగిరి ఉద్యానవనంలో ఉన్న షెడ్లన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. భక్తుల సంఖ్య గంటగంటకు పెరుగుతుండడంతో ఆందోళనకర పరిస్థితి ఏర్పడింది. అక్కడ నుంచి క్యూలైన్ ఏటీసీ గుండా.. కృష్ణతేజ సర్కిల్ మీదుగా ఏకంగా శిలాతోరణం రహదారి వరకు భక్తులు వరుసలో వేచి ఉన్నారు.
Also Read: IPL 2026: చాంపియన్ రేసులో గుజరాత్ టైటాన్స్.. వైభవ్ పోరాడినా రాజస్థాన్కు నిరాశ
భక్తుల రద్దీ
ప్రస్తుత పరిస్థితుల్లో శ్రీవారి సర్వదర్శనం (ఉచిత దర్శనం) కోసం వేచి ఉన్న భక్తులకు దాదాపు 24 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం రూ.300 టికెట్లు, స్లాటెడ్ సర్వ దర్శనం కలిగిన భక్తులకు దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఎప్పటికప్పుడు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. క్యూలైన్లలో గంటల కొద్దీ సమయం వేచి ఉన్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిరంతరాయంగా అన్నప్రసాదాలు, తాగునీరు, చల్లని మజ్జిగను పంపిణీ చేస్తున్నారు. టీటీడీ తీసుకుంటున్న ఈ చర్యలతో క్యూలైన్లలో ఉన్న భక్తులకు తీవ్ర ఎండ, అలసట నుంచి ఉపశమనం లభిస్తోంది.
దర్శనానికి ఇలా ఉండగా.. గదులు, లాకర్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. తిరుమలలో గదులకు తీవ్ర కొరత ఏర్పడింది. భక్తుల సంఖ్య లక్షకు చేరడంతో గదులన్నీ బుక్ అయిపోయాయి. గదులు దొరకని వేలాది మంది భక్తులు తిరుమలలోని పార్కులు, ఓపెన్ షెడ్లలోనే తలదాచుకుంటున్నారు. ఈ రద్దీ మరో వారం పాటు ఉండే అవకాశం ఉంది. పరిస్థితి మరికొన్ని రోజులు ఇలాగే కొనసాగే అవకాశం ఉందని టీటీడీ అధికారులు అంచనా వేస్తున్నారు. దీనికి అనుగుణంగా భక్తులకు కల్పించాల్సిన మౌలిక వసతులపై టీటీడీ ఉన్నతాధికారులు నిరంతరం సమీక్షిస్తున్నారు. దర్శనంతోపాటు టీటీడీ సేవల కోసం భక్తులు ఓపిక.. సంయమనంతో వ్యవహరించి.. తమకు సహకరించాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది.
Jagtial: జగిత్యాలలో త్వరలోనే SIR ప్రారంభం.. జూన్ 15 నుంచి బీఎల్వోలకు ప్రత్యేక శిక్షణ!
Jagtial, Telangana:Jagtial Voter List Special Revision 2026: జగిత్యాల జిల్లాలోని ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియను అత్యంత పారదర్శకంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. భారత ఎన్నికల సంఘం ఆదేశాలకు మేరకు ఓటర్ల జాబితాను పకడ్బందీగా రూపొందించేందుకు అధికారులు కసరత్తును ప్రారంభించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించడంతోపాటు.. జాబితాలో ఉన్న తప్పులను సరిదిద్దుకోవడమే లక్ష్యంగా ఈ ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారు. అంతేకాకుండా అర్హులైన వారికి ప్రత్యేకమైన ఓటర్ గుర్తింపు కార్డును కూడా అందించే ప్రక్రియను అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశాలున్నట్లు కూడా తెలుస్తోంది..
డిజిటలైజ్ ప్రక్రియ..
ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా బూత్ స్థాయి అధికారులు 2002తో పాటు 2026 ఓటరు జాబితాల మ్యాపింగ్ పనుల్లో నిమగ్నమైనట్లు సమాచారం.. పాత ఓటరు జాబితాలను.. ప్రస్తుతం తాజా జాబితాలతో సరిపోల్చుతూ.. ఎక్కడైనా లోపాలు ఉన్నాయా? ఓటర్ల విభజన సరిగ్గా జరిగిందా? లేదా అనే అంశాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. పోలింగ్ కేంద్రాల వారీగా ఓటర్ల వివరాలను డిజిటలైజ్ చేసే ప్రక్రియను వేగవంతం చేస్తున్నట్లు సమాచారం..
జూన్ 15 నుంచి శిక్షణా కార్యక్రమాలు..
ఈ భారీ ప్రక్రియను ఎలాంటి పొరపాట్లు లేకుండా నిర్వహించేందుకు వీలుగా క్షేత్రస్థాయి సిబ్బందితో పాటు బీఎల్వోలకు అధికారులు ప్రత్యేకమైన శిక్షణను అందించబోతున్నట్లు తెలుస్తోంది. జూన్ 15వ తేదీ నుంచి జూన్ 24వ తేదీ వరకు వివిధ విడుదల్లో ఈ ప్రత్యేకమైన శిక్షణ కార్యక్రమాలు కొనసాగబోతున్నట్లు సమాచారం. అంతేకాకుండా ఓటర్ల నమోదు తో పాటు మార్పులు చేర్పులు, సాంకేతిక యాపుల వినియోగంపై సిబ్బందికి ఈ శిక్షణలో భాగంగా పూర్తిస్థాయి అవగాహన కల్పించబోతున్నట్లు తెలుస్తోంది..
సర్వే ప్రారంభ తేది..
జూన్ 25వ తేదీ నుంచి నెలరోజులపాటు ఇంటింటి సర్వే శిక్షణ పూర్తి కాగానే.. అసలైన ప్రక్రియ ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. జూన్ 25 నుంచి జూలై 24 వరకు నెల రోజులపాటు బీఎల్వోలు జిల్లా వ్యాప్తంగా ప్రతి ఇంటినీ సందర్శించి సర్వే నిర్వహించబోతున్నారు. ఈ ఇంటింటి సర్వేలో భాగంగా ఓటర్ల వివరాలను క్షేత్రస్థాయిలో నమోదు చేసుకోబోతున్నట్లు సమాచారం.
Also Read: Telangana Heat Waves: తెలంగాణలో మరింత తీవ్రంగా ఎండలు.. బయటకు వెళ్లాలంటే భయపడే పరిస్థితి..
జగిత్యాల జిల్లా ఓటర్ల సంఖ్య..
ఒకే ఇంట్లో ఉంటూ వేర్వేరు పోలింగ్ కేంద్రాలలో ఓట్లు ఉన్న వారిని గుర్తించడంతోపాటు మరణించిన వారి పేర్లు, శాశ్వతంగా వలస వెళ్లిన వారి పేర్లను జాబితా నుంచి తొలగించడం, కొత్తగా 18 ఏళ్లు నిండిన యువతి యువకులను ఓటర్లుగా నమోదు చేయడం వంటి పనులను ఈ సర్వేలోనే పూర్తి చేయబోతున్నట్లు సమాచారం. ప్రస్తుత గణాంకాల ప్రకారం జగిత్యాల జిల్లాలో మొత్తం.. 7 లక్షలకు మందికి పైగా ఓటర్లు ఉన్నట్లు అధికారులు వెల్లడించినట్లు తెలుస్తోంది. ఈ ప్రత్యేక సవరణ ప్రక్రియ ముగిసిన అనంతరం తుది ఓటరు జాబితాను ప్రకటిస్తామని.. ప్రజలందరూ బీఎల్వోల సర్వేకు సహకరించాలని అధికారులు కోరినట్లు సమాచారం..
Also Read: Telangana Heat Waves: తెలంగాణలో మరింత తీవ్రంగా ఎండలు.. బయటకు వెళ్లాలంటే భయపడే పరిస్థితి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
