ఖమ్మం: విషపు నీటిని తాగి గొర్రెల మృతి
Khammam, Telangana:విషపు నీరు తాగి 20 గొర్రెలు మృతి చెందగా మరో 150 గొర్రెలు అస్వస్థతకు గురైన ఘటన ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం లంకాసాగర్ క్రాస్ రోడ్ వద్ద జరిగింది. రామచంద్రాపురం గ్రామానికి చెందిన బోలే రాంబాబుకు చెందిన 200 గొర్రెలను క్రాస్ వద్ద మేపుతున్నాడు. అయితే సింగరేణి నుండి వచ్చే విష రసాయనాలను సమీపంలోని గుంతల్లో డంప్ చేస్తున్నారు. నీటి కోసం వెళ్లిన గొర్రెలు వాటిని తాగి అస్వస్థతకు గురై చనిపోయినట్లు తెలుస్తుంది.हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
Janhvi Kapoor: తెలుగు ప్రేక్షకులు దేవుడితో సమానం.. అమ్మ శ్రీదేవి ఇదే చెప్పేది: హీరోయిన్ జాన్వీ కపూర్
Vijayawada, Andhra Pradesh:Peddi Movie Pre Release Event: రామ్ చరణ్తో కలిసి పెద్ది సినిమాతో తెలుగు ప్రేక్షకులను థియేటర్లలో కలిసేందుకు వస్తున్న నటి జాన్వీ కపూర్ తెలుగు ప్రేక్షకులపై ప్రశంసలు కురిపించారు. తెలుగు ప్రేక్షకులు చూపిస్తున్న ప్రేమకు చాలా సంతోషంగా ఉందని.. ఈ ప్రేమే తాము రోజు రాత్రి కష్టపడి పని చేయడానికి బలాన్ని ఇస్తుందని చెప్పారు. తెలుగు ప్రేక్షకులు దేవుడితో సమానం అని తన తల్లి శ్రీదేవి చెప్పిన మాటలను జాన్వీ కపూర్ పునరుద్ఘాటించారు.
Also Read: Ram Charan: అభిమానుల కోసం రక్తం చిందించి పనిచేస్తా.. రామ్ చరణ్ భావోద్వేగం
విజయవాడలో సోమవారం జరిగిన పెద్ది సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో సినీ నటుడు రామ్ చరణ్తో కలిసి పాల్గొన్న జాన్వీ కపూర్ కొన్ని విషయాలపై మాట్లాడారు. 'పెద్ది సినిమాలో ముఖ్యమైన మెసేజ్ ఏంటంటే.. మీ ఐడెంటిటీని, మీ జీవితానికి ఉన్న అర్థాన్ని కనుక్కోవడం. తన ఐడెంటిటీ ఈ భూమితో, ఇక్కడి ప్రేక్షకులతో ఎంతో లోతుగా కనెక్ట్ అయి ఉంది' అని తెలిపారు. 'సినిమా విడుదల కాకముందే నాకు చాలా విషయాలను ఇచ్చింది. రామ్ చరణ్తో కలిసి పనిచేసే అద్భుతమైన అవకాశం లభించింది. ఆయన ఒక అద్భుతమైన వ్యక్తి. అద్భుతమైన నటుడు' అని రామ్ చరణ్పై జాన్వీ కపూర్ ప్రశంసలు కురిపించారు.
'దర్శకుడు బుచ్చిబాబు నాకు తెలిసిన అత్యంత ప్యాషనేట్ డైరెక్టర్. డీఓపీ రాండీ, సంగీత లెజెండ్ ఏఆర్ రెహమాన్, ప్రొడ్యూసర్ సతీష్, ప్రవీణ్తో కలిసి పనిచేయడం అద్భుతమైన అనుభవం' అని జాన్వీ కపూర్ తెలిపారు. 'తెలుగు ప్రేక్షకులు, సినిమా గురించి అమ్మ (శ్రీదేవి) ఎప్పుడూ ఒక మాట చెప్పేవారని గుర్తుచేసుకున్నారు. తెలుగు ప్రేక్షకులు దేవుడితో సమానం అని అమ్మ ఎప్పుడూ చెప్పేవారు. తెలుగు ప్రేక్షకులు ఇచ్చే ప్రేమే నాకు సర్వస్వం' అని జాన్వీ పేర్కొన్నారు.
Also Read: Govt Employees: తెలంగాణ ఉద్యోగులకు మళ్లీ షాక్.. బదిలీలపై ప్రభుత్వం కీలక నిర్ణయం
ప్రసంగం అనంతరం యాంకర్ సుమ హీరోయిన్ జాన్వీని కొన్ని ప్రశ్నలు అడిగారు. దర్శకుడు బుచ్చిబాబును 'రౌడీ డైరెక్టర్' అని ఎందుకు అన్నారని ప్రశ్నించగా.. 'ఆయన (బుచ్చిబాబు) ప్రతి టేక్ అయిపోయాక అదిరిపోయింది అమ్మా.. అదిరిపోయింది. కానీ మళ్లీ ఒకసారి టేక్' అని జాన్వీ కపూర్ వివరించారు. ఫస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చి వెంటనే ఇంకో టేక్ అడిగేవారని సరదాగా ఆయనను ఇమిటేట్ చేసి జాన్వీ చూపించారు. చిరంజీవి, శ్రీదేవి నటించిన ఐకానిక్ సినిమా 'జగదేక వీరుడు అతిలోక సుందరి'లోని డైలాగ్ను జాన్వీ కపూర్ చెప్పారు. 'ఓ మానవా.. ఒక్కసారి నా చెయ్యి పట్టుకోవా' అని చెప్పడంతో ప్రేక్షకులు కేకలు వేశారు.
ఈ వేడుకకు హాజరైన నటుడు జగపతి బాబు ప్రసంగిస్తూ.. '1962లో విజయవాడలోని బెంజ్ సర్కిల్ దగ్గర ఉన్న సరోజిని దేవి హాస్పిటల్లోనే నేను పుట్టా. గవర్నర్పేటలో ముంతకింద పప్పు తింటూ, సెలవులన్నీ ఇక్కడే గడిపా' అని గుర్తుచేసుకున్నారు. పెద్ది సినిమా పరిశ్రమకు.. డిస్ట్రిబ్యూటర్స్కు, ఎగ్జిబిటర్స్కు ఒక పెద్ద దిక్కు అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అరవింద సమేత తర్వాత దాదాపు ఎనిమిదేళ్లకు తనకు ఈ సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ దొరికిందని.. ఇందులో తాను 'అప్పలసూరి' పాత్ర చేస్తున్నా. ఇది నా కెరీర్లోనే ఉత్తమ పాత్ర అవుతుంది' అని తెలిపారు. 'రామ్ చరణ్ ఈ సినిమాలో తన మెగా పవర్ ఏమిటో చూపిస్తాడు. సినిమాలో ప్రతి షాట్ సిక్సర్లా ఉంటుంది.
Also Read: IPL Final Highlights: గుజరాత్ టైటాన్స్ ఓటమి.. ఐపీఎల్ 2026 చాంపియన్ బెంగళూరు
Ram Charan: అభిమానుల కోసం రక్తం చిందించి పనిచేస్తా.. రామ్ చరణ్ భావోద్వేగం
Vijayawada, Andhra Pradesh:Peddi Movie Release Event: 'ఒక నటుడిగా ఎన్నో కథలు వింటూ ఉంటాం.. కొన్ని నచ్చుతాయి.. కొన్ని ఆశ్చర్యపరుస్తాయి. కానీ 'పెద్ది' కథ విన్నప్పుడు మాత్రం అది గుండెకు హత్తుకుంది' అని సినీ నటుడు రామ్ చరణ్ తెలిపారు. 'మా నాన్న (చిరంజీవి) చెప్పినట్టు ఇలాంటి కథ పది సంవత్సరాలకు ఒకసారి మాత్రమే వస్తుంది. అలాంటి కథ నా వద్దకు వచ్చినందుకు దర్శకుడు బుచ్చిబాబు గురువు సుకుమార్, బుచ్చిబాబుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇది నా జీవితకాల సినిమా లైబ్రరీలో టాప్ ఫిలిమ్స్లో ఒకటిగా నిలిచిపోతుంది' అని రామ్ చరణ్ తెలిపారు.
Also Read: Govt Employees: తెలంగాణ ఉద్యోగులకు మళ్లీ షాక్.. బదిలీలపై ప్రభుత్వం కీలక నిర్ణయం
బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన పెద్ది సినిమా జూన్ 4వ తేదీన థియేటర్లలో విడుదల కాబోతుండగా.. ప్రీ రిలీజ్ వేడుక విజయవాడలో జరిగింది. ఈ సభలో అభిమానులను ఉద్దేశించి రామ్ చరణ్ కీలక ప్రసంగం చేశారు. 'విజయవాడలో వాతావరణం చూస్తుంటే ఇది ప్రీ-రిలీజ్ ఫంక్షన్లా లేదు.. అప్పుడే సక్సెస్ మీట్ చేస్తున్నట్లుగా ఉంది. విజయవాడ అనేది మా కుటుంబానికి ఎంతో లక్కీ సిటీ. గతంలో 'ఇంద్ర', 'ఖైదీ నెంబర్ 150' వేడుకలు కూడా ఇక్కడే జరిగాయి. ఆ లక్ కోసమే మళ్లీ ఇక్కడికి వచ్చాం' అని రామ్ చరణ్ గుర్తుచేశారు.
'ఇది ఒక సినిమా స్టోరీ కాదు, కింద పడిపోయిన ఒక మనిషి మళ్లీ లేచి ఎలా నిలబడ్డాడనే ఒక వ్యక్తి అద్భుతమైన ప్రయాణం. గతంలో నాకు'మగధీర', 'రంగస్థలం', 'ఆర్ఆర్ఆర్' సినిమాలు చేస్తున్నప్పుడు ఎలాంటి అద్భుతమైన ఫీలింగ్, అనుభవం కలిగిందో.. మళ్లీ అంతటి భావం ఈ పెద్ది సినిమా చేస్తున్నప్పుడు కలిగింది' అని రామ్ చరణ్ తెలిపారు. బుచ్చిబాబు ఈ కథను రాసుకున్న విధానం చూసి ఆశ్చర్యపోయానని.. భవిష్యత్లో ఇండియాలోనే టాప్ 3 లేదా 4 డైరెక్టర్ల జాబితాలో బుచ్చిబాబు పేరు కచ్చితంగా ఉంటుందని జోష్యం చెప్పారు.
Also Read: IPL Final Highlights: గుజరాత్ టైటాన్స్ ఓటమి.. ఐపీఎల్ 2026 చాంపియన్ బెంగళూరు
తాను అభిమానుల కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధమని రామ్ చరణ్ ప్రకటించారు. తాను ఇటువంటి సినిమాలు ఒప్పుకోవడానికి కారణం అభిమానులే.. వారి ఇచ్చే ఉత్సాహం.. ప్రోత్సాహంతోనే సినిమాలు చేస్తున్నట్లు చెప్పారు. అభిమానుల కోసం చేతులు ఇరగ్గొట్టుకోవడమే కాదు రక్తం చిందించి అయినా పని చేస్తానని భావోద్వేగానికి లోనయ్యారు. చిరంజీవి కొడుకుగా పుట్టి, పవన్ కల్యాణ్ నీడలో పెరిగిన తనకు సినిమా తప్ప ఇంకేమీ తెలియదని తెలిపారు. తాను చనిపోయే వరకు ప్రేక్షకులను అలరిస్తూ.. వారికి వినోదం అందిస్తూనే ఉంటానని హామీ ఇచ్చారు. 'ఈ చిత్రానికి కెమెరామెన్గా పనిచేసిన రత్నవేలుతో నాకు నాలుగో సినిమా. జాన్వీ కపూర్ శ్రీదేవి కంటే గొప్ప నటి కావాలి' అని రామ్ చరణ్ ఆకాంక్షించారు. జూన్ 4వ తేదీన అందరూ థియేటర్లో తప్పకుండా చూడాలని రామ్ చరణ్ కోరారు.
Zee Media: ఫిఫా ప్రపంచకప్ -2026 ప్రసార హక్కులు దక్కించుకున్న 'జీ' మీడియా
Barcelona, Catalunya:Zee Media Enterprises: అత్యంత ప్రజాదరణ పొందిన క్రీడా సంబరం ఫుట్బాల్ ప్రపంచకప్ ఈనెలలో జరగనుంది. ఫిఫా ప్రపంచ కప్ 2026కు మూడు దేశాలు ఆతిథ్యం ఇస్తుండగా ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారాలు జీ మీడియాలో ప్రసారం కానున్నాయి. ఫిఫా ప్రపంచ కప్ మ్యాచ్ల ప్రసారానికి సంబంధించిన హక్కులు జీ మీడియా దక్కించుకుంది. జీ మీడియా ఎంటర్ప్రైజెస్ ఫీఫా ప్రపంచ కప్ 2026 హక్కులను జీ మీడియా దక్కించుకోగా.. ఈనెల నుంచి ప్రసారం కానున్నాయి. ప్రపంచ కప్ మ్యాచ్లు జూన్ 11వ తేదీన అమెరికా, మెక్సికో, కెనడాలో జరగనున్నాయి.
Also Read: Govt Employees: తెలంగాణ ఉద్యోగులకు మళ్లీ షాక్.. బదిలీలపై ప్రభుత్వం కీలక నిర్ణయం
జీ మీడియా ఎంటర్ప్రైజెస్ 2026 ఫిఫా ప్రపంచ కప్ ప్రసార హక్కులను పొందింది. ఈ టోర్నమెంట్ జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ కొత్త స్పోర్ట్స్ ఛానల్ 'యునైట్8 స్పోర్ట్స్'లో ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. ఈ ప్రపంచ కప్ మ్యాచ్లు 'జీ5' ఓటీటీ ప్లాట్ఫామ్లో కూడా ప్రత్యక్షంగా ప్రసారం కానుండడం విశేషం. ఐపీఎల్ సంబరం ముగిసిన అనంతరం జరుగుతున్న ప్రపంచ క్రీడా సంబరం ఫుట్బాల్ ప్రపంచకప్కు సమయం ముంచుకొస్తోంది.
ప్రపంచ కప్ మ్యాచ్లు జూన్ 11వ తేదీన అమెరికా, మెక్సికో, కెనడాలలో జరగనున్నాయి. ప్రపంచ కప్ ఫుట్బాల్కు అత్యున్నత పాలకమండలి ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డి ఫుట్బాల్ అసోసియేషన్, ఫీఫాల మధ్య ఈ ఒప్పందం కుదిరింది. జీ మీడియా ఇప్పుడు 2034 వరకు ప్రధాన ఫీఫా టోర్నమెంట్లు, సంబంధిత డాక్యుమెంటరీల ప్రసార హక్కులను పొందాయి. వీటిలో 2026 ఫిఫా ప్రపంచకప్ మాత్రమే కాకుండా 2026, 2030 పురుషుల ప్రపంచ కప్లు, 2027 మహిళల ప్రపంచ కప్ కూడా ఉండడం విశేషం. దీనికి అదనంగా అండర్-17, అండర్-20 పురుషుల, మహిళల ప్రపంచ కప్లు, ఫుట్బాల్ ప్రపంచ కప్లు, ఇంటర్కాంటినెంటల్ కప్లు కూడా జీ మీడియాలో అందుబాటులో ఉంటాయి.
Also Read: IPL Final Highlights: గుజరాత్ టైటాన్స్ ఓటమి.. ఐపీఎల్ 2026 చాంపియన్ బెంగళూరు
జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ ఉత్తర అమెరికాలో జరగబోయే వేసవి ఫుట్బాల్ ఈవెంట్తో ప్రారంభించి 2026 నుంచి 2034 వరకు ఎనిమిదేళ్ల కాలానికి మొత్తం 39 ప్రపంచ ఫుట్బాల్ మ్యాచ్ల ప్రత్యేక మీడియా హక్కులను పొందింది. ప్రపంచంలోని అతిపెద్ద క్రీడా ఈవెంట్లలో ఒకదాన్ని భారతీయ ప్రేక్షకులకు అందించడానికి తాము సంతోషిస్తున్నామని జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ సీఈఓ పునీత్ గోయెంకా తెలిపారు. జీ కొత్త స్పోర్ట్స్ ఛానల్ యునైట్8 స్పోర్ట్స్ నాలుగు చానల్స్ ఏర్పాటు కాగా (Unite8 Sports 1), (Unite8 Sports 1 HD), (Unite8 Sports 2), (Unite8 Sports 2 HD) ఆ చానల్స్లో ప్రత్యక్ష ప్రసారాలు జరుగుతాయి.
జీ మీడియా ప్రత్యక్ష ప్రసారాలు ఇవే..!
2027 మహిళల ప్రపంచ కప్
2030 పురుషుల ప్రపంచ కప్లు
2034 వరకు ప్రధాన ఫీఫా టోర్నమెంట్లు
అండర్-17, అండర్-20 పురుషుల, మహిళల ప్రపంచ కప్లు, ఇంటర్కాంటినెంటల్ కప్లు
‘Z’ partners with FIFA to bring 39 global football events including FIFA World Cup 2026™, FIFA World Cup 2030™ & FIFA Women’s World Cup™ 2027 for Indian fans!
Click here to read more: https://t.co/ikr5nUF1Ck#FIFAWorldCup #WorldCup2026 #FIFAonZ pic.twitter.com/jQodlVJh7T
— ZEE (@ZEECorporate) June 1, 2026
Telangana Janasena Sabha: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కు తెలంగాణ ప్రభుత్వం ఝలక్..భారీ బహిరంగ సభకు అనుమతి నిరాకరణ!
Hyderabad, Telangana:Janasena Sabha In Telangana: తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిర్వహించేందుకు తలపెట్టిన భారీ బహిరంగ సభకు తెలంగాణ ప్రభుత్వం బ్రేక్ వేసింది. రేపు గచ్చిబౌలి వేదికగా జరగాల్సిన 'తెలంగాణ నవనిర్మాణ సంకల్ప సభ'కు అనుమతి ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిరాకరించింది. దీంతో జనసేన పార్టీ తదుపరి కార్యచరణ ఏమిటంటూ ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు ఎదురుచూస్తున్నారు.
ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక ప్రధానంగా రెండు కారణాలను పోలీసులు, అధికార యంత్రాంగం పేర్కొంది. తెలంగాణ ఆవిర్భావ వేడుకల సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా అధికారిక ఉత్సవాలు జరుగుతుండటంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా జరిగే ఉత్సవాల్లో భాగంగా భద్రతా కారణాలు, ట్రాఫిక్ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఈ సభకు అనుమతి నిరాకరించినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టం చేసింది.
హైకోర్టుకు జనసేన?
కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయంతో జనసేన శ్రేణులు తీవ్ర అసంతృప్తికి లోనయ్యాయి. సభ నిర్వహణ కోసం అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్న తరుణంలో సభ నిర్వహణకు అనుమతి నిరాకరించడంతో జనసేన ముఖ్య నేతలు ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ రేపు ఉదయమే హైకోర్టును ఆశ్రయించాలని జనసేన లీగల్ టీమ్ యోచిస్తున్నట్లు సమాచారం అందుతోంది.
మరోవైపు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలంగాణ సభపై రాష్ట్రంలో ఇప్పటికే రాజకీయ వేడి రాజుకుంది. ఈ సభను వ్యతిరేకిస్తూ తెలంగాణ మంత్రులు, అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఇప్పటికే తీవ్ర విమర్శలు గుప్పించారు. పవన్ తెలంగాణ పర్యటన వెనుక రాజకీయ వ్యూహాలు ఉన్నాయంటూ అధికార పక్షం ఆరోపిస్తుండగా, సభను అడ్డుకోవడానికే ప్రభుత్వం కావాలని అనుమతి నిరాకరించిందని జనసేన వర్గాలు మండిపడుతున్నాయి. అయితే తెలంగాణ హైకోర్టు ఇచ్చే తీర్పుపైనే ఇప్పుడు 'తెలంగాణ నవనిర్మాణ సంకల్ప సభ' భవితవ్యం ఆధారపడి ఉందని విశ్లేషకులు అంటున్నారు.
Also Read: ఏపీలో కొత్త పెన్షన్ల పండగ షురూ..దరఖాస్తు అప్పుడే..ఈ పత్రాలు రెడీ చేసుకోండి!
Also Read: రెండు విడతల్లో జమిలి ఎన్నికలు..ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
AP Pension Scheme 2026: ఏపీలో కొత్త పెన్షన్ల పండగ షురూ..దరఖాస్తు అప్పుడే..ఈ పత్రాలు రెడీ చేసుకోండి!
Vijayawada, Andhra Pradesh:AP Pension Scheme 2026 Update: ఆంధ్రప్రదేశ్లో కొత్త పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్న వారికి కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించింది. రాష్ట్రంలో కొత్తగా పెన్షన్లు మంజూరు చేసేందుకు వీలుగా దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను ప్రారంభించబోతోంది. ఈ మేరకు అర్హతలు, సమర్పించాల్సిన పత్రాల వివరాలను ప్రభుత్వం వెల్లడించింది.
రాష్ట్రవ్యాప్తంగా కొత్త పెన్షన్ల దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఈ నెల 12వ తేదీన ప్రారంభం కానుంది. అర్హులైన అభ్యర్థులు తమ పరిధిలోని గ్రామ/వార్డు సచివాలయాలకు వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు. సచివాలయంలో దరఖాస్తు సమర్పించిన తర్వాత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి, అర్హులకు పెన్షన్లను ఖరారు చేస్తారు.
పెన్షన్కి కావాల్సిన పత్రాలు..
ఈ విడతలో ప్రధానంగా వృద్ధాప్య, వితంతు, ఒంటరి మహిళా, వికలాంగుల పెన్షన్ల కోసం దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. అన్ని రకాల పెన్షన్లకు కావలసిన 5 రకాల ప్రాథమిక పత్రాలతో పాటు, ఆయా కేటగిరీలను బట్టి క్రింది అదనపు పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది.
వృద్ధాప్య పెన్షన్కు దరఖాస్తు చేసుకునే వారు కచ్చితంగా 60 ఏళ్లు పైబడి వయసు ఉండాలి. అలాగే వితంతువు పెన్షన్ కోసం భర్త మరణ ధృవీకరణ పత్రం తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలి. వీరితో పాటు ఒంటరి మహిళల పెన్షన్ పొందే వారు తప్పనిసరిగా కోర్టు ద్వారా భర్త నుంచి విడాకులు పొందిన సర్టిఫికేట్ ఉండాల్సిందే. మరోవైపు వికలాంగుల పెన్షన్ దరఖాస్తు చేసుకోవాల్సిన వాళ్లు వైద్యుల జారీ చేసిన ఆధీకృత సదరం (SADAREM) సర్టిఫికేట్ సమర్పించాల్సి ఉంటుంది.
ఈ 5 పత్రాలు తప్పనిసరి!
ఏ పెన్షన్కు దరఖాస్తు చేయాలన్నా అభ్యర్థులు క్రింది 5 రకాల డాక్యుమెంట్లను సిద్ధం చేసుకోవాలి. ఆధార్ కార్డు, ఆధార్తో లింక్ అయిన మొబైల్ నంబర్, రేషన్ కార్డు, ఆదాయ ధృవీకరణ పత్రం, కుల ధృవీకరణ పత్రం తప్పనిసరిగా ఉండాలి. అర్హత కలిగిన వారు ఈ నెల 12వ తేదీన అవసరమైన అన్ని పత్రాలతో మీ సమీప సచివాలయాన్ని సంప్రదించి దరఖాస్తు చేసుకోవచ్చు.
Also Read: రెండు విడతల్లో జమిలి ఎన్నికలు..ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడంటే?
Also Read: Monsoon Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో చల్లబడిన వాతావరణం..2-3 రోజుల్లో వానలే వానలు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Monsoon Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో చల్లబడిన వాతావరణం..2-3 రోజుల్లో వానలే వానలు..
Hyderabad, Telangana:Monsoon Rain Alert Update: తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం వేగంగా మారిపోతుంది. నిన్న, మొన్నటి వరకు తీవ్రమైన ఎండలు, వడగాలులతో సతమతమవ్వగా.. ఇప్పుడు వడగళ్లు, అకాల వర్షాలు జనాలకు చుక్కలు చూపిస్తున్నాయి. అయితే ఇలాంటి పరిస్థితుల్లో వాతావరణ శాఖ తీపికబురు అందించింది. రానున్న 48 గంటల్లో నైరుతి రుతుపవనాలు కేరళం రాష్ట్రాన్ని తాకబోతున్నట్లు వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఈ క్రమంలో మరో వారం రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన వానలు పడే అవకాశం కనిపిస్తోంది.
అటు ఆంధ్రప్రదేశ్తో పాటు ఇటు తెలంగాణలో రాబోయే మూడు రోజుల వాతావరణ మార్పులకు సంబంధించి హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ గారు కీలక అప్డేట్ విడుదల చేశారు. రాష్ట్రంలో ఎండల తీవ్రత తగ్గుముఖం పట్టి, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా, రాష్ట్రవ్యాప్తంగా వాతావరణంలో కొన్ని కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. రాబోయే 2-3 రోజుల్లో నైరుతి రుతుపవనాలు దేశంలోకి మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. ఇవి అరబిక్ మహాసముద్రం, లక్షద్వీప్, కేరళ, తమిళనాడు ప్రాంతాలతో పాటు బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాల్లోకి విస్తరిస్తున్నాయి.
ఛత్తీస్గఢ్ను ఆనుకుని తూర్పు విదర్భపై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం ఆగ్నేయ మధ్యప్రదేశ్, దాని పరిసర ప్రాంతాలలో కేంద్రీకృతమై ఉంది. ఇది సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తు వరకు విస్తరించింది. తూర్పు విదర్భ నుండి తెలంగాణ, రాయలసీమ, దక్షిణ కర్ణాటక, తమిళనాడు గుండా దక్షిణ కేరళ వరకు సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తులో ఒక ద్రోణి కొనసాగుతోంది.
రాబోయే 3 రోజుల్లో వాతావరణం..
నేడు తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే రేపు, ఎల్లుండి రాష్ట్రవ్యాప్తంగా కొన్ని జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈరోజు గరిష్ట ఉష్ణోగ్రతలు ప్రస్తుత స్థాయిలోనే (స్థిరంగా) కొనసాగుతాయి. అయితే, రేపటి నుండి తదుపరి నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా 2 నుండి 4 డిగ్రీల వరకు తగ్గే అవకాశం ఉంది. దీనివల్ల ఉక్కపోత, ఎండల తీవ్రత నుంచి ప్రజలకు ఉపశమనం లభిస్తుంది.
Also REad: 'తల్లికి వందనం' డబ్బు అకౌంట్లో జమ కావాలంటే..ఈసారి అధికారులు ఇవి చెక్ చేస్తారు!
Also Read: రాత పరీక్ష లేకుండానే నెలకు రూ.1,80,000 జీతం..కేంద్రప్రభుత్వ ఉద్యోగాలు కొన్ని రోజులే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Vijay Thalapathy BJP: రాజకీయాల్లోకి తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ మాజీ భార్య..బీజేపీలో చేరనున్న సంగీత!
Nagalapuram, Tamil Nadu:Thalapathy Vijay Wife Joined BJP: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్కు తన ఇంటి నుంచే రాజకీయ ప్రత్యర్థి రాబోతున్నారనే వార్తలు ఇప్పుడు పెద్ద చర్చకు దారితీశాయి. ఆయన మాజీ భార్య సంగీత స్వర్ణలింగం త్వరలోనే భారతీయ జనతా పార్టీలో చేరనున్నారని సమాచారం అందుతోంది. అదే జరిగితే సీఎం విజయ్కు రాజకీయంగా పెద్ద దెబ్బే అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
తమిళ నటుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి విజయ్ కు గట్టి షాక్ తగిలే అవకాశం కనిపిస్తోంది. ఆయన మాజీ భార్య సంగీత త్వరలోనే రాజకీయాల్లోకి రంగప్రవేశం చేసే అవకాశం ఉందని పుకార్లు వినిపిస్తున్నాయి. సీఎం విజయ్ మాజీ భార్య సంగీత త్వరలోనే భారతీయ జనతా పార్టీలో చేరనున్నారని సమాచారం అందుతోంది. అందుకు సంబంధించిన ఆహ్వానం బీజేపీ నుంచి సంగీతకు అందిందని అంటున్నారు. అయితే ఈ వార్తలపై సంగీత నుంచి ఎలాంటి స్పందన లేదు. అయితే ఈ ఊహాగానాలు ఇప్పుడు తమిళనాట మరో కొత్త చర్చకు దారితీశాయి.
మరోసారి వార్తల్లో సంగీత!
గత కొన్నేళ్లుగా విజయ్, సంగీత మధ్య విభేదాలు ఉన్నాయన్న పుకార్లు తరచుగా మీడియాలో వినిపిస్తున్నాయి. ముఖ్యంగా విజయ్ రాజకీయంగా ఎదుగుతున్న సమయంలో వారిద్దరూ విడిపోయారన్న వార్తలతో పాటు కుటుంబ సమస్యలకు సంబంధించిన కథనాలు ప్రజల దృష్టిని ఆకర్షించాయి. విజయ్కు సంబంధించిన కొన్ని ముఖ్యమైన బహిరంగ కార్యక్రమాలకు మాజీ భార్య సంగీతతో పాటు వారి పిల్లలు హాజరుకాకపోవడం కూడా, వారి బంధంపై జరుగుతున్న చర్చలకు మరింత ఆజ్యం పోసింది.
ఇది బీజేపీ వ్యూహమా?
'గ్రేట్ ఆంధ్ర' నివేదిక ప్రకారం.. సంగీతను తమ పార్టీలోకి ఆహ్వానించే అవకాశాలను బీజేపీ నాయకులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బీజేపీలో సీనియర్ నాయకురాలిగా ఉన్న ఒక ప్రముఖ నటి, తెర వెనుక ఉండి సంగీతను ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నారని కూడా ఆ నివేదిక పేర్కొంది. విజయ్కు అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తి ఏదైనా ప్రత్యర్థి రాజకీయ పార్టీలో చేరితే.. అది సహజంగానే తమిళనాడు రాజకీయాల్లో ఒక బలమైన చర్చకు దారితీస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
సంగీత స్వర్ణలింగం ఎవరు?
సీఎం విజయ్ మాజీ భార్య సంగీత స్వర్ణలింగం..శ్రీలంకకు చెందిన ఓ వ్యాపార కుటుంబానికి చెందినది. ఆ తర్వాత వారి కుటుంబం లండన్లో స్థిరపడింది. ఆమె మొదట ఒక అభిమానిగా విజయ్ను కలిశారు. ఆ స్నేహం క్రమంగా ప్రేమగా మారింది. ఈ జంట 1999లో వివాహం చేసుకున్నారు. వీరికి జేసన్ సంజయ్, దివ్య సాషా అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.
ప్రస్తుతానికి సంగీత బీజేపీలో చేరడం గురించి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే.. ప్రస్తుతం జరుగుతున్న ఈ ఊహాగానాలను కొందరు రాజకీయ పరిశీలకులు, విజయ్ రాజకీయ ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో ఆయనపై ఒత్తిడి పెంచే ప్రయత్నంగానే చూస్తున్నారని సమాచారం.
Also Read: "నా బిడ్డ చావుకు సీఎం విజయ్ కారణం" తమిళ స్టార్ నటి సంచలన ఆరోపణలు..ఏం జరిగింది?
Also Read: రాత పరీక్ష లేకుండానే నెలకు రూ.1,80,000 జీతం..కేంద్రప్రభుత్వ ఉద్యోగాలు కొన్ని రోజులే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Chandrababu: రాక్షసులు, దుర్మార్గులతో యుద్ధం చేస్తూ సుపరిపాలన యజ్ఞం చేస్తున్నాం: చంద్రబాబు
Nuzendla, Andhra Pradesh:Chandrababu Speech: 'రాష్ట్రాన్ని బాగు చేసేందుకు రాత్రింబవళ్లు మేం (ఎన్డీయే కూటమి) పని చేస్తున్నాం. గత పాలకులు మాత్రం విధ్వంసాన్ని కొనసాగిస్తున్నారు. సుపరిపాలనను వెనక్కు లాగేందుకు గొడ్డలి పార్టీ కుట్రలు కుతంత్రాలు పన్నుతోంది. అందుకే ప్రస్తుతం ఉన్న ప్రతిపక్షాన్ని గొడ్డలి పార్టీ అంటున్నాం' అని వైఎస్సార్సీపీపై సీఎం చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. 'బాబాయి వైఎస్ వివేకానందరెడ్డిని హత్యచేసి గుండెపోటు అన్నారు. పోస్టుమార్టం తర్వాత తెలిసింది గొడ్డలితో నరికి చంపారని. మానాన్న చనిపోయారు ఇప్పుడు చిన్నాన్న కూడా చంపేశారని ఎక్కడికక్కడ డ్రామాలు ఆడారు. ఒక్కఛాన్స్ అన్నారు మోసం చేశారు. కోడికత్తి, గులకరాయి డ్రామాలు కూడా ఆడారు' అని టీడీపీ అధినేత చంద్రబాబు వివరించారు.
కాకినాడ జిల్లా పర్యటనలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. వైసీపీ చేస్తోన్న కుట్రలు, కుతంత్రాలపై తన ప్రసంగంలో ప్రస్తావించారు. ఇటీవల జరిగిన ఐదు సంఘటనలను ప్రజలకు వివరించి వైఎస్సార్సీపీ కుట్రలను సీఎం చంద్రబాబు ఎండగట్టారు. 'ఇటీవల జరిగిన కొన్ని ఘటనలు కూడా ప్రజలు తెలుసుకోవాలి. సుపరిపాలన వైకుంఠపాళీ కాకూడదన్నదే మా విజ్ఞప్తి. గత పాలకులు ఐదేళ్ల పాటు ఒక్క టీచర్ పోస్టును కూడా భర్తీ చేయలేదు. కూటమి అధికారంలోకి వచ్చాక 241 కేసులు వేసినా వాటిని పరిష్కరించి ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేశాం. గత పాలకులు జాబ్ క్యాలెండర్ అని దానిని ఎగ్గొట్టారు. మళ్లీ మా ప్రభుత్వం వచ్చాకే జాబ్ క్యాలెండర్ విడుదల చేశాం' అని సీఎం చంద్రబాబు వివరించారు.
ఉద్యోగాల భర్తీ
'అత్యంత పటిష్టంగా ఈ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ చేపట్టాం. కంప్యూటర్ సిస్టమ్ ద్వారా ఎంపిక ప్రక్రియ చేపట్టాం. 40 వేల ప్రశ్నలు, 25 రకాల ప్రశ్నా పత్రాలు ఎక్కడా అక్రమాలు కాకుండా చూశాం. కానీ ఫ్రస్టేషన్లో ఉన్న వైఎస్సార్సీపీ వివాదం చేసి రాజకీయ లబ్ది పొందాలని ఆలోచన చేస్తోంది. దీనిని వివాదం చేసి సమాజంలో అశాంతిని రేపేందుకు ప్రయత్నాలు చేసింది. జాగ్రత్తగా ఉండబట్టే దీనికి గట్టిగా సమాధానం ఇవ్వగలిగాం' అని సీఎం చంద్రబాబు వెల్లడించారు.
మాది గొడ్డలి పార్టీనే, కత్తులు, కటార్లు తెస్తామని అంటున్నారు. ఇక్కడ ఉన్నది CBN. ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు, మరో పక్క మోడీ గారు ఉన్నారు. జాగ్రత్తగా ఉండాలని గొడ్డలి పార్టీని హెచ్చరిస్తున్నా..
రాక్షసులు, దుర్మార్గులతో యుద్ధం చేస్తూనే సుపరిపాలన యజ్ఞాన్ని కొనసాగిస్తున్నాం.… pic.twitter.com/hobkseTI1c
— Telugu Desam Party (@JaiTDP) June 1, 2026
'ప్రతిపక్షంలో పరామర్శలకు వెళ్తూ సొంత కార్యకర్త సింగయ్యను కారు కింద తొక్కి చంపేసి పొదల్లోకి విసిరేసి పోయారు. కడపకు చెందిన ఓ పాస్టర్ను పంపి హత్యాయత్నం డ్రామాలు ఆడారు. దానిని మాపై నెట్టేందుకు ప్రయత్నించారు' అని సీఎం చంద్రబాబు తెలిపారు. పాస్టర్ ప్రవీణ్ మద్యం తాగి మోటారు సైకిల్ నడుపుతూ ప్రమాదంలో చనిపోతే దానిని కూడా మాపై నెట్టడానికి ప్రయత్నాలు జరిగాయని గుర్తుచేశారు. సీసీ కెమెరాల సాయంతో ఈ కుట్రను బట్టబయలు చేశామని చెప్పారు.
వైఎస్సార్ విగ్రహం ధ్వంసం
'పవిత్ర ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమలలోని కౌస్తుభం గెస్ట్ హౌస్ దగ్గర సాక్షి మీడియా మద్యం బాటిళ్లు తీసుకెళ్లి వేసి అపవిత్రం చేసేందుకు ప్రయత్నం చేశారు. భగవంతుడిని అప్రతిష్ట పాల్జేసేందుకు ప్రయత్నం చేసిన వారిని ఏమనాలి. వారిది వేరే మతం కావొచ్చు దానికి మేం తప్పు పట్టడం లేదు' అని సీఎం చంద్రబాబు తెలిపారు. కానీ కుట్రలతో హిందూ దేవాలయాలపై దాడులు అపవిత్రం చేయటం సరికాదని హెచ్చరించారు. 'ఎక్కడికక్కడ సీసీ కెమెరాలు పెట్టి వారిని పట్టుకుని ప్రజల ముందు నిలబెడతాం. కడపలో పెద్ద దస్తగిరిని వైఎస్సార్సీపీ వారే ఆస్తుల వివాదంలో హత్యచేసి టీడీపీ వారిపై నెట్టేందుకు ప్రయత్నం చేశారు
నంద్యాలలో వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేసింది వైసీపీ కార్యకర్తే. అయినా మేం 20 నిముషాల్లో నిందితుడిని పట్టుకున్నాం' అని సీఎం చంద్రబాబు వివరించారు. రాక్షసులు, దుర్మార్గులతో యుద్ధం చేస్తూనే సుపరిపాలన యజ్ఞం చేస్తున్నామని ప్రకటించారు.
'కాకినాడలోనే వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ దళితుడైన డ్రైవర్ను చంపి డోర్ డెలివరీ చేశారు. కానీ ఆ ఎమ్మెల్సీకి సన్మానాలు చేసింది. ఇంత కుట్రలకు కుతంత్రాలకు పాల్పడుతున్న వారి ఆటలు సాగనీయం' అని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. రాజకీయ పార్టీగా ఈ తంతును సరిచేసుకోవాల్సింది పోయి ఎదురు దాడి చేస్తున్నారని మండిపడ్డారు. 'రాజకీయాల్లో విలువలు చాలా ముఖ్యం. హత్య చేసి డోర్ డెలివరీ చేసిన వ్యక్తిని కనీసం పార్టీ నుంచి సస్పెండ్ కూడా చేయకుండా వెనక తిప్పుకుంటున్నారు' అని సీఎం చంద్రబాబు వివరించారు.
Gold Rate Today: భారీగా తగ్గిన బంగారం ధరలు..రూ.820 తగ్గిన బంగారం ధర..మార్కెట్లో ఎలా ఉన్నాయంటే?
Hyderabad, Telangana:Gold Rate Today News: పశ్చిమాసియా ఇంకా యుద్ధ మేఘాలు వీడని వేళ నిన్న మొన్నటి వరకు బంగారం ధరలు హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. తాజాగా జూన్ 1వ తేదీన బంగారం ధర తగ్గింది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం బంగారం దిగుమతిపై సుంకాన్ని పెంచినా.. బంగారం, వెండి కొనుగోలు తగ్గకపోవడం గమనార్హం. అయితే నేడు భారత్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.Govt Employees: తెలంగాణ ఉద్యోగులకు మళ్లీ షాక్.. బదిలీలపై ప్రభుత్వం కీలక నిర్ణయం
Baddipadaga, Telangana:Govt Employees Transfers: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు భారీ షాక్ తగిలింది. ఉద్యోగులకు సంబంధించి మరో షాకింగ్ నిర్ణయం ప్రభుత్వం తీసుకుంది. ఉద్యోగులు మరో బదిలీలపై కీలక నిర్ణయం తీసుకోవడంతో ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. జూన్ 1, 2026 నుంచి రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలపై నిషేధం విధిస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంతో ఉద్యోగ వర్గాలు ఉలిక్కిపడ్డాయి. ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వులకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
మే 1వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు బదిలీలకు ఇచ్చిన వెసులుబాటు ముగియడంతో జూన్ 1, 2026 నుంచి బదిలీలపై తిరిగి నిషేధం అమలులోకి వచ్చింది. జూన్ 1 నుంచి రాబోయే ఆరు నెలల వరకు బదిలీల విషయంలో ఎటువంటి మినహాయింపు ప్రతిపాదనలను అంగీకరించమని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఒకవేళ ఆరు నెలల తర్వాత బదిలీల నిషేధాన్ని సడలించాల్సి వస్తే.. తప్పనిసరిగా ఆర్థిక శాఖ కార్యదర్శి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సంబంధిత మంత్రుల ద్వారా సీఎం ఆమోదం పొందాల్సి ఉంటుంది.
మినహాయింపులు
బదిలీలకు సంబంధించి కొన్ని మినహాయింపులు ఇచ్చారు. నిషేధం అమలులో ఉన్న సమయంలో కొన్ని సందర్భాల్లో బదిలీలు చేసుకునే అవకాశం కల్పించింది. ప్రభుత్వం కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో బదిలీలకు లేదా పోస్టింగ్లకు అనుమతి ఇచ్చింది. ఉద్యోగులకు పదోన్నతులు వచ్చిన సమయంలో ఖాళీగా ఉన్న స్థానాల్లో వారికి పోస్టింగ్ ఇవ్వవచ్చు. దీనికోసం పని చేస్తున్న ఇతర ఉద్యోగులను మార్చకూడదని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది.
క్రమశిక్షణా చర్యలు
బదిలీలపై విధించిన నిషేధపు ఆజ్ఞల్లో పోస్టుల రద్దు, రివర్షన్లు, డెప్యుటేషన్లు (ఫారిన్ సర్వీస్ మాత్రమే), క్రమశిక్షణా చర్యల కారణంగా జరిగే పోస్టింగ్లను ఖాళీగా ఉన్న స్థానాల్లో భర్తీ చేయవచ్చు. ఆరు నెలల కంటే ఎక్కువ కాలం సెలవులో ఉండి తిరిగి వచ్చే వారికి ఖాళీగా ఉన్న చోట పోస్టింగ్ ఇవ్వవచ్చని ప్రభుత్వం పేర్కొంది. అత్యవసర పాలనా అవసరాల దృష్ట్యా బదిలీలు చేయాల్సి వస్తే, ప్రస్తుత స్థానంలో కనీసం ఒక ఏడాది సర్వీస్ పూర్తి చేసిన వారిని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. దీనికి ఆర్థిక శాఖ అనుమతి తప్పనిసరి అని ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నారు.
ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
బదిలీలపై నిషేధం అమల్లో ఉన్న సమయంలో ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించి ఎవరైనా బదిలీలు చేస్తే వారి జీతాల బిల్లులను నిలిపివేయాలని ఆర్థిక శాఖ అధికారులు, పే అండ్ అకౌంట్స్ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. అన్ని శాఖల కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లు ఈ ఉత్తర్వులను కచ్చితంగా పాటించాలని స్పష్టం చేసింది
Jamili Elections: రెండు విడతల్లో జమిలి ఎన్నికలు..ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎన్నికలు ఎప్పుడు రానున్నాయి?
Hyderabad, Telangana:Jamili Elections News: జమిలి ఎన్నికలు నిర్వహణపై కేంద్ర ప్రభుత్వం తుది కసరత్తు చేస్తోంది. 'ఒకే దేశం.. ఒకే ఎన్నిక' నేపథ్యంతో న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ రోడ్మ్యాప్ను సిద్ధం చేసింది. దేశవ్యాప్తంగా ఒకేసారి కాకుండా.. రెండు దశల్లో జమిలి ఎన్నికలను అమలు చేయాలని కేంద్రం యోచిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు 2026 వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో బిల్లును ఆమోదించేందుకు కేంద్రం ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. జాయింట్ పార్లమెంటరీ కమిటీ (JPC) కూడా దీనిపై కీలక సిఫారసులు చేయనుంది.
రెండు దశల నమూనా..
దేశం మొత్తాన్ని ఒకేసారి ఎన్నికల పరిధిలోకి తెచ్చేందుకు బదులుగా, రాష్ట్రాల అసెంబ్లీల పదవీకాలాన్ని సర్దుబాటు చేస్తూ 2029, 2034లో రెండు దశల్లో ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. మొదటి దశ (2029)లో దాదాపు 20 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను 2029 లోక్సభ ఎన్నికలతో కలిపి నిర్వహిస్తారు. ఆ తర్వాత రెండవ దశలో భాగంగా 2034 ఏడాదిలో మిగిలిన రాష్ట్రాలను ఈ దశలోకి తీసుకువచ్చి పూర్తిస్థాయిలో జమిలిని అమలు చేస్తారు.
తెలుగు రాష్ట్రాల ఎన్నికలు ఎప్పుడు?
జమిలి ఎన్నికల విధానం అమల్లోకి వస్తే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయాల్లో కీలక మార్పులు జరగనున్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జమిలి ఎన్నికలు నిర్వహించేందుకు ఎలాంటి అడ్డంకులు లేవు. ఎందుకంటే లోక్సభ ఎన్నికలతో పాటు ప్రతి సారి ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. కాబట్టి, ఏపీ ఎన్నికల షెడ్యూల్లో మార్పులు ఉండకపోవచ్చు. తెలంగాణ అసెంబ్లీ గడువు 2028తో గడువు ముగుస్తుంది. జమిలి ఎన్నికల్లో తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక వంటి రాష్ట్రాల వంటి అసెంబ్లీల గడువు 2029కి పెంచే వరకు పెంచే అవకాశం ఉంది.
ఇతర రాష్ట్రాల గడువు సర్దుబాటు..
2028లో ఛత్తీస్గఢ్, త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్, మిజోరం అసెంబ్లీల పదవీకాలాన్ని పొడిగిస్తారు. 2030-31లో గడువు ముగిసే బీహార్, ఢిల్లీ, తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరి అసెంబ్లీల గడువును ఒకటి నుంచి రెండేళ్లు తగ్గించాల్సి వస్తుంది.
ఇప్పటికే రాజకీయ పార్టీలు, రాష్ట్ర ప్రభుత్వాలు, నిపుణులతో సంప్రదింపులు జరిపిన జేపీసీ.. 2026 వానకాల సమావేశాల చివరి వారంలో తన నివేదికను సమర్పించనుంది. ఇంతటి భారీ రాజ్యాంగ సంస్కరణకు విస్తృత రాజకీయ ఏకాభిప్రాయం అవసరం. అందువల్ల వర్షాకాల సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టి.. ఆ తర్వాత ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసైనా దీనిని ఆమోదించుకోవాలని కేంద్ర బీజేపీ నాయకత్వం పట్టుదలగా ఉంది.
Also Read: బంగారం ప్రియులకు గుడ్న్యూస్..రూ.820 తగ్గిన బంగారం ధర..ఇప్పుడెలా ఉన్నాయంటే?
Also Read; భారత్లో ప్రజలు ఏడాది పాటు బంగారం కొనకపోతే ఏం జరుగుతుంది? గోల్డ్ రేట్ తగ్గిపోతుందా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Julie On CM Vijay: "నా బిడ్డ చావుకు సీఎం విజయ్ కారణం" తమిళ స్టార్ నటి సంచలన ఆరోపణలు..ఏం జరిగింది?
Nagalapuram, Tamil Nadu:Julie Miscarriage Trolls: బిగ్ బాస్ తమిళ ఫేమ్, నటి మరియా జూలియానా (జూలీ) చెన్నై పోలీసులను ఆశ్రయించి సంచలన ఆరోపణలు చేశారు. నటుడు, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్కు చెందిన 'తమిళగ వెట్రి కజగం' (TVK) పార్టీ మద్దతుదారులు, అభిమానులు సోషల్ మీడియాలో తనపై చేసిన తీవ్రమైన ట్రోలింగ్, వ్యక్తిత్వ హననం వల్లే తాను గర్భస్రావానికి గురయ్యానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ ఏడాది జనవరిలో మహమ్మద్ ఇక్రీమ్ను వివాహం చేసుకున్న జూలీ, ఇటీవల జరిగిన ఒక మీడియా సమావేశంలో భావోద్వేగానికి లోనయ్యారు. తనపై జరిగిన సైబర్ దాడి గురించి ఆమె పలు విషయాలను పంచుకున్నారు. "నాకు అప్పుడే పెళ్లయింది. మేము మా మొదటి బిడ్డ కోసం ఎదురుచూస్తున్న సమయంలో ఈ ఆన్లైన్ వేధింపులు నన్ను తీవ్ర మానసిక వేదనకు గురిచేశాయి. దాంతో నేను నా బిడ్డను కోల్పోయాను. ఒక మహిళ టీవీకే పార్టీ గురించి మాట్లాడినందుకే, మనస్సాక్షి లేకుండా ఆమె పేరును పాడుచేశారు" అని జూలీ ఆరోపించింది.
తనపై రూ.15 లక్షల కిడ్నీ కుంభకోణం ఆరోపణలు మోపడం వెనుక ఒక పక్కా స్క్రిప్ట్ ఉందని, ఇందులో ఒక టీవీకే మద్దతుదారుడు, ఒక న్యాయవాది ఉన్నారని జూలీ ఆరోపించారు. గత మార్చిలో ఎనిమిది మందిపై తాను పోలీసులకు ఫిర్యాదు చేయగా, అది క్రిమినల్ కేసు కాదని, సివిల్ పరువు నష్టం కిందకు వస్తుందని తనకు నోటీసు ఇచ్చారని ఆమె పేర్కొన్నారు.
సీఎం విజయ్పై విమర్శలు
ఈ ఘటనకు తమిళనాడు సీఎం విజయ్నే జూలీ బాధ్యుడిని చేశారు. "నా బిడ్డను కోల్పోవడానికి విజయ్ అన్నే కారణం. ఆయన నేరుగా ఈ పని చేయకపోయినా, తన మద్దతుదారులను వెనక్కి తగ్గమని ఒక్క మాట చెప్పి ఉంటే బాగుండేది" అని ఆమె అన్నారు. అయితే, గత డీఎంకే ప్రభుత్వ హయాంలో (ఎన్నికల సమయంలో) ఈ ఫిర్యాదు చేసినప్పటికీ, ప్రస్తుత ప్రభుత్వం దీనిపై బాధ్యత వహించాలని జూలీ డిమాండ్ చేశారు.
juli feel really bad abt pregnancy.but the statement?very unethical .ur health problem?how can our cm be the https://t.co/cuATQX6NBC bad to say that. U were so rude & used very bad language( disrespect).when we hve a CM or PM evenif the person is 20 or 99 we respect the position.
— Actress Ambika (@ActressAmbika) May 31, 2026
జూలీ వ్యాఖ్యలపై నటి అంబిక తీవ్ర అభ్యంతరం
జూలీ చేసిన ఆరోపణలను దక్షిణాది సీనియర్ నటి అంబిక సోషల్ మీడియా వేదికగా తీవ్రంగా ఖండించారు. ముఖ్యమంత్రి పదవిని, వ్యక్తిని గౌరవించాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆమె స్పష్టం చేశారు. "జూలీ, నీకు గర్భస్రావం జరగడం పట్ల నేను చాలా బాధపడుతున్నాను. కానీ నువ్వు ముఖ్యమంత్రిపై చేసిన వ్యాఖ్యలు చాలా అనైతికమైనవి, అమర్యాదకరమైనవి. నీ వ్యక్తిగత ఆరోగ్య సమస్యకు ముఖ్యమంత్రి ఎలా కారణం అవుతారు? దేశంలో ముఖ్యమంత్రి లేదా ప్రధానమంత్రి పదవిలో ఉన్నవారి వయస్సుతో సంబంధం లేకుండా ఆ పదవికి మనం కనీస గౌరవం ఇవ్వాలి" అని అంబిక రాసుకొచ్చారు.
మరోవైపు విజయ్ అభిమానులు సైతం సోషల్ మీడియాలో జూలీ వ్యాఖ్యలను తప్పుపడుతున్నారు, కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఆమె ఇలాంటి ఆరోపణలు చేస్తోందని వారు మండిపడుతున్నారు. 2017 జల్లికట్టు నిరసనల ద్వారా గుర్తింపు తెచ్చుకున్న జూలీ, ఆ తర్వాత బిగ్ బాస్ తమిళ్ (2017), బిగ్ బాస్ అల్టిమేట్ (2022) లలో కంటెస్టెంట్గా పాల్గొని పాపులర్ అయ్యారు. పలు తమిళ చిత్రాల్లోనూ ఆమె నటించారు.
Also Read: సోషల్ మీడియాలో ట్రోల్స్పై నోరు విప్పిన నాగచైతన్య భార్య..అందరికి ఇచ్చిపడేసింది!
Also Read: స్టార్ యాంకర్తో హైపర్ ఆది పెళ్లి..ఎట్టకేలకు పెళ్లిపై స్టార్ కమెడియన్ క్లారిటీ!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
iPhone 18 Pro: ఐఫోన్ 18 ప్రో ఫోటోలు లీక్.. ఆ నాలుగు అదిరిపోయే రంగులు చూశారా!
Hyderabad, Telangana:iPhone 18 Pro Dummy Units Leaked: యాపిల్ ప్రియులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఐఫోన్ 18 ప్రో సిరీస్కు సంబంధించిన కీలక సమాచారం ఇటీవల లీక్ అయింది.. సెప్టెంబర్లో విడుదల కాబోతున్న ఈ ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్ల డమ్మీ యూనిట్ల ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి. తాజా లీకుల ప్రకారం.. ఈసారి యాపిల్ సంస్థ డిజైన్లు కొన్ని మార్పులు చేయడంతో పాటు.. నాలుగు సరికొత్త ఆకర్షణీయమైన కలర్ వేరియంట్లలో ఈ ఫోన్లను తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే, వీటికి సంబంధించిన డిజైన్ వివరాలు, ఫీచర్స్ మనం ఇప్పుడు తెలుసుకుందాం..
కొత్త రంగులు.. మోనోటోన్ డిజైన్..
ఐఫోన్ 18 ప్రో సిరీస్లో ఈసారి డార్క్ చెర్రీ రంగు చాలా ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. గతంలో ఉన్న కాస్మిక ఆరెంజ్ స్థానంలో దీనిని అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. దీంతోపాటు లైట్ బ్లూ, డార్క్ గ్రేతో పాటు క్లాసిక్ సిల్వర్ రంగులో ఈ ఫోన్ లభించబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఉన్న డ్యూయల్టోన్ బ్యాక్ ప్యానెల్ డిజైన్ను పక్కనపెట్టి.. కెమెరా బంపుతో పాటు వెనక క్లాస్ ఒకే రంగులో ఉండేలా సింగిల్ టౌన్ మోనోటోన్ మ్యాట్ ఫినిషింగ్ తో అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది..
చాలా చిన్నదిగా డైనమిక్ ఐలాండ్..
డిస్ప్లే పరంగా చూస్తే.. ఐఫోన్ 18 ప్రో 6.3 అంగుళాలు, ప్రో మాక్స్ 6.9 అంగుళాల స్క్రీన్తో విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే, స్క్రీన్ పై భాగంలో ఉండే Dynamic Island సైజు యాపిల్ సుమారు 35 శాతం మేరకు తగ్గించినట్లు లీకైన చిత్రాల ద్వారా స్పష్టమవుతుంది. ఇందులో కంపెనీ ఇన్ డిస్ప్లే పేస్ ఐడి సాంకేతికతను వాడటం వల్ల ఈ నాచ్ పరిమాణాన్ని తగ్గించి.. వినియోగదారులకు మరింత ఎక్కువగా స్క్రీన్ స్పేస్ ను కల్పించినట్లు తెలుస్తోంది..
అద్భుతమైన ప్రాసెసర్ ఫీచర్లు..
ఈ స్మార్ట్ఫోన్లో అందుబాటులోకి తీసుకురాబోయే కెమెరా టెక్నాలజీ ఈసారి హైలెట్గా ఉండబోతున్నట్లు సమాచారం. యాపిల్ మొట్టమొదటిసారిగా వేరియబుల్ అపెంచర్ సిస్టం పరిచయం చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. దీనివల్ల తక్కువ వెలుతురులోనూ అద్భుతమైన ఫోటోలు తీసుకోవచ్చు. అంతేకాకుండా వెనకవైపు 48 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్ ను అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. ఇక ముందు భాగంలో 48 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉండబోతున్నట్లు తెలుస్తోంది..
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
ఇక ఈ మొబైల్లో అత్యంత అధునాతన 2 నానోమీటర్ (2nm) ప్రాసెస్ ఆధారంగా తయారైన A20 ప్రో చిప్సెట్ ప్రాసెసర్తో అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. ఇది గతంలో కంటే 15 శాతం వేగవంతమైన పర్ఫామెన్స్తో పాటు.. 30 శాతం మెరుగైన బ్యాటరీ సామర్థ్యాన్ని అందిస్తుంది. అలాగే క్వాల్కామ్ మోడెమ్లకు స్వస్తి పలుకుతూ యాపిల్ సొంతంగా తయారుచేసిన C2 మోడెమ్ను ఇందులో వాడనున్నారు. అంతేకాకుండా ప్రత్యేకమైన శాటిలైట్ ఇంటర్నెట్ కనెక్టివిటీ ని కూడా అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్లో ఈసారి ఎంతో శక్తివంతమైన 5,200mAh బ్యాటరీని కలిగి ఉంటుంది..
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Adluri Laxman: దమ్ముంటే నిరూపించు.. మంత్రి పదవికి రాజీనామా చేస్తా: కొప్పులకు అడ్లూరి కౌంటర్!
Hyderabad, Telangana:Minister Adluri Laxman Challenge: క్షేత్రస్థాయిలో జరుగుతున్న ఇసుక రవాణాలో తాము ఒక్క రూపాయి అయినా లంచం తీసుకున్నట్లు నిరూపిస్తే క్షణాల్లో తమ పదవికి రాజీనామా చేయడానికి సిద్ధమని రాష్ట్ర మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ సవాల్ విసిరారు.. పెద్దపల్లి జిల్లా ధర్మారంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.. తనపై, కాంగ్రెస్ ప్రభుత్వం పై మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఎలాంటి ఆధారాలు లేకుండా కేవలం రాజకీయ ఉనికి కోసమే బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు..
నా మంత్రి పదవి నుంచి తప్పుకుంటా..
గత ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించినప్పటికీ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్లు మార్పు రాలేదని అడ్డూరి లక్ష్మణ్ కుమార్ విమర్శించారు. నియోజకవర్గంలో పారదర్శకంగా పాలన సాగుతుంటే ఓర్వలేకనే లేనిపోని అక్రమాలను.. అంటగడుతున్నారని ధ్వజమెత్తారు.. ఇసుక దందాలు నాకు భాగస్వామ్యం ఉందని కొప్పుల ఈశ్వర్ ప్రచారం చేస్తున్నారు.. దమ్ముంటే, ధైర్యం ఉంటే నాపై చేసిన ఆరోపణలను ఆధారాలతో సహా నిరూపించాలి.. నిరూపిస్తే నా మంత్రి పదవితో పాటు ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకుంటా అని.. మంత్రి స్పష్టం చేశారు..
గత పది ఏళ్ల BRS ప్రభుత్వ హయాంలో పెద్దపెల్లి జిల్లా వ్యాప్తంగా.. ముఖ్యంగా ధర్మారం పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఇసుక అక్రమ రవాణా జరిగిందని మంత్రి ఆరోపించారు.. నాటి ప్రభుత్వ పెద్దల ఆశీస్సులతోనే నాడు ఇసుక మాఫియా చెలరేగిపోయిందని.. ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి కొట్టారని విమర్శించారు.. నాటి అక్రమ ఇసుక రవాణాపై పూర్తిస్థాయి విచారణ జరిపించి.. బాధ్యులను చట్టం ముందు నిలబెడతామని మంత్రి హెచ్చరించారు..
Also Read: Telangana Heat Waves: తెలంగాణలో మరింత తీవ్రంగా ఎండలు.. బయటకు వెళ్లాలంటే భయపడే పరిస్థితి..
ఇప్పటికైనా మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్ తనపై చేస్తున్న తప్పుడు.. నిరాధారమైన ఆరోపణలను మానుకోవాలని హితవు పలికారు. కేవలం వార్తల్లో నిలవడానికి ఇలాంటి చౌకబారు విమర్శలు చేస్తున్నారని.. ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారని మంత్రి అడ్డూరి లక్ష్మణ్ పేర్కొన్నారు.. అంతేకాకుండా ఇలాంటి తప్పుడు ప్రచారం చేసే ముందు వెనక ముందు ఆలోచించి.. కొంతైనా నిజం అనిపిస్తేనే ఇలాంటి తప్పుడు ప్రచారం చేయాలన్నారు.. ఈ సమావేశంలో స్థానిక కాంగ్రెస్ నాయకులతోపాటు ప్రజా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు..
Also Read: Telangana Heat Waves: తెలంగాణలో మరింత తీవ్రంగా ఎండలు.. బయటకు వెళ్లాలంటే భయపడే పరిస్థితి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
Honor Win Turbo: సంచలనం.. 10,000mAh బ్యాటరీతో Honor Win Turbo విడుదల.. ధర ఎంతంటే?
Hyderabad, Telangana:Honor Win Turbo Launched: ప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ Honor టెక్ మార్కెట్లోకి సరికొత్త సంచలనానికి తెరలేపింది.. మొబైల్ వినియోగదారులను ఎంతగానో ఇబ్బందికి గురి చేస్తున్న బ్యాటరీ సమస్యకు శాశ్వత పరిష్కారంగా ఏకంగా 10,000mAh బ్యాటరీ సామర్థ్యంతో కూడిన సరికొత్త స్మార్ట్ఫోన్ హానర్ విన్ టర్బో స్మార్ట్ఫోన్ను చైనా మార్కెట్లోకి అధికారికంగా విడుదల చేసింది. ఇది భారీ బ్యాటరీతో పాటు 16 జిబి పవర్ఫుల్ ర్యామ్తో అందుబాటులోకి వచ్చింది. అంతేకాకుండా ఇందులో కంపెనీ ఎన్నో రకాల అత్యాధునిక ఫీచర్లను కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.
Honor Win Turbo మొబైల్ను కంపెనీ చైనాలో విడుదల చేసినట్లు తెలుస్తోంది. ఇది భారత కరెన్సీలో సుమారు ధర రూ.46,000తో అందుబాటులోకి వచ్చింది. ఈ స్మార్ట్ఫోన్ వేస్ వేరియంట్ 12gb ర్యామ్తో పాటు 256 జిబి ఇంటర్నల్ స్టోరేజ్తో అందుబాటులోకి వచ్చింది. ముఖ్యంగా 512GB స్టోరేజ్ మోడల్ ధర రూ.58,800 నుంచి ప్రారంభమవుతుంది. ఈ ఫోన్ బ్లాక్తో పాటు బ్లూ వైట్ కలర్ ఆప్షన్లలో వినియోగదారులకు లభించబోతున్నట్లు కంపెనీ తెలిపింది. అయితే, ఈ స్మార్ట్ఫోన్ను హానర్ కంపెనీ త్వరలోనే భారత మార్కెట్లోకి విడుదల చేసేందుకు కూడా సిద్ధమైనట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనను కంపెనీ త్వరలోనే వెల్లడించబోతోంది..
ఫీచర్లు, స్పెసిఫికేషన్లు..
ఈ స్మార్ట్ఫోన్కు సంబంధించిన ఫీచర్స్ వివరాల్లోకి వెళ్తే.. ఇది చాలా ప్రత్యేకమైన 6.79 ఇంచుల 1.5K OLED డిస్ప్లేను కలిగి ఉంటుంది. అంతేకాకుండా 120Hz రీఫ్రెష్ రేట్, కంటి రక్షణ కోసం 3840Hz PWM డిమ్మింగ్ టెక్నాలజీతో పనిచేస్తుంది. ఈ మొబైల్ ఎంతో శక్తివంతమైన మీడియాటెక్ డైమెన్సిటీ 8500 రేసింగ్ ఎడిషన్ (Dimensity 8500 Racing Edition) చిప్సెట్తో ప్రాసెసర్ పై పని చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ఇది అద్భుతమైన బ్యాటరీ సామర్థ్యంతో అందుబాటులోకి వచ్చింది. ఇందులో కంపెనీ ఎంతో శక్తివంతమైన 10,000mAh భారీ సిలికాన్-కార్బన్ బ్యాటరీ ని అందిస్తోంది. అంతేకాకుండా 27W రివర్స్ చార్జింగ్ సపోర్ట్ ద్వారా ఈ ఫోన్ను పవర్ బ్యాంక్లా పనిచేస్తుంది. ఒకసారి చార్జ్ చేస్తే దాదాపు 14 గంటల వరకు నిరంతరం పవర్ను అందిస్తుంది..
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
ఈ మొబైల్ వెనుక భాగంలో అద్భుతమైన కెమెరా సెటప్ను కలిగి ఉంది. ముఖ్యంగా ఇది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్తో కూడిన 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో పాటు.. ఫ్రంట్ భాగంలో చాలా ప్రత్యేకమైన 16 మెగాపిక్సెల్ కెమెరాను అందిస్తోంది. అలాగే ఇది అద్భుతమైన డిజైన్తో అందుబాటులోకి వచ్చింది. ముఖ్యంగా భారీ బ్యాటరీ ఉన్నప్పటికీ.. ఈ ఫోన్ కేవలం 7.98mm మందం, 216 గ్రాముల బరువుతో ఎంతో స్లిమ్గా డిజైన్ చేయడం విశేషం. పవర్ఫుల్ పర్ఫార్మెన్స్, తిరుగులేని బ్యాటరీ లైఫ్ కోరుకునే వారికి ఈ ఫోన్ మంచి ఎంపికగా భావించవచ్చు..
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
