ఖమ్మం: విషపు నీటిని తాగి గొర్రెల మృతి
Khammam, Telangana:విషపు నీరు తాగి 20 గొర్రెలు మృతి చెందగా మరో 150 గొర్రెలు అస్వస్థతకు గురైన ఘటన ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం లంకాసాగర్ క్రాస్ రోడ్ వద్ద జరిగింది. రామచంద్రాపురం గ్రామానికి చెందిన బోలే రాంబాబుకు చెందిన 200 గొర్రెలను క్రాస్ వద్ద మేపుతున్నాడు. అయితే సింగరేణి నుండి వచ్చే విష రసాయనాలను సమీపంలోని గుంతల్లో డంప్ చేస్తున్నారు. నీటి కోసం వెళ్లిన గొర్రెలు వాటిని తాగి అస్వస్థతకు గురై చనిపోయినట్లు తెలుస్తుంది.हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
Auto LPG Price Hike: రాష్ట్రంలో భారీగా పెరిగిన ఆటో ఎల్పీజీ ధరలు..లీటరు రూ.106కి అమ్ముతున్న ఫిల్లింగ్ స్టేషన్లు!
Bengaluru, Karnataka:Auto LPG Price Hike News: ఇండియన్ ఆయిల్ (IOCL) వంటి ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలు ఇప్పుడు సామాన్యులకు షాక్ ఇచ్చాయి. ఐఓసీఎల్ ఆధ్వర్యంలో బెంగళూరులో కార్యకలాపాలు చేస్తున్న ఫిల్లింగ్ స్టేషన్లలో ఆటో ఎల్పీజీ (Auto LPG) ధరలు లీటరుకు రూ.11.78 పెంచేందుకు నిర్ణయించారు. అయితే ఈ పెంపు అనేది ఏప్రిల్ 1 నుంచి అములులోకి వస్తుందని తెలియజేశారు. దీంతో ఆటో ఎల్పీజీ ధర లీటరుకు రూ.89.52కు చేరింది. చివరి సవరణ 2026 మార్చి 20న జరగ్గా..అప్పుడు ఎల్పీజీ ధర లీటరుకు రూ.77.74గా విక్రయించారు. అయితే యుద్ధం నేపథ్యంలో ఎల్పీజీ కొరను ఆసరాగా తీసుకోని పలు ప్రైవేట్ ఆటో ఎల్పిజి స్టేషన్లు లీటరుకు రూ.106 వరకు వసూలు చేస్తున్నాయని ఆటో డ్రైవర్లు ఫిర్యాదు చేస్తున్నారు.
బెంగళూరులోని ఓ ఆటో డ్రైవర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ.. ఆటో ఎల్పిజి ఫిల్లింగ్ స్టేషన్లు డ్రైవర్లను దోచుకుంటున్నాయని ఆరోపించారు. "ప్రస్తుతం ఇండియన్ ఆయిల్ (IOCL) నిర్ణయించిన ఆటో ఎల్పిజి ధర రూ.89.52 విక్రయిస్తుండగా.. బెంగళూరులోని అనేక ప్రైవేట్ చమురు ఫిల్లింగ్ స్టేషన్లు లీటరుకు రూ.106 వరకు ఆటో డ్రైవర్ల నుంచి వసూలు చేస్తున్నాయి. అందులోనూ ఆటో ఎల్పీజీ కోసం 2 కిలోమీటర్ల వరకు క్యూలో వేచి చూడాల్సి వచ్చేంది." అని ఆటో డ్రైవర్ సంఘాలు తెలిపాయి. ధరలు ఇప్పటికే ఆకాశాన్ని అంటగా..ఇప్పుడు ఆటో గ్యాస్ గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంద
చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు ఆటో గ్యాస్ కోసం గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. ఈ పరిస్థితిలో ఆటో డ్రైవర్లు ఎలా బ్రతుకుతారు?
పశ్చిమ ఆసియాలో ఇరాన్-ఇజ్రాయిల్ మధ్య ఉద్రిక్తతలు 2026 ఫిబ్రవరి 28న ప్రారంభమయ్యాయి. ఆ రోజు నుంచి ఆయా దేశాల సమన్వయ దాడులు నేపథ్యంలో ప్రతీకార చర్యలు భారీగా మొదలయ్యాయి. దీంతో ప్రపంచంలోని ఇంధన వాణిజ్య మార్గమైన కీలక హోర్ముజ్ జలసంధి నుంచి నౌకాయానానికి అంతరాయం ఏర్పడింది. ఈ సంక్షోభం ప్రపంచవ్యాప్తంగా చమురు, గ్యాస్ ధరలను పెరిగిన క్రమంలో ఇంధన సరఫరాకు అంతరాయం కలిగించింది.
ఆటో ఎల్పీజీ ఇంధన కొరత కారణంగా ఆటో డ్రైవర్లు కూడా ప్యాసింజర్స్ నుంచి అధిక మొత్తంలో డబ్బు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు కూడా వచ్చాయి. ఈ క్రమంలో ఎల్పీజీ ధరలు కూడా భారీగా పెంచినట్లు ఓ ఆటో ఎల్పీజీ డీలర్ తెలియజేశారు. "గత వారం ఒక టన్ను ఎల్పిజి ధర సుమారు రూ.60,000 ఉండేది. ఇప్పుడు పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా దాని ధర దాదాపు రూ. 1.90 లక్షలకు చేరింది. సరఫరా సరిపోవడం లేదు. చాలా ఫిల్లింగ్ స్టేషన్లు మూతపడుతున్నాయి, ఉన్నవాటిలో కొన్ని ఎక్కువ వసూలు చేస్తున్నాయి," అని ఆ డీలర్ అన్నారు.
అయితే కర్ణాటక రాష్ట్రంలో ఆటో ఎల్పీజీ కొరత లేదని ఆహార, పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ తెలిపింది. మార్చి 29, 2026 నాటి పత్రికా ప్రకటనలో.. ఐఓసిఎల్, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ వంటి ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ కంపెనీలచే నిర్వహిస్తున్న కర్ణాటక వ్యాప్తంగా ఉన్న 72 ఆటో ఎల్పీజీ డిస్పెన్సింగ్ స్టేషన్లలో (ALDS), బెంగళూరులోని 31 స్టేషన్లతో సహా ఆటో ఎల్పీజీ సులభంగా అందుబాటులో ఉందని ఆ శాఖ పేర్కొంది.
"గతంలో ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (OMCలు) రోజుకు సగటున 64.9 మెట్రిక్ టన్నుల ఆటో LPGని పంపిణీ చేశాయి. ఈ యుద్ధానికి ముందు ఈ పంపిణీ 57.6 మెట్రిక్ టన్నులుగా ఉండేది. ఇది సరఫరాలో పెరుగుదలను సూచిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రతిరోజూ సరఫరా అవుతున్న సుమారు 4 లక్షల గృహ వినియోగ LPG సిలిండర్లు, దాదాపు 18,000 వాణిజ్య LPG సిలిండర్లకు ఇది అదనం" అని అది పేర్కొంది. అన్ని రంగాలకు నిరంతరాయంగా LPG సరఫరాను నిర్ధారించడానికి రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తూనే ఉందని తెలిపింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Govt Employees: ప్రభుత్వ ఉద్యోగులకు బంపర్ జాక్పాట్.. ఏపీ ప్రభుత్వం భారీ గిఫ్ట్
Nuzendla, Andhra Pradesh:AP Govt Employees Jackpot: ప్రభుత్వ ఉద్యోగులతోపాటు పింఛన్దారులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ శుభవార్త ప్రకటించింది. కొంతకాలంగా భారీగా పేరుకుపోయిన బిల్లులను చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ బిల్లుల విడుదలకు రూ.7 వేల కోట్లు విడుదల చేయాలని ఆర్థిక శాఖకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. మిగిలిన సమస్యలు కూడా త్వరలోనే పరిష్కరిస్తామని ఏపీ ప్రభుత్వం హామీ ఇచ్చింది. దీంతో ప్రభుత్వ ఉద్యోగ వర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. సత్వరమే పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని ఆదేశించడంతో ఉద్యోగ వర్గాలకు భారీ ఊరట లభించనుంది.
Also Read: Liquor Shops: రేపు హైదరాబాద్లో 24 గంటలు వైన్షాపులు, బార్లు బంద్
ప్రభుత్వ ఉద్యోగులకు, రిటైర్డ్ ఉద్యోగులకు భారీ ఉపశమనం కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఉద్యోగులకు గత ప్రభుత్వం పెట్టిన బకాయిల చెల్లింపులపై కసరత్తు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. నిధుల లభ్యతను బట్టి ఉద్యోగులకు చెల్లింపులు జరిపేలా ఆర్థిక మంత్రి పయ్యావుల కసరత్తు చేస్తున్నారు. ఉద్యోగులకు ఇవ్వాల్సిన పెండింగ్ బిల్లుల్లో రూ.7059 కోట్లు విడుదలకు ఆర్థిక శాఖ నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల పెండింగ్ బిల్లులను ప్రణాళికాబద్దంగా ప్రభుత్వం చెల్లించనుంది.
Also Read: Liquor Income:లిక్కర్తో తెలంగాణ ఖజానా గలగల.. ఏడాదిలో వచ్చిన ఆదాయం ఎంతంటే?
పెండింగ్ బిల్లుల చెల్లింపుల్లో ప్రావిడెంట్ ఫండ్ కింద రూ.1,847.83 కోట్లు, గ్రాట్యూటీ కింద రూ.3,411.03 కోట్లు, రిటైర్డ్ ఉద్యోగుల లీవ్ ఎన్క్యాష్మెంట్ రూ.1,800 కోట్లు, పోలీసులకు అదనపు సరెండర్ లీవులు రూ. 223.47 కోట్ల బిల్లులు విడుదలయ్యాయి. ఇక గ్రూప్ లైఫ్ ఇన్సూరెన్స్ నిమిత్తం 4,793 మంది ఉద్యోగులకు రూ.76 కోట్ల చెల్లింపులు ప్రభుత్వం చేసింది. రూ.7059 కోట్ల మేర బిల్లులకు చెల్లింపుల ప్రక్రియను ఆర్థిక శాఖ ప్రారంభించింది. ఇప్పటికే ప్రావిడెంట్ ఫండ్ కింద రూ.1,847.83 కోట్లను ప్రభుత్వం ఉద్యోగుల ఖాతాల్లో జమ చేసింది. జీఎల్ఐ కింద రూ.76 కోట్ల మేర చెల్లింపులు పూర్తి చేసింది. వివిధ శాఖలకు మెటీరియల్ సరఫరా చేసిన చిన్న చిన్న కాంట్రాక్టర్లకు రూ.614 కోట్ల మేర పెండింగ్ బిల్లుల చెల్లింపులు క్లియర్ చేసింది. మరికొన్ని బకాయిలు ఉండడంతో వాటిని త్వరగా ప్రభుత్వం విడుదల చేసే అవకాశం ఉంది. సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఉద్యోగులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించనున్నారు. ఇప్పటికే ఆర్థిక శాఖ అధికారులకు ఉద్యోగుల అంశంపై చర్చలు జరిపి మౌఖిక ఆదేశాలు ఇచ్చారు. సీఎం, మంత్రి ఆదేశాలతో ఆర్థిక శాఖ కొన్ని రోజుల్లోనే బకాయిలకు సంబంధించిన రూ.7 వేల కోట్లు విడుదల చేయనుంది.
Also Read: LSG vs DC Highlights: లక్నోకు ఘోర ఓటమి.. ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన ఢిల్లీ క్యాపిటల్స్
ఉద్యోగ వర్గాల్లో హర్షాతిరేకాలు
తమకు సంబంధించిన పెండింగ్ బిల్లులు విడుదల కానుండడంతో ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్మెంట్ పొందిన ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లు బిల్లులు మంజూరు కాక పడుతున్న తీవ్ర ఇబ్బందులు తీరనున్నాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమ సమస్యల పరిష్కారానికి చొరవ చూపడంపై ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నాయకులు సీఎం చంద్రబాబు, ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్కు కృతజ్ఞతలు చెబుతున్నారు. మిగిలిన డీఏ, పీఆర్సీ వంటి సమస్యలు కూడా పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Hanuman: హనుమంతుడి ఒళ్లంతా సింధూరం.. సీతమ్మ చెప్పిన ఆ మాటే కారణమా?
Hyderabad, Telangana:Hanuman Wears Sindoor Story: రామాయణంలో హనుమంతుడి భక్తి గురించి ఎంత చెప్పినా తక్కువే.. రామనామమే శ్వాసగా.. రామసేవయే ధ్యానంగా బ్రతికిన మహాబలిశాలి ఆయన.. అయితే మనం హనుమంతుడి ఆలయానికి వెళ్ళినప్పుడు ఆయన విగ్రహం ఎక్కువగా సింధూరంతో మెరుస్తూ కనిపిస్తుంది. ఆంజనేయుడు ఒళ్లంతా సింధూరం పూసుకోవడం వెనక ఉన్న అసలైన కథ ఏంటో మీకు తెలుసా? ఇది ఇప్పటికీ చాలామందికి తెలియదు చాలామందికి తెలియదు. అది ఆయన భక్తితో పాటు అమాయకత్వానికి నిదర్శనమని పురాణాలు చెబుతున్నాయి. అయితే, ఆయన విగ్రహానికి ఎందుకు సింధూరం ఉంటుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
రావణ సంహారం తర్వాత శ్రీరాముడు అయోధ్యకు రాజవ్వాల్సిన సమయం అది.. ఒకరోజు సీతాదేవి తన నుదుట ఎర్రటి సింధూరాన్ని ధరించడాన్ని హనుమంతుడు గమనించాడు. ఆశ్చర్యంతో ఆమె వద్దకు వెళ్లి.. తల్లి, నువ్వు ప్రతిరోజు నీ నుదుట ఈ ఎర్రటి పొడిని ఎందుకు ధరిస్తావు అని ప్రశ్నించాడు.. అప్పుడు సీతమ్మ నవ్వుతూ.. హనుమా.. ఇది సింధూరం.. దీనిని ధరిస్తే నా పతి అయిన శ్రీరాముడికి ఆయురారోగ్యాలు వృద్ధి చెందుతాయి.. ఆయన ఎల్లప్పుడూ క్షేమంగా ఉంటారు అని సమాధానం అందించారు..
సీతమ్మ మాట విన్న హనుమంతుడు ఆలోచనలో పడ్డాడు.. కేవలం నుదుట కొద్దిగా సింధూరం ధరిస్తేనే నా ప్రభువుకి అంతటి క్షేమం చేకూరితే.. ఇక నా ఒళ్లంతా సింధూరం పూసుకుంటే ఆయనకు ఇంకెంత మేలు జరుగుతుంది? అని భావించాడు.. వెనుక ముందు ఆలోచించకుండా.. హనుమంతుడు వెంటనే వెళ్లి తన శరీరం అంతట సింధూరాన్ని దట్టంగా పూసుకున్నాడు.. ఆ రూపంతోనే నేరుగా శ్రీరాముడి దర్బార్కు చేరుకున్నాడు..
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
హనుమంతుడి వింత రూపాన్ని చూసి సభలో వారంతా ఆశ్చర్యానికి గురయ్యారు.. శ్రీరాముడు నవ్వుతూ కారణము అడగగా.. ప్రభు.. మీరు కలకాలం ఆరోగ్యంగా.. నిండు నూరేళ్లు వర్ధిల్లాలని నా శరీరం అంత సింధూరం పూసుకున్నాను.. అని హనుమ జవాబు ఇచ్చాడు.. ఆ మాటలకు శ్రీరాముడు చలించి పోయాడు.. ఆంజనేయుడికి తనపై ఉన్న భక్తిని, ప్రేమని చూసి ముగ్ధుడయ్యాడు.. వెంటనే శ్రీరాముడు హనుమంతుడిని ఆశీర్వదిస్తూ.. హనుమా.. ఇకపై ఎవరైతే నిన్ను సింధూరంతో పూజిస్తారో.. వారికి నా సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది.. అని వరం ప్రసాదించాడు.. నాటి నుంచి హనుమంతుడికి సింధూరం సమర్పించడం ఒక సాంప్రదాయంగా మారింది. ఈ సింధూర ధారణ భక్తులకు శక్తితో పాటు అద్భుతమైన ధైర్యాన్ని నమ్మకాన్ని అందిస్తుంది..
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Honda Shine రూ.45 వేలు.. TVS Rider కేవలం రూ.50వేలే.. సగం ధరకే మీ సొంతం!
Hyderabad, Telangana:Second Hand Bikes In Hyderabad Telugu: ఎప్పటినుంచో మంచి మోటార్ సైకిల్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఇదే అద్భుతమైన అవకాశంగా భావించవచ్చు.. హైదరాబాద్ లోని ఆటోనగర్ లో ఉన్న శ్రీరామ్ ఆటో మాల్ వేదికగా నిర్వహించిన బ్యాంకు సీజ్డ్ వాహనాల వేలం పాటలో సామాన్యులకు ఊహించని ధరలకే అత్యాధునిక మోడల్ వాహనాలు లభిస్తున్నాయి. ముఖ్యంగా ఈఎంఐ సకాలంలో చెల్లించని కారణంతో బ్యాంకులు స్వాధీనం చేసుకున్న 185 బైకులపై వేలం వేశారు. ఇందులో భాగంగా ప్రముఖ బ్రాండ్లకు సంబంధించిన బైకులు 50 శాతం కంటే తక్కువ ధరలకే అందుబాటులోకి వచ్చాయి. ఏడాది కింది మోడల్స్ సైతం అత్యంత తక్కువ ధరలోని అందుబాటులోకి రావడం విశేషం.
ఈ వేళలో భాగంగా ప్రధాన ఆకర్షణ ఏంటంటే.. 2024 సంవత్సరం మోడల్ బైక్స్తో పాటు.. 2025 సంవత్సరం మోడల్ వాహనాలు కూడా సగం ధరలకే అందుబాటులో ఉండడం. ముఖ్యంగా హోండా ఎస్పీ 125, టీవీఎస్ రైడర్, యమహా R15, హీరో స్ప్లెండర్ వంటి పాపులర్ మోడళ్లు వేలంలో హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. చాలామంది ఈ వేలంలో పాల్గొని సగం ధరలకే వీటిని కొనుగోలు చేశారు. మంచి కండిషన్ కలిగిన బైక్లను వినియోగదారులు ఎక్కువగా కొనుగోలు చేసేందుకు ఇష్టపడ్డారు..
ఇక ఈ వేలంలో ఉన్న బైక్ లకు సంబంధించిన ధరల వివరాల్లోకి వెళ్తే..2024 మోడల్ హోండా ఎస్పీ 125 బైక్ రూ. 45,000 నుంచి రూ. 60,000 మధ్య ధర పలకగా.. 2025 మోడల్ టీవీఎస్ రైడర్ కేవలం రూ. 50,000లకే సోల్డ్ అయినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా స్పోర్ట్స్ బైక్ ప్రియుల కోసం యమహా R15 V4 మోడల్ రూ. 1.40 లక్షలకు అందుబాటులో ఉంది. అలాగే అందర్నీ ఆశ్చర్యపరుస్తూ..2025 మోడల్ టీవీఎస్ స్పోర్ట్ వాహనం కేవలం రూ. 30,000కే వేలంలో అమ్ముడైంది.. ఇలా వివిధ బ్రాండ్లకు సంబంధించిన మోటార్ సైకిల్స్ అత్యంత తక్కువ ధరలోనే అందుబాటులోకి వచ్చాయి..
ప్రతి శనివారం నిర్వహించే ఈ వేలం పాటలో పాల్గొనే వారు తప్పకుండా రిజిస్ట్రేషన్ చేసుకోవలసి ఉంటుంది. ఇందులో భాగంగా ముందుగానే శ్రీ రామ్ ఫైనాన్స్ కంపెనీకి రూ. 10,120 డిపాజిట్ చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆధార్ కార్డుతో పాటు పాన్ కార్డు జిరాక్స్ కాపీలను తప్పనిసరిగా.. వెంట తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. ఒకవేళ వేలంలో ఏ వాహనం కొనుగోలు చేయలేకపోతే.. చెల్లించిన డిపాజిట్ మొత్తాన్ని అక్కడికక్కడే తిరిగి ఇచ్చేస్తారు.. వాహనాన్ని దక్కించుకున్న వారు ఒక వారం రోజుల్లో పూర్తి మొత్తాన్ని చెల్లించి వాహనాన్ని తీసుకెళ్లాల్సి ఉంటుంది..
Read more: Scorpio, Ertiga సగం ధరకే.. ఢిల్లీ కార్ బజార్లో రూ.30 వేలకే కారు మీ సొంతం!
చాలా వాహనాలు ఆర్టీఓ ఫారమ్స్ (RTO Forms) తో వస్తున్నాయి. అంటే ఒరిజినల్ ఆర్సీ లేకపోయినా, ఫైనాన్స్ కంపెనీలు ఫామ్ 35, 36 వంటి పత్రాలను అందిస్తాయి. వీటితో వాహనాలు కొనుగోలు చేసిన వారంతా వాటిని తమ పేరు మీద సులభంగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. కొన్ని వాహనాలపై పెండింగ్ జవాన్లు ఉన్నప్పటికీ.. వాటిని కొనుగోలుదారులే చెల్లించాల్సి ఉంటుంది. తక్కువ ధరలు కొత్త వాహనం కొనాలనుకునే మధ్య తరగతి ప్రజలకు ఈ వేలం మంచి వేదికగా నిలుస్తోంది. మరిన్ని వివరాల కోసం ప్రతి శనివారం ఉదయం 10 సమయంలో ఆటోనగర్ శ్రీరామ్ ఆటో మాల్ సందర్శించవచ్చు.
Read more: Scorpio, Ertiga సగం ధరకే.. ఢిల్లీ కార్ బజార్లో రూ.30 వేలకే కారు మీ సొంతం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Google Pixel 10 Pro: రౌండ్ డిజైన్.. అదిరిపోయే లుక్.. గూగుల్ పిక్సెల్ 10 ప్రో వెర్షన్ ఇదేనా?
Hyderabad, Telangana:Google Pixel 10 Pro Round Latest News: ప్రముఖ స్మార్ట్ఫోన్ కంపెనీ గూగుల్ మరో సంచలనానికి తెరలైపోతోందా? అంటే అవును అనే సమాధానమే వినిపిస్తుంది. గూగుల్ కంపెనీ తమ సరికొత్త డిజైన్తో కూడిన మొబైల్ త్వరలో విడుదల చేయబోతుందా? అంటే కూడా అవుననే సమాధానమే వస్తోంది. సాధారణంగా మనం ఎన్నో రకాల డిజైన్లతో కూడిన మొబైల్స్ చూస్తూ ఉంటాం. కానీ గూగుల్ కంపెనీ సరికొత్త డిజైన్తో మార్కెట్లోకి అద్భుతమైన మొబైల్ విడుదల చేయబోతోంది. ఇది రౌండ్ షేప్లో లాంచ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. తాజాగా దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. గూగుల్ కంపెనీ ఈ మొబైల్ను గూగుల్ సర్కిల్ పిక్సెల్ లేదా రౌండ్ పిక్సెల్ టెన్ ప్రో అనే సరికొత్త క్యాప్షన్తో అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈ స్మార్ట్ఫోన్ వీడియో మాత్రం సోషల్ మీడియాలో పెద్ద సంచలనం గానే మారింది..
సాధారణంగా మనం చూసే ఫోన్లన్నీ పొడవుగా ఉంటాయి.. కానీ ఈ గూగుల్ సర్కిల్ పిక్సెల్ పూర్తిగా సర్కిల్గా ఉండడం మీరు ఈ వైరల్ అవుతున్న వీడియోలో చూడొచ్చు.. అరచేతిలో పట్టే విధంగా ఉన్న ఈ స్మార్ట్ ఫోన్ డిజైన్ టెక్నీలకు ఎంతగానో నచ్చుతుంది. దీని బాడీ మెటల్ తో పాటు గ్లాస్ ఫినిషింగ్ తో ఉండబోతున్నట్లు ఈ వీడియోనే చెబుతోంది. అంతేకాకుండా ఇది చూడడానికి చాలా అద్భుతమైన క్లాసిక్ లో విడుదల కాబోతున్నట్లు కూడా కొంతమంది టెక్ నిపుణులు భావిస్తున్నారు.. అంతేకాకుండా ఈ మొబైల్లో కొన్ని రకాల కెమెరా ఫీచర్స్ కూడా అందుబాటులో ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
ఈ స్మార్ట్ఫోన్ వెనక భాగంలో అద్భుతమైన కెమెరా సెట్ అప్ కూడా ఉండడం మీరు గమనించవచ్చు. ఇది చాలా ప్రీమియం లుక్ లో హారిజంటల్ కెమెరా బార్ను ఉండడం మీరు చూడొచ్చు. ఇందులో మూడు శక్తివంతమైన కెమెరా లెన్స్ తో పాటు ఒక అద్భుతమైన ఎల్ఈడి ఫ్లాష్ లైట్ ఉండడం కూడా మీరు గమనించవచ్చు. గూగుల్ ఆధ్యాధునిక ఇమేజ్ ప్రాసెసింగ్ టెక్నాలజీతో ఈ ఫోన్ అద్భుతమైన ఫోటోలతో పాటు వీడియోలను తీయగలదని కొంతమంది టెక్ నిపుణులు భావిస్తున్నారు.
అలాగే వీడియోలు సూచించినట్లు.. ఈ సర్కిల్ ఫోన్ ప్యాకేజింగ్ కూడా చాలా విభిన్నంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఫోన్ ఆకారానికి తగ్గట్టుగానే బాక్స్ కూడా వృత్తాకారంలోనే రూపొందించినట్లు తెలుస్తోంది. బాక్స్ లో ఫోన్ తో పాటు టైప్స్సి చార్జింగ్ కేబుల్ కూడా అందుబాటులో ఉండబోతోంది. ఫోన్ ముందుభాగం అంత డిస్ప్లే తో నిండి ఉండి.. అంచులు లేని అనుభూతి కూడా మీరు చూడొచ్చు.. ప్రస్తుతానికి ఇది ఒక కాన్సెప్ట్ వీడియో మాత్రమే.. గూగుల్ అధికారికంగా దీనిపై ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే భవిష్యత్తులో గూగుల్ నిజంగానే ఇలాంటి భిన్నమైన ఫోన్ మార్కెట్లోకి తీసుకువస్తే.. అది స్మార్ట్ ఫోన్ రంగంలో ఒక పెద్ద మార్పుకు నాంది పలుకుతుందని టెక్ నిపుణులు భావిస్తున్నారు.
Read more: Scorpio, Ertiga సగం ధరకే.. ఢిల్లీ కార్ బజార్లో రూ.30 వేలకే కారు మీ సొంతం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
LSG vs DC Highlights: లక్నోకు ఘోర ఓటమి.. ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన ఢిల్లీ క్యాపిటల్స్
Lucknow, Uttar Pradesh:IPL 2026 LSG vs DC Highlights: ఐపీఎల్ 2026లో అతి తక్కువ స్కోర్ నమోదైన మ్యాచ్లో పోరాడలేక లక్నో సూపర్ జియాంట్స్ చేతులెత్తెయగా.. అద్భుత ప్రదర్శన కనబర్చిన ఢిల్లీ క్యాపిటల్స్ ఆల్రౌండ్ ప్రదర్శన చేసి తొలి విజయాన్ని అందుకుంది. 17 బంతులు మిగిలుండగానే 6 వికెట్ల తేడాతో ఢిల్లీ మ్యాచ్ను సొంతం చేసుకోగా.. బ్యాటింగ్లో.. బౌలింగ్లో విఫలమైన లక్నోకు తీవ్ర నిరాశ ఎదురైంది. ఈ ఐపీఎల్లో అతి తక్కువ స్కోర్ మ్యాచ్ ఇదే కావడం విశేషం.
Also Read: Tirumala: తిరుమల భక్తులకు భారీ శుభవార్త.. అలిపిరిలో పులి భయం అక్కర్లేదు
లక్నో వేదికగా జరిగిన మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన లక్నో సూపర్ జియాంట్స్ 18.4 ఓవర్లకే కుప్పకూలి 141 పరుగులు చేసింది. టాపార్డర్, మిడిలార్డర్ కుప్పకూలిపోవడంతో ఏ ఒక్క బ్యాటర్ అర్థ సెంచరీ నమోదు చేయలేదు. ఈ సమయంలో అబ్దుల్ సమద్, మిచెల్ మార్ష్ తలా 35 పరుగులు సాధించి పర్వాలేదనిపించారు. కెప్టెన్ రిషబ్ పంత్ 7 పరుగులకే ఔటవగా.. మార్క్రమ్ 11 పరుగులు చేసి నిరాశపర్చాడు. ఆయుశ్ బదౌనీ డకౌట్ కాగా.. నికోలస్ పూరన్ 8 పరుగులు చేశాడు. చౌదరి (14), షమీ (1), నోర్ట్జే, మోహిసిన్ ఖాన్ డకౌట్ అయ్యారు. ఢిల్లీ బౌలర్లు అద్భుతంగా బంతులు వేసి లక్నో బ్యాటర్లను ఏమాత్రం స్కోర్ చేయకుండా కట్టడి చేశారు. ఎంగిడి, నటరాజన్ నిప్పులు చెరిగేలా బంతులు వేసి మూడేసి వికెట్లు తీశారు. నటరాజన్ రెండు వికెట్లు తీయగా.. అక్షర్ పటేల్ ఒక వికెట్ పడగొట్టాడు.
ఛేదనకు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 17.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 145 సాధించింది. ఢిల్లీ జట్టు కూడా ఆరంభంలో తీవ్ర ఒత్తిడికి లోనయ్యింది. సీనియర్ ఆటగాడు కేఎల్ రాహుల్ గోల్డెన్ డకౌట్ కాగా.. నిస్సాంక ఒక్క పరుగుకే ఔటయ్యాడు. టాప్ ఓపెనర్లు ఔటయిన వేళ గ్రౌండ్లో నిలబడదామనుకున్న నితీశ్ రానా 15 పరుగులకే వెనుదిరిగాడు. ఈ సమయంలో గ్రౌండ్లోకి దిగిన సమీర్ రిజ్వీ అద్భుతంగా ఆడి 70 పరుగుల భారీ స్కోర్తో జట్టుకు విజయాన్ని అందించాడు. అక్షర్ పటేల్ గోల్డెన్ డకౌట్ అయినా కూడా త్రిస్టన్ స్టబ్స్తో కలిసి సమీర్ రిజ్వీ చక్కటి భాగస్వామ్యం నెలకొల్పి స్కోర్ బోర్డును పరిగెత్తించాడు. 47 బంతుల్లో 70 పరుగులు చేసిన రిజ్వీ.. 5 ఫోర్లు, 4 సిక్సర్లు బాదాడు. 32 బంతుల్లో 39 పరుగులు చేసిన త్రిస్టన్ 3 ఫోర్లు, ఒక సిక్సర్ నమోదు చేశాడు. బౌలింగ్లో లక్నో ఆరంభంలో అదరగొట్టినా ఆఖరు వరకు కసి కొనసాగించలేకపోవడంతో మ్యాచ్ చేజారింది. ప్రిన్స్ యాదవ్, షమీ మినహా మిగతా బౌలర్లు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Wholesale Second Hand Market: రేంజ్ రోవర్ రూ.18 లక్షలు.. క్రెటా రూ. 6 లక్షలే. హైదరాబాద్, ఢిల్లీ మార్కెట్లో కళ్లు చెదిరే ధరలు..!!
Lakshmapur, Telangana:Wholesale Second Hand Market: సాధారణంగా షోరూమ్లో లగ్జరీ కార్ల ధరలు ఆకాశాన్ని తాకుతుంటాయి. కానీ సెకండ్ హ్యాండ్ మార్కెట్లో ఇవే కార్లు నమ్మశక్యం కాని ధరలకు లభిస్తున్నాయి. ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలోని కరోల్ బాగ్ మార్కెట్ సెకండ్ హ్యాండ్ వాహనాలకు కేరాఫ్ అడ్రస్గా నిలుస్తోంది. ఇక్కడ లగ్జరీ కార్లు, సూపర్బైక్లు హోల్సేల్ రేట్లకే దొరుకుతుండటంతో దేశవ్యాప్తంగా ఉన్న కారు ప్రేమికులు ఇక్కడికి క్యూ కడుతున్నారు.
ప్రముఖ ఆటోమొబైల్ వ్లాగర్స్, మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం, కరోల్ బాగ్లో కార్ల ధరలు ఇలా ఉన్నాయి:
మెర్సిడెస్ CLA (Mercedes CLA): దీని ధర సుమారు రూ. 12 లక్షల (₹1.2 మిలియన్లు) నుంచే ప్రారంభమవుతోంది.
రేంజ్ రోవర్ ఎవోక్ (Range Rover Evoque): కేవలం రూ. 18 లక్షలకే (₹1.8 మిలియన్లు) ఈ లగ్జరీ ఎస్యూవీని సొంతం చేసుకోవచ్చు.
జాగ్వార్ F-పేస్ (Jaguar F-Pace): దీని ధర దాదాపు రూ. 23 లక్షల వరకు పలుకుతోంది.
ఫోర్డ్ ఎండీవర్ (Ford Endeavour): ఆఫ్రోడ్ ప్రియుల ఫేవరెట్ అయిన ఈ కారు రూ. 18 లక్షల నుంచి లభిస్తోంది.
హ్యుందాయ్ క్రెటా (Hyundai Creta): పాపులర్ ఎస్యూవీ క్రెటా ఇక్కడ కేవలం రూ. 6.75 లక్షల నుంచే అందుబాటులో ఉంది.
ఢిల్లీలో కేవలం కరోల్ బాగ్ మాత్రమే కాకుండా సరోజినీ నగర్, లజపత్ నగర్, వికాస్పురి, మోతీ నగర్ వంటి ప్రాంతాలు కూడా సెకండ్ హ్యాండ్ కార్లకు ప్రధాన హబ్లుగా ఉన్నాయి.
హైదరాబాద్ మార్కెట్లోనూ సందడి!
కేవలం ఢిల్లీలోనే కాదు, మన హైదరాబాద్లో కూడా సెకండ్ హ్యాండ్ కార్ల మార్కెట్ భారీగా విస్తరించింది. నగరంలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ పరిసరాల్లో లగ్జరీ కార్ల రీసేల్ షోరూమ్లు ఎక్కువగా ఉన్నాయి. అలాగే కూకట్పల్లి, ఎల్బీనగర్, ఉప్పల్ ప్రాంతాల్లోని మల్టీ-బ్రాండ్ యూజ్డ్ కార్ స్టోర్లలో క్రెటా, ఫార్చ్యూనర్ వంటి వాహనాలు రీజనబుల్ ధరలకే లభిస్తున్నాయి. ఢిల్లీతో పోలిస్తే ఇక్కడ ధరలు కొంచెం అటు ఇటుగా ఉన్నప్పటికీ, లోకల్ రిజిస్ట్రేషన్ (TS/AP) ఉండటం వల్ల రీ-రిజిస్ట్రేషన్ తలనొప్పులు ఉండవు.
సెకండ్ హ్యాండ్ కారు కొనే ముందు ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
తక్కువ ధరకు వస్తుంది కదా అని తొందరపడి కారు కొంటే భవిష్యత్తులో ఇబ్బందులు పడే అవకాశం ఉంది. అందుకే కొనుగోలు చేసే ముందు ఈ క్రింది విషయాలను గుర్తుంచుకోండి:
డాక్యుమెంట్ వెరిఫికేషన్: వాహనానికి సంబంధించిన ఆర్సి (RC), ఇన్సూరెన్స్, పొల్యూషన్ సర్టిఫికేట్లను క్షుణ్ణంగా తనిఖీ చేయండి. ఆర్సి బదిలీలో ఎటువంటి చట్టపరమైన చిక్కులు లేకుండా చూసుకోవాలి.
మెకానికల్ చెకప్: కారు ఇంజిన్ కండిషన్, యాక్సిడెంట్ హిస్టరీ, కిలోమీటర్ల రీడింగ్ను నమ్మకమైన మెకానిక్తో చూపించడం మంచిది.
సర్వీస్ రికార్డ్స్: కారుకు కంపెనీ సర్వీస్ సెంటర్లో రెగ్యులర్ సర్వీసింగ్ జరిగిందో లేదో రికార్డుల ద్వారా తెలుసుకోండి.
టెస్ట్ డ్రైవ్: కారును కనీసం 5-10 కిలోమీటర్లు నడిపి చూడండి. దీనివల్ల సస్పెన్షన్, గేర్ బాక్స్, ఏసీ పనితీరుపై అవగాహన వస్తుంది.
తక్కువ ధరలో మంచి కారు దొరకడం అదృష్టమే, కానీ సరైన సమాచారం లేకుండా కొంటే మోసపోయే ప్రమాదం ఉంది. అందుకే పూర్తి వివరాలు తెలుసుకున్నాకే డీల్ కుదుర్చుకోండి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Tirumala: తిరుమల భక్తులకు భారీ శుభవార్త.. అలిపిరిలో పులి భయం అక్కర్లేదు
Tirupati Urban, Andhra Pradesh:Alipiri Foot Path: తిరుమల వెళ్లే భక్తుల భద్రతే ధ్యేయంగా టీటీడీ అటవీ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. వేసవి కాలంలో తిరుమలకు భక్తుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో, అడవి జంతువుల నుంచి యాత్రికులను రక్షించేందుకు అత్యాధునిక సాంకేతికతను రంగంలోకి దించింది. మొదటి ఘాట్ రోడ్, నడకదారుల్లో చిరుతలు, ఎలుగుబంట్ల కదలికలను కనిపెట్టేందుకు డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. దీంతో అటవీ జంతువుల నుంచి రక్షణ లభిస్తుంది.
Also Read: YS Sharmila: ఆత్మగౌరవాన్ని మోదీ కాళ్ల దగ్గర తాకట్టు పెట్టిన ఏపీ ఎంపీలు: వైఎస్ షర్మిల
కలియుగ వైకుంఠం తిరుమలకు వేసవి సెలవుల దృష్ట్యా భక్తుల తాకిడి విపరీతంగా పెరిగింది. కాలినడకన వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. అయితే అటవీ ప్రాంతం కావడంతో నడకదారిలో చిరుత పులులు, ఎలుగుబంట్లు, ఏనుగుల సంచారం భక్తులను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. మొదటి ఘాట్ రోడ్డులోని అటవీ ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాలను వినియోగిస్తున్నారు. రాత్రి సమయాల్లో కూడా జంతువుల జాడను స్పష్టంగా గుర్తించేందుకు నైట్ విజన్ కెమెరాలతో కూడిన డ్రోన్లను ఉపయోగిస్తున్నారు. ప్రతి రోజూ రాత్రి 7 గంటల నుంచి 11 గంటల వరకు ఈ డ్రోన్ల ద్వారా నిరంతర మానిటరింగ్ కొనసాగుతుంది.
Also Read: Liquor Shops: రేపు హైదరాబాద్లో 24 గంటలు వైన్షాపులు, బార్లు బంద్
అలిపిరి నడకదారి సమీపంలో క్రూర మృగాల కదలికలు కనిపిస్తే.. వెంటనే క్షేత్రస్థాయి సిబ్బందిని అప్రమత్తం చేసి భక్తులకు ఎలాంటి హాని జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. గతంలో జరిగిన కొన్ని ఘటనలను దృష్టిలో ఉంచుకుని టీటీడీ, అటవీ శాఖ సమన్వయంతో తీసుకుంటున్న ఈ డ్రోన్ నిఘా చర్యలపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భయం లేకుండా గోవిందుడిని దర్శించుకునేలా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
Also Read: Liquor Income:లిక్కర్తో తెలంగాణ ఖజానా గలగల.. ఏడాదిలో వచ్చిన ఆదాయం ఎంతంటే?
తిరుమలలో ప్రముఖులు
తిరుమల వేంకటేశ్వర స్వామిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు ఉదయం విరామ సమయంలో తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల కుటుంబసమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికి.. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదాశీర్వచనం అందించి స్వామి తీర్థప్రసాదాలను అందజేశారు. తెలంగాణలోని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, అశ్వారావుపేట ఎమ్మెల్యే ఆదినారాయణ దర్శించుకున్నారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహారెడ్డి తన పిల్లలతో కలిసి తిరుమలను సందర్శించారు. కన్నడ సీనియర్ నటి తార శ్రీవారి మొక్కును చెల్లించుకున్నారు. ప్రముఖ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి, నిర్మాత అచ్చిరెడ్డి కలిసి వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
YS Sharmila: ఆత్మగౌరవాన్ని మోదీ కాళ్ల దగ్గర తాకట్టు పెట్టిన ఏపీ ఎంపీలు: వైఎస్ షర్మిల
Nuzendla, Andhra Pradesh:Amaravati Capital Bill: విభజన హామీలు, ప్రత్యేక హోదాపై, పార్లమెంట్ వేదికగా ఒక్క ఆంధ్రప్రదేశ్ ఎంపీ నోరు విప్పలేదని ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. విభజన హామీలపై వారికి చిత్తశుద్ధి లేకపోవడం సిగ్గుచేటు అని మండిపడ్డారు. ప్రత్యేక హోదా అంశంపై ఒక్కరూ కూడా ప్రశ్నించలేకపోయారని దుయ్యబట్టారు. తెలుగు వారి ఆత్మగౌరవం, ఆత్మాభిమానం, పౌరుషాన్ని మోదీ కాళ్ల దగ్గర తాకట్టు పెట్టారని వైఎస్ షర్మిల విమర్శించారు.
Also Read: Liquor Shops: రేపు హైదరాబాద్లో 24 గంటలు వైన్షాపులు, బార్లు బంద్
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్దత కల్పిస్తూ లోక్సభలో బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంగా జరిగిన చర్చపై వైఎస్ షర్మిల ఎక్స్ వేదికగా స్పందించారు. 'విభజన హామీలు, ప్రత్యేక హోదాపై, పార్లమెంట్ వేదికగా కాంగ్రెస్ పార్టీ గళం వినిపించిన ఎంపీ మాణిక్కం ఠాగూర్కి ఆంధ్రప్రదేశ్ ప్రజల పక్షాన కృతజ్ఞతలు. కాంగ్రెస్ పార్టీ ఏపీ వ్యవహారాల ఇంచార్జిగా ఉన్నందుకు విభజన హామీలపై మీకున్నంత చిత్తశుద్ధి ఏపీ ఎంపీలకు లేనందుకు సిగ్గుపడాలి. ప్రత్యేక హోదా ఏది అని అడుగుతుంటే ఇక్కడ పుట్టిన ఒక్క ఎంపీ కూడా మద్దతుగా నిలబడకపోవడం తెలుగుగడ్డ చేసుకున్న దౌర్భాగ్యం' అని వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. 'తెలుగు వారి ఆత్మగౌరవాన్ని, ఆత్మాభిమానాన్ని, పౌరుషాన్ని మోదీ కాళ్ల దగ్గర తాకట్టు పెట్టారని అనడానికి ఇంతకంటే నిదర్శనం మరేం కావాలి?' అని ప్రశ్నించారు.
Also Read: Liquor Income:లిక్కర్తో తెలంగాణ ఖజానా గలగల.. ఏడాదిలో వచ్చిన ఆదాయం ఎంతంటే?
'ఎప్పటిలాగే మళ్లీ మన ఎంపీలు బుద్ధిమంతులు. ప్రధాని మోదీకి భజనపరులు. మన ఎంపీలకు స్వలాభం మిన్నా.. రాష్ట్ర ప్రయోజనాలు సున్నా' అని ఏపీ ఎంపీలపై వైఎస్ షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విభజన హామీలు, హక్కుల కంటే మోడీ మెప్పే మిన్న అని ఎంపీ తీరును ఖండించారు. 'పేరుకు మాత్రమే వేరు వేరు పార్టీ ఎంపీలు. అందరూ బీజేపీకి బానిసలు. మోడీ చేతుల్లో రబ్బర్ స్టాంప్స్. బీజేపీ చేతిలో కీలుబొమ్మలు' అని వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. 'బీజేపీ బిల్లులకు గొర్రెల్లా తల ఊపడం తప్ప 11 ఏళ్లు దాటినా ప్రత్యేక హోదా ఏమైందని అడిగే దమ్ము ఒక్కరిలో లేదు. 10 ఏళ్లు హోదా ఎక్కడ అని అడిగే నిలదీసే సత్తా ఎవరికి లేదు' అని మండిపడ్డారు. ఢిల్లీని తలదన్నే రాజధాని నిర్మాణానికి అప్పులెందుకని ప్రశ్నించే ధైర్యం 25 మంది లోక్సభ, 11 మంది రాజ్యసభ ఎంపీలకు లేకపోవడం రాష్ట్రం చేసుకున్న దురదృష్టం అని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read: Chicken Margin: మాంసంప్రియులు నోరు కట్టేసుకోవాల్సిందే! రేపటి నుంచి చికెన్ దుకాణాలు బంద్!
విభజన హామీలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇచ్చిన చెక్కు లాంటిదని తాను మళ్లీ చెబుతున్నట్లు వైఎస్ షర్మిల తెలిపారు. '2014లోనే విభజన హామీల విలువ రూ.5 లక్షల కోట్లు. చెక్కు మన చేతిలో ఉంది. దాని మనం ఎన్క్యాష్ చేసుకోలేకపోతున్నాం. పార్లమెంట్ వేదికగా హామీల కమిటీ అమరావతికి కేంద్రం సహాయం చేయలేదని చెప్పినా.. పోలవరం ఎత్తు ఇక 41 మీటర్లే అని లిఖితపూర్వకంగా సమాధానాలు చెబుతున్నా, విభజన హామీల్లో ఇప్పటివరకు 5 శాతం కూడా అమలు కాకపోయినా, మౌనం వహిస్తూ గుడ్డి గుర్రాలకు పళ్ళు తోముతున్నందుకు ఎంపీలు రాజీనామా చేయాలి' అని కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Happy Hanuman Jayanti 2026: హనుమాన్ జయంతి శుభకాంక్షలు.. అందరి ఇంట ఆయురారోగ్యాలు నిండాలి!
Hyderabad, Telangana:Happy Hanuman Jayanti Wishes And Greetings 2026: చైత్ర పౌర్ణమి రోజు హనుమాన్ దీక్షను ప్రారంభించిన భక్తులు.. మండల కాలం పూర్తిచేసుకుని వైశాఖ దశమినాడే మాలవిరమణ చేస్తారు. అందుకే ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో అత్యంత వైభవంగా హనుమాన్ జయంతిని జరుపుకుంటారు. హనుమమాల ధరించిన వేలాదిమంది భక్తులు ఈరోజు తమ దీక్షను విరమించి.. ఇష్ట దైవానికి మొక్కులు తీర్చుకుంటారు. ఏడాది హనుమాన్ జయంతి ఏప్రిల్ రెండవ తేదీన వచ్చింది. ఇంతటి ప్రత్యేకత కలిగిన పండగ అందరి జీవితాల్లో వెలుగును నింపాలని కోరుకుంటూ.. ఇలా మీ మేలుకోరే ప్రతి ఒక్కరికి హనుమాన్ జయంతి శుభాకాంక్షలు సోషల్ మీడియా ద్వారా పంపండి.
శుభాకాంక్షలు..
కొండల నెత్తిన మేటి బలిశాలి.. కోరిన కోరికలు తీర్చే వనమాలి.. మీ జీవితం ఆ హనుమంతుడి ఆశీస్సులతో ధైర్యంగా సాగిపోవాలని మనసారా కోరుకుంటూ.. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ పేరుపేరునా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు.
రామ నామమే శ్వాసగా.. రామసేవయే ధ్యానంగా.. భక్తికి ప్రతిరూపమైన ఆ వాయు పుత్రుడు మీ ఇంట సుఖశాంతులు నింపాలని.. మనసారా కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ పేరుపేరునా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు.
సముద్రాన్ని దాటిన ఆ ధీరుడు సంకల్పం.. మీ లక్ష్య సాధనకు స్ఫూర్తి కావాలి.. అంజనీపుత్రుని దీవెనలు మీకు ఎల్లప్పుడూ తోడుండాలని ఆకాంక్షిస్తూ.. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు..
గదను పట్టిన చేతులు అభయాన్ని ఇస్తుంటే.. నూట వినిపించే రామాయణం లోకాన్ని తరిస్తుంటే.. ఆ మారుతీ కరుణాకటాక్షాలు మీకు కలగాలని కోరుకుంటూ.. హనుమాన్ జయంతి శుభాకాంక్షలు.
బుద్ధిర్బలం యశోధైర్యం.. ప్రసాదించే జ్ఞాన గురువు హనుమంతుడు.. మీలో అజ్ఞానపు చీకట్లు తొలిగి.. జ్ఞానపు జ్యోతి వెలగాలని ఆశిస్తూ.. మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు.
ఎక్కడ రామనామం వినిపిస్తుందో.. అక్కడ హనుమంతుడు కొలువై ఉంటాడు.. మీ ప్రతి అడుగులో ఆ స్వామి తోడుండి.. మీకు విజయాన్ని చేకూర్చాలని కోరుకుంటూ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు.
మనసు కంటే వేగంగా కదిలి భక్తులను కాపాడే ఆపద్బాంధవుడు ఆ హనుమంతుడు.. మీ కష్టాలన్నీ వాయువేగంతో మాయమాయి పోవాలని కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు.
Also Read: Saleshwaram: రేపటి నుంచే సలేశ్వరం జాతర.. తెలంగాణ అమరనాథ్ యాత్ర ప్రత్యేకత ఏంటో తెలుసా?
చిరంజీవిగా వెలుగొందే కేసరీ నందనుడు.. మీ ఆయురారోగ్యాలను రక్షించాలి.. మీ కుటుంబం పై ఆయన కరుణ, ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ.. హనుమాన్ జయంతి శుభాకాంక్షలు.
సూర్యుడినే ఫలంగా భావించి.. ఎగసిన పరాక్రమశాలి.. మీ జీవితంలో కూడా అంతటి ప్రకాశం, కీర్తి ప్రతిష్టలను ఆ స్వామివారు అందించాలని కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ హనుమాన్ జయంతి ప్రత్యేకమైన శుభాకాంక్షలు..
దాస్య భక్తికి నిలువెత్తు సాక్ష్యం ఆ ఆంజనేయుడు.. నీ స్వార్థమైన సేవతో.. ధర్మ మార్గంలో మీరు పయనించాలని కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ పేరుపేరునా హనుమాన్ జయంతి ప్రత్యేకమైన శుభాకాంక్షలు..
Also Read: Saleshwaram: రేపటి నుంచే సలేశ్వరం జాతర.. తెలంగాణ అమరనాథ్ యాత్ర ప్రత్యేకత ఏంటో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Karimnagar: వింత ఘటన.. ఇళ్లకు తాళాలు వేసి పొలాల్లోకి.. భయంతో వణికిపోతున్న గ్రామస్థులు!
Karimnagar, Telangana:Karimnagar Latest News: ఒక మామూలు సాధారణ గ్రామం కాదు.. తెల్లవారుజామున నాలుగు గంటలకి ఇళ్లకు తాళాలు వేస్తున్నారు.. విల్లాపాపలతో సహా జనం పొలాల బాట పడుతున్నారు.. వంట సామాగ్రి తో పాటు బియ్యం, కూరగాయలు మూటలు గట్టుకొని అడవి బాట పట్టారు.. కారణం తెలిస్తే అందరూ ఆశ్చర్య పోవాల్సిందే.. కారణమేంటో కాదు ఆ ఊరికి కీడు సోకిందన్న భయం.. అవును మీరు విన్నది నిజమే. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం కేశవాపూర్ గ్రామంలో చోటుచేసుకున్న ఈ వింత ఘటన ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు ఈ ఊరు పేరు వింటేనే అంతా భయపడి పోవలసిన పరిస్థితి ఏర్పడింది. అసలు ఏం జరిగింది? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..
గత రెండు నెలలుగా కేశవపూర్ గ్రామంలో వరస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి.. కేవలం 60 రోజుల వ్యవధిలో సుమారు 15 మంది వివిధ కారణాలతో మరణించారట.. తాజాగా ఒకరు మరణించిన తర్వాత.. వారి దశదిన కర్మలు కూడా పూర్తికాకముందే మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోవడంతో గ్రామస్తుల్లో ఒక ఊహించని ఆందోళన మొదలైంది. వయస్సుతో సంబంధం లేకుండా ఒకరి వెనక ఒకరు మృత్యువాత పడడంతో.. గ్రామానికి ఏదో దోష చుట్టుముట్టిందని ప్రజలు బలంగా నమ్ముతున్నారు..
గ్రామంలో నెలకొన్న ఈ భయానక పరిస్థితులపై గ్రామ పెద్దలతో పాటు యువకులు కలిసి ఒక జ్యోతిష్య శాస్త్ర పండితుడిని ఆశ్రయించినట్లు తెలుస్తోంది. ఊరిపై ఉన్న గ్రహ దోషం పోవాలంటే కీడు పంటలు చేయాలని ఆయన సూచించారు. సూర్యోదయానికి ముందే ఊరు విడిచి వెళ్లాలని.. రోజంతా ఊరి పొలిమేరల అవతల పడుకొని తిని.. సూర్యాస్తమయం అయ్యాక చీకటి పడ్డాకే మల్లి పిల్లకు చేరుకోవాలని నియమం విధించారు.. ఇలా చేస్తే గ్రామానికి అంతా బాగా జరుగుతుందని ఆ జ్యోతిష్యులు తెలిపారుట..
పండితుడి సూచనల మేరకు గ్రామస్తులందరూ ఏకమై ఈ నిర్ణయాన్ని అమలు చేస్తున్నారు. బుధవారం తెల్లవారుజామునే గ్రామం అంత ఖాళీ చేసిన పొలాల్లోకి చేరుకున్నారు.. ఊరులోని పాఠశాలలతో పాటు అంగన్వాడి కేంద్రాలు, దుకాణాలు అన్ని మూతపడ్డాయి. అలాగే చెట్ల కింద పొయ్యిలు వెలిగించి సామూహికంగా వంటలు చేసుకుంటున్నారు.. చిన్నపిల్లల నుంచి ముసలి వారి వరకు అందరూ రోజంతా ఊరికి దూరంగానే గడిపారు. వరుస చావులు సంభవిస్తుంటే తట్టుకోలేకపోతున్నాం.. ఎవరికి ఏమవుతుందో అని భయమేస్తోంది.. అందుకే అందరం కలిసి ఊరి దోషం పోవాలని ఈ కార్యక్రమం చేపట్టామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తూ వస్తున్నారు.
Also Read: Saleshwaram: రేపటి నుంచే సలేశ్వరం జాతర.. తెలంగాణ అమరనాథ్ యాత్ర ప్రత్యేకత ఏంటో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Liquor Shops: రేపు హైదరాబాద్లో 24 గంటలు వైన్షాపులు, బార్లు బంద్
Hyderabad, Telangana:Tomorrow Wine Shops Close: మొన్ననే మద్యం దుకాణాలు, బార్లు బంద్ ఉండగా మందుబాబులు కొంత ఇబ్బందులు పడ్డారు. మళ్లీ మరోసారి మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. హైదరాబాద్లోని మద్యం దుకాణాలతోపాటు బార్లు, కల్లు దుకాణాలు బంద్ ఉండనున్నాయి. మొన్న శ్రీరామనవమి సందర్భంగా వైన్స్ మూసివేయగా.. ఇప్పుడు హనుమాన్ జయంతి సందర్భంగా మద్యం దుకాణాలు మూసివేయాలని ఎక్సైజ్ శాఖ, పోలీస్ శాఖ సూచించింది.
Also Read: Amaravati: అమరావతిని ఎవరూ టచ్ చేయలేరు.. అంగుళం కదపలేరు: సీఎం చంద్రబాబు
వైన్స్ దుకాణాలు మూసివేస్తూ మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ అవినాశ్ మహంతి ఉత్తర్వులు జారీ చేశారు. మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మద్యం దుకాణాలు, కల్లు దుకాణాలు, బార్లు రెస్టారెంట్లు మూసివేస్తున్నట్లు పోలీసులు ప్రకటించారు. 2వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 3వ తేదీ ఉదయం 6 గంటల వరకు మూసివేయాలని పోలీస్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. హనుమాన్ జయంతి సందర్భంగా మద్యం విక్రయాలు బంద్ చేస్తున్నట్లు పోలీస్ శాఖ తెలిపింది. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో కూడా మద్యం దుకాణాలు మూసివేసే అవకాశం ఉంది. ఒక్క సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో తెరచి ఉంటాయని తెలుస్తోంది. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడలేదు.
Also Read: Tank Bund Shiva: ప్రాణాలు కాపాడే ట్యాంక్బండ్ శివకు రూ.5 లక్షలు, ప్రభుత్వ ఉద్యోగం
వీర హనుమాన్ విజయయాత్ర
హనుమాన్ జయంతి సందర్భంగా గౌలిగూడ నుంచి సికింద్రాబాద్ తాడ్బండ్ వరకు వీర హనుమాన్ విజయయాత్ర నిర్వహించనున్నట్లు భజరంగ్ దళ్ తెలిపింది. రేపు గురువారం ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు గౌలిగూడ రామమందిరంలో యజ్ఞం, 11 గంటలకు కోఠి కూడలిలో సామూహిక హనుమాన్ చాలీసా నిర్వహించనున్నట్లు భజరంగ్ దళ్ రాష్ట్ర కన్వీనర్ కొండా శ్రీకాంత్ వెల్లడించారు. అనంతరం ద్విచక్ర వాహన ర్యాలీ ప్రారంభమై కోఠి, సుల్తాన్ బజార్, కాచిగూడ, నారాయణగూడ, చిక్కడపల్లి, అశోక్నగర్, ట్యాంక్బండ్, బాటా, ప్యారడైజ్ మీదుగా తాడ్బండ్ హనుమాన్ దేవాలయం వరకు యాత్ర కొనసాగుతుందని తెలిపారు.
Also Read: Chicken Margin: మాంసంప్రియులు నోరు కట్టేసుకోవాల్సిందే! రేపటి నుంచి చికెన్ దుకాణాలు బంద్!
శోభయాత్ర ఏర్పాట్లు పరిశీలన
ఈ నెల 2వ తేదీన హనుమాన్ జయంతి నేపథ్యంలో తాడ్బండ్ వద్ద జరుగుతున్న ఏర్పాట్లను హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ పరిశీలించారు. హనుమాన్ జయంతి శోభాయాత్ర రూట్ మ్యాప్ పరిశీలించి నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఎలివేటెడ్ కారిడార్ పనులు జరుగుతుండడంతో శోభాయాత్ర రూట్మ్యాప్ను బాంటియా గార్డెన్ మీదుగా తరలించేందుకు చర్యలు చేపడుతున్నట్లు కమిషనర్ సజ్జనార్ తెలిపారు. 3000 మంది పోలీసు సిబ్బందితో పాటు సీసీ కెమెరాలతో శోభయాత్రను అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా విజయవంతం చేసేందుకు సన్నహాలు చేస్తున్నట్లు పోలీస్ శాఖ వెల్లడించింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Kondagattu: కేసరి వర్ణంగా మారిన కొండగట్టు గుట్ట.. కిలోమీటర్ల మేర క్యూ!
Kondagattu, Telangana:Kondagattu Latest Telugu News: జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయస్వామి సన్నిధి భక్తులతో కిటకిట లాడుతోంది. చిన్న హనుమాన్ జయంతి పండుగను పురస్కరించుకొని రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా తరలివచ్చిన హనుమాన్ దీక్ష పరులతో కొండగట్టు పరిసరాలన్నీ కేసరి వర్ణంగా మారాయి.. ప్రతి ఏడాది కొండగట్టులో హనుమాన్ జయంతి ఎంతో ఘనంగా జరుగుతుంది. ఈసారి కూడా దీక్షాపరులతో హనుమాన్ జయంతి ఘనంగా జరగబోతున్నట్లు ఆలయ అధికారులు తెలుపుతున్నారు. ఇప్పటికే ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు..
41 రోజులపాటు కఠిన దీక్షలు చేపట్టిన స్వాములు.. శనివారం తెల్లవారుజాము నుంచే కొండగట్టుకు చేరుకోవడం ప్రారంభించారు. తమ ఆరాధ్య దైవమైన అంజనకు ఇరుముడులు సమర్పించి.. మొక్కులు చెల్లించుకుంటున్నారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు కిలోమీటర్ల మేర క్యూ లైన్ లలో వేచి ఉన్నారు. జైశ్రీరామ్.. జై హనుమాన్ అనే నామస్మరణతో కొండగట్టు పై ఆధ్యాత్మిక వాతావరణం ఏర్పడింది. కొండపై భారీ ఎత్తున స్వాములు ఉండడంతో.. కేసరి వర్ణంగా మారిపోయింది..
దీక్షపరుల తాకిడిని దృష్టిలో ఉంచుకొని ఆలయ అధికారులతో పాటు జిల్లా యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లను చేసినట్లు తెలుస్తోంది. దీక్ష పరులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఆలయ ఆవరణంలోని ప్రత్యేకమైన ఇరుముడి సమర్పణ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎండ తీవ్రత దృశ్య క్యూ లైన్ లో ఉన్న భక్తులకు నిరంతరం మంచినీరుతో పాటు మజ్జిగ సరఫరా కూడా చేయబోతున్నట్లు తెలుస్తోంది. స్వచ్ఛంద సంస్థల సహకారంతో ప్రత్యేకమైన అన్నదాన కార్యక్రమాలు కూడా కొనసాగుతాయి. అలాగే అత్యవసర పరిస్థితుల కోసం ప్రత్యేక వైద్య శిబిరాలతో పాటు ఆంబులెన్స్ సేవలను కూడా అందుబాటులో ఉంచారు.
Also Read: Saleshwaram: రేపటి నుంచే సలేశ్వరం జాతర.. తెలంగాణ అమరనాథ్ యాత్ర ప్రత్యేకత ఏంటో తెలుసా?
భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని కొండగట్టు పై వాహనాల రాకపోకలపై పోలీసులు ప్రత్యేకమైన ఆంక్షలు కూడా విధించినట్లు తెలుస్తోంది. ఘాటు రోడ్లలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు చేసి.. కొన్నిచోట్ల ప్రత్యేకమైన సీసీ కెమెరాలు ద్వారా పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తెలుస్తోంది. తమ కష్టాలను తీర్చి.. కొంగుబంగారంగా విరాజిల్లే కొండగట్టు అంజన్న ను దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.. ఏడాది దీక్షపరుల సంఖ్య గతంతో పోలిస్తే మరింత పెరిగే అవకాశం ఉండడంతో అధికారులు మరిన్ని అదనపు ఏర్పాట్లు చేయాలని భక్తులు కోరుతున్నారు..
Also Read: Saleshwaram: రేపటి నుంచే సలేశ్వరం జాతర.. తెలంగాణ అమరనాథ్ యాత్ర ప్రత్యేకత ఏంటో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Most Expensive Wine: ఒక్క బాటిల్ వైన్.. ఒక లగ్జరీ విల్లా కంటే ఖరీదు! ఎందుకంత క్రేజ్?
Hyderabad, Telangana:Most Expensive Wine Telugu: ఒక్క వైన్ బాటిల్ ధర ఎంత ఉంటుంది? కొన్ని వందలు లేదా వేల రూపాయలు ఉంటుంది.. మల్టీ నేషనల్ బ్రాండ్ అయితే లక్షల్లో ఉండవచ్చు.. కానీ ఒకే ఒక బాటిల్ వైన్ ధర ఏకంగా విల్లా, ఖరీదైన లగ్జరీ కార్ల కంటే ఎక్కువకు అమ్ముడై అందర్నీ ఆశ్చర్యపరిచేలా చేసింది. ప్రపంచ ప్రఖ్యాతి డొమైన్ డి లా రోమనీ-కొంటి బ్రాండ్ కు చెందిన 1945 నాటి ఓ వైన్ బాటిల్ ఇటీవల జరిగిన అకర్ వేలంలో ఏకంగా 7.63 కోట్ల రూపాయలకు అమ్ముడైంది. ఇది ఇప్పుడు ప్రపంచ రికార్డును సృష్టించింది. కేవలం ఒక వైన్ బాటిల్ ఇంతవరకు అమ్ముడుపోవడానికి గల కారణాలు? అసలు ఈ వైన్లో ఉన్న స్పెషాలిటీ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
న్యూయార్క్లో నిర్వహించిన ప్రతిష్టాత్మక వేలంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోటీశ్వరులతో పాటు వైన్ బాటిల్స్ ను సేకరించేవారు భారీ మొత్తంలో పాల్గొన్నారు. ఈ వేళంలో 1945 నాటి వింటేజ్కు చెందిన ఈ బాటిల్ కోసం ఒకరంటే ఒకరు పోటా పోటీగా.. దీనిని గెలుచుకునేందుకు ఆసక్తి చూపారు. చివరికి ఒక వ్యక్తి దీనిని రికార్డు స్థాయి ధరకు దక్కించుకున్నారు. 2018లో ఇదే బ్రాండ్ కు చెందిన ఒక బాటిల్ సుమారు నాలుగు కోట్ల రూపాయలకు అమ్ముడవ్వగా.. తాజా వేలం ఆ రికార్డును తుడిచి వేసింది..
ఈ వైన్ బాటిల్ ఇంత ఖరీదు పలకడానికి ప్రధాన కారణం దాని అరుదైన చరిత్రగా భావించవచ్చు. 1945 ప్రాంతంలో ఫ్రాన్స్లోని బుర్గుండి ప్రాంతంలో ఉన్న ప్రసిద్ధ రోమనీ-కొంటి ద్రాక్ష తోటల నుండి దీనిని తయారు చేశారు. ఆ సంవత్సరంలో కేవలం 600 బాటిళ్లు మాత్రమే తయారు చేశారు. రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన సమయంలో తయారైన ఈ వైన్.. ఆ తోటల్లోని పాత ద్రాక్ష తీగలను తొలగించి కొత్తవి నాటడానికి ముందు సేకరించిన చివరి పంట నుండి వచ్చినది. అందుకే దీనిని పురాతన రుచిగా వైన్ ప్రియులు భావిస్తారు.. దాదాపు 80 ఏళ్లు గడిచిన దీని రుచితో పాటు నాణ్యతకు చెక్కుచెదరకుండా ఉండడం విశేషం..
Read more: Scorpio, Ertiga సగం ధరకే.. ఢిల్లీ కార్ బజార్లో రూ.30 వేలకే కారు మీ సొంతం!
వేల నిర్వహించిన అకర్ సంస్థ చైర్మన్ జాన్ కాపోన్ మాట్లాడుతూ.. ఇది కేవలం వైన్ మాత్రమే కాదు.. ఒక చరిత్రని.. నా జీవితంలో కేవలం మూడుసార్లు మాత్రమే దీనిని రుచి చూసే అవకాశం కలిగిందని.. ఇది కేవలం ప్రపంచంలోనే అత్యంతమైనదని.. ఆయన తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైన్ కలెక్టర్లు కూడా దీనిని వైన్ ప్రపంచంలో కోహినూర్ వజ్రంగా అభివర్ణిస్తారు. అరుదైన వస్తువులను సేకరించే వారికి దీని సీసా గొప్ప ఆస్తిగా పరిగణిస్తారు..
Read more: Scorpio, Ertiga సగం ధరకే.. ఢిల్లీ కార్ బజార్లో రూ.30 వేలకే కారు మీ సొంతం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Amaravati: అమరావతిని ఎవరూ టచ్ చేయలేరు.. అంగుళం కదపలేరు: సీఎం చంద్రబాబు
Vinjamur, Andhra Pradesh:Amaravati Capital Bill: ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్దత కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకువచ్చిన బిల్లును లోక్సభ ఆమోదించిన నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక అమరావతిని ఎవరూ టచ్ చేయలేరని ప్రకటించారు. ఒక్క అంగుళం కూడా కదపలేరని స్పష్టం చేశారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతి అని తెలిపారు. అమరావతికి చట్టబద్దత కల్పిస్తూ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టడం ఒక చరిత్రగా ప్రకటించారు. భవిష్యత్లోనే అమరావతిని ఎవరూ టచ్ చేయలేరని.. ఆంధ్రప్రదేశ్కు ఏకైక రాజధానిగా అమరావతి ఉంటుందని తెలిపారు.
Also Read: Tank Bund Shiva: ప్రాణాలు కాపాడే ట్యాంక్బండ్ శివకు రూ.5 లక్షలు, ప్రభుత్వ ఉద్యోగం
నెల్లూరు జిల్లా వింజమూరులో ఫించన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం నిర్వహించిన ప్రజా వేదిక సభలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఐదేళ్లు అరాచక, విధ్వంస పాలన సాగిందని వైఎస్ జగన్ పేరు ప్రస్తావించకుండా విమర్శించారు. వైఎస్సార్సీపీ మూడు ముక్కలాట, మూడు రాజధానుల నినాదంతో అమరావతిపై దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు. అమరావతికి చట్టబద్దత కోసం తీర్మానం చేసేందుకు ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశం నిర్వహిస్తే మాజీ సీఎం వైఎస్ జగన్ రాలేదని గుర్తుచేశారు.
Also Read: Chicken Margin: మాంసంప్రియులు నోరు కట్టేసుకోవాల్సిందే! రేపటి నుంచి చికెన్ దుకాణాలు బంద్!
ప్రజామోదం పొందిన రాజధాని అమరావతి విషయంలో ఇంత కక్ష పెట్టుకోవడాన్ని ఏమనాలి? అని సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. అలాంటప్పుడు ఆ పార్టీ ఎందుకు? ఇలాంటి నాయకులతో ఎవరికీ ఉపయోగం అని నిలదీశారు. ఎవరు ఏం చేసినా భవిష్యత్లో రాజధాని అమరావతిని అంగుళం కూడా కదపలేరు అని విశ్వాసం వ్యక్తం చేశారు. అభివృద్ధిని ఎవరూ ఆపలేరని స్పష్టం చేశారు.
Also Read: Heat Waves: ఏపీలోని ఈ జిల్లాలకు భారీ అలర్ట్.. రాబోయే రోజుల్లో తీవ్ర వడగాలులు
లోక్సభలో అమరావతి రాజధానికి చట్టబద్దత కల్పిస్తూ బిల్లు ఆమోదం పొందడంపై నారా లోకేశ్ స్పందించారు. 'నా రాష్ట్రం ఆంధ్రప్రదేశ్-నా రాజధాని అమరావతి అని ఐదుకోట్ల ఆంధ్రులు గర్వంగా నినదించే చారిత్రాత్మకమైన రోజుకు దేశ పార్లమెంటు వేదిక కావడం చాలా సంతోషంగా ఉంది. ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని నినాదంతో అభివృద్ధి వికేంద్రీకరణ విధానంతో రాజధానిగా అమరావతిని నిర్ణయిస్తూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ చేసిన ఏకగ్రీవ తీర్మానానికి చట్టబద్ధత కల్పించే అమరావతి బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టి, ఆమోదించడం కోట్లాది ప్రజలు గర్వించదగ్గ సందర్భం. కేంద్రప్రభుత్వానికి, మద్దతుగా నిలిచిన పార్టీలకు కృతజ్ఞతలు. ఇది ఐదుకోట్ల ఆంధ్రుల ఆకాంక్ష అమరావతి విజయం. ఆంధ్రప్రదేశ్ ప్రజల విజయం. ఇది రైతుల త్యాగాలకు దక్కిన దైవ ఆశీస్సులు.. శాంతియుత పోరాటానికి దక్కిన ఫలితం. కోట్లాది ప్రజల కోరికను గౌరవించిన కేంద్రం ఆంధ్రుల ఆత్మగౌరవ రాజధానిగా చరిత్ర-సంస్కృతికి ఆలవాలమైన అమరావతిని నిలిపింది. జై ఆంధ్రప్రదేశ్..జయహో అమరావతి' అని నారా లోకేశ్ ప్రకటన విడుదల చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
