Back
Khammam507003blurImage

ఖమ్మం: విషపు నీటిని తాగి గొర్రెల మృతి

Kotha Yakesh
Aug 01, 2024 05:20:14
Khammam, Telangana
విషపు నీరు తాగి 20 గొర్రెలు మృతి చెందగా మరో 150 గొర్రెలు అస్వస్థతకు గురైన ఘటన ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం లంకాసాగర్ క్రాస్ రోడ్ వద్ద జరిగింది. రామచంద్రాపురం గ్రామానికి చెందిన బోలే రాంబాబుకు చెందిన 200 గొర్రెలను క్రాస్ వద్ద మేపుతున్నాడు. అయితే సింగరేణి నుండి వచ్చే విష రసాయనాలను సమీపంలోని గుంతల్లో డంప్ చేస్తున్నారు. నీటి కోసం వెళ్లిన గొర్రెలు వాటిని తాగి అస్వస్థతకు గురై చనిపోయినట్లు తెలుస్తుంది.
1
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com