ఖమ్మం:సిపిఆర్ చేసి ఓ వ్యక్తికి ప్రాణం
Khammam, Telangana:సిపిఆర్ చేసి ఓ వ్యక్తిని బతికించిన ఘటన ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం విఎం బంజార్ లో చోటుచేసుకుంది. పెనుబల్లి నుండి విఎం బంజార్ కు బైక్ పై యేసుబాబు అనే వ్యక్తి వెళుతుండగా అదుపుతప్పి కిందపడి అపస్మారక స్థితికి చేరాడు. సమీపంలో శానిటైజేషన్ పని చేస్తున్న రామారావు అనే వ్యక్తి అక్కడకు చేరుకుని సీపీఆర్ చేసాడు. ఈక్రమంలో ఒక్కసారిగా ఊపిరి తీసుకున్నాడు. సీపీఆర్ చేసి ప్రాణాలు రక్షించిన రామారావును అభినందించారు.हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
Xiaomi 18 Pro Max: లీకైన షావోమి సరికొత్త ఫ్లాగ్షిప్ ఫీచర్స్.. కెమెరా మామూలుగా లేదుగా!
Hyderabad, Telangana:Xiaomi 18 Pro Max Leak: స్మార్ట్ఫోన్ చరిత్రలో సరికొత్త విప్లవానికి చైనా దిగ్గజం షావోమి (Xiaomi) శ్రీకారం చుట్టబోతోంది. గత ఏడాది మార్కెట్లోకి విడుదలైన షావోమి 17 సిరీస్ విజయవంతం కావడంతో.. ఇప్పుడు మార్కెట్లోకి షావోమి 18 సిరీస్ను తీసుకురావడానికి కంపెనీ సన్నాహాలు చేస్తూ వస్తోంది.. ఈ సిరీస్లో అత్యంత ప్రీమియం మోడల్గా షావోమి 18 ప్రో మాక్స్ (Xiaomi 18 Pro Max) స్మార్ట్ఫోన్ ఉండబోతోంది. ఇప్పటికే ఈ స్మార్ట్ఫోన్కి సంబంధించిన అనేక ఫీచర్స్ సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. ప్రస్తుతం ఈ లీక్స్ టెక్ వర్గాల్లో తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి. అయితే, ఈ స్మార్ట్ఫోన్కి సంబంధించిన ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ట్విట్టర్లో లీకైన వివరాలు..
ప్రముఖ చైనా మైక్రోబ్లాగింగ్ ప్లాట్ఫారమ్ వైబో (Weibo)లో ప్రముఖ టిప్స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ ఈ వివరాలను వెల్లడించారు. షావోమి 18 ప్రో మాక్స్ ఇంజనీరింగ్ ప్రొటోటైప్ (Engineering Prototype) ఆధారంగా ఈ ఫోన్ను అందుబాటులోకి తీసుకు వచ్చిన్నట్లు తెలుస్తోంది. లీక్ అయిన వివరాలను బట్టి చూస్తే, ఇది ఎంతో అద్భుతంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
డ్యుయల్ 200 మెగాపిక్సెల్స్ కెమెరాలు..
ఈ స్మార్ట్ఫోన్ అతిపెద్ద హైలైట్ దీని కెమెరా సెటప్.. లీకైన వివరాల ప్రకారం.. షావోమి 18 ప్రో మాక్స్ వెనుక భాగంలో డ్యుయల్ 200 మెగాపిక్సెల్ కెమెరాలను అందించిన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా 200 MP ప్రధాన కెమెరాలో లేటరల్ ఓవర్ఫ్లో ఇంటిగ్రేషన్ కెపాసిటర్ (LOFIC) టెక్నాలజీని కూడా వినియోగించిన్నట్లు తెలుస్తోంది.. ఇది తక్కువ వెలుతురులో కూడా అద్భుతమైన, అత్యంత స్పష్టమైన ఫోటోలను క్యాప్చర్ చేయడానికి ఎంతగానో సహాయపడుతుందని కంపెనీ తెలిపింది..
టెలిఫోటో కెమెరా..
ఈ వెనక భాగం కెమెరాలోని రెండవది కూడా 200 MP టెలిఫోటో కెమెరా కావడం విశేషం.. ఇది మాక్రో ఫోటోగ్రఫీ (Macro Photography)కి కూడా సపోర్ట్ చేస్తుంది. దీని వల్ల ఎక్కడో ఉన్న వస్తువులను కూడా వస్తువులను, ముఖ్యంగా అత్యంత సూక్ష్మమైన సబ్జెట్ను అత్యంత అద్భుతంగా ఫోటోలను తీస్తుంది.. దీంతో పాటు అద్భుతమైన కెమెరా బ్రాండ్ లైకా (Leica) భాగస్వామ్యంతో ఈ కెమెరాల ట్యూనింగ్ ఉండబోతోందని కంపెనీ వెల్లడించింది..
భారీ బ్యాటరీ.. ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్..
సాధారణంగా ఫ్లాగ్షిప్ ఫోన్లలో బ్యాటరీ సామర్థ్యం చాలా తక్కువగా ఉంటుంది. కానీ ఇందులో కంపెనీ ఏకంగా 8,500 mAh సామర్థ్యం గల భారీ బ్యాటరీని అందించబోతున్నట్లు తెలుస్తోంది. ఇంత పెద్ద బ్యాటరీని వేగంగా చార్జ్ చేయడం కోసం 100W వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్తో పాటు 50W వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్ను కూడా ఇందులో అందుబాటులోకి తీసుకు వచ్చారు.
డిస్ప్లేతో పాటు ప్రాసెసర్ వివరాలు..
షావోమి 18 ప్రో మాక్స్ స్మార్ట్ఫోన్ 6.9-అంగుళాల భారీ 2K OLED డిస్ప్లేతో అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది.. ఇది వినియోగదారులకు బెస్ట్ విజువల్ ఎక్స్పీరియన్స్ను అందిస్తుంది.. అలాగే ఈ సిరీస్లోని ప్రో (Pro) మోడల్లో క్వాల్కామ్ అత్యంత శక్తివంతమైన Snapdragon 8 Elite Gen 6 చిప్సెట్ను అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. కాబట్టి ప్రో మాక్స్ వెర్షన్లో కూడా ఇదే రేంజ్ పవర్ఫుల్ ప్రాసెసర్ ఉండే అవకాశం ఉంది.
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Saturn Transit 2026: అక్టోబర్ వరకు ఈ 3 రాశుల వారికి కష్టాల కాలం.. భారీ ఆర్థిక నష్టాలు!
Hyderabad, Telangana:Saturn Transit 2026 Effect On Zodiac: నవగ్రహాలలో శని గ్రహం అత్యంత నెమ్మదిగా కదిలే గ్రహంగా భావిస్తారు . శని ఒక రాశిలో రెండున్నర సంవత్సరాల పాటు సంచార దశలో కొనసాగుతూ ఉంటాడు. అయితే, ఈ సమయంలో ఆయన అనేకసార్లు నక్షత్ర సంచారం చూస్తూ ఉంటాడు.. న్యాయదేవుడైన శని భగవానుడు జూలై 2న రేవతి నక్షత్రంలోని మొదటి పాదం నుండి రెండవ పాదంలోకి ప్రవేశించాడు. ఇక్కడ ఆయన అక్టోబర్ 9 వరకు కొనసాగనున్నాడు.
రేవతి నక్షత్రానికి అధిపతి బుధ గ్రహం.. రేవతి నక్షత్రం రెండవ పాదంలో ఉన్న సమయంలోనే.. జూలై 27న శని రివర్స్ మూవ్మెంట్ చేయబోతోంది. ఆ తర్వాత ఆగస్టు 20న తిరిగి రేవతి నక్షత్రం మొదటి పాదంలోకి ప్రవేశిస్తాడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. శని గ్రహం రాశి లేదా నక్షత్రాన్ని సంచారం చేసినప్పుడల్లా.. మేషం నుంచి మీనం వరకు అన్ని రాశులపై ప్రభావం పడుతుంది. అయితే, అక్టోబర్ వరకు శని దేవుని ఆగ్రహానికి గురై.. తీవ్ర నష్టాలను చవిచూడబోయే ఆ మూడు రాశులు ఏవో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ధనుస్సు రాశి (Sagittarius)
ధనుస్సు రాశి వారికి శని నక్షత్ర సంచారం అత్యంత కష్టదాయకంగా ఉండబోతోంది. శని ప్రభావం వల్ల ఈ సమయంలో ధన సంబంధిత విషయాలలో తీవ్ర నిరాశ ఎదురవుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఇది మీ మానసికతో పాటు శారీరక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. జీవిత భాగస్వామితో సంబంధాలు దెబ్బతినే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ఇంట్లో సుఖశాంతులు కూడా తగ్గిపోతోంది. ఏ పనిలోనూ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి.
మిథున రాశి (Gemini)
మిథున రాశిలో జన్మించిన వారిపై కూడా శని ప్రభావం పడుతుంది. ఈ కాలంలో తీవ్రమైన ఆర్థిక సవాళ్లను ఎదుర్కోవలసి ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. వీరు చేపట్టే పనులలో ఆటంకాలు ఎదురవుతాయి. ప్రేమ జీవితంలో ఒడిదుడుకులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. పని భారం పెరగడం వల్ల శారీరకంగా.. మానసికంగా తీవ్ర అసంతృప్తి, అలసట పొందుతారని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఖర్చులు విపరీతంగా పెరగడం వల్ల చేతిలో డబ్బు ఆడక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయి.
సింహ రాశి (Leo)
సింహ రాశి వారు అక్టోబర్ వరకు ఆర్థిక విషయాలలో చాలా అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది.. అనవసరపు ఖర్చులు విపరీతంగా పెరగడం వల్ల ఆర్థిక పరిస్థితి తలకిందులయ్యే ప్రమాదం కూడా ఉంది.. కుటుంబ సంబంధాలపై ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టడం మంచిది.. లేకుంటే కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు పెరిగే అవకాశం ఉందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఈ సమయంలో మీ ఆరోగ్యం పట్ల కూడా నిర్లక్ష్యం వహించవదని జ్యోతిష్యులు చెబుతున్నారు.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
గమనిక.. 
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..
బెంగళూరు, చెన్నైలను వెనక్కి నెట్టి.. హైదరాబాద్ సరికొత్త రికార్డు.. ఇళ్లపై భాగ్యనగర వాసుల క్రేజ్ చూశారా?
Secunderabad, Telangana:Hyderabad Luxury real estate: దక్షిణ భారతదేశంలోని మూడు ప్రధాన నగరాల్లో అత్యంత విలాసవంతమైన గృహాల మార్కెట్ కొత్త శిఖరాలను చేరుకుంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో, హైదరాబాద్, బెంగళూరు , చెన్నై నగరాల్లో రూ. 10 కోట్లు అంతకంటే ఎక్కువ ధర కలిగిన 811 విలాసవంతమైన గృహాలు అమ్ముడయ్యాయి. వీటి మొత్తం అమ్మకాల విలువ రూ. 11,246 కోట్లు. ఇండియా సోథెబీస్ ఇంటర్నేషనల్ రియల్టీ, సీఆర్ఈ మ్యాట్రిక్స్ సంయుక్తంగా విడుదల చేసిన సదరన్ ఇండియా హై-ఎండ్ లగ్జరీ హౌసింగ్ అనే నివేదికలో ఈ విషయం వెల్లడైంది.
అమ్మకాల చార్టులలో హైదరాబాద్ స్పష్టంగా అగ్రస్థానంలో నిలిచింది. ఒక్క హైదరాబాద్లోనే రూ. 8,562 కోట్ల విలువైన 625 విలాసవంతమైన గృహాలు అమ్ముడయ్యాయి. హైదరాబాద్ తర్వాత, 128 అమ్మకాలతో బెంగళూరు అగ్రస్థానంలో నిలవగా, దీని ద్వారా రూ. 1,957 కోట్ల టర్నోవర్ లభించింది. ఆ తర్వాతి స్థానంలో 58 అమ్మకాలతో చెన్నై నిలవగా, దీని ద్వారా రూ. 727 కోట్ల టర్నోవర్ లభించింది.
ఇతర నగరాలతో పోలిస్తే హైదరాబాద్లో తక్కువ ధరలకే ఎక్కువ స్థలం అందుబాటులో ఉండటమే ఈ పెరుగుదలకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఉదాహరణకు.. మీరు హైదరాబాద్లో రూ.10 కోట్లకు సుమారు 6,210 చదరపు అడుగుల ఇంటిని కొనగలిగితే, అదే మొత్తానికి చెన్నైలో 4,290 చదరపు అడుగుల ఇంటిని, బెంగళూరులో కేవలం 3,930 చదరపు అడుగుల ఇంటిని మాత్రమే పొందగలరు. హైదరాబాద్లోని కోకాపేట్.. బెంగళూరులోని రాజనుకుంటే అల్ట్రా-ప్రీమియం ప్రాజెక్టులకు హాట్స్పాట్లుగా ఆవిర్భవించాయి.
ఈ నివేదికపై వ్యాఖ్యానిస్తూ, ఇండియా సోథెబీస్ ఇంటర్నేషనల్ రియల్టీ సీఈఓ అశ్విన్ చద్దా ఇలా అన్నారు.. దక్షిణ భారతదేశంలోని విలాసవంతమైన గృహాల మార్కెట్ మూడు విభిన్న నగర లక్షణాలతో అభివృద్ధి చెందుతోంది. అమ్మకాల పరిమాణం పరంగా హైదరాబాద్ ముందుండగా, బెంగళూరు వేగవంతమైన వృద్ధికి అవకాశం చూపిస్తోంది. మరోవైపు, చెన్నై తన పాత, జనాదరణ పొందిన ప్రీమియం ప్రాంతాలపై ఆధారపడి స్థిరంగా ఉందని తెలిపారు.
సీఆర్ఈ మ్యాట్రిక్స్ సహ-వ్యవస్థాపకుడు.. సీఈఓ అభిషేక్ కిరణ్ గుప్తా, ఈ రంగం ఒక మలుపుకు చేరుకుందని నమ్ముతున్నారు. హైదరాబాద్ మార్కెట్కు బలమైన పునాదులు ఉన్నాయని.. ఇది బెంగళూరులోని సాంప్రదాయ ఉన్నత-మధ్యతరగతి ప్రాంతాలకు మించి విస్తరిస్తోందని ఆయన అన్నారు. ప్రతి మార్కెట్కు ఒక ప్రత్యేకమైన పెట్టుబడి వ్యూహం అవసరమని ఆయన సూచించారు. ఈ నగరాలు ఐటీ, వ్యాపార కేంద్రాలుగా వేగంగా అభివృద్ధి చెందుతున్నందున, అధిక నికర విలువ కలిగిన వ్యక్తులు.. సంపన్న కొనుగోలుదారులు పెద్ద, విలాసవంతమైన గృహాల వైపు మొగ్గు చూపుతున్నారని నివేదిక స్పష్టంగా చూపిస్తుంది.
Also Read: ప్రపంచంలోనే మోస్ట్ డేంజరస్ 10 పాములు ఇవే.. ఆ లిస్ట్లో భారత్కు చెందినవి కూడా..!!
Also Read: మరో 15రోజులు బంగారం, వెండి జోలికి వెళ్లకండి.. అమెరికా తీసుకున్న ఈ నిర్ణయం బులియన్ మార్కెట్లో
Also Read: భారీగా పడిపోనున్న గోల్డ్ రేట్.. 2 నెలల్లో తులం 1లక్షకు చేరే ఛాన్స్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Guru Aditya Rajayogam 2026: జూలై 16 నుండి ఈ 5 రాశుల వారికి తిరుగుండదు.. కాసుల వర్షమే!
Hyderabad, Telangana:Guru Aditya Rajayogam 2026 Effect On Zodiac Telugu News: జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల మార్పులకు చాలా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుందని మనందరికీ తెలుసు.. నవగ్రహాలకు రాజుగా పిలిచే సూర్యుడు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశించినప్పుడు విశేష యోగాలు ఏర్పడుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే 2026 జూలై నెలలో ఒక అద్భుతమైన శుభ యోగం ఏర్పడబోతోంది.. అదే గురు ఆదిత్య రాజయోగం.. ఈ యోగాన్ని జ్యోతిష్య శాస్త్రంలో అత్యంత పవర్ఫుల్గా భావిస్తారు. ఈ అరుదైన యోగం కారణంగా కొన్ని రాశుల వారి జాతకాలు పూర్తిగా మారిపోబోతున్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అపారమైన ధనలాభంతో పాటు సమాజంలో గౌరవమర్యాదలు విపరీతంగా పెరగుతాయి. ఆశించిన ధన లాభాలు కూడా కలుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అయితే, ఈ శక్తివంతమైన యోగం ప్రభావంతో ఏయే రాశులవారికి ఈ సమయం అత్యంత లాభదాయకంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం..
భారత కాలమానం ప్రకారం.. 2026 జూలై 16వ తేదీ ఉదయం 11:44 గంటలకు సూర్య భగవానుడు కర్కాటక రాశిలోకి సంచారం చేయబోతున్నాడు.. ఈ రాశిలో ఇప్పటికే జ్ఞానంతో పాటు సుఖం, అదృష్టానికి సూచికగా భావించే గురు గ్రహం సంచార దశలో కొనసాగుతూ ఉన్నాడు.. మిత్ర గ్రహాలుగా భావించే సూర్యుడితో పాటు బృహస్పతి కలయిక వల్ల ఈ సమయంలో జ్యోతిష్య శాస్త్రంలో ఎంతో శక్తివంతమైన గురు ఆదిత్య రాజయోగం ఏర్పడబోతోంది.. ఈ యోగం జూలై 16 నుంచి ఆగస్టు 17 వరకు దాదాపు నెల రోజుల పాటు క్రియాశీలకంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. దీని ప్రభావంతో ముఖ్యంగా ఐదు రాశుల వారికి అపారమైన అదృష్టం వరించబోతోంది..
విశేష లాభాలు పొందే ఆ 5 అదృష్ట రాశులు:
మేష రాశి (Aries)
గురు ఆదిత్య రాజయోగం వల్ల మేష రాశివారికి నాలగవ స్థానంలో సూర్యుడు ఉండడం వల్ల కెరీర్ పరంగా ఊహించని ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా అనేక మార్పులు వస్తాయి. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా కలుగుతాయి. ముఖ్యంగా ఈ సమయంలో చేసే ప్రయాణాలు లాభసాటిగా కూడా మారుతాయి.. వ్యాపారస్తులకు పెద్ద పెద్ద ఆర్డర్లు కూడా లభిస్తాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ రంగం నుంచి విశేష ప్రయోజనాలు కూడా ఊహించని స్థాయిలో పొందుతారు. ఆర్థిక పరిస్థితి చాలా స్థిరంగా మారే సూచనలు కూడా కనిపిస్తున్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.
కన్యా రాశి (Virgo)
కన్యా రాశి వారికి ఈ సంచారం వల్ల కెరీర్లో అత్యున్నత అవకాశాలు కూడా బోలెడు లభిస్తాయి. వ్యాపారాల్లో లేదా ఆఫీసులో కష్టపడి పనులు చేసేవారికి ఊహించని స్థాయిలో పదవులు లభించే అవకాశాలు కూడా లభిస్తున్నాయి. వ్యాపారాన్ని విస్తరించాలనుకునే.. వారికి ఇది ఎంతో అనుకూలమైన సమయంగా మారుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. ఇంట్లో ఒక విశేషమైన శుభకార్యాలు జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది.
కర్కాటక రాశి (Cancer)
సూర్యుడు కర్కాటక రాశిలోనే సంచారం చేయడం వల్ల ఈ రాశి వారికి లగ్న స్థానంలోనే ఈ రాజయోగం ఏర్పడబోతోందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. దీనివల్ల సమాజంలో గౌరవ మర్యాదలు విపరీతంగా పెరుగుతాయి.. ఉద్యోగులు చేసేవారికి ప్రమోషన్లతో పాటు వేతన పెంపు సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఒకటి కంటే ఎక్కువ వనరుల నుంచి ఆదాయం లభిస్తుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఆత్మవిశ్వాసం రెట్టింపు అవ్వడం వల్ల అనుకున్న పనులన్నీ సులభంగా పూర్తయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.
వృశ్చిక రాశి (Scorpio)
వృశ్చిక రాశి వారికి కాలం క్రమంగా అనుకూలంగా మారుతుంది.. కుటుంబంతో పాటు ఉద్యోగ రంగం రెండింటిలోనూ అదృష్టం తోడు ఉండబోతోంది.. ఉద్యోగ మార్పు లేదా బదిలీ కోసం చూస్తున్నవారికి ఈ
సమయం ఎంతో అనుకూలమైన ఫలితాలను అందిస్తుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. విదేశాలకు వెళ్లే ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. వ్యాపారంలో అమ్మకాలతో పాటు లాభాలు పెరుగుతాయి. అయితే, కోపం, అహంకారాన్ని తగ్గించుకోవడం చాలా మంచిది.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
గమనిక.. 
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..
తులా రాశి (Libra)
సూర్య-బృహస్పతుల కలయిక కారణంగా తులా రాశి వారికి అద్భుతమైన సమయంగా భావించవచ్చు. వీరికి నాయకత్వ సామర్థ్యంతో పాటు ఆత్మవిశ్వాసం విపరీతంగా పెరుగుతుంది.. కార్యాలయంలో వీరి శ్రమకు తగిన గుర్తింపు కూడా లభిస్తుంది.. ముఖ్యంగా కొంతమంది ప్రముఖ సంస్థల్లో ఉద్యోగం పొందే అవకాశం ఉంది. సమాజంలో మీ గౌరవంతో పాటు హోదా గణనీయంగా పెరుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.
26 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా పడిపోయిన ముడి చమురు ధరలు.. ఇక పెట్రోల్, డీజిల్ ధరలు రూ. 3 నుంచి రూ. 5 తగ్గే ఛాన్స్..!!
Secunderabad, Telangana:Petrol Diesel Price: పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధ వాతావరణం కారణంగా ప్రపంచవ్యాప్తంగా చమురు, గ్యాస్ కొరతకు దారితీశాయి. ఈ సంక్షోభంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా పెరిగాయి. దీని ప్రభావం నుంచి భారత్ కూడా తప్పించుకోలేకపోయింది. దేశంలో పెట్రోల్, డీజీల్, వంటగ్యాస్ ధరలను భారీగా పెంచాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు సామాన్యులు త్వరలోనే ఒక గుడ్ న్యూస్ వినబోతున్నారు. యుద్ధ వాతావరణ పరిస్థితులు ముగిసాయి. అమెరికా ఇరాన్ శాంతి ఒప్పందానికి వచ్చాయి. ప్రపంచ పరిస్థితి క్రమంగా సాధారణ స్థితికి చేరుకుంటోంది. ఈ నేపథ్యంలోనే ముడి చమురు ధరలు కూడా భారీగా తగ్గాయి. ప్రస్తుతం బ్యారెల్ ధర 72 డాలర్లుగా ఉంది.
ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఉత్పత్తిదారు అయిన సౌదీ అరేబియా, ఆగస్టు నెలకు ఆసియా వినియోగదారుల కోసం ముడి చమురు ధరలను చారిత్రాత్మకంగా తగ్గించినట్లు ప్రకటించింది. గత 26 ఏళ్లలో ఇదే అతిపెద్ద తగ్గింపు అని చెప్పాలి. ముడి చమురు ధరలలో ఈ రికార్డు స్థాయి తగ్గుదల భారతదేశానికి ఒక ముఖ్యమైన వరమని చెప్పాలి. దీనితో దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు మరింత తగ్గుతాయనే ఆశలు పెరుగుతున్నాయి.
11 డాలర్లు తగ్గించిన అరబ్ లైట్:
ఇటీవలి బ్లూమ్బెర్గ్ నివేదిక ప్రకారం.. సౌదీ అరేబియా ప్రభుత్వ యాజమాన్యంలోని చమురు దిగ్గజం, సౌదీ అరామ్కో, ఆగస్టు నుండి ఆసియాకు తన ప్రధాన ఉత్పత్తి అయిన అరబ్ లైట్ క్రూడ్ ధరను బ్యారెల్కు భారీగా 11డాలర్లు తగ్గించాలని నిర్ణయించింది. గత 26 సంవత్సరాలలో సౌదీ అరేబియా ఆసియా దేశాలకు అందించిన అతిపెద్ద తగ్గింపు ఇదే అవడం గమనార్హం. ఈ గణనీయమైన తగ్గింపు తరువాత.. ప్రాంతీయ బెంచ్మార్క్ తో పోలిస్తే అరబ్ లైట్ క్రూడ్ ఇప్పుడు బ్యారెల్కు 1.50డాలర్ల ప్రత్యక్ష తగ్గింపుతో లభిస్తుంది. భారత్ తన మొత్తం చమురు అవసరాలలో భారీ మొత్తాన్నిసౌదీ అరేబియా నుండి కొనుగోలు చేస్తున్నందున.. ఇది భారతీయ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు ఒక ముఖ్యమైన ఉపశమనమని చెప్పాలి. జూన్ మధ్య నుండి ప్రపంచ ముడి చమురు ధరలు నిలకడగా తక్కువగా ఉన్నాయి. అంతర్జాతీయ బ్రెంట్ క్రూడ్ ధరలు ఇప్పుడు బ్యారెల్కు సుమారు 72డాలర్లకు పడిపోయాయి.
ధరలు ఎందుకు తగ్గాయి?
ముడి చమురు ధరలలో ఈ ఆకస్మిక తగ్గుదలకు అతిపెద్ద కారణం అమెరికా, ఇరాన్ల మధ్య జరిగిన కాల్పుల విరమణ అని చెప్పాలి. ఈ రెండు దేశాల మధ్య శత్రుత్వం ముగిసిన తరువాత, సముద్ర వాణిజ్యానికి కీలకమైనదిగా భావించే హోర్ముజ్ జలసంధి, నౌకాయానానికి పూర్తిగా తిరిగి తెరుచుకుంది. యుద్ధ సమయంలో, ఈ మార్గం వాస్తవంగా మూసివేసిన సంగతి తెలిసిందే. దీంతో నౌకలు సుదీర్ఘ మార్గాలను అనుసరించవలసి వచ్చింది. హోర్ముజ్ జలసంధి తిరిగి తెరుచుకోవడంతో, సౌదీ అరామ్కో తన ప్రధాన రాస్ తానూరా ఓడరేవు నుండి ముడి చమురు రవాణాను వేగంగా పెంచింది. ఇది యుద్ధానికి ముందు స్థాయిలలో 90శాతానికి చేరుకుంది.
హోర్ముజ్ జలసంధి మూసివేసినప్పుడు కంపెనీ తన సరుకును ఎర్ర సముద్రంలోని యాన్బు ఓడరేవు ద్వారా మళ్లించవలసి వచ్చింది. దీనివల్ల రవాణా ఖర్చులు గణనీయంగా పెరిగాయి. ఇప్పుడు, చమురు సరఫరాలు సాధారణ స్థితికి రావడం.. మధ్యప్రాచ్యం నుండి చమురు ప్రవాహం పెరగడంతో, భారతదేశం వంటి ఆసియా రిఫైనరీలకు వివిధ రకాల సరసమైన చమురు ఎంపికలు అందుబాటులోకి వచ్చాయి.
ఒపెక్+ దేశాలు ఉత్పత్తిని పెంచనున్నాయి:
సౌదీ అరేబియా, రష్యా నేతృత్వంలోని ప్రధాన చమురు ఉత్పాదక దేశాల సంస్థ అయిన ఒపెక్+, ఆగస్టు నెలకు చమురు ఉత్పత్తి కోటాలను గణనీయంగా పెంచుతున్నట్లు ప్రకటించింది. గతంలో, ప్రధాన హోర్ముజ్ జలసంధి మూసివేసినప్పుడు.. సకాలంలో సరఫరా అంతరాయాల కారణంగా ఈ ఉత్పత్తి పెరుగుదల మార్కెట్పై పెద్దగా ప్రభావం చూపలేదు. అయితే, ఇప్పుడు మార్గం స్పష్టంగా ఉండటంతో, సౌదీ అరేబియా, ఇరాక్, కువైట్ వంటి శక్తివంతమైన చమురు ఉత్పాదక దేశాలు తమ పెరిగిన కోటాలను పూర్తిగా వినియోగించుకుంటూ, ప్రపంచ మార్కెట్లోకి భారీగా చమురును విడుదల చేస్తున్నాయి. మార్కెట్లో ముడి చమురు ఈ విధంగా విరివిగా లభించడం ధరలు క్రమంగా తగ్గడానికి దారితీసింది. ఒకవేళ ముడి చమురు ధరలు దీర్ఘకాలం పాటు 72 డాలర్ల వద్ద లేదా అంతకంటే తక్కువగా ఉంటే, భారతీయ చమురు కంపెనీల లాభాలు గణనీయంగా పెరుగుతాయని.. ఆ తర్వాత వారు పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరలను రూ. 3 నుండి రూ. 5 వరకు తగ్గించడం ద్వారా ఈ ప్రత్యక్ష ప్రయోజనాన్ని వినియోగదారులకు అందించగలరని నిపుణులు భావిస్తున్నారు.
Also Read: ప్రపంచంలోనే మోస్ట్ డేంజరస్ 10 పాములు ఇవే.. ఆ లిస్ట్లో భారత్కు చెందినవి కూడా..!!
Also Read: మరో 15రోజులు బంగారం, వెండి జోలికి వెళ్లకండి.. అమెరికా తీసుకున్న ఈ నిర్ణయం బులియన్ మార్కెట్లో
Also Read: భారీగా పడిపోనున్న గోల్డ్ రేట్.. 2 నెలల్లో తులం 1లక్షకు చేరే ఛాన్స్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి సంచలన ప్రకటన.. 'అవసరమైతే బీఆర్ఎస్ పార్టీని రద్దు చేస్తాం!'
Hyderabad, Telangana:Kannepalli Pumphouse: 'కాళేశ్వరం ప్రాజెక్టుకు ఏమైనా ప్రమాదం జరిగితే బీఆర్ఎస్ పార్టీ బాధ్యత తీసుకుంటుంది. అవసరమైతే బీఆర్ఎస్ పార్టీని రద్దు చేస్తాం. రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటాం' అని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి హరీశ్ రావు సంచలన ప్రకటన చేశారు. 'కన్నెపల్లి పంప్హౌస్లో మోటార్లు ప్రారంభం చేసి 150 టీఎంసీల నీటిని నిల్వ చేసే అవకాశం ఉంది. అయినా ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోంది. ప్రభుత్వ కుట్ర, మోసాన్ని తెలంగాణ రైతులు గమనిస్తున్నారు' అని తెలిపారు. చేతగాకపోతే మాకు అప్పగించండి.. వారం రోజుల పాటు కేసీఆర్కు అప్పగిస్తే మొత్తం నీరు పారించి చూపుతాం' అని కాంగ్రెస్కు సవాల్ చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి చెబుతున్నట్లు ఏమైనా ప్రమాదం జరిగితే బీఆర్ఎస్ పార్టీ బాధ్యత తీసుకుంటుందని మరోసారి ప్రకటించారు.
హైదరాబాద్లోని బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్లో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఉత్తమ్ అడిగినా.. మంత్రివర్గం అడిగినా తెలంగాణ ప్రజల తరపున కేసీఆర్ అండర్ టేకింగ్ ఇస్తారని తెలిపారు. 'చంద్రబాబు కోసం రేవంత్ రెడ్డి మంత్రివర్గం ఆడుతున్న నాటకం మాత్రమే. ఎన్డీఎస్ఏకు ఏ మాత్రం సంబంధం లేదు' అని స్పష్టం చేశారు. 'ఎస్ఎల్బీసీ విషయంలో రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ జైలుకు పోవాలి. ఏడాది నుంచి మోటార్లను కనీసం ప్రారంభం చేయలేదని ఇంజనీర్లు చెబుతున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఏమీ తెలియదు. ఏం మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదు' అని విమర్శించారు.
'మంత్రులు తెలంగాణ ఆత్మను కోల్పోయారు. శ్రీధర్ బాబు లాంటి వాళ్లు కూడా పదవీ భయంతో రేవంత్ రెడ్డి అడుగులకు మడుగులు ఒత్తుతున్నారు' అని సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ భూములను కాపాడేందుకు కన్నేపల్లి సిద్ధంగా ఉందని కేటీఆర్ అందరికీ కళ్లకు కట్టినట్లు చూపారని గుర్తుచేశారు. 'నలుగురు మంత్రులు మళ్లీ సొల్లు పురాణం తప్ప తెలంగాణ సోయితో మాట్లాడలేదు. రూ.లక్ష కాదు పది రూపాయల అవినీతిని కూడా తీయలేకపోయారు. ప్రభుత్వం వేసిన కమిషన్ ను కోర్టు చెత్త బుట్టలో పడేసింది' అని వివరించారు.
'ఎల్నినో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో కాళేశ్వరం ప్రాజెక్టు అవసరం ఎంతైనా ఉంది. కేసీఆర్ అక్కడ కాళేశ్వరం ప్రాజెక్టును కట్టిన ఉద్దేశం ఇదే. ఎటువంటి కరువు నచ్చినా ప్రజలను బతికించడానికి ప్రాణహిత ఉపయోగపడుతుంది' అని కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పతనాన్ని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు జగదీశ్ రెడ్డి వివరించారు. 'బ్యారేజీల నుంచి ఇసుక తవ్వి వేల కోట్లు దండుకుంటున్నారు. విద్యుత్ బిల్లులకు భయపడి రైతుల పంట కొనాల్సి వస్తుందని, బోనస్ ఇవ్వాల్సి వస్తుందని ప్రభుత్వం పంపులు నడపడం లేదు' అని ఆరోపించారు. ప్రజలకు అన్ని విషయాలు అర్థం అవుతున్నాయని.. సమయం వచ్చినపుడు తగిన నిర్ణయం తీసుకుంటారని రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి హెచ్చరించారు.
ప్రశ్నించే గొంతు నొక్కే కుట్రను వైస్సార్సీపీ సహించదు.. న్యాయ పోరాటం చేస్తాం: అంబటి రాంబాబు
Guntur, Andhra Pradesh:Ambati Rambabu vs Chandrababu: 'ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతులను అణచివేసే కుట్ర జరుగుతోంది. సోషల్ మీడియా యాక్టివిస్టులపై చట్టవ్యతిరేకంగా దౌర్జన్యకాండ కొనసాగుతోంది' అని వైఎస్సార్సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న వారిపై వరుసగా అక్రమ కేసులు నమోదు చేసి అరెస్టులు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని మండిపడ్డారు. అన్యాయంగా, అక్రమంగా కేసులు ఎదుర్కొంటున్న వారికి అండగా నిలిచి వైఎస్సార్సీపీ న్యాయపరమైన పోరాటం చేస్తుందని ప్రకటించారు.
గుంటూరులోని వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో సోమవారం మీడియా సమావేశం నిర్వహించి మాజీ మంత్రి అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేశారు. సోషల్ మీడియా యాక్టివిస్టులను లక్ష్యంగా చేసుకుని అక్రమ అరెస్టులు చేస్తూ కూటమి ప్రభుత్వం రాజకీయ కక్ష సాధిస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడాల్సిన పోలీసులు ప్రతిపక్ష నాయకులు, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వారిపై కేసులు నమోదు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. యూట్యూబర్ ప్రశ్న రావణ్, తెలంగాణ జర్నలిస్టు కేవీఆర్పై వరుసగా కేసులు పెట్టి అరెస్టులు చేయడం చట్టవిరుద్ధం అని స్పష్టం చేశారు. తప్పు చేస్తే కోర్టులో నిరూపించాలి తప్ప.. కేసుల మీద కేసులు పెట్టి వేధించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం అని మాజీ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు.
ప్రశ్న రావణ్కు పలుమార్లు బెయిల్ వచ్చినా మళ్లీ మళ్లీ అరెస్టు చేయడం అధికార దుర్వినియోగానికి నిదర్శనం అని వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు అంబటి రాంబాబు ఆరోపించారు. రిమాండ్ ఇవ్వని కోర్టులను దాటేందుకు ఉగ్రవాద నిరోధక చట్టమైన ఉపాను ఒక యూట్యూబర్పై ప్రయోగించడం న్యాయ వ్యవస్థకే సవాల్ అని ఆందోళన వ్యక్తం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేకపోయినా అన్యాయంగా కేసులు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్కరికీ తాము అండగా నిలుస్తామని ప్రకటించారు. ఎవరైనా తప్పు చేస్తే చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి కానీ వేధింపుల కోసం చట్టాలను దుర్వినియోగం చేయడం సరికాదని కూటమి ప్రభుత్వానికి మాజీ మంత్రి అంబటి రాంబాబు హితవు పలికారు.
బాధితులనే నిందితులుగా మార్చే ఈ ధోరణిని వైఎస్సార్సీపీ సహించదని.. అందుకే ఎవరికి అన్యాయం జరిగినా పార్టీలకు అతీతంగా వారి తరపున పోరాడతామని మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రకటించారు. తన ఇంటిపై జరిగిన దాడికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని ఈ నెల 29న డీజీపీ కార్యాలయానికి వెళ్లి వినతిపత్రం అందిస్తానని తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని అణచివేసే ప్రతి చర్యను ప్రజల తరపున వైయస్సార్సీపీ ప్రశ్నిస్తూనే ఉంటుందని సీనియర్ నాయకులు అంబటి రాంబాబు స్పష్టం చేశారు.
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటుడు సునీల్
Dharmavaram, Andhra Pradesh:Actor Sunil Special Darshan In Tirumala Temple Watch Videoపర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దాలి.. అధికారులకు తెలంగాణ సీఎం ఆదేశం
Hyderabad, Telangana:Telangana CM Review: పర్యాటకంగా హైదరాబాద్ను సరికొత్తగా తీర్చిదిద్దాలని.. పర్యాటకులను మరింతగా ఆకర్షించాలని తెలంగాణ ముఖ్యమంత్రి అధికారులకు ఆదేశించారు. నగరంలోని కీలకమైన ప్రాంతాల్లో పర్యాటకంగా అభివృద్ధి చేయాలని తెలిపారు. పురానాపూల్ బ్రిడ్జి, వికారాబాద్ ప్రాంతం కాకుండా హైదరాబాద్ పరిసరాల్లో ఉన్న పర్యాటక, ఆధ్యాత్మిక ప్రాంతాలను తీర్చిదిద్దాలని తెలంగాణ సీఎం సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో తలపెట్టిన పర్యాటక అభివృద్ధి ప్రాజెక్టులకు సంబంధించి నిర్దేశించుకున్న పనులను వేగవంతం చేయడానికి పర్యాటక శాఖపై ముఖ్యమంత్రి సోమవారం సమీక్ష చేశారు. హైదరాబాద్లోని ఎంసీఆర్హెచ్ఆర్డీ బోధి పెవిలియన్లో పర్యాటక శాఖపై ముఖ్యమంత్రి సమీక్ష చేసి కీలక ఆదేశాలు జారీ చేశారు. 'తారామతి బారామతిని పర్యాటక ప్రాంతంగా మరింత అభివృద్ధి చేయాలి. దుర్గం చెరువును పూర్తి స్థాయి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలి. మంజీరా, దిల్కుషా గెస్ట్హౌస్లను ఆధునీకరించాలి. టూరిజం హబ్ డెవలప్మెంట్ పథకం కింద వికారాబాద్ను అభివృద్ధి చేయాలి' అని తెలంగాణ ముఖ్యమంత్రి సూచించారు. వికారాబాద్లో వీరభద్రస్వామి దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని.. యాదాద్రి తరహాలో టెంపుల్కి కమిటీ ఏర్పాటు చేయాలని చెప్పారు.
'అటవీ శాఖ భూములను పర్యాటక శాఖతో కలిసి ఎకో టూరిజంగా అభివృద్ధి చేయాలి. గుర్రంగూడ ఎకో పార్క్ తరహాలో నగరంలో ఎకో పార్క్లు తీర్చిదిద్దాలి' అధికార యంత్రాంగానికి రేవంత్ రెడ్డి సూచించారు. ఫ్యూచర్ సిటీలో ఉన్న అటవీ భూములను అంతర్జాతీయ స్థాయిలో తీర్చి దిద్దాలని.. అర్బన్ ఫారెస్ట్ తరహాలో ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అర్బన్ ఫారెస్ట్ ప్రాజెక్ట్ల కోసం స్పెషల్ ఆఫీసర్ను ఏర్పాటు చేసుకొని పనులు ముమ్మరం చేయాలని చెప్పారు.
'పాతబస్తీలోని పురానాపూల్ హెరిటేజ్ బ్రిడ్జిలను అభివృద్ధి చేసి పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దాలి. బ్రిడ్జిలపైన పర్యాటకుల కోసం ఏర్పాట్లు చేయాలి. అవకాశం ఉంటే ట్రాఫిక్ మళ్లించి పర్యాటకులకు అవకాశం కల్పించాలి' అని రేవంత్ రెడ్డి సూచించారు. పర్యాటక రంగంలో పెట్టుబడులకు సంబంధించి అధికారులను ఆరా తీసిన అనంతరం డిసెంబర్లో నిర్వహించే గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్పై కసరత్తు ప్రారంభించాలని చెప్పారు. సమ్మిట్ కోసం శాఖల మధ్య సమన్వయం కోసం కమిటీలు ఏర్పాటు చేయాలని తెలంగాణ సీఎం ఆదేశించారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి సలహాదారు రామకృష్ణా రావు, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, సీఎంఓ ముఖ్య కార్యదర్శి శేషాద్రి, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్, టూరిజం సెక్రటరీ వాణి ప్రసాద్, టూరిజం కార్పొరేషన్ ఎండీ గౌతమి తెలిపారు.
మంత్రి లేకుండానే..
పర్యాటక శాఖపై సమీక్ష చేసిన సమావేశంలో సంబంధిత శాఖ మంత్రి లేకపోవడం గమనార్హం. పర్యాటక శాఖ మంత్రిగా ఉన్న జూపల్లి కృష్ణారావు లేకుండానే పర్యాటక శాఖపై ముఖ్యమంత్రి సమీక్ష చేయడం చర్చనీయాంశంగా మారింది. సంబంధిత మంత్రులు లేకుండా ఆ శాఖలపై ముఖ్యమంత్రి సమీక్ష చేయడం ఇటీవల వివాదాస్పదంగా మారుతున్న విషయం తెలిసిందే. మరి దీనిపై ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో చూడాలి.
తిరుమలలో అక్కినేని కుటుంబం.. 'లెనిన్' హిట్టు కోసం పూజలు
Dharmavaram, Andhra Pradesh:Akkineni Akhil Lenin Movie Team Visits Tirumala Temple A Head Movie Release On July 10thతిరుమలలో సినీ నటుడు మాధవన్ కుటుంబం
Dharmavaram, Andhra Pradesh:Actor Madhavan Tirumala Darshan Along With Family Watch Videoతిరుమలలో అక్కినేని కుటుంబం.. అఖిల్ 'లెనిన్' సక్సెస్ కోసం మొక్కులు
Tirupati Urban, Andhra Pradesh:Akkineni Family In Tirumala: సినీ పరిశ్రమలో అక్కినేని వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన అఖిల్ ఇప్పటివరకు సరైన విజయం పొందలేకపోయాడు. ఒక్క హిట్ కోసం అతడు ఆత్రుతగా ఎదురుచూస్తున్నాడు. ఈ క్రమంలో సరికొత్త కథాంశంతో 'లెనిన్' పేరుతో అఖిల్ సినిమా చేశాడు. ఈనెల 10వ తేదీన థియేటర్లలో భారీ స్థాయిలో విడుదల అవుతున్న సందర్భంగా అక్కినేని కుటుంబం తిరుమల ఆలయాన్ని సందర్శించింది. తిరుమలలో అక్కినేని అఖిల్ మొక్కులు చెల్లించుకున్నాడు.
మూడేళ్ల విరామం తర్వాత అఖిల్ 'లెనిన్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. తన సినిమా విజయవంతం కావాలని తన కుటుంబంతో కలిసి అఖిల్ తిరుమలకు చేరుకున్నాడు. తన తల్లిదండ్రులు అక్కినేని నాగార్జున, అక్కినేని అమలతోపాటు 'లెనిన్' సినిమా హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే, నిర్మాత సూర్యదేవర నాగవంశీ తిరుమల వచ్చారు. సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనంలో స్వామివారిని వారు దర్శించుకున్నారు. వారికి టీటీడీ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసిన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించారు. అనంతరం టీటీడీ అధికారులు తీర్థప్రసాదాలతోపాటు పట్టు శాలువాతో సత్కరించారు.
సినిమా విజయం సాధించాలని
దర్శనం అనంతరం మీడియాతో అక్కినేని నిఖిల్ మాట్లాడారు. 'లెనిన్ సినిమా ప్రేక్షకుల అంచనాలకు మించి ఉంటుంది. ప్రతి ఒక్కరికీ నచ్చేలా రూపొందించాం. ఈనెల 10వ తేదీన విడుదల కానున్న లెనిన్ సినిమా విజయం సాధించాలని తిరుమల వేంకటేశ్వర స్వామిని ప్రార్థించా' అని అఖిల్ వివరించాడు. ఇదే సినిమాలో నటించిన సునీల్ మరో సమయంలో స్వామిని దర్శించుకున్నాడు. అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే హీరోహీరోయిన్లుగా నటించిన ‘లెనిన్’ ఈనెల 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. మురళి కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో మనం ఎంటర్ప్రైజెస్, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మించారు. వీరు తిరుమల దర్శనానికి ముందు రోజు అంటే ఆదివారం తిరుపతిలో లెనిన్ సినిమా గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్లో జరిగింది. సందడిగా జరిగిన ఈ కార్యక్రమం విజయవంతమైంది. ఈ సినిమాతో అఖిల్ హిట్ కొడతాడని అక్కినేని కుటుంబంతోపాటు అభిమానులు ఆశాభావం వ్యక్తం చేశారు.
తిరుమలలో మాధవన్
సుప్రసిద్ధ నటుడు మాధవన్ కూడా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తన కుటుంబంతో కలిసి సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనంలో స్వామిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. వారికి టీటీడీ అధికారులు దర్శన ఏర్పాట్లు చేసి.. దర్శానంతరం సత్కరించి తీర్థ ప్రసాదాలు అందించారు.
రతన్ టాటా అడుగుజాడల్లో.. సోషల్ మీడియాకు దూరం.. బిజినెస్లో టాప్ గేర్.. ఎవరీ మాయా టాటా..?
Secunderabad, Telangana:Maya Tata in Tata Group: టాటా గ్రూప్లో క్రమంగా ఒక కొత్త తరం నాయకత్వం ఆవిర్భవిస్తోంది. ఈ నేపథ్యంలో, రతన్ టాటా తమ్ముడు నోయల్ టాటా చిన్న కుమార్తె అయిన 37ఏళ్ల మాయా టాటాకు ట్రెంట్ లిమిటెడ్ వారి ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్ వెస్ట్సైడ్ లో కీలక బాధ్యతలు అప్పగించనున్నట్లు సమాచారం. ఆమె ఆన్లైన్ వ్యాపారం, అంతర్జాతీయ ఈ-కామర్స్ విస్తరణను పర్యవేక్షించే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు సూచిస్తున్నాయి.
ప్రస్తుతం ట్రెంట్ లిమిటెడ్ ఛైర్మన్గా ఉన్న నోయల్ టాటా ఈ ఏడాది నవంబర్లో పదవీ విరమణ చేయనున్నారు. దీంతో ఈ మార్పు చాలా ముఖ్యమైనదిగా మారింది. అయితే, మాయా టాటా నియామకంపై ట్రెంట్ ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు.
ఎవరీ మాయా టాటా:
1989లో ముంబైలో జన్మించిన మాయా టాటా, యూకేలోని వార్విక్ విశ్వవిద్యాలయంలో చదువుకున్నారు. ఆ తర్వాత లండన్లో బిజినెస్ మేనేజ్మెంట్, ఫైనాన్స్లో ఉన్నత విద్యను అభ్యసించారు. ఆమె రతన్ టాటా మార్గదర్శకత్వంలో టాటా గ్రూప్లో తన కెరీర్ను ప్రారంభించారు. టాటా డిజిటల్లో చేరకముందు, ఆమె టాటా క్యాపిటల్ వారి టాటా ఆపర్చునిటీస్ ఫండ్ లో పనిచేశారు.
నోయెల్ టాటా ముగ్గురు పిల్లలు టాటా సన్స్ టాటా ట్రస్ట్స్లో మెజారిటీ వాటాదారులుగా ఉన్నారు. వారు వివిధ అనుబంధ.. చిన్న ట్రస్టుల బోర్డులలో సభ్యులుగా ఉన్నారు. నెవిల్ సర్ దొరబ్జీ టాటా ట్రస్ట్ బోర్డులో కూడా సభ్యుడిగా ఉన్నారు. నివేదికల ప్రకారం.. ఇటీవల కంపెనీ నష్టాలపై ఆందోళన వ్యక్తం చేసిన నోయెల్ టాటా, టాటా డిజిటల్పై దృష్టి సారిస్తున్న తరుణంలో మాయా టాటా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ పరిస్థితులలో.. ఆయన తన కుమార్తెను ఇప్పటికే మెరుగైన స్థితిలో ఉన్న కంపెనీకి మార్చాలని కోరుకుంటున్నట్లుగా ఉంది. మాయా సోదరుడు నెవిల్ టాటా ప్రస్తుతం ట్రెంట్ వారి స్టార్ బజార్ వ్యాపారాన్ని పర్యవేక్షిస్తున్నారు. ఆయన సోదరి టాటా గ్రూప్ హోటల్ వ్యాపారానికి బాధ్యత వహిస్తున్నారు.
ట్రెంట్ లిమిటెడ్కు వెస్ట్సైడ్ ఒక కీలకమైన వ్యాపార విభాగం. ఈ బ్రాండ్ కంపెనీ మొత్తం ఆదాయంలో సుమారు 40శాతం వాటాను అందిస్తుంది. ఏటా సుమారు 50 కొత్త వెస్ట్సైడ్ స్టోర్లను ప్రారంభించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఒక్క 2025-26 ఆర్థిక సంవత్సరంలోనే.. ఇది 53 కొత్త స్టోర్లను ప్రారంభించింది.ఇటీవల, యూఏఈలో తన మొదటి అంతర్జాతీయ స్టోర్ను ప్రారంభించడం ద్వారా వెస్ట్సైడ్ ప్రపంచ మార్కెట్లోకి ప్రవేశించింది. ఈ భారతీయ ఫ్యాషన్ బ్రాండ్ను మరిన్ని దేశాలకు విస్తరించే ప్రణాళికలతో ట్రెంట్ ముందుకు సాగుతోంది.
వెస్ట్సైడ్తో పాటు, ట్రెంట్ జూడియో.. స్టార్ బజార్ వంటి ప్రముఖ రిటైల్ బ్రాండ్లను కూడా కలిగి ఉంది. 2025-26 ఆర్థిక ఏడాది చివరినాటికి కంపెనీ ఆదాయం సుమారు రూ. 19,700 కోట్లుగా అంచనా. ఇది దేశవ్యాప్తంగా 321 నగరాల్లో 1,286 స్టోర్ల నెట్వర్క్ను నిర్వహిస్తోంది.
Also Read: ప్రపంచాన్ని షేక్ చేస్తున్న వింత మద్యం.. బ్రాందీ, విస్కీ కాదు.. అత్యధికంగా తాగేది దీనినే..!
Also Read: ప్రపంచంలోనే మోస్ట్ డేంజరస్ 10 పాములు ఇవే.. ఆ లిస్ట్లో భారత్కు చెందినవి కూడా..!!
Also Read: మరో 15రోజులు బంగారం, వెండి జోలికి వెళ్లకండి.. అమెరికా తీసుకున్న ఈ నిర్ణయం బులియన్ మార్కెట్లో
Also Read: భారీగా పడిపోనున్న గోల్డ్ రేట్.. 2 నెలల్లో తులం 1లక్షకు చేరే ఛాన్స్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Sri lanka Prison Clash: శ్రీ లంక జైలులో అల్లర్లు.. 25 మంది మృతి... 100 మందికి పైగా ఖైదీలకు తీవ్ర గాయాలు..
Hyderabad, Telangana:At Least 25 killed in srilanka: శ్రీలంక పశ్చిమ తీర పట్టణమైన నెగొంబోలోని ఒక జైలులో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఖైదీల మధ్య గ్యాంగ్ వార్ వల్ల ఏకంగా 25 మంది చనిపోయాడు. దాదాపు 100 మందికి పైగా ఖైదీలు తీవ్రంగా గాయాలపాలయ్యారు. చనిపోయిన వారిలో పోలీసు గార్డులు కూడా ఉన్నారు. కిక్కిరిసిన జైలులో ఖైదీల ప్రత్యర్థి వర్గాల మధ్య ఆదివారం ఘర్షణ జరగడంతో హింస మొదటగా చెలరేగింది. అల్లర్లకు పాల్పడిన ఖైదీలు జైలు నుంచి తుపాకులను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం రావడంతో, సోమవారం నాడు మరల అల్లర్లు చెలరేగాయి.
జైలు లోపల మాదకద్రవ్యాల అక్రమ రవాణా కార్యకలాపాలకు మద్దతు ఇస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక వర్గానికి, ఆ కార్యకలాపాలను వ్యతిరేకిస్తున్న మరో వర్గానికి మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో ఒకరిపై మరోకరు దాడులుచేసుకున్నారు. అడ్డువచ్చిన పోలీసులు కూడా దాడులు చేశారు.
ఈ క్రమంలో పరిస్థితి అదుపు తప్పిపొవడంతో అదనపు బలగాల్ని పోలీసులు రప్పించారు. పోలీస్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF), అల్లర్ల నియంత్రణ విభాగాలను మోహరించారు. శాంతిభద్రతలను పునరుద్ధరించే ప్రయత్నాల్లో భాగంగా, ముగ్గురు ఖైదీలను సోమవారం పల్లన్సేన జైలు శిబిరానికి తరలించారు.
ఈ ఘటనపై శ్రీలంక ప్రభుత్వం సీరియస్ గా స్పందించింది. నెగొంబో జైలు లోపల, చుట్టుపక్కల భద్రతను కట్టుదిట్టం చేయడంతో అధికారులు పరిస్థితిని అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తూనే ఉన్నారు.
