ఖమ్మం:సిపిఆర్ చేసి ఓ వ్యక్తికి ప్రాణం
Khammam, Telangana:సిపిఆర్ చేసి ఓ వ్యక్తిని బతికించిన ఘటన ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం విఎం బంజార్ లో చోటుచేసుకుంది. పెనుబల్లి నుండి విఎం బంజార్ కు బైక్ పై యేసుబాబు అనే వ్యక్తి వెళుతుండగా అదుపుతప్పి కిందపడి అపస్మారక స్థితికి చేరాడు. సమీపంలో శానిటైజేషన్ పని చేస్తున్న రామారావు అనే వ్యక్తి అక్కడకు చేరుకుని సీపీఆర్ చేసాడు. ఈక్రమంలో ఒక్కసారిగా ఊపిరి తీసుకున్నాడు. సీపీఆర్ చేసి ప్రాణాలు రక్షించిన రామారావును అభినందించారు.हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
FIFA World Cup 2026: అంతరిక్షంలో Trionda ఫుట్బాల్.. నాసా క్రేజీ ప్రయోగం వెనుక ఉన్న ప్రత్యేకతలేంటో తెలుసా?
Secunderabad, Telangana:FIFA World Cup 2026: ప్రపంచవ్యాప్తంగా ఫీఫా సందడి నెలకొంది. తాజాగా అంతరిక్షం నుండి ఒక అద్భుతమైన చిత్రం వెలుగులోకి వచ్చింది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఉంచిన అధికారిక ఫీఫా ప్రపంచ కప్ ఫుట్బాల్, ట్రియోండాను ఈ చిత్రం చూపిస్తుంది. భూమికి 421 కిలోమీటర్ల ఎత్తులో పరిభ్రమిస్తున్న అంతరిక్ష కేంద్రంలోని వ్యోమగాములు, సూక్ష్మ గురుత్వాకర్షణలో ఫుట్బాల్ గతిశీలత, పనితీరును అధ్యయనం చేసే లక్ష్యంతో ట్రియోండా పై ఒక ప్రత్యేక పరీక్షను నిర్వహిస్తున్నారు. అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ఈ ప్రయోగానికి సంబంధించిన ఫోటోలను ఇన్స్టాగ్రామ్లో పంచుకుంది. నాసా ప్రకారం, ఐ.ఎస్.ఎస్ సిబ్బంది 2019లో నిర్వహించిన ఒక అధ్యయనాన్ని పునరావృతం చేశారు. అడిడాస్ తయారు చేసిన ట్రియోండా ఫుట్బాల్ను ఉపయోగించి, బంతి సమతుల్యత, ద్రవ్యరాశి కేంద్రం దాని కదలికను ఎలా ప్రభావితం చేస్తాయో వారు పరిశీలించారు.
అధికారిక ఫీఫా ప్రపంచ కప్ బంతి అంతరిక్షాన్ని చేరుకుందని నాసా తెలిపింది. మైదానంలో బంతి వేగం, దిశ మరింత కచ్చితంగా, ఊహించదగినవిగా ఉండేలా చూసేందుకు, క్రీడా ఇంజనీర్లు ఫుట్బాల్ ద్రవ్యరాశి కేంద్రం, సమతుల్యతను చాలా జాగ్రత్తగా కొలిచి, మెరుగుపరుస్తారు. బాగా సమతుల్యం చేసిన సరిగా సమతుల్యం చేయని బంతుల ప్రవర్తన మధ్య వ్యత్యాసాన్ని ప్రదర్శించడానికి వ్యోమగాములు ఈ ప్రయోగాన్ని పునరావృతం చేశారని నాసా తెలిపింది. మ్యాచ్ బంతులలో పొందుపరిచిన సెన్సార్ల వంటి సాంకేతికతలు వాటి పనితీరును ఎలా ప్రభావితం చేస్తాయో అర్థం చేసుకోవడానికి ఈ అధ్యయనం శాస్త్రవేత్తలకు సహాయపడుతుంది.
The official FIFA World Cup ball went to space!
We're working to inspire the next generation by showing how space exploration inspires innovation in sports science — and everyday life. Learn more: https://t.co/CWbI8MFDtp pic.twitter.com/ebJtkpD5uM
— NASA (@NASA) June 20, 2026
ఫీఫా ప్రకారం, ట్రియోండాలో గాలిలో బంతి స్థిరత్వాన్ని పెంచే అనేక అధునాతన సాంకేతికతలు ఉన్నాయి. అదే సమయంలో దానిపై ఉన్న ఉబ్బెత్తు ఉపరితలం వర్షంలో మెరుగైన పట్టును అందిస్తుంది. ఈ బంతిలో అత్యాధునిక కనెక్టెడ్-బాల్ టెక్నాలజీ కూడా ఉంది. ఇది 500Hz మోషన్ సెన్సార్ చిప్ను కలిగి ఉండి... నిజ-సమయ కదలిక డేటాను వీడియో అసిస్టెంట్ రెఫరీ (VAR) సిస్టమ్కు ప్రసారం చేస్తుంది. ఈ సాంకేతికత మ్యాచ్ అధికారులకు ఆఫ్-సైడ్ నిర్ణయాలు. ఇతర కీలక నిర్ణయాలు తీసుకోవడంలో సహాయపడుతుంది.
Also Read: బంగారం ధరలను కట్టడి చేసేందుకు మోదీ సర్కార్ బిగ్ ప్లాన్.. బ్యాంకులపై కఠిన ఆంక్షలు..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
TG20 League 2026: అట్టహాసంగా టీజీ20 లీగ్ 2026 ప్రారంభం.. విజయ్ దేవరకొండ సందడి
Hyderabad, Telangana:Palamuru Strikers: తెలంగాణలో తొలిసారి దేశీయ క్రికెట్ లీగ్ టోర్నమెంట్ అట్టహాసంగా ప్రారంభమైంది. అట్టహాసంగా నిర్వహిస్తున్న ఈ టోర్నీ ఉప్పల్ స్టేడియంలో ప్రారంభమవగా క్రీడాకారులు సందడి చేశారు. ఐపీఎల్ తరహాలో జరుగుతున్న ఈ టోర్నీలో తెలంగాణలోని ప్రధాన జిల్లాలు జట్లుగా పోటీ పడుతుండగా.. మట్టిలోని మాణిక్యాలు ఈ క్రికెట్ టోర్నీలో తమ తడాఖా చూపించబోతున్నారు. ఈ టోర్నీని యువ నటుడు విజయ్ దేవరకొండ ప్రారంభించగా.. తెలంగాణ ప్రజాప్రతినిధులు హాజరై క్రీడాకారులను ఉత్సాహ పరిచారు.
తొలి మ్యాచ్ పాలమూరు స్ట్రైకర్స్
టీజీ 20 లీగ్ 2026 హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో ఆదివారం ప్రారంభమవగా.. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు హాజరవగా.. ఈ టోర్నీ బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న స్టార్ హీరో విజయ్ దేవరకొండ టోర్నీని లాంఛనంగా ప్రారంభించాడు. మొత్తం 8 జట్లు పాల్గొంటున్న ఈ టోర్నీలో తొలి రోజు పాలమూరు స్ట్రైకర్స్, ఖమ్మం ఏసెస్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. టోర్నీ ప్రారంభం సందర్భంగా డిప్యూటీ సీఎం స్వాగత ప్రసంగం చేశారు.
స్వాగత ప్రసంగం
'గ్రామీణ ప్రాంతాల క్రికెటర్లను సానబట్టి వెలికితీసి ప్రపంచానికి అందించడానికి ఈ లీగ్ తీసుకొచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిర్వాహకులను అభినందిస్తున్నాం. క్రికెట్ అంటే అర్బన్ సెంటర్స్ కు మాత్రమే అవకాశాలు ఉండేవి. మొదటిసారి ప్రతీ జిల్లాలో ఉండే క్రీడాకారులను గుర్తించి టీమ్స్ను సెలెక్ట్ చేసి నిర్వహిస్తున్న లీగ్ దేశానికి మార్గదర్శకంగా ఉంటుంది. నైపుణ్యం ఉన్న గ్రామీణ క్రీడాకారులకు అద్భుతమైన అవకాశం ఉంది' అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు.
భవిష్యత్లో ఒలింపిక్స్లో
'క్రీడలను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని.. ఫుట్బాల్ క్రీడాకారుడు మెస్సీని హైదరాబాద్కి తీసుకొచ్చాం. హైదరాబాద్లో స్పోర్ట్స్ యూనివర్సిటీ తీసుకురాబోతున్నాం. భవిష్యత్లో ఒలింపిక్స్లో తెలంగాణ నుంచి మెడల్స్ పొందేలా శిక్షణ ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం పునాదులు వేస్తుంది' అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఈ జట్లలో టీమ్ఇండియా అండర్ 19కు ఆడిన ప్లేయర్లు, రంజీ ట్రోఫీలో ప్రాతినిధ్యం వహించిన ఆటగాళ్లు బరిలో దిగుతుండగా.. దేశీయ టోర్నీల్లో సత్తా చాటిన క్రికెటర్లు కూడా ఉన్నారు. టోర్నీ ప్రారంభోత్సవంలో టీజీ20 లీగ్-2026 తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్, హెచ్సీఏ కార్యదర్శి జీవన్ రెడ్డి, తెలంగాణ టీ20 లీగ్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ ఆగంరావు ఉన్నారు.
టోర్నీలో పాల్గొంటున్న జట్లు ఇవే!
పాలమూరు స్ట్రెకర్స్
మెదక్ ఫాల్కాన్స్
నల్గొండ నైట్స్
వరంగల్ వారియర్స్
ఖమ్మం ఏసెస్
కరీంనగర్ డైమండ్స్
రంగారెడ్డి రైజర్స్
హైదరాబాద్ ఈ ఛాంపియన్స్
టోర్నీలో స్టార్ ఆటగాళ్లు
టీజీ20 లీగ్లో స్టార్ ప్లేయర్లు కూడా గ్రౌండ్లో దిగనున్నారు. భారత స్టార్ ఆటగాళ్లు మహ్మద్ సిరాజ్, తిలక్ వర్మ తెలంగాణ క్రికెట్ టోర్నమెంట్లో బరిలో దిగే అవకాశం ఉంది. తిలక్ వర్మను వేలం రూ.33 లక్షలకు మెదక్ జట్టు కొనుగోలు చేయగా, మహ్మద్ సిరాజ్ను రూ.14 లక్షలకు వరంగల్ జట్టు వేలంలో దక్కించుకుంది. ఈ టోర్నీలో వారిద్దరూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు.
Yoga Day 2026: రోజూ యోగా చేయడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే! మోడ్రన్ సైన్స్ ఏం చెబుతుందంటే?
Hyderabad, Telangana:Modern Science On Yoga: యోగా అనేది శరీరం, మనస్సు, ఆత్మకు కలిపి చేసే ప్రాచీన అభ్యాసం. ఇది ఒక వ్యక్తి శారీరక బలం, మానసిక శ్రేయస్సు, అంతర్గత చైతన్యాన్ని మెరుగుపరచడానికి దోహదపడుతుంది. అలాంటి వాళ్లను చురుకుగా ఉంచేందుకు ప్రేరేపిస్తుంది. "యోగా" అనే పదం "యుజ్" అనే సంస్కృత మూలం నుండి వచ్చింది. దీని అర్థం "ఐక్యం చేయడం" లేదా "కలపడం" . వేల ఏళ్ల క్రితం ప్రాచీన భారతదేశంలో ఉద్భవించిన యోగా, ప్రపంచంలోని ప్రతి మూలలో ఆచరించబడే ఒక సంపూర్ణ క్రమశిక్షణగా పరిణామం చెందింది.
ప్రపంచవ్యాప్తంగా ప్రతిఏటా జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. యోగాకు ఉన్న అపారమైన శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ప్రయోజనాల గురించి ప్రపంచవ్యాప్తంగా అవగాహన కల్పించడం దీని ముఖ్య ఉద్దేశ్యం. ఒత్తిడిని తగ్గించుకోవడానికి, చురుకుగా ఉండడం సహా ఆరోగ్యకరమైన, మరింత సామరస్యపూర్వకమైన జీవనశైలిని నిర్మించుకోవడానికి ఈ ప్రాచీన అభ్యాసాన్ని స్వీకరించమని ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ప్రజలను ప్రోత్సహిస్తుంది.
ఆధునిక విజ్ఞానశాస్త్రానికి యోగా ఎందుకు ముఖ్యం?
ప్రపంచవ్యాప్తంగా ఆధునిక విజ్ఞానశాస్త్ర రంగంలో యోగాకు ఆదరణ రోజురోజుకు పెరుగుతోంది. యోగా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలను ఎలా తగ్గిస్తుంది. ఒత్తిడిని ఎలా తగ్గిస్తుంది, మెదడు పనితీరును ఎలా మెరుగుపరుస్తుంది అనే విషయాలు ఈ రోజుల్లో దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇది శాస్త్రవేత్తలను యోగా ప్రభావాలను లోతుగా అన్వేషించడానికి ప్రోత్సహిస్తోంది.
యోగా గురించి ఆధునిక విజ్ఞానశాస్త్రం ఏమి చెబుతుంది?
నివేదికల ప్రకారం.. యోగాను క్రమం తప్పకుండా అభ్యసించినప్పుడు అది అనేక శారీరక, మానసిక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుందని ఆధునిక విజ్ఞానశాస్త్రం సూచిస్తుంది. యోగా ఒత్తిడిని తగ్గించడంలో, శరీర సౌలభ్యాన్ని, సమతుల్యతను మెరుగుపరచడంలో, మానసిక శ్రేయస్సును పెంచడం సహా మొత్తం జీవన నాణ్యత పెంచడంలో సహాయపడుతుందని నమ్ముతారు. ఒక వ్యక్తి జీవితంలో యోగా అభ్యాసం వల్ల ఆందోళన, కుంగుబాటు, దీర్ఘకాలిక నొప్పులు, అధిక రక్తపోటు, నిద్రలేమి వంటి సమస్యలను నియంత్రించడంలో సహాయపడుతుంది.
యోగా వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..
1) మానసిక ఒత్తిడి
మన శరీరంలో కార్టిసాల్ హార్మోన్ అనేది మానసిక ఒత్తిడిని కలిగిస్తుంది. రోజూ యోగా సాధన చేయడం వల్ల కార్టిసాల్ స్థాయిలను తగ్గించవచ్చని శాస్త్రీయంగా నిరూపితం అయ్యింది. ఈ విధంగో క్రమం తప్పకుండా యోగా, ప్రాణాయామం అభ్యాసం చేయడం వల్ల పారాసింపథెటిక్ నాడీ వ్యవస్థ ఉత్తేజితమై, శరీరాన్ని ప్రశాంతపరుస్తుంది.
2) మెదడు ఆరోగ్యం
క్రమం తప్పకుండా యోగా చేసే వారి మెదడులో గ్రే మ్యాటర్ పెరిగినట్లు.. ఎంఆర్ఐ స్కానింగ్ ఉపయోగించి చేసిన అధ్యయనాలు బయటపెట్టాయి. జ్ఞాపకశక్తిని, ఏకాగ్రతను మెరుగుపరచడంతో పాటు వయసుతో పాటు వచ్చే మెదడు సమస్యలను నివారించడంలో యోగా ప్రభావవంతంగా ఉంటుంది.
3) గుండె ఆరోగ్యం
రోజూ యోగా చేయడం వల్ల గుండె సంబంధిత రక్తపోటు, కొలెస్ట్రాల్ నియంత్రించేందుకు సహాయపడుతుందని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వెల్లడించింది. తద్వారా గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించవచ్చని పేర్కొన్నాయి.
4) రోగనిరోధక శక్తి పెరుగుదల
రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడే యోగాసనాలు, శ్వాస వ్యాయామాలు ఉన్నాయి.
5) దీర్ఘకాలిక నొప్పి నుండి ఉపశమనం
ఎన్నో రోజులుగా లేదా నెలలుగా పడుతున్న నడుము నొప్పి, కీళ్లవాతం, మైగ్రేన్లు మొదలైన వాటికి యోగా ప్రయోజనకరంగా ఉంటుందని అధ్యయనాల్లో తేలింది. ఇది శరీరంలోని కండరాలను బలపరచడం సహా.. తద్వారా దీర్ఘకాలిక నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది.
Also Read: రోజూ 10 నిమిషాల యోగా మీ జీవితాన్నే మార్చేస్తుంది! యోగా
Also Read; Fathers Day 2026: మనకు అన్నీ నేర్పించిన నాన్న కోసం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Strait Of Hormuz: పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్తత..హోర్మూజ్ జలసంధిని మూసివేసిన ఇరాన్!
Strait Of Hormuz Closed: పశ్చిమాసియాలో యుద్ధాన్ని ముగించే ఒప్పందాన్ని అమలు చేయడంపై చర్చల కోసం ఇరాన్, అమెరికా ప్రతినిధులు స్విట్జర్లాండ్లో సమావేశం కావడానికి సిద్ధమవుతున్న తరుణంలో.. లెబనాన్లో ఇజ్రాయెల్ దాడులకు నిరసనగా కీలకమైన హోర్ముజ్ జలసంధిని శనివారం మరోసారి మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. ఈ ఉద్రిక్తతల్లో నలుగురు ఇజ్రాయెల్ సైనికులు మరణించిన తర్వాత.. లెబనాన్లో ఇజ్రాయెల్ వరుస దాడులు జరపడంతో, శుక్రవారం స్విట్జర్లాండ్లో తదుపరి చర్చలు జరగాల్సి ఉండగా.. చివరి నిమిషంలో వాయిదా పడ్డాయి.Road Accident: ఫాదర్స్ డే రోజు విషాదం.. రోడ్డు ప్రమాదంలో తండ్రీ కొడుకులు దుర్మరణం
Khammam, Telangana:Fathers Day Turns Tragedy: ప్రపంచమంతా ఫాదర్స్ డేను ప్రశాంతంగా.. ఆనందోత్సాహాలతో చేసుకుంటుండగా.. తెలంగాణలో మాత్రం తీవ్ర విషాదం నింపింది. ఫాదర్స్ డే రోజే పలు విషాద సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఓ తల్లి కాపురంలో కలహాలతో తన ఇద్దరి పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకోగా.. తండ్రిని ఒంటరిని చేసింది. మరో ఘటనలో దురదృష్టవశాత్తు జరిగిన ప్రమాదంలో తండ్రీ కొడుకుతోపాటు ఓ మహిళ కూడా మరణించారు. ఈ సంఘటనలన్నీ కూడా ఖమ్మం జిల్లాలో చోటుచేసుకున్నాయి.
రోడ్డు ప్రమాదం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చెట్టును కారు ఢీకొనడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం పూసుగూడెం, మాదారం అటవీ ప్రాంతంలో ఆదివారం మధ్యాహ్నం కారు అదుపు తప్పి చెట్టును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన (భార్యాభర్తలు, కొడుకు) ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. తల్లికి తీవ్ర గాయాలవడంతో 108 వాహనంలో పాల్వంచ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతి చెందిన వారు ఒకే కుటుంబానికి చెందిన భార్యాభర్తలు సాయి ప్రకాష్, సంధ్య, వారి కొడుకు మోక్షిత్ (ఐదు సంవత్సరాలు) ఉండగా.. వారి తల్లి జ్యోతికి తీవ్ర గాయాలవడంతో ఆస్పత్రిలో కొనప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు.
బంధువుల ఇంటికి వెళ్లి
ప్రమాదానికి గురయిన కుటుంబం మొత్తం భద్రాచలం పట్టణానికి చెందిన వారుగా తెలుస్తోంది. వీరంతా ములకలపల్లిలోని బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి భద్రాచలం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పాల్వంచ ప్రభుత్వాసుపత్రికి తరలిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఒకేసారి ముగ్గురు మరణించడంతో ఆ కుటుంబం తీవ్ర దుఃఖంలో మునిగిపోయింది.
కాపురంలో కలహాలు
ఖమ్మం జిల్లాలో ఓ వివాహిత తనతోపాటు తన ఇద్దరు పిల్లలకు ఎలుకల మందు తాగించి ప్రాణాలు తీసింది. వారి ముగ్గురు మరణంతో ఓ తండ్రి దిక్కులేని వాడుగా మారాడు. ఖమ్మం త్రీ టౌన్ పరిధిలోని గాంధీనగర్కు లింగరాజు, స్వాతి భార్యాభర్తలు. వారికి ఇద్దరు కుమారులు వేదిక్ కుమార్ (7), తనిష్క్ (5)తో ఉన్నారు. అయితే నిత్యం కాపురంలో కలహాలు ఉండడంతో భార్యాభర్తలు నిత్యం గొడవపడేవారు. ఈ క్రమంలో స్వాతి క్షణికావేశానికి గురయి తన ఇద్దరు పిల్లలకు ఎలుకల మందు తినిపించి.. తానూ తిని ఆత్మహత్యకు పాల్పడింది. వెంటనే లింగరాజు స్పందించి వారిని ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఇద్దరు చిన్నారులు మరణించగా.. స్వాతి పరిస్థితి విషమంగా ఉంది.
వివాహేతర సంబంధంతో హత్య
కొత్తగూడెం టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చుంచుపల్లి మండలం పెనగడప అంబేద్కర్ నగర్లో తన భార్యను వేధిస్తున్నాడని అనుమానంతో నాగరాజు అనే వ్యక్తిని కత్తితో పొడిచి ఓ దుండగుడు హత్య చేశాడు. ఓ ఫంక్షన్ హాల్లో నాగరాజుకు శివాజీకి మధ్య ఘర్షణ జరిగింది. కక్షపెంచుకున్న శివాజీ పథకం ప్రకారం నాగరాజును రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో కత్తితో విచక్షణా రహితంగా కడుపులో పొడవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. 'పాల్వంచ పెద్దమ్మ గుడిలో జరిగిన ఫంక్షన్లో శివాజీ తన భార్యతో వెళ్లగా అదే ఫంక్షన్కు హాజరైన నాగరాజు గొడవ పడ్డాడు. శివాజీకి తన భార్యకు నాగరాజు మధ్య వివాహేతర సంబంధం ఉందని అనుమానం ఉంది. ఫంక్షన్కు తన భార్య కోసమే నాగరాజు వచ్చాడని శివాజీ ఆగ్రహంతో నాగరాజుతో ఘర్షణకు దిగాడు. ఇద్దరి మధ్య కొట్లాట జరిగింది' అని మృతుడి మేనత్త తెలిపారు. ఈ ఘటనపై రామవరం టూ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదవగా.. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
KTR: ఒక్క ఏడాది ఓపిక పట్టండి... మళ్లీ రాబోయేది కేసీఆర్ ప్రభుత్వం: కేటీఆర్
Hyderabad, Telangana:KTR Requests To Public: 'అలవి కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి తాను గుంపు మేస్త్రి అని చెప్పుకుంటూ నిర్మాణాలు చేయాల్సింది పోయి ప్రజల ఇండ్లను కూల్చే పనిలో పడ్డాడు. ఈ ప్రభుత్వానికి సగం కాలం పూర్తయింది. కానీ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు' అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు. రాష్ట్రంలో అభివృద్ధి పేరుతో లూటీలు జరుగుతున్నాయి.. కానీ హైదరాబాద్ నగరంలో ఒక్క ఇటుక కూడా పేర్చలేదు అని చెప్పారు.
హైదరాబాద్ రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని హనుమాన్నగర్లో నిర్వహించిన బస్తీ బాట కార్యక్రమంలో పాల్గొని స్థానిక ప్రజల సమస్యలను బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అడిగి తెలుసుకున్నారు. దాదాపు 60 సంవత్సరాలుగా హనుమాన్ నగర్ బస్తీలో నివసిస్తున్న తమను బలవంతంగా తరలించి.. ఆ భూములను ప్రభుత్వం అమ్మేసుకోవాలని రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నాడని బస్తీవాసులు కేటీఆర్ దృష్టికి తీసుకొచ్చారు. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అందించిన పట్టాలను కూడా రద్దు చేసి.. తమ భూములను లాక్కోవాలని ప్రభుత్వం కుట్ర చేస్తోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.
మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, బీఆర్ఎస్ పార్టీ రాజేంద్రనగర్ నియోజకవర్గ ఇన్చార్జ్ పట్లోళ్ల కార్తీక్ రెడ్డి పాల్గొన్న బస్తీబాటలో మాజీ మంత్రి కేటీఆర్ పాల్గొని కీలక ప్రసంగం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లపాటు అధికారంలో ఉన్న సమయంలో హనుమాన్ నగర్ ప్రజల జోలికి ఎవరూ రాలేదని గుర్తుచేశారు. హనుమాన్ నగర్ బస్తీ మూసీకి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ.. ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ భూములను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ప్రజలు ఐక్యంగా ఉంటే ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చని సూచించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ప్రజల సమస్యలను అర్థం చేసుకునే తెలివితేటలు కూడా లేవని మండిపడ్డారు.
'ఇంకో సంవత్సరం ఓపిక పట్టండి... మళ్లీ రాబోయేది మన ప్రభుత్వమే. కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక అందరికీ పట్టాలు ఇచ్చే బాధ్యత మాది' అని బస్తీవాసులకు మాజీ మంత్రి కేటీఆర్ భరోసా ఇచ్చారు. ఈ ఒక్క సంవత్సరం పాటు మీ ఇండ్లను మీరే కాపాడుకోండి... కాంగ్రెస్ నాయకుల మాటలకు మోసపోవద్దని సూచించారు. పెద్దలకు ఒక నీతి... పేదలకు మరో నీతి అన్నట్లుగా హైడ్రా వ్యవహరిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
'రాజేంద్రనగర్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లి, ప్రస్తుతం స్థానిక ప్రజలను బెదిరింపులకు గురిచేస్తున్నారని తమ దృష్టికి వచ్చింది. మేమంతా మీకు అండగా ఉంటాం. ఎవరూ భయపడకండి' అని మాజీ మంత్రి కేటీఆర్ హితవు పలికారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం రెండున్నర సంవత్సరాలు గడిచినా ఎన్నికల హామీల్లో ఒక్కదాన్ని కూడా అమలు చేయలేదని గుర్తుచేశారు.
UK Grooming Gang Report: 2,50,000 అమ్మాయిలపై అత్యాచారం చేసిన పాకిస్థానీ టీమ్..పనికట్టుకొని మరీ బాలికలకు ఎర!
England:UK Grooming Gang News: బ్రిటన్లో గత కొన్ని దశాబ్దాలుగా సాగిన అమానవీయ 'గ్రూమింగ్ గ్యాంగ్' వ్యవస్థీకృత బాలల లైంగిక దోపిడీకి సంబంధించిన నమ్మలేని నిజాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. బ్రిటిష్ పార్లమెంట్ సభ్యుడు (MP) రూపెర్ట్ లోవ్ నేతృత్వంలోని ఒక స్వతంత్ర విచారణ సంస్థ జూన్ 16న విడుదల చేసిన 'సామూహిక అత్యాచార విచారణ నివేదిక' దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఈ ఘోరాల బారిన పడి కనీసం 2,50,000 మంది బాలికలు లైంగిక వేధింపులకు గురయ్యారని ఈ నివేదిక వెల్లడించింది.
బాధితురాలి నుండి సామాజిక కార్యకర్తగా మారిన సామీ వుడ్హౌస్ అధ్యక్షతన, కోర్టు రికార్డులు, బాధితుల వాంగ్మూలాల ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు. ఈ దారుణాల్లో బాధితులుగా మారిన వారిలో అత్యధిక శాతం మంది శ్వేతజాతీయులైన బ్రిటిష్ బాలికలే కావడం గమనార్హం. 2005 నుండి 2017 మధ్య కాలంలో బాలల లైంగిక దోపిడీకి పాల్పడి శిక్ష అనుభవిస్తున్న వారిలో 84 శాతం మంది దక్షిణాసియా ముస్లిం (ప్రధానంగా పాకిస్తానీ మూలాలున్న) పురుషులేనని నివేదిక స్పష్టం చేసింది.
యూకేలోని దాదాపు 40 శాతం ప్రాంతాలు (149 స్థానిక అధికార జిల్లాలు) ఈ ముఠాల బారిన పడ్డాయి. రోథర్హామ్, ఆక్స్ఫర్డ్, టెల్ఫోర్డ్, రోచ్డేల్ వంటి నగరాల్లో ఇవి తీవ్రస్థాయిలో సాగాయి.
ముఠాల అమానుష వ్యూహం
ఈ వ్యవస్థీకృత ముఠాలు విచ్ఛిన్నమైన కుటుంబాలు, సంరక్షణ గృహాలకు చెందిన 11 ఏళ్ల లోపు బలహీనమైన బాలికలను లక్ష్యంగా చేసుకునేవి. పాఠశాలల వద్ద, వీధుల్లో బాలికలతో స్నేహం చేసి.. వారికి బహుమతులు, మద్యం, మాదకద్రవ్యాలు ఎరగా వేసి టాక్సీలలో రహస్య ప్రాంతాలకు తరలించేవారు.
ఇళ్లు, హోటళ్లు, రెస్టారెంట్లలో వారిపై పదేపదే సామూహిక అత్యాచారాలు, చిత్రహింసలు జరిపేవారని నివేదికలు వెల్లడించాయి. బ్లాక్మెయిల్ చేయడం కోసం వాటిని చిత్రీకరించి, ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి, కొన్నిసార్లు విదేశాలకు సైతం అక్రమ రవాణా చేసేవారు. ఈ క్రూరత్వం కారణంగా ఎంతోమంది మైనర్ బాలికలు గర్భవతులయ్యారు. బలవంతపు అబార్షన్లు, తీవ్ర మానసిక ఆఘాతాల వల్ల గర్భస్రావాలకు గురయ్యారు.
బ్రిటన్ జాతీయ ఆరోగ్య సంస్థ (NHS) 13 ఏళ్ల చిన్న పిల్లలలో జననేంద్రియ గాయాలు, లైంగిక వ్యాధులు, ఆత్మహత్యాయత్నాలను గుర్తించినప్పటికీ, బాధితులకు సరైన రక్షణ కల్పించడంలో విఫలమై తిరిగి వారిని అదే నరకంలోకి నెట్టేసిందని నివేదిక తీవ్రంగా తప్పుబట్టింది.
దశాబ్దాలుగా సాగిన ఈ దారుణాలను అణచివేయడంలో పోలీసులు, సామాజిక సేవా సంస్థలు, విద్యాసంస్థలు, ఎన్హెచ్ఎస్, ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయి. నివేదిక ఆరోపణ ఆధారంగా.. నేరస్థుల జాతి, మతపరమైన నేపథ్యం కారణంగా, తమపై ఎక్కడ "జాత్యహంకారులు" అనే ముద్ర పడుతుందోననే భయంతో అధికారులు చర్యలు తీసుకోవడానికి వెనుకాడారు. కొన్ని ముస్లిం సమాజాల్లోని సాంస్కృతిక వైఖరులు, ముస్లిమేతర అమ్మాయిలను తక్కువగా చూసే ధోరణి కూడా ఈ నేరాలు పెరగడానికి దోహదపడ్డాయి.
నివేదిక చేసిన కఠిన సిఫార్సులు
సమూహ ఆధారిత బాలల లైంగిక దోపిడీకి పాల్పడే ప్రధాన సూత్రధారులకు కనీసం 50 సంవత్సరాలు, సహకరించిన వారికి 25 సంవత్సరాల జైలు శిక్ష విధించాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి ఘోరాలకు పాల్పడినట్లు రుజువైన విదేశీ పౌరుల బ్రిటిష్ పౌరసత్వాన్ని రద్దు చేయాలి. ద్వంద్వ పౌరసత్వం ఉన్నవారితో సహా అందరినీ వెంటనే దేశం నుండి బహిష్కరించాలి. ప్రాణాలతో బయటపడిన బాధితులకు ప్రభుత్వ పరంగా పూర్తిస్థాయి పునరావాసం, మానసిక వైద్యం అందించాలి. ప్రజల నుంచి సేకరించిన నిధులతో, బాధితుల ఆధ్వర్యంలోనే సాగిన ఈ స్వతంత్ర విచారణ నివేదిక ప్రస్తుతం యూకేలో బాలల రక్షణ, వలసల విధానం, చట్టపరమైన జవాబుదారీతనంపై తీవ్రస్థాయి చర్చకు దారితీసింది.
Also Read: హిజాబ్ లేకుండా పాట పాడిందని లేడీ సింగర్కు 74 కొరడా దెబ్బలు!
Also Read: అమెరికా-ఇరాన్ దేశాల మధ్య శాంతి ఒప్పందం..యుద్ధం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Prakash Raj Arrest: నటుడు ప్రకాష్ రాజ్పై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ..ఎట్టి పరిస్థితుల్లో అరెస్టు చేయాలని ఆదేశం!
Hyderabad, Telangana:Prakash Raj Arrest Warrant: సినీ నటుడు ప్రకాష్ రాజ్పై నాన్-బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది. ఇటీవల 'ధర్మస్థల' కేసుతో వార్తల్లో నిలిచిన బహుభాషా నటుడు ప్రకాష్ రాజ్ ఇప్పుడు మరో చిక్కులో పడ్డారు. ఒకే పేరుతో నాలుగు ఓటర్ ఐడీ కార్డులు పొందారన్న ఆరోపణపై నటుడు ప్రకాష్ రాజ్పై నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ అయింది.
ప్రకాష్ రాజ్పై దిలీప్ కుమార్ కేసు నమోదు చేయడంతో బెంగళూరు మేజిస్ట్రేట్ కోర్టు నాన్-బెయిలబుల్ వారెంట్ (NBW) జారీ చేసింది. ఒకే పేరుతో నాలుగు ఓటర్ ఐడీ కార్డులు పొందారన్న ఆరోపణలపై దిలీప్ కుమార్ కేసు దాఖలు చేశారు. ఆ తర్వాత, 48వ ఏసీజేఎం కోర్టు ప్రకాష్ రాజ్పై ఎన్బీడబ్ల్యూ జారీ చేయగా, మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.
కోర్టు ద్వారా రెండుసార్లు సమన్లు జారీ చేసినా, రెండుసార్లు నాన్-బెయిలబుల్ వారెంట్ (NBW) జారీ చేసినా ప్రకాష్ రాజ్ హాజరు కాకపోవడంతో, మేజిస్ట్రేట్ కోర్టు ఇప్పుడు ఆయనపై మూడోసారి నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. అరెస్ట్ వారెంట్ జారీ అయింది.
ఎన్నిసార్లు నోటీసులు జారీ చేసినా నటుడు ప్రకాష్ రాజ్ కోర్టుకు హాజరు కాలేదు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు.. ఈ నాలుగు రాష్ట్రాల్లో చట్టవిరుద్ధమైన ఓటర్ ఐడి కలిగి ఉన్నారనే తీవ్రమైన ఆరోపణలను ప్రకాష్ రాజ్ ఎదుర్కొంటున్నారు. రాజ్యాంగం ప్రకారం, ఒక వ్యక్తి దేశంలోని ఏ ప్రాంతంలోనైనా ఒకే ఒక ఓటర్ ఐడి కార్డును మాత్రమే కలిగి ఉండటానికి అనుమతి ఉంది.
కానీ నటుడు ప్రకాష్ రాజ్ నాలుగు రాష్ట్రాల్లో ఓటర్ ఐడి కార్డులు పొందారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో, నిందితుడు ప్రకాష్ రాజ్ సమన్లు, వారెంట్లను పట్టించుకోకుండా కోర్టుకు హాజరు కాకపోవడంపై ఏసీజేఎం కోర్టు ఆగ్రహంగా ఉందని అంటున్నారు. దీంతో, మేజిస్ట్రేట్ కోర్టు ఇప్పుడు ప్రకాష్ రాజ్ కోసం అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఏ సమన్లు, వారెంట్లకూ హాజరుకాని ప్రకాష్ రాజ్పై ఇప్పుడు చట్ట ఉల్లంఘన ఆరోపణలు కూడా నమోదయ్యాయి. ఈ కారణాలన్నిటి వల్ల నటుడు ప్రకాష్ రాజ్ ఇప్పుడు అరెస్టు ముప్పును ఎదుర్కొంటున్నారు.
Also Read: మరణించిన తర్వాత ఆరుగురికి ప్రాణం పోసిన రాజ్..ముంబై కుర్రాడి హృదయ విదారక గాథ!
Also Read: భారీగా తగ్గిన ధరలు.. బంగారంపై రూ.3 వేలు.. వెండి రూ.14 వేలు డౌన్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Tirumala: తిరుమల శ్రీవారి సేవలో 'చెన్నై లవ్ స్టోరీ బృందం', ఇతర ప్రముఖులు
Tirupati Urban, Andhra Pradesh:Tirumala Rush: కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఆదివారం పూట సినీ, రాజకీయ ప్రముఖులతోపాటు పలు రాష్ట్రాల న్యాయమూర్తులు స్వామిని దర్శించుకున్నారు. దీంతో భక్తులతో తిరుమల కిటకిటలాడింది. వేసవి సెలవులు ముగిసినా కూడా భక్తుల తాడికి తిరుమలకు తగ్గడం లేదు. వారికి ప్రత్యేక దర్శనం కల్పించిన అనంతరం టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
సినీ ప్రముఖులు
త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న చెన్నై లవ్ స్టోరీ చిత్ర బంధం కూడా తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. తిరుమల స్వామిని ఆదివారం ఉదయం కిరణ్ అబ్బవరంతోపాటు హీరోయిన్ శ్రీ గౌరి ప్రియ, నిర్మాత శ్రీనివాస్ కుమార్, రచయిత అనంత శ్రీరామ్, సంగీత దర్శకుడు మణిశర్మ స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వారికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు కల్పించిన టీటీడీ అధికారులు.. అనంతరం ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం అందించి తీర్థ ప్రసాదాలు ఇచ్చారు. దర్శనానంతరం సినిమా బృందం ఆలయం వెలుపల సందడి చేశారు. తమ సినిమా విజయం సాధించాలని.. ప్రేక్షకుల ఆదరణ పొందాలని స్వామివారి సన్నిధిలో వారు ప్రార్థించినట్లు సినీ నటుడు కిరణ్ అబ్బవరం తెలిపారు
న్యాయమూర్తులు
శ్రీవారిని తెలంగాణ, మేఘాలయ న్యాయమూర్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మేఘాలయ హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి రామలింగం సుధాకర్, తెలంగాణ హైకోర్ట్ న్యాయమూర్తి శ్రవణ కుమార్ ఆలయ దర్శనానికి రాగా.. అధికారులు వారికి వేద ఆశీర్వచనం అందించి శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఇక గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి కుటుంబసభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు .
After the blockbuster Musical Fest of #ChennaiLoveStory
Hero @Kiran_Abbavaram, #SriGouriPriya & producers @SKNonline & #SaiRajesh, @DheeMogilineni completed divine darshan at Tirupati ✨❤️ pic.twitter.com/KVbjkOv3gZ
— Mohan Kumar (@ursmohan_kumar) June 21, 2026
తిరుమలలో భక్తుల రద్దీ
వారాంతం కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠంలోని అన్ని కంపార్ట్మెంట్లలోని క్యూలైన్లలో భక్తులు వేచి ఉన్నారు. ఉచిత సర్వదర్శనానికి సుమారు 15 నుంచి 18 గంటల సమయం పడుతోంది. టైమ్ స్లాట్ (ఎస్ఎస్డీ) టోకెన్లు కలిగిన భక్తులకు 2-5 గంటలు దర్శనానికి సమయం పడుతుంటా.. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సుమారు 2-6 గంటల సమయం కొనసాగుతోందని టీటీడీ అధికారులు తెలిపారు. నిన్న 20వ తేదీన స్వామివారిని 93,303 మంది భక్తులు దర్శించుకున్నట్లు వెల్లడించారు. స్వామివారికి తలనీలాలు 46,688 మంది భక్తులు సమర్పించగా.. స్వామివారి హుండీ ఆదాయం రూ.4.49 కోట్లు వచ్చింది.
Team India ODI Squad: వన్డే జట్టులో ఎట్టకేలకు విరాట్ కోహ్లీ ఆగమనం..కానీ, ఆ పని చేస్తేనే ఆడే ఛాన్స్!
Mumbai, Maharashtra:Team India ODI Squad Vs England: జూలైలో ఇంగ్లాండ్తో జరగనున్న వన్డే సిరీస్ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) 15 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. చాలా రోజుల తర్వాత వన్డే జట్టులో కోహ్లీకి అవకాశం కల్పించగా.. అయితే ఈ నెలాఖరులో జరిగే ఫిట్నెస్ పరీక్షలో అతను నెగ్గాల్సి ఉంటుంది. తాజాగా బీసీసీఐ ప్రకటించిన వన్డే జట్టుకు శుభ్మన్ గిల్ నాయకత్వం వహిస్తుండగా.. జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్ తిరిగి జట్టులోకి వచ్చారు. ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా టీమ్ఇండియా జట్టు జూలై 14 నుంచి 19 వరకు మూడు వన్డేలు ఆడనుంది.
బీసీసీఐ ప్రకటించిన వన్డే జట్టులో ఎవరెవరు ఉన్నారంటే?
శుభ్మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ (ఫిట్నెస్ పరీక్ష నెగ్గాలి), శ్రేయాస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, నితీష్ కుమార్ రెడ్డి, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, ప్రసిధ్ కృష్ణ, హర్షిత్ రాణా, అర్ష్దీప్ సింగ్, గుర్నూర్ బ్రార్.
గత నెల ఇండియన్ ప్రీమియర్ లీగ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ప్రాతినిధ్యం వహించిన విరాట్ కోహ్లీ.. ఫైనల్ మ్యాచ్లో బ్యాటింగ్ చేస్తుండగా.. కోహ్లీకి'హామ్స్ట్రింగ్' గాయం బారిన పడ్డాడు. అయితే ప్రస్తుతం విరాట్ కోహ్లీ వేగంగా కోలుకుంటున్నాడని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి. లండన్లో BCCI వైద్య బృందం అతన్ని పరీక్షించి, పునరావాస ప్రక్రియలో ప్రాథమిక దశను కొనసాగించడానికి ఒక ప్రణాళికను అందించింది. తదుపరి పరిశీలన, ప్రణాళిక, అనుమతి కోసం అతను జూన్ 22, 2026న CoE (సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్)లో రిపోర్ట్ చేయనున్నారు.
జైస్వాల్, హార్దిక్లకు చోటు లేదు
ఆఫ్ఘనిస్తాన్తో ఇటీవల జరిగిన మూడు మ్యాచ్ల సిరీస్కు కోహ్లీ దూరమయ్యాడు. ఆ సిరీస్ను భారత్ 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. కోహ్లీ గైర్హాజరీలో యశస్వి జైస్వాల్కు అవకాశం లభించింది. ఈ యువ లెఫ్ట్-హ్యాండ్ బ్యాటర్ ఆ అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకుని, జూన్ 20 శనివారం నాడు చెన్నైలో జరిగిన సిరీస్ నిర్ణయాత్మక మ్యాచ్లో సెంచరీ సాధించాడు. అయితే, ఇంగ్లాండ్ పర్యటనకు ఎంపిక చేసిన 15 మంది సభ్యుల వన్డే జట్టులో యశస్వికి చోటు దక్కలేదు.
గాయం సమస్యల నుండి ఇంకా కోలుకుంటున్నందున హార్దిక్ పాండ్యాను ఈ వన్డే పర్యటనకు ఎంపిక చేయలేదు. ఐపీఎల్ 2026 టోర్నమెంట్లో పూర్తి ఫిట్గా ఉండేందుకు ఇబ్బంది పడిన ఈ ఆల్రౌండర్, ఈ నెల ప్రారంభంలో బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో శిక్షణ తీసుకుంటుండగా క్వాడ్రిసెప్స్ కండరాల గాయానికి గురయ్యాడు. అతని గైర్హాజరీలో, నితీష్ కుమార్ రెడ్డి ప్రధాన ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్గా తన స్థానాన్ని నిలబెట్టుకుంటాడు.
శ్రేయస్ అయ్యర్ వైస్ కెప్టెన్గా తన స్థానాన్ని నిలుపుకోగా.. ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన మ్యాచ్లో జైస్వాల్కు అవకాశం కల్పించేందుకు ఓపెనింగ్ స్థానాన్ని ఖాళీ చేసిన కెప్టెన్ శుభ్మన్ గిల్, బ్యాటింగ్ ఆర్డర్లో తిరిగి ఓపెనర్గా వచ్చే అవకాశం ఉంది. లక్నోలో ఆఫ్ఘనిస్తాన్పై 125 పరుగులు చేసి తనదైన ముద్ర వేసిన వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు.
బుమ్రా పునరాగమనం
ఆఫ్ఘనిస్తాన్ వన్డేలకు, యూకే పర్యటనలోని టీ20లకు (ఐర్లాండ్తో మూడు టీ20లు, ఇంగ్లాండ్తో ఐదు) విశ్రాంతి తీసుకున్న జస్ప్రీత్ బుమ్రా, వన్డే జట్టులోకి తిరిగి రానున్నాడు. 2027 ప్రపంచకప్కు ముందు బుమ్రా టెస్ట్ క్రికెట్ ఆడి, వన్డేలపై దృష్టి పెట్టాలన్న ప్రధాన సెలెక్టర్ అజిత్ అగార్కర్ అభిప్రాయానికి అనుగుణంగా ఈ నిర్ణయం ఉంది.
బుమ్రాకు పూర్తిస్థాయి పేస్ బౌలింగ్ దళం అందుబాటులో ఉంటుంది. ఇందులో అర్ష్దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, హర్షిత్ రాణాతో పాటు, ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన తన తొలి వన్డే సిరీస్లో ఏడు వికెట్లతో ఆకట్టుకున్న కొత్త ఆటగాడు గుర్నూర్ బ్రార్ కూడా ఉన్నారు. ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన సిరీస్లో అరంగేట్రం చేసిన ప్రిన్స్ యాదవ్కు జట్టు నుంచి మినహాయింపు లభించింది.
Also Read: ఐపీఎల్ అభిమానులకు గుడ్న్యూస్..94 మ్యాచ్లతో మెగా టోర్నీ..ఆర్సీబీకి పండగే!
Also Read: పాకిస్థాన్ బౌలర్ మెడ పట్టుకున్న టీమ్ఇండియా బ్యాటర్..సోషల్ మీడియాలో వైరల్ వీడియో!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Rythu Bharosa 2026: జూన్ 30న రైతు భరోసా విడుదల.. రూ.15 వేలు వస్తాయా.. రూ.12 వేలా?
Hyderabad, Telangana:Rythu Bharosa Funds Release On June 30: రాష్ట్రంలో వానాకాలం సాగు పనులు ఊపు అందుకుంటున్న సమయంలో రైతందానికి పెట్టుబడి సహాయం అందించే రైతు రైతు భరోసా నిధుల పంపిణీ పై అన్నదాతల్లో ఉత్కంఠ నెలకొంది.. ఈనెల 30వ తేదీ నుంచి రైతుల ఖాతాల్లో వానాకాలం పెట్టుబడి సాయం నిధులను జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కీలక నిర్ణయం తీసుకుంది.. అయితే ప్రస్తుతం ఏకరానికి ఏడాది రూ.12 వేల చొప్పున అందుతుండడంతో.. ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విధంగా ఎకరానికి 15వేల సాయం ఎప్పటి నుంచి అందుతుందని ఉమ్మడి కరీంనగర్ జిల్లా రైతాంగం ఎదురుచూస్తూ వస్తోంది..
జూన్ 30న మధిర సభలో నిధుల విడుదల..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో కేబినెట్ సమావేశంలో రైతు భరోసా నిధుల విడుదలకు ముహూర్తం ఖరారు చేశారు.. జూన్ 30వ తేదీన ఖమ్మం జిల్లాలోని మధిరలో నిర్వహించబోతున్న భారీ బహిరంగ సభ వేదికగా ముఖ్యమంత్రి ఈ నిధుల పంపిణీని అధికారికంగా ప్రారంభించబోతున్నట్లు సమాచారం. లబ్ధిదారులైన రైతుల ఖాతాల్లో దాదాపు పది రోజుల వ్యవధిలోనే నేరుగా ఈ పెట్టుబడి సాయాన్ని జమ చేసేందుకు వ్యవసాయ, ఆర్థిక శాఖలు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం..
రూ.15 వేల పెంపుపై అన్నదాతల ప్రశ్నలు..
ప్రభుత్వం నిధులు విడుదల చేస్తున్నట్లు ప్రకటించినప్పటికీ.. ఉమ్మడి కరీంనగర్ జిల్లా రైతుల్లో ఒకే ఒక అంశంపై ప్రధానంగా చర్చ నడుస్తూ వస్తోంది.. కాంగ్రెస్ ప్రభుత్వం తమ ఎన్నికల మేనిఫెస్టోలో రైతు భరోసా కింద పెట్టుబడి సాయాన్ని ఎకరానికి ఏడాదికి ఏకంగా 15000కు పెంచుతామని హామీ ఇచ్చింది.. ప్రస్తుతం వానాకాలం సీజన్ ప్రారంభమైన.. పాత పద్ధతిలోనే ఎకరానికి 6000 చొప్పున 12000 మాత్రమే జమయ్యే అవకాశాలు ఉండడంతో రైతులు కొంత నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు..
పెంచిన 15వేల సాయాన్ని ఈ వానాకాలం నుంచి వర్తింప చేస్తారా? లేక తదుపరి యాసంగి సీజన్ నుంచి అమలు చేస్తారా? అనే విషయంపై స్పష్టత కరువైంది.. ప్రస్తుతం ఎరువులతో పాటు విత్తనాలు, దుక్కుల ఖర్చులు భారీగా పెరిగిపోవడంతో సాగు పెట్టుబడుల కోసం రైతులు అల్లాడిపోతున్నారు. ఇలాంటి తరుణంలో పెంచిన సాయం త్వరగా అందితే తమకు మరింత ఊరట లభిస్తుందని కరీంనగర్ ఉమ్మడి జిల్లా పరిధిలో చిన్న సన్న కారు రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు..
Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!
రైతుల డిమాండ్..
ప్రభుత్వం జూన్ 30 నుంచి ఇచ్చే నిధులతో పాటు పెంచిన 15 వేల సాయం అమలుపై కూడా తక్షణమే ఒక అధికారిక ప్రకటన చేయాలని.. అర్హులైన ప్రతి ఒక్క రైతుకు.. కౌలు రైతుకు ఈ సాయం అందేలా మార్గదర్శకాలు విడుదల చేయాలని కోరుతున్నారు. ఖాతాల్లో నిధులు జమావుతున్నప్పటికీ వారు సంతోషించినప్పటికీ.. పెరిగిన సాయం ఎప్పటినుంచి చేతికి అందుతుందో తెలియక.. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న లక్షలాదిమంది అన్నదాతలు ఇప్పుడు ప్రభుత్వం వైపు ఆశగా ఎదురుచూస్తున్నారు..
Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
Russia Ukraine War: రష్యాపై ఉక్రెయిన్ మెగా డ్రోన్ ఎటాక్.. ట్యూమెన్ ఆయిల్ రిఫైనరీపై విధ్వంసం!
Hyderabad, Telangana:Russia Ukraine Drone Attack: రష్యా ఉక్రెయిన్ దేశాల మధ్య సాగుతున్న సుదీర్ఘ యుద్ధం సరికొత్త వ్యూహాత్మక మలుపు తిరిగింది.. రష్యా ఆర్థిక మూలాలను దెబ్బతీసే వ్యూహంలో భాగంగా ఉక్రేన్ సైన్యం శత్రుదేశంపై మునుపేన్నడు లేనివిధంగా అత్యంత సుదూర పరిధి నుంచి విధ్వంసకర దాడికి తెగబడింది.. ఉక్రెయిన్ సరిహద్దుల నుంచి ఏకంగా 2000 కిలోమీటర్ల దూరంలో ఉన్న రష్యకు గుండెకాయ లాంటి యురల్స్ (Urals) ప్రాంతంలో ఉన్న ట్యూమెన్ ఆయిల్ రిఫైనరీ ఫై ఉక్రెయిన్ డ్రోన్లతో విరుచుకుపడింది. రష్యా భూభాగంలో ఇంత సుదూర ప్రాంతంలో ఉన్న వ్యూహాత్మక కేంద్రాన్ని ఉక్రెన్ టార్గెట్ చేయడం అంతర్జాతీయ రక్షణ రంగ నిపుణులను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తూ వస్తుంది..
ఆయిల్ రిఫైనరీలే టార్గెట్.. రష్యాకు భారీ నష్టం..
గత కొంతకాలంగా రష్యాకు చెందిన చమురు నిల్వలతోపాటు ఇంధన మౌలిక వసతులే లక్ష్యంగా వుక్రీన్ వరస దాడులకు పాల్పడుతూ వస్తోంది. ఈ క్రమంలో తాజాగా రష్యాలోని అతిపెద్ద ప్రైవేట్ ఆయిల్ రిఫైనరీలో ఒకటైన Tyumen ప్లాంట్పై ఉక్రెయిన్ డ్రోన్లు విజయవంతంగా చేదించాయి.. అత్యంత ప్రతిష్టమైన రష్యా వైమానిక రక్షణ వ్యవస్థ దాటుకుంటూ వెళ్లిన ఈ డ్రోన్లు రిఫైనరీ సమీపంలోని పేలిపోయినట్లు తెలుస్తోంది. ఈ దాడితో రష్యా ఇంధన సరఫరాకు భారీ నష్టం కలిగే అవకాశాలు ఉన్నట్లు సమాచారం..
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్ కి రష్యా భూభాగంపై తాము సాధించిన ఈ సుదూర డ్రోన్ దాడి పై ఉక్రెయిన్ అధ్యక్షుడు హర్షం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇదొక అద్భుతమైన, గొప్ప విజయమని ఆయన అభివర్ణించారట.. శత్రువు మాపై దాడులు చేస్తూ సురక్షితంగా ఉంటాం అనుకుంటే అది పొరపాటేనని.. రష్యా భూభాగంలో ఏ మూలన దాక్కున్న వారిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని.. వారి రక్షణ రంగ ఇంజనీర్లు రాత్రి పగళ్ళు శ్రమించి అత్యంత అధునాతన సాంకేతికతతో సరికొత్త లాంగ్ రేంజ్ డ్రోన్లను అభివృద్ధి చేశారని.. ఇవి ఏకంగా మూడు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను సైతం అత్యంత ఖచ్చితత్వంతో ఛేదించగలమని జెలన్స్ కి తెలిపారు..
3,000 కి.మీ రేంజ్ డ్రోన్లతో రష్యాకు కొత్త ముప్పు..
బుక్ గ్రీన్ సరికొత్తగా తయారుచేసిన ఈ లాంగ్ రేంజ్ డ్రోన్లు రష్యా సైన్యానికి నిద్ర పట్టకుండా చేస్తున్నాయి.. సాధారణంగా చిన్న పరిధిలో పనిచేసే డ్రోన్ల స్థానంలో.. వేల కిలోమీటర్లు ప్రయాణించి వ్యూహాత్మక స్థావరాలను ధ్వంసం చేసే సామర్థ్యం వీటికి ఉంది. 3000 కిలోమీటర్ల పరిధి అంటే కేవలం సరిహద్దు ప్రాంతాలే కాకుండా.. రష్యాలోని దాదాపు అన్ని ప్రముఖ నగరాలతో పాటు పారిశ్రామిక కేంద్రాలు ఇప్పుడు ఉక్రెయిన్ డ్రోన్ల నిఘా నీడలొకి వచ్చినట్లేనని రక్షణ నిపుణులు విశ్లేషిస్తున్నారు..
ఆందోళనలో రష్యా..
సరిహద్దుకు అత్యంత దూరంలో ఉన్న ప్రాంతంపై దాడి జరగడంతో మాస్కో వర్గాలు తీవ్ర దిబ్రాంతుకు గురైనట్లు సమాచారం.. ఈ డ్రోన్ దాడితో రష్యా తన అంతర్గత రక్షణ వ్యవస్థను పునర్సమీక్షించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలుస్తోంది. ఒకవైపు అంతర్జాతీయ ఆంక్షలుతో సతమతమవుతున్న రష్యాకు.. ఈ ఆయిల్ రిఫైనరీ లపై దాడులు మరింత ఆర్థిక నష్టాన్ని చేకూర్చేలా ఉన్నాయి. ఈ ఘటనతో రాబోయే రోజుల్లో ఇరుదేశాల మధ్య దాడులు మరింత తీవ్ర రూపం దాల్చే అవకాశం కనిపిస్తోంది..
Also Read: International Yoga Day 2026: యోగాతో దేశానికి చైతన్యం.. ప్రధాని మోడీ..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Karimnagar: ఘోర ప్రమాదం.. 37 మంది ప్రయాణికులను కాపాడిన రియల్ హీరో..
Karimnagar, Telangana:Karimnagar EV Bus Fire Latest News: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ సమీపంలో ఆదివారం భారీ ప్రమాదం తప్పింది.. ఎల్ఎంటి సమీపంలో ప్రయాణికులతో వెళుతున్న ఒక ఎలక్ట్రిక్ బస్సు లో హఠాత్తుగా ఘోరమైన మంటలు చెలరేగాయి.. బస్సులో ఉన్న 37 మంది ప్రయాణికులు ఏం జరుగుతుందో తెలియక తీవ్రభయాందోళనకు గురయ్యారు.. అయితే బస్సు డ్రైవర్ ప్రశాంత్ చూపిన అసాధారణ సమయస్ఫూర్తితో పాటు ధైర్యం కారణంగా ఒక పెద్ద విపత్తు తృటిలో తప్పింది.. బస్సు పూర్తిగా బూడిదైనా.. ప్రయాణికులు అందరూ ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డారు..
అసలేం జరిగిందంటే..?
హైదరాబాద్ వైపు ప్రయాణికులతో వెళుతున్న ఎలక్ట్రిక్ బస్సు తిమ్మాపూర్ సమీపంలోని కాకతీయ కెనాల్ వద్దకు చేరుకోగానే.. బస్సు వెనుక భాగం నుంచి ఒక్కసారిగా దట్టమైన పొగలు రావడం మొదలయ్యాయి.. దీనిని గమనించిన కొందరు ప్రయాణికులు భయాందోళనతో గట్టిగా అరిచారు.. వెంటనే అలెర్ట్ అయిన డ్రైవర్ ప్రశాంత్.. క్షణం కూడా ఆలస్యం చేయకుండా చాకచక్యంగా వ్యవహరించాడు.. బస్సు రోడ్డు పక్కకు సురక్షితంగా ఆపేసి.. ప్రయాణికులను ఏమాత్రం కంగారు పడవద్దు అని ధైర్యం చెప్పారు.. బస్సు తలుపులు తెరిచి.. లోపల ఉన్న 37 మంది ప్రయాణికులను త్వర త్వరగా కిందికి దింపేశారు..
చివరి ప్రయాణికుడు దిగేవరకు బస్సులోనే..
సాధారణంగా ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణభయంతో ఎవరైనా ముందుగా బయటపడాలని అనుకుంటూ ఉంటారు.. కానీ డ్రైవర్ ప్రశాంత్ మాత్రం వృత్తి ధర్మాన్ని, మానవత్వాన్ని చాటుకున్నారు.. ఏమాత్రం బస్సులో మంటలు వస్తున్నప్పటికీ భయపడకుండా 37 మంది ప్రయాణికులను అతనే త్వర త్వరగా అతని బయటికి పంపించాడు.. చివరి ప్రయాణికుడి వరకు అక్కడే ఉండి.. చివరిగా అందరూ దిగిన తర్వాతే డ్రైవర్ ప్రశాంత్ కాలుతున్న బస్సులో నుంచి దిగాడు...
క్షణాల్లో బస్సులో మంటలు..
ప్రయాణికులు అందరూ కిందికి దిగిన కేవలం కొద్ది నిమిషాల్లోనే.. బ్యాటరీ ప్రభావంతో మంటలు బసంత వేగంగా వ్యాప్తించాయి. చూస్తూ చూస్తూనే.. లక్షలాది రూపాయల విలువైన ఎలక్ట్రిక్ బస్సు పూర్తిగా అగ్నికి ఆహుతి అయింది.. అంతేకాకుండా బస్సు అంతా కాలిపోయి ఒక అస్తిపంజరంలా మారిపోయింది.. స్థానికులతో పాటు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలు అదుపు చేసే ప్రయత్నం చేశారు..
ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన 37 మంది ప్రయాణికులతో పాటు వారి కుటుంబ సభ్యులు డ్రైవర్ ప్రశాంత్ కు ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుతున్నారు. నువ్వే కనుక సరైన సమయంలో బస్సు ఆపకపోయి ఉంటే.. మా పరిస్థితి ఏంటో ఊహించుకుంటూనే భయమేస్తోందని.. అతను వారికి మళ్లీ పునర్జన్మను ఇచ్చారని.. ప్రయాణికులు బాగోదు ద్వేగానికి లోనవుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు బయటకు రావడంతో సోషల్ మీడియా వేదికగా డ్రైవర్ ప్రశాంత్ రియల్ హీరో అంటూ సోషల్ మీడియా వినియోగదారులు సైతం ప్రశంశల వర్షం కురిపిస్తున్నారు..
Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
Indian Treasure Act: మీ భూమిలో లంకెబిందెలు, వజ్రాలు దొరికితే ఏం చేయాలి? మీకు సొంతం కావాలంటే చట్టం ఏం చెబుతుంది?
Hyderabad, Telangana:Hidden Treasure Laws In India: మన సొంత భూమి లేదా వారసత్వంగా వచ్చిన ఆస్తిపై మనకు సర్వహక్కులూ ఉంటాయని భావించడం సహజం. కానీ, భారతీయ చట్టాల ప్రకారం భూమి ఉపరితలంపై ఉండే హక్కులకు, భూగర్భంలో లభించే వనరులపై ఉండే హక్కులకు చాలా తేడా ఉంది. రజనీకాంత్ 'నరసింహ' సినిమాలో చూపించినట్లుగా సొంత భూమిలో ఖనిజాలు దొరకగానే రాత్రికి రాత్రే కోటీశ్వరులు కావడం నిజ జీవితంలో సాధ్యం కాదు. మీ భూమిలో లంకెబిందెలు, వజ్రాలు లేదా ఖనిజాలు లభిస్తే చట్టం ఏం చెబుతుందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
భూమిలో ఖనిజాలుంటే హక్కు ఎవరిది?
మీ భూమి అడుగున బొగ్గు, ముడి ఇనుము, పెట్రోలియం, బంగారం లేదా వజ్రాలు వంటి ఏ రకమైన సహజ ఖనిజ సంపద బయటపడినా.. దానిపై మీకు ఎలాంటి హక్కు ఉండదు.
చట్టం ఏం చెబుతోంది?
'మైన్స్ అండ్ మినరల్స్ (డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్) చట్టం, 1957' ప్రకారం భూగర్భంలో ఉండే అన్ని రకాల ఖనిజాలపై పూర్తి నియంత్రణ, హక్కులు కేవలం ప్రభుత్వం (రాష్ట్ర లేదా కేంద్ర) పరిధిలోనే ఉంటాయి. 2024 జులై నాటి చారిత్రాత్మక 'మినరల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ' కేసుతో పాటు 2025లో కూడా సుప్రీంకోర్టు 9 మంది న్యాయమూర్తుల ధర్మాసనం దీనిపై స్పష్టతనిచ్చింది. భూమి మీదే అయినప్పటికీ, ప్రభుత్వ అనుమతి (లీజు) లేకుండా, రాయల్టీ చెల్లించకుండా అందులో మైనింగ్ చేసే హక్కు ఎవరికీ లేదు.
లంకెబిందెలు లేదా నిధులు దొరికితే?
పాతకాలం నాటి బంగారు నాణాలు, వెండి ఆభరణాలు లేదా లంకెబిందెలు దొరికినప్పుడు 'ఇండియన్ ట్రెజర్ ట్రోవ్ యాక్ట్, 1878' అమల్లోకి వస్తుంది. చట్టప్రకారం పది రూపాయల కంటే ఎక్కువ విలువైన ఏ వస్తువు దొరికినా అది 'నిధి' కిందకే వస్తుంది. నిధి దొరికిన వెంటనే ఆ విషయాన్ని స్థానిక జిల్లా కలెక్టర్కు గానీ లేదా రెవెన్యూ అధికారులకు గానీ రాతపూర్వకంగా తెలియజేయాలి.
సమాచారం అందిన తర్వాత కలెక్టర్ 4 నుండి 6 నెలల గడువుతో పబ్లిక్ నోటీసు ఇస్తారు. ఆ నిధిని ఎవరు, ఎప్పుడు దాచారనే కోణంలో విచారణ జరుగుతుంది. ఒకవేళ ఆ నిధి 100 ఏళ్ల లోపుదా అని తేలి, దానికి సంబంధించిన వారసులు సరైన ఆధారాలు చూపిస్తే వారికి అప్పగిస్తారు. ఒకవేళ ఆధారాలు లేకపోతే దానిని 'యజమాని లేని నిధి'గా ప్రకటిస్తారు.
నిధి పంపిణీ ఎలా జరుగుతుంది?
ఎటువంటి వివాదాలు లేని పక్షంలో, దొరికిన నిధిలో 75 శాతం దాన్ని కనుగొన్న వ్యక్తికి, 25 శాతం భూమి యజమానికి దక్కుతుంది. ఒకవేళ ఆ నిధికి చారిత్రక లేదా పురావస్తు ప్రాధాన్యత ఉంటే, ప్రభుత్వం దాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకుంటుంది. అలాంటి సమయంలో ఆ నిధి మార్కెట్ విలువకు అదనంగా మరో 20 శాతం పరిహారాన్ని కలిపి కనుగొన్న వ్యక్తికి, భూ యజమానికి పంచుతారు.
అయితే నిధి దొరికిన విషయాన్ని దాచిపెట్టి, రహస్యంగా అమ్ముకోవడానికి ప్రయత్నిస్తే చట్టప్రకారం నిధిపై హక్కు కోల్పోవడమే కాకుండా, ఏడాది పాటు జైలు శిక్ష లేదా జరిమానా (లేదా రెండూ) విధించే అవకాశం ఉంది.
వజ్రాలు సొంతం చేసుకోవచ్చా?
వర్షాకాలంలో పల్నాడు జిల్లాలోని కోళ్లూరు ప్రాంతం.. కర్నూలు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో పొలాల్లో, రోడ్లపై వజ్రాలు దొరుకుతుంటాయనే పుకారు ఉంది. చట్టప్రకారం ఈ వజ్రాలపై కూడా వెతికిన వారికి ఎలాంటి హక్కు ఉండదు. అది ఎవరి పొలంలో దొరికినా అది ప్రభుత్వ ఆస్తి కిందకే వస్తుంది. వాటిని వెంటనే పోలీసులకు లేదా రెవెన్యూ అధికారులకు అప్పగించాలి.
ఎవరైనా దొరికిన వజ్రాన్ని నిజాయితీగా అధికారులకు అప్పగిస్తే, ప్రభుత్వం దాన్ని అధికారికంగా వేలం వేస్తుంది. ఆ వేలం ద్వారా వచ్చే ఆదాయంలో ప్రభుత్వం నిర్ణయించిన మేరకు కొంత శాతాన్ని (సాధారణంగా సగం వరకు) ఆ వ్యక్తికి నజరానాగా అందిస్తారు. మిగిలిన మొత్తం ప్రభుత్వ ఖజానాకు చేరుతుంది.
ప్రస్తుతం క్షేత్రస్థాయిలో దళారుల ప్రమేయం వల్ల బ్లాక్ మార్కెట్ నడుస్తున్నప్పటికీ, చట్టపరంగా చూస్తే భూమిలో దొరికే ఎలాంటి ఖనిజాలు, లంకెబిందెలైనా ప్రభుత్వానికే చెందుతాయి. వాటిని అధికారులకు అప్పగించి చట్టబద్ధంగా వచ్చే వాటాను లేదా నజరానాను పొందడమే సురక్షితమైన మార్గం.
Also Read: ఆంధ్రప్రదేశ్కు కూతవేటు దూరంలో మరో బంగారం నిధి..దక్షిణ భారతదేశంలో రెండో బంగారు గని!
Also Read: కొత్త ఉద్యోగులకు కేంద్రం గుడ్న్యూస్.. పీఎఫ్ అకౌంట్లో రూ.15,000 జమ..ఎప్పుడంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Flipkartలో బంపర్ ఆఫర్.. సగం ధరకే Motorola Edge 60 Fusion 5G ఫోన్..
Hyderabad, Telangana:Motorola Edge 60 Fusion 5g Huge Discount: మోటరోలా కంపెనీ ఎప్పటికప్పుడు అద్భుతమైన స్మార్ట్ఫోన్స్ అత్యంత తక్కువ ధరల్లో విడుదల చేస్తూ వస్తోంది. ముఖ్యంగా గత ఐదు సంవత్సరాల నుంచి మార్కెట్లో ఈ మొబైల్స్ ప్రభంజనం సృష్టిస్తున్నాయి. ఎక్కువగా ఈ స్మార్ట్ఫోన్స్ను యువతే కొనుగోలు చేయడం విశేషం.. తక్కువ ధరల్లో ఎక్కువ ఫీచర్స్తో అందుబాటులోకి రావడం కారణంగా.. సేల్స్ విపరీతంగా పెరుగుతూ వస్తున్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకొని మోటరోలా కంపెనీ ఎప్పటికప్పుడు మంచి మంచి మొబైల్స్ విడుదల చేస్తూ వస్తోంది.
ప్రస్తుతం మంచి డిమాండ్ కలిగిన మోటోరోలా మొబైల్స్లో Motorola Edge 60 Fusion 5G ఒకటి. దీనికి ఇప్పటికీ మంచి డిమాండ్ ఉంది. చాలామంది యువత ఈ స్మార్ట్ఫోన్ ఎగబడి కొనుగోలు చేస్తున్నారు.. అత్యంత తక్కువ ధరలోనే ప్రీమియం కెమెరా సెట్ అప్ తో ఎన్నో రకాల ఫీచర్లతో అందుబాటులోకి రావడం వల్ల మొబైల్ మార్కెట్లో హైలెట్గా నిలిచింది.. మీరు కూడా ఎప్పటినుంచో Motorola Edge 60 Fusion 5G స్మార్ట్ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటే ఇదే మంచి సమయం.. ఎందుకంటే దీనిపై ఎన్నో రకాల డిస్కౌంట్ ఆఫర్స్ ఫ్లిప్కార్ట్అందిస్తోంది. ఇందులో భాగంగా కొనుగోలు చేస్తే సగం కంటే తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఎక్స్చేంజి బోనస్ ఆఫర్ వినియోగిస్తే చాలా చీప్ ధరకే పొందవచ్చు..
ప్రస్తుతం మార్కెట్లో 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన ఈ స్మార్ట్ఫోన్ను కంపెనీ MRP ధర రూ.27,999 లకు విక్రయిస్తోంది. అయితే, దీనిని ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్కార్ట్లో కొనుగోలు చేసే వారికి అదనంగా బ్యాంకు డిస్కౌంట్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. ఈ బ్యాంకు ఆఫర్స్లో భాగంగా.. దీనిని ఫ్లిప్కార్ట్ అనుసంధాన యాక్సిస్ బ్యాంకు తోపాటు ఎస్బిఐ బ్యాంకులకు సంబంధించిన క్రెడిట్ కార్డులను వినియోగించి పేమెంట్ చేస్తే రూ.1000 వరకు తగ్గింపు లభిస్తుంది.
ముఖ్యంగా దీనిపై ఫ్లిప్కార్ట్ అదనంగా ఎక్స్చేంజ్ బోనస్ ఆఫర్ అందిస్తుంది. ఇందులో భాగంగా మీ దగ్గర ఉన్న ఏదైనా పాత స్మార్ట్ఫోన్ ఎక్స్చేంజ్ చేస్తే దాని కండిషన్ను బట్టి.. అలాగే ఆ మొబైల్ బ్రాండ్ ను బట్టి.. అదనంగా దాదాపు రూ.9 వేల వరకు ఎక్స్చేంజ్ బోనస్ లభిస్తుంది. ఈ బోనస్ కొత్త మొబైల్ కొనుగోలు చేసే క్రమంలో వినియోగిస్తే..దాదాపు ఈ Motorola Edge 60 Fusion 5G స్మార్ట్ఫోన్ కేవలం రూ.1,7999 లోపే సొంతం చేసుకోవచ్చు..
ఇక ఈ Motorola Edge 60 Fusion 5G స్మార్ట్ఫోన్కు సంబంధించిన ఫీచర్స్ వివరాల్లోకి వెళ్తే.. ఇది ఎంతో అద్భుతమైన 6.67 ఇంచుల Super HD+ (1.5K) pOLED క్వాడ్-కర్వ్డ్ డిస్ప్లేతో అందుబాటులోకి వచ్చింది. అంతేకాకుండా దీన్ని డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్, 4500 nits పీక్ బ్రైట్నెస్ సపోర్టును కలిగి ఉంటుంది. అలాగే ఈ స్క్రీన్ ప్రొటెక్షన్ కోసం.. Corning Gorilla Glass 7i సపోర్టుతో అందుబాటులో ఉంది. అలాగే ఇది ఎంతో శక్తివంతమైన MediaTek Dimensity 7400 (4nm) ఆక్టా-కోర్ ప్రాసెసర్ను కలిగి ఉంటుంది. గేమింగ్తో పాటు మల్టీ టాస్టింగ్ కోసం ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది.. ఇది ఎంతో శక్తివంతమైన 5500 mAh బ్యాటరీ ను కలిగి ఉంటుంది. దీనికి కంపెనీ ఫాస్ట్ ఛార్జింగ్ కోసం 68W TurboPower సపోర్టును కూడా అందిస్తోంది.. అదేవిధంగా వెనక భాగంలో స్పెషల్ కెమెరా సెటప్ అందుబాటులో ఉండడం విశేషం.
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
ఈ Motorola Edge 60 Fusion 5G మొబైల్కు సంబంధించిన కెమెరా సెటప్ వివరాల్లోకి వెళ్తే.. ఇది ఎంతో ప్రత్యేకమైన 50 MP ప్రధాన కెమెరా (Sony LYTIA 700C సెన్సార్, OIS సపోర్ట్)తో పాటు 13 MP అల్ట్రా-వైడ్ యాంగిల్ (లింక్డ్ మేక్రో విజన్) కెమెరాలను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఫ్రంట్ భాగంలో 32 MP సెల్ఫీ కెమెరా లభిస్తుంది. ఇది 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్తో వస్తుంది. ఇవే కాకుండా మోటరోలా కంపెనీ ఎన్నో రకాల కొత్త కొత్త ఫీచర్స్ ను కూడా అందిస్తోంది.
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
