ఖమ్మం:సిపిఆర్ చేసి ఓ వ్యక్తికి ప్రాణం
Khammam, Telangana:సిపిఆర్ చేసి ఓ వ్యక్తిని బతికించిన ఘటన ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం విఎం బంజార్ లో చోటుచేసుకుంది. పెనుబల్లి నుండి విఎం బంజార్ కు బైక్ పై యేసుబాబు అనే వ్యక్తి వెళుతుండగా అదుపుతప్పి కిందపడి అపస్మారక స్థితికి చేరాడు. సమీపంలో శానిటైజేషన్ పని చేస్తున్న రామారావు అనే వ్యక్తి అక్కడకు చేరుకుని సీపీఆర్ చేసాడు. ఈక్రమంలో ఒక్కసారిగా ఊపిరి తీసుకున్నాడు. సీపీఆర్ చేసి ప్రాణాలు రక్షించిన రామారావును అభినందించారు.हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
Rotten Eggs Sale: రూ.2లకే ఒక్క కోడిగుడ్డు..ఎగబడ్డ జనం..అస్సలు కథ బయటపడ్డాక, ఏం జరిగిందంటే?
Bollaram, Telangana:Rotten Eggs Sale In Hyderabad: మార్కెట్లో ప్రస్తుతం ఓ కోడిగుడ్డు ధర రూ.6కి విక్రయిస్తున్నారు. అయితే ఓ వ్యక్తి మాత్రం తన వద్ద ఉన్న కోడిగుడ్ల లోడ్ను తీసుకొచ్చి కేవలం రూ.2లకే గుడ్డును అమ్మతున్నట్లు బోర్డ్ పెట్టాడు. ఆఫర్ నచ్చిన ఎంతో మంది జనం తక్కువ ధరకే కోడిగుడ్లను కొనుగోలు చేసి ఇంటికి తీసుకెళ్లారు. అక్కడున్న వారంతా కోడిగుడ్లను ఎగబడి కొంటుంటే.. ఓ వ్యక్తి మాత్రం అనుమానంతో కోడిగుడ్డును పగలకొట్టి చూడగా అప్పుడు అస్సలు రహస్యం బయటపడింది. ఈ విచిత్ర ఘటన హైదరాబాద్ పరిధిలోని బొల్లారంలో శనివారం రాత్రి ఈ ఘటన జరిగిందట.
శనివారం అనగా మార్చి 18 రాత్రి బొల్లారం జ్యోతి థియేటర్ దగ్గర ఓ గుర్తుతెలియని వ్యక్తి కోడిగుడ్ల లోడ్తో విక్రయించేందుకు అక్కడికి వచ్చాడు. అయితే మార్కెట్లో కోడిగుడ్డు లభించే ధర రూ.6 ఉండగా.. వాటిని కేవలం ఒక్కోదాన్ని రూ.2 విక్రయించాడు. ప్రస్తుతం మార్కెట్లో డజను కోడిగుడ్ల రూ.70 నుంచి రూ.80లకు అమ్మతుండగా.. ఈ వ్యక్తి దగ్గర కోడిగుడ్ల ధర ఎంతో తక్కువగా లభిస్తుందని జనాలు ఎగబడి కొన్నారు. అప్పటికే ఎందరో వినియోగదారులు కోడిగుడ్లను కొనుగోలు చేసి ఇంటికి కూడా తీసుకెళ్లిపోయారు. అయితే మార్కెట్లో లభించే ధరకు సగం కంటే తక్కువకు ఎలా అమ్మకాలు చేస్తున్నాడని కొందరికి అనుమానం వచ్చింది. అందులో అనుమానం కలిగిన ఓ వ్యక్తి మాత్రం ఓ కోడిగుడ్డును పగలకొట్టి చూశాడు.
ఆ వెంటనే ఆ కోడిగుడ్డు నుంచి నల్లని పదార్థంతో పాటు వింత వాసన రావడం చూసి అక్కడున్న వారంతా ఖంగుతిన్నారు. వెంటనే ఆ అమ్మకాలు చేస్తున్న వ్యక్తిని పట్టుకొని పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్కు తరలించారు. పోలీసు ఫిర్యాదు ఇవ్వడంతో అప్పటి వరకు గుడ్లను కొనుగోలు చేసిన వారికి సదరు ఆగంతకుడు వారి డబ్బులు తిరిగి చెల్లించేశాడు.
ఒకవేళ ఈ విషయం బయటకు రాకపోయే ప్రజలు మోసపోయి ఉండే వాళ్లని..జనం దగ్గర డబ్బుతో ఆ మోసగాడు సొమ్ముచేసుకోని వెళ్లేవాడని స్థానికులు చెబుతున్నారు. అయితే హైదరాబాద్ సిటీ వ్యాప్తంగా ఇలాంటి చౌకబారు సంఘటనలు చాలానే జరుగుతున్నాయి. కొన్ని ప్రజల దృష్టిలో పడుతుండగా.. మరికొన్ని గుట్టు చప్పుడు కాకుండా జరిగిపోతున్నాయి.
ఏది ఏమైనా ప్రజలు ముఖ్యంగా గ్రహించాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి. మార్కెట్లో లభించే ధర కంటే ఏదైనా తక్కువ ధరకే లభిస్తే.. అది నకిలీది లేదా కల్తీకి గురైందనే విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవేళ కొనాలని అనుకుంటే తప్పనిసరిగా వాటి పరిశీలించి అంతా బాగుంటే మాత్రమే కొనుగోలు చేయవచ్చు. ఇలాంటి ఘటనల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. తక్కువ ధరతో ఉండే ఆఫర్లతో మోసపోవద్దని అధికారులు సూచిస్తున్నారు. అయితే ఆ వింత కోడిగుడ్లను ఎక్కడి నుంచి తెచ్చాడు? ఎందుకు అలాంటి వాటిని విక్రయిస్తున్నాడనే దానిపై పోలీసులు విచారణ చేపట్టారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Fly91 Hubballi Flight: హైదరాబాద్ విమానం గాల్లో ఉండగా కుదుపులు..ప్రాణం పోతుందని వెక్కివెక్కి ఏడ్చిన ప్రయాణికులు..ఫ్యామిలీకి వీడియో కాల్స్!
Hubballi, Karnataka:Fly91 Hubballi Flight Incident: విమానంలో ప్రయాణం చేయాలని ప్రతి ఒక్కరికీ కోరిక ఉంటుంది. కానీ, కొన్ని సందర్భాలు చూసినా.. గుర్తుకు వచ్చినా విమానం ఎక్కాలంటే భయానికి లోనయ్యే సంఘటనలు ఎన్నో జరిగాయి. తాజాగా అలాంటి ఓ ఘటన భారత్లో జరిగింది. హైదరాబాద్ నుంచి హుబ్బళ్లికి బయల్దేరిన విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. ఈ లోపం కారణంగా గాల్లో అదుపుతప్పి వందలాది మంది ప్రయాణికులు భయబ్రాంతులకు లోనయ్యారు. సాంకేతిక లోపం కారణంగా సుమారు నాలుగు గంటల పాటు గగనతలంలోనే చక్కర్లు కొట్టిన ఆ విమానం చివరకు బెంగళూరులో సురక్షితంగా ల్యాండ్ అవ్వడంతో, ఒక పెద్ద విమాన ప్రమాదం తప్పినట్లు అయ్యింది.
ఫ్లై91 ఎయిర్లైన్స్కు చెందిన విమానం IC3401 (ATR-72) నిన్న మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి బయలుదేరి, సాయంత్రం 4:30 గంటలకు హుబ్బళ్లిలో ల్యాండ్ కావాల్సి ఉంది. అయితే, హుబ్బళ్లిని సమీపిస్తుండగా విమానంలో సాంకేతిక లోపం తలెత్తడంతో పైలట్ నియంత్రణ కోల్పోయాడు. హుబ్బళ్లిలో ల్యాండ్ కాలేకపోయిన ఆ విమానం, దావణగెరె, ముండగోడ, శివమొగ్గ చుట్టుపక్కల ఆకాశంలో సుమారు నాలుగు గంటల పాటు చక్కర్లు కొట్టింది. విమానం వేగాన్ని, దిశను నియంత్రించడానికి పైలట్లు తీవ్రంగా శ్రమించారు.
విమానంలోని ప్రయాణికులు తాము బ్రతకలేమోనని తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. చాలామంది విమానం లోపల ఏడుస్తూ దేవుడికి ప్రార్థించగా, మరికొందరు తమ ఆందోళనలను తెలియజేస్తూ మొబైల్ ఫోన్లలో తమ కుటుంబ సభ్యులకు చివరి సందేశాలు పంపారు. నిరంతర ప్రయత్నాల తర్వాత, పైలట్లు చివరకు రాత్రి 7:30 గంటల ప్రాంతంలో బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేయగలిగారు. విమానం నేలను తాకగానే ప్రయాణికులు నిట్టూర్చారు. ఈ మొత్తం ఘటనలో ఫ్లై91 ఎయిర్లైన్స్ ప్రవర్తన పట్ల ప్రయాణికులు, వారి కుటుంబాలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాయి. విమానంలో సాంకేతిక లోపం తలెత్తినప్పుడు కనీస సమాచారం కూడా అందించకుండా కంపెనీ నిర్లక్ష్యంగా వ్యవహరించిందనే ఆరోపణలు ఉన్నాయి.
ఇదిలా ఉండగా, హుబ్బళ్లి ఎయిర్పోర్ట్లో విమానం కోసం ఎదురుచూస్తున్న బంధువులకు అధికారులు ఎలాంటి స్పష్టమైన సమాచారం ఇవ్వకుండా బాధ్యతారాహిత్యం ప్రదర్శించారని కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సాంకేతిక లోపానికి గల కచ్చితమైన కారణంపై విచారణ జరపాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే ప్రస్తుతానికి వందలాది ప్రాణాలు కాపాడబడటం ఊరట కలిగించే విషయం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
NPS Benefits: పెన్షన్ అంటే భరోసా కాదు.. భారీ ఆదాయం.. NPS ద్వారా 20 శాతం లాభం ఎలా పొందాలో తెలుసా?
Secunderabad, Telangana:NPS Benefits: రిటైర్మెంట్ తర్వాత బతుకు బండి ఎలా ముందుకు సాగించాలన్న ఆందోళన ఉంటుంది. రోజువారీ ఖర్చులతోపాటు వైద్య ఖర్చులు ఇలా ఎన్నో కళ్ల ముందు కదలాడుతుంటాయి. అలాంటి వారికోసం జాతీయ పెన్షన్ స్కీమ్ ఒక నమ్మకమైన తోడుగా నిలుస్తోంది. ఈమధ్యే పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్ మెంట్ అథారిటీ దాని నిబంధనల్లో కీలక మార్పులు చేసింది. దీంతో ఈస్కీమ్ మరింత సరళంగా.. అందరికీ ప్రయోజనకరంగా మారింది.
ఎన్పీఎస్ అంటే ఏంటి? ఇందులో ఎవరు ఇన్వెస్ట్ చేయవచ్చు?
నేషనల్ పెన్షన్ స్కీమ్ అనేది ఒక ప్రభుత్వ పెట్టుబడి పథకం. ఇందులో 18ఏళ్ల నుంచి 85ఏళ్ల మధ్య వయస్సు ఉన్న ఏ భారతీయ పౌరుడు అయినా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మీరు స్వచ్చందంగా డబ్బును జమ చేసుకోవచ్చు. అది మార్కెట్ ఆధారంగా పెరుగుతుంది. రిటైర్మెంట్ తర్వాత మీ చేతికి పెద్ద మొత్తం ఒకేసారి అందుతుంది. మిగిలిన మొత్తం నెలలవారీ యాన్యుటీ రూపంలో చెల్లిస్తుంది. ఇందులో రెండు రకాల అకౌంట్స్ ఉంటాయి. టైర్ 1. ఇది రిటైర్మెంట్ కోసం టైర్ 2 ఇది సేవింగ్స్ అకౌంట్ వంటిది. ఇందులో నుంచి మీరు ఎప్పుడైనా డబ్బులను విత్ డ్రా చేసుకోవచ్చు.
కొత్త నిబంధనల ప్రకారం..మీరు రిటైర్మెంట్ అయ్యాక 60ఏళ్ల వయస్సులో డబ్బు విత్ డ్రా చేసుకుంటే మీ మొత్తం ఫండ్ రూ. 8లక్షల వరకు ఉన్నట్లయితే.. మీరు మొత్తాన్ని ఒకేసారి విత్ డ్రా చేసుకోవచ్చు. ఒకవేల ఆ మొత్తం రూ. 8లక్షలు దాటినట్లయితే ప్రభుత్వ ఉద్యోగులు ఆ మొత్తంలో 60శాతం, ప్రభుత్వేతర ఉద్యోగులు అయితే 80శాతం వరకు ఒకేసారి విత్ డ్ర చేసుకోవచ్చు. మిగిలిన మొత్తం కూడా పెన్షన్ రూపంలోకి మారుతుంది. అయితే ఎవరైనా మధ్యలోనే ఈ స్కీము నుంచి బయటకు రావాలనుకున్నప్పుడు ఫండ్ రూ. 5లక్షల కంటే తక్కువగా ఉంటే కూడా ఈ మొత్తాన్ని విత్ డ్రా చేసుకోవచ్చు.
పిల్లల కోసం కూడా ప్రత్యేక స్కీమ్:
కేవలం పెద్దవారికి మాత్రమే కాదు.. పిల్లల కోసం ఎన్పీఎస్ వాత్సల్యా అనే స్కీమును ప్రారంభించింది ప్రభుత్వం. తల్లిదండ్రులు తమ మైనర్ పిల్లల పేరు మీద అకౌంట్ తీసుకోవచ్చు. పిల్లలకు 18సంవత్సరాలు నిండిన తర్వాత ఈ అకౌంట్ సాధారణ ఎన్పీఎస్ లోకి మారుతుంది. బడ్జెట్ 2025 ప్రకారం సాధారణ ఎన్పీఎస్ మాదిరిగానే ఎన్పీఎస్ వాత్సల్య కూడా అవే పన్ను ప్రయోజనాలను అందిస్తుంది. మీ పిల్లల భవిష్యత్తు కోసం భారీ డబ్బు కూడబెట్టాలనుకుంటే ఇది బెస్ట్ స్కీమ్ అని చెప్పాలి.
ట్యాక్స్ బెనిఫిట్.. భారీ లాభాలు ఎలా పొందాలి?
పాత పన్ను విధానంలో ఎన్పీఎస్ లో ఇన్వెస్ట్ చేస్తే 80సీ అదనంగా 80సీసీడీ కింద రూ. 50,000 అదనపు తగ్గింపు ప్రధానంగా అందుబాటులో ఉండేది. అయితే కొత్త ఆదాయపు పన్ను చట్టంలో సెక్షన్ 80 లేదా 80సీసీడీ కింద ఈ తగ్గింపు అందుబాటులో లేదు. కానీ యజమాని ఎన్పీఎస్ వాటా చెల్లుతుంది. గత కొన్ని సంవత్సరాలుగా ఎన్పీఎస్ సగటును 11 శాతం నుంచి 20శాతం వరకు వార్షిక రాబడి ఇచ్చింది. ఇది ఇతర సేవింగ్స్ స్కీమ్స్ కంటే చాలా మంచి రాబడిని అందించింది.
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. దయచేసి దీన్ని పెట్టుబడి, ఆర్థిక లేదా వ్యాపార సలహాగా భావించవద్దు. గుర్తుంచుకోండి స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టోకరెన్సీలు, రియల్ ఎస్టేట్, విలువైన లోహాలు వంటి అన్ని రకాల పెట్టుబడులు మార్కెట్ ఆటు పోటులు రిస్కులకు లోబడి ఉంటాయి. దీని అర్థం, మీరు లాభపడవచ్చు లేదా నష్టపోవచ్చు. మీరు తీసుకునే ఎలాంటి పెట్టుబడి నిర్ణయాలు లేదా వ్యాపార కార్యకలాపాల వల్ల కలిగే నష్టాలు లేదా లాభాలకు మా సంస్థ జీ తెలుగు వెబ్ పోర్టల్ ఎట్టి పరిస్థితుల్లోనూ బాధ్యత వహించదు. ఏదైనా ఆర్థిక నిర్ణయం తీసుకునే ముందు, తప్పకుండా ఒక రిజిస్టర్డ్ లేదా సర్టిఫైడ్ ఆర్థిక నిపుణుడిని సంప్రదించి, వారి సలహా తీసుకోమని పాఠకులకు సిఫార్సు చేస్తున్నాము.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
Gold Bond: లక్ష పెడితే 3 లక్షలొచ్చాయ్.. సావరీన్ గోల్డ్ బాండ్ ఇన్వెస్టర్లకు బంపర్ రిటర్న్స్ ..మీ దగ్గర ఈ బాండ్లు ఉన్నాయా?
Secunderabad, Telangana:SGB Gold Bond Price : సావరిన్ గోల్డ్ బాండ్స్... ఇప్పుడు ఇన్వెస్టర్లకు పంట పండిస్తున్నాయి. బంగారం ధరలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో లాభాలు కూడా అదే విధంగా పెరుగుతున్నాయి. ఇప్పుడు 2020-21 సిరీస్ VII కింద గోల్డ్ బాండ్లకు సంబంధించి రిడెంప్షన్ ధరలను కూడా ప్రకటించింది. లక్ష ఇన్వెస్ట్ చేసిన వారికి ఏకంగా రూ. 3లక్షలు రావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అంటే ఏకంగా శాతానికిపైగానే రావడి వస్తుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేసిన ఓ ప్రకటన ప్రకారం.. కేంద్ర బ్యాంక్ ఏప్రిల్ 20న తన సావరిన్ గోల్డ్ బాండ్ 2020-21 సిరీస్ VII కింద ఇన్వెస్టర్లకు ముందుస్తు విమోచనను ప్రకటించింది. ఇది ఎస్ జీబీ స్కీముకు సంబంధించిన ప్రభుత్వ నిబంధనల పరిధిలోకి వస్తుంది. ఆ రూల్స్ ప్రకారం గోల్డ్ బాండ్లను జారీ చేసిన తేదీ నుంచి 5ఏళ్ల తర్వాత వడ్డీ చెల్లించిన తేదీన ముందస్తుగా విమోచించుకోవచ్చు.
అయితే ఎస్ జీబీల విమోచన ధర, విమోచన తేదీకి ముందు 3 ట్రేడింగ్ రోజులు 999 స్వచ్ఛత గత బంగారం ముగింపు ధరల సాధారణ సగటుపై ఆధారపడి ఉంటుంది. ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ లిమిటెడ్ ప్రచురించిన ధర అవుతుందని అందులో పేర్కొంది. దీని ప్రకారం గత మూడు ట్రేడింగ్ రోజుల్లో బంగారం ముగింపు ధరల సాధారణ సగటు ఆధారంగా ఏప్రిల్ 20న ముందస్తు విమోచన కోసం విమోచన ధర ఒక్కో ఎస్ జీబీ యూనిట్ రూ. 15,254 గా ఉంటుంది.
అంటే ఇన్వెస్టర్లు యూనిట్ కు రూ. 5,051 ఇష్యూ ధరతో పోల్చినట్లయితే గోల్డ్ బాండ్లను ఎంచుకున్న ఇన్వెస్టర్లు యూనిట్ కు రూ. 15,254 చొప్పున 202శాతం పైగానే లాభపడ్డారు. ఆన్ లైన్ లో ఎస్ జీబీ లను కొనుగోలు చేసిన ఇన్వెస్టర్లు ఇష్యూ సమయంలో రూ. 50 డిస్కౌంట్ కూడా పొందారు. ఆన్ లైన్ డిస్కౌంట్ ను కూడా పరిగణలోనికి తీసుకున్నట్లయితే వారికి లాభం 205శాతానికి పెరుగుతుంది. ఈ రాబడులతోపాటు ఎస్ జీబీలు ఇన్వెస్టర్లకు హోల్డింగ్ కాలానికి 2.5శాతం వార్షిక వడ్డీ రేటును కూడా అందిస్తాయి. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేసిన సావరిన్ గోల్డ్ బాండ్స్ సాధారణంగా మెచ్యూరిటీ సమయంలో చెల్లిస్తారు. ఇది జారీ చేసిన తేదీ నుంచి 8 సంవత్సరాలు ఉంటుంది.
ఇక సావరిన్ గోల్డ్ బాండ్స్ భారత ప్రభుత్వం తరపున రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేసే ప్రభుత్వ సెక్యూరిటీలు. ఇవి బంగారంను గ్రాముల రూపంలో విలువ కలిగి ఉంటాయి. ఫిజికల్ గోల్డ్ తో ఉన్న అదనపు ఖర్చులు లేకుండా ప్రభుత్వ రక్షణతోపాటు మూలధన వృద్ధి ప్రయోజనాలను ఇన్వెస్టర్లకు అందిస్తాయి. అంటే భౌతిక బంగారానికి ఈ బాండ్స్ ఒక ప్రత్యామ్నాయం అని చెప్పాలి. కాగా 2026-27 ఆర్థిక ఏడాదికి గాను ఇంకా సావరిన్ గోల్డ్ బాండ్ల కొత్త విడతను ప్రకటించలేదు. కాగా ప్రభుత్వ ఖజానాపై అదనంగా భారం పడుతుందన్న కారణంతో ఆర్బీఐ గత కొంత కాలంగా గోల్డ్ బాండ్లను జారీ చేయడం లేదు. అయితే వీటి టెన్యూర్ 8 సంవత్సరాలు ఉంటుంది గతంలో ఇష్యూ చేసిన బాండ్లకు ఇప్పుడు డబ్బుల్ని చెల్లిస్తోంది.
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. దయచేసి దీన్ని పెట్టుబడి, ఆర్థిక లేదా వ్యాపార సలహాగా భావించవద్దు. గుర్తుంచుకోండి స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టోకరెన్సీలు, రియల్ ఎస్టేట్, విలువైన లోహాలు వంటి అన్ని రకాల పెట్టుబడులు మార్కెట్ ఆటు పోటులు రిస్కులకు లోబడి ఉంటాయి. దీని అర్థం, మీరు లాభపడవచ్చు లేదా నష్టపోవచ్చు. మీరు తీసుకునే ఎలాంటి పెట్టుబడి నిర్ణయాలు లేదా వ్యాపార కార్యకలాపాల వల్ల కలిగే నష్టాలు లేదా లాభాలకు మా సంస్థ జీ తెలుగు వెబ్ పోర్టల్ ఎట్టి పరిస్థితుల్లోనూ బాధ్యత వహించదు. ఏదైనా ఆర్థిక నిర్ణయం తీసుకునే ముందు, తప్పకుండా ఒక రిజిస్టర్డ్ లేదా సర్టిఫైడ్ ఆర్థిక నిపుణుడిని సంప్రదించి, వారి సలహా తీసుకోమని పాఠకులకు సిఫార్సు చేస్తున్నాము.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
PBKS vs LSG: ప్రియాన్ష్, కూపర్ బ్యాట్తో పరుగుల సునామీ.. లక్నోపై 54 పరుగులతో పంజాబ్ భారీ విజయం
New Chandigarh, Punjab:IPL 2026 PBKS vs LSG Highglights: బౌండరీ లైన్ చిన్నబోయింది.. కుర్రాళ్లు ఇద్దరూ కలిసి కొడుతుంటే ప్రేక్షకులు ఈలలు.. కేకలు.. విజిల్స్తో హోరెత్తించారు. బంతి బంతికి ఫోర్ లేదా సిక్సర్ నమోదవుతుంటే ప్రేక్షకులు సీట్లపై కూర్చుంటే ఒట్టు. బౌలర్ ఎవరూ అనేది చూడకుండా బంతిని మాత్రమే చూసి చక్కగా దానిని బౌండరీ లైన్ అవతల పడేస్తున్నారు. బంతిని శత్రువులా చూస్తూ చితక్కొట్టారు. గ్రౌండ్లోనూ.. టీవీ.. మొబైల్ స్క్రీన్లపై ప్రియాన్ష్ ఆర్య, కూపర్ కన్నోల్లి ఆట చూడేందుకు రెండు కళ్లు చాలలేదు. ఒక్కో షాట్.. కళ్లు చెదిరిపోయేలా ఉండడంతో ప్రేక్షకులకు అసలైన ఐపీఎల్ మజా అందించింది. వారిద్దరూ ఊచకోతకు లక్నో సూపర్ జియాంట్స్ చిత్తయ్యింది. భారీ స్కోర్ ఛేదించలేక 54 పరుగుల తేడాతో లక్నో ఓడిపోగా.. పంజాబ్ వరుసగా ఐదో విజయంతో అగ్రస్థానాన్ని పదిలం చేసుకుంది.
Also Read: RR vs KKR: రాజస్థాన్ రాయల్స్కు మరో ఓటమి.. ఓటముల నుంచి గట్టెక్కిన కలకత్తా నైట్రైడర్స్
న్యూచండీగడ్ వేదికగా ఆదివారం సాయంత్రం రెండో మ్యాచ్లో పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జియాంట్స్ తలపడ్డాయి. టాస్ గెలిచి లక్నో బౌలింగ్ ఎంచుకోగా.. ప్రత్యర్థి ఆహ్వానం మేరకు పంజాబ్ కింగ్స్ మొదట బ్యాటింగ్కు దిగింది. నిర్ణీత 20 ఓవర్లకు 7 వికెట్లు కోల్పోయి 254 పరుగులు చేసింది. ప్రియాన్ష్ ఆర్య (93), కూపర్ కన్నోల్లి (87) బ్యాటింగ్ విధ్వంసం చేయగా.. లక్నో బౌలర్లు ప్రిన్స్ యాదవ్, సిద్ధార్థ్ రెండేసి వికెట్లు తీశారు. భారీ లక్ష్య ఛేదనకు దిగిన లక్నో ఓవర్లు పూర్తయ్యేసరికి ఐదు వికెట్లు కోల్పోయి 200 పరుగుల వద్ద ఆటను ముగించింది. కెప్టెన్ రిషబ్ పంత్తో సహా బ్యాటర్లందరూ తలా కొన్ని పరుగులు చేసినా విజయానికి కావాల్సిన స్కోర్కు దూరంగా జట్టు నిలిచింది. పంజాబ్ బౌలర్లలో మార్కో జేన్సన్ రెండు వికెట్లు తీయగా.. మిగతా బౌలర్లు ఒక్కో వికెట్ తీశారు.
Also Read: Free Railway Journey: రేవంత్ రెడ్డికి భారీ షాక్.. రైళ్లలో ఫ్రీ జర్నీ వార్తలు అబద్దం: రైల్వే శాఖ
మ్యాచ్కే కాదు ఈ ఐపీఎల్ సీజన్లోనే ప్రియాన్ష్ ఆర్య, కూపర్ కన్నోల్లి భారీ భాగస్వామ్యం నెలకొల్పడమే కాకుండా వ్యక్తిగత స్కోర్ను కూడా చేశారు. 37 బంతుల్లో అత్యంత వేగంగా 93 పరుగులు చేసి ఊచకోత కోశాడు. బౌండరీలు నాలుగు ఉండగా.. తొమ్మిది సిక్సర్లు కొట్టి ప్రత్యర్థి గుండెల్లో రైళ్లు పరిగెత్తించాడు. ప్రభు సిమ్రాన్ ఔటయిన వేళ బ్యాటింగ్కు దిగిన కూపర్ కన్నోల్లి 46 బంతుల్లో 87 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. 8 ఫోర్లు, ఏడు సిక్సర్లతో దుమ్మురేపాడు. వీరిద్దరూ గ్రౌండ్లో పాతుకుపోయి ప్రత్యర్థి బౌలర్లను చెడుగుడు ఆడుకున్నారు. సీనియర్.. జూనియర్ అని బౌలర్ను చూడకుండా కుమ్ముడే కుమ్ముడు చేశారు. వీరిద్దరూ ఔటయిన తర్వాత మార్కస్ స్టొయినిస్ మాత్రమే 29 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (5), నేహాల్ వదేరా (13), శశాంక్ సింగ్ (17) తలా కొన్ని పరుగులు చేశారు. బ్యాటర్ల దెబ్బకు లక్నో బౌలర్లు తేలిపోయారు. ప్రిన్స్ యాదవ్ పొదుపుగా వేసి రెండు వికెట్లు ఈయగా.. సిద్ధార్థ్ కూడా రెండు వికెట్లు పడగొట్టాడు. షమీ, మోహిసిన్ ఖాన్ ఒక్కో వికెట్ తీశారు.
Also Read: Hyderabad Police: హైదరాబాద్లో ‘ఆపరేషన్ సేఫ్ స్కూల్'.. 558 షాపులపై పోలీస్ రైడ్
భారీ లక్ష్యాన్ని ఛేదించడానికి లక్నో సూపర్ జియాంట్స్లో ఏ ఒక్క బ్యాటర్ కూడా పోరాటం చేయలేకపోయారు. 23 బంతుల్లో కెప్టెన్ రిషబ్ పంత్ చేసిన 43 పరుగులే అత్యధికం కావడం విశేషం. 28 బంతుల్లో మిచెల్ మార్ష్ 40 స్కోర్ నమోదు చేయగా.. మర్క్రమ్ 42 పరుగులు చేశాడు. ఆయుశ్ బదౌనీ (25), ముకుల్ రాయ్ (21*), నికోలస్ పూరన్ (9) కొన్ని పరుగులు చేశారు. బ్యాటర్లు చేసిన భారీ స్కోర్ను పంజాబ్ బౌలర్లు కాపాడారు. మార్కో జేన్సన్ రెండు వికెట్లు, విజయ్ కుమార్ వైశాఖ్, అర్ష్దీప్ సింగ్, యుజువేంద్ర చాహల్ ఒక్కో వికెట్ తీశారు.
ఐపీఎల్ 2026లో పంజాబ్ కింగ్స్ పూర్తిస్థాయి ఆధిపత్యం ప్రదర్శిస్తూ పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని సుస్థిరం చేసుకుంది. ఆడిన 6 మ్యాచ్ల్లో 5 విజయం సాధించగా.. ఒక మ్యాచ్ రద్దయ్యింది. మొత్తం 11 పాయింట్లతో తొలి స్థానంలో పంజాబ్ నిలిచింది. ఆడిన ఆరు మ్యాచ్ల్లో రెండింట గెలిచి.. నాలుగింట ఓడిపోయిన లక్నో జట్టు పాయింట్ల పట్టికలో చివరి నుంచి మూడో స్థానంలో ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
RR vs KKR: రాజస్థాన్ రాయల్స్కు మరో ఓటమి.. ఓటముల నుంచి గట్టెక్కిన కలకత్తా నైట్రైడర్స్
Kolkata, West Bengal:KKR 1st Victory In IPL 2026: పేలవ ప్రదర్శనతో వరుస ఓటముల నుంచి కలకత్తా నైట్రైడర్స్ గట్టెక్కి తొలి విజయాన్ని అందుకుంది. సొంత గడ్డపై జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ను చిత్తు చేసి విజయం సాధించింది. బ్యాట్తో రింకూ సింగ్ రఫ్పాడించడంతో కలకత్తా జట్టు పోరాడి మ్యాచ్ను సొంతం చేసుకుంది. 4 వికెట్ల తేడాతో విజయం సాధించిన కలకత్తా నైట్రైడర్స్ ఓటముల పరంపరకు చెక్ పట్టింది. వరుస విజయాలతో దూసుకెళ్తున్న రాజస్థాన్ రాయల్స్ ఊహించని విధంగా రెండో ఓటమిని ఖాతాలో వేసుకుంది.
SRH Vs CSK Black Magic: ఉప్పల్ స్టేడియంలో చేతబడి..బీసీసీఐకి సీఎస్కే యజమాని ఫిర్యాదు..అస్సలు ఏం జరిగిందంటే?
Hyderabad, Telangana:SRH Vs CSK Black Magic Video: ఉప్పల్ స్టేడియం వేదికగా శనివారం చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ ఘనవిజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత ఓ వైరల్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది. అదే ఓ బ్లాక్ మ్యాజిక్ వీడియో. సన్రైజర్స్కు చెందిన ఓ అభిమాని స్టేడియంలోని ఓ స్టాండ్లో చేతబడి చేస్తున్నట్లు చిత్రీకరించిన వీడియో ఇప్పుడు అనేక అభిప్రాయాలకు నెలవైంది. ఇదే విషయమై చెన్నై సూపర్ కింగ్స్ జట్టు యాజమాన్యం ఐపీఎల్ నిర్వహణ కమిటీకి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అయితే ఇందులో నిజమెంత? అబద్ధమెంతా అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం వేదికగా నిన్న చెన్నై, హైదరాబాద్ మ్యాచ్ జరిగింది. అందులో జరిగిన వింత ఘటన ఓ వీడియో రూపంలో బయటకు వచ్చింది. గ్యాలరీలో కూర్చొని మ్యాచ్ వీక్షిస్తున్న ఓ సన్రైజర్స్ అభిమాని.. చేతిలో నిమ్మకాయ పెట్టుకొని మంత్రాలు చదువుతున్నట్లు ఆ వీడియోను చిత్రీకరించారు. దాన్ని బ్లాక్ మ్యాజిక్ (చేతబడి) అని సోషల్ మీడియాలో వీడియో వైరల్ చేస్తున్నారు. అయితే అతడు నిమ్మకాయ చేతిలో తీసుకొని మంత్రాలు చదివిన తర్వాతి బంతికి చెన్నై బ్యాటర్ శివమ్ దూబే క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో అక్కడ ఒక్కసారిగా వీడియో చిత్రీకరించే వ్యక్తి..బ్లాక్ మ్యాజిక్ చేసిన వ్యక్తి ఆశ్చర్యపోయారు.
ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. దీంతో ఈ వీడియోపై చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు అభ్యంతరం వ్యక్తం చేస్తుండగా.. మరికొందరు ఆ వ్యక్తిపై ట్రోల్స్ మొదలుపెట్టారు. ఆ తాంత్రికుడి వల్లే తమ జట్టు ఓటమి పాలైందని విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో సీఎస్కే టీమ్ మేనేజ్మెంట్ రంగంలోకి దిగి.. బ్లాక్ మ్యాజిక్ చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలంటూ ఐపీఎల్ నిర్వహకులకు ఓ లేఖ రాసినట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ లెటర్ వైరల్ గా మారింది. ఇప్పుడీ పంచాయితీ బీసీసీఐ వద్ద ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
వైరల్ అయిన లెటర్ ఆధారంగా.. తమ ఆటగాళ్లపై చేతబడి, తాంత్రిక విద్యలను ప్రయోగించారని.. నిమ్మకాయలతో పాటు నల్లని వస్త్రాలను చూపిస్తూ క్రీడాస్ఫూర్తిగా విఘాతం కలిగించారని అందులో రాసుంది. సీఎస్కే టీమ్ ఆటగాళ్ల ఏకాగ్రత దెబ్బతీసేలా ఇలాంటి మంత్ర తంత్రాలు ప్రయోగించడంపై విచారణ చేపట్టి.. కఠిన చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో పేర్కొన్నట్లు తెలుస్తోంది.
. @ChennaiIPL lodged a complaint with @BCCI https://t.co/kvPTdZNCn1 pic.twitter.com/XsPOAWu9cJ
— Maximus Chaturvedi 🪷 (@PsychoSainik) April 19, 2026
అయితే ఈ వైరల్ అవుతున్న వీడియోను పరిశీలిస్తే..అదొక ఫన్నీ వీడియో మాత్రమే అని సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అది కేవలం సరదా కోసం చేసిన వీడియో అని.. అందులో యాదృచ్ఛికంగా వికెట్ పడిపోవడం గమనార్హం అంటూ కామెంట్ చేస్తున్నారు. అంతమాత్రానికి చిన్నపిల్లల్లా ఫిర్యాదులేంటి అంటూ సన్రైజర్స్ అభిమానులు అంటున్నారు. అయితే ఆ ఫిర్యాదు నకిలీ అని సీఎస్కే ఫ్యాన్స్ చెబుతున్నారు. ఇటీవలే ఆర్సీబీతో మ్యాచ్లో 'ఇడ్లీ సాంబార్' సాంగ్ పెట్టడం పట్ల సీఎస్కే ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ వీడియో చూస్తే సీఎస్కే మేనేజ్మెంట్ మరోసారి కంప్లైయింట్ ఇస్తుందని సరదాగా మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు.
(గమనిక: పైన పేర్కొన్న సమాచారం కేవలం కొందరి అభిప్రాయలు, నమ్మకాలను దృష్టిలో ఉంచుకొని.. వారివారి అభిప్రాయాలను సేకరించి రాసినది. చేతబడి లేదా బ్లాక్ మ్యాజిక్ అనేది ఓ మూఢనమ్మకం. దాని గురించి ఎక్కడా మద్దతుగా రాయలేదు. జీ తెలుగు న్యూస్ ఇలాంటి మూఢనమ్మకాలను ప్రోత్సహించదు.)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Aarav Akshay Kumar Salary: ఆ హీరోకి రూ.2,700 కోట్ల ఆస్తి..అయినా కొడుకు రూ.4,500 జీతానికి పనిచేస్తున్నాడు!
Hyderabad, Telangana:Akshay Kumar Son Aarav Salary: బాలీవుడ్ 'ఖిలాడీ' హీరో అక్షయ్ కుమార్ గురించి తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. ఆయన కిందిస్థాయి నుంచి ఓ స్టార్గా ఎదిగిన తీరు ఎంతోమందికి స్ఫూర్తిని కలిగిస్తోంది. ఇప్పుడు ఆయన ఆస్తి సుమారు రూ.2,700 కోట్లు ఉంటుందని అంచనా. కానీ, ఆయన కుమారుడు ఆరవ్కు మాత్రం నెలకు రూ.4,500 మాత్రమే సంపాదిస్తున్నాడని.. ఓ ఇంటర్వ్యూలో అక్షయ్ కుమార్ వెల్లడించారు. తనకు ఎంత ఆస్తి ఉన్నా విలాసవంతమైన జీవితానికి తన కుమారుడు గడపడం లేదని తాజాగా స్పష్టం చేశాడు. సినిమాల్లో కాకుండా తన కుమారుడు వేరే రంగంలో రాణించేందుకు ఆసక్తి చూపుతున్నాడని అక్షయ్ కుమార్ చెప్పుకొచ్చాడు.
ఇటీవలి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ తన సినీ కెరీర్ గురించి మాత్రమే కాకుండా తన కుమారుడు ఆరవ్ గురించి కూడా కొద్దిసేపు మాట్లాడారు. ఆరవ్ ప్రచారానికి, హంగుఆర్బాటాలు ఇష్టపడడు అంట. చిత్ర పరిశ్రమలో లేదా సినిమాలలో కెరీర్ను కొనసాగించాలని తాను కోరుకోవడం లేదని నటుడు అక్షయ్ కుమార్ వెల్లడించారు. ఆరవ్ అచ్చుపోలినట్లు తన తండ్రి, నటుడు అక్షయ్ కుమార్లాగే ఉంటాడు. ఆరవ్ కూడా ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తాడు.
ఆరవ్కు తన కెరీర్ మార్గంపై పూర్తి స్పష్టత ఉంది. ఆరవ్కు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టాలనే కోరిక లేదని అక్షయ్ చెబుతున్నారు. అతనికి ఫ్యాషన్పై ఆసక్తి ఉంది. నా కుమారుడు ఆరవ్ ఇప్పటికీ నెలకు రూ.4,500 జీతానికి పనిచేస్తున్నాడు. ఫ్యాషన్ గురించి తెలుసుకోవడానికి అతను ఊరూరా తిరుగుతాడు. ఆయా ప్రాంతాలలో ఉపయోగించే నిర్దిష్ట రకాల ప్రింట్లు, డిజైన్లను అతను గమనిస్తాడని నటుడు అక్షయ్ కుమార్ అన్నారు.
"నేను నా కొడుకుకి ఎక్కువగా ఉపదేశాలు ఇవ్వను. వాడికి ఇదే చెబుతాను. ఎవరికీ హాని చేయవద్దు, ఎవరినీ బాధపెట్టవద్దు" అని నటుడు అక్షయ్ కుమార్ అన్నారు. ఫ్యాషన్ డిజైనింగ్లో కెరీర్ నిర్మించుకోవాలని ఆరవ్ చాలా ఆసక్తిగా ఉండేవాడనే విషయం గమనార్హం. అక్షయ్ కుమార్ ఒక స్టార్ నటుడు అయినప్పటికీ, అతని కుమారుడు ఆరవ్ 15 ఏళ్ల వయసులోనే ఇంటిని విడిచిపెట్టాడు. అతను ఫ్యాషన్ డిజైనింగ్లో తన చదువును కొనసాగించడానికి లండన్కు వెళ్ళాడు.
ఆరవ్కు చిన్నప్పటి నుంచే ఫిట్నెస్, క్రీడల పట్ల అమితమైన ఆసక్తి ఉంది. ఆరవ్ నాలుగేళ్ల వయసులోనే మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ ప్రారంభించాడు. అతను జాతీయ జూడో ఛాంపియన్షిప్లో బంగారు పతకం కూడా గెలుచుకున్నాడు. ఆరవ్కు వంట చేయడం పట్ల కూడా ఎంతో ఆసక్తి ఉంది. అతను ఈ రంగంలో ఒక కోర్సు కూడా పూర్తి చేశాడు.
ఆరవ్ ముంబైలోని జుహులో ఉన్న ఎకోల్ మోండియల్ వరల్డ్లో తన పాఠశాల విద్యను పూర్తి చేశాడు. ఆ తర్వాత.. అతను సింగపూర్కు వెళ్ళాడు. ఆ తర్వాత అతను లండన్ విశ్వవిద్యాలయంలో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులో చేరాడు. నటుడు అక్షయ్ కుమార్ మొత్తం నికర ఆస్తి విలువ రూ.2700 కోట్లుగా ఉంటుందని అంచనా. ఇంతటి అపారమైన సంపద ఉన్నప్పటికీ, అక్షయ్ కుమారుడు ఆరవ్ తన సొంత కష్టంతో డబ్బు సంపాదిస్తున్నాడు. ఇది చాలా మందికి స్ఫూర్తిదాయకం. బాలీవుడ్ పరిశ్రమలోని స్టార్ కిడ్స్ వారి విలాసవంతమైన జీవనశైలికి ప్రసిద్ధి చెందగా, సినిమాలు, ప్రజాదరణ రెండింటికీ దూరంగా ఉండాలనుకునే ఏకైక వ్యక్తి ఆరవ్.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Free Railway Journey: రేవంత్ రెడ్డికి భారీ షాక్.. రైళ్లలో ఫ్రీ జర్నీ వార్తలు అబద్దం: రైల్వే శాఖ
Hyderabad, Telangana:Railway Passengers: ఉచిత బస్సు పథకం అమలు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం రైల్వేపరంగా కూడా ఉచిత ప్రయాణం కల్పించేందుకు సిద్ధమైంది. ఎంఎంటీఎస్ రైళ్లలో హైదరాబాద్ ప్రజలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని సూత్రప్రాయంగా నిర్ణయించింది. అయితే ఈ ప్రతిపాదనను రైల్వే శాఖ కొట్టిపారేసింది. ఎంఎంటీఎస్ రైళ్లల్లో ఫ్రీ జర్నీ అంశాన్ని దక్షిణ మధ్య రైల్వే ఖండించింది. ఉచిత రైలు ప్రయాణం సానుకూలంగా లేమని స్పష్టం చేసింది.
Also Read: Hyderabad Police: హైదరాబాద్లో ‘ఆపరేషన్ సేఫ్ స్కూల్'.. 558 షాపులపై పోలీస్ రైడ్
జూన్ 2వ తేదీ నుంచి ఎంఎంటీఎస్ రైళ్ళల్లో ఫ్రీ జర్నీ అంటూ ప్రభుత్వం ప్రకటనలు ఇవ్వడంపై దక్షిణ మధ్య రైల్వే స్పందించింది. ఫ్రీ జర్నీపై సానుకూలంగా లేమని తెలిపింది. ఉచిత బస్సు పథకం అమలు చేస్తుండగా.. ఆర్టీసీని నిర్వీర్యం చేసిన విధానం గుర్తుచేసింది. కోట్లలో నడిచే రైల్వేకి ఆదాయం సమకూర్చి లోకల్ రైళ్లకు ఫ్రీ జర్నీ ఇస్తామని గొప్పలు ఇవ్వడాన్ని ఖండించింది. తమను మర్యాదపూర్వకంగా మాత్రమే ప్రభుత్వ పెద్దలు కలిశారని దక్షిణ మధ్య రైల్వే అధికారులు చెబుతున్నారు.
Also Read: SRH vs CSK: సన్రైజర్స్ హైదరాబాద్ అద్భుతం.. ఉప్పల్ స్టేడియంలో చెన్నై చిత్తు
లిఖితపూర్వకంగా కనీసం లేఖ కూడా ఇవ్వకుండా ఇలాంటి ప్రకటనలు చేయొద్దని హితవు పలికింది. లిఖిత పూర్వకంగా ఇస్తే తాము రైల్వే బోర్డుకు పంపించి అనుమతి తీసుకుంటామని స్పష్టం చేసింది. ఫ్రీ జర్నీ విషయంలో రైల్వే బోర్డు కూడా సానుకూలంగా స్పందిస్తుందని అనేది మాత్రం అనుమానమే అని దక్షిణ మధ్య రైల్వే అధికారులు చెబుతున్నారు. కేవలం ఏడాది పాటు ఆదాయం చెల్లించి ఫ్రీ జర్నీ ప్రయాణికులకు అందిస్తామని ప్రభుత్వం చెబుతోందని.. దీనిపై రైల్వే బోర్డు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఫ్రీ జర్నీ ఇస్తే భద్రతాపరంగా అనేక రకాల సమస్యలు వస్తాయని ఇది రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ పరిధిలో ఉంటుందని స్పష్టం చేసింది. ముఖ్యమంత్రితో జరిగిన రివ్యూ మీటింగ్లో ఎంఎంటీఎస్ను కేవలం 2 లక్షలు మంది మాత్రమే వినియోగించుకుంటున్నారు. ఎంఎంటీఎస్ విస్తీర్ణం చాలా పెద్దది 250 కిలోమీటర్లు ఉంది. ప్రజలు ఎందుకు వినియోగించుకోలేకపాతున్నారనే చర్చ జరిగింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Iran Warns America: అమెరికా-ఇజ్రాయెల్కు ఇరాన్ వార్నింగ్.."చిన్న పొరపాటు చేసినా పేల్చిపడేస్తాం"..యుద్ధం మళ్లీ షూరూ అయ్యేనా?
Haftador, Yazd Province:Iran Warns America-Israel: పశ్చిమాసియాలో పరిస్థితులు మరోసారి ఉధృతంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాల్పుల విరమణ సమయంలో అమెరికా, ఇజ్రాయెల్ ఏ చిన్న పొరపాటు చేసినా ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ హెచ్చరించింది. ఇదే విషయాన్ని ఇరాన్ దేశ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాఘేర్ గాలిబాఫ్ అమెరికాను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశాడు. గతంతో పోలిస్తే తమ సైనికుల సంపత్తి.. ప్లానింగ్ కెపాసిటీ భారీగా పెరిగనట్లు ఆయన చెప్పుకొచ్చారు. శత్రువల ఎత్తుగడలను చిత్తు చేసేందుకు రంగం సిద్ధం చేశామని ఆయన బదులిచ్చారు.
ఇరాన్ గగనతల రక్షణ వ్యవస్థ తీవ్రంగా బలోపేతం చేసినట్లు చెప్పిన స్పీకర్ గాలిబాఫ్.. గత కొన్ని నెలలుగా సుమారు 180 శత్రువుల డ్రోన్లను పేల్చేసినట్లు ఆయన వెల్లడించారు. అమెరికాకు చెందిన అడ్వాన్స్డ్ ఎఫ్-35 యుద్ధ విమానంపై జరిగిన దాడి ఇరాన్ సాంకేతిక డిజైన్ కెపాసిటీకి నిదర్శనమని ఆయన ప్రకటించారు. ఇప్పటికే తమ శత్రువులకు తమ స్థాయి ఏంటో తెలిసిందని ఆయన పునరుద్ఘాటించారు.
ప్రస్తుత అమలులో ఉన్న కాల్పుల విరమణ ఒప్పందంపై మాట్లాడుతూ.. తమ డిమాండ్స్ నెరవేరడం వల్లనే కాల్పుల విరమణకు అంగీకరించినట్లు స్పీకర్ గాలిబాఫ్ చెప్పారు. క్షేత్రస్థాయిలో ఈ యుద్ధంలో తామే విజయం సాధించినట్లు ధీమా వ్యక్తం చేశారు. ఇస్లామాబాద్ వేదికగా అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్తో చేసిన చర్చలు దౌత్యపరమైన పోరాటంలో భాగమని అయన వెల్లడించారు. ఓ పక్క శాంతి చర్చలు జరుగుతున్న వేళ హార్ముజ్ జలసంధి నియంత్రణలో ఇరాన్ "తగ్గేదేలే" అన్నట్లు ప్రవర్తిస్తుంది.
ఇజ్రాయిల్కు అమెరికా తమ పూర్తి మద్దతు ఇస్తుందని తెలిపిన గాలిబాఫ్.. మరో కొద్దిరోజుల్లో కాల్పుల విరమణ గడువు ముగిసే క్రమంలో ప్రతీకారం తీర్చుకుంటామనే వ్యాఖ్యలు ఇప్పుడు చర్చానీయాంశంగా మారాయి. అణు కార్యకలాపాలు, చమురు రవాణాకు కీలకమైన హార్ముజ్ జలసంధి అంశాలపై రెండు దేశాల మధ్య ఇంకా ఏకాభిప్రాయం రాకపోవడం వల్ల హార్ముజ్ జలసంధిపై ఇరాన్ ఆంక్షలను విధిస్తోంది.
Also Read: Hormuz Gunfire: యుద్ధంలో బిగ్ ట్విస్ట్..భారత నౌకలపై ఇరాన్ IRGC కాల్పులు..అస్సలు ఏం జరుగుతోంది?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
PM Modi On Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ప్రధాని మోదీ ఫోన్..ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసిన పీఎం!
Nunna, Vijayawada, Andhra Pradesh:PM Modi On Pawan Kalyan Health: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు జరిగిన సర్జరీపై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరా తీశారు. తాజాగా పవన్ కళ్యాణ్తో మాట్లాడిన ప్రధాని మోదీ.. ఆయన ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతం త్వరగా కోలుకోవాలని ఆయన ట్వీట్ చేశారు.Kcr Public Meeting: జగిత్యాల జైత్రయాత్ర.. కేసీఆర్ సభకు సర్వం సిద్ధం..
Jagtial, Telangana:KCR Jagitial Public Meeting Latest News: తెలంగాణ రాజకీయాల్లో కీలక ఘట్టానికి జగిత్యాల వేదిక కాబోతోంది.. రేపు పట్టణంలో నిర్వహిస్తున్న బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభకు భారీ ఏర్పాట్లు పూర్తయ్యాయి. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు కాబోతున్న ఈ బాహిరంగ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పార్టీ శ్రేణులు తమ బలాన్ని చాటుకునేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే పట్టణమంతా గులాబీ తోరణాలతో పాటు ఫ్లెక్సీలతో నిండిపోయింది. ఈ సభకు నేరుగా మాజీ ముఖ్యమంత్రి రావడం వల్ల అధికారులు ప్రత్యేకమైన భద్రతను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది..
ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని సభకు వచ్చే సామాన్య ప్రజలకు, కార్యకర్తలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నాయకులు ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా తాగునీరు ఇబ్బంది రాకుండా భారీ స్థాయిలో ఏర్పాట్లు చేశారట.. మూడు లక్షల వాటర్ బాటిల్లు సభా ప్రాంగణం వద్ద అందుబాటులో ఉంచారట. దీంతోపాటు ఎండ వేడి నుంచి ఉపశమనం కలిగేందుకు రెండు లక్షల మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ కూడా చేయబోతున్నట్లు తెలుస్తోంది. సభా ప్రాంగణంలో భారీ కూలర్లతో పాటు ఫ్యాన్లను కూడా ఏర్పాటు చేశారు..
ఉమ్మడి కరీంనగర్ జిల్లా నలుమూలల నుంచి వేలాది వాహనాల్లో జనం తరలివచ్చే అవకాశాలు ఉండడంతో పోలీసులతో పాటు పార్టీ వాలెంటీర్లు సమన్వయంతో పనిచేస్తున్నారు.. వివిధ రూట్ల నుంచి వచ్చే బస్సులతోపాటు కార్లు, ద్విచక్ర వాహనాల కోసం ప్రత్యేకమైన పార్కింగ్ స్థలాలను కేటాయించారు. పట్టణంలో ట్రాఫిక్ జామ్ కాకుండా ప్రత్యామ్నాయ మార్గాలను సూచిస్తూ సైన్ బోర్డులను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం..
ఉమ్మడి జిల్లా BRS ఎమ్మెల్యేలే కాకుండా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన పార్టీ కీలక నేతలు కూడా సభ స్థలాన్ని నిరంతరం సందర్శిస్తూ.. పనులను పర్యవేక్షిస్తున్నారట.. స్టేజ్ నిర్మాణంతోపాటు సౌండ్ సిస్టం, విలేకరుల గ్యాలరీ తో పాటు వీఐపీలు కూర్చునే ఏర్పాట్లపై నేతలు దగ్గరుండి ఏర్పాట్లను చేస్తున్నారట.. జగిత్యాల గడ్డ ఎప్పుడు కేసీఆర్ గారికి అండగా ఉంటుందని.. ఈ సభ ద్వారా ప్రతిపక్షాలకు గట్టి సమాధానం చెబుతామని అక్కడి నేతలు ఇప్పటికే ధీమా వ్యక్తం చేస్తున్నారు..
భారీ బహిరంగ సభ నేపథ్యంలో పోలీసులు ఇప్పటికే ప్రత్యేకమైన భద్రత ఏర్పాట్లను చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సీసీ కెమెరాల నిఘాతో పాటు మఫ్టీల్లో ఉన్న పోలీసులు కూడా నిరంతరం పహార కాస్తున్నారట. ఎక్కడ చిన్నపాటి అవాంఛనీయ ఘటన జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ఈ సభ కేవలం రాబోయే ఎన్నికలకు ప్రచారం మాత్రమే కాదని.. జగిత్యాల ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపమని పార్టీ వర్గాలు అభివర్ణిస్తున్నాయి. రేపు మధ్యాహ్నం జరగబోతున్న ఈ మహాసభ కోసం ఇప్పుడు అందరి కళ్ళు జగిత్యాల వైపే ఉన్నాయి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
MPTC ZPTC Polls: కరీంనగర్ జిల్లా నుంచి ఎన్నికల కసరత్తు ప్రారంభం.. రంగంలోకి యంత్రాంగం..
Karimnagar, Telangana:Mptc Zptc Polls Telangana News: రాష్ట్రంలో సర్పంచ్తో పాటు మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ముగియడంతో ప్రభుత్వం ఇప్పుడు ద్వితీయతో పాటు తృతీయ శ్రేణి స్థానిక సంస్థలపై దృష్టి సాధించింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఎంపీటీసీతో పాటు జడ్పిటిసి ఎన్నికల నిర్వహణకు సంబంధించిన కసరత్తు వేగవంతం చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇప్పటికే అక్కడ ఎన్నికల హడావిడి ప్రారంభమైనట్లు తెలుస్తోంది.
ఎన్నికల నిర్వహణలో అత్యంత కీలకమైన ఓటర్ల జాబితా తయారీపై అధికారులు నిమగ్నమయ్యారు. 2026 ఫిబ్రవరి 5 నాటి గణాంకాల ప్రాతిపదికగా తీసుకుని.. మండలాల వారీగా ఓటర్ల జాబితాను రూపొందించాలని ఎలక్షన్ కమిషన్ ఆదేశించింది. ఈ జాబితాను పంచాయితీ వార్డు రూల్స్ తో మ్యాపింగ్ చేసే ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. ఒకవేళ ఓటర్ల జాబితాలో ఏమైనా వ్యత్యాసాలు లేదా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 23వ తేదీ లోపు నివేదికను సమర్పించాలని కలెక్టర్లను ఎన్నికల సంఘం సూచించింది..
ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో ఎన్నికలు జరగనున్న స్థానాల వివరాలు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. ఇక్కడ మొత్తం 60 జెడ్పిటిసి స్థానాలకు, 646 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికల సంఘం ఎన్నికలు నిర్వహించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.. ఇప్పటికే ఈ స్థానాల్లో ఓటర్ల జాబితాలకు సంబంధించిన వివరాలను కూడా కోరినట్లు సమాచారం. రాష్ట్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసే లోపే క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా యంత్రాంగం భావిస్తుందని.. అందులో భాగంగానే ఈ పనులన్నీ పూర్తి చేస్తున్నట్లు తెలుస్తోంది..
పోలింగ్ కేంద్రాల గుర్తింపుతో పాటు బ్యాలెట్ బాక్స్ లభ్యత, సిబ్బంది కేటాయింపు వంటి అంశాలపై ఇప్పటికే ప్రాథమిక సమీక్షలు ముగిసాయట.. ఓటర్ల జాబితా మ్యాపింగ్ ప్రక్రియలో ఎలాంటి తప్పులు దొర్లకుండా గ్రామపంచాయతీ కార్యదర్శులతో పాటు MRO సమన్వయంతో పని చేయాలని ఉన్నతాధికారులు పలుసార్లు ఆదేశించినట్లు సమాచారం. వార్డుల విభజనతో పాటు ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు ఉన్నవారు నిర్నిత గడువులోగా సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కోరింది..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Huawei: ఏప్రిల్ 20న ఎంట్రీ.. కిరిన్ 9030 ప్రాసెసర్తో Huawei Pura 90 Pro Max.. బాహుబలి ఫీచర్లు!
Hyderabad, Telangana:Huawei Pura 90 Pro Max Leaks Telugu News: స్మార్ట్ఫోన్ ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉన్న హువావే అతి త్వరలోనే మరో కొత్త మొబైల్ను విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.. దీనిని కంపెనీ పురా 90 సిరీస్తో విడుదల చేసి సంచలనం సృష్టించేందుకు సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి.. చైనాకు చెందిన ప్రముఖ టిప్స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ ఈ వివరాలను స్వయంగా తన సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేశారు.. ఈ స్మార్ట్ఫోన్ అద్భుతమైన బ్యాటరీ లైఫ్తో పాటు ఎన్నో రకాల కెమెరా ఫీచర్లతో విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది.. ముఖ్యంగా ఇది చూడడానికి ఎంతో ప్రత్యేకమైన డిజైన్లు కలిగి ఉండే అవకాశాలు ఉన్నట్లు లీకైన ఫోటోలు చెబుతున్నాయి. అయితే, ఈ మొబైల్కు సంబంధించిన అన్ని రకాల వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.
లీకైన వివరాల ప్రకారం.. ఈ స్మార్ట్ఫోన్ సిరీస్లో ఎంతో శక్తివంతమైన 6500mAh భారీ బ్యాటరీని కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా బేస్ మోడల్స్లో 6000mAh భారీ బ్యాటరీ ఉండే అవకాశాలున్నాయి. ప్రో మోడల్స్లో మాత్రం అద్భుతమైన ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో పాటు చాలా రకాల కొత్త కొత్త ఫీచర్లు అందుబాటులోకి రాబోతున్నట్లు సమాచారం ముఖ్యంగా వైర్లెస్ చార్జింగ్ టెక్నాలజీని మరింత మెరుగుపరుస్తూ ఈ స్మార్ట్ఫోన్స్ను తయారు చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
ఈ స్మార్ట్ఫోన్లో ఎంతో శక్తివంతమైన 200 మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్ కెమెరా ఉండబోతోంది. అంతేకాకుండా అదనంగా 40MP అల్ట్రా వైడ్ కెమెరాతో పాటు 50MP ప్రధాన కెమెరాను కూడా కలిగి ఉంటుంది. ఇందులోని అల్ట్రా వైడ్ లైన్స్ 4k వీడియో సపోర్టింగ్ను కూడా కలిగి ఉంటుంది తక్కువ కాంతిలో ఎక్కువ క్వాలిటీ ఫోటోలను అందించేందుకు ఎంతగానో సహాయపడుతుంది ముఖ్యంగా ఇందులో వివిధ రకాల కెమెరా మోడ్లు కూడా ఉన్నట్లు సమాచారం. దీనివల్ల కావలసినప్పుడల్లా మోడ్స్ మార్చుకొని.. ఫోటోలను దిగొచ్చు.
Read more: Cheap Luxury Cars: కేవలం రూ. 15 లక్షలకే BMW.. ఆడి కారు రూ. 7.50 లక్షలే.. ఎక్కడో తెలుసా?
పురా 90 ప్రో మాక్స్ స్మార్ట్ఫోన్ చాలా ప్రత్యేకమైన 6.87-అంగుళాల 1.5K రిజల్యూషన్ కలిగిన OLED డిస్ప్లేతో విడుదల కాబోతోంది.. ఇది 120Hz రిఫ్రెష్ రేట్ను సపోర్ట్ చేస్తుందని కంపెనీ లీక్ అయిన వివరాలు చెబుతున్నాయి.. హువావే సొంతంగా అభివృద్ధి చేసిన కిరిన్ 9030 (Kirin 9030) ప్రాసెసర్తో ఈ ఫోన్ పనిచేస్తుందని వార్తలు వస్తున్నాయి. ఈ మొబైల్ను కంపెనీ 16gb ర్యామ్తో విడుదల చేయబోతోంది. ఇది వివిధ స్టోరేజ్ ఆప్షన్స్లో అందుబాటులో ఉంటుంది. అలాగే స్టోరేజ్ వేరియంటును బట్టి ధర కూడా నిర్ణయిస్తారని టెక్ నిపుణులు భావిస్తున్నారు..
ఈ స్మార్ట్ఫోన్ను హువావే కంపెనీ ఏప్రిల్ 20వ తేదీన చైనాలో అధికారికంగా విడుదల చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అక్కడ విడుదల చేసిన తర్వాతే అంతర్జాతీయ మార్కెట్లో అందుబాటులోకి తీసుకురావాలని కంపెనీ యోచిస్తుందట. అంతేకాకుండా ఈ మొబైల్ విడుదలయితే వివిధ ప్రీమియం బ్రాండ్లతో కూడిన స్మార్ట్ఫోన్స్తో ఈ మొబైల్ సిరీస్ పోటీ పడే అవకాశాలున్నాయి. అయితే, అతి త్వరలోనే కంపెనీ ఈ స్మార్ట్ఫోన్స్కి సంబంధించిన ఫీచర్స్ను అధికారికంగా వెల్లడించబోతోంది.
Read more: Cheap Luxury Cars: కేవలం రూ. 15 లక్షలకే BMW.. ఆడి కారు రూ. 7.50 లక్షలే.. ఎక్కడో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
YS Jagan On Pawan Kalyan: స్వరం మార్చిన వైసీపీ అధినేత..జగన్ నోట డిప్యూటీ సీఎం మాట..వైఎస్ జగన్ ఎమోషనల్ ట్వీట్!
Vijayawada, Andhra Pradesh:YS Jagan On Pawan Kalyan Health: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి తాజాగా సర్జరీ అయిన సంగతి తెలిసిందే. ఇటీవలే పవన్ కళ్యాణ్ అస్వస్థతకు గురైన నేపథ్యంలో ఆయన్ని హుటాహుటిన హైదరాబాద్లో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత సర్జరీ అవసరమని వైద్యులు సూచించడంతో వెంటనే సర్జరీ చేశారు. అయితే ఇదే విషయమై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత జగన్ సోషల్ మీడియాలో స్పందించారు. పవన్ కళ్యాణ్ ఆరోగ్యం పూర్తిగా మెరుగవ్వాలని వారు ఆశించారు.
అయితే వైసీపీ అధినేత జగన్ స్పందించిన తీరు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేరుగానీ, ఆయన పార్టీ గురించి ప్రస్తావించేందుకు ఇష్టపడలేదు. పవన్ కళ్యాణ్ని గతంలో జగన్ దత్తపుత్రుడు అంటూ పరోక్షంగా సంభోధించేవారు. అధికారంలో ఉన్న అన్ని రోజులు పవన్ కళ్యాణ్ గురించి ప్రస్తావించేందుకు ఇష్టపడని జగన్.. ఇప్పుడు స్పెషల్గా పవన్ కళ్యాణ్ను ఆయన పేరుతో జగన్ ట్వీట్లో ప్రస్తావించడంతో ఇప్పుడు ఇరు పార్టీల నేతలు ఆశ్చర్యానికి గురవుతున్నారు.
Wishing @PawanKalyan Garu a speedy and complete recovery following his surgery. Get well soon!
— YS Jagan Mohan Reddy (@ysjagan) April 19, 2026
2024 ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్కు అభినందనలు తెలిపేందుకు వైఎస్ జగన్ ఇష్టపడలేదు. కానీ, ఇప్పుడు ఈ ఘటన మరింత చర్చ మారింది. కూటమిలో ఉన్న పార్టీలు బలంగా ఉండడంతో రానురాను అధికారానికి దూరమైపోతామేమో అని అటు వైసీపీ నేతలు కూడా అంతర్గతంగా చర్చించుకుంటున్నారు.
అయితే ఇలాంటి పరిస్థితుల్లో కూటమిని విడగొట్టాలని వైసీపీ గతంలో ఎన్నో ప్రయత్నాలు చేసిన సంగతి తెలిసిందే. ఇలాంటి రాజకీయ ప్రణాళికల్లో భాగంగా జనసేనకు దగ్గరైతే బాగుంటుందని ఎప్పటి నుంచో వైసీపీ సీనియర్ నేతలు చెబుతున్న సత్యమిది. తాజాగా జరిగిన పరిణామాలతో జనసేతతో కయ్యం కంటే వియ్యం బెటర్ అని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ ను వ్యక్తిగతంగా ఎన్నో విమర్శలు చేసిన వైసీపీ పార్టీ.. ఇప్పుడు డిప్యూటీ సీఎం పేరు ఎత్తేందుకు కొంత ఆలోచిస్తున్న మాట వాస్తవమే. ఇప్పుడు అధికారం కోల్పయిన తర్వాత పవన్ కళ్యాణ్ను వ్యక్తిగతంగా విమర్శించడం మానేసి.. సానుకూలంగా ఉంటే కనీసం వైసీపీ పార్టీపై నెగెటివిటీ తగ్గుతుందని వైసీపీ నేతలు భావిస్తున్నట్లు సమాచారం. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ ఆరోగ్యం బాగుపడాలని వైసీపీ అధినేత చేసిన ట్వీట్పై ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో తెగ చర్చ జరుగుతోంది.
Spoke to Andhra Pradesh Deputy Chief Minister Shri Pawan Kalyan Garu and enquired about his well-being. He is remarkably courageous and I am sure he will recover very soon. Praying for his good health.@PawanKalyan
— Narendra Modi (@narendramodi) April 19, 2026
డిప్యూటీ సీఎంకు ప్రధాని మోదీ సందేశం..
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు జరిగిన సర్జరీపై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. ఇదే విషయమై మోదీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు ఫోన్లో మాట్లాడినట్లు మోదీ ట్వీట్లో స్పష్టం చేశారు. పవన్ యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నట్లు మోదీ తెలిపారు. పవన్ లాంటి ధైర్యవంతులు, త్వరగా కోలుకుంటారనే నమ్మకం తనకు ఉన్నట్లు మోదీ చెప్పుకొచ్చారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరోగ్యం మెరుగుపడాలని కోరుకుంటున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
