ఖమ్మం:సిపిఆర్ చేసి ఓ వ్యక్తికి ప్రాణం
Khammam, Telangana:సిపిఆర్ చేసి ఓ వ్యక్తిని బతికించిన ఘటన ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం విఎం బంజార్ లో చోటుచేసుకుంది. పెనుబల్లి నుండి విఎం బంజార్ కు బైక్ పై యేసుబాబు అనే వ్యక్తి వెళుతుండగా అదుపుతప్పి కిందపడి అపస్మారక స్థితికి చేరాడు. సమీపంలో శానిటైజేషన్ పని చేస్తున్న రామారావు అనే వ్యక్తి అక్కడకు చేరుకుని సీపీఆర్ చేసాడు. ఈక్రమంలో ఒక్కసారిగా ఊపిరి తీసుకున్నాడు. సీపీఆర్ చేసి ప్రాణాలు రక్షించిన రామారావును అభినందించారు.हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
అయ్యే.. కన్నపిల్లలను ఐరన్ రాడ్లతో చితకబాది, వాతలు పెట్టిన కసాయి తల్లిదండ్రులు!
Hyderabad, Telangana:Huzurnagar Crime News Telugu: కన్నపిల్లలను కంటికి రెప్పలా చూసుకోవాల్సింది పోయిన తల్లిదండ్రులు.. పిల్లలకు కాలయముళ్లయ్యారు. నరరూప రాక్షసుల్లా మారి కన్నప్రేమను మరువడమే కాకుండా.. పసిబిడ్డలపై అమానుషంగా ప్రవర్తించారు.. తప్పు చేస్తే మందలించాల్సింది పోయి.. ఉన్మాదుల్లా మారి ఇద్దరు చిన్నారులను ఐరన్ రాడ్లతో చితకబాది.. ఒళ్లంతా వాతలు పెట్టిన హృదయవిదారక ఘటన సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గంలో వెలుగుచూసింది.
ఒంటినిండా వాతలు..
స్థానికులతో పాు పోలీసుల అదించిన సమాచారం ప్రకారం... హుజూర్ నగర్ ప్రాంతానికి చెందిన నకిరికంటి రవి, ఇందు దంపతులకు ధనుష్, రేవంత్ అనే ఇద్దరు చిన్నారులు ఉన్నారు. ఏమైందో ఏమో కానీ.. ఈ కసాయి తల్లిదండ్రులకు పిల్లలపై తీవ్ర ఆగ్రహం కట్టలు తెంచుకుంది. మానవత్వాన్ని పూర్తిగా మర్చిపోయిన రవి, ఇందు దంపతులు ఇద్దరు పసిపిల్లలను బంధించి తీవ్రంగా కొట్టారు.. అంతటితో వారి కసి తీరలేదు.. ఇనుప రాడ్లను కాల్చి చిన్నారుల శరీరాలపై ఇష్టమొచ్చినట్లు వాతలు పెట్టారు.. తల్లిదండ్రుల ఉన్మాదపు చర్యల కారణంగా ఆ పసివాళ్లు తట్టుకోలేక.. భరించలేని నొప్పితో విలవిలలాడిపోయారు. తీవ్ర గాయాలపాలు కావడంతో పిల్లలిద్దరూ స్పృహతప్పి పడిపోయారు.
చలించిపోయిన స్థానికులు..
చిన్నారుల ఆర్తనాదాలతో పాటు వారి పరిస్థితిని గమనించిన స్థానికులు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనయ్యారు. పిల్లల ఒంటి నిండా ఉన్న గాయాలతో పాటు ఐరన్ రాడ్ల వాతలను చూసి.. స్థానికుల గుండెలు తరుక్కుపోయాయి. పసిపిల్లలపై ఇంతటి ఘాతుకానికి పాల్పడిన ఆ కసాయి తల్లిదండ్రులపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా.. ఈ తల్లిదండ్రుల బారి నుంచి ఆ ఇద్దరు చిన్నారులను స్థానికులే చొరవ తీసుకుని సురక్షితంగా రక్షించారు.
Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!
పోలీస్ స్టేషన్కు తరలింపు..
బాధిత చిన్నారులను రక్షించిన స్థానికులు వెంటనే.. వారిని స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించారు. పిల్లల దీనస్థితిని.. ఒంటిపై ఉన్న రక్తం గడ్డకట్టిన గాయాలను చూసి పోలీస్ సిబ్బంది సైతం కంటతడి పెట్టుకున్నట్లు తెలుస్తోంది.. వెంటనే చిన్నారులకు ప్రథమ చికిత్స అందించేలా చర్యలు తీసుకున్నారు. ఈ అమానుష ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. కన్నపిల్లలపై ఇంతటి క్రూరత్వానికి కారణమైన నకిరికంటి రవి, ఇందులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకునేందుకు దర్యాప్తు వేగవంతం చేశారు. పసి హృదయాలను గాయపరిచిన ఈ ఉన్మాద తల్లిదండ్రులను కఠినంగా శిక్షించాలని స్థానికులు సైతం డిమాండ్ చేస్తున్నారు.
Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
శని వక్రగతి 2026 ఎఫెక్ట్.. జూలై 27 నుంచి ఈ 3 రాశుల వారికి కష్టాలు.. మీ రాశి ఉందా?
Hyderabad, Telangana:Saturn Retrograde 2026 Effect: జ్యోతిష్యశాస్త్రంలో న్యాయదేవుడిగా, కర్మఫల ప్రదాతగా భావించే శని దేవుడు త్వరలోనే తన గమనాన్ని మార్చుకోబోతున్నాడు. ఈ మార్పు కొన్ని రాశుల వారికి తీవ్రమైన ఇబ్బందులను, సవాళ్లను తీసుకువచ్చే అవకాశాలు ఉన్నాయి.. జ్యోతిష్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. 2026 జూలై 27వ తేదీన శని దేవుడు మీన రాశిలో వక్రగమనాన్ని ప్రారంభించనున్నాడు. ఈ వక్ర స్థితి 2026 డిసెంబర్ 11 వరకు కొనసాగుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అంటే రాబోయే నాలుగున్నర నెలల పాటు కొన్ని రాశుల వారు అత్యంత అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది.. డిసెంబర్ 11న శని మళ్లీ సక్రమ మార్గంలోకి వచ్చిన తర్వాతే వీరికి ఉపశమనం లభిస్తుంది.
ఏల్నాటి శని బాధితులకు మరిన్ని సమస్యలు..
సాధారణంగా ఏల్నాటి శని నడుస్తున్న రాశులపై శని వక్రగమనం అత్యంత తీవ్రమైన ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని మనందరికీ తెలుసు.. శని వెనక్కి తిరిగినప్పుడు శక్తి ప్రభావం మరింత పెరుగుతాయని జ్యోతిష్యులు చెబుతూ ఉంటారు. దీనివల్ల ఇప్పటికే ఇబ్బందులు పడుతున్న రాశుల వారి సమస్యలు రెట్టింపు అయ్యే అవకాశం ఉంటుంది.. ఈ సమయంలో ముఖ్యంగా మూడు రాశుల వారు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అయితే, ఈ సమయంలో ఏయే రాశులవారికి సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.
మేష రాశి (Mesha Rashi)
మేష రాశి వారికి శని వక్రగమనం వల్ల ఆర్థిక పరంగా.. మానసిక పరంగా తీవ్రమైన ఒత్తిడి వంటి సమస్యలు కూడా వస్తాయి.. మీరు ప్రస్తుతం చేపట్టిన ప్రాజెక్టులు లేదా పనులలో ఊహించని అడ్డంకులు ఎదురవుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఈ సమయంలో ఖర్చులు అకస్మాత్తుగా విపరీతంగా పెరుగుతాయి. ఈ నాలుగున్నర నెలల పాటు ఎలాంటి పెద్ద పెట్టుబడులు పెట్టకపోవడం చాలా మంచిది.. ఎవరికీ అప్పులు ఇవ్వడం కానీ.. తీసుకోవడం కానీ చేయకపోవడం మంచిది.. లేదంటే భారీ నష్టాలను చవిచూడాల్సి వస్తుంది.
కుంభ రాశి (Kumbha Rashi)
కుంభ రాశి వారికి ప్రస్తుతం ఏల్నాటి శని రెండో దశ కొనసాగుతోంది. శని వక్రగమనం వల్ల వీరి సమస్యలు రెట్టింపు అయ్యే ప్రమాదం ఉందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. పని ప్రదేశంలో వీరికి సహోద్యోగులతో లేదా పైఅధికారులతో తీవ్రమైన వాదోపవాదాలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి.. ఈ కాలంలో సమయంలో ఆరోగ్య సంబంధిత సమస్యలు కూడా వస్తాయి. పాత వ్యాధులు మళ్లీ ఇబ్బంది పెట్టవచ్చని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. మీ మాట తీరుపై.. కోపంపై ఖచ్చితమైన నియంత్రణ ఉంచుకోవాల్సి ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. వ్యాపార రంగంలో ఉన్నవారు ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు.
మీన రాశి (Meena Rashi)
శని దేవుడు మీన రాశిలోనే వక్రగమనంలోకి వెళ్లడం.. అలాగే మీన రాశి వారికి ప్రస్తుతం ఏల్నాటి శని మొదటి దశ నడుస్తుండటంతో ఈ రాశి వారే అందరికంటే ఎక్కువగా ప్రభావితం అవుతారని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. నిరంతరం మానసిక ఆందోళనతో పాటు కుటుంబంలో కలహాలు, గృహ వాతావరణంలో అశాంతి నెలకొనే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మీరు చేసే పనులలో విపరీతమైన ఆలస్యం జరగడం వల్ల తీవ్ర నిరాశకు లోనవుతారు. ఎంత కష్టపడినా తగిన ప్రతిఫలం దక్కడం లేదనే భావన కలుగుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. అదృష్టం అస్సలు కలిసిరాకపోవడంతో పాటు బోనస్గా అనే సమస్యలు వస్తాయి.. ఈ రాశి వారు ఎంతో ఓపికతో వ్యవహరించాలి. ప్రతిరోజూ క్రమం తప్పకుండా శని చాలీసా పఠించడం వల్ల శని దేవుని కీడు ప్రభావం నుంచి ఉపశమనం లభిస్తుంది.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
గమనిక.. 
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..
తండ్రి లేని లోటును భర్తీ చేస్తూ.. ఆటో నడుపుతూ.. నలుగురిని సాకుతున్న యువతి!
Hyderabad, Telangana:Inspiring Woman Auto Driver News: సమాజంలో ఎంత మార్పు వచ్చినా.. ఆడపిల్లల సామర్థ్యాల పట్ల కొన్ని అపోహలు ఇంకా కొనసాగుతూనే వస్తున్నాయి. కానీ, ఆ అపోహలన్నింటినీ ఏ మాత్రం లెక్కచేయకుండా.. సవాళ్లను ఎదురు నిలించింది ఒక యువతి... కష్టాల సుడిగుండంలో చిక్కుకున్న తన కుటుంబాన్ని ఒడ్డుకు చేర్చడానికి తానే.. ఒక సైన్యమై కదిలింది. ఆటో డ్రైవింగ్ వృత్తిని ఎంచుకుని.. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఆటో పట్టి దూసుకుపోతోంది బట్టి సరస్వతి.. ఇంట్లో మగ దిక్కు లేకపోయినా.. తానే ఆ ఇంటికి పెద్ద కొడుకుగా మారి ముగ్గురు ఆడపిల్లల కుటుంబాన్ని సాకుతున్న ఈ యువతి కథ ప్రతి ఒక్కరినీ కదిలిస్తూనే.. కొండంత ధైర్యాన్ని ఇస్తోంది..
కన్నతండ్రి దూరమైనా..
మహబూబాబాద్ పట్టణంలోని గాయత్రీ గుట్ట కాలనీకి చెందిన బట్టి సరస్వతి జీవితం మొదటి నుంచి పూలబాట ఏమీ కాదు.. ఆ కుటుంబంలో ముగ్గురు ఆడపిల్లలు.. వారు ఇంకా లోకం తెలియని చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే.. కన్నతండ్రి వారిని వదిలేసి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి ఆ తల్లి తన ముగ్గురు ఆడపిల్లలను రెక్కల కష్టం చేస్తూ.. సాకుతూ వచ్చింది. కానీ రోజులు గడిచేకొద్దీ ఆర్థిక ఇబ్బందులు విపరీతంగా పెరిగాయి. ఇంట్లో సంపాదించే.. మగ దిక్కు లేకపోవడం.. కేవలం ఆడపిల్లలే ఉండటంతో సమాజం నుంచి కూడా ఆ కుటుంబానికి ఎన్నో ఇబ్బందులు, అవహేళనలు ఎదురయ్యాయి.
భిన్నమైన మార్గం..
కుటుంబ పరిస్థితులు చూసి సరస్వతి చలించిపోయింది.. ఎలాగైనా తన తల్లికి, సోదరీమణులకు అండగా నిలవాలని నిశ్చయించుకుంది. సాధారణంగా మహిళలు ఎంచుకునే కుట్టుపని, ఇతర కూలి పనులు కాకుండా.. సరస్వతి భిన్నమైన మార్గాన్ని ఎంచుకుంది.. తనకు చిన్నప్పటి నుంచి డ్రైవింగ్ అంటే విపరీతమైన ఆసక్తి.. వేరే పనులు తెలిసినప్పటికీ.. తన మనసుకు నచ్చిన, ఇష్టమైన డ్రైవింగ్ రంగంలోనే స్థిరపడాలని నిర్ణయించుకుంది.
సమాజంలో ఒక మహిళ ఆటో నడపడం అంటే ఎన్నో సవాళ్లతో కూడుకున్న పని.. పురుషుల సమాజంలో అడుగుపెట్టి ఆటో నడపడం అంత తేలిక కాదు.. కానీ.. వాటన్నింటినీ తన ఆత్మవిశ్వాసంతో అధిగమించి.. ఆటో డ్రైవింగ్ నేర్చుకుని లైసెన్స్ సాధించింది. మహబూబాబాద్ రోడ్లపై ఆటో నడపడం ప్రారంభించి.. అందరినీ ఆశ్చర్యపరిచింది.
నేటి తరానికి ఆదర్శం..
ప్రస్తుతం సరస్వతి ఉదయం నుంచి రాత్రి వరకు ఆటో నడుపుతూ కష్టపడుతోంది.. ముగ్గురు ఆడపిల్లల భారాన్ని.. తల్లి బాధ్యతను తన భుజాలపై వేసుకుని జీవనం సాగిస్తోంది. ఆటో నడపడం వల్ల వచ్చే సంపాదనతోనే ఇల్లు గడుస్తోంది.. తమ ఇంట్లో మగవారు లేరనే వెలితి వారి అమ్మకు రాకూడదని అనుకుందని.. అందుకే తనే ఆ బాధ్యత తీసుకున్నానని.. ఈ వృత్తి నాకు గౌరవాన్ని, నా కుటుంబానికి తిండిని ఇస్తోందని.. సరస్వతి గర్వంగా చెబుతోంది.
Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఆటో నడుపుతున్న సరస్వతిని చూసి స్థానిక ప్రజలు, ప్రయాణికులు ఎంతో ఆశ్చర్యపోవడమే కాకుండా.. ఆమె ధైర్యాన్ని అభినందిస్తున్నారు. తోటి ఆటో కార్మికులు సైతం ఆమెకు సపోర్ట్గా నిలుస్తున్నారు. కష్టాలు వచ్చాయని కుంగిపోకుండా.. తండ్రి లేని లోటును భర్తీ చేస్తూ.. స్వయంశక్తితో నిలబడిన బట్టి సరస్వతి నేటి తరానికి.. ముఖ్యంగా ఎంతోమంది యువతులకు ఒక గొప్ప రోల్ మోడల్గా నిలుస్తోంది. ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు స్పందించి.. ఇలాంటి వీరనారికి మరింత ప్రోత్సాహంతో పాటు ఆర్థిక సహాయం అందిస్తే.. ఆమె కుటుంబానికి మరింత మేలు జరుగుతుందని స్థానికులు కోరుతున్నారు.
Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
Deo రాదు.. పరిస్థితి మారదు.. కారిడార్లలో ఉపాధ్యాయుల సర్వీస్ ఫైళ్లు.. సంగారెడ్డి కలెక్టరేట్లో విద్యాశాఖ దారుణ పరిస్థితి..!!
Secunderabad, Telangana:Sangareddy Collectorate: సంగారెడ్డి విద్యాశాఖలో పరిస్థితి ఎక్కడ వేసిన గొంగడి.. అక్కడే అన్నట్లుగా తయారైంది. ఒకవైపు డీఈఓ కార్యాలయాన్ని పూర్తిగా కలెక్టరేట్ లోకి తరలించడం.. అదే సమయంలో 15 రోజులుగా డీఈఓ సెలవులో ఉండటంతో.. ఫైళ్లన్ని పెండింగ్ లో పడిపోయాయి. ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన ఫైళ్లు అస్సలు కదలడం లేదు. చెక్ పవర్ డీఈఓ కే ఉండటంతో ఎఫ్ఓసీ బాధ్యతలను అడిషనల్ డైరెక్టర్ శంకర్ కు అప్పగించినా.. ఆయన విధులు మొక్కుబడిగానే సాగుతున్నాయి. దీంతో ఏం చేయాలో పాలుపోక ఇటు ఉద్యోగులు, అటు ఉపాధ్యాయులు తలలు పట్టుకుంటున్నారు.
జాయిన్ అయిన పక్షం రోజులకే సెలవులో డీఈఓ:
సంగారెడ్డి జిల్లా విద్యాధికారిగా రోహిణి జూన్ 3న బాధ్యతలు స్వీకరించారు. ఆమె విధుల్లో చేరిన 20 రోజులకే లాంగ్ లీవ్ పెట్టేశారు. మొదట 15 రోజులు సెలవులో ఉన్నారని కార్యాలయ ఉద్యోగులు చెబుతున్నా.. సంగారెడ్డిలో పనిచేసేందుకు ఆమె సుముఖంగా లేనట్లు ప్రచారం జరుగుతోంది. ఆమె సెలవును మరికొన్ని రోజులు పొడిగించుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఉద్యోగుల్లో చర్చ జరుగుతోంది. ఆర్సీవో గా ప్రమోషన్ వస్తుందన్న ఆలోచనతోనే కొన్ని రోజులు సెలవును పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు టాక్. అయితే డీఈఓగా పనిచేసిన 20 రోజుల్లోనూ పాత కార్యాలయం వైపు వెళ్లేందుకు కూడా ఆసక్తి చూపలేదని చర్చ జరుగుతోంది.
సంగారెడ్డి మున్సిపల్ కార్యాలయం పక్కనే ఉన్న డీఈఓ ఆఫీస్ భవనం పాతబడిపోవడంతో అందులో అడుగుపెట్టేందుకు కూడా రోహిణి సముఖత వ్యక్తం చేయలేదని టాక్. గతంలో హైదరాబాద్ లో పనిచేసిన డీఈఓ సంగారెడ్డి కార్యాలయం చూడగానే ఇదేం ఆఫీస్.. కూలే స్థితిలో ఉన్న ఈ భవనంలో ఎలా ఉంటున్నారని పలువురు ఉద్యోగులతో మాట్లాడినట్లు తెలుస్తోంది. పాత భవనంలో ఉండేందుకు ఇష్టం లేకే సంగారెడ్డి కలెక్టరేట్ లో ఉన్న సమగ్ర శిక్ష అభియాన్ కార్యాలయం వేదికగానే ఫైళ్లు క్లియర్ చేసినట్లు సిబ్బంది చెబుతున్నారు.
కీలక ఫైళ్లన్నీ కారిడార్ లోనే:
మున్సిపల్ ఆఫీస్ పక్కన ఉన్న విద్యాశాఖ కార్యాలయాన్ని సంగారెడ్డి కలెక్టరేట్ లోకి తరలించాలని ఇటీవల జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదేశించారు. ఈ నేపథ్యంలో సెకండ్ ఫ్లోర్ లోని సమగ్ర శిక్షా అభియాన్ కార్యాలయంలోకి డీఈవో కార్యాలయానికి తరలించారు. అయితే ఏళ్ల తరబడి భద్రంగా ఉంచిన కీలక ఫైళ్లు, ఉపాధ్యాయుల సర్వీస్ వ్యవహారాలకు సంబంధించిన ఫైళ్లు, ఆఫీస్ వ్యవహారాల దస్త్రాలు ఎక్కడ పెట్టాలో తెలియక సిబ్బంది.. కార్యాలయం కారిడార్ లోనే ఉంచేశారు. దీంతో కీలక ఫైళ్లు ఉంటాయా.. మాయమౌతాయా అన్న ఆందోళన ఉద్యోగులు, ఉపాధ్యాయుల్లో నెలకొంది. కార్యాలయానికి అవసరమైన స్థలం లేకపోవడంతోనే కారిడార్ లో మూటలు కట్టి.. ఫైళ్లు పెట్టామని సిబ్బంది చెబుతున్నప్పటికీ.. ఎలాంటి భద్రత లేకుండా పడి ఉంటే వాటిని పట్టించుకునే నాథుడు లేరని పలువురు వాపోతున్నారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం కారణంగా ఉద్యోగులకు ఇబ్బందులు తప్పడం లేదన్న ఆందోళన పలువురిలో కనిపిస్తోంది.
ఫైళ్లు పెడింగ్ లో.. ఉపాధ్యాయులు ఆందోళనలో..:
డీఈఓ సంతకం చేస్తే గానీ ముందుకు సాగని ఫైళ్లు గత పక్షం రోజులుగా పెండింగ్ లో ఉన్నాయి. ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాలతో ముడిపడిన ఫైళ్లు, మెడికల్ రీయింబర్స్ మెంట్ బిల్స్ వంటివి పెండింగ్ లో ఉన్నాయి. ఇక ఉపాధ్యాయుల సర్దుబాటు కూడా జరగకపోవడంతో కొన్ని స్కూళ్లలో విద్యార్థులకు తిప్పలు తప్పడం లేదు. డీఈఓ పర్యవేక్షణ లేకపోవడంతో ప్రైవేట్ స్కూళ్లు కూడా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. సెలవు పెట్టాలనుకున్న డీఈఓ ఇక్కడికి రాకపోయినా బాగుండేదిగా అని పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి విద్యాశాఖ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు.
Also Read: జనం అడిగారా?..ఆ ఉచిత పథకాలు ఎవరి కోసం? తెలంగాణ సర్కార్పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం..!!
Also Read: ఉచిత వైద్యం ఉద్యోగుల హక్కు.. జీతాల్లో EHS కోతపై తెలంగాణ హైకోర్టు సీరియస్..!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
బుధుడి వక్ర గమనం.. రాబోయే 30 రోజులు ఈ 4 రాశుల వారికి కాసుల వర్షమే!
Hyderabad, Telangana:Mercury Retrograde In Gemini Telugu: జ్యోతిష్యశాస్త్రంలో వ్యాపారంతో పాటు బుద్ధి, వాక్కుకు కారకుడైన బుధ గ్రహ గమనంలో మార్పు రాబోతోంది. అయితే, దీనిని అత్యంత శుభప్రదమైనదిగా భావిస్తారు. జూలై 7 మంగళవారం రోజున గ్రహాల యువరాజు భావించే.. బుధుడు తన సొంతం రాశి అయిన మిథునరాశిలో వక్రగతిలోకి వెళ్లాడు. జ్యోతిష్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. సొంతం రాశిలో బుధుడి ఈ తిరోగమనం మొత్తం 12 రాశులపై ప్రభావం చూపుతుంది.. ముఖ్యంగా 4 రాశుల జాతకులకు మాత్రం రాబోయే ఒక నెల రోజుల పాటు ఊహించని ధనలాభాలతో పాటు అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి.
రాబోయే ఆగస్టు 5 వరకు బుధుడు ఇదే మిథునరాశిలో వక్ర స్థితిలోనే కొనసాగబోతున్నాడు.. ఈ 30 రోజల్లో కెరీర్, వ్యాపారంతో పాటు ఆర్థిక రంగాలలో ఊహించని పురోగతి లభించబోతోంది. అయితే, ఈ సమయంలో అదృష్టం పొందే 4 రాశులవారికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
సింహ రాశి (Leo)
సింహ రాశివారికి బుధుడి ఈ వక్రగతి ప్రభావంతో ఈ సమయం అత్యంత లాభదాయకంగా ఉండబోతోందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. కెరీర్లో ముందుకు సాగడానికి అనేక సువర్ణ అవకాశాలు లభిస్తాయి. ముఖ్యంగా విదేశీ ప్రయాణాలు చేయాలనుకునే వారికి లేదా విదేశీ వ్యాపారాలతో సంబంధం ఉన్నవారికి వీసా.. ఇతర చట్టపరమైన ఇబ్బందులు క్షణాల్లో పరిష్కరం లభిస్తుంది. కొత్త ఉద్యోగం కోసం వెతుకుతున్న వారికి కూడా ఈ సమయం ఎంతో సానుకూలంగా ఉంటుంది.
మిథున రాశి (Gemini)
బుధుడు ఇదే రాశిలో వక్ర గమనంలోకి వెళ్లడం వల్ల వీరికి ఈ సమయంలో తప్పకుండా ఆత్మవిశ్వాసం ఒక్కసారిగా భారీగా పెరుగుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. దీర్ఘకాలంగా మీరు పడుతున్న కష్టానికి మంచి ఫలితాలు దక్కే సమయం లభిస్తుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఉద్యోగస్తులకు కార్యాలయంలో ఉన్నతాధికారుల నుంచి పూర్తి సపోర్ట్ లభిస్తుంది. ప్రమోషన్ లేదా జీతాలు విపరీతంగా పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే, పెద్ద మొత్తంలో ఆర్థిక లావాదేవీలు చేసేటప్పుడు ఇతరుల సలహా తీసుకోవడం మంచిదని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.
ధనుస్సు రాశి (Sagittarius)
వక్ర మార్గంలోకి బుధుడి ప్రవేశం వల్ల ధనుస్సు రాశి వారి ఆర్థిక స్థితిలు గతంలో కంటే చాలా బలంగా మారబోతున్నాయని జ్యోతిష్యలు తెలుపుతున్నారు. ఆదాయానికి సంబంధించిన విషయాల్లో ఊహించని ప్రయోజనాలు కలుగుతాయి.. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలని ఆలోచిస్తున్న వారికి ఈ నెల రోజుల్లోనే ఊహించని ప్రయోజనాలు కలుగుతాయి. వీరికి ఈ సమయంలో తప్పకుండా లక్ష్మీదేవి అనుగ్రహం లభించి.. ఊహించని ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.
తులా రాశి (Libra)
తులా రాశి వారి జీవితంలో ఈ సమయం ఎంతో అద్భుతంగా ఉంటుంది. గతంలో వేధిస్తున్న మానసిక, ఆర్థిక ఇబ్బందులు క్రమంగా తొలగిపోతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. వీరు తప్పకుండా శత్రువులపై విజయాలు సాధించే అవకాశాలు ఉన్నాయి. ఆస్తి లేదా భూమికి సంబంధించిన పాత వివాదాలు ఏవైనా ఉంటే.. అవి మీకు అనుకూలంగా పరిష్కారమయ్యే అవకాశం ఉందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. వీరు తప్పకుండా కుటుంబంలో శుభకార్యాల ప్లాన్ చేస్తారు. సంతానానికి సంబంధించి శుభవార్తలు కూడా వినే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.
నోట్: ఈ సమాచారం జ్యోతిష్య శాస్త్ర నిపుణులు, నమ్మకాలను ఆధారంగా తీసుకు రాసింది మాత్రమే.. దీనిని కేవలం సమాచారంగా మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే దీనికి జీ తెలుగు న్యూస్కి ఎలాంటి సంబంధం లేదు..
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
గమనిక.. 
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..
తెలంగాణ ఆర్టీసీలో కొలువుల జాతర.. 1500 కండక్టర్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్!
Hyderabad, Telangana:TGSRTC 1500 Conductor Posts: తెలంగాణ ఆర్టీసీలో ఉద్యోగాల జాతర మొదలయ్యింది. రాష్ట్రవ్యాప్తంగా 1500 కండక్టర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించే లక్ష్యంతో తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ అతి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఈ పోస్టుల ఎంపిక పదో తరగతి మార్కుల ఆధారంగా జరుగుతుంది. అయితే, కొందరికి పదవ తరగతిలో మార్కులు, మరికొందరికి గ్రేడింగ్ పాయింట్లు ఉండటంతో, ఆ గ్రేడింగ్ మార్కులను శాతంగా ఎలా లెక్కించాలనే అంశంపై ఆర్టీసీ ఇప్పటికే ఎస్ఎస్సి బోర్డుకు లేఖ రాసింది. దీనిపై ప్రస్తుతం కసరత్తు జరుగుతోంది.
మహాలక్ష్మి పథకం అమలు తర్వాత ఆర్టీసీలో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. పెరుగుతున్న రద్దీ దృష్ట్యా ప్రస్తుతం తాత్కాలికంగా ఔట్ సోర్సింగ్ సిబ్బందిని వాడుతున్నారు. ఇటీవల జరిగిన ఆర్టీసీ సమ్మె సమయంలో కూడా కొందరిని విధుల్లోకి తీసుకున్నారు. అయితే, ఇప్పుడు రిజర్వేషన్ల నిబంధనల ప్రకారం రీజియన్ల వారీగా ఈ 1500 పోస్టులను శాశ్వత ఉద్యోగులుగా భర్తీ చేయనున్నారు.
గ్రేడింగ్తోనే గందరగోళం..
గత ఏప్రిల్లో జరిగిన సమ్మె సమయంలో రవాణా ఇబ్బందులు లేకుండా చూడటానికి, మెదక్, నర్సాపూర్ డిపోల పరిధిలో ఆర్టీసీ యాజమాన్యం తాత్కాలికంగా డ్రైవర్లు, కండక్టర్లను నియమించింది. డ్రైవర్ పోస్టులకు 18 నెలల అనుభవం, హెవీ వెహికల్ లైసెన్స్ ఉండాలి. కండక్టర్ పోస్టులకు పదో తరగతి పాస్ అయిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. తాత్కాలికంగా నియమించిన డ్రైవర్లకు రోజుకు రూ.1000, కండక్టర్లకు రూ.800 చొప్పున చెల్లిస్తారని సమాచారం. ఆర్టీసీలో శాశ్వత ఉద్యోగాల భర్తీ జరిగి చాలా ఏళ్లయింది కాబట్టి, ఈ పోస్టులకు దరఖాస్తుల సంఖ్య భారీగా ఉండే అవకాశం ఉంది. అయితే, పదో తరగతి మార్కులు, గ్రేడింగ్ పాయింట్ల విషయంలో ఉన్న గందరగోళం వల్ల ఎంపిక ప్రక్రియ ఎలా జరుగుతుందనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.
ప్రతి ఏటా ఆర్టీసీ ఉద్యోగుల రిటైర్మెంట్ వల్ల ఏర్పడిన ఖాళీలను భర్తీ చేసేందుకు హైదరాబాద్, సికింద్రాబాద్ సహా పలు ప్రాంతాల్లో ఇప్పటికే ఔట్ సోర్సింగ్ సిబ్బంది ఉన్నారు. కానీ, ఇప్పుడు 1500 మందిని శాశ్వత ప్రాతిపదికన రీజియన్ల వారీగా భర్తీ చేయాలని నిర్ణయించారు. పదో తరగతి మార్కులపై స్పష్టత రాగానే ఈ ప్రక్రియ వేగవంతం అవుతుంది. 12 ఏళ్ల తర్వాత కండక్టర్ల భర్తీకి ప్రయత్నాలు జరిగాయి. 2013 నుండి ఆర్టీసీలో కండక్టర్ల నియామకాలు జరగలేదు, కేవలం తాత్కాలిక నియామకాలే జరుగుతున్నాయి. రిటైర్మెంట్లు పెరుగుతున్న నేపథ్యంలో కండక్టర్లను శాశ్వతంగా తీసుకోవాలని డిమాండ్ వ్యక్తమవుతోంది.
Also Read: ఆర్టీసీ ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. జూన్ 1 నుంచి మారనున్న బస్ చార్జీలు..అసలు మ్యాటర్ ఏమిటంటే.?.
Also Read: Telangana RTC Strike: తెలంగాణ ఆర్టీసీ సమ్మెలో కీలక పరిణామం..
సాంకేతిక కారణాల వల్ల ఈ ప్రక్రియ కొంత ఆలస్యమైనప్పటికీ, ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నియామకాలు త్వరలోనే మొదలవుతాయని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం సుదూర ప్రాంతాలకు వెళ్లే సూపర్ లగ్జరీ, డీలక్స్ బస్సులను వన్ మ్యాన్ సర్వీసులుగా మారుస్తూ వస్తున్న ఆర్టీసీ, ఇప్పుడు ఎక్స్ప్రెస్ బస్సులను కూడా జాబితాలో చేర్చింది. కొన్ని రూట్లలో కండక్టర్లు ప్రధాన బస్ స్టాప్ల వద్దే ఉండి టికెట్లు జారీ చేస్తున్నారు. తాజాగా 1500 మంది కొత్త సిబ్బందిని తీసుకోవడానికి ఆర్టీసీ నేరుగా రిక్రూట్మెంట్ ప్రక్రియను చేపట్టింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.
రైలులో ‘హనీమూన్ కోచ్’ వివాదం.. టీటీఈ సస్పెండ్, ఉన్నత స్థాయి విచారణకు ఆదేశిస్తూ రైల్వే సంచలన నిర్ణయం!
Hyderabad, Telangana:Indian Railways Action: భారతీయ రైల్వే ద్వారా ప్రతిరోజూ లక్షలాది మంది ప్రయాణికులు తక్కువ ఖర్చుతో, సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరుకుంటారు. అయితే, రైలును ప్రయాణానికి కాకుండా హనీమూన్ కోసం వాడుకోవడం వివాదానికి దారితీసింది. జులై ఆరో తేదీన ముంబై నుండి నందిగ్రామ్ ఎక్స్ప్రెస్లో వెళ్తున్న రైలులోని ఫస్ట్ ఏసీ కోచ్ను ఒక జంట పూలు, బెలూన్లతో హనీమూన్ కోసం అలంకరించుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో రైల్వే శాఖ స్పందించి విచారణకు ఆదేశించింది.
సంబంధిత టీటీఈని సస్పెండ్ చేసింది.
ఆ జంట ప్రైవేట్గా డెకరేటర్ను నియమించుకున్నారు. అనుమతి లేకుండా రైలులోకి ప్రవేశించిన ఆ డెకరేటర్పై కూడా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. ఈ వీడియో దేశవ్యాప్తంగా వైరల్ కావడంతో, ఫస్ట్ ఏసీ కోచ్లో క్యాబిన్ అలంకరించిన విషయంపై పెద్ద దుమారమే రేగింది. సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడంతో టీటీఈకి ఉద్యోగం పోయింది. అసలు విషయం ఏమిటంటే, జూలై 6వ తేదీన నందిగ్రామ్ ఎక్స్ప్రెస్లో ప్రయాణిస్తున్న ఒక జంట, తమ ప్రయాణాన్ని ప్రత్యేకంగా మార్చుకోవడానికి ఆన్లైన్లో ప్రైవేట్ డెకరేటర్ను సంప్రదించి ఫస్ట్ ఏసీ క్యాబిన్ను పూర్తిగా అలంకరించుకున్నారు. ఆ గది మొత్తం హనీమూన్ సెటప్లా మారిపోయింది. ఈ వీడియోను నెట్టింట షేర్ చేయడంతో, రైల్వే శాఖ దీనిని భద్రతా లోపంగా పరిగణించి, నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బందిని తక్షణమే సస్పెండ్ చేసి విచారణకు ఆదేశించింది.
A First AC coach has reportedly been decorated with a "honeymoon-style" setup.
The Railway administration must explain: is it's allowed? @RailMinIndia @RailwaySeva @AshwiniVaishnaw @PMOIndia pic.twitter.com/ofE4AGawJH
— The Nalanda Index (@Nalanda_index) July 7, 2026
రైల్వే నిబంధనల ప్రకారం, ఒక ప్రయాణికుడు క్యాబిన్ను పూర్తిగా బుక్ చేసుకుని స్వయంగా అలంకరించుకోవడానికి ఎలాంటి అభ్యంతరం ఉండదు. అయితే, ఈ కేసులో అసలు వివాదం ఒక ప్రైవేట్ డెకరేటర్ ఎలా రైలులోకి ప్రవేశించాడనేది. ఫస్ట్ ఏసీ కోచ్లోకి డెకరేటర్ను అనుమతించడం భద్రతా నియమాలకు పూర్తిగా విరుద్ధమని రైల్వే యంత్రాంగం స్పష్టం చేస్తోంది. ఈ ఘటనపై దర్యాప్తు నివేదిక వచ్చిన తర్వాత కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రైల్వే శాఖ పేర్కొంది.
వైరల్ అవుతున్న వీడియోలో ఫస్ట్ ఏసీ కోచ్లో కర్టెన్ల నుండి వైట్ బెడ్ షీట్లు, రకరకాల పువ్వులు, మల్లెపూలు, బెలూన్లతో హనీమూన్ థీమ్ను ఏర్పాటు చేసినట్లు కనిపిస్తోంది. బెడ్ పైన కూడా పూలతో అందంగా అలంకరించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు వింత కామెంట్లు చేయగా, మరికొందరు దీనిని 'సుహాగ్రత్ ఎక్స్ప్రెస్' లేదా 'హనీమూన్ ఆన్ వీల్స్' అని వ్యంగ్యంగా అభివర్ణించారు.
Read more: Video Viral: ఏం రొమాంటిక్ ఐడియా భయ్యా.. ట్రైన్లోని ఏసీ కోచ్లో శోభనం డెకొరేషన్.!
Read more: నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. రైల్వేలో 4,098 టెక్నికల్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
England Vs India Preview: తప్పక గెలవాల్సిన మ్యాచ్..టీమ్ఇండియా గెలుస్తుందా? ఇంగ్లాండ్పై పట్టు సాధిస్తుందా?
Hyderabad, Telangana:England Vs India 4th T20i Preview: ఇంగ్లాండ్తో జరిగిన టీ20 సిరీస్లోని తొలి మూడు మ్యాచ్ల్లో రెండు ఘోర పరాజయాల తర్వాత పరువు నిలుపుకోవాలి టీమ్ఇండియా భావిస్తోంది. ఇప్పటికే సిరీస్ ఆశలు కోల్పోయిన భారత జట్టు ఇప్పుడు ఎట్టిపరిస్థితుల్లో మిగిలిన రెండు టీ20 మ్యాచ్ల్లో విజయం సాధించి సిరీస్ను సమం చేయాలని చూస్తోంది.
అయితే ఈ నాలుగో మ్యాచ్కు సంబంధించి టీమ్ఇండియా కూర్పులో పెద్ద గందరగోళం ఏర్పడింది. ఇప్పటికే అనుభవజ్ఞుడైన సంజూ శాంసన్ను పక్కకు తప్పించి అతడి స్థానంలో వైభవ్ సూర్యవంశీని జట్టులోకి తీసుకోగా.. అతని ప్రభావం పెద్దగా చూపలేకపోవడంతో భారత ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు. అయితే భారత జట్టు ఇప్పటికే 0-2 తేడాతో సిరీస్ చేజారే పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో కోచ్ గౌతమ్ గంభీర్ కీలక నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.
అయితే ఇప్పటికే ఐర్లాండ్తో జరిగిన టీ20 సిరీస్లో ఓటమి తర్వాత ఇప్పుడు ఇంగ్లాండ్ సిరీస్ కూడా కోల్పోతే డిఫెండింగ్ ఛాంపియన్గా నిలిచిన టీమ్ఇండియాకు పెద్ద అవమానం అనే చెప్పాలి. అయితే ఇంగ్లాండ్, ఐర్లాండ్ పర్యటనల్లో జట్టు కూర్పుపై సెలెక్షన్ కమిటీ, మేనేజ్మెంట్పై భారత ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో మునిగిఉన్నారు.
భారత జట్టు పరిస్థితి ఇదే!
తాజాగా ఇంగ్లాండ్తో జరిగిన మూడో టీ20లో భారత జట్టు 125 పరుగుల ఘోర పరాజయం తర్వాత భారత అభిమానులు.. "We Want Sanju" (మాకు సంజూ కావాలి) అంటూ నినాదాలు చేయడం గమనార్హం. దీంతో పాటు టీ20 ప్రపంచకప్లో భారత జట్టును విజయతీరాలకు చేర్చడంలో కృషి చేసిన కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ను పూర్తిగా జట్టు నుంచి తప్పించడం పట్ల తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది.
ఇంగ్లాండ్తో మూడో టీ20 మ్యాచ్లో ఘోర పరాజయం తర్వాత జట్టులో ఇలాంటి లోపాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. జోఫ్రా ఆర్చర్, జోష్ టంగ్ల నేతృత్వంలోని వేగవంతమైన పేస్ బౌలింగ్ దాడి ముందు బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. ఈ దాడిలో భాగంగా టాప్ ఐదుగురితో సహా మొత్తం ఏడు వికెట్లను పంచుకుని భారత్ను చిత్తు చేశారు.
ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని చెదరగొట్టకుండా శాంసన్కు చోటు కల్పించడం సహా వైభవ్ సూర్యవంశీకి మరో అవకాశం ఇవ్వాలంటే మిడిల్ ఆర్డర్లో తప్పనిసరిగా మార్పులు చేయాల్సి ఉంటుంది. వికెట్ కీపర్-బ్యాటర్ ఇషాన్ కిషన్, బ్యాటింగ్ నైపుణ్యంపై యాజమాన్యానికి నమ్మకం ఉన్నందున అతను తన స్థానాన్ని నిలబెట్టుకునే అవకాశం ఉండగా, వైస్ కెప్టెన్ తిలక్ వర్మ స్థానం మాత్రం డౌట్ అనే చెప్పాలి. ముంబై ఇండియన్స్ జట్టులో ఫినిషర్గా పేరొందిన తిలక్ వర్మ.. తాజాగా ఫామ్లోకి వచ్చేందుకు ఇబ్బంది పడడం కొసమెరుపు.
ఐర్లాండ్తో జరిగిన మ్యాచ్లో కేవలం ఒక పరుగు తేడాతో ఓడిపోయినప్పటికీ, కష్టపడి ఆడిన 55 పరుగులు వృధా అయ్యాయి. అది మినహా, ఇంగ్లాండ్లో జరిగిన మ్యాచ్లలో వర్మ తన మంచి ఆరంభాలను పెద్ద స్కోర్లుగా మలచడంలో విఫలమై.. 13, 24 నాటౌట్, 3 పరుగులు మాత్రమే సాధించాడు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో తిలక్ వర్మను జట్టు నుంచి తప్పించి సంజూ శాంసన్ను మళ్లీ జట్టులోకి తీసుకొచ్చే అవకాశం ఉంది.
మూడో టీ20 మ్యాచ్లో ఛేజింగ్ సమయంలో భారత్ కేవలం 76 పరుగులకే ఆలౌట్ కాగా, పవర్ప్లేలోనే ఫినిషర్ శివమ్ దూబే కంటే ముందుగా హర్షిత్ రాణాను బ్యాటింగ్కు పంపారు. బ్యాటింగ్ చాలా మెరుగుపడాల్సిన అవసరం ఉంటే, బౌలింగ్ విభాగం, ముఖ్యంగా స్పిన్నర్ల విషయంలో కూడా పరిస్థితి భిన్నంగా లేదు. మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఈ సిరీస్లో ఏడు ఓవర్లలో కేవలం ఒక వికెట్ మాత్రమే తీసి తీవ్రంగా నిరాశపరిచాడు.
ఇంగ్లాండ్ జట్టు ఎలా ఉందంటే?
అయితే మరోవైపు హ్యారీ బ్రూక్ నేతృత్వంలోని ఇంగ్లాండ్ జట్టుకు అలాంటి ఆందోళనలు లేవు. విధ్వంసకర ఓపెనర్ ఫిల్ సాల్ట్ ఫామ్లోకి తిరిగి వచ్చి 44 బంతుల్లో 70 పరుగులు చేయడంతో, ఆ జట్టు ఉత్సాహంగా ఈ పోటీలోకి అడుగుపెడుతోంది. ఇంగ్లండ్కు అతిపెద్ద సానుకూల అంశం పేస్ ద్వయం ఆర్చర్, టంగ్. వీరు కొత్త బంతితో అద్భుతమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పి సహజ వేగాన్ని, భారీ బౌన్స్ను ప్రదర్శించారు. గత నెలలో న్యూజిలాండ్తో జరిగిన టెస్ట్ సిరీస్లో తమ మధ్య కెమిస్ట్రీని ఏర్పరచుకున్న టంగ్, తన అద్భుతమైన ఫామ్ను తన సీనియర్ భాగస్వామితో కలిసి టీ20 ఫార్మాట్లోకి కూడా కొనసాగించాడు.
ఇంగ్లాండ్ Vs భారత్ జట్లు ఇవే..
టీమ్ఇండియా: శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), తిలక్ వర్మ, సంజు శాంసన్, శివమ్ దూబే, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, అర్ష్దీప్ సింగ్, రవి బిష్ణోయ్, ప్రసిధ్ కృష్ణ, సూర్యంష్ షెడ్గే, వాషింగ్టన్ షెడ్గే.
ఇంగ్లాండ్ జట్టు: హ్యారీ బ్రూక్ (కెప్టెన్), ఫిల్ సాల్ట్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్), టామ్ బాంటన్, జాకబ్ బెథెల్, సామ్ కర్రాన్, విల్ జాక్స్, జోఫ్రా ఆర్చర్, లియామ్ డాసన్, ఆదిల్ రషీద్, జోష్ టంగ్, జోర్డాన్ కాక్స్, సోనీ బేకర్, ల్యూక్ వుడ్, సాకిబ్ మహమూద్, రెహాన్ అహ్మద్, రెహాన్ అహ్మద్.
Also Read: ఫీఫా వరల్డ్ కప్లో విచిత్ర సంఘటన..ఇంగ్లాండ్ ప్లేయర్లకు వయాగ్రా ఇచ్చారు! ఎందుకంటే?
Also Read: గ్రౌండ్లో కంటతడి పెట్టుకున్న వైభవ్ సూర్యవంశీ..క్యాప్ అందుకున్న తర్వాత భావోద్వేగం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Tharun Bhascker Eesha Rebba: పెళ్లికి రెడీ అయిన తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా..జంటగా కలిసి ఎయిర్పోర్టులో ఇలా..
Hyderabad, Telangana:Tharun Bhascker Eesha Rebba Airport: టాలీవుడ్లో స్టార్ కపుల్ విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక ఇటీవలే పెళ్లి బంధంతో ఒక్కటవ్వగా.. ఇప్పుడు మరో జంట పెళ్లికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. 'పెళ్లిచూపులు' సినిమాతో సెన్సేషనల్ క్రియేట్ చేసిన డైరెక్టర్ తరుణ్ భాస్కర్ త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్నట్లు సమాచారం. హీరోయిన్ ఈషా రెబ్బాతో ఈయన ఎప్పటి నుంచో ప్రేమలో ఉన్నట్లు సమాచారం అందుతోంది. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి వార్త చెప్పనున్నట్లు టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
ఈ వార్తలకు బలం చేకూరేలాగ వీరిద్దరూ ప్రతిసారి జంటగా మీడియా కంట పడుతున్నారు. అందుకు తగ్గట్టు తాజాగా తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా హైదరాబాద్ ఎయిర్పోర్టులో జంటగా కనిపించడమే అందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఈ జంట కలిసి ఎక్కడికో వెళ్తున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై క్లారిటీ లేదు.
డైరెక్టర్ తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా ప్రేమాయణం గురించి ఎప్పటి నుంచో వార్తలు వినిపిస్తున్నా.. ఈ వార్తలపై వీరిద్దర్లో ఎవరూ స్పందించకపోవడం గమనార్హం. అయితే ఇలాంటి వార్తలపై స్పందించలేదు. అలాగనీ ఖండించకపోవడం వల్ల వీరిద్దరి ప్రేమ నిజమే అంటూ టాలీవుడ్ ఫ్యాన్స్ అంటున్నారు. తాజాగా హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో కంటపడిన వీడియోలో డైరెక్టర్ తరుణ్ భాస్కర్ స్టైలిష్ లుక్తో కనిపించగా.. హీరోయిన్ ఈషా రెబ్బా సింపుల్గా 3-పీస్ డ్రస్సులో కనిపించింది.
ఉదయ్పూర్లోనూ జంటగా..
హీరో విజయ్ దేవరకొండ, రష్మిక వివాహ వేడుకలు ఇటీవలే రాజస్థాన్లో జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ పెళ్లికి కూడా తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా జంటగా వెళ్లినట్లు సమాచారం. అందుకు సంబంధించిన కొన్ని ఫొటోలు అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్గానూ మారాయి. వీరి మధ్య ఉన్న కెమిస్ట్రీ చూస్తుంటే, కేవలం స్నేహం కంటే ఎక్కువే ఉందన్న అనుమానాలు అభిమానుల్లో వ్యక్తమయ్యాయి.
New Couple Very Soon ❤️✨😍#EeshaRebba #TharunBhascker pic.twitter.com/iaEvK4RW9h
— Hatoffcine (@Hatoffcine_) July 8, 2026
గత కొంతకాలంగా వీరిద్దరూ డేటింగ్లో ఉన్నారంటూ వార్తలు వస్తున్నప్పటికీ, తాజా పర్యటనతో ఆ పుకార్లకు ఒక్కసారిగా రెక్కలు వచ్చాయి. అయితే, ఈ వార్తలపై అటు తరుణ్ భాస్కర్ గానీ, ఇటు ఈషా రెబ్బా గానీ ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. విజయ్ దేవరకొండతో ఉన్న సాన్నిహిత్యం వల్లే వీరు ఈ వేడుకకు హాజరయ్యారని, వీరిద్దరూ కేవలం మంచి స్నేహితులు మాత్రమేనని కొందరు అభిప్రాయపడుతున్నారు.
వెడ్డింగ్ ప్లాన్?
తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా ప్రస్తుతం స్ట్రాంగ్ రిలేషన్లో ఉన్నారనే చర్చ ఫిలిం నగర్ సర్కిల్స్లో గట్టిగా వినిపిస్తోంది. విజయ్ - రష్మికల పెళ్లి సందడిలో ఈ కొత్త జంట హైలైట్ అవ్వడం ఇపుడు టాలీవుడ్లో టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది. మరి ఈ వార్తలపై తరుణ్ లేదా ఈషా ఎప్పుడు స్పందిస్తారో వేచి చూడాలి.
Also Read: మహేష్ బాబు ఫ్యాన్స్కు సూపర్ గుడ్న్యూస్..'వారణాసి' సినిమా టీజర్ వచ్చేది ఎప్పుడంటే?
Also Read: ఒక్క వెబ్సిరీస్తో లెవల్ మారిపోయింది..రాత్రికి రాత్రే స్టార్గా మారిన మలయాళ బ్యూటీ!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
ఈనెల 20 నుంచి 22 వరకు వైభవంగా బల్కంపేట బోనాలు.. కల్యాణోత్సవం
Hyderabad, Telangana:Bonalu Festival 2026: ఆషాఢ మాసం ప్రారంభమవుతుండడంతో హైదరాబాద్ బోనాల పండుగకు ముస్తాబవుతోంది. అయితే బోనాల ప్రారంభానికి ముందు అంగరంగ వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవం జరగనుంది. ఈ సందర్భంగా బోనాల ఉత్సవాలు జరగనుండగా.. ఈ ఉత్సవాలకు సంబంధించి తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి సమన్వయ సమావేశం నిర్వహించడమే కాకుండా సమీక్ష చేశారు. జూలై 20 నుంచి 22వ తేదీ వరకు జరగనున్న కల్యాణోత్సవానికి సంబంధించి పోస్టర్ను ఆవిష్కరించారు.
హైదరాబాద్లోని బల్కంపేట ఎల్లమ్మ వార్షిక కల్యాణోత్సవం, ఆషాడ బోనాల జాతరకు సంబంధించిన ఏర్పాట్లపై సంబంధిత శాఖ మంత్రి కొండా సురేఖ సమీక్ష చేశారు. అంతకుముందు బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవం భారీ స్థాయిలో జరిపేందుకు తెలంగాణ ప్రభుత్వం సర్వసన్నద్ధమైంది. జూలై 20వ తేదీ నుంచి 22వ తేదీ వరకు మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించాలని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అధికారులను ఆదేశించారు.
బల్కంపేట ఎల్లమ్మ దర్శనం అష్టాదశ శక్తిపీఠాల దర్శనంతో సమానమని మంత్రి కొండా సురేఖ ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉండడంతో.. ఏర్పాట్లలో ఎలాంటి లోపాలు ఉండకూడదని స్పష్టం చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పోలీస్, జీహెచ్ఎంసీ, విద్యుత్, జలమండలి, వైద్య, తెలంగాణ ఆర్టీసీ వంటి అన్ని ప్రభుత్వ శాఖలు సంపూర్ణ సమన్వయంతో పనిచేయాలని మంత్రి ఆదేశించారు.
కల్యాణోత్సవం, జాతర సందర్భంగా క్యూ లైన్లు, ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి కొండా సురేఖ తెలిపారు. భక్తుల రద్దీని తట్టుకునేలా ప్రత్యేక క్యూ లైన్లను ఏర్పాటు చేస్తున్నామని.. ట్రాఫిక్కు ఇబ్బంది కలగకుండా ముందస్తుగా ట్రాఫిక్ మళ్లింపులు, వాహనాల నిలుపుదలకు ప్రత్యేక పార్కింగ్ స్థలాలను కేటాయిస్తున్నట్లు కొండా సురేఖ వివరించారు. జాతరలో మహిళలు, వృద్ధులు, చిన్నారులు, దివ్యాంగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దర్శనానికి ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తున్నట్లు కొండా సురేఖ వెల్లడించారు.
బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి వైభవాన్ని ప్రతిబింబించేలా సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించాలని మంత్రి కొండా సురేఖ అధికారులకు సూచించారు. బల్కంపేట ఎల్లమ్మ ఉత్సవాల ప్రాంగణంలో నిరంతరం తాగునీటి సరఫరా, మొబైల్ టాయిలెట్ల ఏర్పాటుతో పాటు పారిశుద్ద్యంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు.. విద్యుత్ ప్రమాదాలు, ఎలాంటి అపశృతులు జరగకుండా విద్యుత్ శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. ఓపెన్ వైర్లు, ట్రాన్స్ఫార్మర్ల వద్ద ముందస్తు రక్షణ ఏర్పాట్లు చేయనుని సూచించారు.
కల్యాణోత్సవం, జాతర సందర్భంగా భక్తులకు ఇబ్బందులు ఎదురుకాకుండా భారీ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నట్లు.. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా పాత నేరస్తులు, అనుమానితుల ఫొటోలను వాల్ పోస్టర్లుగా ప్రదర్శించాలని పోలీసులను మంత్రి ఆదేశించారు. ఉత్సవాల సమయంలో రద్దీ ఉండగా తప్పిపోయిన చిన్నారులను త్వరగా గుర్తించేందుకు వీలుగా ప్రత్యేక కార్యాచరణను చేపట్టినట్లు తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో ఎవరైనా అస్వస్థతకు గురయితే ఉత్సవాల ప్రాంగణంలో ప్రత్యేక వైద్య శిబిరాలను, 108 అంబులెన్స్లను నిరంతరం అందుబాటులో ఉంచుతున్నట్లు వివరించారు. భక్తుల రాకపోకలకు వీలుగా ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు మంత్రి ప్రకటించారు.
రూ.4.70 కోట్ల వాట్సాప్ 'బాస్' మోసం కేసు.. నమ్మించి మోసం చేసిన ఇద్దరు అరెస్ట్!
Hyderabad, Telangana:Cyber Security Bureau: వాట్సప్ ద్వారా ఓ కంపెనీ వారిని నమ్మించి భారీ మోసం చేసిన ఉదంతం తెలంగాణలో జరిగింది. కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ) పేరు, ఫొటోతో నకిలీ వాట్సాప్ ప్రొఫైల్ను సృష్టించి ఏకంగా రూ. 4.70 కోట్లు దోచుకున్నారు. ఈ భారీ సైబర్ మోసం కేసును తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఛేదించింది. ఈ కేసులో సైబర్ నేరగాళ్లకు సహకరిస్తూ బ్యాంక్ ఖాతాలను సమకూర్చిన ఇద్దరు మ్యూల్ (నకిలీ) ఖాతాదారులను, ఏజెంట్లను పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి.
తాను పనిచేసే కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ ఫోటో, పేరుతో ఉన్న ఒక వాట్సాప్ నంబర్ నుంచి వచ్చిన సందేశాలను సంబంధిత సంస్థ ఉద్యోగి నిజమేనని భావించాడు. అత్యవసరం అని నమ్మించి ఆ ఉద్యోగి నుంచి పలు బ్యాంక్ ఖాతాలకు విడతల వారీగా మొత్తం రూ.4.70 కోట్ల భారీ మొత్తాన్ని బదిలీ చేసుకున్నాడు. ఆ తర్వాత ఎంతకీ అడిగిన డబ్బులు తిరిగివ్వకపోవడంతో తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
బాధితుడి ఫిర్యాదు మేరకు సాంకేతిక విశ్లేషణ, బ్యాంక్ ఖాతాల పరిశీలన ఆధారంగా పోలీసులు ఇద్దరు నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు. నిందితులను ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన దోసపాటి కృష్ణసాయి, హైదరాబాద్ కొత్తపేటలో నివసిస్తున్న మందవల్లి శివ నాగరాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితులు ఇద్దరూ కమిషన్ ఆశతో సైబర్ నేరగాళ్లకు కరెంట్ బ్యాంక్ ఖాతాలను కొనుగోలు చేసి సరఫరా చేసినట్లు తేలింది. ఈ మ్యూల్ ఖాతాల నిర్వహణను సులభతరం చేసినందుకు వారు సుమారు రూ.4 లక్షలు కమీషన్ పొంది.. దానిని ఇద్దరూ పంచుకున్నారు.
బాధితుడి నుంచి దోచుకున్న సొమ్ములో రూ.1.80 కోట్లు నేరుగా నిందితుడు మందవల్లి శివ నాగరాజు బ్యాంక్ ఖాతాలోకి చేరాయి. ఈ ఖాతాను సహ-నిందితుడైన దోసపాటి కృష్ణసాయి సైబర్ నేరగాళ్లకు ఏర్పాటుచేసి ఇచ్చాడు. సదరు బ్యాంక్ ఖాతాను మరింత లోతుగా పరిశీలించగా వాటిలో రూ.2.49 కోట్లకు పైగా అనుమానాస్పద లావాదేవీలు జరిగినట్లు వెల్లడైంది. ఈ ఖాతాకు మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడు రాష్ట్రాల్లో నమోదైన పలు సైబర్ నేరాల ఫిర్యాదులతో సంబంధం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితులను కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. పరారీలో ఉన్న మిగిలిన నిందితులను పట్టుకోవడానికి దర్యాప్తు కొనసాగుతోంది.
ప్రజలకు సైబర్ బ్యూరో సూచనలు
==> ఎవరైనా తెలిసిన వ్యక్తి పేరు లేదా ఫొటో వాట్సాప్ ప్రొఫైల్లో ఉన్నంత మాత్రాన దానిని బ్లైండ్గా నమ్మకండి. వీటిని సైబర్ నేరగాళ్లు సులభంగా కాపీ చేసి దుర్వినియోగం చేసే అవకాశం ఉంది.
మీకు తెలిసిన కాంటాక్ట్ నుంచి అకస్మాత్తుగా అత్యవసరంగా లేదా రహస్యంగా డబ్బులు పంపించాలని.. ముఖ్యంగా కొత్త బ్యాంక్ ఖాతాలకు పంపాలని కోరితే అప్రమత్తంగా ఉండండి.
ఆర్థిక లావాదేవీలు జరిపేటప్పుడు కేవలం వాట్సాప్ సందేశాలపై మాత్రమే ఆధారపడకండి.
ఒకవేళ మీరు సైబర్ మోసానికి గురైతే, ఆలస్యం చేయకుండా వెంటనే #1930 నంబర్కు కాల్ చేయండి లేదా జాతీయ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ www.cybercrime.gov.in ద్వారా ఫిర్యాదు చేయవచ్చు.
రూ.10 నాణేలతో బైక్ కొన్న కస్టమర్.. లెక్కపెట్టలేక తలలు పట్టుకున్న సిబ్బంది!
Nalgonda, Telangana:Nalgonda Viral News: సమాజంలో ఇప్పటికీ రూ.10 నాణేల చెల్లబాటుపై అక్కడక్కడా అపోహాలు నడుస్తూనే ఉన్నాయి. చాలా చోట్ల కిరాణా దుకాణ యజమానులతో పాటు వ్యాపారాలు చేసేవారు కూడా పది రూపాయల కాయిన్స్ తీసుకోవడానికి నిరాకరిస్తూ ఉంటారు. అయితే, ఆ అపోహలను తొలగిస్తూ.. రూ.10 నాణేలు భారత అధికారిక కరెన్సీయేనని నిరూపించాడు నల్లగొండ జిల్లాకు చెందిన ఒక సాధారణ వ్యక్తి.. ఏకంగా రూ.1.10 లక్షల విలువైన బైక్ను కేవలం పది రూపాయల నాణేల రూపంలోనే బిల్ కట్టేసి.. అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు..
అసలేం జరిగిందంటే..?
నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు గ్రామానికి చెందిన కొండే రఘుపతి అనే వ్యక్తి కొంతకాలంగా బైక్ కొనుగోలు చేయాలని అనుకున్నాడు.. అయితే, ఇందుకోసం ఆయన వినూత్నంగా ఆలోచించి.. రూ.10 నాణేలను భారీగా సేకరించాడట. చిట్యాల పట్టణంలోని ప్రముఖ మోటర్ సైకిల్ షోరూమ్కు వెళ్లాడు. అక్కడ తనకు నచ్చిన.. సుమారు రూ.1.10 లక్షల విలువైన హీరో స్ప్లెండర్ ప్లస్ బైక్ను కొనుగోలు చేశాడు..
నాణేల మూటలతో షోరూమ్కు..
ఇక అసలు కథ ఇక్కడే మొదలైంది. బైక్ కొనుగోలుకు సంబంధించిన నగదు చెల్లించే సమయం వచ్చేసరికి.. రఘుపతి తన వెంట తెచ్చుకున్న సంచులను ఓపెన్ చేశాడు. అందులో నోట్లకు బదులుగా గుట్టలు గుట్టలుగా రూ.10 నాణేలు దర్శనమిచ్చాయి. ఏకంగా 11,000 పది రూపాయల నాణేలను షోరూమ్ కౌంటర్పై కుమ్మరించాడు. అది చూసి షోరూమ్ సిబ్బందితో పాటు అక్కడున్న మిగతా కస్టమర్లు కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయారు.
లెక్కపెట్టడానికి గంటల సమయం..
ఆ భారీ నాణేల గుట్టను చూసి షోరూమ్ సిబ్బంది తలలు పట్టుకున్నారు.. అయినా కస్టమర్ తెచ్చిన డబ్బును కాదనలేక.. వాటిని లెక్కించడం మొదలు పెట్టారు. వేల సంఖ్యలో ఉన్న ఆ నాణేలను ఒక్కొక్కటిగా లెక్కించడానికి సిబ్బందికి చాలా సమయం పట్టింది. ఒకరి తర్వాత ఒకరు చేతులు మారుస్తూ.. కౌంటింగ్ పూర్తి చేసేసరికి షోరూమ్ సిబ్బందికి చెమటలు పట్టాయి.
Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!
ఈ వింత సంఘటనపై ఆ మోటార్స్ షోరూమ్ నిర్వాహకుడు సానుకూలంగా స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. కస్టమర్ రఘుపతి ఏకంగా 11 వేల నాణేలను తెచ్చి బైక్ కొంటానన్నప్పుడు మొదట కాస్త ఆశ్చర్యమేసిందని.. వాటిని లెక్కించడానికి మా సిబ్బందికి చాలా సమయం పట్టిన మాట నిజమేనని.. కానీ, రూ.10 నాణేలు అనేవి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ద్వారా గుర్తింపు పొంది.. చెల్లుబాటులో ఉన్న భారత అధికారిక కరెన్సీనని.. చట్టబద్ధమైన కరెన్సీని తిరస్కరించే హక్కు ఎవరికీ లేదని.. అందుకే మేము ఆ నాణేలను సంతోషంగా స్వీకరించి.. ఆయనకు బైక్ డెలివరీ చేశామని తెలిపారు.
Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
Siddipet: రాజీ మార్గమే రాజమార్గం.. చెక్ బౌన్స్ కేసులున్నవారికి బంపర్ ఛాన్స్..
Siddipet, Telangana:Siddipet Special Lok Adalat: సుదీర్ఘకాలంగా కోర్టుల్లో పెండింగ్లో ఉన్న కేసులను పరస్పర రాజీ మార్గం ద్వారా పరిష్కరించుకోవడం వల్ల అటు సమయం.. ఇటు డబ్బు రెండూ ఆదా అవుతాయని సిద్దిపేట జిల్లా ప్రధాన న్యాయమూర్తి సుదర్శన్ స్పష్టం చేశారు. సిద్దిపేట కోర్టు కాంప్లెక్స్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 18వ తేదీన జిల్లాలో చెక్ బౌన్స్ కేసుల పరిష్కారం కోసం ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు ఆయన అధికారికంగా ప్రకటించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
519 చెక్ బౌన్స్ కేసుల..
ఈ సందర్భంగా.. జిల్లా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ.. ప్రస్తుతం సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా మొత్తం 1324 చెక్ బౌన్స్ కేసులు పెండింగ్లో ఉన్నాయని వెల్లడించారు.. ఇందులో ప్రాథమికంగా రెండు వర్గాల మధ్య పరస్పర అవగాహనతో క్లియర్ చేసుకునే.. 519 కేసులను ప్రత్యేకంగా గుర్తించినట్లు ఆయన వెల్లడించారు. వీరందరికీ ఇప్పటికే కోర్టు ద్వారా ముందస్తు నోటీసులు జారీ చేశామని.. లోక్ అదాలత్కు హాజరై తమ వివాదాలను సుహృద్భావ వాతావరణంలో పరిష్కరించుకోవాలని సూచించారు.
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు..
ముఖ్యంగా ప్రైవేటు ఫైనాన్స్ సంస్థలు, బ్యాంకులు, చిట్ ఫండ్ కంపెనీలకు సంబంధించిన చెక్ బౌన్స్ సమస్యలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని న్యాయమూర్తి ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి ఆర్థికపరమైన వివాదాలకు త్వరితగతిన ముగింపు పలికేందుకు గౌరవ సుప్రీంకోర్టు ప్రత్యేక ఆదేశాలు జారీ చేసిందని ఆయన గుర్తు చేశారు. అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల అనుగుణంగానే.. ఈ నెల 18న ఈ స్పెషల్ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!
కోర్టుల చుట్టూ.. ఏళ్ల తరబడి తిరిగి మానసిక ప్రశాంతతను కోల్పోవడం కంటే.. లోక్ అదాలత్ వేదికగా ఇరుపక్షాలు ఒక అంగీకారానికి రావడం ఎంతో ఉత్తమయని.. లోక్ అదాలత్లో పరిష్కారమైన కేసులకు సంబంధించి ఎలాంటి అప్పీళ్లకు అవకాశం ఉండదు కాబట్టి.. వివాదాలు శాశ్వతంగా తొలగిపోతాయని న్యాయమూర్తి సుదర్శన్ ఈ సందర్భంగా వివరించారు. ఈ సమావేశంలో న్యాయమూర్తి సంతోష్ కుమార్తో పాటు పలువురు న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. వ్యాపారస్తులు, ఫైనాన్స్ నిర్వాహకులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని తమ కేసులను క్లియర్ చేసుకోవాలని కోరారు.
Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
అమ్మ ప్రేమకు హద్దుల్లేవు.. అనాథలైన పసి ప్రాణాలకు తల్లిగా మారిన పంది!
Nuzendla, Andhra Pradesh:Kurnool Pig Viral Pic: అమ్మ ప్రేమకు ఎలాంటి హద్దులు, సరిహద్దులు లేవని నిరూపించే ఒక అద్భుతమైన సంఘటన ఆంధ్రప్రదేశ్లో వెలుగుచూసింది. కర్నూలు జిల్లా కోసిగి మండలానికి సమీపంలో ఉన్న జాంబాపురం గ్రామంలో ఒక హృదయ విదారకమైన ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఒక ఆడకుక్క కొన్ని రోజుల క్రితం నాలుగు అందమైన పిల్లలకు జన్మనిచ్చింది. అయితే, దురదృష్టవశాత్తూ రెండు రోజుల క్రితం జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో ఆ తల్లి కుక్క చనిపోయింది.. దీనితో పుట్టి కొన్ని రోజులు కూడా కాకముందే ఆ చిన్నారి కుక్క పిల్లలు తల్లిలేని అనాథలుగా మారిపోయాయి.
ఆకలి కేకలతో పిల్లలు..
కళ్లు కూడా సరిగ్గా.. తెరవని ఆ నాలుగు కుక్క పిల్లలకు తమ తల్లి చనిపోయిందనే విషయం కూడా తెలియదు.. ఆకలితో అవి అలమటించిపోయాయి. ఆహారం కోసం, తల్లి పాలు దొరకక అల్లాడిపోతూ.. గట్టిగా అరుస్తూ ఏడవడం మొదలుపెట్టాయి. ఆ పసి ప్రాణాల ఆకలి కేకలు, దీనమైన అరుపులు చూసి స్థానికులు ఎంతో బాధపడ్డారు. కానీ వాటి ఆకలిని ఎలా తీర్చాలో.. పాలు ఎలా పట్టాలో తెలియదు.. సరిగ్గా అదే సమయంలో అక్కడ ఒక అపురూపమైన ఘటన చోటు చేసుకుంది.
ఆ వీధిలోనే తిరిగే ఒక ఆడపంది.. ఆకలితో ఏడుస్తున్న కుక్క పిల్లల దీనమైన అరుపులను వినింది... ఆ పంది కుక్క పిల్లలు ఉన్న చోటుకు వెళ్లింది. ఆకలితో అలమటిస్తున్న ఆ పసి ప్రాణాలను చూసి దానిలోని మాతృ హృదయం ఉప్పొంగింది.. ఏమాత్రం సంకోచించకుండా.. ఆ కుక్క పిల్లల చెంతకు చేరి వాటి పక్కనే ప్రేమగా పడుకుంది. సాధారణంగా పందులు ఇతర జంతువుల పట్ల క్రూరంగా ప్రవర్థించడం మనం చూస్తూ ఉంటాము.. కానీ ఈ పంది మాత్రం ఆ పిల్లలకు తల్లిలా మారిపోయింది.
పాలు తాగిన కుక్క పిల్లలు..
ఆకలితో అలమటించిన ఆ చిన్నారి కుక్క పిల్లలు కూడా తమ ఎదుట ఉన్నది వేరే జాతి జంతువు అనే భయం లేకుండా.. వెంటనే ఆ పంది దగ్గరకు చేరి ఎంతో ఆత్రుతగా పాలు తాగడం మొదలు పెట్టాయి.. ఆ పంది కూడా ఎంతో ఓపికగా.. కదలకుండా నిలబడి ఆ పిల్లల ఆకలి తీరేంత వరకు పాలు ఇచ్చింది.. ఆ పసి పిల్లలు కడుపు నిండా పాలు తాగిన తర్వాతే.. అక్కడే ప్రశాంతంగా పడుకున్నాయి.. అప్పటి నుంచి ఆ పంది ప్రతిరోజూ క్రమం తప్పకుండా వచ్చి.. ఆ అనాథ కుక్క పిల్లల ఆకలి తీరుస్తూ.. కంటికి రెప్పలా కాపాడుతోందని స్థానికులు చెబుతున్నారు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
Love గుడ్డిదంటే ఇదేనా? ప్రియుడి కోసం 88 తులాల బంగారం దోచేసిన యువతి!
Hyderabad, Telangana:Chennai Love Cheating Case: అందరూ ప్రేమ గుడ్డిదని చెప్పుకుంటూ ఉంటారు.. కానీ ఆ గుడ్డి ప్రేమ ఒక్కోసారి కన్నవారిని.. నమ్ముకున్న కుటుంబాన్ని రోడ్డున పడేస్తూ ఉంటుంది.. తాజాగా తమిళనాడులోని చెన్నైలో ఇటువంటి ఘటన ఒకటి వెలుగుచూసింది. ప్రేమించిన ప్రియుడి కోసం ఓ యువతి తన సొంతింటిలో భారీ చోరీకి పాల్పడింది. ఏకంగా 88.4 తులాల బంగారు ఆభరణాలను కొద్దికొద్దిగా దొంగిలించి ప్రియుడి చేతిలో పెట్టింది.. ఆ నమ్మకద్రోహి ఆ నగలని అమ్మి.. స్నేహితులతో కలిసి విలాసవంతమైన జీవితాన్ని గడిపాడు. చివరకు పోలీసుల విచారణలో అసలు నిజం బయటపడటంతో కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్ అయిపోయారు..
అసలు ఏం జరిగిందంటే?
చెన్నైలోని మధురవాయల్ ప్రాంతానికి చెందిన పన్నీర్సెల్వం (51) తన అన్న మరణించడంతో.. ఆయన భార్యతో పాటు ముగ్గురు కుమార్తెల బాధ్యతలను చూసుకుంటున్నాడు. కొన్ని నెలల క్రితం పన్నీర్సెల్వం తనకు సంబంధించిన బంగారు నగలను తన వదినకు ఇచ్చి.. బీరువాలో భద్రపరచమని చెప్పాడు.. కాగా.. కొన్ని రోజుల క్రితం ఇంట్లోని బీరువాను తెరిచి చూడగా పన్నీర్సెల్వం ఇచ్చిన బంగారు నగలతో పాటు వారి సొంత బంగారం మొత్తం 88 తులాలకు పైగా బంగారం మాయమైనట్లు గుర్తించి షాక్కు గురయ్యారు. ఇంట్లో ఎలాంటి తాళాలు పగలగొట్టకపోవడంతో విస్తుపోయిన కుటుంబ సభ్యులు వెంటనే మధురవాయల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
అబద్ధాలతో దోపిడీ..
రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. బీరువా తలుపులు పగలగొట్టకపోవడంతో.. ఇది కచ్చితంగా ఇంట్లోని వారి పనే అని పోలీసులు అనుమానించారు. ఈ క్రమంలో పన్నీర్సెల్వం అన్న మూడో కుమార్తె అయిన 18 ఏళ్ల యువతి ప్రవర్తనపై పోలీసులకు సందేహం వచ్చి.. ఆమెను గట్టిగా విచారించడంతో అసలు నిజం ఏంటో బయటపడింది.
గతేడాది ఇంటర్మీడియట్ సెలవుల్లో ఆ యువతి ఒక చోట పార్ట్-టైమ్ ఉద్యోగం చేసేందుకు వెళ్లింది.. అక్కడ షెనాయ్ నగర్కు చెందిన కార్తీక్ (21) అనే యువకుడితో పరిచయం ఏర్పడి.. అది కాస్తా ప్రేమగా మారుతూ వచ్చింది. యువతి అమాయకత్వాన్ని కార్తీక్ ఆసరాగా చేసుకున్నాడు. మా నాన్నకు ఆరోగ్యం బాగోలేదని.. ఆసుపత్రి ఖర్చుల కోసం అత్యవసరంగా డబ్బు కావాలని అంటూ నమ్మబలికాడు..
కొద్దికొద్దిగా నగలు మాయం..
ప్రియుడి మాటలను గుడ్డిగా నమ్మిన ఆ యువతి.. ఇంట్లో ఎవరికీ తెలియకుండా బీరువాలో ఉన్న బంగారు నగలను కొద్దికొద్దిగా దొంగిలించి.. కార్తీక్కు ఇవ్వడం ప్రారంభించింది.. కార్తీక్ ఆశ అక్కడితో ఆగలేదు.. ఆ తర్వాత కూడా వరుసగా డబ్బు.. నగలు కావాలని అడగడంతో, ఇంట్లో ఉన్న మొత్తం 88 తులాల బంగారాన్ని యువతి అతడికి అప్పగించింది. ఆ నగలను తీసుకున్న కార్తీక్.. తన స్నేహితులతో కలిసి వాటిని తాకట్టు పెట్టి.. ఆ డబ్బుతో కొత్త కారు.. ఖరీదైన మోటార్ సైకిళ్లు, అత్యంత విలాసవంతమైన స్మార్ట్ఫోన్లు కొనుగోలు చేసి స్నేహితులతో కలిసి జల్సాలు చేశాడు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
