Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Khammam507003

అమరుల త్యాగాల వల్లే ప్రజలకు స్వేచ్ఛ జీవితం: కలెక్టర్ ముజామిల్ ఖాన్

Jul 26, 2024 11:58:30
Khammam, Telangana
సైనికుల త్యాగాలను ఎప్పటికి స్మరించుకోవాలని వారి సేవలను గుర్తుపెట్టుకోవాలని ఖమ్మం కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ అన్నారు. కార్గిల్ విజయ్ దివస్ లో బాగంగా అమరులకు కలెక్టర్ నివాళిఅర్పించారు. దేశ ప్రజలు స్వేచ్చగా బ్రతుకుతున్నారంటే అది అమరుల త్యాగాల వల్లే అన్నారు. వారి త్యాగాలను వెలకట్టలేమని కలెక్టర్ అన్నారు. ఈ క్రమంలో వారి సేవలను కొనియాడుతూ గుర్తుచేసుకున్నారు. ఈకార్యక్రమంలో నగర మేయర్ నీరజా, జిల్లా సైనిక సంక్షేమ అధికారి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
HDHarish Darla
Jan 20, 2026 07:21:05
Hyderabad, Telangana:

Fat Loss Diet And Exercise: బరువు తగ్గాలనుకునే వారు నిరంతరం వినే పదం 'క్యాలరీ డెఫిసిట్' (Calorie Deficit). అసలు దీని అర్థం ఏమిటి? ఆకలితో మాడాలా? లేక తక్కువ తినాలా? ఒక కిలో కొవ్వు తగ్గడానికి ఎన్ని రోజులు పడుతుంది? ఈ అంశాలపై కొందరు ఫిట్‌నెస్ నిపుణులు ఇచ్చే సలహాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

బరువు తగ్గడం అనేది ఒక మ్యాజిక్ కాదు. మన శరీరం రోజూ శ్వాస తీసుకోవడం, నడవడం, జీర్ణక్రియ వంటి పనుల కోసం కొంత శక్తిని (క్యాలరీలను) ఖర్చు చేస్తుంది. ఈ క్యాలరీల కంటే తక్కువగా ఆహారం తీసుకోవడాన్నే 'క్యాలరీ డెఫిసిట్' అంటారు.

ఒక కిలో కొవ్వు తగ్గడానికి ఎన్ని రోజులు పడుతుంది?
సాధారణంగా ఒక కిలో కొవ్వు కరగాలంటే శరీరంలో సుమారు 7,700 క్యాలరీల లోటు (Deficit) ఏర్పడాలి. మీరు రోజుకు 500 క్యాలరీలు తక్కువగా తీసుకుంటే, దాదాపు 15 నుండి 16 రోజుల్లో ఒక కిలో కొవ్వు తగ్గుతారు.

వ్యాయామం + డైట్: కేవలం ఆహారం తగ్గించడమే కాకుండా, వ్యాయామం కూడా తోడైతే ఫలితం ఇంకా వేగంగా, ఆరోగ్యకరంగా ఉంటుంది. ఉదాహరణకు, 300 క్యాలరీలు తక్కువగా తిని, మరో 200 క్యాలరీలు నడక ద్వారా ఖర్చు చేస్తే శరీరం మరింత ధృడంగా మారుతుంది.

ఆకలితో ఉండటం క్యాలరీ డెఫిసిట్ కాదు!
ఫిట్‌నెస్ నిపుణుల అభిప్రాయం ప్రకారం, చాలామంది చేసే తప్పు ఏంటంటే అస్సలు తినకుండా ఉండటం. మీ శరీరం రోజుకు 2000 క్యాలరీలు ఖర్చు చేస్తుంటే, మీరు 1500 నుండి 1700 క్యాలరీలు తీసుకోవాలి. రోజుకు 300 నుండి 500 క్యాలరీల లోటు ఉంచడం అత్యంత సురక్షితమైన మార్గం. దీనివల్ల కండరాలు బలహీనపడకుండా కేవలం కొవ్వు మాత్రమే కరుగుతుంది.

అతిగా తగ్గించడం వల్ల వచ్చే ముప్పు..
బరువు త్వరగా తగ్గాలనే ఆశతో రోజుకు 1000 క్యాలరీల కంటే తక్కువ తీసుకుంటే తీవ్రమైన అనారోగ్య సమస్యలు వస్తాయట. మహిళల్లో నెలసరి సమస్యలు, పురుషుల్లో హార్మోన్ల లోపం ఏర్పడవచ్చని అంటున్నారు. అలాగే ఎముకలు బలహీనపడటం, గుండెపై ఒత్తిడి పడటం, నిరంతరం అలసటగా అనిపించడం వంటివి జరుగుతాయి. అదే విధంగా తక్కువ కేలరీలు తీసుకోవడం వల్ల తక్కువ ఆహారం వల్ల నిద్రలేమి, చిరాకు (Mood swings) పెరుగుతాయి.

సహజంగా బరువు తగ్గడానికి 5 సూత్రాలు..
తీపికి దూరం: కూల్ డ్రింక్స్, సోడాల బదులు నీళ్లు ఎక్కువగా తాగాలి.

ప్రోటీన్: ఆహారంలో ప్రోటీన్ పెంచితే కండరాలు దృఢంగా ఉంటాయి.

రిఫైన్డ్ ఫుడ్ వద్దు: మైదా, తెల్ల బియ్యం తగ్గించి ముడి ధాన్యాలు (Whole Grains) తీసుకోవాలి.

శారీరక శ్రమ: జిమ్‌కు వెళ్లకపోయినా రోజుకు కనీసం 30-40 నిమిషాలు నడవాలి.

ఓపిక: బరువు తగ్గడం అనేది నెమ్మదిగా జరిగే ప్రక్రియ. తక్షణ ఫలితాల కోసం ఆరోగ్యంతో చెలగాటం ఆడవద్దు.

(గమనిక: పైన పేర్కొన్న సమాచారం కేవలం కొందరు నిపుణుల సలహలు, సూచనల మేరకు మాత్రమే పేర్కొన్నది. మీరు అనారోగ్య సమస్యలతో బాధపడే వారైతే సంబంధిత వైద్యుడిని సంప్రదించడం మేలు. దీన్ని జీ తెలుగు న్యూస్ ధ్రువీకరించడం లేదు.)

Also Read: 8th Pay Commission: ఉద్యోగులకు శుభవార్త..వచ్చే 1వ తేదీ నుంచి జీతం ఎంత పెరుగుతుందంటే?

Also Read: Akshay Kumar Car Accident: హీరో అక్షయ్ కుమార్ కారుకు ఘోర ప్రమాదం..కారులో అక్షయ్, ట్వింకిల్..ఆటోని ఢీకొని గాల్లోకి అమాంతం!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
IPInamdar Paresh
Jan 20, 2026 06:18:10
Hyderabad, Telangana:

Harish rao fires on cm revanth reddy over phone tapping case allegations: తెలంగాణ రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహరం తీవ్ర దుమారంగా మారిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు దీనిలో అనేక మంది అధికారుల్ని సిట్ విచారించింది. ఇక ఇది కాస్త మున్సిపల్ ఎన్నికల సమీపిస్తున్న వేళ పొలిటికల్ టర్న్ తీసుకుంది. నిన్న రాత్రి (సోమవారం) బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావుకు సిట్ అధికారులు తమ ఎదుట మంగళవారం హజరు కావాలని నోటీసులు ఇచ్చారు. ఈ ప్రకారమే మాజీ మంత్రి హరీష్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ముందు హజరయ్యే ముందు తెలంగాణ భవన్ కు వచ్చారు.

 

మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ కీలక నేతలు తెలంగాణ భవన్ కు వచ్చారు. జూబ్లిహిల్స్ పోలీసుల ముందు హజరు కాబోయే ముందు హరీష్ రావు మీడియాలో మాట్లాడారు.  ఇది కేవలం డైవర్షన్ పాలిటిక్స్ లో భాగమన్నారు. బొగ్గుగనుల స్కామ్ ను డైవర్షన్ చేసేందుకు, వాటాల పంచాయతిని పక్కన పెట్టడానికి  మాత్రమే సీఎం రేవంత్ ఈ నోటీసుల డ్రామాకు తెరతీశాడన్నారు.  

గతంలోనే సుప్రీంకోర్టు తనపై కేసు నమోదు చేస్తామంటూ కొట్టివేసిందని అన్నారు. ఇచ్చిన 420 హమీలను అమలు చేయమంటే ఈ విధంగా ప్రశ్నిస్తున్న వారి గొంతు నొక్కేందుకు సీఎం రేవంత్ ప్రయత్నిస్తున్నాడన్నారు. ఇలాంటి కేసులు,  వేధింపులకు భయపడేదిలేదని స్పష్టం చేశారు. గతంలో కేసీఆర్ హయాంలో ఎన్నో కేసుల్ని, వేధింపుల్ని ఎదుర్కొన్నామన్నారు.

Read more: Renuka Chowdhury: మహిళల దుస్తుల జోలికి వస్తే తాట తీస్తా.!.. కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరీ సంచలన వ్యాఖ్యలు..

అదే విధంగా ప్రజలు మున్సిపల్ ఎన్నికల్లో సరైన విధంగా బుద్ది చెప్తారన్నారు. రేవంత్ రెడ్డి తాటాకు చప్పుళ్లకు, కేసులకు ఎవరు భయపడరని మాజీ మంత్రి హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. మరోవైపు హరీష్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసుల విచారణకు హజరవుతున్న నేపథ్యంలో పోలీసులు గట్టి బందోబస్తు చేపట్టారు. ఎక్కడ కూడా అవాంఛనీయ ఘటనలు జరక్కుండా భారీగా పోలీసుల్ని మోహరించారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Jan 20, 2026 05:09:05
Hyderabad, Telangana:

Dwipushkar Yoga Effect On Zodiac 2026: ప్రతి మంగళవారం హనుమంతుడి అంకితం చేస్తారు. ఇలా ప్రతి వారం ఒక్కొక్క దేవుడికి అంకితం చేస్తారు. అయితే ఈ సమయంలో చంద్రుడు మకర రాశి నుంచి కుంభరాశిలోకి సంచారం చేస్తాడు. దీనివల్ల కుజుడితోపాటు చంద్రుడి కలయిక జరుగుతుంది.. ప్రత్యేకమైన ధనయోగం ఏర్పడుతుంది. సూర్యుడు కుజుడు సంయోగం వల్ల ఆదిత్య మంగళ రాజయోగం కూడా ఏర్పడుతుంది. అలాగే శ్రవణా నక్షత్రం తర్వాత ధనిష్ట నక్షత్రంలో సర్వార్ధ సిద్దయోగం కూడా ఏర్పడుతుంది. దీంతోపాటు సిద్ది యోగం కూడా ఏర్పడుతుంది. 

ఇలా ప్రత్యేకమైన యోగాలు ఏర్పడడం కారణంగా ఈ సమయంలో ద్విపుష్కర యోగం కూడా ఏర్పడబోతోంది. దీనివల్ల ఈ సంవత్సరం మొదటి నెలలోనే కొన్ని రాశుల వారికి హనుమంతుడి అనుగ్రహం లభించబోతోంది. ముఖ్యంగా ఈ సమయంలో పురోగతి లభించడమే కాకుండా ప్రభుత్వ పనుల్లో ఆర్థికపరమైన విజయాలు సాధించగలుగుతారు. అలాగే దీర్ఘకాలికంగా పెట్టుబడింది పెట్టే వారికి ఈ సమయం చాలా అద్భుతంగా ఉండబోతోంది. 

ఈ రాశులవారికి బంపర్‌ ప్రయోజనాలు:
ఈరోజు నుంచి మేషరాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది.. హనుమంతుడి అనుగ్రహంతో వీరికి దౌత్యపరమైన విషయాల్లో అద్భుతమైన విజయాలు కలుగుతాయి.. ముఖ్యంగా సీనియర్ అధికారుల నుంచి మంచి సపోర్టు లభించబోతోంది. కెరీర్ పరంగా అనుకున్న పనులు చేసి అద్భుతంగా సెటిల్ అవుతారు. అలాగే పెండింగ్‌లో ఉన్న ఏదైనా పనులు కూడా ఈ సమయంలో పూర్తిచేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. తల్లిదండ్రుల మధ్య సంబంధాలు మరింత మెరుగుపడతాయి. 

మేషరాశి 

మిధున రాశి 

మిథున రాశిలో జన్మించిన వ్యక్తులకు కూడా మంగళవారం చాలా అద్భుతంగా ఉంటుంది.. వీరు ప్రత్యర్థులపై అద్భుతమైన విజయాలు సాధించగలుగుతారు. ఓర్పుతో ధైర్యంతో ఉండడం వల్ల మంచి ప్రయోజనాలు పొందుతారు. అలాగే మీపై శత్రువులు ఎన్ని అడ్డంకులు సృష్టించాలని చూసిన అద్భుతమైన లాభాలు పొందుతారు. ఆర్థికపరంగా చాలావరకు కలిసి రాబోతోంది. ఉద్యోగాలు చేస్తున్న వారికి మీ తోటి ఉద్యోగులతో సంబంధాలు మరింత మెరుగుపడి విశేషమైన ప్రయోజనాలు పొందుతారు.

కర్కాటక రాశి 

కర్కాటక రాశిలో జన్మించిన వ్యక్తులకు కూడా మంగళవారం రోజు నుంచి ఆదాయ వనరులు అద్భుతంగా పెరుగుతాయి. వ్యాపారవేత్తలకు ఈ సమయంలో మంచి ఆదాయం లభిస్తుంది. అలాగే ఈ సమయంలో ఇతరులనుంచి బహుమతులు కూడా పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఎలాంటి ప్రయత్నాలు చేసినా అద్భుతమైన లాభాలు పొందుతారు. ప్రభుత్వ రంగాల్లో పనులు చేయాలనుకుంటున్న వ్యక్తులు ఊహించని విజయాలు సాధించగలుగుతారు. ముఖ్యంగా కుటుంబ జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది.

కన్యారాశి 

ఈ మంగళవారం నుంచి కన్యా రాశి వారికి కూడా కెరీర్ పరంగా ఎంతో పురోగతి లభించబోతోంది. ముఖ్యంగా వీరు భారీ మొత్తంలో డబ్బులు సంపాదిస్తారు. వ్యాపారాలు చేస్తున్నవారు పెద్దపెద్ద ఒప్పందాలు కూడా కుదుర్చుకుంటారు. ముఖ్యంగా ఈ సమయంలో అదృష్టం సహకరించి అన్ని రకాల పనులు చేయగలుగుతారు. అలాగే కార్యాలయాల్లో ఉద్యోగాలు చేస్తున్న వ్యక్తులు ఈ సమయంలో అద్భుతమైన విజయాలు సాధిస్తారు. 

మీన రాశి 

మీన రాశిలో జన్మించిన వ్యక్తులకు కూడా ఈ సమయం అన్ని విధాలుగా శుభప్రదంగా ఉండబోతోంది. ముఖ్యంగా పెద్ద కోరికలు ఏవైనా వీరికి నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇల్లు లేదా కారు కొనుగోలు చేయాలనుకుంటున్న వ్యక్తులకు కెరీర్ పరంగా మెరుగుదల కనిపిస్తుంది. సామాజిక హోదా కూడా ఊహించని స్థాయిలో పెరుగుతుంది. సంపాదన కూడా ఊహించని స్థాయిలో పెరిగి అద్భుతమైన లాభాలు పొందుతారని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా వ్యాపారాలు అభివృద్ధి చెందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.

Also Read: Mercury Transit 2026: మకరంలో తిష్ట వేసిన బుధుడు.. ఈ రాశుల వారికి కోటీశ్వరులయ్యే యోగం ప్రారంభం!

 

Also Read: Mercury Transit 2026: మకరంలో తిష్ట వేసిన బుధుడు.. ఈ రాశుల వారికి కోటీశ్వరులయ్యే యోగం ప్రారంభం!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Jan 20, 2026 04:55:48
Hyderabad, Telangana:

Venus Effect On Zodiac 2026: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రుడిని సంపాదన ఆనందం, అదృష్టానికి సూచికగా భావిస్తారు. ఇలాంటి గ్రహం 2025 సంవత్సరం డిసెంబర్ 31వ తేదీన అస్తమించింది. అయితే ఈ ఏడాది ఫిబ్రవరి ఒకటో తేదీన శుక్రుడు మకర రాశిలో సక్రమ మార్గంలోకి రాబోతున్నాడు. ఏదైనా ఒక గ్రహం తీరుగమనం నుంచి సక్రమ మార్గంలోకి రావడం వల్ల జీవితంలో అద్భుతమైన మార్పులు సంభవిస్తాయి. ముఖ్యంగా దీని ప్రభావం అన్ని రాశుల వారిపై పడుతుంది. శుక్రుడి ప్రభావంతో కొన్ని రాశుల వారు అదృష్టవంతులు కూడా అవుతారు. అలాగే ఆర్థికంగా కూడా ఆయా రాసిన వారికి మేలు జరుగుతుంది. కెరీర్ పరంగా ఈ సమయంలో చాలా ముందుకు సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే శుక్రుడు సక్రమ మార్గంలోకి రావడం వల్ల ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఏ రాశుల వారికి ఎక్కువగా మేలు జరుగుతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ రాశులవారికి ఊహించని లాభాలు:
మిథున రాశి 

శుక్రుడు ఉదయించడం వల్ల ఎక్కువగా మిథున రాశి వారికి లాభాలు కలుగుతాయి. వీరికి ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఆత్మవిశ్వాసం ఊహించని స్థాయిలో పెరుగుతుంది. దీంతోపాటు సమాజంలో ఇమేజ్ కూడా విపరీతంగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొత్త సంబంధాలు ఏర్పడి మంచి పరిచయాలు కూడా పొందుతారు. అలాగే జీవితంలో వస్తున్న కొన్ని రకాల సమస్యలు ఎంతో సులభంగా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా డబ్బు సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్న వ్యక్తులకు ఈ సమయం అద్భుతమైన అవకాశాల అందిస్తుంది. చాలాకాలంగా ఆస్తుల్లో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్న వ్యక్తులకు ఇది అద్భుతమైన సమయం గా భావించవచ్చు. ఇక కుటుంబ సభ్యుల నుంచి కూడా ఈ సమయంలో శుభవార్తలు వినే సూచనలు కనిపిస్తున్నాయి. వైవాహిక జీవితంలో వస్తున్న సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు.

తులారాశి 
ఫిబ్రవరి ఒకటవ తేదీ నుంచి తులా రాశి వారికి కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా జీవితంలో కథ కొద్ది రోజుల నుంచి వస్తున్న ఎలాంటి సమస్యలైనా పరిష్కారం అవుతాయి.. అంతేకాకుండా ఆనందంతో పాటు శ్రేయస్సు విపరీతంగా పెరుగుతుంది. వీరు ఈ సమయంలో కొత్తగా కారు లేదా ఇతర ఆస్తులు కూడా కొనుగోలు చేయగలుగుతారు. అనుకుంటున్న పనులు వెంటవెంటనే చేసి భారీ మొత్తంలో డబ్బులు కూడా పొందగలుగుతారు. వ్యాపారాల్లో అనుకున్న లాభాలు కూడా పొంది ముందుకు సాగుతారు. తల్లిదండ్రులతో సంబంధాలు అద్భుతంగా మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా వీరు ఈ సమయంలో ఎంతో ఓపికతో సహనంతో పనిచేస్తే భారీ మొత్తంలో అదృష్టం సహకరించి ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఆందోళన కూడా పూర్తిగా తొలగిపోతుంది.

మకర రాశి 
శుక్రుడి ప్రభావంతో మకర రాశి వారికి కూడా ఎంతో మేలు జరుగుతుంది. ఈ సమయంలో వీరిపై వీరికి నమ్మకం పెరిగి కెరీర్ పరంగా ముందుకు సాగుతారు. అంతేకాకుండా పెద్దపెద్ద ఆఫర్లు కూడా పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగాల్లో స్థిరపడిన వ్యక్తులకు గౌరవం కూడా ఊహించని స్థాయిలో పెరుగుతుంది. అంతేకాకుండా పూర్వీకుల ఆస్తులు కూడా పొందగలుగుతారు. ఏదైనా బాధ పెట్టుబడుల నుంచి ఈ సమయంలో భారీ మొత్తంలో లాభాలు పొందుతారు. అలాగే చాలా కాలంగా నిలిచిపోయిన కొన్ని డబ్బులు కూడా తిరిగి వస్తాయి. ముఖ్యంగా ఇంట్లో అత్యంత శుభకరమైన వాతావరణం నెలకొంటుంది. మనశ్శాంతి కూడా విపరీతంగా పెరుగుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.

Also Read: Mercury Transit 2026: మకరంలో తిష్ట వేసిన బుధుడు.. ఈ రాశుల వారికి కోటీశ్వరులయ్యే యోగం ప్రారంభం!

 

Also Read: Mercury Transit 2026: మకరంలో తిష్ట వేసిన బుధుడు.. ఈ రాశుల వారికి కోటీశ్వరులయ్యే యోగం ప్రారంభం!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
HDHarish Darla
Jan 20, 2026 04:18:18
Hyderabad, Telangana:

8th Pay Commission Salary Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న 8వ వేతన సంఘం (8th Pay Commission) అమలుపై కీలక సమాచారం వెలువడింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణ ప్రక్రియలో జాప్యం జరుగుతున్నట్లు కనిపిస్తోంది. దీనివల్ల వెంటనే జీతాలు పెరగకపోయినా, భవిష్యత్తులో అందే బకాయిల (Arrears) రూపంలో భారీ లబ్ధి చేకూరనుంది.

1. అమలులో జాప్యం - కారణాలేంటి?
నియమ నిబంధనల ప్రకారం.. 8వ వేతన సంఘం జనవరి 1, 2026 నుండి అమలులోకి రావాలి. అయితే, ICRA నివేదిక ప్రకారం.. వేతన సంఘం తన తుది నివేదికను సమర్పించడానికి ఇంకా 15 నుండి 18 నెలల సమయం పట్టే అవకాశం ఉంది. దీనివల్ల 2026 ప్రారంభంలోనే జీతాల పెంపు ఉండకపోవచ్చు.

2. 15 నెలల బకాయిలు అందే ఛాన్స్!
అమలు ఆలస్యమైనప్పటికీ, ప్రభుత్వం దీనిని జనవరి 1, 2026 నుండి వర్తింపజేస్తే, ఉద్యోగులకు దాదాపు 15 నెలల కంటే ఎక్కువ కాలం నాటి బకాయిలు ఒకేసారి అందుతాయి. ఈ భారీ బకాయిల చెల్లింపు వల్ల 2028 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ జీతాల వ్యయం 40% నుండి 50% వరకు పెరిగే అవకాశం ఉందని అంచనా.

3. గత వేతన సంఘాల అనుభవాలు..
7వ వేతన సంఘం: కేవలం 6 నెలల బకాయిలతోనే ప్రభుత్వ వ్యయం 20% పెరిగింది.
6వ వేతన సంఘం: రెండున్నర ఏళ్ల జాప్యం కారణంగా ప్రభుత్వంపై దీర్ఘకాలిక ఆర్థిక ఒత్తిడి పడింది. ఇప్పుడు 8వ వేతన సంఘం విషయంలో కూడా అదే స్థాయి ఆర్థిక ప్రభావం ఉంటుందని ICRA విశ్లేషించింది.

4. ప్రభుత్వం తీసుకుంటున్న ముందస్తు జాగ్రత్తలు
భవిష్యత్తులో పెరిగే జీతాలు, పెన్షన్ల భారాన్ని తట్టుకోవడానికి ప్రభుత్వం ఒక వ్యూహాన్ని అనుసరిస్తోంది. 2027 ఆర్థిక సంవత్సరంలో మూలధన వ్యయాన్ని (Capital Expenditure) 14% పెంచి, సుమారు రూ. 13.1 లక్షల కోట్లకు చేర్చాలని ప్రభుత్వం భావిస్తోంది. తద్వారా వేతనాల భారం పడకముందే మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాజెక్టులను వేగవంతం చేయాలని చూస్తోంది.

5. ఉద్యోగులకు కలిగే ప్రయోజనం ఏంటి?
ప్రస్తుతానికి జీతాల పెంపు వాయిదా పడినట్లు కనిపించినా, అది రద్దు కాలేదని గుర్తుంచుకోవాలి. అమలు ఆలస్యమయ్యే కొద్దీ బకాయిల రూపంలో పెద్ద మొత్తం ఉద్యోగుల ఖాతాల్లో జమ అవుతుంది. అయితే, స్పష్టమైన ప్రకటన వచ్చే వరకు ఉద్యోగుల్లో కొంత అనిశ్చితి కొనసాగే అవకాశం ఉంది.

8వ వేతన సంఘం అమలు అనేది కేవలం వేతన సవరణ మాత్రమే కాదు, ఇది దేశ ఆర్థిక బడ్జెట్‌ను ప్రభావితం చేసే పెద్ద ప్రక్రియ. 2026 బడ్జెట్ ద్వారా ఈ విషయంలో ప్రభుత్వం మరింత స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది.

Also Read: Akshay Kumar Car Accident: హీరో అక్షయ్ కుమార్ కారుకు ఘోర ప్రమాదం..కారులో అక్షయ్, ట్వింకిల్..ఆటోని ఢీకొని గాల్లోకి అమాంతం!

ALso Read: Union Budget 2026: 8వ వేతన సంఘం జీతాల పెంపు..2026 కేంద్ర బడ్జెట్‌పై ప్రభావం ఎంత? ఉద్యోగుల కష్టాలు తీరేది ఎన్నడో?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
HDHarish Darla
Jan 20, 2026 03:02:11
Mumbai, Maharashtra:

Akshay Kumar Car Accident News: బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ కారు ప్రమాదానికి గురైంది. ఇప్పుడీ వార్త నెట్టింట కలకలం రేపుతోంది. ముంబైలో జరిగిన ఈ ఘటనలో అక్షయ్ దంపతులు తృటిలో పెను ముప్పు నుంచి తప్పించుకున్నారు. సోమవారం రాత్రి ముంబైలోని జుహు ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఎయిర్‌పోర్ట్ నుండి తన భార్య ట్వింకిల్ ఖన్నాతో కలిసి ఇంటికి తిరిగి వస్తుండగా అక్షయ్ కుమార్ ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదానికి గురైనట్లు సమాచారం.

అసలేం జరిగిందంటే?
రాత్రి 8:45 నుండి 9:00 గంటల సమయంలో ముంబైలోని జుహులోని గాంధీగ్రామ్ రోడ్డులో ఉన్న ఇస్కాన్ టెంపుల్ సమీపంలో అక్షయ్ కుమార్‌కు చెందిన మెర్సిడెస్ కారు ఒక ఆటో రిక్షాను బలంగా ఢీకొట్టింది. ఈ ఢీకొన్న వేగానికి ఆటో రిక్షా పూర్తిగా ధ్వంసమైంది. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో అక్షయ్ కుమార్, అతని భార్య ట్వింకిల్ ఖన్నాకు ఎటువంటి గాయాలు కాలేదు. వారు సురక్షితంగా బయటపడినట్లు తెలుస్తోంది.

ఆటో డ్రైవర్, అందులోని ప్రయాణికుడికి స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే వారిని సమీపంలోని క్రిటికల్ కేర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వారి ప్రాణాలకు ఎటువంటి ముప్పు లేదని సమాచారం.

రంగంలోకి పోలీసులు
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పెద్ద ఎత్తున చేరుకోవడంతో అక్కడ గందరగోళం నెలకొంది. సమాచారం అందుకున్న ముంబై పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రమాద సమయంలో కారు నడుపుతున్న డ్రైవర్‌ను పోలీసులు విచారిస్తున్నారు. ఇంకా దీనిపై అధికారికంగా ఎఫ్ఐఆర్ (FIR) నమోదు కాలేదు, కానీ దర్యాప్తు కొనసాగుతోంది.

ప్రమాదానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ఘటనపై అక్షయ్ కుమార్ ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు.

Also Read: Union Budget 2026: 8వ వేతన సంఘం జీతాల పెంపు..2026 కేంద్ర బడ్జెట్‌పై ప్రభావం ఎంత? ఉద్యోగుల కష్టాలు తీరేది ఎన్నడో?

Also Read: Rohit Sharma Doubtful: రోహిత్ శర్మ వన్డే కెరీర్‌కు ఎండ్ కార్డ్? గంభీర్ 'మిషన్ 2027'లో హిట్ మ్యాన్ ఉంటారా?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
RKRavi Kumar Sargam
Jan 19, 2026 17:07:33
Hyderabad, Telangana:

Harish Rao Phone Tapping Notice: సింగరేణి భూకుంభకోణం కేసులో కమీషన్లు, వాటాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు రేవంత్ రెడ్డి సరికొత్త డ్రామాకు తెరలేపాడని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ మండిపడ్డారు. రాజకీయ వేధింపులే కాంగ్రెస్ పార్టీ ఏకైక అజెండాగా మారిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎలాంటి పస లేదని.. అది కేవలం రాజకీయ కక్ష సాధింపు అని సాక్షాత్తూ సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పడమే కాకుండా కేసును కూడా కొట్టేసిందని మాజీ మంత్రి కేటీఆర్‌ గుర్తుచేశారు.

Also Read: Kavitha: తెలంగాణ రాజకీయాల్లోకి మళ్లీ ప్రశాంత్‌ కిశోర్‌.. కవిత పార్టీకి సేవలు

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో విచారణకు హాజరుకావాలని బీఆర్‌ఎస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు, మాజీ మంత్రి హరీశ్ రావుకు ఈడీ నోటీసులు ఇవ్వడంపై మాజీ మంత్రి కేటీఆర్‌ స్పందించారు. ఈ సందర్భంగా రేవంత్‌ రెడ్డి కుటిల బుద్ధిపై మండిపడ్డారు. 'అత్యున్నత న్యాయస్థానం తీర్పుతోనే ఈ డ్రామా ముగిసిపోయినా, మళ్లీ హరీష్ రావు గారికి నోటీసులు ఇవ్వడం చూస్తుంటే రేవంత్ రెడ్డి సర్కార్ ఎంత దిగజారిందో అర్థమవుతోంది' అని తెలిపారు.

Also Read: Viral Pic: ఈ 'స్టార్ యువకులకు వధువు కావలెను'.. పెళ్లి కాని యువకుల బ్యానర్ ఫొటో వైరల్‌

'రేవంత్ రెడ్డి బావమరిది సుజన్ రెడ్డి కి బొగ్గు గనుల కేటాయింపు కుంభకోణాన్ని ఈరోజు బయటపెట్టినందుకే.. దాని నుంచి ప్రజల దృష్టిని మళ్లించే 'డైవర్షన్ పాలిటిక్స్' తప్ప మరొకటి కాదు' అని మాజీ మంత్రి కేటీఆర్‌ ప్రకటించారు. 'హరీశ్‌ రావు తెలంగాణ ఉద్యమం నుంచి నేటి వరకు ప్రజల కష్టాల్లో తోడున్న నాయకుడు. అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడంలో కానీ, క్షేత్రస్థాయిలో ప్రజల పక్షాన నిలబడటంలో కానీ ఆయన చూపిస్తున్న చొరవను చూసి రేవంత్ రెడ్డికి వణుకు పుడుతోంది' మాజీ మంత్రి కేటీఆర్‌ విమర్శించారు.

Also Read: KTR Condemns: మతిభ్రమించిన రేవంత్ రెడ్డి.. అతడు సీఎం కావడం సిగ్గుచేటు: కేటీఆర్‌ ఆగ్రహం

'రాజకీయంగా హరీశ్‌ రావును ఎదుర్కోలేక ఇలాంటి తప్పుడు కేసులతో ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. 24 నెలలుగా రాష్ట్ర ముఖ్యమంత్రిని.. ఈ దారుణమైన పాలనను నిలదీస్తున్నందుకే హరీశ్‌ రావుని టార్గెట్ చేస్తూ ఈ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు' అని మాజీ మంత్రి కేటీఆర్‌ మండిపడ్డారు. మాకు చట్టంపై, న్యాయస్థానాలపై పూర్తి గౌరవం ఉందని.. ఏ విచారణకైనా సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. కానీ విచారణల పేరుతో, నోటీసులతో ప్రతిపక్ష గొంతు నొక్కాలని చూస్తే అది మీ భ్రమ మాత్రమేనని రేవంత్ రెడ్డిని మాజీ మంత్రి కేటీఆర్‌ ఎద్దేవా చేశారు. ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా.. ఎన్ని వేధింపులకు గురిచేసినా ప్రజల పక్షాన మిమ్మల్ని వేటాడడం ఆపేది లేదని కేటీఆర్‌ స్పష్టం చేశారు. రేవంత్‌ రెడ్డి వైఫల్యాలను ఎండగడుతూనే ఉంటాం, మిమ్మల్ని అడుగడుగునా ప్రశ్నిస్తూనే ఉంటామని కేటీఆర్‌ ప్రకటించారు. ఇలాంటి చౌకబారు బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని చెప్పారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
Jan 19, 2026 14:57:06
Narayanpur, Telangana:కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్గా 2013 వ బ్యాచ్కి చెందిన హరిత సోమవారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. కాగా జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వచ్చిన హరితను కలెక్టరేట్ అధికారులు, సిబ్బంది బొకేలతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్ హరిత సంబంధిత అధికారులతో సమావేశమై జిల్లా సమాచారాన్ని తెలుసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శిగా పనిచేసిన హరిత బదిలీపై కొమురం భీమ్ ఆసిఫాబాద్ కలెక్టర్గా రాగా ఇక్కడ పనిచేసిన వెంకటేష్ దోత్రే తెలంగాణ గ్రామీణ అభివృద్ధి సంస్థ సీఈవోగా వెళ్లారు. నూతన కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన హరిత జిల్లాలోని బడుగు బలహీన వర్గాలు, గిరిజనుల సమస్యలు పరిష్కరించాలని,మౌలిక వసతులు కల్పించాలని కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ప్రజలు కోరుకుంటున్నారు.
0
comment0
Report
Jan 19, 2026 13:40:39
Narayanpur, Telangana:మిషన్ భగీరథ పథకంలో భాగంగా ఎల్ అండ్ టి ఆధ్వర్యంలో పనిచేస్తున్న సిబ్బందికి ఐదు నెలల పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలని,లేనట్లయితే ఈనెల 23 నుంచి నిరవధిక సమ్మెకు వెళ్తామని ఏఐటియుసి కొమరం భీమ్ జిల్లా ఏ ఐ టి యు సి ప్రధాన కార్యదర్శి బి ఉపేందర్ స్పష్టం చేశారు. సోమవారం ఎల్ అండ్ టి సైట్ ఇంజనీర్ కు వినతి పత్రం ఇచ్చిన అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి ఇంటికి శుభ్రపరచిన నీరు వస్తుందంటే ఎల్ అండ్ టి కార్మికుల కృషి వల్లనే అని గుర్తించాల్సిన అవసరం ఉందని అన్నారు. వేతనాలు లేక కార్మికులు, కార్మికుల కుటుంబాలు పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఎల్ అండ్ టి యాజమాన్యం విభజించి పాలించు అనే విధంగా కాకుండా కార్మికులందరికీ వేతనాలు చెల్లించాలని కోరారు. అటు ప్రభుత్వం ఇటు ఎలాంటి యాజమాన్యం సౌర్యంతో నిర్ణయం తీసుకొని కార్మికుల వేతనాలతో పాటు ఇతర సమస్యలు తీర్చాలని కోరారు. ఇలాంటి యాజమాన్యం సానుకూలంగా స్పందించిందని 22 వరకు వేచి చూసి మరిన్ని ఆందోళన కార్యక్రమాలకు సిద్ధమవుతున్నామని అన్నారు.
0
comment0
Report
RKRavi Kumar Sargam
Jan 19, 2026 11:43:34
Hyderabad, Telangana:

Kavitha Prashant Kishor Meeting: తెలంగాణ రాజకీయాల్లోకి రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ మళ్లీ ఎంట్రీ ఇవ్వనున్నారని.. ఓ పార్టీకి వ్యూహ రచన చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయని.. అతడు తెలంగాణలో సేవలు చేయడం ఖాయంగా కనిపిస్తోంది. బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి బహిష్కరణకు గురయిన కవిత స్థాపించనున్న పార్టీకి పని చేస్తారని సమాచారం. ఆమె ఏర్పాటు చేసే పార్టీ కోసం పీకే పని చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. కవితతో కలిసి పని చేసేందుకు పీకే ఆసక్తి కనబరిచారని విశ్వసనీయ సమాచారం.

Also Read: Viral Pic: ఈ 'స్టార్ యువకులకు వధువు కావలెను'.. పెళ్లి కాని యువకుల బ్యానర్ ఫొటో వైరల్‌

రాజకీయ పార్టీ పెట్టేందుకు సిద్ధమవుతున్న కవితతో ప్రశాంత్‌ కిశోర్‌ ఇప్పటికే పలుమార్లు భేటీ అయినట్లు సమాచారం. రెండు నెలల వ్యవధిలో హైదరాబాద్‌కు వచ్చిన పీకే కవితతో సమావేశమైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే సంక్రాంతి పండుగ సందర్భంగా ఐదు రోజుల పాటు పీకేతో కవిత సమావేశమయ్యారు. తెలంగాణ ప్రజల కోసం  పార్టీ ఏర్పాటు.. ప్రజలు తమ పార్టీగా ఓన్ చేసుకోవడం.. ప్రజల కోణంలో ఎలా పని చేయాలనే అంశంపై పీకేతో కవిత చర్చించినట్లు సమాచారం.

Also Read: KTR Condemns: మతిభ్రమించిన రేవంత్ రెడ్డి.. అతడు సీఎం కావడం సిగ్గుచేటు: కేటీఆర్‌ ఆగ్రహం

కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు దిశగా కవిత ప్రయత్నాలు కొనసాగుతున్న క్రమంలో పీకేతో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రజల కోణంలో పార్టీ విధానాల రూపకల్పన కోసం ఇప్పటికే 50 కమిటీలు ఏర్పాటు చేసి కవిత అధ్యయనం చేస్తున్నారు. తెలంగాణ స్వీయ రాజకీయ అస్తిత్వ పరిరక్షణ కోసం పార్టీ ఏర్పాటు ప్రయత్నాల్లో కవిత వేగం పెంచారు. తాను ఏర్పాటు చేసే పార్టీ కోసం పీకేతో పని చేయాలని కవిత నిర్ణయించుకున్నారు. పలుమార్లు వీరిద్దరూ భేటీ అయి చర్చలు జరగ్గా.. కవితతో కలిసి పని చేసేందుకు పీకే ఆసక్తి కనబరిచినట్లు సమాచారం. గతంలో విజయవంతంగా అనేక పార్టీలకు రాజకీయ వ్యూహ రచన చేసిన ప్రశాంత్‌ కిశోర్‌ ఇటీవల బిహార్‌లో రాజకీయ పార్టీని స్థాపించి రాజకీయంగా పూర్తిగా విఫలమయ్యాడు. బిహార్‌ ఎన్నికల్లో ఘోరంగా విఫలమైన పీకే ఇప్పుడు కవితకు పని చేస్తుండడం గమనార్హం. మరి పీకే వ్యూహ రచనతో కవిత రాజకీయంగా ఎదుగుతారా? విజయం సాధిస్తారా? అనేది వేచి చూడాలి.

Also Read: Tomorrow Holiday: రేపు అన్నీ స్కూళ్లకు సెలవు.. బ్యాంకులకు కూడా! ఎందుకో తెలుసా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
HDHarish Darla
Jan 19, 2026 10:39:44
Hyderabad, Telangana:

Union Budget 8th Pay Commission: 8వ వేతన సంఘం (8th Pay Commission) అమలు కేవలం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాల పెంపునకు మాత్రమే పరిమితం కాకుండా, దేశ ఆర్థిక వ్యవస్థపై, ముఖ్యంగా కేంద్ర బడ్జెట్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. రేటింగ్ ఏజెన్సీ ICRA విశ్లేషణ ప్రకారం.. రాబోయే కేంద్ర బడ్జెట్ 2026పై అంచనాలు, ఆర్థిక పరిణామాలు ఎలా ఉండబోతున్నాయో వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఆశగా ఎదురుచూస్తున్న 8వ వేతన సంఘం అమలు ఇప్పుడు ఒక ప్రధాన ఆర్థిక చర్చగా మారింది. దీనివల్ల ప్రభుత్వ ఖజానాపై పడే భారం, బడ్జెట్ కేటాయింపుల్లో వచ్చే మార్పులను ఈ క్రింది అంశాల ద్వారా అర్థం చేసుకోవచ్చు.

1. 2026 బడ్జెట్‌లో వేతన సవరణ సాధ్యమేనా?
ICRA నివేదిక ప్రకారం.. 8వ వేతన సంఘం తుది నివేదిక రావడానికి ఇంకా 15 నుండి 18 నెలల సమయం పట్టే అవకాశం ఉంది. దీనివల్ల 2026-27 బడ్జెట్ నాటికి పూర్తిస్థాయి వేతన సవరణ అసంభవం అనిపిస్తోంది. అయితే, ఉద్యోగులు ఆశించే ఉపశమనంపై ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో ఏదైనా సంకేతం ఇస్తుందో లేదో వేచి చూడాలి.

2. బకాయిల భారం (Arrears Pressure)
ఒకవేళ వేతన సంఘం సిఫార్సులను పాత తేదీ (జనవరి 1, 2026) నుండి అమలు చేస్తే, ప్రభుత్వం భారీ మొత్తంలో బకాయిలను చెల్లించాల్సి ఉంటుంది. అమలులో జాప్యం జరిగితే, దాదాపు 15 నెలలకు పైగా పేరుకుపోయిన బకాయిలను ఒకేసారి చెల్లించడం వల్ల ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ఒత్తిడి పడుతుంది.

జీతాల వ్యయం: 2028 ఆర్థిక సంవత్సరం నాటికి జీతాలు, పెన్షన్ల వ్యయం 40-50% వరకు పెరిగే అవకాశం ఉందని అంచనా.

3. గత అనుభవాలు - ఒక హెచ్చరిక
7వ వేతన సంఘం బకాయిలు కేవలం 6 నెలలకే పరిమితమైనా, అప్పట్లో వేతన వ్యయం ఒక్క ఏడాదిలోనే 20% పెరిగింది.

అంతకు ముందు 6వ వేతన సంఘం అమలు జాప్యం వల్ల 2.5 ఏళ్ల బకాయిలు చెల్లించాల్సి వచ్చింది. దీనివల్ల వరుసగా రెండు మూడేళ్ల పాటు బడ్జెట్ కేటాయింపుల్లో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి.

4. ప్రభుత్వం తీసుకుంటున్న ముందస్తు చర్యలు
భవిష్యత్తులో పడే ఈ భారీ ఆర్థిక భారాన్ని తట్టుకోవడానికి ప్రభుత్వం ఒక వ్యూహాన్ని అనుసరిస్తోంది. వేతనాల భారం పడకముందే, అభివృద్ధి పనులకు ఆటంకం కలగకుండా 2027 ఆర్థిక సంవత్సరంలోనే మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు నిధులు కేటాయిస్తోంది. మూలధన వ్యయాన్ని 14% పెంచి, దాదాపు రూ. 13.1 లక్షల కోట్లకు చేర్చడం ద్వారా ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుకోవాలని చూస్తోంది.

ICRA విశ్లేషణ ప్రకారం.. 8వ వేతన సంఘం అనేది కేవలం ఉద్యోగుల జీతాల పెంపు మాత్రమే కాదు, ఇది రాబోయే సంవత్సరాల్లో ప్రభుత్వ వ్యయ ప్రాధాన్యతలను మార్చే ఒక ప్రధాన ఆర్థిక కార్యక్రమం. 2026 బడ్జెట్ ఈ ప్రక్రియకు ఒక పునాదిలా మారనుంది.

(గమనిక: ఈ సమాచారం కేవలం విశ్లేషణల ఆధారంగా అందించబడింది. ఖచ్చితమైన వివరాల కోసం అధికారిక ప్రభుత్వ ఉత్తర్వులను అనుసరించండి. దీన్ని జీ తెలుగు న్యూస్ ధ్రువీకరించడం లేదు.)

Also Read: Rohit Sharma Doubtful: రోహిత్ శర్మ వన్డే కెరీర్‌కు ఎండ్ కార్డ్? గంభీర్ 'మిషన్ 2027'లో హిట్ మ్యాన్ ఉంటారా?

Also Read: School Holiday: విద్యార్థులకు మరో గుడ్‌న్యూస్..తెలంగాణలో వరుసగా 4 రోజులు సెలవులు..ఎప్పటి నుంచి ఎప్పటివరకు?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
RKRavi Kumar Sargam
Jan 19, 2026 10:06:31
Irala, Andhra Pradesh:

Unmarried Youth Banner: పండుగ, ఉత్సవాలు ఉంటే శుభకాంక్షలు చెబుతూ బ్యానర్లు వెలుస్తుంటాయి. రాజకీయ నాయకులు, యువజన సంఘాలు తదితర వారు బ్యానర్లు ప్రదర్శిస్తుంటారు. అయితే ఓ జాతరలో వినూత్నంగా.. తమ కష్టాలు చెబుతూ పెళ్లి కాని ప్రసాదుల బ్యానర్‌ వెలిసింది. వీరంతా స్టార్‌ యువకులకు వధువు కావలెను అని పెట్టి బ్యానర్ ప్రదర్శించడం ఆసక్తికరంగా మారింది. అమ్మాయి కోసం వారు వేసిన బ్యానర్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సంఘటన ఏపీలో జరిగింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

Also Read: KTR Condemns: మతిభ్రమించిన రేవంత్ రెడ్డి.. అతడు సీఎం కావడం సిగ్గుచేటు: కేటీఆర్‌ ఆగ్రహం

చిత్తూరు జిల్లా ఐరాల మండలం కలికిరిపల్లి గ్రామంలో సంక్రాంతి పండుగ ఆనందోత్సాహాలతో జరిగింది. పండుగ సందర్భంగా నిర్వహించిన పశువుల పండుగలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన యువకులు ఒక భారీ బ్యానర్ ఏర్పాటుచేశారు. సంప్రదాయ శుభాకాంక్షలకు భిన్నంగా గ్రామంలోని యువకులు తమ ఫొటోలన్నింటినీ ముద్రించి.. 'ముఖ్య గమనిక స్టార్ యువకులకు వధువు కావలెను' అని పెద్ద అక్షరాలతో బ్యానర్ కట్టేశారు.

Also Read: Tomorrow Holiday: రేపు అన్నీ స్కూళ్లకు సెలవు.. బ్యాంకులకు కూడా! ఎందుకో తెలుసా?

దాదాపు 30 మందికి పైగా యువకుల ఫొటోలతో కూడిన ఈ పేద్ద బ్యానర్ చూసి జనం ఆసక్తిగా గమనిస్తున్నారు. ఇప్పుడు పిల్లని ఇచ్చేవారి కోసం కుర్రాళ్లు ఇలా ఫ్లెక్సీలు వేసుకున్నారు. ఈ సరదా బ్యానర్ వెనుక ఒక బలమైన సామాజిక సందేశం దాగి ఉందని ఊరి పెద్దలు చెబుతున్నారు. 'మా కుర్రాళ్లంతా సాఫ్ట్‌వేర్ ఉద్యోగస్తులే. వయసు కూడా మించిపోలేదు. కానీ పెళ్లిళ్ల దగ్గరకు వచ్చేసరికి అబ్బాయికి కారు ఉందా? విమానం ఉందా? రైలు ఉందా?' అని అడుగుతున్నట్లు గ్రామ పెద్దలు చెప్పారు. ఇది సరైన పద్ధతి కాదు  అని వధువు తరఫు వారికి హితవు పలికారు. ఆస్తులు, హోదాలు చూసి పెళ్లిళ్లు చేయడం మానేయాలని విజ్ఞప్తి చేశారు. మానవత్వాన్ని, మనిషి గుణాన్ని చూడాలని ఆడపిల్లల తల్లిదండ్రులకు సూచించారు.

Also Read: Women Dress: మహిళలు ఏం ధరించాలి? సనాతన ధర్మం చెబుతోంది తెలుసా?

కనుమ పండుగ సందర్భంగా కట్టిన ఈ బ్యానర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.  ఊర్లో కూడా ఇలాంటి బ్యానర్ కట్టాలి అంటూ బ్యాచిలర్స్ కామెంట్స్ చేస్తున్నారు. కలికిరిపల్లి యువకుల ప్రయత్నం నవ్వులు పూయించడమే కాదు, నేటి వివాహ వ్యవస్థలోని లోపాలను కూడా ఎత్తిచూపుతోంది. ఇలా బ్యానర్‌ కట్టాల్సిన పరిస్థితి ఏర్పడడం చూస్తుంటే యువకుల పెళ్లి కష్టాలు ఎలా ఉన్నాయో అర్థమవుతోంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
HDHarish Darla
Jan 19, 2026 09:40:51
Hyderabad, Telangana:

Rohit Sharma Doubtful In ODI World Cup: న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో భారత మాజీ కెప్టెన్, స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ ఘోరంగా విఫలమవ్వడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మూడు మ్యాచ్‌ల్లో కలిపి కేవలం 61 పరుగులు మాత్రమే చేయడంతో, 2027 వన్డే ప్రపంచ కప్‌లో ఆయన స్థానంపై నీలి నీడలు కమ్ముకున్నాయి.

టీ20, టెస్ట్ క్రికెట్‌కు ఇప్పటికే వీడ్కోలు పలికిన రోహిత్ శర్మ, ప్రస్తుతం కేవలం వన్డే ఫార్మాట్‌పైనే దృష్టి పెట్టారు. అయితే, తాజా సిరీస్‌లో ఆయన ప్రదర్శన నిరాశపరచడం అభిమానుల్లో ఆందోళన కలిగిస్తోంది.

గౌతమ్ గంభీర్ ప్లాన్ ఏంటి?
కోచ్ గంభీర్ ఎప్పుడూ కుర్రాళ్లకు అవకాశాలు ఇవ్వాలని మొగ్గు చూపుతుంటారు. 2027 ప్రపంచ కప్ నాటికి జట్టును యువతతో నింపాలని ఆయన భావిస్తున్నారు. రోహిత్ వయస్సు రీత్యా ఆయన ఫిట్‌నెస్, ఫామ్‌ను గంభీర్ నిశితంగా గమనిస్తున్నారు. గిల్ సారథ్యంలో కొత్త తరం జట్టును నిర్మించే క్రమంలో సీనియర్లను పక్కన పెట్టే సాహసం గంభీర్ చేస్తారా అనేది ఇప్పుడు ఆసక్తికరం.

విరాట్ వర్సెస్ రోహిత్..
న్యూజిలాండ్ సిరీస్‌లో విరాట్ కోహ్లీ తన ఫామ్‌ను నిలబెట్టుకోగా, రోహిత్ మాత్రం తడబడ్డారు. గతంలో దక్షిణాఫ్రికా సిరీస్‌లో ఇద్దరూ రాణించి విమర్శలకు సమాధానం ఇచ్చారు. కానీ ఇప్పుడు రోహిత్ వరుసగా విఫలమైతే, గంభీర్ కఠిన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

రోహిత్ ఎందుకు అవసరం?
2027 ప్రపంచ కప్ దక్షిణాఫ్రికా వేదికగా జరగనుంది. దక్షిణాఫ్రికాలోని వేగవంతమైన పిచ్‌లపై రోహిత్ శర్మకు ఉన్న అనుభవం, ఆయన ఆడే 'పుల్ షాట్లు' జట్టుకు ప్లస్ పాయింట్ అవుతాయి. రోహిత్ క్రీజులో ఉంటే ప్రత్యర్థి బౌలర్లకు ఉండే భయం అంతా ఇంతా కాదు. ఈ కోణంలో చూస్తే ఆయన అనుభవం జట్టుకు ఎంతో అవసరం.

ప్రత్యామ్నాయం ఎవరు?
ఒకవేళ రోహిత్ శర్మ జట్టులో లేకపోతే, ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు యశస్వి జైస్వాల్ సిద్ధంగా ఉన్నారు. యువ ఆటగాడైన జైస్వాల్ తన దూకుడైన ఆటతీరుతో ఇప్పటికే అందరి దృష్టిని ఆకర్షించారు. రోహిత్ స్థానంలో ఓపెనర్‌గా జైస్వాల్‌ను సిద్ధం చేయాలనే ఆలోచనలో కూడా మేనేజ్‌మెంట్ ఉన్నట్లు తెలుస్తోంది.

తదుపరి అవకాశం ఎప్పుడు?
ప్రస్తుతానికి టీమిండియాకు వన్డే మ్యాచ్‌లు లేవు. ఐపీఎల్ 2026 ముగిసిన తర్వాతే వన్డే సిరీస్‌లు ప్రారంభమవుతాయి. అప్పుడు లభించే అవకాశాలను రోహిత్ సద్వినియోగం చేసుకోకపోతే, సెలెక్టర్లు కచ్చితంగా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తారు.

Also Read: ICC Ultimatum To Bangladesh: టీ20 వరల్డ్‌కప్ నుంచి బంగ్లాదేశ్‌ ఔట్..ఐసీసీ వార్నింగ్ ఇచ్చినా మారలేదు..అతిచేస్తే జరిగేది ఇదే!

Also REad; Bangladesh T20 World Cup: భారత్‌లో ఆడేందుకు బంగ్లాదేశ్ నో! షాక్ ఇచ్చిన ఐర్లాండ్..నాగిణిలకు దెబ్బ మీద దెబ్బ!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
HDHarish Darla
Jan 19, 2026 08:11:58
Keraniganj, Dhaka Division:

ICC Ultimatum To Bangladesh Update: 2026 టీ20 ప్రపంచకప్ ఆతిథ్యంపై నెలకొన్న సందిగ్ధత ఇప్పుడు క్లైమాక్స్‌కు చేరుకుంది. భద్రతా కారణాల సాకుతో భారత్‌లో ఆడేందుకు నిరాకరిస్తున్న బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB)కు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) గట్టి హెచ్చరిక జారీ చేసింది.

భారత్, శ్రీలంక వేదికలుగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్ పాల్గొనడంపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ విషయంలో ఐసీసీ తన వైఖరిని స్పష్టం చేస్తూ, నిర్ణయం తీసుకోవడానికి జనవరి 21ని ఆఖరి తేదీగా (Deadline) నిర్ణయించింది.

వివాదం ఎక్కడ మొదలైంది?
ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) జట్టు నుంచి బంగ్లా పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్‌ను తొలగించాలనే బీసీసీఐ నిర్ణయం తర్వాత రెండు బోర్డుల మధ్య విభేదాలు మొదలయ్యాయి. దీనికి తోడు రాజకీయ పరిస్థితులను సాకుగా చూపిస్తూ, భారత్‌లో ఆడితే తమ ఆటగాళ్లకు భద్రత ఉండదని బంగ్లాదేశ్ వాదిస్తోంది.

ఐసీసీ మీటింగ్‌లో కీలక అంశాలు:
వేదిక మార్పు కుదరదు: తమ గ్రూప్ మ్యాచ్‌లను భారత్ నుంచి శ్రీలంకకు మార్చాలన్న బంగ్లాదేశ్ విన్నపాన్ని ఐసీసీ తోసిపుచ్చింది. ముందుగా నిర్ణయించినట్లు కోల్‌కతా, ముంబైలలోనే మ్యాచ్‌లు ఆడాలని స్పష్టం చేసింది. ఐర్లాండ్‌తో గ్రూప్ మార్చుకుంటామన్న ప్రతిపాదనను కూడా ఐసీసీ తిరస్కరించింది. భారత్‌లో బంగ్లాదేశ్ జట్టుకు ఎటువంటి ముప్పు లేదని, పూర్తి స్థాయి భద్రత కల్పిస్తామని ఐసీసీ హామీ ఇచ్చింది.

బంగ్లాదేశ్ తప్పుకుంటే ఏమవుతుంది?
జనవరి 21లోపు బంగ్లాదేశ్ తన నిర్ణయాన్ని వెల్లడించకపోతే, ఐసీసీ కఠిన చర్యలకు సిద్ధమవుతోంది. బంగ్లాదేశ్ స్థానంలో ఐసీసీ ర్యాంకింగ్స్ ప్రకారం స్కాట్లాండ్ జట్టును ప్రపంచకప్‌లోకి తీసుకునే అవకాశం ఉంది.

మరోవైపు, బంగ్లాదేశ్‌కు మద్దతుగా పాకిస్తాన్ కూడా తన భాగస్వామ్యంపై ఆలోచిస్తామని ప్రకటించడం గమనార్హం. ఒకవేళ శ్రీలంక వీలుకాకపోతే బంగ్లాదేశ్ మ్యాచ్‌లను తమ దేశంలో (పాకిస్తాన్) నిర్వహించడానికి సిద్ధమని పీసీబీ ప్రతిపాదించింది.

వచ్చే 48 గంటలు బంగ్లాదేశ్ క్రికెట్ భవిష్యత్తుకు అత్యంత కీలకం. ఐసీసీ హెచ్చరికకు తలొగ్గి భారత్‌కు వస్తారా? లేక ప్రతిష్టాత్మక ప్రపంచకప్ నుంచి తప్పుకుంటారా? అన్నది ఇప్పుడు క్రీడా లోకంలో హాట్ టాపిక్‌గా మారింది.

Also Read: School Holiday: విద్యార్థులకు మరో గుడ్‌న్యూస్..తెలంగాణలో వరుసగా 4 రోజులు సెలవులు..ఎప్పటి నుంచి ఎప్పటివరకు?

Also REad: Dmart Business Model: డీమార్ట్‌ ఆఫర్ల వెనుక ఎవ్వరికీ తెలియని సీక్రెట్స్..తక్కువ ధరకే సరుకులు అమ్మడానికి కారణం ఇదే!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
BBhoomi
Jan 19, 2026 07:59:55
Secunderabad, Telangana:

Union Budgets 2026: జనవరి నెల పూర్తవ్వడానికి వస్తుంది. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాల సవరణ అమల్లోకి రాలేదు. దీంతో 8వ వేతన సంఘం అమలు ఆలస్యం అవుతుందన్న విషయం స్పష్టమవుతోంది. రేటింగ్ సంస్థ ఐసీఆర్ఏ తాజాగా విడుదల చేసిన నివేదికలో ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ.. ఈ జాప్యం వల్ల కేంద్ర ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థపై గణనీయమైన ప్రభావం పడే ఛాన్స్ ఉందని హెచ్చరించింది. ముఖ్యంగా వేతన సంఘ సిఫార్సులు చివరకు జనవరి 1నుంచి అమలు చేస్తే ఆ ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందని పేర్కొంది. 

సాధారణంగా కేంద్ర వేతన సంఘాలు ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి అమల్లోకి వస్తాయి. అదే విధంగా  7వ వేతన సంఘం జనవరి 1, 2016 నుంచి అమలులోకి వచ్చిన నేపథ్యంలో.. 8వ వేతన సంఘం కూడా జనవరి 2026 నుంచే అమల్లోకి వస్తుందని చాలా కాలంగా భావించారు. అయితే, ప్రస్తుతం కమిషన్ తన నివేదికను సమర్పించేందుకు ఇంకా 15 నుంచి 18 నెలల సమయం పట్టే అవకాశం ఉందని ఐసీఆర్‌ఏ వెల్లడించింది. దీనివల్ల సమీప భవిష్యత్తులో జీతాల సవరణ జరగడం అసాధ్యమని సంస్థ అభిప్రాయపడింది. ఈ విషయాన్ని ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్ నివేదిక కూడా ప్రస్తావించింది.

ఐసీఆర్‌ఏ రూపొందించిన ఈ విశ్లేషణను బడ్జెట్ 2026–27పై ఇచ్చిన అవుట్‌లుక్‌లో చేర్చారు. దాని ప్రకారం, 8వ వేతన సంఘం వల్ల కేంద్ర ప్రభుత్వంపై పడే ఆర్థిక భారం తక్షణం కాకుండా 2028 ఆర్థిక సంవత్సరంలోనే స్పష్టంగా కనిపించే అవకాశం ఉంది. ఒకసారి సిఫార్సులు అమలులోకి వస్తే జీతాలు, పెన్షన్లపై ప్రభుత్వ ఖర్చు భారీగా పెరుగుతుందని, ఇది ఆర్థిక స్థిరత్వంపై ఒత్తిడిని పెంచుతుందని అంచనా వేస్తున్నారు.అయితే, వేతన సంఘం అమలు ఎప్పుడు జరిగినా ప్రభుత్వం దానిని జనవరి 1, 2026 నుంచి వెనుకటి తేదీ నుంచి అమలు చేసే అవకాశమే ఎక్కువగా ఉందని ఐసీఆర్‌ఏ భావిస్తోంది. అలా జరిగితే, కనీసం 15 నెలలు లేదా అంతకంటే ఎక్కువ కాలానికి సంబంధించిన బకాయిలను ఒకేసారి చెల్లించాల్సి వస్తుంది. ఇది ప్రభుత్వ ఖజానాపై ఒక్కసారిగా భారీ భారం మోపుతుంది. ఐసీఆర్‌ఏ అంచనా ప్రకారం, ఈ కారణంగా 2028 ఆర్థిక సంవత్సరంలో జీతాల వ్యయం 40 నుంచి 50 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది.

గత అనుభవాలను ఉదాహరణగా తీసుకుంటే, బకాయిల పరిమాణం బడ్జెట్‌పై ఎంత ప్రభావం చూపుతుందో స్పష్టంగా తెలుస్తుంది. 7వ వేతన సంఘం అమలు సమయంలో బకాయిలను కేవలం ఆరు నెలలకు మాత్రమే పరిమితం చేసినప్పటికీ, ఒకే ఏడాదిలో జీతాల వ్యయం 20 శాతానికి పైగా పెరిగింది. దీనికి భిన్నంగా, 6వ వేతన సంఘం అమలులో జాప్యం ఎక్కువగా ఉండటంతో బకాయిలు రెండున్నర సంవత్సరాలకు మించి పేరుకుపోయాయి. దీని వల్ల అనేక సంవత్సరాల పాటు ప్రభుత్వంపై నిరంతర ఆర్థిక ఒత్తిడి కొనసాగింది.

Also Read: Pension: తమ సంబంధాన్ని ఎప్పుడూ దాచలేదు..లివ్‌-ఇన్‌-పార్ట్‌నెర్‌కు పెన్షన్ ఇవ్వాల్సిందే.. కేంద్రానికి హైకోర్టు ఆదేశాలు..!

రాబోయే కాలంలో జీతాలు, పెన్షన్ల భారం వల్ల వచ్చే ప్రభావాన్ని కొంత మేర తగ్గించేందుకు ప్రభుత్వం 2027 ఆర్థిక సంవత్సరంలో మూలధన వ్యయాన్ని ముందుగానే పెంచే అవకాశం ఉందని ఐసీఆర్‌ఏ అంచనా వేస్తోంది. ఈ నివేదిక ప్రకారం, మూలధన వ్యయం దాదాపు 14 శాతం పెరిగి సుమారు రూ. 13.1 లక్షల కోట్లకు చేరుకోవచ్చు. దీని ద్వారా మౌలిక సదుపాయాలు, అభివృద్ధి ప్రాజెక్టులు కొనసాగుతూనే, ఆర్థిక స్థలం కొంత సమతుల్యంగా ఉండే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల దృష్టిలో చూస్తే, ఈ ఆలస్యం అంటే జీతాల పెంపు రద్దు అయినట్టు కాదు, కేవలం వాయిదా పడినట్టే. చివరకు వేతన సంఘం అమలులోకి వచ్చినప్పుడు భారీ మొత్తంలో బకాయిలు అందుకునే అవకాశం ఉన్నప్పటికీ, ఈ దీర్ఘకాలిక నిరీక్షణ ఉద్యోగుల్లో అనిశ్చితిని పెంచుతోంది. మరోవైపు, ప్రభుత్వానికి బడ్జెట్ ప్రణాళిక రూపొందించడాన్ని మరింత క్లిష్టంగా మారుస్తోంది.

ఐసీఆర్‌ఏ అంచనా ప్రకారం 8వ కేంద్ర వేతన సంఘం ఇకపై ఒక సాధారణ జీత సవరణ ప్రక్రియగా మాత్రమే ఉండదు. ఇది కేంద్ర ప్రభుత్వ వ్యయ ప్రాధాన్యతలను తిరిగి నిర్వచించే స్థాయికి చేరుకుని.. రాబోయే సంవత్సరాల్లో వరుసగా వచ్చే కేంద్ర బడ్జెట్‌లపై కూడా గణనీయమైన ప్రభావం చూపించే ప్రధాన ఆర్థిక పరిణామంగా మారే అవకాశం ఉందని నివేదిక స్పష్టం చేస్తోంది.

Also Read: Yogi Adityanath: అంతా టీచరే చేశారు.. యోగి బాల్డ్ హెడ్‌కి కారణం తెలుసుకుంటే మైండ్ బ్లాక్‌ అవుతుంది.. ఓసారి ఈ యూపీ సీఎం బాల్యంలోకి తొంగిచూద్దామా?

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
Advertisement
Back to top