icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

Govt Scheme: ప్రధాని MODI అదిరిపోయే Scheme... జేబులో పైసా లేకున్నా రూ. 20 లక్షల Loan పొందే ఛాన్స్.. ఎలా అప్లయ్ చేసుకోవాలంటే..?

BBhoomi45m ago
Secunderabad, Telangana:

pradhan mantri mudra yojana: ప్రపంచంలోనే అతిపెద్ద సోషల్ వెల్ఫేర్ స్కీమ్ గా ముద్ర యోజన స్కీమ్ ఆదరణ పొందింది.  ముఖ్యంగా ముద్ర యోజన స్కీం ద్వారా ప్రతి ఏడాది దాదాపు లక్షలాది మంది యువత ఎలాంటి గ్యారెంటీ లేకుండానే బ్యాంకుల నుంచి లోన్ పొందుతున్నారు.  ముద్రా యోజన స్కీం ద్వారా కొత్తగా వ్యాపారం చేసేవారు కావచ్చు.. అలాగే ఉన్న వ్యాపారాన్ని మరింత అభివృద్ధి చేసుకోవాలి అనుకునే వారు కూడా ఈ స్క్రీన్ ద్వారా లబ్ధి పొందే అవకాశం ఉంటుంది.

కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మక ప్రవేశపెట్టిన స్కీం ఏదైనా ఉందంటే అది ప్రధానమంత్రి ముద్ర యోజన స్కీమ్ అనే చెప్పాలి. ఈ స్కీం కింద ఇప్పటికే దాదాపు 50 కోట్లకు మంది పైగా లబ్ధిదారులు దేశవ్యాప్తంగా లబ్ధి పొందుతున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద సోషల్ వెల్ఫేర్ స్క్రీన్ గా ఈ ముద్రా యోజన స్కీమ్. భావిస్తున్నారు. ముఖ్యంగా ముద్రా యోజన స్కీం ద్వారా ప్రతి ఏడాది దాదాపు లక్షలాది మంది యువత ఎలాంటి గ్యారెంటీ లేకుండా బ్యాంకుల నుంచి లోన్ తీసుకుంటున్నారు. ముద్ర యోజన స్కీం ద్వారా కొత్తగా బిజినెస్ చేయాలనుకునే వాళ్ళు కావచ్చు లేదంటే ఉన్న వ్యాపారాన్ని మరింత విస్తరించుకోవాలనుకునేవారు కావచ్చు ఈ లోన్ ద్వారా లబ్ధి పొందే అవకాశం ఉంటుంది.

ముద్ర యోజన స్కీం ద్వారా మీరు మీ సమీపంలో ఉన్నటువంటి ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకు నుంచి కూడా లోన్స్ ఎలాంటి తాకట్టు లేకుండానే పొందే అవకాశం ఉంటుంది. ఈ స్కీమ్ ద్వారా మీరు బిజినెస్ ప్రారంభించాలి అనుకున్నట్లయితే మీకు గరిష్టంగా 20 లక్షల రూపాయల వరకు లోన్ అందిస్తారు.   దీనిలో మొత్తం మూడు కేటగిరీలో లోన్స్ అందిస్తారు.  కొత్తగా చిన్న వ్యాపారం ప్రారంభించే వారికి శిశు రుణాల కేటగిరిలో భాగంగా 50 వేల రూపాయల వరకు లోన్ పొందవచ్చు.  కిషోర్ కేటగిరీలో 5 లక్షల వరకు లోన్స్ పొందవచ్చు.  దీనిలో ముఖ్యంగా ఇప్పటికే ఉన్న వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పాలి. 

ఇక తరుణ్ కేటగిరి విషయానికి వచ్చినట్లయితే 5 లక్షల రూపాయల కంటే ఎక్కువగా 10 లక్షల లోపు రుణాలు పొందే ఛాన్స్ ఉంటుంది. ఇది స్థిరపడిన వ్యాపారాన్ని మరింత విస్తరింప చేయాలనుకునే వారికి ఎంతోగానో ఉపయోగపడుతుందని చెప్పాలి. అలాగే తరుణ్ ప్లస్ స్కీం కింద 10 లక్షల కంటే ఎక్కువగా అంటే 20 లక్షల వరకు లోన్స్ పొందే ఛాన్స్ ఉంటుంది. గతంలో తరుణ్ లోన్స్ తీసుకుని సకాలంలో చెల్లించిన వారికి ఈ లోన్స్ ఈజీగా అందిస్తారు. అయితే ఇప్పటివరకు గమనించినట్లయితే దేశవ్యాప్తంగా దాదాపు 40 లక్షల కోట్ల రూపాయలు ఈ లోన్స్ కింద మంజూరు అయ్యాయి. దీనిలో దాదాపు 70% మంది మహిళలే ఉండటం విశేషమని చెప్పాలి.

 ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాలకు చెందిన వారికి సుమారు 50% వరకు లోన్స్ అందిస్తున్నారు. సుమారు 12 కోట్ల మంది మొదటిసారిగా వ్యాపారంలో ప్రవేశించేందుకు ఈ లోన్స్ ఎంతగానో ఉపయోగపడ్డాయి. లోన్స్ తిరిగి చెల్లించే స్కీములో ఇది అగ్రస్థానంలో ఉందని చెప్పాలి. కేవలం 2.3 శాతం  మొండి బాకీలు మాత్రమే ఇందులో ఉన్నాయి. ముద్ర లోన్స్ పొందేందుకు మీ సమీపంలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్, గ్రామీణ, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులకు కూడా వెళ్ళవచ్చు.

 మీరు కేంద్ర ప్రభుత్వం అధికారిక ఉద్యమ్ మిత్ర పోర్టల్ లేదా జన సమర్థ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో ఈజీగా దరఖాస్తు చేసుకోవచ్చు. మీ దగ్గరలో ఉన్నటువంటి బ్యాంకు శాఖను సందర్శించి ముద్ర లోన్ అప్లికేషన్ ఫారం సమర్పించడంతో పాటు ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటర్ ఐడి, అలాగే బిజినెస్ ప్లాన్ కు సంబంధించి ప్రాజెక్ట్ రిపోర్ట్ అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అందించాల్సి ఉంటుంది. లోన్ మంజూరైన తర్వాత మీకు ముద్రకార్డు రూపంలో డిబేట్ కార్డ్ అందిస్తారు. దీని ద్వారా మీరు ఎప్పుడు అవసరమైతే అప్పుడు డబ్బులు ఉపయోగించుకునే ఛాన్స్ ఉంటుంది. మీరు ఎంత డబ్బు వాడుకుంటారో దానిపై మాత్రమే వడ్డీ పడుతుంది. 

Also Read: చేవేళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి చేస్తున్న ఈ క్రేజీ బిజినెస్

Also Read:  Business Ideas 2026: ఉద్యోగం వెతుక్కోవడంలో విసిగిపోయారా? 

Also Read:  Business Ideas: మోదీ సర్కార్ అందిస్తున్న రూ.5 లక్షల లోన్‎ తీసుకుని

Also Read:  కేంద్రంలోని మోదీ సర్కార్ అందించే రూ. 10లక్షలతో ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తే

Disclaimer: ఈ కథనంలో పొందుపరిచిన సమాచారం కేవలం సాధారణ అవగాహన కోసం మాత్రమే. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టుబడి, ఆర్థిక, వ్యాపార లేదా న్యాయ సలహాగా పరిగణించరాదు. ఇందులోని వివరాలు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా సేకరించబడ్డాయి. సమాచార ఖచ్చితత్వంపై జీ తెలుగు న్యూస్ ఎలాంటి హామీ ఇవ్వదు. ఈ సమాచారాన్ని ఆధారంగా చేసుకుని తీసుకునే పెట్టుబడి లేదా ఇతర ఆర్థిక నిర్ణయాలకు సంబంధించి కలిగే లాభనష్టాలకు పూర్తిగా పాఠకులే బాధ్యులు. ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు అర్హత కలిగిన ఆర్థిక సలహాదారులను సంప్రదించడం మంచిది.

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Students Jackpot: విద్యార్థులకు భారీ శుభవార్త.. స్కూళ్ల ప్రారంభం రోజే అద్భుత పథకానికి శ్రీకారం

Baddipadaga, Telangana:

Telangana Govt Breakfast Scheme: పాఠశాల విద్యార్థులతోపాటు కళాశాల విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం భారీ శుభవార్త వినిపించింది. ప్రభుత్వ విద్యాలయాలకు వచ్చే పేద విద్యార్థుల కోసం ఉచితంగా అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ పథకాన్ని విద్యాలయాల పునఃప్రారంభం రోజు నుంచి ప్రారంభించనుంది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఈ పథకాన్ని జూన్‌ 15వ తేదీ నుంచి అంటే సోమవారం నుంచి ప్రారంభించేందుకు చర్యలు చేపడుతోంది.

విద్యా వ్యవస్థ బలోపేతంపై తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. విద్యా సంవత్సరం ప్రారంభమవుతుండడంతో విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు వినిపించింది. విద్యార్థులకు పాఠశాల, కళాశాలల ఆవరణల్లో ఉదయం టిఫిన్‌ అందించడమే కాకుండా మధ్యాహ్న భోజనం అందించనుంది. అంతేకాకుండా పాలు లేదా రాగిజావ ఇవ్వాలని కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇదివరకు పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం మాత్రమే అందించేవారు. ఇప్పుడు టిఫిన్‌ కూడా విద్యార్థులకు అందిస్తున్నారు. దాంతోపాటు పాలు లేదా రాగిజావ ఇవ్వనున్నారు.

కళాశాలల్లో మూడు.
ప్రభుత్వ కళాశాలల్లో ఇప్పటివరకు మధ్యాహ్న భోజనం అంటూ ఏమీ లేదు. గతంలో కేసీఆర్‌ ప్రభుత్వం ఉన్న సమయంలో మధ్యాహ్న భోజనం అందించాలని చర్యలు తీసుకున్నా కార్యరూపం దాల్చలేదు. నేటి కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇంటర్‌తోపాటు డిగ్రీ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం ప్రారంభించనుంది. దీంతోపాటు టిఫిన్‌ కూడా ప్రారంభించబోతున్నది. ఇక పాలు లేదా రాగిజావ అందించనుంది.

విద్యార్థుల సంఖ్య పెంపు లక్ష్యం
ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలపై ప్రజల్లో నమ్మకం కోల్పోతుండడంతో వాటి ఉనికి ప్రమాదకరంగా మారింది. రోజురోజుకు ప్రభుత్వ విద్యాలయాల్లో చదువుకునే వారి సంఖ్య తగ్గిపోతున్నది. డ్రాపౌట్స్‌ సంఖ్య పెరిగిపోతున్నది. విద్యార్థులు లేక కొన్ని పాఠశాలలు వెలవెలబోతున్నాయి. ఈ పరిస్థితి గ్రామీణ ప్రాంతాల్లో తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం విద్యా వ్యవస్థ బలోపేతం కోసం కొన్ని పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోంది. విద్యార్థులు తిరిగి విద్యా సంస్థకు ఉత్సాహంగా వచ్చేందుకు ప్రభుత్వం బ్రేక్‌ఫాస్ట్‌తోపాటు లంచ్‌ అందించనుంది. ప్రభుత్వ విద్యా వ్యవస్థపై నమ్మకం కలిగించడమే కాకుండా నాణ్యమైన విద్య అందిస్తున్నామని.. వాటితోపాటు పోషకాహారం అందిస్తున్నట్లు విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రభుత్వం చెప్పబోతున్నది. 

ప్రభుత్వ విద్యాలయాలకు పూర్వ వైభవం
ప్రభుత్వ స్కూల్స్, కాలేజీలలో బ్రేక్ ఫాస్ట్ పథకం అమలు చేయనుండడంతో మరి విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో మార్పు వస్తుందా? లేదా? అనేది చూడాలి. పాఠశాలలు, కళాశాలల్లో టిఫిన్, భోజనంతో పాటు పాలు లేదా రాగిజావ ఇవ్వనుండగా.. ఈ పథకాన్ని ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని తెలుస్తోంది. ఈ పథకాన్ని పక్కాగా.. నాణ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అమలు చేస్తే ప్రభుత్వ విద్యాలయాలకు మళ్లీ పూర్వవైభవం వచ్చే అవకాశం ఉంది. మరీ ఈ పథకం విజయవంతం కావాలని కోరుకుందాం.

0
0
Report
Advertisement

Tirumala Traffic Jam: అలిపిరిలో ట్రాఫిక్‌ జామ్‌.. తిరుమలలో అనూహ్యంగా పెరిగిన భక్తుల రద్దీ

Tirupati, Andhra Pradesh:

Tirumala Temple Rush: పాఠశాలలకు వేసవి సెలవులు ముగుస్తున్న నేపథ్యంలో తిరుమల ఆలయాన్ని సందర్శించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. అనూహ్యంగా శనివారం భక్తుల రద్దీ పెరిగిపోయింది. ఈ కారణంగా అలిపిరి టోల్‌గేట్‌ వద్ద వాహనాలు బారులుతీరాయి. టోల్‌ గేట్‌ వద్ద తనిఖీలకు దాదాపు అర్థ గంటకు పైగా సమయం పడుతోంది. సర్వ దర్శనంలో భక్తులకు 18 గంటల సమయం దర్శనానికి పడుతోంది. ఈ వివరాలు ఇలా ఉన్నాయి.

నిండిన అన్నీ కంపార్ట్‌మెంట్లు
తిరుమలలో శనివారం భక్తుల రద్దీ భారీగా కొనసాగుతోంది. సర్వదర్శనం కోసం వేచి ఉండే సమయం సుమారు 15–18 గంటల సమయం పడుతుండగా.. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో అన్నీ కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి. శిలాతోరణం వరకు క్యూలైన్లు విస్తరించాయి. వారం రోజుల్లో రోజుకు 83 వేల నుంచి 93 వేల మందికి పైగా భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. జూన్ 7వ తేదీన ఒక్కరోజే 93,230 మంది దర్శనం చేసుకున్నారు. సర్వదర్శనం క్యూ లైన్ శిలాతోరణం ప్రాంతం వరకు విస్తరించిన దీంతో భక్తులు గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి కూడా రద్దీ ప్రభావం కనిపిస్తోంది. సాధారణంగా రెండు నుంచి నాలుగు గంటల్లో పూర్తయ్యే దర్శనం మరింత ఆలస్యం అవుతోంది. కాలినడకన వచ్చే దివ్యదర్శనం భక్తులకు కూడా 6 గంటలకుపైగా నిరీక్షణ తప్పడం లేదు. రద్దీ నియంత్రణ కోసం టీటీడీ ఏఐ ఆధారిత కమాండ్ కంట్రోల్ సిస్టమ్‌ను వినియోగిస్తోంది. దీంతో గతంలో 24 నుంచి 36 గంటలు పట్టిన దర్శనం సమయం అత్యంత రద్దీ సమయంలో కూడా 8 నుంచి 14 గంటలకు తగ్గిందని టీటీడీ అధికారులు చెబుతున్నారు

భారీ విరాళం
తిరుమల శ్రీవారికి ప్రముఖ వాహన తయారీ సంస్థ అశోక్ లేలాండ్ భారీ విరాళాన్ని సమర్పించింది. రూ.31 లక్షలకు పైగా విలువైన అధునాతన ట్రక్కును టీటీడీకి విరాళంగా అందజేసింది. శనివారం  తిరుమలలో ఈ వాహనానికి శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. తిరుమలకు చేరుకున్న సంస్థ ప్రతినిధులు శ్రీవారి ఆలయం ముందు నూతన వాహనాన్ని ఉంచారు. రూ.31,72,532 విలువైన ఈ ట్రక్కుకు అర్చకులు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు చేయగా.. అశోక్ లేలాండ్ సంస్థ ప్రెసిడెంట్ సంజీవ్ కుమార్ టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరికి ట్రక్కు తాళాలను అందజేశారు. అశోక్‌ లేలాండ్‌ సంస్థ ఇచ్చిన ట్రక్కును శ్రీవారి సేవా కార్యక్రమాలకు, లడ్డూ ప్రసాదాల రవాణాకు లేదా ఇతర అవసరాలకు వినియోగిస్తామని టీటీడీ అధికారులు తెలిపారు.

ట్రాఫిక్‌ జామ్‌
తిరుమలలో భక్తుల రద్దీ తీవ్రంగా పెరగడంతో వాహనాలు పెద్ద ఎత్తున నిలిచిపోయాయి. వేసవి సెలవులు ముగుస్తుండటం, శనివారం కావడంతో దేశం నలుమూలల నుంచి భక్తులు భారీగా తిరుపతికి తరలివస్తున్నారు. దీంతో అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద వాహనాలు భారీగా ఆగిపోయాయి. వాహనాలు కిలోమీటర్ల మేర బారులు తీరాయి. టోల్‌గేట్ నుంచి గరుడ విగ్రహం వరకు ఎటు చూసినా వాహనాలే కనిపిస్తున్నాయి. తనిఖీ ప్రక్రియ ఆలస్యం కావడం.. ఒకేసారి వందలాది వాహనాలు రావడంతో అలిపిరి మార్గంలో ట్రాఫిక్ స్తంభించిపోయింది.

0
0
Report

Union Cabinet: కేంద్ర కేబినెట్‌లోకి జనసేన ఎంట్రీ.. లింగమనేని రమేష్‌, వేమిరెడ్డికి ఛాన్స్‌?

Nuzendla, Andhra Pradesh:

Union Cabinet Extension: పన్నెండేళ్ల పాలనను పూర్తి చేసుకున్న ఎన్డీయే ప్రభుత్వం త్వరలో మంత్రివర్గ విస్తరణ జరగనుందని తెలుస్తోంది. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న టీడీపీకి విశేష ప్రాధాన్యం లభిస్తుండగా.. తొలిసారిగా జనసేన పార్టీ జాతీయ రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. పార్టీ పెట్టిన పుష్కర కాలానికి జనసేన కేంద్ర పదవులను అలంకరించనుంది. టీడీపీ.. జనసేన నుంచి కేంద్ర మంత్రివర్గంలోకి మరోసారి ప్రాధాన్యం లభిస్తుందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.

కేంద్ర మంత్రివర్గ విస్తరణ లేదా పునర్వ్యవస్థీకరణ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. కొందరికి ఉద్వాసన పలకడంతో మరికొందరికి ఆహ్వానం పలికే అవకాశాలు ఉన్నాయి. కేంద్ర మంత్రివర్గ విస్తరణ జరిగితే ఆంధ్రప్రదేశ్‌కు మరోసారి మరింత ప్రాతినిధ్యం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం కేంద్ర మంత్రివర్గంలోకి టీడీపీతోపాటు జనసేనకు కూడా అవకాశం లభిస్తుందని తెలుస్తోంది. ఇటీవల జనసేన పార్టీ తరఫున రాజ్యసభకు ఎన్నికైన లింగమనేని రమేష్ కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కించుకునే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

కేంద్ర మంత్రివర్గంలోకి టీడీపీ నుంచి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి పేరు చర్చకు వస్తోంది. నెల్లూరు లోక్‌సభ సభ్యుడు వేమిరెడ్డి కూడా కేంద్ర మంత్రివర్గ విస్తరణ సందర్భంగా అతడి పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. టీడీపీ అభివృద్ధికి కృషి చేస్తుండడంతోపాటు పార్లమెంటులో చురుకైన పాత్ర, రాష్ట్ర రాజకీయాల్లో ఉన్న ప్రాధాన్యం నేపథ్యంలో వేమిరెడ్డికి ఈసారి కేంద్ర మంత్రివర్గంలో స్థానం లభించే అవకాశాలు ఉన్నాయి. ఆయనకు కేంద్రంలో బాధ్యతలు దక్కే అవకాశం ఉందని భావిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే కూటమిలో టీడీపీ, జనసేన కీలక భాగస్వాములుగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి కేంద్ర మంత్రివర్గంలో మరింత ప్రాతినిధ్యం కల్పిస్తారనే చర్చ జరుగుతున్నట్లు సమాచారం. ఇటీవల చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌తో ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్‌ షా భేటీలో దీనిపై నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రాంతీయ సమతుల్యత, మిత్రపక్షాల ప్రాధాన్యత, రాజకీయ సమీకరణాలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని కేంద్ర నాయకత్వం మంత్రివర్గ విస్తరణపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.

ప్రస్తుతానికి కేంద్ర మంత్రివర్గ విస్తరణపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. దీని విషయమై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగితేనే ఈ అంశంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఎప్పుడు మంత్రివర్గ విస్తరణ జరిగినా లింగమనేని రమేష్‌, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. మరి ఎప్పుడు మంత్రివర్గ విస్తరణ జరుగతుందనేది కాలం సమాధానం ఇస్తుంది.

0
0
Report

Vemulawada: రైతు బంధు ఆపేసి.. ఢిల్లీకి రాహుల్ బంధు తెచ్చారు.. కాంగ్రెస్‌పై KTR ఫైర్!

Vemulawada, Telangana:

KTR Vemulawada speech Telugu News: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆనాడు కెసిఆర్ ఒంటరిగా బయలుదేరి.. అందరినీ కలుపుకొని రాష్ట్రాన్ని సాధించారు.. నేడు బీఆర్ఎస్ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం భయభ్రాంతులకు గురిచేస్తోంది.. దేనికి భయపడకండి. మీ వెనుక నేను.. చల్మెడ లక్ష్మీనరసింహారావు ఉన్నాం.. అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కలవకుంట్ల తారక రామారావు పిలుపునిచ్చారు.. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గ కార్యకర్తల విస్తృతస్థాయి సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జి చెల్మెడ లక్ష్మీనరసింహారావు, సభ్యత్వ నమోదు ఇన్చార్జి ప్రవీణ్, మాజీ చైర్పర్సన్ తుల ఉమా తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రంలో SIR ప్రక్రియ.. బూత్ కార్యకర్తలే సైనికులు..
దేశంలో 13 సార్లు స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో లేదా ప్రత్యేక సర్వేల రూపంలో ఓటర్ల పరిశీలన జరిగినప్పుడు వేములవాడ లేదని కేటీఆర్ గుర్తు చేశారు.  జూన్ 25 నుంచి జూలై 25 వ తేదీ వరకు నెల రోజులపాటు అధికారికంగా 2002 తో పాటు 2025 ఓటర్ల జాబితాలను పక్క పక్కన పెట్టి ఫ్యామిలీ మ్యాపింగ్ చేయనున్నారని తెలిపారు.. ఇంటికి వచ్చే అధికారులు.. చనిపోయిన వారి ఓట్లను, రెండు చోట్ల ఉన్న ఓట్లను తొలగిస్తారని.. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ అనుకూల ఓట్లు పోకుండా బూత్ స్థాయి కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వేములవాడలో చల్మెడ లక్ష్మీనరసింహారావు విజయం పక్కా అని.. అయితే SIR ప్రక్రియలో ప్రతి ఓటును కాపాడుకోవడం అత్యంత కీలకమని స్పష్టం చేశారు..

రైతు బంధు ఆపేసి.. రాహుల్ బంధు తెచ్చారు..
కాంగ్రెస్ పాలనపై కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.  రేవంత్ రెడ్డి ది నోరా? లేదా మోరా? అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.. నూరు రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి ప్రజలను దారుణంగా మోసం చేశారని.. ఆనాటి ప్రభుత్వ హయంలో లభించిన రూ.200 పెన్షన్ను రూ.2,000 చేసింది మేమేనని.. కానీ నేడు రేవంత్ రెడ్డి అభివృద్ధి చేయడం చేతకాక.. కెసిఆర్ ప్రభుత్వం పై ఏడుస్తున్నారని అన్నారు.. వ్యవసాయానికి ఇచ్చే రైతుబంధు బందు చేసి.. ఢిల్లీకి మూటలు పంపుతూ రాహుల్ బంధును తీసుకొచ్చారని ఆయన మండిపడ్డారు.. 

త్వరలో సభ్యత్వ నమోదు.. 
కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయంతో పాటు విద్య వైద్య రంగాల్లో ప్రజలను ఎలా మోసం చేసిందనేది వివరించడానికి త్వరలోనే నియోజకవర్గాల వారీగా పార్టీ సమావేశాలు ఏర్పాటు చేస్తామని.. అలాగే బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కూడా ప్రారంభిస్తామని ఈ సభ ముఖంగా కేటీఆర్ ప్రకటించారు.. నేటి యువత అంతా ఎక్కువగా డిజిటల్ ప్లాట్ఫార్మ్స్ లోనే ఉంటున్నారని.. కాబట్టి సోషల్ మీడియాను ఒక శక్తివంతమైన ఆయుధంగా వాడుకోవాలని కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. కాంగ్రెస్ వైఫల్యాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తూ.. ప్రజల క్షేత్రస్థాయిలోకి వెళ్లాలని సూచించారు. తెలంగాణలో మళ్లీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని.. తాము స్వయంగా వేములవాడపై ప్రత్యేక దృష్టి కార్యకర్తను కలుపుకుంటానని భరోసా ఇచ్చారు..

Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

0
0
Report
Advertisement

TPCC: ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా? నియంత దేశంలో ఉన్నామా?: మహేశ్ కుమార్ గౌడ్

Baddipadaga, Telangana:

Meenakshi Natarajan Nomination Rejection: 'మీనాక్షి నటరాజన్ విషయంలో బీజేపీ తీరు ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా? నియంత దేశంలో ఉన్నామా? అనుమానం కలుగుతుంది. కేసు లేదు ఏమి లేదు నోటీసు మాత్రమే ఇచ్చింది. ఎఫ్‌ఐఆర్‌ లేనపుడు కేసు ఎక్కడిది?' అని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. 'పసలేని కేసును పట్టుకొని దుర్బుద్ధితో నోటీసు మాత్రమే ఇచ్చింది. ఆర్ఓకి తిరస్కరించే అధికారం లేకున్నా తిరస్కరించారు. ఆర్ఓని ఉరి వేసిన తప్పులేదు' అని సంచలన వ్యాఖ్యలు చేశారు.

'రాజ్యసభలో బలం పెంచుకోవాలని కుట్రకు పూనుకున్నారు. గాంధేయ వాది నియయితికి నిలువుటద్దం మీనాక్షి నటరాజన్. ప్రధానమంత్రి కార్యాలయం చొరవతో కేసును తప్పుదోవ పట్టించారు. ఈ విషయంలో ఉరి వేసిన తప్పులేదు' అని ఎమ్మెల్సీ మహేశ్‌ కుమార్‌ తెలిపారు. రాజకీయ ఒత్తిడితో ఆర్ఓ ఆఫీసులో కూర్చుని ప్రధాని నియంతలా వ్యవహరించడం శోచనీయం అని మండిపడ్డారు. సుప్రీంకోర్టులో కూడా న్యాయం జరగలేదు అసహనం వ్యక్తం చేశారు.

'బీజేపీ ఫాసిస్టు విధానాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మీనాక్షి నాకు సోదరి లాంటివారు. 24 గంటల్లో ఎన్నికల సంఘం స్పందించకపోవడం విచారకరం. మీనాక్షిని బలి చేశారు. మీనాక్షి విషయంలో కొంత మంది బీజేపీ నాయకులు సానుభూతి తెలిపినట్లు తెలిసింది. బీజేపీ నాయకులు దిగజారి ప్రవర్తిస్తున్నారు. లీకు వీరులు, గ్రీకు వీరులు ఉంటే రేవంత్‌ రెడ్డి సమగ్రంగా విచారిస్తున్నారు. ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కి మాపై బురద జల్లుతున్నారు' అని మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ ఖండించారు.

'రాజకీయాల్లో విభేదాలు సహజం. అంతమాత్రాన కుట్రకు పాల్పడరు. ఓటు చోరీ చేసి.. ఇప్పుడు సీటు చోరీ చేశారు. ప్రధాని ఇంతలా దిగజారి ప్రవర్తించడం సిగ్గుచేటు' అని మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ మండిపడ్డారు. 'మీనాక్షికి కేసుకు అసలు సంబంధం లేదు. రాజ్యాంగాన్ని ఇంత దుర్మార్గంగా అవమానిస్తారా? కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నపుడు ఇలా వ్యవహరిస్తే మోడీ ప్రధాని అయ్యేవారా?ముఖ్యమంత్రి అయ్యేవారా?' అని ప్రశ్నించారు.

'పశ్చిమ బెంగాల్, మహరాష్ట్రలో బీజేపీ ఏం చేసిందో దేశ ప్రజలు చూశారు. 12 ఏళ్లలో మోదీ చేసింది ఏమి లేదు' అని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ విమర్శించారు. మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఆరోపణలపై తొందరపడి స్పందించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. తన ఆస్తులు, తన వ్యక్తిత్వం ఏమిటో నిజామాబాద్ ప్రజలకు తెలుసు అని చెప్పారు. 'చంద్రశేఖర్ రెడ్డిని స్వయంగా షబ్బీర్ అలీ రేవంత్‌ రెడ్డి సమక్షంలో చేర్పించారు. షబ్బీర్  అలీకి షోకాజ్ ఇచ్చాం' అని వివరించారు. 'ఇన్నాళ్లు రాజకీయాల్లో ఉన్న షబ్బీర్ అలీ అలా మాట్లాడటం సబబు కాదు. మహిళలను చులకన చేసి మాట్లాడటం విచారకరం. ఏడాది కిందటి మాట్లాడిన ఆడియో బయటకు వచ్చింది' అని మహేశ్‌ కుమార్‌ వెల్లడించారు.

0
0
Report

OnePlus Nord CE6: రూ.43,999 OnePlus ఫోన్ కేవలం రూ.28,990కే.. ఎక్స్చేంజ్ ఆఫర్‌తో ఇంకా చీప్!

Hyderabad, Telangana:

OnePlus Nord CE6 Offers Latest News: OnePlus బ్రాండ్‌కి సంబంధించిన మంచి మొబైల్ ఏదైనా ఎప్పటినుంచో కొనుగోలు చేయాలనుకుంటున్నారా? మీకోసం ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్ అద్భుతమైన అవకాశాన్ని అందిస్తోంది. ఇందులో భాగంగా ఎక్స్చేంజ్ ఆఫర్స్‌తో పాటు అదనంగా బ్యాంకు క్రెడిట్ కార్డ్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. వీటన్నిటినీ వినియోగించి కొనుగోలు చేసే వారికి వన్ ప్లస్ బ్రాండ్‌కి సంబంధించిన కొన్ని మొబైల్స్ చీప్ ధరకే అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన OnePlus Nord CE6 మొబైల్ అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్స్‌తో అందుబాటులో ఉంది. ఇందులో భాగంగా ఈ స్మార్ట్‌ఫోన్‌ అమెజాన్‌లో కొనుగోలు చేసే వారికి చాలా చీప్ ధరకే సొంతం చేసుకోవచ్చు. అలాగే ఇది ఎన్నో రకాల ప్రీమియం ఫీచర్స్‌ను కలిగి ఉంది. ఇది ఏయే ఫీచర్లతో అందుబాటులోకి వచ్చిందో? దీనిపై అందుబాటులో ఉన్న ఫీచర్స్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఈ OnePlus Nord CE6 స్మార్ట్‌ఫోన్‌ 6.78 ఇంచుల 1.5K (2772 × 1272 పిక్సెల్స్) Sunburst AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇది 144Hz హై రిఫ్రెష్ రేట్‌తో లభిస్తోంది. కాబట్టి గేమింగ్‌తో పాటు స్క్రోలింగ్ చేసే వారికి ఈ డిస్ప్లే చాలా స్మూత్‌గా ఉంటుంది. దీంతో పాటు ఇది అద్భుతమైన పిక్ బ్రైట్నెస్‌తో అందుబాటులో ఉంది. దీనివల్ల ఎండలో కూడా చాలా స్పష్టంగా మీకు దీని డిస్ప్లే కనిపిస్తుంది..ఇందులో డిస్ప్లే ప్రొటెక్షన్ కోసం కంపెనీ చాలా అద్భుతమైన క్రిస్టల్ గార్డ్ (Crystal Guard) మెటీరియల్ సపోర్ట్ అందించింది. అంతేకాకుండా ఇది ఎంతో శక్తివంతమైన Qualcomm Snapdragon 7s Gen 4 (4nm) ఆక్టా-కోర్ ప్రాసెసర్ పై పని చేస్తుంది. ఇది హెవీ గేమింగ్‌తో పాటు మల్టీ టాస్కింగ్‌ను సులువుగా హ్యాండిల్ చేస్తుంది. దీంతోపాటు ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత OxygenOS 16 ఆపరేటింగ్ సిస్టంపై రన్ అవుతుంది..

ఇక ఈ OnePlus Nord CE6 స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన వెనక భాగం వివరాల్లోకి వెళ్తే.. ఇది ఎంతో శక్తివంతమైన 50MP మెయిన్ కెమెరా (OmniVision OV50D40 సెన్సార్‌తో అందుబాటులోకి వచ్చింది. దీంతోపాటు అదనంగా ప్రత్యేకమైన 2MP అసిస్టెన్స్ కెమెరాను కలిగి ఉంటుంది. అదేవిధంగా ఫ్రంట్ భాగంలో 32MP సెల్ఫీ కెమెరా కూడా లభించడం విశేషం..ఈ స్మార్ట్ ఫోన్ లో అతిపెద్ద హైలైట్ దీనిలోని భారీ 8000mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీ. ఇది దాదాపు 2 రోజులకు పైగా బ్యాకప్ ఇస్తుంది. OnePlus Nord CE6 (8GB + 256GB) వేరియంట్ ధర వివరాల్లోకి వెళ్తే.. ఇది MRP రూ.43,999 నుంచి ప్రారంభమవుతుంది. అయితే, ఇప్పుడే దీనిని ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్‌లో కొనుగోలు చేస్తే 28 శాతం స్పెషల్ ఫ్లాట్ తగ్గింపుతో కేవలం.. రూ.28,990కే సొంతం చేసుకోవచ్చు. ఇక ఇవే కాకుండా అదనంగా బ్యాంకు డిస్కౌంట్ ఆఫర్స్ లభిస్తున్నాయి. 

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

దీనిపై ఉన్న బ్యాంకు డిస్కౌంట్ ఆఫర్స్ వివరాల్లోకి వెళితే.. దీనిని కొనుగోలు చేసే సమయంలో ఆమెజాన్ పే ఐసిఐసిఐ బ్యాంకు క్రెడిట్ కార్డును వినియోగించి పేమెంట్ చేస్తే రూ.1,500 తగ్గింపు లభిస్తుంది. అలాగే హెచ్డిఎఫ్సి, ఇతర బ్యాంకులను వినియోగించి పేమెంట్ చేసే వారికి కూడా ఇదే తగ్గింపు లభిస్తుంది. అదనంగా దీనిపై ఎక్స్చేంజ్‌ బోనస్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. ఇందులో భాగంగా ఏదైనా పాత మొబైల్ ఎక్స్చేంజ్ చేస్తే రూ.27 వేల వరకు బోనస్ లభిస్తుంది. దీంతో ఈ  OnePlus Nord CE6 మొబైల్ కేవలం రూ.1,990 కే సొంతం చేసుకోవచ్చు..

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report

Chandrababu: ఏపీకి పెట్టుబడులే లక్ష్యం.. రేపు సింగపూర్‌కు సీఎం చంద్రబాబు

Singapore,

Chandrababu Singapore Tour: అభివృద్ధికి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్‌ను నిలపాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కార్యాచరణ రూపొందిస్తున్నారు. పక్కా ప్రణాళికతో ఏపీకి పెట్టుబడులు తీసుకువచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అందులో భాగంగా మరోసారి విదేశీ పర్యటన చేపట్టనున్నారు. పెట్టుబడుల సాధనలో భాగంగా సీఎం చంద్రబాబు రెండు రోజుల పాటు విదేశాల్లో పర్యటించనున్నారు. రేపు సింగపూర్‌కు ఏపీ సీఎం చంద్రబాబు వెళ్లనున్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

పెట్టుబడులే లక్ష్యం
రెండు రోజుల పాటు ముఖ్యమంత్రి ఆధ్వర్యంలోని ఏపీ బృందం సింగపూర్‌లో పర్యటించనుంది. రాజధాని అమరావతి నిర్మాణ ప్రాజెక్టులు సహా రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు సీఎం బృందం సింగపూర్‌లో పర్యటించనుంది. 14 తేదీ ఉదయం 11.35 గంటలకు బెంగళూర్ నుంచి సీఎం చంద్రబాబు సింగపూర్ బయల్దేరి వెళ్లనున్నారు. సింగపూర్ చేరుకున్న అనంతరం 15వ తేదీన సింగపూర్ కాలమానం ప్రకారం ఉదయం 10.30 గంటలకు ఆ దేశంలోని భారత హై కమిషనర్ శిల్పక్ అంబులేతో చంద్రబాబు బృందం సమావేశం కానుంది. పర్యటనలో తొలిరోజు స్టార్టప్ వెంచర్ కాపిటలిస్టులతో జరిగే రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్‌కు సీఎం హాజరు కానున్నారు. 16 తేదీ రాత్రి 10 గంటలకు ముఖ్యమంత్రి స్వదేశానికి తిరిగి రానున్నారు.

ప్రముఖులతో భేటీ
అనంతరం యూఎన్ హాబిటాట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనాక్లాడియా రాస్ బాబ్‌తో విందు సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం పాల్గొనుంది. సింగపూర్ సీనియర్ మంత్రి లో యెన్ లింగ్‌తో సమావేశం కానున్నారు. గూగుల్ క్లౌడ్ ఏపీఏపీ అధ్యక్షుడు కరణ్ భజ్వా, జీఐసీ ఎగ్జిక్యూటివ్ కమిటీ అడ్వైజర్ లిమ్ సియాంగ్ గౌన్‌తో చర్చలు జరగనున్నాయి. వైసీహెచ్ లాజిస్టిక్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రాబర్ట్ యాప్‌తోనూ, నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ సింగపూర్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ టాన్ యెంగ్ చెయ్‌తో భేటీ అవుతారు. సింగపూర్ ప్రధానమంత్రి లారెన్స్ వాంగ్‌తోనూ పలు అంశాలపై చర్చిస్తారు.

సింగపూర్ విదేశాంగ మంత్రి వివియన్ బాలకృష్ణన్‌తోనూ ఏపీ ప్రభుత్వ బృందం భేటీ కానుంది. సీఐఐ ఆంధ్రప్రదేశ్ ప్రతినిధి బృందంతోనూ సమావేశమవుతారు. హోం మంత్రి కె షణ్ముగమ్, మానవ వనరుల శాఖ మంత్రి టాన్ సీ లెంగ్‌తో భేటీ జరుగుతుంది. ఇక రెండో రోజు పర్యటనలో భాగంగా 16వ తేదీ ఉదయం కాకతీయ కల్చరల్ అసోసియేషన్ సీబీఎన్ 361ను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభిస్తారు. అనంతరం జరగనున్న ఏపీఏసీ సెమికండక్టర్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు.

ఏపీ ప్రభుత్వ బృందం ఇదే
సుర్బానా జురాంగ్-అమరావతి ప్లానింగ్ సమావేశానికి ఏపీ ప్రభుత్వ బృందం హాజరు కానుంది. సింగపూర్ ఉప ప్రధానమంత్రి, వాణిజ్య మంత్రి గాన్ కిమ్ యాంగ్‌ బృందంతో సమావేశం అవుతారు. తర్వాత ‘వరల్డ్ సిటీస్ సమ్మిట్’ లీడర్షిప్ ప్లీనరీలో పాల్గొని సీఎం చంద్రబాబు ప్రసంగిస్తారు. వరల్డ్ సిటీస్ సమ్మిట్ ఎగ్జిబిషన్ సందర్శించి.. సింగపూర్ పెవిలియన్, ఇన్నోవేటర్ల అలయ్, గూగుల్ టెక్నాలజీస్‌ స్టాల్స్ వివరాలు ఏపీ బృందం తెలుసుకోనుంది. 

సీట్రియమ్ సమావేశంలోనూ పాల్గొన్న సీఎం చంద్రబాబు పర్యటనలో చివరిగా సీఐఐ పార్టనర్షిప్ సమ్మిట్ 2026 బిజినెస్ రోడ్ షోకు హాజరవుతారు. సింగపూర్ పర్యటనకు ముఖ్యమంత్రి వెంట పురపాలక శాఖ మంత్రి నారాయణ, పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్, పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి సురేశ్ కుమార్, ఈడీబీ సీఈఓ షన్మోహన్, సీఆర్డీఏ అధికారుల బృందం ఉంది.

0
0
Report
Advertisement

Honor X80 Pro Max ఫోన్‌ లీకైన ఫీచర్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే.. లాంచ్ ఎప్పుడంటే?

Hyderabad, Telangana:

Honor X80 Pro Max Leaks Latest News: టెక్నాలజీ ప్రపంచంలో స్మార్ట్‌ఫోన్‌ల బ్యాటరీ లైఫ్ అనేది ఎప్పుడు ఒక పెద్ద సవాలు గానే ఉంటూ వస్తోంది. కానీ ప్రముఖ మొబైల్ బ్రాండ్ హానర్ ఈ సమస్యకు శాశ్వతంగా పరిష్కారాన్ని చూపబోతోంది. మార్కెట్లోని సంచలనం సృష్టించేందుకు సరికొత్త హానర్ ఫ్లాగ్ షిప్ మోడల్  Honor X80 Pro Max స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ సిద్ధం చేస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ అతి త్వరలో విడుదల చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అయితే ఈ ఫోన్కు సంబంధించిన అధికారిక టీజర్ కూడా తాజాగా విడుదల కావడం విశేషం. ఇందులో భాగంగా అందుబాటులోకి వచ్చిన వివరాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..

చార్జింగ్ స్పీడ్..
ఈ స్మార్ట్‌ఫోన్‌ లో అందరినీ ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే.. దీనికి అద్భుతమైన శక్తివంతమైన బ్యాటరీ. లీకైన వివరాల ప్రకారం ఇది ఏకంగా 11,000mAh భారీ బ్యాటరీతో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. స్మార్ట్‌ఫోన్‌ చరిత్రలోనే ఎంత పెద్ద బ్యాటరీని పరిచయం చేయడం ఇదే తొలిసారి కావచ్చని మార్కెట్ ని గుణలు చర్చించుకుంటున్నారు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు సాధారణ వినియోగం పై మూడు నుంచి ఐదు రోజులపాటు ఎలాంటి సమస్య లేకుండా పవర్ సపోర్ట్ అందిస్తుంది. అయితే, ఈ భారీ బ్యాటరీని చార్జ్ చేయడానికి వీలుగా 90W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌ను కూడా ఈ ఫోన్‌లో అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది..

ప్రీమియం డిజైన్.. 
కేవలం బ్యాటరీ మాత్రమే కాదు.. ఈ స్మార్ట్‌ఫోన్‌ డిజైన్ కూడా ఎంతో ప్రీమియం గా ఉండబోతోంది. లీకైన ఫోటోల ప్రకారం.. ఈ స్మార్ట్‌ఫోన్‌ వెనక భాగం డ్యూయల్ టోన్ లెదర్ ఫినిషింగ్ తో రాబోతోంది. ఇది వినియోగదారులకు ఫోన్ను పట్టుకున్నప్పుడు ఒక లగ్జరీ అనుభూతిని అందించడమే కాకుండా.. చాలా కంఫర్ట్‌గా ఫీల్ అవొచ్చు. దీంతోపాటు ఇది నాలుగు కలర్ ఆప్షన్స్‌లో విడుదల కాబోతోంది. ఫోను వెనక భాగంలో ఒక పెద్ద సర్కిల్ కెమెరా మాడ్యూల్‌ని కూడా కలిగి ఉంటుంది. ఇందులో అద్భుతమైన సెన్సార్‌తో కూడిన కెమెరాలు అందుబాటులో ఉండబోతున్నాయి. 

పవర్‌ఫుల్ ఫీచర్లు..
ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన ఫీచర్ల వివరాల్లోకి వెళ్తే.. ఇది 1.5K రెజ్యూల్యూషన్ కలిగిన చాలా ప్రత్యేకమైన 6.8 ఇంచుల ఫ్లాట్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. దీని అల్ట్రా నానో బెజెల్స్ ఫోన్ స్క్రీన్‌ను మరింత అందంగా చేసేందుకు క్రియాశీలక పాత్ర పోషిస్తాయి. ఈ మొబైల్ ఎంతో శక్తివంతమైన సరికొత్త Qualcomm Snapdragon 6 Gen 5 చిప్‌సెట్‌ను వాడబోతున్నట్లు తెలుస్తోంది. ఇది మల్టీ టాస్కింగ్‌తో పాటు గేమింగ్ కు ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది. ఇక ఈ మొబైల్ వెనక భాగంలో ఉండే సర్కిల్ కెమెరా మాడ్యూల్లో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా కూడా అందుబాటులో ఉంది. 

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

అంతేకాకుండా ఈ ఫోన్ నీటిలో పడినప్పటికీ పాడవకుండా పూర్తిగా వాటర్ రెసిటెంట్‌తో పాటు.. కిందపడిన పగలకుండా ఉండేందుకు డ్రాప్ రెసిస్టెన్స్ టెక్నాలజీ అందుబాటులో ఉంది.. అదేవిధంగా ఈ మొబైల్‌కు సంబంధించిన లాంచ్ డీటెయిల్స్ వివరాల్లోకి వెళితే.. దీనిని కంపెనీ ఈనెల చివరి వారంలో చైనా మార్కెట్లో అధికారికంగా విడుదల చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఇది భారత మార్కెట్ లోకి వచ్చే అవకాశం ఉంది. బ్యాటరీ త్వరగా అయిపోతుందని బాధపడే వారికి.. అలాగే హెవీ యూజర్లకు ఈ మొబైల్ ఎంతగానో పనిచేస్తుంది..

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report

Samsung Galaxy A27 5G: 50MP కెమెరా, స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌తో సాంసంగ్ కొత్త ఫోన్.. లీకైన గెలాక్సీ A27 5G ఫీచర్లు!

Hyderabad, Telangana:

Samsung Galaxy A27 5G Leaks: ప్రముఖ దిగ్గజ స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ సాంసంగ్ బడ్జెట్‌తో పాటు మిడ్రెంజ్ ప్రియుల కోసం ఒక సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్‌లోకి తీసుకురావడానికి సిద్ధమైంది. ఇది సాంసంగ్ గెలాక్సీ A27 5G పేరుతో లాంచ్ కాబోతోంది. ఇటీవల చెక్ రిపబ్లిక్కు చెందిన samsung అధికారికి వెబ్సైట్లో ఈ ఫోన్ లిస్ట్ అవడం దీనికి సంబంధించిన కీలకమైన ఫీచర్లతో పాటు స్పెసిఫికేషన్స్ లీకవడం విశేషం. గత ఏడాది మార్చిలో విడుదలైన సాంసంగ్ గెలాక్సీ a26 5జికి అప్‌గ్రేడెడ్ వెర్షన్‌గా ఈ కొత్త మోడల్ అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ స్మార్ట్ ఫోన్ కు సంబంధించిన అన్ని వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. 

అద్భుతమైన డిస్‌ప్లే..
ఇటీవల లీకైన వివరాల ప్రకారం.. సాంసంగ్ గెలాక్సీ A27 5జి స్మార్ట్‌ఫోన్‌ అద్భుతమైన 6.7 ఇంచుల ఫుల్ HD+ (1080 x 2340 పిక్సెల్స్) సూపర్ అమోలెడ్ (Super AMOLED) డిస్‌ప్లేను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇది చాలా ప్రత్యేకమైన 800 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ సపోర్ట్‌తో అందుబాటులోకి రాబోతోంది. అంతేకాకుండా ఫ్లాట్ ప్యానెల్ డిస్ప్లేతో పాటు వెనక భాగంలో ఫిల్ షీల్డ్ కెమెరా మాడ్యూయల్‌ని దీనికి అందించారు. ఇవే కాకుండా ఇందులో ఎన్నో రకాల ప్రత్యేకమైన ఫీచర్లు అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది..

పవర్‌ఫుల్ ప్రాసెసర్..
ఈ స్మార్ట్‌ఫోన్‌లో క్వాల్కమ్ కంపెనీకి చెందిన పవర్ఫుల్ స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 (Snapdragon 6 Gen 3) ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది. ఇది మల్టీ టాస్కింగ్‌తో పాటు గేమింగ్‌కు అద్భుతంగా సపోర్ట్ చేస్తున్నట్లు కంపెనీ క్లైమ్ చేసే అవకాశాలున్నాయి. ఈ ఫోన్ రెండు స్టోరేజ్ ఆప్షన్స్‌తో అందుబాటులోకి రాబోతున్నట్లు లీకైన వివరాలు చెబుతున్నాయి. ఇందులోని మొదటి స్టోరేజ్ వేరియంట్ 128gb ఇంటర్నల్ స్టోరేజ్‌తో అందుబాటులోకి రాబోతోంది. ఇక రెండవ స్టోరేజ్ వేరియంట్ 256 జిబి ఇంటర్నల్ స్టోరేజ్‌తో విడుదల కాబోతున్నట్లు సమాచారం. డ్యూయల్ సిమ్ సపోర్ట్‌తో వస్తున్న ఈ మొబైల్ చాలా ప్రత్యేకమైన పవర్ బటన్ తో పాటు కుడివైపున వాల్యూమ్ కంట్రోల్స్‌ను కలిగి ఉండబోతుంది.

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

కెమెరా, బ్యాటరీ సామర్థ్యం..
ఫోటోగ్రఫీ ప్రేమికుల కోసం ఇందులో కంపెనీ వెనక వైపు ట్రిపుల్ కెమెరా అందుబాటులోకి తీసుకువచ్చింది. అందులో ఎంతో శక్తివంతమైన 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాను కలిగి ఉంటుంది. అంతేకాకుండా 5 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరాతో పాటు అదనంగా చాలా ప్రత్యేకమైన  2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా ఉన్నాయి.. ఇక సెల్ఫీ కోసం ఎందులో కంపెనీ ముందు భాగంలో అద్భుతమైన  12 మెగాపిక్సెల్ కెమెరాను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక బ్యాటరీ విషయానికొస్తే.. ఇందులో కంపెనీ రోజంతా బ్యాకప్ ను ఇచ్చేలా..5,000mAh భారీ బ్యాటరీని అందిస్తున్నట్లు సమాచారం..

Also Read:  7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report

Sircilla: క్లాస్‌రూమ్‌లో చీపురు పట్టిన క్లిన్‌ చేసిన కేంద్రమంత్రి బండి సంజయ్!

Hyderabad, Telangana:

Bandi Sanjay Sircilla Visit: కేంద్ర హోం సహాయక మంత్రి బండి సంజయ్ కుమార్ శనివారం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సందడి చేశారు. సరికొత్త లుక్కులో కనిపించిన ఆయన స్వయంగా క్లాస్ రూమ్లను శుభ్రం చేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు. దేశవ్యాప్తంగా ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వ పాలన విజయవంతంగా 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా.. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గం వ్యాప్తంగా బిజెపి శ్రేణులు స్వచ్ఛ పాఠశాల కార్యక్రమాన్ని వినూత్నంగా నిర్వహిస్తున్నారు.. త్వరలో పాఠశాలలు మొదలు కాబోతున్న నేపథ్యంలో.. విద్యార్థులకు శుభ్రమైన వాతావరణాన్ని అందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా ఈరోజు సిరిసిల్లలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కేంద్రమంత్రి సందర్శించారు..

పైపుతో నీళ్లు కొట్టి.. క్లాస్‌రూమ్‌లు క్లీన్ చేసి..
సాధారణంగా మంత్రులు వస్తేనే అధికారులతో పాటు అనుచరులు హడావుడి చేయడం మనం తరచుగా చూస్తూ ఉంటాం.. కానీ బండి సంజయ్ మాత్రం ఎందుకు భిన్నంగా వ్యవహరించారు. పాఠశాలకు రాగానే స్వయంగా చేతిలోకి చీపిరి తీసుకున్నారు. తరగతి గదుల్లోని దుమ్ముతో పాటు దూలిని ఊడ్చేశారు.. ఆ తర్వాత వాటర్ పైపులను చేతపట్టుకుని బెంచీలతో పాటు గదులను నీళ్లతో కడిగి తల తలలాడేలా క్లీన్ చేశారు.. కేంద్ర మంత్రి హోదాలో ఉండి కూడా ఒక సామాన్య కార్యకర్తల ఆయన శ్రమించిన తీరు స్థానికులను, ఉపాధ్యాయులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో బిజెపి నాయకులతో పాటు కార్యకర్తలు పాల్గొని పాఠశాల ప్రాంగణాన్ని శుభ్రం చేశారు..

సిరిసిల్ల ఎస్పీపై కేంద్రమంత్రి తీవ్ర ఆగ్రహం..
ఇదిలా ఉంటే.. ఈ పర్యటనలో ఒక ఆసక్తికర రాజకీయరచ్చ కూడా చోటుచేసుకుంది.. కేంద్ర మంత్రి పాల్గొన్న ఇంత పెద్ద ప్రభుత్వ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ మహేష్ తో పాటు కొంతమంది పోలీస్ అధికారులు హాజరు కాకపోవడంపై బండి సంజయ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కేవలం డిఎస్పీ మాత్రమే అక్కడ అందుబాటులో ఉండడంతో పాటు ఆయన పై కేంద్రమంత్రి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.. నేనేమి ఇక్కడ సాధారణ కార్యకర్తగా రాలేదని.. కేంద్ర మంత్రి హోదాలో వచ్చినప్పుడు జిల్లా పోలీస్ బాస్ ఎందుకు హాజరు కాలేదని.. బిజెపి కార్యకర్తలతో పాటు నాయకులు అంటే ఆయనకు ఎందుకంత కోపమని బండి సంజయ్ నిలదీశారు.

Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!

KTRపై అంత ప్రేమ ఉంటే BRSలో చేరండి..
పోలీసు అధికారుల పక్షపాత వైఖరి పై బండి సంజయ్ తనదైన శైలిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.. స్థానిక ఎమ్మెల్యేతో పాటు మాజీ మంత్రి కేటీఆర్‌ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు.. మీ ఎస్పీకి కేటీఆర్ పైన..బీఆర్ఎస్ పార్టీ పైన అంత ప్రేమ ఉంటే.. వెంటనే కాకి చొక్కా తీసేసి గులాబీ కండువా కప్పుకోవాలని.. ప్రభుత్వ అధికారులుగా ఉంటూ రాజకీయ పక్షపాతం చూపించడం తగదని.. అంటూ ఘాటుగా ఎద్దేవ చేశారు.. ప్రజాస్వామ్యంలో ప్రోటోకాల్‌ను గౌరవించని అధికారుల తీరుపై తాము కోరుకునేది లేదని హెచ్చరించారు. మొత్తానికి బండి సంజయ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సిరిసిల్ల రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతోంది..

Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

 

0
0
Report
Advertisement

Plane crash: ఘోర విమాన ప్రమాదం.. మేఘనిలో కుప్పకూలిన ఎయిర్‌ ఇండియా విమానం..

Hyderabad, Telangana:

Ahmedabad Plane crash Video: అహ్మదాబాద్ విమానాశ్రయంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఎయిర్ ఇండియా విమానం మేఘానిగర్‌లో కుప్ప కూలిపోయింది. దీంతో ఆ ప్రాంతమంతా ఆకాశంలో నల్లటి పొగ పేరుకుపోయింది. చెట్టును తాకడంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. 242 మంది ప్రయాణీకులు బోర్డింగ్‌ చేసినట్లు సమాచారం. రెస్క్యూ టీమ్‌ వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఇక ఈ విమానం అహ్మదాబాద్ నుంచి లండన్ కు వెళుతుండగా ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. విమానాశ్రయం నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే మేఘానిననగర్ సమీపంలో కుప్పకూలిపోయింది. విమానాశ్రయం నుంచి ఇది దాదాపు 15 కిలోమీటర్ల దూరంలో ఉంది.

 

 

అహ్మదాబాద్ ఎయిర్‌పోర్ట్ సమీపంలో జరిగిన ఈ విమాన ప్రమాదం ఎయిర్ ఇండియా బోయింగ్ 787 డ్రీం లైనర్ గా సమాచారం. ఈ విమానం టేక్ ఆఫ్‌ అయిన కాసేపటిక కుప్పకూలింది. దీంతో భారీగా మంటలు చెలరేగాయి. అయితే ఈ ప్రయాణ సమయంలో 242 మంది ప్రయాణికులు ఉన్నారని అధికారులు వెల్లడించారు. 

 ఇక అహ్మదాబాద్ విమాన ప్రమాదం గురించి కేంద్ర హోం మంత్రి అమిత్ షా గుజరాత్ సీఎంతో మాట్లాడారు. ఇప్పటికే ఫోన్ చేసి ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. అయితే ఎయిర్ ఇండియా అధికారులు ఈ విమానం మధ్యాహ్నం 1: 17 గంటలకు టేక్ ఆఫ్ కాగా.. 1:50 గంటలకి ఎమర్జెన్సీ డిక్లేర్ చేశారు అని చెప్పారు. మొత్తంగా ఈ విమాన ప్రయాణ సమయంలో 242 మంది ప్రయాణికులు 10 మంది సిబ్బంది, ఇద్దరు పైలెట్లు ఉన్నట్లు సమాచారం. ఈ విమాన ప్రమాదంతో ఆ ప్రాంతాల్లో బంధువుల రోదనలు మిన్నంటాయి. వీటికి సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. భారీ సంఖ్యలో మరణాలు సంభవించి ఉండొచ్చని వార్తలు కూడా సోషల్‌ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న ఈ విమానం మేఘానీనగర్ లో కుప్పకూలింది. సమాచారం ప్రకారం ఈ విమానం ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ చేరుకుని అక్కడ నుంచి లండన్‌కు బయలుదేరుతుంది.

కూలిన విమానంలో మాజీ సీఎం..?
అయితే ఈ రోజు ఈ కుప్పకూలిన అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమానంలో మాజీ సీఎం విజయ రూపాని కూడా ఉన్నట్లు సమాచారం. ఆయనతో పాటు పలువురు ముఖ్య నేతలు ఉన్నట్లు కూడా వార్తలు బయటకు వస్తున్నాయి. మరిన్ని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

Also Read: తల్లికి వందనం అకౌంట్‌లలోకి రూ.13,000.. మిగతా రూ.2000 కోత ఎందుకంటే?

Also Read: జియో సూపర్‌హిట్‌ ప్లాన్.. రూ.895 కే 11 నెలల వ్యాలిడిటీ పొందే ఛాన్స్‌..  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

0
0
Report

Karimnagar: కరీంనగర్ రైతులకు ఎరువుల కష్టం.. వానాకాలం సాగు వేళ వ్యాపారుల దోపిడీ!

Hyderabad, Telangana:

Karimnagar Fertilizer Shortage Telugu News: వానాకాలం సాగు సీజన్ ప్రారంభం వేల ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని అన్నదాతలను ఎరువుల కోరతతో పాటు ధరల మాయాజాలం తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవైపు ఆకాశాన్ని తాకుతున్న పెట్టుబడి వ్యాయాయంతో పాటు మరోవైపు నకిలీల భయంతో సతమతమవుతున్న రైతులకు.. ఇప్పుడు ఎరువుల వ్యాపారుల దోపిడీ అదనపు శాపంగా మారింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది దాదాపు 12.29 లక్షల ఎకరాల్లో వరి సాగుకు రైతాంగం సర్వం సిద్ధం చేసుకున్న తరుణంలో.. ఎరువుల కృత్రిమ కోరతతో పాటు అక్రమ విక్రయాలు వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తించేలా చేస్తున్నాయి..

పాత స్టాక్‌కు కొత్త ధరలు.. 
మార్కెట్లోని కొత్త నిలువలు రాకముందే.. పాత స్టాకులను కొత్త ధరలకు విక్రయిస్తూ కొందరు వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపణలు ఊహించని స్థాయిలో వెల్లువెత్తుతూ వస్తున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వం నిర్ణయించిన గరిష్ట విక్రయ ధరల కంటే ఒక్కొక్క ఎరువు బస్తా పై దాదాపు రూ.200 నుంచి రూ.300 వరకు అదనంగా వసూలు చేస్తున్నట్లు సమాచారం. దీనిపై ప్రశ్నించిన రైతులకు ఎరువులు లేవంటూ తెగేసి చెప్తుండడంతో.. చేసేదేమీ లేక అడిగినంత ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది..

యూరియా కావాలంటే.. అవి కొనాల్సిందే..
రైతులను నిలుపునా ముంచుతున్న మరో ప్రధాన సమస్య లింక్ బిజినెస్.. డిమాండ్ ఎక్కువగా ఉన్న యూరియా లేదా ఇతర ముఖ్యమైన కాంప్లెక్స్ ఎరువులు కావాలంటే.. వాటితో పాటు వ్యాపారులకు లాభాలు తెచ్చిపెట్టే ఇతర పనికిరాని జింక్ తో పాటు సల్ఫర్ లేదా బయో ప్రొడక్ట్స్ ను తప్పకుండా కొనుగోలు చేయాలని డీలర్లు మొండి చేస్తున్నారట.. యూరియా బస్తా కావాలంటే రూ.300 విలువ చేసే మరో మందు డబ్బాను బలవంతంగా అంటగడుతున్నారని.. దీనివల్ల వారికి అనవసరమైన ఆర్థిక భారం పెరుగుతుందని ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కొంతమంది రైతులు చెబుతున్నారు..

Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!

అధికారుల నిఘా కరవు..
అక్రమంగా పెంచిన ధరలకు విక్రయిస్తున్న కారణంగా.. వ్యాపారులు రైతులకు ఎలాంటి అధికారిక బిల్లులు ఇవ్వడం లేదు.. బిల్లులు అడిగితే స్టాక్ లేదని సాకులు చెబుతున్నారు. అంతేకాకుండా పీఓఎస్ మిషన్ల ద్వారానే విక్రయాలు జరపాలని నిబంధనలు ఉన్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో అవి అమలు కావడం లేదు.. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా రూ.12.29 లక్షల ఎకరాల్లో సాగు అవుతున్న నేపథ్యంలో ఎరువుల అవసరం చాలా ఎక్కువగా ఉంది. దీనిని ఆసరాగా చేసుకొని సాగుతున్న ఈ దోపిడీపై వ్యవసాయ శాఖ అధికారులు తక్షణమే స్పందించాలని.. ఆస్క్ ఫోర్స్ బృందాలతో పాటు ఇతర అధికారులు ప్రత్యేకమైన తనిఖీలు నిర్వహించి.. బ్లాక్ మార్కెట్ కు తరలిస్తున్న వారిపై.. లూటీ చేస్తున్న డీలర్ల పై కఠిన చర్యలు తీసుకోవాలని ఉమ్మడి జిల్లా రైతాంగం డిమాండ్ చేస్తుంది.

Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

0
0
Report

Sarvartha Siddhi Yoga: జూన్ 15న సర్వార్థ సిద్ధి యోగం.. ఈ 5 రాశుల వారికి దిమ్మతిరిగే ధనలాభం, బంపర్ ఆఫర్లు!

Hyderabad, Telangana:

Sarvartha Siddhi Yoga Effect On Zodiac: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. జూన్ 15వ తేదీ జాల ప్రత్యేకమైనది ఎందుకంటే ఇదే రోజున ఈ సంవత్సరం మిధున సంక్రాంతి వచ్చింది. అయితే, ఈరోజు అత్యంత శుభప్రదమైన సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఈ యోగం చాలా శక్తివంతమైనదిగా కూడా చెప్పుకుంటారు. దీని కారణంగా అన్ని రాశుల వారిపై ఊహించని ప్రభావం పడుతుంది. దీంతో ఆయా రాశుల వారికి అర్థికంగా అద్భుతమైన లాభాలు కలుగుతాయి. సర్వార్థ సిద్ధి యోగం ప్రభావంతో కొన్ని రాశుల వారికి దిమ్మ తిరిగే ధన లాభాలు కలుగుతాయి.. ముఖ్యంగా విజయాలు సాధించడమే కాకుండా ఆర్థిక పరంగా ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. అలాగే అనుకుంటున్నా పనుల్లో ఊహించని ఆర్థిక లాభాలు పొందగలుగుతారు. ఏవైనా సమస్యలు ఉన్నవారికి ఈ సమయంలో తప్పకుండా పరిష్కారం దొరుకుతుంది. అయితే, ఈ శక్తివంతమైన యోగ ప్రభావంతో ఏ రాశుల వారికి మేలు జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. 

ఈ రాశులవారికి బంపర్‌ లాభాలు..
మిథున రాశి 
మిథున సంక్రాంతి సమయంలో ఏర్పడే సర్వార్థ సిద్ది యోగం ప్రభావంతో వీరికి ఆత్మవిశ్వాసం ఊహించని స్థాయిలో పెరుగుతుంది.. ముఖ్యంగా ఉద్యోగాల్లో కొత్త బాధ్యతలు లభించడమే కాకుండా చాలా కాలంగా నిలిచిపోయిన పనులు కూడా సులభంగా పూర్తవుతాయి. కొత్త కాంట్రాక్టులు లేదా లాభాలకు అవకాశాలు ఉన్నాయి కుటుంబ సంబంధాలు కూడా గతంలో కంటే ఇప్పుడు మరింత మెరుగుపడతాయి.

సింహరాశి 
సింహరాశిలో జన్మించిన వ్యక్తులకు ఈ సమయంలో కొత్త ఆదాయ మార్గాలు కూడా తెరుచుకుంటాయి. దీంతోపాటు ఆర్థికంగా కూడా చాలా వరకు కలిసి వస్తుంది. అలాగే ఉద్యోగాలు చేస్తున్న వ్యక్తులందరికీ తప్పకుండా పదోన్నతులు కూడా కలుగుతాయి. ఉన్నతాధికారుల అద్భుతమైన ప్రశంసలు కూడా అందుకుంటారు. అలాగే సమాజంలో గౌరవంతో పాటు పలుకుబడి కూడా విపరీతంగా పెరుగుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.

తులారాశి 
సర్వార్ధ సిద్ధ యోగంతో తులా రాశి వారికి కూడా అదృష్టం విపరీతంగా పెరుగుతుంది. ఉన్నత విద్య కోసం విదేశీ ప్రయాణాలు చేయాలనుకుంటున్న వ్యక్తులకు ఈ సమయం అద్భుతంగా ఉండబోతోంది. వ్యాపారాల విస్తరణకు ఈ సమయంలో అద్భుతమైన ప్రణాళికలను రచించే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ఆర్థిక స్థిరత్వం పెరగడమే కాకుండా కుటుంబంలో సంతోషకరమైన వాతావరణ నెలకొంటుంది.

ధనస్సు రాశి 
ధనస్సు రాశిలో జన్మించిన వ్యక్తులకు కూడా ఈ సర్వార్ధ సిద్దయోగ ప్రభావం అద్భుతమైన అవకాశాలను అందిస్తుంది. అంతేకాకుండా భాగస్వామ్య వ్యాపారాలు చేసే వారికి ఈ సమయం ఎంతో అద్భుతమైన అవకాశాలని అందిస్తుంది. ఉద్యోగాలు చేసే వారికి ప్రాజెక్టులలో విజయ అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా బంధాలు మరింత బలపడి విశేషమైన లాభాలు కలుగుతాయి.

కుంభరాశి 
శని అధిపతిగా వ్యవహరించే కుంభ రాశి వారికి కూడా సర్వార్ధ సిద్ధియోగ ప్రభావంతో అన్ని పనుల్లో సానుకూలమైన ఫలితాలు రావడం ప్రారంభమవుతాయి. ముఖ్యంగా ఉద్యోగాలు లేదా వ్యాపారాల్లో పోటీదారుల కంటే వీరు ముందుకెళ్లే అవకాశాలున్నాయి.. గతంలో కంటే ఇప్పుడు ఆరోగ్యం మెరుగుపడడమే కాకుండా మానసిక ఒత్తిడి కూడా విపరీతంగా తగ్గుతుంది.

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

గమనిక.. 

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report
Advertisement
Advertisement
Back to top