అమరుల త్యాగాల వల్లే ప్రజలకు స్వేచ్ఛ జీవితం: కలెక్టర్ ముజామిల్ ఖాన్
Khammam, Telangana:సైనికుల త్యాగాలను ఎప్పటికి స్మరించుకోవాలని వారి సేవలను గుర్తుపెట్టుకోవాలని ఖమ్మం కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ అన్నారు. కార్గిల్ విజయ్ దివస్ లో బాగంగా అమరులకు కలెక్టర్ నివాళిఅర్పించారు. దేశ ప్రజలు స్వేచ్చగా బ్రతుకుతున్నారంటే అది అమరుల త్యాగాల వల్లే అన్నారు. వారి త్యాగాలను వెలకట్టలేమని కలెక్టర్ అన్నారు. ఈ క్రమంలో వారి సేవలను కొనియాడుతూ గుర్తుచేసుకున్నారు. ఈకార్యక్రమంలో నగర మేయర్ నీరజా, జిల్లా సైనిక సంక్షేమ అధికారి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
YS Jagan DSC Demands: "డీఎస్సీ లీకేజీలపై సీబీఐ విచారణ జరపాలి..లోకేష్ రాజీనామా చేయాలి" వైఎస్ జగన్ డిమాండ్!
Vijayawada, Andhra Pradesh:YS Jagan Demands CBI Enquiry On DSC: ఆంధ్రప్రదేశ్ గతంలో జరిగిన మెగా డీఎస్సీ (DSC) పరీక్షల నిర్వహణలో జరిగిన లీకేజీలు, అక్రమాలపై తక్షణమే సీబీఐ (CBI) విచారణ జరిపించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్.జగన్ డిమాండ్ చేశారు. డీఎస్సీ, ఏపీపీఎస్సీ (APPSC) అంశాలకు సంబంధించిన సాక్ష్యాలు, ఆధారాలను ఆయన మీడియా సమావేశంలో ప్రజల ముందుకు ఉంచారు.
డీఎస్సీలో అక్రమాలు జరిగాయని తాము లేవనెత్తిన అంశాలన్నీ వాస్తవాలేనని క్రమంగా ప్రభుత్వమే అంగీకరించే పరిస్థితి వచ్చిందని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పేర్కొన్నారు. తప్పు చేశారు కాబట్టే ప్రభుత్వం గింజుకుంటోంది కానీ, సీబీఐ విచారణకు మాత్రం ముందుకు రావడం లేదని జగన్ ఆరోపించారు.
ఈ అక్రమాలను గట్టిగా లేవనెత్తుతామనే భయంతోనే తమకు ప్రధాన ప్రతిపక్షంగా గుర్తింపు ఇవ్వడం లేదని, చివరికి ప్రతిపక్షం లేకుండానే సభను నడుపుతున్నారని జగన్ విమర్శించారు. ప్రత్యర్థి జట్టు లేని చోట, బౌలింగ్, ఫీల్డింగ్ లేకుండా తండ్రీ కొడుకులు ఇద్దరూ బ్యాటింగ్ చేసుకుంటూ తాము అద్భుతంగా చేశామని చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
డీఎస్సీ లీకేజీలపై చర్చ జరపాలని డిమాండ్ చేస్తూ తమ ఎమ్మెల్సీలు (MLCలు) నాలుగు రోజుల పాటు శాసనమండలిని స్తంభింపజేసినా ప్రభుత్వం చర్చకు సిద్ధపడలేదని వైఎస్ జగన్ మండిపడ్డారు. ఈ అక్రమాలకు బాధ్యత వహిస్తూ లోకేష్ తన మంత్రి పదవికి రాజీనామా చేసి తప్పుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
అలాగే డీఎస్సీ పరీక్షల ప్రశ్నల తయారీ, పరీక్ష నిర్వహణ అనే రెండు కీలక బాధ్యతలను ఒకే అధికారి చేతిలో పెట్టడం ద్వారా పారదర్శకతకు పాతరవేసి, లీకేజీలకు స్వయంగా ద్వారాలు తెరిచారని వైఎస్ జగన్ ఆరోపించారు. ప్రశ్నల తయారీ అనేది ఎస్సీఈఆర్టీ (SCERT) డైరెక్టర్ బాధ్యత కాగా, పరీక్ష నిర్వహించే బాధ్యత డీఎస్సీ కన్వీనర్దని ఆయన అన్నారు.
అయితే, ఈ రెండింటినీ ఒకే వ్యక్తికి అప్పగించినట్లు లోకేష్ స్వయంగా అంగీకరించడమే కాకుండా, అందులో తప్పేముందని దబాయించారని విమర్శించారు. ఈ రెండు వ్యవస్థల మధ్య ఉండాల్సిన కనీస నియంత్రణలను ఎందుకు తొలగించారో.. అలాగే ఒకే వ్యక్తి చేతిలో రెండు కీలక బాధ్యతలు ఎందుకు పెట్టారో తేలడానికి దర్యాప్తు జరగాలని జగన్ డిమాండ్ చేశారు.
అవుట్సోర్సింగ్ ఉద్యోగి 'నవీన్' వివాదం..
డీఎస్సీ ప్రశ్నపత్రాలు తయారు చేసే విభాగంలో పనిచేసిన అవుట్సోర్సింగ్ ఉద్యోగి 'నవీన్'కు పరీక్షలో ఫస్ట్ ర్యాంక్ రావడం వాస్తవమేనని ప్రభుత్వం ఒప్పుకుందని వైఎస్ జగన్ తెలిపారు. క్వశ్చన్ బ్యాంక్ యాక్సెస్ ఉన్న నవీన్కు మొదటి ర్యాంక్ రావడంతో లీకేజీ స్పష్టంగా జరిగిందని, ఇది బయటపడితే గొడవ అవుతుందనే భయంతోనే మెరిట్ లిస్ట్ మార్చి అతనిని పక్కన పెట్టారని ఆయన ఆరోపించారు. మొదటి మెరిట్ లిస్టులో ఉన్న నవీన్ పేరును తొలగించి, రెండవ మెరిట్ లిస్టును ఎందుకు తెచ్చారని ప్రశ్నించారు.
సీబీఐ దర్యాప్తునకు డిమాండ్..
నవీన్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు రాలేదు కాబట్టే ఉద్యోగం ఇవ్వలేదని తండ్రీ కొడుకులు ఇద్దరూ అసెంబ్లీలో, కోర్టులో అధికారుల చేత చెప్పించారని విమర్శించారు. అయితే, అభ్యర్థి ఐడీని బ్లాక్ చేసి, కనీసం కాల్ లెటర్ కూడా పంపనప్పుడు నవీన్ వెరిఫికేషన్కు ఎలా రాగలుగుతాడని ప్రశ్నించారు. దీనికి సంబంధించిన ఆధారాలతో నవీన్ హైకోర్టులో అఫిడవిట్ కూడా వేశాడని పేర్కొన్నారు. అసెంబ్లీలో వీటికి తండ్రీ కొడుకులు (చంద్రబాబు, లోకేష్) సమాధానం ఎందుకు చెప్పలేదని జగన్ నిలదీస్తూ, ఈ తప్పులన్నింటిపై తక్షణమే సీబీఐ దర్యాప్తు జరగాలని డిమాండ్ చేశారు.
Also Read: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల ముందు కీలక అప్డేట్..మరి ప్రతిపక్ష వైసీపీ పరిస్థితి ఇదే
Also Read: తూర్పు గోదావరి జిల్లాలో తీవ్ర విషాదం.. నదిలో దూకిన ఏఈ కుటుంబం..ముగ్గురు గల్లంతు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Eshwar Sai Madhuri Rathod: ఫోక్ డాన్సర్ల వివాదం.. ఈశ్వర్ సాయి భార్యపై రివర్స్ కేసు పెడుతున్న మాధురి రాథోడ్?
Hyderabad, Telangana:Eshwar Sai Madhuri Rathod Controversy: ప్రముఖ ఫోక్ సాంగ్స్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న నటుడు, ఫోక్ డాన్సర్ ఈశ్వర్ సాయి వివాహేతర సంబంధానికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఫోక్ డాన్సర్ మాధురి రాథోడ్ల అక్రమ సంబంధం వ్యవహారం ఇప్పుడు పెద్ద వివాదంగా మారింది. ఈ వివాదం కాస్తా పోలీస్ స్టేషన్లకు చేరి, ఇరు వర్గాల మధ్య పరస్పర ఫిర్యాదులు, తీవ్ర ఆరోపణలతో సంచలనం సృష్టిస్తోంది.
అయితే ఈ వివాదం వేములవాడలోని రెడ్డి భవన్లో మొదలైంది. ఈశ్వర్ సాయి కోసం అతని భార్య శరణ్య, ఆమె సోదరి కలిసి అక్కడికి వెళ్లగా, ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ ఇద్దరూ ఒకే ఇంట్లో పట్టుబడ్డారు. ఆ సమయంలో అక్కడ ఒక చిన్నారి కూడా ఉంది. దీనికి సంబంధించిన దృశ్యాలను శరణ్య సోదరి తన మొబైల్లో వీడియో రికార్డ్ చేసింది.
ఇదే విషయమై తాము ప్రశ్నించినందుకు ఈశ్వర్ సాయి, అతని అసిస్టెంట్ తమపై దాడి చేసి, అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా మొబైల్ ఫోన్లు లాక్కున్నారని శరణ్య సోదరి ఆరోపించింది. ఈ వ్యవహారంపై హైదరాబాద్లోని రాయిదుర్గం పోలీస్ స్టేషన్లో శరణ్య సోదరి ఫిర్యాదు చేసింది.
అయితే, ఇల్లీగల్ అఫైర్ వ్యవహారం తమ పరిధిలోకి రాదని, సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం పరస్పర ఇష్టంతో ఉండే సంబంధాలు నేరం కిందకు రావని పోలీసులు స్పష్టం చేశారు. దాడులు లేదా ఫోన్ లాక్కున్న ఘటన వేములవాడలో జరిగింది కాబట్టి అక్కడే ఫిర్యాదు చేసుకోవాలని రాయిదుర్గం పోలీసులు వారికి సూచించారు.
మరోవైపు ఈ వ్యవహారంలో సదరు మాధురి రాథోడ్ కమ్యూనిటీకి చెందిన వారు ఎదురుదాడికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. తను తన స్నేహితుడైన ఈశ్వర్ సాయితో ఉన్న సమయంలో శరణ్య, ఆమె సోదరి అకారణంగా లోపలికి వచ్చి, తనపై భౌతిక దాడికి పాల్పడ్డారని మాధురి పేర్కొంది.
అంతేకాకుండా తనను కులం పేరుతో దూషిస్తూ అవమానించారని.. వ్యక్తిగత వీడియోలను సోషల్ మీడియాలో విడుదల చేసి పరువు తీశారని ఆమె ఆరోపిస్తోంది. దీనిపై శరణ్య, ఆమె సోదరిపై వేములవాడ పోలీస్ స్టేషన్లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసేందుకు మాధురి చట్టపరమైన సలహాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
అయితే, మాధురి రాథోడ్ పక్కనే ఉంటూ నటిస్తూ, తన భర్తను వలలో వేసుకుని, లొంగతీసుకుని ఇల్లు చేరకుండా చేస్తోందని ఈశ్వర్ సాయి భార్య శరణ్య ఆవేదన వ్యక్తం చేస్తోంది. ప్రస్తుతం ఈ కేసులో ఇరువర్గాలు చట్టపరమైన చర్యల కోసం సిద్ధమవుతుండటంతో వేములవాడ పోలీసులు వీటిపై దృష్టి సారించారు.
Also Read: నటి మీనా భర్త మృతి వెనుక అసలు నిజం ఇదే..ఇంటర్వ్యూలో చెబుతూ కంటతడి పెట్టిన హీరోయిన్!
Also Read; 'ఇరుముడి' సినిమా ఫస్ట్ రివ్యూ..రవితేజ కంబ్యాక్..థియేటర్లలో అయ్యప్ప శరణుఘోష పక్కా!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Sonia Gandhi Vande Mataram: సోనియా గాంధీ వందేమాతరం వివాదం..కాంగ్రెస్ పార్టీపై మరింత పెరిగిన రాజకీయ రగడ!
Hyderabad, Telangana:AC Side Effects Monsoon: వర్షాకాలంలో కూడా ఏసీ వాడుతున్నారా? అయితే మీరు ఈ సమస్యలు తెచ్చిపెట్టుకున్నట్టే!
Hyderabad, Telangana:AC Side Effects In Monsoon: వర్షాకాలంలో ఉక్కపోత, తేమ నుండి ఉపశమనం పొందేందుకు చాలా మంది ఎక్కువ సమయం ఏసీ (AC) గదుల్లోనే గడుపుతుంటారు. అయితే ఏసీ నుండి వచ్చే చల్లని, పొడి గాలి చర్మానికి తీవ్ర హాని చేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రముఖ చర్మవాధుల నిపుణుల సూచనల ప్రకారం.. ఈ సీజన్లో ఏసీ వాడేటప్పుడు కొన్ని పొరపాట్లు చేస్తే ఎలాంటి సమస్యలు వస్తాయో, వాటిని ఎలా నివారించాలో ఇక్కడ చూద్దాం.
చర్మం పొడిబారడం, ఇన్ఫెక్షన్లు..
బయటి వాతావరణంలోని తేమకు, ఏసీ గదిలోని పొడి గాలికి మధ్య జరిగే నిరంతరం మార్పు వల్ల చర్మం సహజ తేమను కోల్పోతుంది. దీనివల్ల చర్మం పొడిబారి, తీవ్రమైన దురద, చికాకు కలుగుతాయి. గోకడం వల్ల ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం పెరుగుతుంది.
చేయకూడని తప్పులు..
1) తక్కువ ఉష్ణోగ్రతలో ఏసీ వాడకం అనగా చాలా మంది ఏసీని 16 లేదా 18 డిగ్రీల వద్ద సెట్ చేస్తుంటారు. అలా కాకుండా ఉష్ణోగ్రతను 25 నుండి 26 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంచడం చర్మానికి మంచిది.
2) నేరుగా గాలి తగలకుండా చూసుకోవడం అంటే.. ఏసీ లేదా కార్ వెంట్స్ నుంచి వచ్చే బలమైన గాలి నేరుగా ముఖానికి తగిలేలా ఉంటే చర్మం త్వరగా పొడిబారుతుంది. గాలి పక్కకు వెళ్లేలా వెంట్లను సర్దుబాటు చేసుకోవాలి.
3) తగినంత నీరు తాగకపోవడం అనగా.. రోజంతా ఏసీ ఆఫీసుల్లో ఉండేవారు తగినన్ని నీళ్లు తాగకపోతే డీహైడ్రేషన్ బారిన పడతారు. ఇది చర్మాన్ని నిర్జీవంగా మారుస్తుంది.
4) మాయిశ్చరైజర్ వాడకపోవడం మంచిది. ప్రతి నాలుగు గంటలకు ఒకసారి తేలికపాటి మాయిశ్చరైజర్, పెదవులకు లిప్ బామ్ రాసుకోవడం వల్ల చర్మంలో తేమ నిలుస్తుంది.
చర్మ పరిశుభ్రత, ఆహారం..
వర్షాకాలంలో తేమ, చెమట కారణంగా బ్యాక్టీరియా చేరే అవకాశం ఉంది. అందుకే మంచి సబ్బుతో రోజుకు రెండుసార్లు స్నానం చేయడం, ముఖాన్ని శుభ్రమైన నీటితో రోజుకు 2-3 సార్లు కడుక్కోవడం మంచిది. అలాగే పోషకాలున్న పండ్లు, ఆకుకూరలు తింటూ చర్మాన్ని లోపలి నుండి ఆరోగ్యంగా ఉంచుకోవాలి.
Also Read: బరువు తగ్గడానికి 'యాపిల్ సైడర్ వెనిగర్' మంచిదా..?
Also Read: Weight Loss Tips: వాకింగ్ Vs రన్నింగ్..ఫాస్ట్గా బరువు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Konda Surekha: వివాదాల కేరాఫ్ అడ్రస్గా మంత్రి కొండా సురేఖ.. డిఫెన్స్లో కాంగ్రెస్!
Hyderabad, Telangana:Minister Konda Surekha News: తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ నాయకురాలిగా మంచి గుర్తింపు పొందిన మంత్రి కొండా సురేఖ చుట్టు వివాదాలు వీడకుండా చుట్టూ ముడుతూనే ఉన్నాయి.. తనదైన దూకుడు శైలిలో వార్తల్లో నిలిచే ఆమె.. చేసిన వరుస వ్యాఖ్యలతో పాటు చోటు చేసుకున్న పరిణామాలు ప్రభుత్వానికి.. కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరంగా మారుతూ వస్తున్నాయి.. గత కొద్ది కాలంగా ఒక వివాదం ముగిసేలోపే మరొకటి తెరపైకి వస్తూ ఆమెను రాజకీయంగా సుడిగుండంలోకి నెడుతోంది..
సినీనటి సమంత విడాకుల వ్యవహారంలో మంత్రి కొండా సురేఖ గతంలో చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా పెను దుమారాన్ని రేపిన సంగతి తెలిసిందే.. రాజకీయ విమర్శల క్రమంలో సినీ ప్రముఖుల పేర్లను ప్రస్తావించడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.. సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులతో పాటు ఇతర రాజకీయ పార్టీ నాయకులు సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు న్యాయపరమైన వివాదాలకు కూడా దారి తీసిన సంగతి తెలిసిందే. పరిస్థితి తీవ్రతను గమనించిన ఆమె బహిరంగంగా క్షమాపణలు చెప్పడంతో ఆ వివాదం కాస్త సర్దుమనిగిపోయింది..
సమంత వివాదం చల్లారుతున్న సమయంలోనే.. మంత్రులు ఫైల్ క్లియరెన్స్ కోసం డబ్బులు తీసుకుంటున్నారంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు సొంత పార్టీలోనే తీవ్ర ఆగ్రహానికి దారి తీసేలా చేశాయి.. క్యాబినెట్ సహచరులపైనే తీవ్ర ఆరోపణలు చేసినట్లు అవ్వడంతో కాంగ్రెస్ అధిష్టానం ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించిన సంగతి కూడా తెలిసిందే.. ఈ ప్రకటనతో అటు ప్రభుత్వంపై విపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శల దాడికి దిగాయి.
Also Read: తెలుగు రాష్ట్రాల్లో 22A పిడుగు.. సొంత భూమి ఉన్నా ఎందుకీ తిప్పలు?
మరోవైపు ఉమ్మడి వరంగల్ జిల్లాలో సీనియర్ నేత కడియం శ్రీహరితో జరిగిన ప్రోటోకాల్ వివాదం కూడా పార్టీ వర్గాల్లో తీవ్రమైన చర్చనీ అంశానికి దారితీసింది.. అలాగే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తో టెండర్ల ప్రక్రియకు సంబంధించిన అంశాలు కూడా అంతర్గత విభేదాలను రచ్చకెక్కించేలా చేశాయి.. ఇలా వరుస వివాదాలతో సతమతమవుతున్న తరుణంలో.. తాజాగా ఆమె కుమార్తె చేసిన వ్యాఖ్యలు మంత్రి సురేఖకు మరింత తలనొప్పిగా మారేలా చేశాయి.. సొంత పార్టీ నేతలతో సమన్వయం లేకపోవడంతో పాటు దూకుడుగా మాట్లాడే శైలి ఆమెను మరింత డిఫెన్స్లో పడేస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.. వరుస వివాదాల నేపథ్యంలో అధిష్టానం ఈ వ్యవహారంపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందో అన్న ఉత్కంఠ రాజకీయ వర్గాల్లో నెలకొంది..
Also Read: తెలుగు రాష్ట్రాల్లో 22A పిడుగు.. సొంత భూమి ఉన్నా ఎందుకీ తిప్పలు?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Meena Husband Death: నటి మీనా భర్త మృతి వెనుక అసలు నిజం ఇదే..ఇంటర్వ్యూలో చెబుతూ కంటతడి పెట్టిన హీరోయిన్!
Hyderabad, Telangana:Meena Husband Death Reason: దక్షిణాది చిత్ర పరిశ్రమలో మూడు దశాబ్దాలకు పైగా స్టార్ హీరోయిన్గా వెలుగొందిన మీనా వ్యక్తిగత జీవితంలో 2022లో తీవ్ర విషాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఆమె భర్త విద్యాసాగర్ హఠాన్మరణం చెందడం అప్పట్లో సినీ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన మరణంపై రకరకాల పుకార్లు వచ్చినప్పటికీ, తాజాగా ఒక ఇంటర్వ్యూలో మీనా స్పందిస్తూ తన భర్తను కాపాడుకునేందుకు తాను పడిన వేదనను తలచుకుని తీవ్రంగా భావోద్వేగానికి గురయ్యారు.
నటి మీనా భర్త విద్యాసాగర్ మృతికి సంబంధించి ఆమె మాట్లాడుతూ.. ఆయనకు ఊపిరితిత్తుల మార్పిడి (లంగ్ ట్రాన్స్ప్లాంట్) చేయాల్సి వచ్చిందని తెలిపారు. అప్పట్లో ఈ వైద్య ప్రక్రియ గురించి తమకు అంతగా అవగాహన లేదని, ఆ మెడికల్ ప్రాసెస్ చాలా పెద్దదానిని ఆమె వెల్లడించారు.
వైద్యం కోసం దేశమంతా తిరిగిన వైనం..
భర్తను బతికించుకోవడానికి హైదరాబాద్, బెంగళూరు ఇలా దేశంలోని పలు ప్రాంతాల్లో బెస్ట్ ట్రీట్మెంట్ కోసం శతవిధాలా ప్రయత్నించినట్లు మీనా చెప్పారు. అమెరికా వెళ్లి వైద్యం చేయిద్దామని ఆలోచించినా, అక్కడి డాక్టర్లు కూడా ఇక్కడ ఇస్తున్న చికిత్సనే అక్కడ కూడా ఇస్తారని, ఈ స్థితిలో ప్రయాణం చేయడం క్షేమం కాదని చెప్పడంతో ఇండియాలోనే ఉండాల్సి వచ్చిందన్నారు.
లంగ్స్ మార్పిడి కోసం పలుమార్లు అలెర్ట్స్ వచ్చినా.. మెడికల్ క్రైటీరియా సరిపోకపోవడం, అవయవాలు మ్యాచ్ కాకపోవడంతో మూడు, నాలుగు సార్లు ఆస్పత్రికి వెళ్లి వెనుదిరిగిన సందర్భాలున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యుల పర్యవేక్షణలో ఎంత ప్రయత్నించినప్పటికీ ఆయన శరీరం చికిత్సకు సహకరించలేదని చెప్పారు.
భర్త మరణం తర్వాత తాను కుటుంబంతో కలిసి చాలా కఠినమైన రోజులను ఎదుర్కొన్నానని మీనా పేర్కొన్నారు. ఇప్పటికీ కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ, తన స్నేహితులు, సినిమాల సాయంతో ఆ విషాద ఛాయల నుంచి క్రమంగా బయటపడుతున్నట్లు ఆమె తెలిపారు.
Also Read: 'ధురంధర్' నటి ఆయేషా ఖాన్ నిశ్చితార్థం..అతడి ఫొటో సీక్రెట్గా..సోషల్ మీడియాలో వైరల్!
Also Read: 'చెన్నై లవ్స్టోరీ' నుంచి 'జన నాయగన్' వరకు..ఈ వారం ఓటీటీల్లో విడుదల కానున్న సినిమాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Rare Crime: ఐఫోన్, ప్రియుడి బైక్ కోసం కన్న తాతనే చంపేసిన 13 ఏళ్ల మైనర్ బాలిక..
Hyderabad, Telangana:Rare Crime In Kerala: లగ్జరీ జీవితంతో పాటు ఖరీదైన స్మార్ట్ ఫోన్లపై పెంచుకున్న ఓ పిచ్చి వ్యామోహం.. ఓ మైనర్ బాలిక ను నేరస్తురాలుగా మార్చేసింది.. చేతిలో ఐఫోన్ ఉండాలని.. ప్రియుడితో కలిసి సూపర్ బైక్ పై చెక్కర్లు కొట్టాలన్న దురాశతో.. పెంచి పెద్ద చేసిన కన్న తాత ప్రాణాలని తీసేసింది 13 ఏళ్ల ఒక బాలిక.. కేరళలోని అలప్పుజ జిల్లాలు వెలుగు చూసిన ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియా వ్యాప్తంగా పెద్ద సెన్సేషన్ గా మారింది.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..
అసలు ఏమైందంటే..
అలప్పుజకు సంబంధించిన 60 ఏళ్ల వృద్ధుడు తన ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు కనిపించాడు.. ఇంట్లో బంగారు ఆభరణాలతో పాటు విలువైన వస్తువులు మాయం కావడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మొదటగా దీనిని దొంగతనం కోసం జరిగిన హత్యగా భావించి.. అదే కోణంలో దర్యాప్తు చేయడం మొదలుపెట్టారు..
అయితే, ఇంట్లోని పరిస్థితులతో పాటు అనుమానితుల కదలికలను పరిశీలించిన పోలీస్ అధికారులు మనమరాలి ప్రవర్తన పై అనుమానం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. దీంతో అదే సమయంలో ఆమెను అదుపులోకి తీసుకొని పోలీసులు తమదైన శైలిలో విచారించగా.. కళ్లు బైర్లు కమ్మి నిజాలు బయటపడి అందర్నీ ఆశ్చర్యపోయేలా చేశాయి..
క్రైమ్ సినిమాను తలపించే పథకం..
విచారణలో బాలిక వెల్లడించిన విషయాలను విన్న పోలీసులే ఊహించని స్థాయిలో ఆశ్చర్యపోయినట్లు తెలుస్తోంది. తనకు కొత్త ఐఫోన్ కావాలని.. తన ప్రియుడికి ఒక సూపర్ బైక్ కొనివ్వాలని ఆమె ముందుగా భావించిందట.. దీనికి పెద్ద మొత్తంలో డబ్బులు అవసరం అవ్వడంతో.. ఇంట్లో ఉండే తాతను అడ్డు తొలగించుకొని.. నగలను దోచుకోవాలని పథకం రచించిందని దర్యాప్తులో తేలింది.
ఈ కుట్రలో తమ ప్రియుడితో పాటు మరో ఇద్దరు మైనర్ స్నేహితులను భాగస్వాములు చేసింది ఆ మైనర్ నిందితురాలు.. పక్కా ప్రణాళిక ప్రకారం తాత ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయాన్ని చూసి ప్రియుడితో పాటు అతని స్నేహితులతో లోపలికి ప్రవేశించిందట.. వృద్ధిడి పై దాడి చేసి అత్యంత కిరాతకంగా చంపారు.. అనంతరం ఇంట్లో బంగారంతో పాటు నగలను దోచుకుని అక్కడి నుంచి పారిపోయారట.. దోచుకున్న బంగారాన్ని అమ్మి అనుకున్నవన్నీ కొనుగోలు చేసే లోపే పోలీసులు వీరి గుట్టును రట్టు చేసేసారు..
Also Read: తెలుగు రాష్ట్రాల్లో 22A పిడుగు.. సొంత భూమి ఉన్నా ఎందుకీ తిప్పలు?
పోలీసుల అదుపులో నిందితులు..
హత్యకు పాల్పడిన బాలికతో పాటు ఆమె ప్రియుడు, సహకరించిన మరో ఇద్దరు మైనర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారట.. వారి వద్ద నుంచి చోరీ చేసిన బంగారు ఆభరణాలను కూడా స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. అంతేకాకుండా నిందితులంతా మైనర్లు కావడంతో వారిని ప్రత్యేకమైన జువైనల్ జస్టిస్ బోర్డు ముందు హాజరు చేసి.. రిమాండ్ హోమ్ కు తరలించినట్లు పోలీస్ అధికారులు తెలిపారు..
Also Read: తెలుగు రాష్ట్రాల్లో 22A పిడుగు.. సొంత భూమి ఉన్నా ఎందుకీ తిప్పలు?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Venus Transit: శుక్ర సంచారంతో గోల్డెన్ డేస్.. ఉద్యోగంలో ప్రమోషన్లు, భారీ లాభాలు పొందే లక్కీ రాశులివే!
Hyderabad, Telangana:Venus Transit In Chitra Nakshatra Effect: వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రుడిని అత్యంత ముఖ్యమైన గ్రహంగా పరిగణిస్తూ ఉంటారు. ఈ గ్రహం సంపదతో పాటు ప్రేమ వైభవం విలాసం సౌందర్యానికి కారకుడిగా కూడా భావిస్తారు. ఇదిలా ఉంటే ఆగస్టు 25వ తేదీన 12 గంటల సమయంలో శుక్రుడు నక్షత్ర సంచారం చేయబోతున్నాడు. ఈ గ్రహం సెప్టెంబర్ 11వ తేదీ వరకు ఒకటే నక్షత్రంలో సంచార దశలో ఉండబోతోంది. ముఖ్యంగా చిత్రా నక్షత్రంలోకి శుద్రుడు ప్రవేశించడం కారణంగా మొత్తం నాలుగు రాశుల వారిపై ఊహించని ప్రభావం పడబోతోంది. ఈ సమయంలో విపరీతమైన ఆధార మార్గాలు పెరగడమే కాకుండా కొన్ని రాశుల వారికి ఉద్యోగాలపరంగా అద్భుతమైన ప్రయోజనాలు చేకూరుతాయి. అంతేకాకుండా వ్యాపారాల్లో పురోగతి కూడా లభిస్తుంది. శుక్రుడి సంచారం కారణంగా ఏయే నాలుగు రాశుల వారికి సమయం అద్భుతంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ రాశులవారికి బంపర్ లాభాలు:
మేషరాశి
చిత్రా నక్షత్రంలోకి శుక్రుడు ప్రవేశించిన వెంటనే మేషరాశి వారికి ఎంతో మేలు జరుగుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ సమయంలో ఉద్యోగస్తులు కార్యాలయాల్లో మంచి మంచి పనులు చేయగలుగుతారు. కొత్త ప్రాజెక్టుల నుంచి భారీ మొత్తంలో డబ్బులు కూడా పొందే అవకాశాలు ఉన్నాయి. ఆదాయ వనరులు కూడా అంచలంచలుగా పెరుగుతాయి. అంతేకాకుండా డబ్బుకు ఎలాంటి కొరత ఉండదని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.
వృషభ రాశి
వృషభ రాశిలో జన్మించిన వ్యక్తులకు ఈ సమయం అద్భుతమైన అవకాశాలను అందిస్తుంది. అంతేకాకుండా శుక్రుడు సంచార ప్రభావం కొత్త ప్రణాళికలను కూడా విజయవంతం చేస్తుంది. వృత్తిలో గొప్ప పురోగతి లభించడమే కాకుండా మంచి మంచి పదోన్నతులు లభించేలా చేస్తుంది. ముఖ్యంగా ఎప్పటినుంచో మానసిక ఆందోళన వంటి సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులందరికీ పరిష్కారం కూడా లభిస్తుంది. అలాగే వ్యాపారస్తులు సరైన నిర్ణయాలు కూడా తీసుకుంటారు.
తులారాశి
తులా రాశిలో జన్మించిన వ్యక్తులకు చిత్రా నక్షత్రంలో శుక్రుడు ప్రవేశించడం కారణంగా ఈ సమయం గోల్డెన్ పీరియడ్గా మారుతుంది. అంతేకాకుండా కొత్త మార్గాల నుంచి ఆదాయం కూడా విపరీతంగా లభిస్తుంది.. ఈ సమయంలో సంతోషకరమైన రోజు కూడా రావడం ప్రారంభమౌతాయి. వ్యాపారాల్లో భారీ లాభాలు కలగడమే కాకుండా పాత పెట్టుబడిల నుంచి అనుకున్న ధన లాభాలు సొంతం చేసుకోగలుగుతారు. ముఖ్యంగా కుటుంబంలో ఆనందం కూడా రెట్టింపు అవుతుంది.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశిలో జన్మించిన వ్యక్తులకు కూడా శుక్రుడి ప్రభావంతో జీవితంలో అనేక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఉద్యోగాలు మారాలని అనుకుంటున్న వ్యక్తులందరికీ మంచి ఆఫర్స్ లభిస్తాయి. ముఖ్యంగా కోరుకుంటున్న కోరికలు కూడా చాలా వరకు నెరవేరుతాయి. చాలాకాలంగా నిలిచిపోయిన పనులు కూడా పూర్తవుతాయి.. సమాజంలో గౌరవం విపరీతంగా పెరుగుతుంది. ప్రేమ సంబంధాలు ఊహించని స్థాయిలో మెరుగుపడి.. అద్భుతమైన గౌరవంతో పాటు ఆనందం పొందగలుగుతారు. ముఖ్యంగా కుటుంబంలో మంచి రోజులు రావడం ప్రారంభమవుతాయి.
గమనిక.. ఇక్కడ అందించిన సమాచారం కేవలం అంచనాలతో పాటు జ్యోతిష్య శాస్త్ర నిపుణుల నుంచి సేకరించి రాసింది మాత్రమే. దీనికి జీ తెలుగు న్యూస్ కి ఎలాంటి సంబంధం లేదు..
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..
E10 Petrol: వాహనదారులకు బిగ్ రిలీఫ్..పెట్రోల్ బంకుల్లో పాత వాహనాల కోసం మళ్లీ E10 పెట్రోల్ అందుబాటులో!
Hyderabad, Telangana:E10 Petrol Brings Back: దేశవ్యాప్తంగా పెట్రోల్లో ఇథనాల్ కలపడంపై వ్యక్తమవుతున్న ఆందోళనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక పునరాలోచనలో పడింది. వాహనాల మైలేజ్, ఇంజిన్ ఆయుష్షు తగ్గిపోతున్నాయంటూ వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో, పాత వాహనాల కోసం ప్రత్యేకంగా E10 పెట్రోల్ (10 శాతం ఇథనాల్ కలిపిన ఇంధనం)ను మళ్లీ బంకుల్లో అందుబాటులోకి తీసుకురావాలని భారత ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు (CEA) అనంత నాగేశ్వరన్ ప్రతిపాదించారు. కొత్త వాహనాలకు మాత్రం E20ని యథావిధిగా కొనసాగించాలని ఆయన సూచించారు.
కేంద్ర ప్రభుత్వ విధానం ప్రకారం దేశంలో 20 శాతం ఇథనాల్ బ్లెండింగ్ చేసిన E20 పెట్రోల్ అమల్లో ఉంది. అయితే పాత ఇంజిన్లు ఉన్న మోటార్ సైకిళ్లు, కార్ల యజమానులు దీనివల్ల నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో E10ని పునరుద్ధరిస్తే ధరలు ఏ విధంగా ఉంటాయనే దానిపై మార్కెట్లో చర్చ నడుస్తోంది.
ధరల అంచనా..
ప్రస్తుత ట్యాక్స్లు, పెట్రోల్, ఇథనాల్ బేస్ ధరల ఆధారంగా చూస్తే.. E20తో పోలిస్తే E10లో పెట్రోల్ శాతం (90%) కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. దీంతో దీని లీటరు ధర సుమారు రూ.103 నుంచి రూ.105 మధ్య ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే ప్రాంతాన్ని బట్టి ఈ ధరల్లో మార్పులు ఉండవచ్చు.
ఇథనాల్ కలపని ప్రీమియం ఇంధనాలు..
మరోవైపు ఎలాంటి ఇథనాల్ కలపని స్వచ్ఛమైన E0 ప్రీమియం పెట్రోల్ (100 ఆక్టేన్) కూడా కొన్ని ఎంపిక చేసిన నగరాల్లో అందుబాటులో ఉంది. ఇండియన్ ఆయిల్ (XP100), హెచ్పీ (Power100), బీపీసీఎల్ (Speed100) వంటి సంస్థలు విక్రయిస్తున్న ఈ ఇంధనాన్ని బ్లెండింగ్ నిబంధనల నుంచి మినహాయించారు. హైదరాబాద్, బెంగళూరు, ముంబై, ఢిల్లీ వంటి మెట్రో నగరాల్లోని సెలెక్టెడ్ బంకుల్లో ఇది లభిస్తోంది.
పాత వాహనదారులకు ఎదురవుతున్న ఇబ్బందిని దృష్టిలో ఉంచుకుని ఈ-10 ఇంధనాన్ని పునరుద్ధరించే ప్రపోజల్పై కేంద్ర ప్రభుత్వం త్వరలోనే అధికారిక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇది అమలైతే పాత మోడల్ వాహనాల డ్రైవర్లకు పెద్ద ఉపశమనం లభించనుంది.
Also Read: స్కూల్ విద్యార్థులపై వీధికుక్కల వరుస దాడులు..ఆ స్కూళ్లకు వరుసగా 4 రోజులు సెలవులు!
Also Read: మహిళా ఉద్యోగులకు గుడ్న్యూస్..మూడో బిడ్డ ప్రసవానికి 365 రోజులు ప్రసూతి సెలవులు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Cinema Ticket Prices: తెలంగాణలో సినిమా థియేటర్లలో కొత్త రేట్లు..నిర్మాతలకు కాంగ్రెస్ ప్రభుత్వం కీలక ఆదేశాలు!
Hyderabad, Telangana:Telangana Cinema Ticket Prices: తెలంగాణ ప్రభుత్వం సినిమా టికెట్ల ధరల పెంపు, థియేటర్ల నిర్వహణపై సంచలన జీవోను విడుదల చేసింది. భారీ బడ్జెట్ చిత్రాల టికెట్ హైక్స్ ద్వారా వచ్చే అదనపు ఆదాయంలో సంక్షేమ నిధులకు కేటాయింపులతో పాటు, అన్ని రకాల థియేటర్లకు కొత్త కనిష్ఠ, గరిష్ఠ ధరలను ఖరారు చేసింది.
థియేటర్ల వారీగా టికెట్ ధరల వివరాలు..
తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన ప్రత్యేక ఆదేశాల ప్రకారం.. నాన్-ఏసీ థియేటర్లలో నాన్-ప్రీమియం టికెట్లు రూ.30 నుంచి రూ.70 వరకు.. అలాగే ప్రీమియం రూ.50 నుంచి రూ.100 వరకు నిర్ణయించారు. ఏసీ థియేటర్లలో నాన్-ప్రీమియం రూ.50 - రూ.150 ఉండగా.. ప్రీమియం రూ.100 - రూ.200 ఉండనుంది. అదే విధంగా స్పెషల్ థియేటర్లు, మల్టీప్లెక్స్ల్లో రెగ్యులర్/నాన్-ప్రీమియం రూ.100 - రూ.250.. రిక్లయినర్లు రూ.200 - రూ.300 గా ధరలను నిర్ణయించారు.
షోల పెంపు, చిన్న సినిమాలకు ప్రాధాన్యం..
ప్రతి థియేటర్లో రోజుకు ఉదయం 8 గంటల నుంచి అర్ధరాత్రి 1 గంట వరకు 5 షోలకు అనుమతినిచ్చారు. ఉదయం 11 నుంచి రాత్రి 9 గంటల మధ్య ఒక షో చిన్న సినిమాల ప్రదర్శనకు కేటాయించాలని, పండుగ సీజన్లలో చిన్న/మీడియం బడ్జెట్ చిత్రాలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు.
ఇతర ముఖ్యమైన మార్గదర్శకాలు..
రూ.100 కోట్లకు పైగా బడ్జెట్ ఉన్న సినిమాలకు మొదటి 10 రోజులు మాత్రమే టికెట్ ధరల పెంపు వర్తిస్తుంది. అయితే సినీ కార్మిక సంక్షేమ నిధికి రూ.1 కోటి విరాళం ఇచ్చే చిత్రాలకే ఈ పెంపు అవకాశం లభిస్తుంది.
మల్టీప్లెక్స్లతో సహా అన్ని థియేటర్లలో పేద, మధ్యతరగతి ప్రేక్షకుల కోసం 25 శాతం సీట్లు (నాన్-ప్రీమియం) తప్పనిసరిగా కేటాయించాలి. ఆన్లైన్ బుకింగ్స్పై ఏసీ థియేటర్లకు రూ.5, నాన్-ఏసీ థియేటర్లకు రూ.3 నిర్వహణ ఛార్జీలు ఉంటాయి. రాబోయే రెండేళ్లలో ఎయిర్ కూల్డ్ థియేటర్లన్నీ ఏసీ థియేటర్లుగా మారాలని స్పష్టం చేశారు.
కార్మికుల సంక్షేమ నిధికి 20% వాటా..
'అఖండ 2', 'ది రాజాసాబ్', 'మన శంకర వరప్రసాద్ గారు', 'పెద్ది' వంటి భారీ సినిమాలకు టికెట్ ధరల పెంపును అనుమతించిన ప్రభుత్వం.. ఆ హైక్స్ ద్వారా వచ్చే అదనపు ఆదాయంలో 20 శాతాన్ని తప్పనిసరిగా చెల్లించాలని ఆదేశించింది. ఈ మొత్తాన్ని 'తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ వెల్ఫేర్ అసోసియేషన్', 'ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్' (TGFDC) ఖాతాల్లో జమ చేసి సినీ కార్మికుల సంక్షేమానికి వినియోగించనున్నారు.
Also Read: హైదరాబాద్లో మరో దారుణమైన హత్య..లవర్ని హత్య చేసి గోనెసంచిలో కుక్కిన ప్రియుడు!
Also Read: Balapur Ganesh Theme: ఈసారి బాలాపూర్ గణేష్కు పూరీ జగన్నాథ్ ఆలయం థీమ్..ఎలా ఉండబోతుందంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
India In WTC Cycle: డబ్ల్యూటీసీ రేసులో భారత్ అసలు సిసలైన పరీక్ష.. ఫైనల్కు చేరాలంటే భారత్ ఈ మ్యాచ్ల్లో గెలవాల్సిందే!
Hyderabad, Telangana:India In WTC 2027 Cycle: ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (WTC) ఫైనల్కు అర్హత సాధించేందుకు భారత క్రికెట్ జట్టు కీలకమైన పోరుకు సిద్ధమవుతోంది. శ్రీలంక గాలే వేదికగా జరిగిన తొలి టెస్టులో 165 పరుగుల భారీ తేడాతో విజయం సాధించిన భారత్, పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మెరుగుపరుచుకుంది. ప్రస్తుతం 53.33 శాతంతో ఐదో స్థానంలో ఉన్న టీమిండియా, ఫైనల్ రేసులో నిలకడగా కొనసాగాలంటే అద్భుత ప్రదర్శన చేయడం తప్పనిసరి కానుంది.
గత రెండు డబ్ల్యూటీసీ సీజన్లలో వరుసగా ఫైనల్కు దూసుకెళ్లిన భారత్, రెండుసార్లు రన్నరప్గా నిలిచింది. ఇప్పుడు ప్రస్తుత సీజన్లోనూ అదే జోరును కొనసాగించాలని భావిస్తోంది. సాధారణంగా 60 శాతానికి పైగా పాయింట్లు సాధించిన జట్లు మాత్రమే ఫైనల్కు అర్హత సాధిస్తున్న చరిత్ర ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని భారత్ తన వ్యూహాలను రచిస్తోంది.
శ్రీలంకతో జరగనున్న రెండో టెస్టులోనూ విజయం సాధించి సిరీస్ను 2-0తో క్లీన్ స్వీప్ చేస్తే, భారత్ పాయింట్ల శాతం 57.57కు పెరిగే అవకాశం ఉంది. లంక పర్యటన ముగిసిన తర్వాత భారత్కు అసలైన పరీక్ష ఎదురుకానుంది.
న్యూజిలాండ్ గడ్డపై రెండు టెస్టుల సిరీస్, ఆ తర్వాత స్వదేశంలో ఆస్ట్రేలియాతో ఐదు టెస్టుల ప్రతిష్టాత్మక సిరీస్లలో భారత్ తలపడాల్సి ఉంది. మిగిలివున్న మొత్తం 8 టెస్టుల్లో భారత్ కనీసం 6 నుంచి 7 మ్యాచ్ల్లో విజయం సాధిస్తేనే టాప్-2 స్థానం ఖాయమవుతుంది.
ప్రస్తుతం ఆస్ట్రేలియా (77.78%), దక్షిణాఫ్రికా (75%), న్యూజిలాండ్ (72.22%) జట్లు పట్టికలో అగ్రభాగంలో ఉన్నాయి. అయితే దక్షిణాఫ్రికాకు రాబోయే రోజుల్లో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ వంటి బలమైన జట్లతో కఠినమైన మ్యాచ్లు ఉండటం భారత్కు సానుకూలాంశంగా మారవచ్చు. ఏదేమైనా, రాబోయే కివీస్, ఆసీస్ సిరీస్లే టీమిండియా ఫైనల్ భవితవ్యాన్ని నిర్ణయించనున్నాయి.
Also Read: శ్రీలంకతో తొలిటెస్టులో భారత్ ఘన విజయం..10 వికెట్లు పడగొట్టిన స్పిన్నర్ మానవ్ సుతార్!
Also Read: టెస్టుల్లో రిషబ్ పంత్ సరికొత్త రికార్డు..రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ రికార్డు బ్రేక్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
School Holidays: స్కూల్ విద్యార్థులపై వీధికుక్కల వరుస దాడులు..ఆ స్కూళ్లకు వరుసగా 4 రోజులు సెలవులు!
Simlasu, Uttarakhand:Uttarakhand School Holidays: ఉత్తరాఖండ్లోని చమోలి జిల్లా నారాయణ్బగడ్ ప్రాంతంలో హింసాత్మక కుక్కల బెడద విపరీతంగా పెరుగుతున్న తరుణంలో స్థానిక అధికారులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో నారాయణ్ బాగ్లోని 10 పాఠశాలలకు ఏకంగా నాలుగు రోజులను సెలవులుగా మంజూరు చేశారు. అయితే ఈ నాలుగు రోజుల్లో పిల్లలకు ఆన్లైన్లో తరగతులు కొనసాగించాలని అధికారులు నిర్ణయించారు.
అయితే ఈ మధ్య నారాయణబగడ్ వరుసగా జరుగుతున్న పరిణామాల దృష్ట్యా స్థానికుల్లో భయాందోళనలు పెరిగిపోయాయి. ముఖ్యంగా పాఠశాలకు వెళ్లే తమ పిల్లల భద్రత గురించి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు, కొన్ని రోజుల పాటు పాఠశాలలను మూసివేయాలని యాజమాన్యం నిర్ణయించింది.
పాఠశాలకు రాకపోకలు సాగించేటప్పుడు పిల్లలను ఎలాంటి ప్రమాదం జరగకుండా రక్షించడమే థ్యేయంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పాఠశాలలు మూసివేసినప్పటికీ విద్యార్థుల విద్యకు ఆటంకం కలగకుండా ఉండేందుకు, ఆన్లైన్ తరగతులను ప్రతిపాదించడం జరిగింది.
అధికారులు తీసుకున్న నిర్ణయం ప్రకారం.. నారాయణబగడ్ ప్రాంతంలోని 10 పాఠశాలలను నాలుగు రోజుల పాటు మూతపడనున్నాయి. ఈ సమయంలో ఉపాధ్యాయులు ఆన్లైన్లో విద్యార్థులతో అనుసంధానమై వారికి బోధిస్తారు. దీనివల్ల సాధారణ తరగతులు మూసివేసినప్పటికీ పిల్లలు తమ విద్యను కొనసాగించడానికి వీలవుతుంది. ఈ సమయంలో తల్లిదండ్రులు తమ పిల్లల భద్రత పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని, వారిని అనవసరంగా బయటకు వెళ్లనివ్వవద్దని కూడా కోరారు.
దూకుడు స్వభావం గల కుక్కల ఉనికి పాఠశాల విద్యార్థులకే కాకుండా స్థానిక నివాసితులకు కూడా ఆందోళన కలిగిస్తోంది. పర్వత ప్రాంతాలలో ప్రజలు తరచుగా కాలినడకన ప్రయాణించాల్సి ఉంటుంది. వీధి కుక్కలు, దూకుడు స్వభావం గల కుక్కల గుంపులు ఇబ్బందికరంగా మారవచ్చు.
ప్రస్తుతానికి పాఠశాలలను మూసివేయాలన్న నిర్ణయాన్ని ముందుజాగ్రత్త చర్యగా భావిస్తున్నారు. యాజమాన్యం పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తోంది. పరిస్థితి సాధారణ స్థితికి వచ్చిన తర్వాత యధావిధిగా తరగతులు తిరిగి ప్రారంభమవుతాయి.
Also Read: అమ్మాయిలతో మూత్రం తాగించిన 5వ తరగతి విద్యార్థి..ప్రిన్సిపల్ చాక్లెట్స్ తినమన్నాడు!
Also Read: మహిళా ఉద్యోగులకు గుడ్న్యూస్..మూడో బిడ్డ ప్రసవానికి 365 రోజులు ప్రసూతి సెలవులు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
India vs Pakistan: రెండో రౌండ్కు అర్హత.. భారత్ దెబ్బకు ప్రపంచకప్ నుంచి పాకిస్థాన్ నిష్క్రమణ
Amstelveen, Noord-Holland:India vs Pakistan Highlights: హాకీ ప్రపంచకప్లో భారత జట్టు అద్భుతం చేసింది. ప్రపంచ హాకీ టోర్నీలో భారత జట్టు చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ను చిత్తు చేసి ముందడుగు వేసింది. భారీ తేడాతో విజయం సాధించిన భారత జట్టు గోల్స్తో అదరగొట్టింది. హర్మన్ప్రీత్ సింగ్, అభిషేక్ గోల్స్తో చెలరేగడంతో పాకిస్థాన్ ఆటగాళ్లు ఏమాత్రం పోరాడలేకపోయారు. చేసిన మూడు గోల్స్కు పరిమితమై ఓటమితో ప్రపంచకప్ను పాకిస్థాన జట్టు వీడింది. ఈ మ్యాచ్కు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
పురుషుల హాకీ ప్రపంచకప్ 2026లో ఓటమి నుంచి తేరుకున్న భారత జట్టు హోరాహోరీగా జరిగిన మ్యాచ్లో పాకిస్థాన్పై తీవ్రంగా శ్రమించి విజయం సాధించింది. ఆమ్స్టల్వీన్ వేదికగా బుధవారం జరిగిన పూల్-డి మ్యాచ్లో భారత్ 5-3 తేడాతో పాకిస్థాన్ను చిత్తుచేసింది. భారీ విజయాన్ని అందుకున్న భారత జట్టు రెండో రౌండ్కు అర్హత సాధించగా.. పాకిస్తాన్ జట్టు ప్రపంచకప్ టోర్నీ నుంచి నిష్క్రమించింది.
మ్యాచ్ ప్రారంభం నుంచే భారత జట్టు దూకుడుగా ప్రదర్శన చేసింది. కెప్టెన్ హర్మన్ప్రీత్ సింగ్, ఫార్వర్డ్ అభిషేక్ చెరో రెండు గోల్స్తో చేసి ప్రత్యర్థి జట్టును ఒత్తిడిలో పడేశారు. రెండో క్వార్టర్ పూర్తయ్యాక భారత్ 3-0తో పాకిస్థాన్పై ఆధిక్యం సాధించి మ్యాచ్పై పూర్తి పట్టు సాధించింది. మూడో క్వార్టర్లో పాకిస్థాన్ గొప్పగా పుంజుకుని రెండు గోల్స్ సాధించింది. అయితే అదే సమయంలో భారత జట్టు మరో గోల్ సాధించడంతో 4-2 భారత్ ఆధిక్యం కొనసాగింంది. ఆఖరి క్వార్టర్లో పాకిస్థాన్ తొలుత ఓ గోల్ కొట్టి భారత్కు ఝలక్ ఇచ్చింది. తర్వాత గోల్స్ కోసం పాకిస్థాన్ ఆటగాళ్లు శ్రమించినా భారత డిఫెండర్లు ఎదురు నిలబడి గట్టిగా సమాధానం ఇచ్చారు. ఆట పూర్తయ్యేసరికి ఆధిక్యం 5-3 ఉండడంతో పాకిస్థాన్కు ఓటమి తప్పలేదు.
𝗔 𝗗𝗘𝗖𝗔𝗗𝗘 𝗢𝗙 𝗗𝗢𝗠𝗜𝗡𝗔𝗡𝗖𝗘. 𝗔𝗡𝗢𝗧𝗛𝗘𝗥 𝗖𝗛𝗔𝗣𝗧𝗘𝗥 𝗪𝗥𝗜𝗧𝗧𝗘𝗡. 🇮🇳🔥
Indian Men's Team defeated Pakistan 5–3 in a thrilling Pool D clash at the FIH Hockey World Cup Belgium & Netherlands 2026, extending their dominance in this iconic rivalry. 🏑🏆… pic.twitter.com/UqhiEV6v57
— Hockey India (@TheHockeyIndia) August 19, 2026
భారత గోల్స్ ఇలా..
రెండో రౌండ్లోకి అడుగుపెట్టాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో భారత ఆటగాళ్లు విజృంభించారు. మ్యాచ్ ప్రారంభమైన ఐదో నిమిషంలోనే కెప్టెన్ హర్మన్ప్రీత్ గోల్ సాధించి శుభారంభం అందించాడు. తర్వాత 11వ నిమిషంలో అభిషేక్ గోల్ చేసి అభిమానుల్లో ఉత్సాహం నింపాడు. రెండో క్వార్టర్లో 21వ నిమిషానికి హర్మన్ప్రీత్ ఓ గోల్ చేయగా.. కొద్దిసేపటికే 24వ నిమిషానికి అభిషేక్ గోల్ చేయడంతో పాకిస్థాన్పై భారత జట్టు ఆధిక్యంలోకి వచ్చింది. మూడో క్వార్టర్లో హార్దిక్ సింగ్ 35వ నిమిషానికి ఒక గోల్ చేయడంతో ప్రత్యర్థిపై భారత ఆధిక్యం పెరిగింది.
పాకిస్తాన్ గోల్స్
పాక్ తరఫున హన్నన్ షాహిద్ రెండు గోల్స్ సాధించాడు. 22వ, 46వ నిమిషాల్లో షాహీద్ గోల్స్ కొట్టగా.. 24వ నిమిషంలో సుఫ్యాన్ ఖాన్ గోల్ కొట్టాడు. గోల్స్ కోసం పాకిస్థాన్ ఆటగాళ్లు పోరాడినా భారత డిఫెండర్లు పెట్టని కోటలా నిలబడి అడ్డుకోవడంతో వారి శ్రమ వృథాగా మారి మ్యాచ్ ఓడిపోవడమే కాకుండా టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది.
Konda Susmita: రేవంత్ రెడ్డిపై సుష్మిత తీవ్ర వ్యాఖ్యలు.. కొండా సురేఖకు కాంగ్రెస్ క్రమశిక్షణా కమిటీ నోటీసులు
Baddipadaga, Telangana:Konda Susmita Row: వరుసగా మంత్రులు, ఎమ్మెల్యేలు ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో అధికారంలోని కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఇబ్బందుల్లో పడింది. పార్టీ నాయకులే ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ కీలక నిర్ణయాలు తీసుకుంది. దేవాదాయ, అటవీ శాఖల మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుష్మిత బుధవారం రేవంత్ రెడ్డితోపాటు పొంగులేటి శ్రీనివాస రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేయడం తీవ్ర వివాదాస్పదంగా మారింది. అవినీతి ఆరోపణలు చేయడంతో కాంగ్రెస్ పార్టీ ఇరుకున పడింది. ఈ నేపథ్యంలో క్రమశిక్షణా కమిటీ కొండా సుష్మిత వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని ఆమె తల్లి, మంత్రి కొండా సురేఖకు క్రమశిక్షణా కమిటీ నోటీసులు జారీ చేసింది.
సీనియర్ నాయకుడు సస్పెండ్
కొందరిని అసభ్య పదాలతో వ్యక్తిగత దూషణలు చేసిన ఎల్బీనగర్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జక్కిడి ప్రభాకర్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. అతడిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఆదేశాలు ఇచ్చింది. పలువురిని వ్యక్తిగత విషయాలపై దూషించడమే కాకుండా కులాల పేరుతో దూషించిన సంఘటనలపై సరైన ఆధారాలు ఉండడంతో జక్కిడి ప్రభాకర్ రెడ్డిని సస్పెన్షన్ చేస్తూ టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఆదేశాలు జారీ చేసింది.
చిన్నారెడ్డికి నోటీస్
ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి ఇటీవల వనపర్తి నియోజకవర్గంలో ఒక సభలో చేసిన పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలపై, ఎమ్మెల్యే మేఘారెడ్డిపై చేసిన అనుచిత ప్రసంగాలపై మూడు రోజులలో వివరణ ఇవ్వాలని టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ఆదేశించింది. ఇక ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్చార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి, మునిసిపల్ కార్పొరేషన్ సభ్యుడు సంజయ్లకు క్రమశిక్షణ కమిటీ నోటీసు పంపింది. వెంటనే వివరణ ఇవ్వాలని వారిద్దరికీ కాంగ్రెస్ పార్టీ ఆదేశించింది.
Telangana Police: ట్రాఫిక్, రోడ్డు భద్రతకు అత్యధిక ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
Hyderabad, Telangana:Telangana Police: తెలంగాణలో ట్రాఫిక్, రోడ్డు భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తామని డీజీపీ సీవీ ఆనంద్ ప్రకటించారు. మారుతున్న సవాళ్లకు అనుగుణంగా పోలీసు సిబ్బంది పునర్వ్యవస్థీకరణ జరుగుతోందని వెల్లడించారు. డ్రగ్స్, సైబర్ నేరాలు, ఆన్లైన్ బెట్టింగ్పై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. తెలంగాణలో మావోయిస్టు కార్యకలాపాలు గణనీయంగా తగ్గాయని.. ఛత్తీస్గఢ్, ఒడిశా, జార్ఖండ్ తదితర రాష్ట్రాల్లో కార్యకలాపాలు కొనసాగుతున్నాయని వివరించారు.
హైదరాబాద్లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో డీజీపీ సీవీ ఆనంద్ కీలక విషయాలు వెల్లడించారు. మారుతున్న నేర స్వభావం, ప్రజా భద్రతకు ఎదురవుతున్న కొత్త సవాళ్లకు అనుగుణంగా తెలంగాణ పోలీసు శాఖలో మానవ వనరులను పునర్వ్యవస్థీకరిస్తున్నట్లు తెలిపారు. ఒకప్పుడు వామపక్ష తీవ్రవాదం, ఉగ్రవాదం ప్రధాన సవాళ్లుగా ఉండగా.. ప్రస్తుతం డ్రగ్స్, సైబర్ నేరాలు, ఆన్లైన్ బెట్టింగ్, పెట్టుబడి మోసాలు, ట్రాఫిక్ నిర్వహణ, రోడ్డు భద్రత, ఆహార కల్తీ వంటి అంశాలు పోలీసులకు కొత్త సవాళ్లుగా మారాయని వెల్లడించారు.
తెలంగాణలో వామపక్ష తీవ్రవాదం దాదాపు ముగిసిపోయిందని.. మావోయిస్టు కార్యకలాపాలు గణనీయంగా తగ్గాయని డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు. కర్రెగుట్టల ప్రాంతాన్ని సందర్శించిన సందర్భంగా అక్కడ మౌలిక వసతుల కొరత స్పష్టంగా కనిపించిందని.. కొన్ని ప్రాంతాల్లో రహదారులు, పాఠశాలలు, వైద్య సదుపాయాలు ఇంకా మెరుగుపడాల్సి ఉందని పేర్కొన్నారు. యువతలో డ్రగ్స్ వినియోగం పెరుగుతోందని డీజీపీ ఆందోళన వ్యక్తం చేశారు.
గతేడాది 835 మంది విద్యార్థుల్లో డ్రగ్స్ ఆనవాళ్లు గుర్తించినట్లు.. మరో విశ్వవిద్యాలయంలో నిర్వహించిన అధ్యయనంలో సుమారు 70 శాతం మంది విద్యార్థులు డ్రగ్స్కు గురైనట్లు తేలిందని డీజీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. డ్రగ్స్ సరఫరా చైన్ను పూర్తిగా అడ్డుకోవడంతో పాటు విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యా సంస్థల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉందని పోలీస్ యంత్రాంగానికి గుర్తుచేశారు. పిల్లలను ఇప్పుడే కాపాడుకోకపోతే భవిష్యత్తులో పరిస్థితి మరింత తీవ్రంగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
పెరుగుతున్న సైబర్ నేరాలు
ప్రస్తుతం సైబర్ నేరాలు ప్రధాన సవాలుగా మారాయని.. ఆన్లైన్ బెట్టింగ్, పెట్టుబడి మోసాలు, నకిలీ యాప్ల ద్వారా మోసాలు పెరుగుతున్నాయని డీజీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. గతేడాది తెలంగాణలో సైబర్ నేరాల కారణంగా సుమారు రూ.1,750 కోట్ల ఆర్థిక నష్టం జరిగినట్లు తెలిపారు. గతేడాది తెలంగాణలో రోడ్డు ప్రమాదాల్లో సుమారు 8 వేల మంది ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను గుర్తించి వాటికి సంబంధించిన ఇంజినీరింగ్ లోపాలను సరిదిద్దేందుకు సంబంధిత ప్రభుత్వ శాఖలతో కలిసి పనిచేస్తామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక రోడ్డు భద్రత కార్యక్రమాన్ని చేపట్టేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు వెల్లడించారు.
