అమరుల త్యాగాల వల్లే ప్రజలకు స్వేచ్ఛ జీవితం: కలెక్టర్ ముజామిల్ ఖాన్
Khammam, Telangana:సైనికుల త్యాగాలను ఎప్పటికి స్మరించుకోవాలని వారి సేవలను గుర్తుపెట్టుకోవాలని ఖమ్మం కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ అన్నారు. కార్గిల్ విజయ్ దివస్ లో బాగంగా అమరులకు కలెక్టర్ నివాళిఅర్పించారు. దేశ ప్రజలు స్వేచ్చగా బ్రతుకుతున్నారంటే అది అమరుల త్యాగాల వల్లే అన్నారు. వారి త్యాగాలను వెలకట్టలేమని కలెక్టర్ అన్నారు. ఈ క్రమంలో వారి సేవలను కొనియాడుతూ గుర్తుచేసుకున్నారు. ఈకార్యక్రమంలో నగర మేయర్ నీరజా, జిల్లా సైనిక సంక్షేమ అధికారి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
Pawan Kalyan Chiranjeevi: చిన్నప్పటి నుంచి నా హీరో, నా అన్నయ్య చిరంజీవే: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్!
Hyderabad, Telangana:Pawan Kalyan Chiranjeevi Birthday: మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయన సోదరుడు, ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా పంచుకున్న హృదయపూర్వక భావాలు పంచుకున్నారు. ఈ క్రమంలో పాత జ్ఞాపకాలు ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటున్నాయి. సినిమా రంగంలో అడుగుపెట్టి హీరో కాకముందు నుంచే అన్నయ్యే తన జీవితానికి ఏకైక హీరో అని పవన్ కల్యాణ్ ఎంతో గర్వంగా చెప్పుకొచ్చారు.
పవన్ కల్యాణ్ తన స్కూలు రోజుల్లో అన్నయ్య పక్కన నడవడం కూడా ఎంతో గర్వకారణంగా భావించేవారని, అప్పట్లో ఆయన ఇంకా కాలేజీ విద్యార్థి అయినప్పటికీ ప్రపంచంలోనే అత్యంత గొప్ప వ్యక్తితో నడుస్తున్నట్లు అనుభూతి చెందేవారని పేర్కొన్నారు. చిన్నతనంలో చిరంజీవి కాలేజీ చదువు కోసం నర్సాపూర్ వెళ్లేవారని, వేసవి సెలవులకు ఆయన ఇంటికి రావడం ఒక పెద్ద పండుగలా ఉండేదని గుర్తుచేసుకున్నారు. కానీ, తిరిగి వెళ్లేటప్పుడు మాత్రం చాలా బాధగా ఉండేదని, ఆయన తిరిగి వచ్చేంతవరకు ఇల్లంతా కళావిహీనంగా మారిపోయేదని పేర్కొన్నారు.
చిరంజీవి తన పొడవైన ఉంగరాల జుట్టుతో, దృఢమైన ఎన్సీసీ క్యాడెట్ శరీరాకృతితో, నాన్నగారి బుల్లెట్ బైక్ నడుపుతుంటే ఒక అభిమానిగా చూస్తూ ఆరాధించిన క్షణాలను పవన్ గుర్తుచేసుకున్నారు. కెరీర్ ప్రారంభ రోజుల్లో మొదటిసారి సింగపూర్ పర్యటన నుండి తిరిగి వచ్చినప్పుడు పెద్ద నీలం రంగు బ్యాగులో లెగో హెలికాప్టర్, రిమోట్ కార్లు, రేసింగ్ ట్రాక్, కామిక్ పుస్తకాలు, మ్యూజిక్ టేపులు, టేప్ రికార్డర్, సువాసనల యార్డ్లీ పౌడర్లు తేవడం ద్వారా చిన్న ఇల్లాంటి తమ నివాసంలో సంతోషాన్ని, చిరునవ్వులను నింపిన సంఘటనను గుర్తుచేసుకున్నారు.
A thought about Annaya @KChiruTweets is always a source of joy. While I walk along the memory lane on this special day ,these are few memories I have tumbled upon.
In our childhood, he went away from home to pursue his college education in Narsapur. And his homecoming for… pic.twitter.com/oWMPairQY1
— Pawan Kalyan (@PawanKalyan) August 22, 2026
"అన్నయ్యకు పెళ్లయినప్పుడు తమకు దూరమవుతారేమోనని ఒక గదిలో కూర్చుని నిశ్శబ్దంగా ఏడుస్తుంటే, అన్నయ్య తన భార్యను తీసుకువచ్చి "రా, ఈ రోజు నిన్ను ఒక పెద్ద మనిషికి పరిచయం చేస్తాను" అని నవ్వించిన మధుర క్షణాలను నెమరువేసుకున్నారు. ఆ తర్వాత తనను చెన్నై తీసుకువెళ్లి సొంత బిడ్డలా చూసుకున్నార"ని పవన్ కల్యాణ్ భావోద్వేగానికి గురయ్యారు.
చెన్నై ఉక్కపోతలో రోజుకు 18 గంటల పాటు కఠోరంగా శ్రమించి, నిలబడటానికి కూడా బలం లేక, చెమటతో తడిసిన దుస్తులు, బూట్లతో అర్ధరాత్రి ఇళ్లకు చేరుకునే అన్నయ్య కష్టాన్ని చూసి పవన్ కల్యాణ్ ఎంతో అపరాధభావంతో బాధపడేవారట. అయినప్పటికీ, పవన్ చదువులో వైఫల్యాల గురించి చిరంజీవి ఎప్పుడూ ఒక్క మాట కూడా అనలేదట.
"తన ఉదారతతో కుటుంబాన్ని, బంధువులను సంతోషపెట్టిన చిరంజీవి.. దక్షిణాది, హిందీ చిత్ర పరిశ్రమల మధ్య సాంస్కృతిక వారధిగా నిలిచారు. హిందీలో 'ప్రతిబంధ్', 'ఆజ్ కా గూండా రాజ్' వంటి బ్లాక్బస్టర్ చిత్రాలు నిర్మించి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. కేంద్ర కేబినెట్ మంత్రిగా, పద్మవిభూషణ్ గ్రహీతగా అత్యున్నత స్థాయికి చేరినప్పటికీ చిరంజీవి ఏనాడూ విశ్రమించలేదు. ఇటీవల వెన్నెముకకు పెద్ద ఆపరేషన్ జరిగినప్పటికీ, ఏమాత్రం ఆలస్యం లేకుండా తిరిగి కోలుకుని మళ్లీ పనిలోకి వెళ్లడం ఆయన అసాధారణ పట్టుదలకు నిదర్శనం" అని పవన్ కల్యాణ్ కొనియాడారు.
"నగరం ఎప్పుడూ నిద్రపోనట్లే చిరంజీవి కూడా ఎప్పటికీ విశ్రమించరని, అందుకే ఆయన లక్షలాది మందికి స్ఫూర్తిప్రదాత, తన ఏకైక హీరో" అని పవన్ కల్యాణ్ ఎంతో సగర్వంగా ముగించారు. "అన్నయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడం కేవలం లాంఛనం కాదు, నాలాంటి ఎంతో మందికి ఒక సున్నితమైన జ్ఞాపిక అని, మనమందరం ఆరాధించే భరతభూమికి ఒక మంచి భవిష్యత్తును నిర్మించడానికి, బలమైన పునాదులు వేయడానికి, అతని జీవితం నాలాంటి లక్షలాది మందిని ఎలా ప్రభావితం చేసిందో గుర్తుచేయడమే ఈ సందర్భం" అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలియజేశారు.
Also Read: బిగ్బాస్ 'అగ్నిపరీక్ష 2'పై పెరుగుతున్న విమర్శలు..షో జడ్జ్ల వైఖరిపై నెటిజన్ల ఆగ్రహం
Also REad: హీరో ప్రభాస్కు మరో సర్జరీ..సోషల్ మీడియాలో డాక్టర్ ఎమోషనల్ పోస్ట్..ఏం జరిగింది?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
వ్యక్తిగత వివాదాలతో జానపద రంగాన్ని దిగజార్చవద్దు: శేఖర్ వైరస్ ఫైర్..
Hyderabad, Telangana:Madhuri Rathod Controversy News: తెలంగాణ జానపద కళారంగానికి ఉన్న ఖ్యాతితో పాటు గౌరవాన్ని వ్యక్తిగత వివాదాలతో దిగజార్చ వద్దని.. ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ వైరస్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల వేములవాడలో చోటుచేసుకున్న వివాదాస్పద సంఘటనతో ఫోక్ ఇండస్ట్రీకి ఎలాంటి సంబంధం లేదని ఆయన కరీంనగర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో స్పష్టం చేశారు. అంతేకాకుండా ఆయన వివిధ అంశాల గురించి కూడా మాట్లాడినట్లు తెలుస్తోంది..
ఎన్నో ఏళ్లుగా రాత్రింబగళ్లు కష్టపడుతూ.. చెమటోడ్చి తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీని కళాకారులు ఉన్నత స్థాయికి చేర్చారని ఆయన ఈ సమయంలో గుర్తు చేశారు. కొందరు వ్యక్తిగత కారణాలతో పాటు అనవసర వివాదాల వల్ల యావత్ పరిశ్రమకు చెడ్డ పేరు రావడం అత్యంత బాధాకరమని ఆయన పేర్కొన్నారు.. అంతేకాకుండా ఎంతో కష్టంతో నిర్మించుకున్న గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆయన తెలిపారు..
ఇలాంటి అనవసర వివాదాలతో పాటు ఆరోపణల వల్ల ఇండస్ట్రీలో కొత్తగా రావాలనుకునే వారికి ప్రోత్సాహం ఉండకుండా.. ఇప్పటికే ఉన్న కళాకారులు తీవ్ర ఇబ్బందులు గురై.. భయాందోళనలు ఎదుర్కొనే పరిస్థితులు కూడా ఎదురవుతాయని ఆయన తెలిపారు. వేములవాడలో జరిగిన వ్యవహారానికి.. మొత్తం జానపద పరిశ్రమకు లంకె పెట్టడం ఏ మాత్రం సరికాదని ఆయన అన్నారు..
Also Read: Eshwar Sai: బాసింగా బాసింగా సాంగ్ ఫేమ్ ఈశ్వర్సాయి రాసలీలలు..
తెలంగాణ ఫోక్ రంగాన్ని కించపరిచేలా.. తప్పుదోవ పట్టించేలా.. మాట్లాడిన ఈశ్వర్ స్థాయి భార్య శరణ్య వైఖరిపై శేఖర్ వైరస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. జానపద రంగాన్ని కించపరిచే హక్కు ఎవరికీ లేదని.. ఆమె చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని.. అంతేకాకుండా బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కలను.. కళాకారులను కించపరిచే విధంగా మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరిస్తూ.. పరిశ్రమ సమగ్రతను దెబ్బ తీసే చర్యలను కళాకారులంతా ఖండించాలని ఆయన పిలుపునిచ్చారు..
Also Read: Eshwar Sai: బాసింగా బాసింగా సాంగ్ ఫేమ్ ఈశ్వర్సాయి రాసలీలలు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Madhuri Rathod: ఈశ్వర్ సాయి భార్య శరణ్యపై కేసు పెట్టిన మాధురి రాథోడ్.. ఎందుకో తెలుసా?
Hyderabad, Telangana:Madhuri Rathod Latest News: ప్రముఖ జానపద కళాకారిణి మాధురి రాథోడ్ పై దాడితో పాటు ఆమె వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించిన ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. తనపై దురుసుగా ప్రవర్తించి.. దాడి చేయడమే కాకుండా తన మొబైల్ ఫోన్ను చోరీ చేసి అందులో వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేశారంటూ ఆమె వేములవాడ పోలీసులను ఆశ్రయించింది.. ఈ వ్యవహారంలో ఈశ్వర్ సాయి భార్య శరణ్యతో పాటు మరికొందరిపై పోలీస్ కేసు నమోదు చేశారు..
బాధితురాలి ఫిర్యాదు ప్రకారం.. ఈ నెల 19వ తేదీన వేములవాడలోని రెడ్డి భవన్లో ఈ వివాదం చోటు చోటుచేసుకుంది. అక్కడ ఉన్న సమయంలో ఈశ్వర్ సాయి భార్య శరణ్య తనతో అత్యంత దురుసుగా ప్రవర్తించడమే కాకుండా అసభ్య పదజాలంతో దూషించి.. ఆమెపై భౌతికంగా దాడి కూడా చేసిందని మాధురి పేర్కొంది. ఆ సమయంలో సుమారు 50 వేల విలువైన ఐఫోన్ బలవంతంగా లాక్కొని తీసుకొని వెళ్ళిపోయారని ఆరోపించారు..
తన ఫోన్ను దొంగలించి తీసుకొని పోయిన తర్వాత.. అందులోని వ్యక్తిగత డేటా తో పాటు వీడియోలను రికార్డు చేసి.. ఉద్దేశ పూర్వకంగా తప్పుదోవ పట్టించేలా సోషల్ మీడియా వేదికల్లో వైరల్ చేశారని మాధురి ఫిర్యాదులు తెలిపారు. సమాజంలో తనకున్న గౌరవంతో పాటు వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసేలా ఈ వ్యవహారానికి పాల్పడ్డారని ఆమె ఫిర్యాదులో వివరించారు..
వాస్తవాలు తెలుసుకోకుండా కొన్ని మీడియా సంస్థలతోపాటు సోషల్ మీడియా ఛానల్లు తన ప్రతిష్టను దెబ్బతీసే విధంగా వార్తలు ప్రసారం చేయడంపై ఆమె అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.. బాధితురాలి లిఖితపూర్వక ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన వేములవాడ పోలీసులు.. నిందితులపై సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారట.. ఈ ఘటనకు దారి తీసిన పరిస్థితులతో పాటు ఫోన్ చోరీ వెనక ఉన్న కారణాలు, సైబర్ క్రైమ్ కోణంలో వీడియోల వైరల్పై పోలీసులు ముమ్మరమైన దర్యాప్తు కొనసాగిస్తున్నారట..
Also Read: Eshwar Sai: బాసింగా బాసింగా సాంగ్ ఫేమ్ ఈశ్వర్సాయి రాసలీలలు.. రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Tirumala VIPs: తిరుమల శ్రీవారి సేవలో తమిళ స్టార్ నటుడు
Dharmavaram, Andhra Pradesh:Tamil Hero Soori And Music Director Mani Sharma Visits Tirumala Temple Watch Videoరేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు ఎవరి డబ్బులు ఖర్చు చేశారు? ఎంపీ ధర్మపురి అరవింద్
Nizamabad, Telangana:Revanth Reddy US Tour: అమెరికా పర్యటన రద్దు కావడం వెనుక కారణాలేమిటో రేవంత్ రెడ్డి చెప్పాలని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ డిమాండ్ చేశారు. క్లియరెన్స్ వచ్చిన తర్వాతే విదేశీ పర్యటన టికెట్లు బుక్ చేసుకోవాలి కదా? అని ప్రశ్నించారు. రేవంత్రెడ్డి విదేశీ పర్యటనకు కేంద్రం నుంచి క్లియరెన్స్ ఎందుకు రాలేదో చెప్పాలని నిలదీారు. క్లియరెన్స్ రాకముందే టికెట్లు బుక్ చేయడంపై రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని ఎంపీ అరవింద్ డిమాండ్ చేశారు.
హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎంపీ ధర్మపురి అరవింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి లక్ష్యంగా తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేశారు. ప్రతినిధి మొత్తం విదేశీ పర్యటన కొనసాగుతుంటే రేవంత్ రెడ్డి ఒక్కరి పర్యటన ఎందుకు ఆగిపోయింది? అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ఒక్కరి పర్యటనకు క్లియరెన్స్ రాకపోవడం సమస్యను మరింత తీవ్రతరం చేస్తోందని.. క్లియరెన్స్ ఎందుకు రాలేదో తెలపాలని కాంగ్రెస్ పార్టీని నిలదీశారు.
ముఖ్యమంత్రి కార్యాలయం చెబుతున్న కారణాలు వాస్తవం కావని ధర్మపురి అరవింద్ కొట్టిపారేశారు. 'రేవంత్ రెడ్డి పాస్పోర్టును రెండు వారాల కిందటే సమర్పించారు. కోర్టు పరిధిలో ఉన్న పాస్పోర్టు తీసుకుని రేవంత్ రెడ్డి విదేశాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది. విదేశీ పర్యటనలో ఫారిన్ హాస్పిటాలిటీ, ఎఫ్సీఆర్ఏ నిబంధనలను పరిశీలించాల్సిన అవసరం ఉంది' అని వ్యాఖ్యానించారు. విదేశాల్లో భోజనం, హోటల్ బిల్లులు, వాహనాల ఖర్చులు ఎవరూ భరిస్తున్నారో తేలాలని కోరారు. ఆ ఖర్చులు ఏ సంస్థలు భరిస్తున్నాయో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
'విదేశీ సంస్థలకు భారత వ్యతిరేక శక్తులతో సంబంధాలున్నాయా? పరిశీలించాలి. ఆక్స్ఫర్డ్లో రేవంత్ రెడ్డి వెళ్లనున్న సంస్థలు, కార్యక్రమాల వివరాలు నా వద్ద ఉన్నాయి. ఆయా సంస్థలకు జార్జ్ సోరోస్తో సంబంధాలపై ఆధారాలతో మాట్లాడా. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ కుమార్తె వివాహానికి రేవంత్ రెడ్డి హాజరుకావడంలో తప్పులేదు. వివాహానికి వెళ్లాలనుకుంటే ముందే ప్రణాళిక వేసుకుని క్లియరెన్స్ తీసుకోవాల్సింది' అని ధర్మపురి అరవింద్ సూచించారు. క్లియరెన్స్ రాకముందే ప్రజాధనంతో టికెట్లు బుక్ చేయడం సరికాదని విమర్శించారు.
వివాహానికి వెళ్లేందుకు రేవంత్ రెడ్డి సొంత డబ్బుతో టికెట్ కొనాల్సి ఉందని ధర్మపురి అరవింద్ చెప్పారు. విదేశీ పర్యటనకు ప్రజాధనం ఖర్చు చేయడంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీశారు. విదేశీ పర్యటన పేరుతో ప్రజాధనం వృథా చేశారని ఆరోపించారు. విద్యారంగం విషయంలో రేవంత్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. పసుపు రైతులకు రూ.24 వేల హామీ ఏమైందని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
'విదేశీ పర్యటనలో భారీ పెట్టుబడులు, విద్యాసంస్థల ఒప్పందాలు తీసుకొస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతోంది. అలాంటి పర్యటనలో రేవంత్ రెడ్డి ఒక్కరికే క్లియరెన్స్ ఎందుకు రాలేదు? ఇది చిన్న సమస్య కాదని.. జాతీయ ప్రయోజనాలకు సంబంధించిన అంశం' అని ధర్మపురి అరవింద్ వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారం రాజకీయాలకు సంబంధించినది కాదని.. జాతీయ భద్రత, దేశ సమగ్రత, సార్వభౌమత్వానికి సంబంధించినదని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన వ్యవహారం మొత్తం రాష్ట్రానికే ఆందోళన కలిగించే అంశమని తెలిపారు. సీఎం విదేశీ పర్యటనకు సంబంధించిన అన్ని అంశాలపై ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని ధర్మపురి అరవింద్ డిమాండ్ చేశారు.
ఓ ఎంపీ కొడుకు ప్రమాదంపై మాదాపూర్ పోలీసుల కీలక ప్రకటన.. 'అవసరమైతే అరెస్ట్ చేస్తాం'
Hyderabad, Telangana:Inorbit Mall Accident Case Update: హైదరాబాద్లోని మాదాపూర్ ఇనార్బిట్ మాల్ వద్ద అత్యంత వేగంగా స్పోర్ట్స్ కారుతో ఢీకొట్టడంతో ఓ యువతి మరణించగా.. కారు నడిపిన నిందితుడిని ఇంతవరకు అరెస్ట్ చేయకపోవడంతో తీవ్ర విమర్శలు, ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో మాదాపూర్ పోలీసులు కీలక ప్రకటన చేశారు. అయితే నిందితుడి పేరు.. అతడి తండ్రి పేరు ప్రస్తావించకుండా కేవలం కేసు నంబర్ ప్రస్తావిస్తూ ప్రకటన చేయడం విస్మయానికి గురి చేస్తోంది. మాదాపూర్ పోలీసుల పూర్తి ప్రకటన ఇలా ఉంది.
మాదాపూర్ కేసులో నిందితుడిని అరెస్ట్ చేయలేదంటూ వస్తున్న ఆరోపణలు అవాస్తవం అంటూ డీసీపీ రితిరాజ్ ప్రకటించారు. చట్టపరమైన నిబంధనల ప్రకారమే నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేవారు. ఈ కేసుపై దర్యాప్తు కొనసాగుతోంది.. అవసరమైతే అరెస్ట్ చేస్తామని డీసీపీ రితిరాజ్ ప్రకటన చేశారు. మాదాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలో నమోదైన క్రైమ్ నంబర్ 1238/2026 కేసులో నిందితుడి అరెస్ట్పై వస్తున్న ఆరోపణలకు కూకట్పల్లి డీసీపీ రితిరాజ్ స్పష్టత ఇచ్చారు.
'ఆగస్టు 16వ తేదీన బీఎన్ఎస్ సెక్షన్ 106 (1) కింద కేసు నమోదు చేశాం. కేసు నమోదైన వెంటనే ప్రమాదానికి కారణమైన వాహనం డ్రైవర్ను అదుపులోకి తీసుకుని మద్యం, డ్రగ్స్కు సంబంధించి ప్రాథమిక పరీక్షలు నిర్వహించాం. ఆ పరీక్షల్లో నెగెటివ్ ఫలితాలు వచ్చాయి. అనంతరం నిందితుడి రక్త నమూనాలను సేకరించి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్కు పంపించాం. ప్రమాదానికి కారణమైన వాహనాన్ని సీజ్ చేసి ఎంవీఐ తనిఖీకి పంపించాం' అని కూకట్పల్లి డీసీపీ రితిరాజ్ వెల్లడించారు.
ఎంవీఐ నివేదిక ఇంకా రావాల్సి ఉందని, అది కూడా దర్యాప్తులో కీలక ఆధారంగా ఉంటుందని డీసీపీ తెలిపారు. సెక్షన్ 106(1) కింద నమోదైన నేరానికి గరిష్ఠంగా ఐదేళ్ల శిక్ష విధించే అవకాశం ఉండడంతో ఏడేళ్లలోపు శిక్ష పడే నేరాల్లో అరెస్ట్ అవసరమా? లేదా? అనే అంశాన్ని బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 35 ప్రకారం పరిశీలించాల్సి ఉంటుందని డీసీపీ వివరించారు. అరెస్ట్కు సంబంధించి సుప్రీంకోర్టు అర్నేశ్ కుమార్ వర్సెస్ బిహార్ ప్రభుత్వం కేసులో ఇచ్చిన మార్గదర్శకాలను కూడా దర్యాప్తు అధికారి పరిగణనలోకి తీసుకున్నారని కూకట్పల్లి డీసీపీ రితిరాజ్ వెల్లడించారు.
'ప్రమాద సమయంలో అందుబాటులో ఉన్న ఆధారాలను పరిశీలించిన తర్వాత నిందితుడిని అరెస్ట్ చేయాల్సిన పరిస్థితులు కనిపించలేదు. అందుకే బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 35 కింద నోటీసు జారీ చేసి దర్యాప్తుకు సహకరించాలని ఆదేశించాం' అని డీసీపీ రితిరాజ్ తెలిపారు. నిందితుడిని అరెస్ట్ చేయకుండా పోలీసులు ఎవరికైనా అనుకూలంగా వ్యవహరించారని వస్తున్న ఆరోపణలను ఈ సందర్భంగా డీసీపీ ఖండించారు.
'పోలీసుల నిర్ణయం పూర్తిగా చట్టపరమైన నిబంధనలు, కేసులో అప్పటివరకు అందుబాటులో ఉన్న ఆధారాల ఆధారంగానే తీసుకున్నాం. దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. ఎంవీఐ నివేదికతో పాటు ఇతర ఆధారాలను సేకరించి పరిశీలిస్తాం. తదుపరి దర్యాప్తులో అరెస్ట్ అవసరమని తేలితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం' అని డీసీపీ రితిరాజ్ స్పష్టం చేశారు. అరెస్ట్ చేయకుండా నిందితుడికి పోలీసులు అనుకూలంగా వ్యవహరించారన్న ఆరోపణలు వాస్తవ విరుద్ధమని, చట్టపరంగా కూడా నిలబడవని డీసీపీ రితిరాజ్ తేల్చిచెప్పారు.
Konda Surekha: సీఎం రేవంత్ వచ్చాక అన్ని విషయాలు చెప్తా.!. సుష్మిత వివాదంపై కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు..
Hyderabad, Telangana:konda surekha reacts on her daughter sushmita controversy: తెలంగాణ రాజకీయాలు ప్రస్తుతం కొండా ఫ్యామిలీ చుట్టు తిరుగుతున్నాయి. ఇప్పటికే కొండా సురేఖ కూతురు వరంగల్ జిల్లా గీసు కొండలో సుష్మిత చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టిని కలవరపెట్టేదిగా మారాయి. అంతే కాకుండా ఏకంగా సీఎంను సుష్మిత టార్గెట్ చేసి మాట్లాడటం, ఆయన ప్రతిష్టను అభాసుపాలు చేసేలా ఉండటంతో తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ సైతం సీరియస్ అయ్యింది. దీనిపై ఇప్పటికే క్రమశికణ కమిటీ మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. దీనికి కౌంటర్ గా కొండా సురేఖ తన కూతురు చేసిన వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమన్నారు. ఇక దీనిపై తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రంగంలోకి దిగారు.
మంత్రి కొండా సురేఖను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. దీంతో తెలంగాణ కాంగ్రెస్ లో ఏంజరుగబోతుందని రచ్చ మొదలైంది. ఇక దీనిపై మంత్రి కొండా సురేఖ మరోసారి స్పందించారు. సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన నుంచి వచ్చాక ఆయనను కలిసి అన్ని విషయాలు బైటపెడతానని అన్నారు.
ఇప్పటికే క్రమశికణ కమిటీకి చెప్పాల్సింది చెప్పానని మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. మా ఇంట్లో పూజలతో బిజీగా ఉన్నానని చెప్పారు. మరోవైపు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వివాదంపై మాట్లాడేందుకు కొండా సురేఖ ఆసక్తిని చూపించలేదు.
Read more: Konda Surekha: కొండా సురేఖను బర్తరఫ్ చేయాలి.! . సీఎల్పీ వేదికగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తీవ్ర ఆగ్రహం..
మరోవైపు కొండా సుష్మిత తనకు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ గౌరవమన్నారు. అసలు సీఎం రేవంత్ తన టార్గెట్ అని చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్ని మరో టర్న్ తీసుకునేలా చేశాయి. దీనిపై కాంగ్రెస్ అధిష్టానం, సీఎం రేవంత్ సైతం సీరియస్ గా ఉన్నట్లు సమాచారం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తానని మహిళపై అత్యాచారం.. కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షుడిపై కేసు!
Hyderabad, Telangana:Yadadri Bhuvanagiri News: సమాజంలో పేదలకు అండగా ఉండాల్సిన ఓ ప్రజా నాయకుడు కామాంధుడిగా మారిపోయాడు.. ప్రభుత్వ పథకాలను ఆసరాగా చేసుకుని.. ఓ అభాగ్యురాలిపై లైంగిక దాడికి పాల్పడిన అత్యంత అమానవీయ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు (ఎం) మండలంలో చోటు చేసుకుంది.. ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తానని నమ్మించి.. ఆపై బ్లాక్ మెయిల్ చేస్తూ.. ఓ మహిళపై కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు అత్యాచారానికి ఒడిగట్టిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతూ వస్తోంది..
వివరాల్లోకి వెళితే.. ఆత్మకూరు (ఎం) మండలం పుల్లాయగూడెం గ్రామానికి చెందిన కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షుడు కన్ను ఓ అమాయక మహిళపై పడిందట.. ఆమెకు ప్రభుత్వ పథకం కింద ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తానని చాలా రోజుల నుంచి నమ్మించిన్నట్లు సమాచారం.. ఇల్లు మంజూరైన తర్వాత.. ఇంటి నిర్మాణానికి అవసరమైన సిమెంట్ బస్తాలు ఇస్తానని.. ఆశచూపి ఆమెను తన ఇంటికి పిలిపించుకున్నట్లు సమాచారం. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి.. ఆమెపై బలవంతంగా అత్యాచారానికి పాల్పడ్డారట.. ఈ దారుణం ఒక్క రోజుతో ఆగిపోలేదట.. జరిగిన విషయాన్ని బయటపెడితే.. పరువు పోతుందని బెదిరిస్తూ.. గత రెండు నెలలుగా ఆ మహిళపై అఘాయిత్యానికి పాల్పడుతున్నట్లు తెలుస్తోంది..
ఈ క్రమంలో భార్య తీవ్ర మానసిక క్షోభకు గురికావడంతో పాటు ఆమె ప్రవర్తనలో మార్పును గమనించిన భర్త అసలు విషయం ఆరా తీశాడట. ఆతను చేస్తున్న అఘాయిత్యాల గురించి.. భార్య కన్నీరుమున్నీరుగా విలపించడంతో బాధితురాలి భర్త ఈ విషయాన్ని గ్రామ పెద్దల దృష్టికి తీసుకెళ్లాడట.. దీంతో గ్రామంలో పంచాయితీ ఏర్పాటు చేసినట్లు కూడా సమాచారం.
పంచాయితీలో తన తప్పును అంగీకరించి.. సారీ చెప్పాల్సింది పోయి.. నిందితుడు తన పరపతిని వినియోగించి.. కేసును తొక్కేసే ప్రయత్నం చేశాడట.. పోలీస్ స్టేషన్లో కేసు పెడితే.. తీవ్ర పరిణామాలు ఉంటాయని బాధితురాలికి.. ఆమె భర్తకు బెదిరింపులకు గురిచేసినట్లు కూడా సమాచారం. విషయం బయటకు పొక్కకుండా ఉండేందుకు.. కేసు పెట్టకుండా ఉంటే పరిహారంగా అర ఎకరం భూమి రాసిస్తానని గ్రామ పెద్దల ద్వారా రాయబారం నడిపాడట..
అంతేకాకుండా గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు వచ్చిన వాళ్లంతా నాతో పడుకున్నారంటూ.. శంకర్ రెడ్డి పచ్చి బూతులతో పాటు నోటి దురుసు మాటలు మాట్లాడటం అతని అహంకారానికి.. శాడిజానికి నిదర్శనమని చెప్పొచ్చు. ఇలాంటి బెదిరింపులకు, ప్రలోభాలకు తలొగ్గని బాధితురాలు.. ధైర్యంగా ఆత్మకూరు (ఎం) పోలీస్ స్టేషన్ను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
Also Read: Eshwar Sai: బాసింగా బాసింగా సాంగ్ ఫేమ్ ఈశ్వర్సాయి రాసలీలలు.. రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Jagtial: జగిత్యాలలో ఇందిరమ్మ లబ్ధిదారులకు అవమానం? తిండి దగ్గర ఆంక్షలు..
Hyderabad, Telangana:Jagtial Ministers Meeting: పేదలకు ఆసరాగా నిలవాల్సిన ప్రభుత్వం... వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తోందన్న విమర్శలు ఊహించని స్థాయిలో వస్తున్నాయి. జగిత్యాల జిల్లా కేంద్రంలో మంత్రుల పర్యటన సందర్భంగా.. స్థానిక నూకపల్లి డబుల్ బెడ్రూం కాలనీలో చోటుచేసుకున్న ఘటన తీవ్ర దుమారానికి దారి తీసేలా చేస్తోంది.. మంత్రుల సభకు జనాన్ని సమీకరించేందుకు మున్సిపల్ యంత్రాంగం అనుసరించిన తీరు లబ్ధిదారులను తీవ్ర మనస్తాపానికి గురిచేసింది.
మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు అడ్లూరి లక్ష్మణ్ కుమార్లతో పాటు స్థానిక MLA డా. సంజయ్ కుమార్తో పాటు మేడిపల్లి సత్యంలు హాజరవుతున్న ఇందిరమ్మ లబ్ధిదారుల ముఖాముఖి కార్యక్రమానికి రావాల్సిందిగా అధికారులు కాలనీవాసులను ఆహ్వానించారట.. అయితే, అక్కడికి చేరుకున్న మున్సిపల్ సిబ్బంది ఒక్కో ఇంటికి ఒకే ఒక్క భోజన టోకెన్ ఇస్తూ.. వివిధ షరతులు విధించడంతో స్థానికులను ఆశ్చర్యానికి గురయ్యారట.. ఇంట్లో నలుగురైదుగురం ఉంటే.. ఒక్కరికే తిండి పెడతారా? మిగతా కుటుంబ సభ్యులు ఏం కావాలి?.. అంటూ నిరుపేద మహిళలు అధికారులను నిలదీసే ప్రయత్నం కూడా చేశారట.. కడుపు నింపే తిండి వద్ద కూడా ఇలాంటి లెక్కలు వేయడం పేదలను తీవ్రంగా అవమానించడమేనని.. స్థానికులు మండిపడుతున్నారు.
సభ ప్రాంగణానికి తరలిరావాలని ఒత్తిడి చేసిన అధికారులు.. కాలనీ నుంచి అక్కడికి చేరుకోవడానికి కనీస రవాణా సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేయకపోవడం గమనార్హం.. నూకపల్లి కాలనీ నుంచి ప్రధాన పట్టణానికి చేరుకోవడానికి ఆటోలతో పాటు బస్సు సౌకర్యాలు లేక వృద్ధులు, మహిళలు, చంటిపిల్లల తల్లులు తీవ్ర ఇబ్బందులు పడ్డట్లు కూడా తెలుస్తోంది.. సభలకు జనాన్ని తరలించుకోవడానికే మేం పనికొస్తామా? మా కనీస సమస్యలు.. ప్రయాణ అవసరాలు మీకు పట్టవా? అంటూ.. ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Eshwar Sai: బాసింగా బాసింగా సాంగ్ ఫేమ్ ఈశ్వర్సాయి రాసలీలలు.. రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న
ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం కాస్తా.. అధికారుల నిర్లక్ష్యంతో పాటు అధికారుల నిబంధనల వల్ల తీవ్ర వివాదాలకు కేంద్రంగా మారింది.. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పక్షపాతి అని మంత్రులు పదేపదే చెబుతున్న సమయంలో.. క్షేత్రస్థాయిలో భోజనం విషయంలో సైతం ఆంక్షలు విధించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నట్లు తెలుస్తోంది.. ప్రజాప్రతినిధులు ఇప్పటికైనా స్పందించి.. ఇలాంటి అస్తవ్యస్త ఏర్పాట్లకు కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Also Read: Eshwar Sai: బాసింగా బాసింగా సాంగ్ ఫేమ్ ఈశ్వర్సాయి రాసలీలలు.. రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Cobra Video: వామ్మె.. పొలంలో ట్రాక్టర్కు అడ్డంగా భారీ కింగ్ కోబ్రా.. వీడియో ఇదే..
Hyderabad, Telangana:Massive King Cobra Video: పొలాల్లో వ్యవసాయ పనులు చేసుకునే రైతులకు అప్పుడప్పుడు అత్యంత ప్రమాదకరమైన పాములు కనిపించడం చాలా సాధారణం.. అయితే, ఒక్కోసారి ఊహించని విధంగా భారీ సైజులో ఉండే విష సర్పాలు ఎదురై రైతులను భయాందోళనకు గురి చేస్తూ ఉంటాయి.. తాజాగా సోషల్ మీడియాలో నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేస్తున్న ఒక వీడియో ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఒక భారీ నాగుపాము ట్రాక్టర్ అడ్డంగా నిలబడి పడగ విప్పడం, ఆ తర్వాత జరిగిన పరిణామాలు నెటిజన్లను తీవ్ర ఆశ్చర్యానికి గురి చేసేలా చేస్తున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసకుందాం..
వైరల్ అవుతున్న వీడియోలో ఒక వ్యవసాయ భూమిలో పనులు జరుగుతుండడం మీరు గమనించవచ్చు. ఓ రైతు తన ట్రాక్టర్ను నడుపుకుంటూ ముందుకు వెళ్లడం మీరు గమనించవచ్చు. అంతేకాకుండా అంతా మామూలుగానే సాగుతున్న ఆ సమయంలో.. భారీ కోబ్రా ఆ ట్రాక్టర్ చక్రాల ముందుకు రావడం మీరు ఈ వీడియోలో క్లియర్గా చూడొచ్చు.. ప్రమాదాన్ని పసిగట్టిన ట్రాక్టర్ డ్రైవర్ అద్భుతమైన టైమింగ్తో బ్రేకులు వేయడం కూడా మీరు చూడొచ్చు..ఈ సమయంలో ఏమాత్రం ముందుకు వెళ్లినా ఆ పాము ట్రాక్టర్ టైరు కింద నలిగిపోయి ఉండేది..
అంతేకాకుండా ఈ వీడియోలో ఆ పాము టైరు ముందు నిలబడి బుసలు కొడుతూ పడగ విప్పిన దృశ్యం చూస్తుంటే ఎవరికైనా భయం కలగక తప్పదు.. ఈ పరిస్థితిని చూసిన వారు వెంటనే స్నేక్ క్యాచర్ సమాచారం అందించిన్నట్లు తెలుస్తోంది. ఈ వీడియోను కోబ్రా రెప్టైల్స్ (Cobra Reptiles) అనే యూట్యూబ్ ఛానెల్కి వారు వీడియోగా చిత్రీకరించి పోస్ట్ చేసిన్నట్లు తెలుస్తోంది.. అయితే, ఈ వీడియోలో ఆ నాగుపామును పట్టుకునేందుకు.. ఒకరు ఎలాంటి పరికరాలు ఉపయోగించకుండా.. కేవలం ఒక సాధారణ ప్లాస్టిక్ పీవీసీ పైపును చేతుల్లో పట్టుకుని అత్యంత సులభంగా ఆ పామును అందులోకి పంపే ప్రయత్నం చేశారు.
Also Read: Viral Pic: ఇదేం క్రియేటివిటీ రా బాబు.. మూత్రం పోస్తూ ప్రీ వెడ్డింగ్ ఫోటో స్టిల్స్..
పాము వెనుక భాగాన్ని నెమ్మదిగా చేత్తో పట్టుకుని.. దాని తల భాగాన్ని ఆ పైపులోకి దూర్చాడం మీరు ఈ వీడియోలో చూడొచ్చు.. ఏమాత్రం భయం లేకుండా.. ఎంతో నైపుణ్యంతో ఆ స్నేక్ క్యాచర్ పామును సురక్షితంగా రక్షించిన తీరు అందరినీ ఆశ్చర్యపోయేలా చేస్తోంది..సాధారణంగా ఇలాంటి పాములను చూసినప్పుడు భయంతో రైతులు పాములను కొట్టి చంపుతూ ఉంటారు. అయితే, ఇక్కడ మాత్రం ట్రాక్టర్ డ్రైవర్ సమయస్ఫూర్తి.. స్నేక్ క్యాచర్ ఎక్పీరియన్స్ మూగ జీవి ప్రాణాలను కాపాడాయి. ప్రస్తుతం ఈ యూట్యూబ్ షార్ట్ వీడియో సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో విపరీతంగా వైరల్గా మారింది. చాలా మంది ఈ వీడియో చూసిన కామెంట్లు కూడా పెడుతున్నారు.
Also Read: Viral Pic: ఇదేం క్రియేటివిటీ రా బాబు.. మూత్రం పోస్తూ ప్రీ వెడ్డింగ్ ఫోటో స్టిల్స్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Telangana BJP: రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దులో రాజకీయ కోణం లేదు: బీజేపీ
Baddipadaga, Telangana:Revanth Reddy US Tour Cancel: అమెరికా పర్యటనకు వెళ్లాల్సిన రేవంత్ రెడ్డి టూర్ను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడంతో తెలంగాణ తీవ్ర రాజకీయ వివాదం నెలకొంది. అతడి అమెరికా పర్యటన రద్దు విషయమై కాంగ్రెస్, బీజేపీ మధ్య విమర్శలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు వివరణ ఇచ్చారు. రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దు కావడం.. వారితోపాటు వెళ్లేవారికి పనులు చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని వెల్లడించారు.
హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణ డాక్టర్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో భారీగా బీజేపీలో చేరికలు జరిగాయి. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనపై రాంచందర్ రావు స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. 'ముఖ్యమంత్రులు లేదా మంత్రుల విదేశీ పర్యటనలకు విదేశాంగ శాఖ (MEA) నుండి నిబంధనల ప్రకారం క్లియరెన్స్ తీసుకోవడం సాధారణ పరిపాలనా ప్రక్రియ మాత్రమే. పర్యటన ఉద్దేశం, ఆహ్వానించిన సంస్థల వివరాలు, భద్రత, ప్రోటోకాల్, ద్వైపాక్షిక సంబంధాలు వంటి అనేక అంశాలను పరిశీలించిన తర్వాతే అనుమతులు ఉంటాయి' అని వివరించారు. 'విదేశాలకు వెళ్లేవారికి క్లియరెన్స్ ఉంటుంది. కార్యక్రమాలలో పాల్గొనే వ్యక్తుల హోదాను కూడా చూశాకే కేంద్ర విదేశాంగ శాఖ అనుమతి ఉంటుంది' అని వెల్లడించారు.
'తరుణ్ గగోయ్ కూడా గతంలో అమెరికా పర్యటన కోసం అనుమతి ఇవ్వలేదు. అప్పుడు యూపీఏ ప్రభుత్వమే ఉంది' అని రాంచందర్ రావు వివరించారు. రేవంత్ రెడ్డి గతంలో వెళ్లినప్పుడు ఆపలేదు కదా అని గుర్తుచేశారు. 'ఇది ఒక పద్ధతి ప్రకారం జరుగుతుంది. అందులో భాగంగానే అనుమతి ఇవ్వలేదు. అంతేకానీ దీనిలో ఎటువంటి రాజకీయకోణం లేదు' అని స్పష్టం చేశారు. నీట్ విద్యార్థులు తనను కలవడంతో వారితో రాంచందర్ మాట్లాడారు.
ముఖ్యమంత్రులు లేదా మంత్రుల విదేశీ పర్యటనలకు విదేశాంగ శాఖ (MEA) నుండి నిబంధనల ప్రకారం క్లియరెన్స్ తీసుకోవడం సాధారణ పరిపాలనా ప్రక్రియ మాత్రమే. పర్యటన ఉద్దేశం, ఆహ్వానించిన సంస్థల వివరాలు, భద్రత, ప్రోటోకాల్, ద్వైపాక్షిక సంబంధాలు వంటి అనేక అంశాలను పరిశీలించిన తర్వాతే అనుమతులు ఉంటాయి.… pic.twitter.com/fFlvPyI8nd
— BJP Telangana (@BJP4Telangana) August 21, 2026
'స్టూడెంట్స్ వద్ద అదనంగా ఫీజు వసూలు చేశారో వాళ్లకు తిరిగి ఇచ్చివేయాలని హై కోర్టు తీర్పు ఇచ్చింది. అదనంగా ఫీజు వసూలు చేసిన కాలేజీల నుంచి పేరెంట్స్కు తిరిగి ఇప్పించాలని నన్ను కోరారు' అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు తెలిపారు. ఈ సందర్భంగా తనను కలిసిన నీట్ విద్యార్థుల తల్లితండ్రులతో మాట్లాడి వారికి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. 'ఎన్ఎంసీ, టీఏఎఫ్ఆర్సీ నిబంధన ప్రకారం నాలుగున్నరేళ్లకే ఫీజు తీసుకోవాలి. కానీ ప్రైవేట్ కాలేజీలు ఇంటర్న్షిప్ ఏడాదికి కూడా ఫీజు వసూలు చేస్తున్నాయి' అని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోయారు.
'ఫీజు కట్టని విద్యార్థులను క్లాసులకు రానివ్వకపోవడం, బయోమెట్రిక్ హాజరు బ్లాక్ చేయడం, హాల్ టికెట్లు ఆపడం చేస్తున్నారు. ఇంటర్న్షిప్ విద్యార్థులకు ఇవ్వాల్సిన స్టైఫండ్ ఇవ్వడం లేదు' అని విద్యార్థుల తల్లిదండ్రులు బీజేపీ అధ్యక్షుడికి మొరపెట్టుకున్నారు. అదనంగా వసూలు చేసిన ఫీజు వెనక్కి ఇవ్వాలని, స్టైపెండ్ నిబంధనల ప్రకారం ఇవ్వాలని, రూల్స్ ఉల్లంఘించిన కాలేజీలపై చర్యలు తీసుకునేలా చూడాలని కోరారు. బాధిత విద్యార్థులకు బీజేపీ అండగా ఉంటుందని.. ఈ అంశంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటం చేస్తామని రాంచందర్ రావు హామీ ఇచ్చారు.
Shavukaru Janaki: సినీ పరిశ్రమ దిగ్భ్రాంతి.. దిగ్గజ నటి షావుకారి జానకి కన్నుమూత
Chennai, Tamil Nadu:Shavukaru Janaki Passes Away: దక్షిణ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వందల సినిమాలు చేసి దక్షిణాది ప్రేక్షకులను అలరించిన దిగ్గజ నటి షావుకారు జానకి (94) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ తీవ్ర అనారోగ్యానికి గురయిన ఆమె కొన్ని రోజుల కిందట చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూ శుక్రవారం మధ్యాహ్నం ఆమె తుదిశ్వాస విడిచారు. కొన్ని దశాబ్దాలపాటు సినీ పరిశ్రమలో అగ్ర హీరోయిన్గా షావుకారు జానకి నటించారు. ఆమె మృతికి దక్షిణాది సీని పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఆమె మృతికి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతోపాటు తమిళనాడు ముఖ్యమంత్రి సంతాపం ప్రకటించారు.

)