అమరుల త్యాగాల వల్లే ప్రజలకు స్వేచ్ఛ జీవితం: కలెక్టర్ ముజామిల్ ఖాన్
Khammam, Telangana:సైనికుల త్యాగాలను ఎప్పటికి స్మరించుకోవాలని వారి సేవలను గుర్తుపెట్టుకోవాలని ఖమ్మం కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ అన్నారు. కార్గిల్ విజయ్ దివస్ లో బాగంగా అమరులకు కలెక్టర్ నివాళిఅర్పించారు. దేశ ప్రజలు స్వేచ్చగా బ్రతుకుతున్నారంటే అది అమరుల త్యాగాల వల్లే అన్నారు. వారి త్యాగాలను వెలకట్టలేమని కలెక్టర్ అన్నారు. ఈ క్రమంలో వారి సేవలను కొనియాడుతూ గుర్తుచేసుకున్నారు. ఈకార్యక్రమంలో నగర మేయర్ నీరజా, జిల్లా సైనిక సంక్షేమ అధికారి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
TTD September Tickets: తిరుమల వెళ్లే భక్తులకు శుభవార్త..రూ.120లకే దర్శనం టికెట్..రేపు ఒక్క రోజు మాత్రమే!
Tirupati Urban, Andhra Pradesh:TTD September 2026 Tickets: తిరుమల శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) కీలక ప్రకటన చేసింది. సెప్టెంబర్ 2026 నెలకు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్ల ఆన్లైన్ ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ నమోదు ప్రక్రియ జూన్ 18న ప్రారంభమైంది. ఈ లక్కీ డిప్లో టికెట్లు పొందిన భక్తులకు కేవలం రూ.120కే మొదటి గడప నుంచి స్వామివారిని అత్యంత సమీపంగా దర్శించుకునే అరుదైన అవకాశం లభిస్తుంది.
లక్కీ డిప్ ముఖ్యమైన తేదీలు
ఈ లక్కీడిప్ నమోదుకు ఇప్పటికే రిజిస్ట్రేషన్స్ ఓపెన్ అవ్వగా.. జూన్ 20వ తేదీన ఉదయం 10 గంటలకు వరకు మాత్రమే భక్తులకు రేపు లాస్ట్ ఛాన్స్ ఉండనుంది. జూన్ 20 మధ్యాహ్నం విజేతల వివరాలను టీటీడీ ప్రకటిస్తుంది. ఎంపికైన వారికి ఎస్ఎంఎస్, ఈమెయిల్ ద్వారా సమాచారం అందుతుంది. లక్కీ డిప్లో పేరు వచ్చిన భక్తులు జూన్ 20 నుండి జూన్ 22 మధ్యాహ్నం 12 గంటల లోపు ఆన్లైన్లో నిర్ణీత రుసుము చెల్లించి టికెట్ కన్ఫర్మ్ చేసుకోవాలి.
గమనిక: సాధారణంగా మొదటి గడప దర్శనం కోసం శ్రీవాణి ట్రస్ట్ ద్వారా రూ.10,500 ఖర్చు చేయాల్సి ఉంటుంది. కానీ ఈ లక్కీ డిప్ ద్వారా సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధన వంటి సేవలను కేవలం రూ. 120 ప్రారంభ ధరకే పొందే వీలుండటంతో భక్తులు దీనిపై ప్రత్యేక ఆసక్తి చూపిస్తారు. భక్తులు టీటీడీ అధికారిక వెబ్సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా ఈ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
ఇతర సేవా టికెట్ల విడుదల షెడ్యూల్
లక్కీ డిప్ సేవలతో పాటు సెప్టెంబర్ నెలకు సంబంధించిన మిగతా దర్శన కోటాలను కూడా టీటీడీ వరుసగా విడుదల చేయనుంది.
తిరుమలలో ఇతర ఆర్జిత సేవలైన కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ టికెట్లను బుకింగ్ చేసేందుకు జూన్ 22 ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు.
అలాగే జూన్ 22 మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవలు, వాటికి సంబంధించిన దర్శన స్లాట్లు రిలీజ్ చేస్తుండగా.. జూన్ 23న అంగప్రదక్షిణ టోకెన్లు, శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శన టికెట్లు, అలాగే వృద్ధులు, దివ్యాంగుల ప్రత్యేక దర్శన కోటా టోకెన్లు విడుదలవుతాయి. ఆ తర్వాత జూన్ 24వ తేదీన ఉదయం 10 గంటలకు రూ.300 విలువైన స్పెషల్ దర్శనం టికెట్లను బుక్ చేయోచ్చు. అదే విధంగా జూన్ 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు సెప్టెంబరు నెలలో దర్శనం టికెట్లు ఉన్న భక్తులకు రూమ్ బుకింగ్ అందుబాటులో ఉండనుంది. శ్రీవారి సేవల్లో పాల్గొనాలనుకునే భక్తులు ఈ తేదీలను గమనించి, గడువులోగా తమ టికెట్లను బుక్ చేసుకోవాలని టీటీడీ సూచించింది.
Also Read: ఏపీ రైతులకు తీపికబురు..రేపు రైతుల ఖాతాల్లోకి డబ్బు జమ..ఏం టైమ్కి వస్తాయంటే?
Also Read: విశాఖపట్నంపై కన్నేసిన పాకిస్థాన్..బంగాళఖాతంలోకి పాక్ సబ్మెరైన్ ఎంట్రీ!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Career Guide: ఇంటర్ తర్వాత తక్కువ ఖర్చుతో.. హై శాలరీ ఇచ్చే టాప్ డిప్లొమా కోర్సులు!సైన్స్, ఆర్ట్స్, కామర్స్ వారికి బెస్ట్ ఆప్షన్స్!
Hyderabad, Telangana:Top Diploma Courses After 12th: పరీక్షల ఫలితాలు వచ్చిన తర్వాత, ఇక తదుపరి అడుగు ఏమిటి అనే సందేహం విద్యార్థుల్లో ఉంటుంది. ఇంటర్మీడియట్ పూర్తి చేసిన వారు కేవలం డిగ్రీ, బీకాం, బీఎస్సీ లేదా బీటెక్ కోర్సులకే పరిమితం కానక్కర్లేదు; డిప్లమా కోర్సుల ద్వారా కూడా త్వరగా ఉద్యోగంలో చేరవచ్చు. ఈ కోర్సుల్లో ప్రాక్టికల్ శిక్షణకు అధిక ప్రాధాన్యత ఇస్తారు, దీనివల్ల విద్యార్థుల్లో నైపుణ్యం (Skill Development) పెరుగుతుంది. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక శిక్షణ మరియు జ్ఞానాన్ని అందిస్తూ, ఒకటి నుండి మూడు ఏళ్లలో ఈ కోర్సులను పూర్తి చేసి లక్ష్యంగా పెట్టుకున్న ఉద్యోగాన్ని సాధించవచ్చు.
12వ తరగతి తర్వాత ఉత్తమ డిప్లమా కోర్సులు ఇవే...
దేశవ్యాప్తంగా ప్రాచుర్యంలో ఉన్న కొన్ని ముఖ్యమైన డిప్లమా కోర్సులు
డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్, డిప్లొమా ఇన్ ఆర్కిటెక్చర్, డిప్లొమా ఇన్ ఫార్మసీ, డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్, డిప్లొమా ఇన్ ఫ్యాషన్ డిజైనింగ్, డిప్లొమా ఇన్ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్, డిప్లొమా ఇన్ గ్రాఫిక్ డిజైన్, ఇంటీరియర్ డిజైన్, డిప్లొమా ఇన్ డిజిటల్ మార్కెటింగ్, ఈవెంట్ మేనేజ్మెంట్, డిప్లొమా ఇన్ వెబ్ డిజైన్ అండ్ డెవలప్మెంట్, మెడికల్ లేబొరేటరీ టెక్నాలజీ, డిప్లొమా ఇన్ నర్సింగ్, డిప్లొమా ఇన్ ఎర్లీ చైల్డ్ హుడ్ ఎడ్యుకేషన్.
12వ తరగతి తర్వాత సైన్స్ విద్యార్థుల కోసం డిప్లొమా కోర్సులు...
సైన్స్ విభాగం విద్యార్థులు డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్, డిప్లొమా ఇన్ ఫార్మసీ, డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్, డిప్లమా ఇన్ నర్సింగ్ వంటి కోర్సులను ఎంచుకోవచ్చు.
Also Read: NEET UG Re-Exam: నీట్ రీ-ఎగ్జామ్ రాసే విద్యార్థులకు అలెర్ట్.. పరీక్ష రోజూ ఇవి అస్సలు వేసుకెళ్లొద్దు! డ్రెస్ కోడ్ రూల్స్ ఇవే!
Also Read: నీట్ రీ-ఎగ్జామ్ గైడ్లైన్స్ విడుదల.. మార్కింగ్ విధానం, తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్లు ఇవే!
కామర్స్ విద్యార్థుల కోసం డిప్లొమా కోర్సులు...
కామర్స్ స్ట్రీమ్కు చెందిన వారు డిప్లొమా ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్, డిప్లొమా ఇన్ అకౌంటింగ్, రిటైల్ మేనేజ్మెంట్ వంటి కోర్సులను చేయవచ్చు.
ఆర్ట్స్ విద్యార్థుల కోసం డిప్లొమా కోర్సులు...
ఆర్ట్స్ విభాగంలో డిప్లొమా ఇన్ ఫైన్ ఆర్ట్స్, డిప్లొమా ఇన్ ఈవెంట్ మేనేజ్మెంట్, డిప్లొమా ఇన్ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్, డిప్లొమా ఇన్ ఫ్యాషన్ డిజైన్, మల్టీమీడియా అండ్ యానిమేషన్ వంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయి. విద్యార్థులు తమ ఆసక్తిని బట్టి సరైన గ్రూపులను ఎంచుకోవచ్చు. ఈ కోర్సులు వారి కెరీర్ లక్ష్యాలను చేరుకోవడానికి, నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి, పారిశ్రామిక అనుభవాన్ని పొందడానికి భవిష్యత్తులో గొప్ప బాటగా నిలుస్తాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Karimnagar: వంటా-వార్పుకు 15 ఏళ్లు.. నాటి కరీంనగర్ పోరాట జ్ఞాపకాలు!
Hyderabad, Telangana:Telangana Vanta Varpu 15 Years: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన మలిదశ ఉద్యమంలో కరీంనగర్ జిల్లా ఒక ఊపు ఊపేసింది. తెలంగాణ సమాజం మొత్తాన్ని ఒకే తాటిపైకి తెచ్చిన అపూర్వ ఘట్టం.. వంటా-వార్పు కార్యక్రమం జరిగి సరిగ్గా నేటికీ 15 ఏళ్లు పూర్తయింది.. పల్లె నుంచి పట్నం వరకు.. పేద నుంచి ధనిక దాకా.. ప్రతి ఒక్కరూ రోడ్లపైకి వచ్చి.. పొయ్యిలు వెలిగించి.. వంటలు వండి సగర్వంగా తమ నిరసనలు వ్యక్తం చేశారు.. నాడు కరీంనగర్ వీధులన్నీ తెలంగాణ నినాదంతో మారుమోగాయి.. ఈ అపూర్వ ప్రజా ఉద్యమ తీవ్రత అప్పట్లో ఢిల్లీ పీఠాన్ని కుదిపేసిన సంగతి కూడా తెలిసిందే..
ఉద్యమ జ్వాలగా మారిన వంటిల్లు..
నాడు కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా జరిగిన ఈ వంటావార్పు కార్యక్రమం కేవలం ఒక నిరసన కార్యక్రమంగా మిగలలేదు.. అదొక మహా జనజాతరను తలపించేసింది. జాతీయ రహదారులతో పాటు ప్రధాన కూడలన్నీ వంటశాలలుగా మారిపోయాయి.. కుల మత వర్గ బేధాలు మరిచి అందరూ ఒకే చోట కూర్చుని భోజనాలు చేశారు.. వంటలు వండుతూనే.. మరోవైపు బతుకమ్మ ఆడుతూ.. ధూమ్ దాం అద్భుతమైన ఆటపాటలతో ఉద్యమ కళాకారులు ఉత్సాహాన్ని నింపారు.. అంతేకాకుండా కొన్ని చోట్ల పోలీసులు సైతం ఈ కార్యక్రమాన్ని అడ్డుకున్నప్పటికీ.. ప్రజలు ఏమాత్రం వారి లాఠీ దెబ్బలకు లెక్కచేయకుండా దీనిని విజయవంతం చేశారు...
నాడు రోడ్డుపై వండిన ప్రతి మెతుకు.. తెలంగాణ రాష్ట్ర కాంక్షను చాటి చెప్పిందని.. ప్రతి పొయ్యి నుంచి వచ్చిన పొగ.. ఢిల్లీ పాలకుల కళ్ళకు కమ్మేలా చేసిందని నాటి ఉద్యమకారులు ఎన్నో వ్యాసాలు రాశారు.. తెలంగాణ వస్తేనే మన బతుకులు మారుతాయి అని నమ్మకాన్ని.. ఈ వంటావార్పు కార్యక్రమం ప్రజల్లో బలంగా నాటింది. పిల్లలతో పాటు వృద్ధులు, మహిళలు సైతం ఎండను లెక్కచేయకుండా రోడ్లపైనే గడిపేశారు..
Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!
సకలజనులు ఏకమైతే ఉద్యమం ఎంతటి ప్రరూపం దాల్చుతుందో.. ఈ కార్యక్రమం దేశానికి చూపించేలా చేసింది.. నాటి కరీంనగర్ పోరాటాల పటిమ.. ఆత్మగౌరవ నినాదం.. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయడంలో క్రియాశీలక పాత్ర పోషించింది.. 15 ఏళ్లు గడిచినప్పటికీ.. నాటి వంటావార్పు జ్ఞాపకాలు.. ఆ ఉద్వేగం, ఆ ఐక్యత తెలంగాణ ప్రజల గుండెల్లో నేటికీ ఒక అద్భుతమైన జ్ఞాపకం గానే మిగిలిపోయి ఉంది.. తెలంగాణ ఉద్యమ చరిత్ర పుటల్లో కరీంనగర్ సాధించిన ఈ పోరాటం ఎప్పటికీ ఒక మైలురాయిగానే నిలిచిపోయింది.. అంతేకాకుండా ఈ సమయంలో ఎంతోమంది చేసిన త్యాగాలు కూడా చరిత్రలో నిలిచిపోయాయి..
Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
Annadata Sukhibhava: ఏపీ రైతులకు తీపికబురు..రేపు రైతుల ఖాతాల్లోకి డబ్బు జమ..ఏం టైమ్కి వస్తాయంటే?
Vijayawada, Andhra Pradesh:Annadata Sukhibhava 2026: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న పెట్టుబడి సాయం కోసం ఎదురుచూస్తున్న అన్నదాతలకు కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించింది. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన 'అన్నదాత సుఖీభవ' పథకానికి సంబంధించిన నిధుల విడుదలకు ముహూర్తం ఖరారైంది. రేపు (శనివారం) ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బటన్ నొక్కి ఈ నిధులను నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి జమ చేయనున్నారు.
పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలోని లింగంగుంట్ల గ్రామం వేదికగా ఈ కార్యక్రమం అధికారికంగా ప్రారంభం కానుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా ఈ బహిరంగ సభలో పాల్గొని, 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తొలి విడత నిధులను రైతులకు విడుదల చేయనున్నారు. ఉదయం జరగనున్న బహిరంగ సభలో సీఎం చంద్రబాబు మాట్లాడిన తర్వాత దాదాపుగా ఉదయం 11 గంటల సమయంలో అకౌంట్లోకి డబ్బు జమ చేయనున్నారని సమాచారం. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలులో భాగంగా, వ్యవసాయ సీజన్ ప్రారంభంలోనే రైతులకు పెట్టుబడి సాయం అందించాలనే సంకల్పంతో ప్రభుత్వం ఈ అడుగు వేసింది.
ముఖ్యాంశాలు, లబ్ధి వివరాలు..
కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో సాగే 'అన్నదాత సుఖీభవ - పీఎం కిసాన్' కలయిక ద్వారా ఈ ఏడాది తొలి విడత కింద ప్రభుత్వం ఏకంగా రూ.3,125 కోట్ల భారీ మొత్తాన్ని పంపిణీ చేయనుంది. ఈ విడత నిధుల విడుదల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు 46.85 లక్షల రైతు కుటుంబాలకు నేరుగా లబ్ధి చేకూరనుంది.
విత్తనాలు, ఎరువుల కొనుగోలు సమయానికి ఈ పెట్టుబడి సాయం అందడం వల్ల రైతులకు అప్పుల బాధ తప్పుతుందని, వ్యవసాయ పనులకు ఎంతో ఊరట లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.
చిలకలూరిపేట పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు నిధుల విడుదలతో పాటు, రైతులతో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలను తెలుసుకోనున్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే తమ ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని కూటమి నాయకులు స్పష్టం చేస్తున్నారు. సీజన్ ఆరంభంలోనే నేరుగా ఖాతాల్లోకి డబ్బులు జమ అవుతుండటంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్నదాతల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన సాంకేతిక ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు.
Also Read: విశాఖపట్నంపై కన్నేసిన పాకిస్థాన్..బంగాళఖాతంలోకి పాక్ సబ్మెరైన్ ఎంట్రీ!
Also Read: Sai Krishna Case: "నా కొడుకు బతికే ఉన్నాడా లేదా చంపేశారా?".. రౌడీషీటర్ సాయికృష్ణ తల్లి ఆవేదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Cow Viral Video: పిల్లాడికి ఉయ్యాల ఊపుతున్న గోమాత.. వీడియో వైరల్!
Hyderabad, Telangana:Cow Rocking Cradle Viral Video Watch: గోమాతను మన సాంస్కృతిలో కేవలం జంతువుగా కాకుండా.. అమ్మలా భావించి పూజ చేస్తూ ఉంటాం.. ఆవుకు మనుషుల పట్ల, ముఖ్యంగా చిన్నపిల్లల పట్ల ఉండే ప్రేమ అపారమైందని చెప్పడానికి ఎన్నో పురాణాలకు సంబంధించిన కథలను వినే ఉంటాం.. కానీ తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వింత వీడియో చూస్తే.. ఆ మాటలు అక్షరాల నిజమైన అని నమ్మక తప్పదు.. ఒక మూగ జీవం చూపించిన మాతృ ప్రేమ ఇప్పుడు సోషల్ మీడియా వినియోగదారుల హృదయాలను గెలుచుకుంటుంది. అయితే ఈ వీడియోలో ఏముంది? ఇంతలా వైరల్ అవ్వడానికి గల కారణాలేంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
అమ్మతో పోటీగా ఉయ్యాల ఊపుతూ..
వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక పల్లెటూరి వాతావరణం కనిపిస్తోంది.. అక్కడ ఒక పెద్ద చెట్టుకు కట్టిన ఉయ్యాలను ఒక చిన్నారి ప్రశాంతంగా పడుకొని ఉండడం మీరు చూడొచ్చు. ఆ పిల్లాడిని నిద్రపుచ్చడానికి ఒకవైపు అతని తల్లి ఉయ్యాల ఊపుతోంది.. అయితే ఇక్కడే ఒక అద్భుతం జరిగింది.. అక్కడే నిలబడి ఉన్న ఒక ఆవు ఆ చిన్నారిపై తనకున్న ప్రేమను చాటుకుంది. తన నోటితో ఉయ్యాలతాడును పట్టుకొని.. ఆ తల్లితో పోటీగా ఎంతో జాగ్రత్తగా ఉయ్యాల ఊపడం మీరు క్లియర్ గా చూడొచ్చు.
మూగజీవం చూపిన మాతృప్రేమ..
సాధారణంగా జంతువులకు అంతగా అవగాహన ఉండదని చాలామంది భావిస్తూ ఉంటారు.. కానీ ఈ వీడియోలో ఆవు ప్రవర్తించిన తీరు చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలగక తప్పదు.. ఆ చిన్నారికి ఎక్కడ తగులుతుందో అన్నట్లుగా చాలా నెమ్మదిగా.. ఎంతో క్రమశిక్షణతో అది ఉయ్యాల ఊపుతున్న దృశ్యాలు చూసి అక్కడున్న వారితో పాటు వీడియో చూస్తున్న సోషల్ మీడియా వినియోగదారులు కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు. జంతువుల్లోనూ ఇంతటి ప్రేమ, బంధం ఉంటుందా అని అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ వస్తున్నారు..
Also Read: నాగమణికి కాపలాగా రెండు భారీ కింగ్ కోబ్రాలు.. వీడియో వైరల్..
సోషల్ మీడియా వినియోగదారులు ఫిదా..
ప్రస్తుతం ఈ అరుదైన వీడియో అన్ని సోషల్ మీడియాకు సంబంధించిన ప్లాట్ఫారమ్లలో హల్ చల్ చేస్తోంది. లక్షలాదిమంది ఈ వీడియోను వీక్షించడమే కాకుండా లైక్లతో పాటు షేర్లు కూడా చేస్తున్నారు. అంతేకాకుండా చాలామంది ఈ వీడియో చూసి వారి అభిప్రాయాలను కామెంట్లలో వ్యక్తం చేస్తూ వస్తున్నారు. గోమాత అంటే కేవలం దైవం మాత్రమే కాదు.. కమ్మని అమ్మ ప్రేమకు నిదర్శనం అని ఒకరు కామెంట్ చేయగా.. ఇక మరికొంతమంది ఈ దృశ్యం చూశాక మనసు చాలా ప్రశాంతంగా అనిపించిందని.. మూగ జీవాల ప్రేమ ఎంతో స్వచ్ఛమైన దంటు కామెంట్లు చేస్తూ వస్తున్నారు.. ఏది ఏమైనా ఉయ్యాల ఊపుతున్న ఆవుకి సంబంధించిన వీడియో మాత్రం సోషల్ మీడియాను ఊపేస్తోంది..
Also Read: నాగమణికి కాపలాగా రెండు భారీ కింగ్ కోబ్రాలు.. వీడియో వైరల్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్.. - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..
Viral Video: ఒకవైపు కాలుతున్న చితి.. పక్కనే కూర్చుని రమ్మీ ఆడుతున్న యువకులు.. వీడియో!
Hyderabad, Telangana:Burning Pyre Rummy Game Viral Video Watch: సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి నిత్యం ఏదో ఒక విచిత్రమైన షాకింగ్ వీడియో నెట్టింట ఊహించని స్థాయిలో హల్చల్ చేస్తూనే ఉంటుంది. కొన్ని వీడియోలు నవ్వు పుట్టిస్తుంటే.. మరికొన్ని ఆశ్చర్యం కలిగిస్తూ ఉన్నాయి. కానీ తాజాగా వైరల్ అవుతున్న ఒక వీడియో మాత్రం సోషల్ మీడియా వినియోగదారులను ఊహించని స్థాయిలో దిగ్భ్రాంతికి గురిచేస్తుంది. చావుపట్ల కనీసం గౌరవం లేకుండా, ఏమాత్రం భయం భక్తి లేకుండా కొంతమంది యువకులు చేసిన పనికి అందరూ ఆశ్చర్యపోతూ ఉన్నారు. అసలు ఏం జరిగి ఉంటుంది? తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఏంటి? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.
శవం కాలుతున్నా.. డోంట్ కేర్..
వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక హృదయ విదారక.. అదే సమయంలో విచిత్రమైన దృశ్యం కనిపిస్తూ ఉండడం మీరు చూడొచ్చు. ఒకవైపు స్మశాన వాటికలో చితిపై ఒక శవం కాలుతుంది. సాధారణంగా ఇలాంటి చోట నిశ్శబ్దంతో పాటు బాధ ఒక రకమైన భయానక వాతావరణముంటుంది.. కానీ అక్కడ ఉన్న కొందరు యువకులకు మాత్రం అవేమి పట్టనట్లుగా ప్రవర్తించారు. చితి పక్కనే కొంతమంది యువకులు కూర్చుని చాలా ప్రశాంతంగా రమ్మీ ఆడుతూ కనిపించారు..
భయం లేదు.. బాధ లేదు..
పక్కనే మంటలు ఎగసిపడుతూ ఒక మృతదేహం కాలిపోతున్నప్పటికీ.. ఆ యువకులు ఏమాత్రం చలించలేదు.. వారి ముఖాల్లో ఎలాంటి భయం కానీ.. బాధ కానీ కనిపించలేదు. తమ చుట్టూ ఏం జరుగుతుందననే.. దానితో సంబంధం లేకుండా.. ఆట గెలవడమే లక్ష్యంగా.. కార్డులు మొక్కలు పంచుకుంటూ రమ్మీ గేమ్ ఆడుతుండడం ఈ వీడియోలో మీరు స్పష్టంగా చూడొచ్చు. ఈ వీడియోను ఎవరు ఎక్కడ తీశారో కానీ.. సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అది కాస్త ఇప్పుడు వైరల్ గా మారింది.
Also Read: నాగమణికి కాపలాగా రెండు భారీ కింగ్ కోబ్రాలు.. వీడియో వైరల్..
ఈ వీడియో సోషల్ మీడియా అన్ని ప్లాట్ఫారమ్లలో విపరీతంగా షేర్ అవుతోంది. దీనిపై చాలామంది సోషల్ మీడియా వినియోగదారులు రకరకాలుగా స్పందిస్తూ వస్తున్నారు.. కలికాలం అంటే ఇదేనేమో.. మనుషుల్లో మానవత్వంతో పాటు చావుపట్ల భయం పూర్తిగా పోయాయి.. అని కొందరు కామెంట్స్ చేస్తుంటే.. మరికొంతమందైతే వీరి మానసికస్థితి ఏ స్థాయికి చేరిందో చూడండి.. స్మశానాన్ని కూడా వదలట్లేదు అంటూ కొంతమంది కామెంట్లలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. చితి పక్కన కూర్చుని రమ్మీ ఆడటానికి ఎంత గుండె ధైర్యం కావాలి బాబోయ్.. అంటూ మరికొంతమంది షాక్ అవుతూ కామెంట్లు పెడుతున్నారు..
Also Read: నాగమణికి కాపలాగా రెండు భారీ కింగ్ కోబ్రాలు.. వీడియో వైరల్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్.. - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..Twitter, Facebook
Allu Arjun Stampede Case: అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు నోటీసులు..సోమవారం కోర్టుకు రావాల్సిందే!
Hyderabad, Telangana:Allu Arjun Stampede Case News: హైదరాబాదులోని సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించిన ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. రాబోయే సోమవారం నాడు కోర్టు ముందు వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని న్యాయస్థానం ఆయనను ఆదేశించింది.ఈ ఘోర ప్రమాదానికి సంబంధించి చిక్కడపల్లి పోలీసులు ఇప్పటికే 23 మందిని నిందితులుగా చేర్చుతూ కోర్టులో ఛార్జ్షీటు దాఖలు చేశారు. వీరిలో 19 మంది నిందితులకు నాంపల్లి కోర్టు తాజాగా సమన్లు జారీ చేసింది.Woman Attack Video: రెవెన్యూ అధికారిపై దాడి చేసిన మహిళ..నడిరోడ్డుపై చొక్కా గల్లా పట్టి లాగేసింది!
Turkayamjal, Hayathnagar_Khalsa, Telangana:Allu Arjun: పుష్ప 2 సినిమా వివాదంపై గ్యాగ్ ఆర్డర్.. ఊహాజనిత వార్తలు ప్రచారం చేయోద్దని హైదరాబాద్ సివిల్ కోర్టు ఆదేశాలు.!.
Hyderabad, Telangana:Hyderabad civil court issued gag orders on allu arjun pushpa 2 movie controversy: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు నాంపల్లి హైకోర్టు ఊహించని షాక్ ఇచ్చింది. గతంలో పుష్ప 2 మూవీ ప్రీరిలీజ్ వేళ అశోక్ నగర్ లోని సంధ్య థియేటర్ వద్ద చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటనలో తమ ఎదుట హజరు కావాలని సమన్లు జారీ చేసింది. 2024 డిసెంబర్ 4న 'పుష్ప 2' సినిమా బెనిఫిట్ షో నేపథ్యంలో సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటలో రేవతి అనే మహిళఅభిమాని చనిపోగా, ఆమె కుమారుడు శ్రీతేజ్ ఇప్పటికి చికిత్స తీసుకుంటున్నాడు. ఈ క్రమంలో పోలీసులు మొత్తంగా 23 మందిపై గతంలో చార్జ్ షీట్ దాఖలు చేశారు.
తాజాగా.. ఈ కేసులో నాంపల్లి కోర్టు తమ ఎదుట హజరు కావాలని 19 మందికి సమన్లు జారీ చేసింది. దీనిలో ఏ 11గా ఉన్న అల్లు అర్లును కూడా నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ నెల 22న (సోమవారం) వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. దీంతో ఈ పరిణామం అల్లుఅర్జున్ కు బిగ్ షాక్ గా మారింది. మరోవైపు హైదరాబాద్ సిటి సివిల్ కోర్టు పుష్ప 2 వివాదంకు సంబంధించి గ్యాగ్ ఆర్డర్ విధించింది.
పుష్ప 2 సినిమా చిత్ర యూనిట్ తో పాటు ఎవరిపై కూడా ఊహాజనిత వార్తలు వేయవద్దంటూ కోర్టు ఆదేశించింది.
ఊహాజనిత వార్త కథనాలతో పాటు, టీవీ ఛానెల్స్ లలో డిబేట్లు పెట్టవద్దంటూ కోర్టు స్పష్టం చేసింది. సంధ్య థియేటర్కు సంబంధించిన O.S. No.216 of 2026 లో I.A. No.369 of 2026 కేసులో, హైదరాబాద్ నగర సివిల్ కోర్టు గౌరవ వేకేషన్ సివిల్ జడ్జి-కమ్-XXV అదనపు చీఫ్ జడ్జి గారు 04 జూన్ 2026 తేదీన మధ్యంతర (Ad-Interim Ex Parte Injunction) ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ ఉత్తర్వుల ప్రకారం, పై కేసుకు సంబంధించిన అంశాలపై కేసు విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో.. వాస్తవ నిర్ధారణకు ముందుగానే ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ఎటువంటి ఊహాగానాలు, అసత్య ప్రచారాలు, ఆధారరహిత ఆరోపణలు, వాస్తవాలకు విరుద్ధమైన చర్చలు, డిబేట్లు, వార్తా కథనాలు లేదా సోషల్ మీడియా పోస్టులు ప్రచురించడం లేదా ప్రసారం చేయరాదని కోర్టు ఆదేశించింది.
ముఖ్యంగా.. సంబంధిత మీడియా సంస్థలు, డిజిటల్ ప్లాట్ఫారమ్లు, సోషల్ మీడియా వేదికలు, ప్రజలు గౌరవ న్యాయస్థానం జారీ చేసిన ఈ ఉత్తర్వులను గౌరవించి, కేసుకు సంబంధించిన నిర్ధారణ కాని సమాచారాన్ని ప్రచారం చేయకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోర్టు ఆదేశించింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Rajendranagar: రీల్స్ పిచ్చి పీక్స్.. కోబ్రా పిల్లతో స్టంట్లు.. యువకుడు మృతి!
Hyderabad, Telangana:Rajendranagar Snake Bite Video: సోషల్ మీడియా పిచ్చి.. రీల్స్ మోజు నేటి తరం యువత ప్రాణాల మీదకు తెస్తోంది.. లైకులు, కామెంట్ల కోసం ప్రాణాలను సైతం పణంగా పెడుతూ చేసిన ఒక పిచ్చి ప్రయత్రం ఒక యువకుడి నిండు ప్రాణాన్ని బలితీసుకుంది.. రీల్స్ కోసం ఏకంగా కింగ్ కోబ్రా పిల్లతో సాహసాలు చేయబోయిన ఓ యువకుడు, అది కాటేయడంతో కేవలం మూడు గంటల సమయంలో ప్రాణాలు కోల్పోయిన విషాదకర సంఘటన రాజేంద్రనగర్ పరిధిలో కలకలం రేపింది.
రీల్స్ పిచ్చి..
స్థానికులతో పాటు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజేంద్రనగర్ పిల్లర్ నెంబర్ 248 పరిసర ప్రాంతంలో ఓ యువకుడు సోషల్ మీడియాలో రీల్స్ చేసి అప్లోడ్ చేయాలనుకున్నాడు. అందుకోసం స్థానికంగా కనిపించిన ఒక చిన్న కోబ్రా పిల్లను పట్టుకున్నాడు. అది చిన్న పిల్ల కదా.. ఏమౌతుందిలే అనే నిర్లక్ష్యంతో, చేతుల్లో పట్టుకుని రకరకాల విన్యాసాలు చేస్తూ వీడియోలు రికార్డ్ చేయించుకున్నాడు..
మూడు గంటల్లోనే..
పాముతో ఆటలాడుతున్న సమయంలో అది ఒక్కసారిగా యువకుడిపై దాడి చేసి కాటు వేసింది. చిన్న పామే కదా అని మొదట లైట్ తీసుకున్నప్పటికీ...కొద్దిసేపటికే విషం శరీరం మొత్తం పాకడం మొదలైంది. తీవ్ర అస్వస్థతకు గురైన యువకుడిని గమనించిన స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే, కోబ్రా విషం అత్యంత ప్రమాదకరమైనది కావడంతో.. కాటు వేసిన కేవలం మూడు గంటల సమయంలోనే ఆ యువకుడు చికిత్స పొందుతూ చనిపోయాడు.. ఈ వార్త తెలియడంతో యువకుడి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
Also Read: Video Viral: సాయం ముసుగులో అరాచకం.. యువతి ప్రైవేటు పార్ట్ మీద చెయ్యి వేసి మరీ.!. వీడియోపై దుమారం..
స్థానికుల ఆందోళన..
ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో యువతకు రీల్స్ పిచ్చి ముదిరిపోతోందని.. నాలుగు లైకుల కోసం, వ్యూస్ కోసం బిల్డింగ్ల పైనుంచి దూకడం, బైక్ స్టంట్లు చేయడం, ఇప్పుడు ఇలా విషసర్పాలతో ఆటలాడటం చూస్తుంటే భయమేస్తోందఅని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. వన్యప్రాణులు, విషసర్పాలతో ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రయోగాలు చేయోద్దని.. ప్రాణాలతో చెలగాటం ఆడవద్దని పోలీసులతో పాటు అటవీ శాఖ అధికారులు గట్టిగా హెచ్చరిస్తూ వస్తున్నారు.
Also Read: Video Viral: సాయం ముసుగులో అరాచకం.. యువతి ప్రైవేటు పార్ట్ మీద చెయ్యి వేసి మరీ.!. వీడియోపై దుమారం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్.. - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..Twitter, Facebook
Korutla: కోరుట్లలో అరుదైన కాటిల్ ఈగ్రేట్ పక్షుల.. ఎందుకొచ్చాయో తెలుసా?
Jagtial, Telangana:Korutla Mini Tank Bund News: జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని మినీ ట్యాంక్ బండ్ ప్రాంతం ప్రస్తుతం పక్షుల కిలకిలరావాలతో, అద్భుతమైన ప్రకృతి దృశ్యాలతో కళకళలాడి పోతోంది.. కంటికి ఇంపుగా, చూడముచ్చటైన రూపురేఖలతో సందర్శకులను ఆకట్టుకుంటున్న కాటిల్ ఈగ్రేట్ (Cattle Egret) పక్షులు ఇప్పుడు పట్టణ వాసులకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.. అసలు ఈ పక్షులు ఎక్కడి నుంచి వచ్చాయి. వీటి ప్రాముఖ్యత పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
సంతానోత్పత్తి కోసమే ఈ రాక..
సాధారణంగా వివిధ ప్రాంతాలకు వలస వెళ్లే ఈ కాటిల్ ఈగ్రేట్ పక్షులు.. ప్రస్తుతం కోరుట్లలోని మినీ ట్యాంక్ బండ్ సమీపంలో ఉన్న తుమ్మ చెట్లపై ప్రత్యేకమైన స్థావరాలను ఏర్పాటు చేసుకున్నాయి.. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఇవి కేవలం విశ్రాంతి కోసమే కాకుండా.. సంతానోత్పత్తి కోసం ఇక్కడికి చేరుకున్నట్లు సమాచారం.. చెట్లపై గుంపులు గుంపులుగా చేరుతూ.. గూళ్లు కట్టుకుని, గుడ్లు పొదుగుతూ పక్షులు చేస్తున్న సందడి ప్రకృతి ప్రేమికులకు కనువిందు చేస్తూ వస్తోంది..
ఆకర్షణీయమైన రంగులో..
ఈ పక్షుల ప్రత్యేకత వాటి రంగులోనే ఉంటుంది.. సాధారణ కొంగల కంటే ఇవి ఎంతో భిన్నంగా.. వీటి తల, మెడతో పాటు వీపు భాగం నారింజ, గోధుమ రంగుల సమ్మేళనంతో మెరిసిపోతూ చాలా ఆకర్షణీయంగా నిలుస్తూ ఉంటాయి.. పట్టణం మధ్యలో కూడా ఇటువంటి వలస పక్షులు కోరుట్లను తమ ఆవాసంగా ఎంచుకోవడం పర్యావరణ సమతుల్యతకు.. ఇక్కడి మినీ ట్యాంక్ బండ్ పరిసరాలు పక్షుల జీవనానికి అనుకూలంగా ఉన్నాయనడానికి నిదర్శనమని పర్యావరణవేత్తలు అభిప్రాయ పడుతూ వస్తున్నారు..
Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!
ప్రకృతి ప్రేమికుల్లో ఆనందం..
రోజూ సాయంత్రం సమయంలో మినీ ట్యాంక్ బండ్ దగ్గరకు వచ్చే స్థానికులు.. చెట్లపై వాలి ఉన్న ఈ పక్షులను చూసి ఆశ్చర్యపోతున్నట్లు తెలుస్తోంది.. చాలా మంది వీటిని ఫోటోలు తీసి సోషల్ మీడియాల్లో కూడా పోస్ట్ చేస్తున్నారు. అయితే, పక్షుల గూళ్లకు, వాటి సంతానోత్పత్తికి ఎటువంటి ఆటంకం కలగకుండా చూడాలని.. ఈ అరుదైన పక్షులను రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని స్థానిక ప్రకృతి ప్రేమికులు కోరుతున్నారు.
Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
Honor నుంచి మైండ్ బ్లోయింగ్ ఫోన్.. ఏకంగా 7,700mAh బ్యాటరీ, ప్రత్యేక AI బటన్..
Hyderabad, Telangana:Honor 600 Smart 5G: ప్రముఖ చైనీస్ స్మార్ట్ఫోన్ కంపెనీ Honor స్మార్ట్ఫోన్ ప్రియులకు అద్భుతమైన శుభవార్తను చెప్పెందుకు సిద్ధమైంది. భారీ బ్యాటరీ సామర్థ్యంతో సరికొత్త 5G స్మార్ట్ఫోన్ను లాంచ్ చేసేందుకు రెడీ అయ్యింది. దీనిని కంపెనీ Honor 600 Smart 5G పేరుతో సరికొత్త మోడల్ను కంపెనీ త్వరలోనే మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకు రాబోతోంది. ఇప్పటికే ఫ్రాన్స్కు చెందిన అధికారిక హానర్ వెబ్సైట్లో ఈ ఫోన్ 'కమింగ్ సూన్' (Coming Soon) ట్యాగ్తో లిస్ట్ అవ్వడంతో దీనిపై భారీ అంచనాలు పెరిగాయి..
ఛార్జింగ్ టెన్షన్కు చెక్..
ఈ Honor 600 Smart 5G స్మార్ట్ఫోన్ అతిపెద్ద హైలైట్ దీని బ్యాటరీ సామర్థ్యం. సాధారణంగా స్మార్ట్ఫోన్లలో 5000mAh లేదా 6000mAh బ్యాటరీలను చూస్తుంటాం.. కానీ Honor ఒక అడుగు ముందుకు వేసి ఇందులో ఏకంగా 7,700mAh భారీ బ్యాటరీని అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు 45W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా లభించడం విశేషం. ఒక్కసారి ఛార్జ్ చేస్తే రోజులకు రోజులు బ్యాటరీ బ్యాకప్ ఇచ్చేలా ఈ ఫోన్ను డిజైన్ చేసిన్నట్లు తెలుస్తోంది..
ప్రత్యేక AI బటన్..
టెక్నాలజీ పరంగా చూస్తే.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టూల్స్ను వినియోగదారులు సులభంగా యాక్సెస్ చేయడానికి వీలుగా ఈ స్మార్ట్ఫోన్లో ఒక ప్రత్యేకమైన AI బటన్ను అందించిన్నట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్ఫోన్ సరికొత్త ఆండ్రాయిడ్ 16 ఆధారిత మ్యాజిక్ ఓఎస్ 10.0 (MagicOS 10.0) ఆపరేటింగ్ సిస్టమ్పై రన్ అవుతుంది.. అంతేకాకుండా, ఇందులో శక్తివంతమైన స్నాప్డ్రాగన్ 4 జెన్ 4 (Snapdragon 4 Gen 4) ప్రాసెసర్ను వినియోగించిన్నట్లు సమాచారం..
డిస్ప్లే, కెమెరా..
Honor 600 Smart 5G మొబైల్కి సంబంధించని ఫీచర్స్ వివరాల్లోకి వెళితే.. ఈ ఫోన్ 1,020 నిట్స్ పీక్ బ్రైట్నెస్తో 6.87 ఇంచుల HD+ (1592 × 720 పిక్సెల్స్) LCD డిస్ప్లేను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా వెనక భాగంలో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను అందుబాటులోకి తీసుకు వచ్చారు. ఇందులో అద్భుతమైన సౌండ్ ఎక్స్పీరియన్స్ కోసం డ్యూయల్ స్టీరియో స్పీకర్లను అందించారు.
ఈ స్మార్ట్ఫోన్ ప్రస్తుతం వెబ్సైట్లో వైట్తో పాటు బ్లాక్ కలర్ ఆప్షన్లలో అందుబాటులోకి వచ్చింది. బడ్జెట్ ధరలోనే అదిరిపోయే ఫీచర్లు, భారీ బ్యాటరీ బ్యాకప్తో రాబోతున్న ఈ హానర్ 600 స్మార్ట్ 5G ఫోన్ మార్కెట్లో వన్ ప్లస్, శామ్సంగ్, వివో వంటి బ్రాండ్లకు గట్టి పోటీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. త్వరలోనే దీని ధరతో పాటు లాంచ్ తేదీల అధికారిక వివరాలు వెల్లడించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Allu Arjun Stampede Case: తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్కు నాంపల్లి కోర్టు నోటీసులు..కోర్టులో హాజరు కావాల్సిందేనంటూ ఆదేశం!
Hyderabad, Telangana:Allu Arjun Stampede Case News: హైదరాబాదులోని సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించిన ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. రాబోయే సోమవారం నాడు కోర్టు ముందు వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని న్యాయస్థానం ఆయనను ఆదేశించింది.
ఈ ఘోర ప్రమాదానికి సంబంధించి చిక్కడపల్లి పోలీసులు ఇప్పటికే 23 మందిని నిందితులుగా చేర్చుతూ కోర్టులో ఛార్జ్షీటు దాఖలు చేశారు. వీరిలో 19 మంది నిందితులకు నాంపల్లి కోర్టు తాజాగా సమన్లు జారీ చేసింది.
ఈ కేసులో ప్రధాన నిందితులుగా సంధ్య థియేటర్కు చెందిన యాజమాన్యం, సిబ్బందిని A1 నుంచి A10 వరకు ఛార్జ్షీట్లో చేర్చారు. అలాగే ఏ 11 నిందితుడిగా నటుడు అల్లు అర్జున్ పేరును పోలీసులు ఈ కేసులో చేర్చారు.
ఏం జరిగిందంటే?
2024 డిసెంబర్ 4 తేదీన ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్ వద్ద 'పుష్ప 2' సినిమా బెనిఫిట్ షో ప్రదర్శించనున్నారు. ఈ సందర్భంగా నటుడు అల్లు అర్జున్ అక్కడికి రావడంతో భారీగా అభిమానులు తరలివచ్చారు. ఆ సమయంలో తీవ్రమైన తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ దురదృష్టకర తొక్కిసలాటలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోగా.. ఆమె కుమారుడు శ్రీ తేజ తీవ్రంగా గాయపడ్డాడు.
తాజాగా ఈ కేసులో నాంపల్లి కోర్టు నుంచి నోటీసులు అందుకున్న నిందితులంతా సోమవారం నాడు కోర్టుకు వ్యక్తిగతంగా హాజరు కావాల్సి ఉంటుంది. నిందితుల హాజరు నమోదు ప్రక్రియ పూర్తయిన తర్వాత.. నాంపల్లి కోర్టు ఈ కేసు పై అధికారికంగా ట్రయల్ విచారణ ప్రారంభించనుంది.
Also Read: హీరోయిన్గా బుల్లితెర మెగాస్టార్ కూతురు..హీరోయిన్లనే తలదన్నే అందం దివిజ!
Also Read: ఆర్ఆర్ఆర్లో నటించిన చిన్నారి మల్లి ఇప్పుడెలా ఉందో తెలుసా? ఇంత అందంగా ఉందేంట్రా బాబూ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Oppo Reno 16c 5G: అరాచకమైన ఫీచర్స్.. 6,500mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Oppo కొత్త ఫోన్!
Hyderabad, Telangana:Oppo Reno 16c 5g Launching Soon: ప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీ కంపెనీ ఒప్పో భారత మార్కెట్లోకి మరో అద్బుతమైన స్మార్ట్ఫోన్ను విడుదల చేసేందుకు సిద్ధమైంది. దీనిని కంపెనీ అంతర్జాతీయంగా ఎంతో పేరు పొందించిన Reno సిరీస్లో మార్కెట్లోకి లాంచ్ కాబోతోంది. దీనిని కంపెనీ Oppo Reno 16c 5G మోడల్లో భారత్లో అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు కంపెనీ సిద్ధమైన్నట్లు తెలుస్తోంది. ఇది ఎంతో శక్తివంతమైన ఫీచర్స్తో పాటు అద్భుతమైన బ్యాటరీతో, అత్యంత చీప్ ధరలో లాంచ్ కాబోతున్నట్లు తెలుస్తోంది.
లీకైన ధర, వేరియంట్లు..
ప్రముఖ టిప్స్టర్ అందించిన సమాచారం ప్రకారం.. ఈ Oppo Reno 16c 5G స్మార్ట్ఫోన్ భారత మార్కెట్లోకి మొత్తం రెండు వేరియంట్స్తో అందుబాటులోకి రాబోతోంది. దీని బేస్ వేరియంట్ 256GB ఇంటర్నల్ స్టోరేజ్తో రూ. 34,999 ధరతో విడుదల కాబోతోంది. ఇక రెండవ వేరియంట్ 12GB ర్యామ్తో పాటు 256GB స్టోరేజ్ ధర రూ. 37,999తో లాంచ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. దీనిని కంపెనీ ఎంతో అద్బుతమైన ఇది పాప్ వైట్, ట్విలైట్ వయొలెట్ వంటి కలర్ ఆప్షన్స్లో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.
డిస్ప్లే, పవర్ఫుల్ ప్రాసెసర్..
Oppo Reno 16c 5G స్మార్ట్ఫోన్ 6.57-ఇంచుల ఫుల్ హెచ్డీ+ (Full HD+) అమోలెడ్ (AMOLED) డిస్ప్లేతో విడుదల కాబోతోంది. అంతేకాకుండా ఇది 120Hz రీఫ్రెష్ రేట్ను సపోర్ట్ను కలిగి ఉంటుంది. కాబట్టి దీనివల్ల స్క్రోలింగ్తో పాటు గేమింగ్ ఎక్స్పీరియన్స్ అత్యంత స్మూత్గా ఉంటుందని టెక్ నిపుణులు తెలుపుతున్నారు. ఇక ఈ స్మార్ట్ఫోన్కి సంబంధించిన పర్ఫార్మెన్స్ వివరాల్లోకి వెళితే.. ఇందులో 4 నానోమీటర్ల టెక్నాలజీతో తయారు చేసిన పవర్ఫుల్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 (MediaTek Dimensity 7300) ఆక్టా-కోర్ ప్రాసెసర్ను కలిగి ఉంటుందని లీక్ అయిన వివరాలు చెబుతున్నాయి. ఇది LPDDR5X ర్యామ్తో పాటు UFS 3.1 స్టోరేజ్ సపోర్ట్తో వస్తుండటం వల్ల మల్టీటాస్కింగ్ ఎంతో సులభంగా చేసుకోవచ్చు.
అద్భుతమైన ట్రిపుల్ కెమెరా సెటప్..
ఈ స్మార్ట్ఫోన్లో కంపెనీ అద్భుతమైన కెమెరా సెటప్ను అందించిన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా దీని వెనక భాగంలో ఎంతో ప్రత్యేకమైన ట్రిపుల్ కెమెరా సెటప్ను కలిగి ఉంటుంది. అందులో అద్భుతమైన ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్ట్తో కూడిన 50 మెగాపిక్సెల్ కలిగిన ప్రైమరీ కెమెరాను కలిగి ఉంటుంది. అంతేకాకుండా అదనంగా 3.5x ఆప్టికల్ జూమ్ సామర్థ్యం గల 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ కెమెరాను కూడా ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్ కెమెరా కూడా ఉంటుంది. దీంతో పాటు ఫ్రంట్ భాగంలో వీడియో కాలింగ్ కోసం పవర్ఫుల్ 50 మెగాపిక్సెల్ కెమెరాను అందించిన్నట్లు తెలుస్తోంది.
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
మెగా బ్యాటరీ, సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్..
ఈ స్మార్ట్ఫోన్ అత్యంత అద్భుతమైన భారీ 6,500mAh బ్యాటరీ సామర్థ్యంతో లాంచ్ కాబోతోంది.. దీనిని వేగంగా ఛార్జ్ చేసేందుకు కంపెనీ 45W సూపర్ ఊక్ (SuperVOOC) ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని అందించిన్నట్లు లీక్ అయిన వివరాలు చెబుతున్నాయి. అలాగే ఈ స్మార్ట్ఫోన్ సరికొత్త IP69 రేటింగ్తో అందుబాటులోకి వస్తోంది. దీని వల్ల దుమ్ముతో పాటు వాటర్ నుంచి ఫోన్కు పూర్తి రక్షణ లభించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. కనెక్టివిటీ పరంగా ఇందులో 5G నెట్వర్క్, ఎన్ఎఫ్సీ (NFC), స్టీరియో స్పీకర్ల సపోర్ట్ కూడా లభిస్తోంది..
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
FiFa World Cup 2026: ఫిఫా వరల్డ్ కప్లో Mexico సరికొత్త చరిత్ర.. రౌండ్ ఆఫ్ 32కు చేరిన తొలి జట్టుగా రికార్డ్..!!
Secunderabad, Telangana:Mexico vs South Korea 1-0 Match Highlights: ఆతిథ్య దేశమైన మెక్సికో.. శుక్రవారం దక్షిణ కొరియాపై 1-0 తేడాతో విజయం సాధించి 2026 ఫీఫా ప్రపంచ కప్ రౌండ్ ఆఫ్ 32లో తన స్థానాన్ని పదిలం చేసుకుంది. లూయిస్ రోమో చేసిన గోల్ తో మెక్సికో తన విజయాన్ని ఖాయం చేసింది. దీంతో ప్రపంచ కప్లో తమ మొదటి 2 మ్యాచ్లలో క్లీన్ షీట్ సాధించి.. విజయం సాధించిన 1998లో ఫ్రాన్స్ తర్వాత మొదటి ఆతిథ్య దేశంగా మెక్సికో రికార్డు క్రియేట్ చేసింది. క్లీన్ షీట్ అంటే.. మెక్సికోతో జరిగిన 2 మ్యాచ్లలోనూ ప్రత్యర్థులు ఒక్క గోల్ కూడా చేయకపోవడమని అర్థం.
గోల్ లేకుండా ముగిసిన ఫాస్టాఫ్ తర్వాత.. మెక్సికో స్కోరింగ్ను ప్రారంభించింది. 50వ నిమిషంలో లూయిస్ రోమో గోల్ చేశాడు... హెడర్తో బంతిని అడ్డుకోవడానికి కొరియా గోల్ కీపర్ చేసిన ప్రయత్నం విఫలమవడంతో మెక్సికో ఆ గోల్ను సాధించింది. ఆ తర్వాత స్కోరును సమం చేయడానికి కొరియా తీవ్రంగా ప్రయత్నించినా.. ఫలితం లేకుండా పోయింది. దీంతో సౌతాఫ్రికాతో జరిగిన మొదటి మ్యాచ్లో మెక్సికో విజయం సాధించింది.
ప్రపంచ కప్ చరిత్రలో తొలిసారిగా.. మెక్సికో తమ మొదటి రెండు గ్రూప్ దశ మ్యాచ్లను ఒక్క గోల్ కూడా ఇవ్వకుండా గెలుచుకుంది. గతంలో వారు 2002 (1-0 క్రొయేషియా, 2-1 ఈక్వెడార్), 2018 (1-0 జర్మనీ, 2-1 దక్షిణ కొరియా)లలో తమ ప్రారంభ మ్యాచ్లను గెలుచుకున్నారు. కానీ ఆ రెండు టోర్నమెంట్లలోనూ వారు తమ రెండవ మ్యాచ్లో గోల్ ఇచ్చారు.
లూయిస్ రోమో తన సొంత గడ్డపై మెక్సికో తరఫున గోల్ చేశాడు. ప్రపంచ కప్ టోర్నమెంట్లో తన క్లబ్ అయిన సిడి గ్వాడలజారా సొంత మైదానంలో తన జాతీయ జట్టు తరఫున గోల్ చేసిన ఆటగాడికి అత్యంత ఇటీవలి ఉదాహరణగా చెబుకుంటే.. జోహన్నెస్బర్గ్లోని సాకర్ సిటీలో జరిగిన 2010 ప్రపంచ కప్ ప్రారంభ మ్యాచ్లో సిఫివే త్షబలాల (కైజర్ చీఫ్స్). ఈ ఘనతను 1970 ప్రపంచ కప్లో ఎస్టాడియో అజ్టెకాలో మెక్సికో తరఫున జేవియర్ ఫ్రాగోసో (క్లబ్ అమెరికా) సాధించాడు.
గ్రూప్ Aలో అగ్రస్థానంలో నిలిచిన మెక్సికో, జూన్ 30న మెక్సికో సిటీలో జరిగే రౌండ్ ఆఫ్ 32లో గ్రూప్ C, E, F, H లేదా E నుండి మూడవ స్థానంలో నిలిచిన జట్టుతో తలపడుతుంది. 1994 నుండి బ్రెజిల్ (8)ను అధిగమించి, మెక్సికో (9) అత్యధిక సార్లు ప్రపంచ కప్ గ్రూప్ దశకు అర్హత సాధించింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
