icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

Best Used Cars: రూ.8.99 లక్షలకే మహీంద్రా థార్, టాటా హారియర్.. సెకండ్ హ్యాండ్ కార్ల ధమాకా!

Hyderabad, Telangana:

Best Used Cars in Delhi Pitampura: తక్కువ ధరలో మంచి కారు కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే మీకు శుభవార్త.. మధ్యతరగతి ప్రజల ధరలకు కూడా అద్భుతమైన కండిషన్తో కూడిన సెకండ్ హ్యాండ్ కార్లు ఢిల్లీ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఢిల్లీలోని పీతంపురా ఏరియాలో ఉన్న సెకండ్ హ్యాండ్ కార్ల షోరూంలో అత్యంత తక్కువ ధరలకే మంచి మంచి కండిషన్ కలిగిన కార్లు లభిస్తూ ఉన్నాయి. అంతేకాకుండా ఇక్కడ అద్భుతమైన కార్లు రూ.2.60 లక్షల నుంచి ప్రారంభమవుతున్నాయి. అలాగే అదిరిపోయే ఫీచర్లు ఉన్న ఎస్‌యూవీ (SUV), సెడాన్, హ్యాచ్‌బ్యాక్ కార్లు చీపు ధరలకే లభించడం విశేషం. ముఖ్యంగా ఇక్కడ డీజిల్, పెట్రోల్, సిఎన్‌జి (CNG) ఆప్షన్లలో లభిస్తున్న కార్లను ఎక్కువగా వినియోదారులు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే, ఈ సెకండ్ హ్యాండ్ కార్ షోరూమ్స్‌లో అందుబాటులో ఉన్న కార్లు ఏంటో వాటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఈ కార్ల మార్కెట్లో టాటా హారియర్ (Tata Harrier) వంటి లగ్జరీ కార్లు రూ. 7.75 లక్షల నుంచి ప్రారంభమవుతున్నాయి. ముఖ్యంగా 2021కి సంబంధించిన మోడల్ హారియర్ కేవలం రూ. 8.99 లక్షలకే అందుబాటులో ఉండడం విశేషం. అలాగే ఆఫ్-రోడింగ్ ప్రియుల కోసం 2021 మోడల్ మహీంద్రా థార్ (Mahindra Thar) 4x4 వేరియంట్ రూ. 8.99 లక్షలకే అందుబాటులో ఉంది. అలాగే మధ్యతరగతి వారికి ఇష్టమైన మారుతి స్విఫ్ట్ డిజైర్ (Swift Dzire) ఆటోమేటిక్ వేరియంట్ రూ. 3.99 లక్షలకే లభిస్తోంది. ఇవే కాకుండా ఎన్నో రకాల మోడల్స్ అత్యంత తక్కువ ధరల్లో లభిస్తూ ఉన్నాయి.

ఇవే కాకుండా 2019 మోడల్ కు సంబంధించిన మహీంద్రా KUV ఆన్-పేపర్ సిఎన్‌జితో కలిపి రూ. 2.95 లక్షలకే అందుబాటులో ఉండడం విశేషం.. అదేవిధంగా 2015 కు సంబంధించిన ఫోర్డ్ ఫిగో కేవలం రూ. 2.60 లక్షలతో మొదలు కాబోతోంది. దీంతోపాటు 2016 మోడల్ కు సంబంధించిన హ్యుందాయ్ క్రెటా ధర రూ. 5.50 లక్షలకే లభిస్తోంది. అలాగే ఈ సిఎన్‌జి ఫిట్టింగ్‌తో అందుబాటులో ఉంది. ఇది హైవేపై దాదాపు 30 కిలోమీటర్ల వరకు మైలేజీని అందిస్తున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా 2018 మోడల్ హ్యుందాయ్ వెర్నా (Verna) కేవలం రూ. 6.25 లక్షలకు అందుబాటులో ఉంది.

Also Read:​ ‘దురంధర్’ సినిమాపై నోరు మెదపని ఖాన్స్ త్రయం.. ఇతర ఇండస్ట్రీ హీరోలు..

దీంతోపాటు కస్టమర్ల కోసం తాడుపాటి మెకానిక్ చెకప్ లేదా ఇన్ఫెక్షన్ చేసుకునే వెసులుబాటును కూడా ఈ మార్కెట్లో కొన్ని సెకండ్ హ్యాండ్ షోరూమ్స్ వారు వారే ప్రత్యేకంగా అందిస్తున్నారు. అంతేకాకుండా వీటితోపాటు ఫ్యాన్ ఇండియా లోన్ సదుపాయం, ఇతర రాష్ట్రాలకు వెళ్లే వారికోసం ఎన్ఓసీతో పాటు ట్రాన్స్ఫర్ వంటి బాధ్యతలను కూడా ఇక్కడున్న షోరూమ్ యజమానులే చూసుకుంటున్నట్లు సమాచారం. కాబట్టి తక్కువ ధరలో మంచి కారు కొనుగోలు చేయాలనుకునేవారు తప్పకుండా ఢిల్లీలోని పీతంపురా మెట్రో స్టేషన్ సమీపంలో ఉన్న  సెకండ్ హ్యాండ్ కార్లు షోరూమ్స్ చాలా బెస్ట్ గా భావించవచ్చు..

Also Read:​ ‘దురంధర్’ సినిమాపై నోరు మెదపని ఖాన్స్ త్రయం.. ఇతర ఇండస్ట్రీ హీరోలు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report
Advertisement

Karimnagar: తెలంగాణ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. కేసీఆర్‌తో మాజీ మంత్రి జీవన్ రెడ్డి భేటీ!

Hyderabad, Telangana:

Karimnagar Telugu Latest News: తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటు చేసుకోబోతోంది. ఉమ్మడి కరీంనగర్ (Karimnagar) జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఈరోజు BRS అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావుతో భేటీ కాబోతున్నారు. ఎర్రబెల్లిలోని కేసీఆర్ నివాసానికి తన అనుచరులతో కలిసి జీవన్ రెడ్డి వెళ్లనుండటం ఇప్పుడు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.. ఈరోజు జీవన్ రెడ్డి కెసిఆర్ ని కలవడానికి గల కారణాలేంటి? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఈ సమావేశాన్ని కేవలం మర్యాదపూర్వక భేటీగా జీవన్ రెడ్డి వర్గీయులు తెలిపినప్పటికీ.. దీని వెనక లోతైన రాజకీయ వ్యూహాలు ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. గత కొంతకాలంగా జిల్లా రాజకీయాల్లో చోటు చేసుకున్న మార్పులతో పాటు సొంత పార్టీలో నెలకొన్న అనిచ్చితి నేపథ్యంలో జీవన్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కెసిఆర్ తో భేటీ అనంతరం ఆయన భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ భేటీకి జీవన్ రెడ్డితో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన పలువురు కీలక Brs నేతలు కూడా హాజరు కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR, మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్‌తో పాటు గంగుల కమలాకర్, టిఆర్ఎస్ సీనియర్ నేత ఎల్ రమణ, దామోదర్ రావు తదితరులు ఈ సమావేశంలో పాల్గొనబోతున్నారు. ఉమ్మడి జిల్లాలో పార్టీ బలోపేతంతో పాటు ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై కేసీఆర్ వీరికి దిశా నిర్దేశం చేయబోతున్నట్లు సమాచారం. 

Also Read:​ ‘దురంధర్’ సినిమాపై నోరు మెదపని ఖాన్స్ త్రయం.. ఇతర ఇండస్ట్రీ హీరోలు..

జీవన్ రెడ్డి వంటి సీనియర్ నేత కేసిఆర్ చెంతకు చేరడం వల్ల ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో BRS కేడర్‌లో కొత్త ఉత్సాహం నెలకుంది. గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాము మాత్రం గా ఉన్న పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకే ఈ భేటీ ఉపయోగపడుతుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా కొప్పుల ఈశ్వర్ తో పాటు గంగుల కమలాకర్ వంటి సీనియర్ నేతల సమక్షంలో జరిగే ఈ సమావేశం జిల్లా రాజకీయ చిత్రపటాన్ని మార్చే అవకాశాలున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు..

Also Read:​ ‘దురంధర్’ సినిమాపై నోరు మెదపని ఖాన్స్ త్రయం.. ఇతర ఇండస్ట్రీ హీరోలు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report

Shani Dev: ఏప్రిల్ 12 నుంచి శని గ్రహ మార్పు.. ఆ రాశుల వారికి ఆర్థిక కష్టాలు తప్పవా?

Hyderabad, Telangana:

Shani Dev Effect On 4 Zodiac Signs Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనిగ్రహం మార్పుల కారణంగా మానవ జీవితాల్లో ఎన్నో రకాల ఊహించని మార్పులు సంభవిస్తూ ఉంటాయి. న్యాయదేవతగా పిలుచుకునే ఈ శని తన స్థితిని మార్చుకున్నప్పుడల్లా ద్వాదశ రాశుల వారిపై శుభ, అశుభ ప్రభావం పడుతూ ఉంటుంది. 2026 సంవత్సరం ఏప్రిల్ 12వ తేదీన శని దేవుడు మీన రాశిలో ఉదయించబోతున్నాడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఏదైనా గ్రహం తిరోగమన నుంచి సక్రమ మార్గంలోకి రావడం వల్ల అనేక మార్పులు సంభవిస్తాయి. ముఖ్యంగా శని గ్రహం శనివారం రోజున సక్రమ మార్గంలోకి రావడం వల్ల కొన్ని రాశుల వారిపై తీవ్ర ప్రభావం పడుతుంది. ముఖ్యంగా ఈ సమయంలో కొన్ని రాశుల వారు అనేక సమస్యలను ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఆర్థికంగా కూడా తీవ్రంగా నష్టపోతారు. కాబట్టి ఈ సమయంలో తప్పకుండా ఆయా రాశుల వారి జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.

ఈ రాశుల వారిపై శని ప్రభావం..
మేషరాశి 
మేషరాశిలో జన్మించిన వ్యక్తులపై శని ప్రభావం విపరీతంగా పడబోతోంది. వీరికి ఊహించని స్థాయిలో ఖర్చులు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వీరు అనవసరపు వివాదాల్లో కూడా దూరి పేరును నాశనం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. దీంతోపాటు అనేక సమస్యలు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ఎన్నో రకాల దీర్ఘకాలిక సమస్యల భారిన కూడా పడే అవకాశాలు ఉన్నాయి. 

కన్యరాశి 
కన్యా రాశి వారికి భాగస్వామ్య వ్యాపారాల్లో అనేక ఇబ్బందులు రావడం ప్రారంభమవుతాయి. జీవిత భాగస్వామితో చిన్నపాటి విభేదాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ సమయంలో వీరి తప్పకుండా ఒకటికి రెండుసార్లు ఆలోచించడం చాలా మంచిది.. దీంతో పాటు ఆరోగ్య విషయంలో కూడా అశ్రద్ధ వహించకపోవడం మంచిదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. 

వృశ్చిక రాశి 
వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో సంతానపరమైన సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆందోళన పడకుండా ఎంతో జాగ్రత్తగా ఉండి ముందుకు సాగడం చాలా మంచిదని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా ఉద్యోగాలు చేస్తున్న వారిపై ఈ సమయంలో విపరీతమైన ఒత్తిడి పెరుగుతుంది. తీసుకునే నిర్ణయాల్లో కూడా ఆలోచించి వ్యక్తిగత జీవితానికి ఏది బాగుంటుందని అనే అంశాన్ని ఒకటికి రెండుసార్లు ఆలోచించి ముందుకు సాగండి..

మీన రాశి 
శని మీన రాశిలో ఉదయించడం వల్ల రాశి వారికి మానసిక ఆందోళన పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా అన్ని రకాల పనుల్లో విపరీతంగా జాప్యం జరుగుతుంది. ఏదైనా పని ప్రారంభించడం వల్ల ముందుకు సాగకపోవచ్చు. కాబట్టి ఈ సమయంలో కాస్త నెమ్మది నెమ్మదిగా పనులు చేస్తూ ముందుకు సాగాల్సి ఉంటుంది. దీంతోపాటు ముఖ్యమైన నిర్ణయాలు వాయిదా వేయడం చాలా మంచిదని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report

IPL 2026 LSG vs KKR: ఓటమి నుంచి లక్నో విజయం.. బౌలర్ల వైఫల్యంతో కలకత్తా హ్యాట్రిక్ ఓటమి

Kolkata, West Bengal:

KKR vs LSG Highlights: ఇది అసలైన క్రికెట్‌ ఆట.. ఇది అసలైన ఐపీఎల్‌ మజా. వరుసగా జరుగుతున్న మ్యాచ్‌లు నరాలు తెగే ఉత్కంఠతో కొనసాగుతుండగా.. లక్నో సూపర్‌ జియాంట్స్‌, కలకత్తా నైట్‌రైడర్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌ కూడా అదే స్థాయిలో జరిగింది. ఒక్కో బంతి ఒక్కో మలుపు తిరుగుతూ.. ఫలితం అటు ఇటు తారుమారు అవుతూ చివరకు విజయం లక్నో వైపు నిలవగా.. మరో ఓటమిని ఖాతాలో వేసుకుని ఈ సీజన్‌లో కలకత్తా హ్యాట్రిక్‌ పరాభవం మూటగట్టుకుంది.

Also Read: Gas Cylinder Theft: ఖమ్మంలో సరికొత్త దొంగతనం.. బంగారం కన్నా గ్యాస్‌ సిలిండర్‌ ఎక్కువ

వరుస ఓటములతో సతమతమవుతున్న కలకత్తా నైట్‌రైడర్స్‌ మరో ఓటమిని చవిచూసింది. లక్నో సూపర్‌ జియాంట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఏమాత్రం పోరాటం చేయలేదు. మోస్తరు లక్ష్యాన్ని బౌలర్లు కాపాడడంలో విఫలమయ్యారు. కానీ లక్నో సూపర్‌ జియాంట్స్‌ అద్భుతంగా ఆడి ఓటమి నుంచి విజయం వైపుగా మ్యాచ్‌ను మలుపు తిప్పింది. కలకత్తా వేదికగా జరిగిన మ్యాచ్‌లో కలకత్తాపై మూడు వికెట్ల తేడాతో లక్నో విజయం సాధించి పాయింట్లను మెరుగుపర్చుకోగా.. కలకత్తా హ్యాట్రిక్‌ ఓటములతో చెన్నై సరసన నిలిచింది.

Also Read: Gas Cylinder Theft: ఖమ్మంలో సరికొత్త దొంగతనం.. బంగారం కన్నా గ్యాస్‌ సిలిండర్‌ ఎక్కువ

సొంతగడ్డపై టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్‌లలో 4 వికెట్లు కోల్పోయి 181 పరుగులు చేసింది. కెప్టెన్‌ అజింక్యా రహనే 24 బంతుల్లో 41 పరుగులు చేయగా.. వాటిలో 4 ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి. ఫిన్‌ అలెన్‌ (9) తక్కువ స్కోర్‌కే పరిమితమవగా.. అంగ్‌క్రిష్‌ రఘువంశీ అద్భుతంగా ఆడి 33 బంతుల్లో 45 పరుగులు చేశాడు. వాటిలో 5 బౌండరీలు, రెండు సిక్సర్లు ఉన్నాయి. కామెరూన్‌ గ్రీన్‌ 24 బంతుల్లో 32 పరుగులతో రాణించగా.. రింకూ సింగ్‌ 4 పరుగులే చేశాడు. ఆఖరులో రావ్‌మన్‌ పావెల్‌ చెలరేగి ఆడి 39 పరుగులు చేసి జట్టుకు చెప్పుకోదగ్గ స్కోర్‌ను అందించాడు. వరుస వైఫల్యాలను పొందుతున్న సమయంలో విజయం కోసం భారీ స్కోర్‌ చేస్తారనుకుంటే మోస్తరు స్కోర్‌ నమోదు చేశారు. లక్నో సూపర్‌ జియాంట్స్‌ బౌలింగ్‌ చెప్పుకోదగ్గట్టు ఏమీ లేదు. ప్రిన్స్‌ యాదవ్‌, సిద్ధార్థ్‌, దిగ్వేష్‌ రాఠి, అవేశ్ ఖాన్‌ ఒక్కో వికెట్‌ తీశారు.

Also Read: Voice And SMS Packs: మొబైల్‌ వినియోగదారులకు తీపి కబురు.. డేటా లేకుండా రీచార్జ్‌ ప్లాన్స్‌

కలకత్తా నిలిపిన లక్ష్యాన్ని బంతులను పూర్తి చేసుకుని 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. సూపర్‌ ఓవర్‌ వెళ్తుందని భావించగా అనూహ్యంగా ముకుల్‌ చౌదరి బ్యాటింగ్‌తో అదరగొట్టి జట్టుకు విజయాన్ని అందించాడు. మిచెల్‌ మార్ష్‌ (15), కెప్టెన్‌ రిషబ్‌ పంత్‌ (10), నికోలస్‌ పూరన్‌ (13), అబ్దుల్‌ సమద్‌ (2), షమీ (1) తక్కువ పరుగులు చేయగా.. ఆయుశ్‌ బదౌనీ, ముకుల్‌ చౌదరి అద్భుతంగా ఆడారు. 34 బంతుల్లో 54 పరుగులు చేసిన ఆయుశ్‌.. 7 ఫోర్లు, రెండు సిక్సర్లతో చెలరేగి ఆడాడు. వికెట్లన్నీ టపాటపా పడుతున్నా.. ఓటమి ఖాయం చేసుకున్న సమయంలో ముకుల్‌ చౌదరి అద్భుతంగా ఆడాడు. ఎవరూ ఊహించని రీతిలో ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి దుమ్మురేపాడు. 27 బంతుల్లో 54 పరుగులు చేసి విన్నింగ్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. బౌండరీలు రెండు కొట్టగా.. ఏడు సిక్సర్లతో ధనాధన్‌ షాట్లు బాదాడు.

చివరి రెండు ఓవర్లు
విజయం కోసం ఏమాత్రం కలకత్తా బౌలర్లు ప్రయత్నం చేయలేకపోయారు. ఆరంభంలో టపాటపా వికెట్లు తీసినా.. ఓవర్లు ముగుస్తున్నా కొద్దీ బౌలింగ్‌ పదును తగ్గింది. ముఖ్యంగా చివరి రెండు ఓవర్లు చక్కగా వేసి ఉంటే ఫలితం వేరేలా ఉండేది. కానీ కలకత్తా బౌలర్లు గెలుపు బాధ్యత మరిచారో లేదో ఏమిటో తెలియదు కానీ వికెట్లు తీయకపోవడమే కాకుండా పరుగులను కూడా నియంత్రించలేకపోయారు. వైభవ్‌ అరోరా, అనుకుల్‌ రాయ్‌ రెండేసి వికెట్లు తీయగా.. సునీల్‌ నరైన్‌, కార్తీక్‌ త్యాగి, కామెరూన్‌ గ్రీన్‌ ఒక్కో వికెట్‌ తీశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report
Advertisement

Akanksha Puri Bikini Saree: చీరపై బికినీ బ్లౌజ్‌లో తమిళ హీరోయిన్ రచ్చ..సోషల్ మీడియాలో బండ బూతులు తిడుతున్నారు!

Hyderabad, Telangana:

Akanksha Puri Bikini Saree Photots: సినీ తారల జీవితమంతా వారు ఏదో ఒక స్టైల్‌, ఫ్యాషన్ ట్రెండ్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అయితే అలాంటి కొన్ని విచిత్రమైన ఫ్యాషన్స్ సాధారణ ప్రజలకు అంతగా నచ్చకపోవచ్చు. అలా ఎంతో మంది సెలబ్రిటీలు తమ ఫ్యాషన్ డిజాస్టర్‌గా మిగిలిన రోజుల్లో ఎంతో మంది ట్రోల్స్‌కు గురైయ్యారు. ఇప్పుడదే కోవలో ఓ సీరియల్ నటిపై నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. అయితే ఈ 37 ఏళ్ల నటి తాజాగా జరిగిన ఓ ఫ్యాషన్‌ షోలో సంప్రదాయ దుస్తులైన చీరపై బికినీ బ్లౌజ్ ధరించి ర్యాంప్ వాక్ చేసింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. 

తమిళ, హిందీ, భోజ్‌పురీ వంటి భాషల్లో సుపరిచితమైన బోల్డ్ యాక్టరస్ ఆకాంక్ష పూరి. తమిళంలో విశాల్, తమన్నా జంటగా నటించిన 'యాక్షన్' సినిమాలోనూ ఆకాంక్ష నటించింది. ఈ సినిమా తెలుగు డబ్బింగ్ వర్షెన్ రిలీజ్ కాగా.. ఈమె తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. ఇటీవలే ఆమె 'సారీ పర్మైష్' అనే మ్యూజిక్ వీడియోతో తరచూ వార్తల్లో నానుతోంది. ఆ మ్యూజిక్ ఆల్బమ్ ప్రచారంలో భాగంగా ఓ ఫ్యాషన్‌ షోకు నటి ఆకాంక్ష పూరి హాజరైంది. అయితే అందులో ఆమె ధరించిన దుస్తులు ఇప్పుడు విమర్శలకు తావిస్తోంది. 

ఈ ఆన్‌లైన్ ట్రోలింగ్‌కు కారణం ఏమిటంటే ఆమె ర్యాంప్ వాక్ సమయంలో సంప్రదాయ చీరపై బికినీ బ్లౌజ్ ధరించడమే అని తెలుస్తోంది. ఇదే విషయమై ఆమెపై సోషల్ మీడియాలో రకరకాల ట్రోల్స్ వస్తున్నాయి. కొందరు నెటిజన్లు ఆమెపై తిట్ల దండకం మొదలుపెడుతున్నారు. ఇప్పుడిదే ట్రోల్స్ పై నటి ఆకాంక్ష పూరి స్పందించారు. 

బాంబే టైమ్స్ ఫ్యాషన్ వీక్‌లో డిజైనర్ రోహిత్ వర్మ కోసం నటి ఆకాంక్ష పూరి.. అతిథిగా ర్యాంప్‌పై నడిచినప్పటి నుంచి ఈమెపై సోషల్‌ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ బిపాషా బసుతో సహా పలువురు ప్రముఖ తారలు విచ్చేశారు. అయితే ఈ ర్యాంప్‌ వాక్‌లో ఆకాంక్ష పూరి ధరించిన బికినీ బ్లౌజ్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ నటి సాంప్రదాయ మహారాష్ట్ర పైఠానీ చీరను ధరించి, దానికి బికినీ బ్లౌజ్‌ను ధరించడం చాలామందికి నచ్చలేదు. 

ఈ క్రమంలో ఆమె ఈ దుస్తులలో ర్యాంప్‌పై నడిచినప్పుడు.. అందరూ ఆమె సిక్స్ ప్యాక్ అబ్స్, ఫిట్‌నెస్‌ను గమనించి కొందరు మెచ్చుకోగా మరికొందరు ఆ ఫొటోలను చూసి విమర్శిస్తున్నారు. ర్యాంప్ వాక్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంటే.. ట్రోల్స్ మొదలయ్యాయి. ఇలాంటి దుస్తుల కాంబినేషన్ భారతీయ సంస్కృతిని అవమానించడమే అని కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరైతే 'చెత్త ఫ్యాషన్' అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు.  

ఆన్‌లైన్ ట్రోలింగ్‌ పై నటి ఆకాంక్ష పూరి స్పందించింది. దుస్తులు అనేవి తన ఎంపిక కాదని చెప్పింది. అది కేవలం డిజైనర్ ఆలోచన అని ఆమె తెలిపింది. డిజైనర్ నచ్చిన దుస్తులను ర్యాంప్ వాక్‌లో ధరించాల్సి ఉంటుందని.. తన డిజైనర్ చెప్పిన దుస్తులనే ధరించానని ఆమె చెప్పుకొచ్చింది. ఈ క్రమంలో తన డిజైనర్ రోహిత్‌కు మద్దతుగా నిలిచింది. రోహిత్ డిజైన్ చేశాడంటే ఎంతో ఆలోచించి.. ఆ తర్వాతే అలా డిజైన్ చేసి ఉంటాడని వెల్లడించింది. అతని పూర్తిగా నమ్మకం ఉందని.. తనపై నమ్మకంతోనే ఆత్మవిశ్వాసంతో ర్యాంప్ వాక్ చేశానని జవాబు ఇచ్చింది. 

Also Read: Silk Smitha Apple Auction: సిల్క్ స్మిత కొరికిన ఆపిల్ పండు వేలం..ఎంతకు కొన్నారో తెలుసా? స్టార్ హీరో సినిమా రెమ్యూనరేషన్ అది!

Also Read; KKR vs LSG Preview: నేడే కేకేఆర్ Vs లక్నో మ్యాచ్..ప్లేయింగ్ 11 జట్లు ఇవే..వాళ్లిద్దరూ జట్టులో నుంచి ఔట్!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report
Advertisement

Gas Cylinder Theft: ఖమ్మంలో సరికొత్త దొంగతనం.. బంగారం కన్నా గ్యాస్‌ సిలిండర్‌ ఎక్కువ

Penuballi, Telangana:

LPG Gas Cylinder: గ్యాస్‌ సిలిండర్ల సమస్య దేశంలో తీవ్రంగా వేధిస్తుండగా దొంగలు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దాని ప్రభావం ఎంతలా బంగారం, వెండి ఆభరణాలకు తగ్గట్టు అంతటి విలువ గ్యాస్‌ సిలిండర్ పొంది ఉంది. ఖమ్మం జిల్లాలో జరిగిన దొంగతనంలో బంగారు, వెండి ఆభరణాలతోపాటు గ్యాస్‌ సిలిండర్‌ను దొంగతనం చేశాడు. అంతేకాకుండా ఇంట్లో ఉన్న వంటనూనె క్యాన్‌ను కూడా తస్కరించాడు. వైరల్‌గా మారిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

Also Read: Cyber Fraud: వికసిత్‌ భారత్‌ పేరిట మోసం.. సైబర్‌ నేరగాళ్ల చేతిలో బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే

ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో పట్టపగలు జరిగిన చోరీ కలకలం రేపింది. దొంగలు బంగారం, వెండి ఆభరణాలతో పాటు వంట నూనె, గ్యాస్ సిలిండర్‌ను కూడా ఎత్తుకెళ్లడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. జార్ఖండ్ నుంచి వచ్చి లంకపల్లి గ్రామంలోని మసీద్‌లో నాలుగు సంవత్సరాలుగా మహమ్మద్ కమాలుద్దీన్ మౌల్వీ సాబ్‌గా పని చేస్తున్నాడు. మసీద్ ఆవరణలోనే నివాసం ఉంటూ లంకపల్లి సెంటర్‌లో ఫ్యాన్సీ షాపు నిర్వహించుకుంటూ జీవిస్తున్నాడు.

Also Read: Voice And SMS Packs: మొబైల్‌ వినియోగదారులకు తీపి కబురు.. డేటా లేకుండా రీచార్జ్‌ ప్లాన్స్‌

యథావిధిగా గురువారం తన ఇంటికి తాళం వేసి మౌల్వీ సాబ్ తన భార్యతో కలిసి దుకాణానికి వెళ్లారు. తర్వాత మధ్యాహ్నం ఇంటికి వచ్చే సరికి ఇంటి తాళాలు పగలకొట్టి.. ఇంట్లోని వస్తువులు చిందరవందరగా పడి ఉన్నాయి. లోపలికి వెళ్లి చూడగా బీరువా తాళాలు పగలకొట్టి ఉంది. పరిశీలించగా రూ.10 వేల నగదుతో పాటు 5.195 గ్రాముల బంగారు ఆభరణాలు, 454.74 గ్రాముల వెండి ఆభరణాలను దొంగతనానికి గురయ్యాయి. దీంతోపాటు ఇంట్లో ఉన్న నిత్యావసర వస్తువులు, 15 లీటర్ల వంట నూనె, గ్యాస్ సిలిండర్‌ను దొంగలు ఎత్తుకెళ్లారు. గ్యాస్ కనెక్షన్‌ను తీసేసి మరీ గ్యాస్ సిలిండర్‌ను దొంగలించడం గమనార్హం. బాధిత కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దొంగతనం జరిగిన విధానాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

మేడిపల్లిలో దొంగతనం
మల్కాజిగిరి కమిషనరేట్ మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధి పర్వతాపూర్ మల్లికార్జున్ నగర్ ఓ ఇంట్లో చోరీ జరిగింది. బంధువు మరణించాడని కుటుంబసభ్యులు వెళ్లి వచ్చేలోపు ఇంట్లో దొంగతనం చోటుచేసుకుంది. ఇంట్లోని బంగారం, వెండి ఆభరణాలు దుండగులు అపహరించారు. ఐదు తులాల బంగారు ఆభరణాలు, కొంత నగదు చోరీకి గురైందని బాధితురాలు రేణుక తెలిపారు.

సికింద్రాబాద్‌లో చైన్‌స్నాచింగ్‌
హైదరాబాద్‌ సికింద్రాబాద్‌లో చైన్ స్నాచింగ్‌కు పాల్పడుతున్న నిందితుడిని రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జీఆర్‌పీ, ఆర్‌పీఎఫ్ సంయుక్తంగా చేపట్టిన దర్యాప్తులో దొంగ చిక్కాడు. అతడి 50 గ్రాముల బంగారు నగలు స్వాధీనం చేసుకున్నారు. షేర్ మార్కెట్ నష్టాలు, ఆన్‌లైన్ బెట్టింగ్ కారణంగా ఈ నేరాలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. రెండు కేసులు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report
Advertisement

Cyber Fraud: వికసిత్‌ భారత్‌ పేరిట మోసం.. సైబర్‌ నేరగాళ్ల చేతిలో బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే

Jangaon, Telangana:

Viksit Bharat Scheme Cyber Fraud: సైబర్‌ నేరగాళ్లు సాధారణ ప్రజలను వదిలిపెట్టి వీవీఐపీలను పట్టుకుంటున్నారు. ఇప్పటికే ఏపీలో పలువురు ప్రజాప్రతినిధులను బురిడీ కొట్టి మోసం చేసిన సైబర్‌ మోసగాళ్లు ఇప్పుడు తెలంగాణ ఎమ్మెల్యేను కూడా తమ వలలో వేసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం వికసిత్‌ భారత్‌ పేరు చెప్పి ఎమ్మెల్యేతో మాట్లాడి రూ.లక్ష తన్నుకుపోయారు. తీరా అసలు విషయం తెలుసుకుని ఎమ్మెల్యే విస్తుపోయాడు. ఆ ఎమ్మెల్యే ఎవరో కాదు బీఆర్‌ఎస్‌ పార్టీ జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌ రెడ్డి. ఈ ఘటనపై జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

Also Read: Voice And SMS Packs: మొబైల్‌ వినియోగదారులకు తీపి కబురు.. డేటా లేకుండా రీచార్జ్‌ ప్లాన్స్‌

జనగామ బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌ రెడ్డి ఫోన్‌కు ఒకరు ఫోన్‌ చేసి 'ఫైనాన్స్‌ అడిషనల్‌ సెక్రటరీ మాట్లాడుతున్నా. కేంద్ర ప్రభుత్వ పథకం వికసిత్‌ భారత్‌ ద్వారా నిరుద్యోగ యువతకు రూ.10 లక్షల వరకు రుణాలు ఇచ్చే అవకాశం ఉంది. దీనికి ఒక్కొక్కరికి రూ.2,500 ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లించాల్సి ఉంది' అని వివరించాడు. ఈ పథకంతో తన జనగామ నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతకు ఆర్థిక ప్రయోజనం లభిస్తుందని భావించిన పల్లా రాజేశ్వర్‌ రెడ్డి తనకు ఫోన్‌ చేసిన వ్యక్తికి రూ.లక్ష ఫోన్‌పే ద్వారా చెల్లించాడు. అనంతరం అసలైన ఫైనాన్స్‌ అడిషనల్‌ సెక్రటరీకి ఫోన్‌ చేసి డబ్బులు అందాయా? అని ఎమ్మెల్యే అడిగారు.

Also Read: Nayanthara: తిరుమలలో హీరోయిన్‌ నయనతారపై ఎగబడ్డ అభిమానులు

డబ్బులు ఎక్కడివి? ఏం మాట్లాడుతున్నారు? తాను ఫోనే చేయలేదని ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శి బదులివ్వడంతో పల్లా రాజేశ్వర్‌ రెడ్డి అవాక్కయ్యారు. తాను మోసపోయానని గ్రహించి వెంటనే జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సైబర్‌ క్రైమ్‌ విభాగంలో ఈ ఘటనపై కేసు నమోదైంది. సైబర్‌ మోసగాళ్ల చేతిలో ఎమ్మెల్యే మోసపోవడం ఇది తొలిసారి కాదు. గతంలో ఏపీకి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు కూడా మోసపోయారు. 

సైబర్‌ నేరగాళ్లు, మోసగాళ్లు వీవీఐపీలనే ఈ స్థాయిలో మోసం చేస్తుంటే ఇక సాధారణ ప్రజల పరిస్థితి ఏమిటో అర్థం చేసుకోవాలి. అసలు నేరాల కంటే సైబర్‌ మోసాలు భారీగా పెరిగిపోతుండడంతో పోలీసులు వీటిపై ప్రత్యేకంగా దర్యాప్తు చేపడుతున్నారు. అయితే ఎంత చేసినా ముందు ప్రజలు సైబర్‌ మోసగాళ్లపై అవగాహన పెంచుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. అవగాహన ఉంటే మోసపోయే అవకాశం ఉండదని చెబుతున్నారు.

Also Read: YSR Death Reason: తండ్రి వైఎస్సార్‌ మరణం వెనుక వైఎస్‌ జగన్ హస్తం: అచ్చెన్నాయుడు తీవ్ర ఆరోపణలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report

YS Sharmila: అన్న వైఎస్‌ జగన్‌ వైఎస్‌ షర్మిల ఆగ్రహం.. వైఎస్సార్‌ ఆశయాలకు వారసుడు కాదు

Vijayawada, Andhra Pradesh:

YS Jagan MAVIGUN: మావిగన్‌ అంటూ రాజధానిపై కొత్త ప్రతిపాదన తీసుకువచ్చిన మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిపై కాంగ్రెస్‌ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అతడు మావిగన్‌ జోకర్‌ అని ప్రకటించారు. 3 రాజధానుల పేరుతో రుషికొండ మింగేసి సొంతానికి ప్యాలెస్‌లు కట్టుకున్నారని మండిపడ్డారు. వారసులం అని చెప్పుకునే జగన్ వైఎస్సార్‌ పేరును వాడుకున్నారు తప్పిస్తే.. ఆయన ఆశయాలకు వారసులు కాలేదని ప్రకటించారు.

Also Read: YSR Death Reason: తండ్రి వైఎస్సార్‌ మరణం వెనుక వైఎస్‌ జగన్ హస్తం: అచ్చెన్నాయుడు తీవ్ర ఆరోపణలు

వైఎస్సార్‌ చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్రకు నేటికి 23 ఏళ్లు పూర్తవడంతో వైఎస్‌ షర్మిల 'ఎక్స్‌' వేదికగా స్పందించారు. 'వైఎస్సార్‌సీపీలో నిజంగా వైఎస్సార్‌ ఐడియాలజీ ఉంటే జగన్ సీఎం అయ్యి కూడా వైఎస్సార్‌ జలయజ్ఞాన్ని ఎందుకు పూర్తి చేయలేదు? వైఎస్సార్‌ వ్యతిరేకించిన బీజేపీకి దత్తపుత్రుడుగా ఎందుకు మారారు? దళితులపై, క్రిస్టియన్లపై దాడులు జరుగుతుంటే మౌనంగా ఎందుకున్నారు? అని వైఎస్ షర్మిలా రెడ్డి ప్రశ్నించారు. వైఎస్సార్‌ ఐడియాలజీ కాంగ్రెస్‌తోనే సాధ్యమని ప్రకటించారు.

Also Read: Tirumala Laddu: తిరుమలలో సరికొత్త రికార్డు.. రూ.13.95 కోట్ల లడ్డూ విక్రయాలతో రూ.567 కోట్ల ఆదాయం

'ఏప్రిల్ 9, 2003లో తెలంగాణలోని చేవెళ్ల నుంచి ఇచ్చాపురం దాక ప్రజాహితమే పరమావధిగా సాగిన 1,457 కిలోమీటర్ల పాదయాత్ర కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలోనే కాదు.. దేశంలోనూ అధికారంలో తెచ్చిన ఒక శాశ్వత జ్ఞాపకం. కాంగ్రెస్ నాయకుడు, నాన్న వైఎస్సార్‌ ప్రజాప్రస్థానం తెలుగు ప్రజల గుండెల్లో ఈరోజుకు పదిలం' అని వైఎస్‌ షర్మిల తెలిపారు. ప్రతిపక్ష నాయకుడిగా ఆనాటి పాదయాత్ర నేటి అభివృద్ధికి నిర్వచనం.. 23 ఏళ్లుగా సంక్షేమానికి మహానేత పెట్టిన చెక్కుచెదరని సంతకం అని కొనియాడారు. ప్రజలకు నేనున్నాననే భరోసా కల్పించిన అభయహస్తం.. రాష్ట్ర దుర్భర పరిస్థితులను అంతమొందించిన స్వర్ణయుగం అని తన తండ్రి పాలనపై వైఎస్‌ షర్మిల ప్రశంసలు కురిపించారు.

Also Read: Nayanthara: తిరుమలలో హీరోయిన్‌ నయనతారపై ఎగబడ్డ అభిమానులు

'వారసులం అని చెప్పుకునే వైఎస్‌ జగన్ మోహన్ రెడ్డి వైఎస్సార్‌ పేరును వాడుకున్నారు తప్పిస్తే ఆయన ఆశయాలకు వారసులు కాలేదు. మాట తప్పం మడమ తిప్పం అనే వైఎస్సార్ లైన్ వాడుకోవడం తప్పిస్తే పూర్తి మద్యపాన నిషేధమని మాట ఇచ్చి.. కల్తీ మద్యం అమ్మి ఓన్లీ క్యాష్ మాఫియా ఎందుకు చేశారు?' అని ఏపీసీసీ చీఫ్‌ వైఎస్‌ షర్మిల ప్రశ్నించారు. 'వైఎస్సార్‌ తన జీవిత కాలం వ్యతిరేకించిన బీజేపీకి దత్తపుత్రుడుగా ఎలా మారారు? ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తే మౌనంగా ఎందుకున్నారు? దేశ వ్యాప్తంగా క్రిస్టియన్ మైనారిటీలపై ఆర్‌ఎస్‌ఎస్‌ వాదులు దాడులు చేస్తుంటే వైఎస్సార్‌ వారసుడిగా జగన్ ఎందుకు ఖండించలేదు?' అని నిలదీశారు.

Also Read: Voice And SMS Packs: మొబైల్‌ వినియోగదారులకు తీపి కబురు.. డేటా లేకుండా రీచార్జ్‌ ప్లాన్స్‌

సంక్షేమానికి సారథి వైఎస్సార్‌. ఆయన ప్రతీ పథకం ప్రజల కష్టం కన్నీళ్ల నుంచి పుట్టిందే. ఉచిత కరెంటు, రైతు రుణమాఫీ, రాజీవ్ ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్ మెంట్, జలయజ్ఞం, ఇందిరమ్మ పక్కా ఇండ్లు, పావుల వడ్డీకే రుణాలు, 108/104 అంబులెన్స్ సేవలు ఇలా ప్రతీది ఒక చరిత్ర' అని వైఎస్‌ షర్మిల వెల్లడించారు. వైఎస్సార్‌ ఐడియాలజీ బతికి ఉంది కేవలం కాంగ్రెస్ పార్టీలోనే.. ఆయన ఆశయాలు మళ్లీ కాంగ్రెస్‌తోనే సాధ్యమని చెప్పారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report

Free House: వార్నీ.. ఇల్లు ఫ్రీ, ఉద్యోగం కూడా ఇస్తారట! యూరప్‌లో ఉన్న ఆ ఊరికి వెళ్తారా? ఓ కండిషన్ ఉందోయ్!

Hyderabad, Telangana:

Free House And Job In Spain Village: ఎంతో మంది కలల దేశం యూరప్‌లో ఉచిత ఉద్యోగం, ఉండటానికి ఇల్లు ఉంటే ఎలా ఉంటుంది? ఉదయం లేవగానే చుట్టూ కొండలు, ట్రాఫిక్‌, ఎలాంటి శబ్దం లేకుండా ఉండే వాతావరణం ఎవరికి ఇష్టం ఉండదు? స్పెయిన్‌లోని అరెనిల్లా అనే గ్రామం ఆ ఊళ్లో ఉంటే ఇల్లు, జాబ్‌ కూడా ఉచితంగా ఇస్తున్నారు. ఇది కేవలం ఫ్రీ హాలిడే కాదు.. సీరియస్‌ డీల్‌. రీయల్‌గా మీరు ఫ్రీగా ఇల్లు, ఉద్యోగం పొందుతారు. కానీ, దీనికి ఒక కండీషన్‌ ఉంది.

అరెనిల్లాస్ ఉచితంగా ఇల్లు, జాబ్‌కు కండీషన్స్‌ ఏంటంటే?
అరెనిల్లాస్ స్పెయిన్‌లోని అత్యంత జనాభాల ఉండే సోరియా ప్రాంతానికి దూరంగా ఉన్న మారుమూల గ్రామం. దాదాపు అక్కడ ఓ 40 నివాసాలు ఉంటాయి. ఈ గ్రామానికి ఇంకో పేరు 'Empty Spain'. ఎందుకంటే కొన్ని దశాబ్దాలుగా ఇక్కడే ఉండే ప్రజలు కనుమరుగైపోతున్నారు. ఈ సమస్యను అధిగమించడానికే లోకల్‌ కౌన్సిల్‌ ఈ ఆఫర్ చేస్తోంది.

ఈ ఆఫర్ కేవలం ఫ్యామిలీస్‌కు మాత్రమే
అయితే, వారికి స్కూలుకు వెళ్లే పిల్లలు కూడా ఉండాలి
వారు శాశ్వతంగా అక్కడే నివాసం ఉండాలి
అక్కడ ఓ విలేజ్‌ బార్‌ కూడా తప్పకుండా నడపాలి
స్థానిక మున్సిపల్‌లో కూడా వారు పనిచేయాలి అని కండీషన్స్‌ పెడుతోంది.

ప్రధానంగా 40 మందే ఉండటంతో ఆ ఊరి జనాభా పెంచడానికి ఈ ఉచిత ఇల్లు, జాబ్‌ ఆఫర్ అందిస్తోంది. అయితే, ఈ ప్రకటన చేసిన వెంటనే దాదాపు 100 దరఖాస్తులు కూడా ఇప్పటికే వచ్చాయట. ఈ ఇల్లు రినోవేట్‌ చేసిన ఏడు ఇళ్లలో ఒకటి కేటాయిస్తారు. మిగతా ఇల్లు ఒక్కోక్కటి నెలకు 100 యూరోలు. బాధ్యత ఎక్కువ ఉంటాయి కాబట్టి ఉచితంగా అందిస్తున్నారు.

Also Read:​  రెండు వారాలు డెడ్‌లైన్‌ పొడిగించిన ట్రంప్.. హార్ముజ్‌ తెరిచేందుకు ఇరాన్‌ గ్రీన్‌ సిగ్నల్! రాత్రికి రాత్రే ఏం జరిగింది?

Also Read:​  ఇరాన్‌కు డొనల్డ్‌ ట్రంప్‌ చివరి హెచ్చరిక.. ఈరోజు రాత్రి ఏం జరుగుతుందో..?

అరెనిల్లాస్ ఎందుకు ప్రత్యేకం..?
2026 ప్రారంభంలోనే ఈ ఆఫర్ ప్రకటించారు. దీంతో కేవలం వారంలోనే 100 అప్లికేషన్స్‌ కూడా వచ్చాయి. ఎందుకుంటే యూరప్‌లో ఫ్రీ ఇల్లు అంటే అది కలే.. దీనికి తోడు జాబ్‌ కూడా లభిస్తుంది. అది కూడా లైఫ్‌టైమ్‌ ఆఫర్.
అయితే ఇక్కడ సులభంగా బతకవచ్చు. ఇది కొండ ప్రాంతంలో ఉంటుంది కాబట్టి ఉష్ణోగ్రతలు కూడా కాస్త వెచ్చగానే ఉంటుంది. ఏప్రిల్‌ నెలలో 24 డిగ్రీలు నమోదు అవుతాయి.

అయితే, ఇక్కడ ఉన్న మరో కండీషన్‌ ఏంటంటే తాత్కాలికంగా కాదు.. ఇక్కడ శాశ్వతంగా నివాసం ఉండాల్సిందే.

ఇవి మర్చిపోకండి..
ఇది కల కాదు.. ఒకసారి నిజంగా ఆలోచించండి. శాశ్వతంగా అక్కడే మీరు ఉండిపోలరా? అని గుర్తుంచుకోండి. అరెనిల్లా ఊళ్లో జీవనం ఏకాంతంగా చాలా బాగుంటుంది. చలికాలంలో కాస్త ఇబ్బంది తప్పదు. అంతేకాదు ఈ ఊరికి రవాణా కూడా అంతంత మాత్రమే. కచ్చితంగా సొంత వాహనం ఉండాల్సిందే. ఇక్కడ స్కూళ్లు కూడా 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ప్రతిరోజూ ఉచితంగా రవాణా కూడా ఉంటుంది. కేవలం ప్రాథమికస్థాయిలో మాత్రమే ఆరోగ్య సేవలు లభిస్తాయి. అత్యవసర సీరియస్‌ సమయంలో టౌన్‌కు వెళ్లాల్సిందే. ఇక్కడ ఉద్యోగాలు కూడా అంత ఈజీగా దొరకవు.

ఇక్కడ మీరు విలేజ్‌ బార్‌ నడిపించినా అవి పెద్దగా లాభాలు ఇవ్వవు. సామాజిక బంధాలను సజీవంగా ఉంచడానికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తారు. మున్సిపల్ వర్క్‌, ఇటుకలు పేర్చే పని కూడా చేయాల్సి ఉంటుంది. దీనికి శారీరక శ్రమ ఎక్కువ. ఆ గ్రామంలో ప్రస్తుతం చాలా ఇల్లు రెనోవెట్‌ చేస్తున్నారు. కాబట్టి ఈ పని ఎంతో ముఖ్యం. మీరు గుర్తుంచుకోవాల్సిన మరీ ముఖ్యమైన అంశం ఏంటంటే వీళ్లు మీకు ఉచితంగా వీసా ఏమీ ఇవ్వరు. మీరు దరఖాస్తు చేసుకోవాలంటే ఇప్పటికే స్పెయిన్‌ వీసా ఉంటేనే అక్కడ ఉండగలరు.. పనిచేయగలరు.

అరెనిల్లాస్‌ ఎందుకు ఈ ఆఫర్ చేస్తోంది?
అరెనిల్లాస్‌ గ్రామం ఈ ఆఫర్ వెనుక పెద్ద కథ ఉంది. 1950 నుంచి ఇక్కడి ప్రజలు స్పెయిన్‌లోని వివిధ సిటీలోకి వలస వెళ్లిపోతున్నారు. గ్రామంలో కేవలం వయస్సు మళ్లిన వృద్ధులు మాత్రమే ఉంటున్నారు. మరికొన్ని ఇళ్లు అయితే, ఖాళీగానే మిగిలిపోయాయి. ఒక్కో సీజన్‌లో అయితే, ఈ అరెనల్లాస్‌ గ్రామంలో 300 మంది జనాభా ఏవైనా పండుగలు ఉన్నప్పుడు కనిపిస్తారు. కానీ, ఏడాదిలో ఎక్కువ రోజులు ఈ ఊరంతా ఖాళీగానే కనిపిస్తుంది. కొత్తగా ఎవరైనా ఇక్కడ ఉందామని వచ్చిన ఈ సమస్యలు చూపి వెళ్లిపోతున్నారు.

మీరు దరఖాస్తు చేసుకుంటారా?
మీకు కూడా సైలెంట్‌, ప్రకృతికి దగ్గరగా, కాంక్రీట్‌ జంగిల్‌కు దూరంగా  ఉండాలంటే ఇవేం పెద్ద సమస్యలు కావు. కొంతమంది గ్రామంలో ఉండటం అంటే ఇష్టం వారికి బెస్ట్ ఛాన్స్‌. ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ కేఫ్‌స్‌ అందుబాటులో ఉండవు. సాధారణ యూరోపియన్‌ లైఫ్‌స్టైల్‌ ఇక్కడ కష్టం. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

0
0
Report
Advertisement
Advertisement
Back to top