icon-pinewzicon-zee
PINEWZ
become creator
Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back

हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|

Govt Employees: ప్రభుత్వ ఉద్యోగుల ఆందోళనలతో దద్దరిల్లిన సెక్రటేరియట్, కలెక్టరేట్

Hyderabad, Telangana:

52 Percent Fitment PRC: '52 శాతం ఫిట్‌మెంట్‌తో పీఆర్సీని అమలు చేయాలి. హెల్త్ స్కీం అమలు చేయాలి. పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలి, సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్‌ అమలు చేయాలి. పెండింగ్ డీఏలను వెంటనే విడుదల చేయాలి' అంటూ తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్ చేశారు. తమ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కావాలని కోరారు. పెండింగ్ బిల్లులు, డీఏలను తక్షణమే విడుదల చేయాలని ప్రభుత్వానికి ఆల్టిమేటం జారీ చేశారు.

Also Read: Hyderabad Traffic: హైదరాబాద్ ప్రజలకు బిగ్‌ రిలీఫ్‌.. పాతబస్తీలో కొత్త ఫ్లైఓవర్‌ ప్రారంభం

ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు ప్రభుత్వ పరిపాలనా కేంద్రం సచివాలయంతోపాటు హైదరాబాద్‌ కలెక్టర్‌ కార్యాలయంలో ఉద్యోగులు భారీ ధర్నా, నిరసన ప్రదర్శనలు చేపట్టారు. తెలంగాణ సెక్రటేరియట్‌లో ప్రభుత్వ ఉద్యోగుల మహా ధర్నా చేపట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ పిలుపు మేరకు సచివాలయం ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో సెక్రటేరియట్‌లో నల్ల రిబ్బన్లతో నిరసనకు దిగారు. మధ్యాహ్న భోజన విరామ సమయంలో మహా నిరసన ప్రదర్శన చేశారు.

Also Read: Akshaya Tritiya Offers: అక్షయ తృతీయకు దుబాయ్‌ సంస్థలు బంపర్‌ ఆఫర్లు.. 40 నుంచి 70 శాతం డిస్కౌంట్

హైదరాబాద్‌ కలెక్టరేట్‌లో..
ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ఆందోళన బాట పట్టింది. హైదరాబాద్ కలెక్టరేట్ కార్యాలయంతో పాటు అబిడ్స్‌లోని భీమా భవన్ ముందు జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి, మధ్యాహ్న భోజన విరమణ సమయంలో నిరసన ప్రదర్శనకు దిగారు. 52 శాతం ఫిట్‌మెంట్‌తో పీఆర్సీ వెంటనే ప్రకటించాలని జేఏసీ చైర్మన్ మారం జగదీష్ డిమాండ్ చేశారు. 'ఉద్యోగుల హెల్త్ స్కీమ్ ను తక్షణమే అమలు చేస్తూ , హెల్త్ కార్డులను విడుదల చేయాలి. పెండింగ్ బిల్లులు, డీఏలను తక్షణమే విడుదల చేయాలి. సెంట్రల్ పెన్షన్ స్కీమ్‌ను రద్దు చేసి పాతన పింఛన్‌ పథకం పునరుద్ధరించాలి. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ లపై జేఏసీ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తుంది. తెలంగాణ ఉద్యమ స్పూర్తితో , హక్కులను సాధించుకుంటాం' అని జేఏసీ చైర్మన్‌ ప్రభుత్వానికి ఆల్టిమేటం జారీ చేశారు.

Also Read: MI vs PBKS: చేతులెత్తేసిన ముంబై ఇండియన్స్‌.. పంజాబ్‌ కింగ్స్‌ మరో అద్భుత విజయం

ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారం తమ పోరాటాలు కొనసాగుతాయని తెలంగాణ ఉద్యోగ , ఉపాధ్యాయ, పెన్షనర్ల జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి స్పష్టం చేశారు. ఉద్యోగులకు సంబంధించి దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలు, న్యాయబద్ధమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. నాంపల్లిలోని హైదరాబాద్ ఆర్డీవోకు వినతి పత్రం అందజేశారు. అనంతరం లచ్చిరెడ్డి మాట్లాడుతూ.. పెన్షనర్స్‌కు నగదు రహిత చికిత్స, సీపీఎస్ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి ఓల్డ్ పెన్షన్‌ను అమలు చేయాలని, పెండింగ్ బిల్లులు డీఏల విడుదల తదితర సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కోసం ప్రత్యేక కార్పొరేషన్, 61 ఏళ్లు నిండిన వీఆర్ఏ వారసులకు ఉద్యోగులు కల్పించాలని కోరారు. జూన్ 2వ తేదీ వరకు పీఆర్సీ అమలు చేయాలని జేఏసీ డిమాండ్ చేశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report

Thorium Reserves In India: బంగారం కంటే విలువైన లోహం..భారత్‌లోనే కోట్ల విలువ చేసే భారీ నిల్వలు.."మనల్ని ఎవడ్రా ఆపేది"?!

Vijayawada, Andhra Pradesh:

Largest Thorium Reserves In The World: ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం యుద్ధ సంక్షోభం నెలకొన్న వేళ.. అనేక దేశాల తమ ఆయుధ సామాగ్రిని సిద్ధం చేసుకుంటున్నాయి. ముఖ్యంగా అణుబాంబుల తయారీపై దృష్టి సారిస్తున్నారు. ఈ బాంబుల తయారీలో థోరియం కీలక పాత్ర పోషిస్తుంది. అది కూడా బంగారం, ఇనుము వంటి లోహాల మాదిరిగా భూమిలోనే లభిస్తోంది. అయితే ఆ థోరియం నిల్వలు అమెరికా, చైనాలతో పోలిస్తే భారత్‌లోనే ఎక్కువగా ఉన్నాయనే విషయం చాలా మందికి తెలియదు. 

ఇది భారత ప్రజలకు ఎంతో గర్వకారణంగా ఈ గనులు నిలుస్తున్నాయి. ఈ క్రమంలో అణుశక్తి రంగంలో భారత్‌లో ఒక పెద్ద ముందడుగు వేసింది. తాజాగా స్వదేశీ నమూనా ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్‌లో చైన్ రియాక్షన్ ప్రారంభంతో భారత్‌లోని థోరియం నిల్వలు ప్రారంభించేందుకు మార్గం సుగమమైంది. ఈ ఘనత పట్ల భారతదేశ అణు శాస్త్రవేత్తలు ఉప్పొంగిపోతున్నారు. 

ప్రపంచ అణు సంఘం నివేదిక ప్రకారం.. భారతదేశం వద్ద 8,46,000 టన్నుల థోరియం నిల్వలు ఉన్నాయి. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద నిల్వగా పరిగణిస్తున్నారు. ప్రపంచంలోని మొత్తం థోరియం నిల్వల్లో నాలుగో వంతు భారతదేశం వద్దే ఉండడం విశేషంగా భావిస్తున్నారు.

ఈ క్రమంలో థోరియం నిల్వల్లో ఉన్న ఆ తర్వాతి స్థానాల్లో 6,32,000 టన్నుల నిల్వలతో బ్రెజిల్ రెండవ స్థానంలో.. 595,000 టన్నుల నిల్వలతో ఆస్ట్రేలియా మూడవ స్థానంలో ఉన్నాయి. యునైటెడ్ స్టేట్స్ వద్ద కూడా దాదాపు ఆస్ట్రేలియాకు సమానమైన థోరియం ఉంది. రష్యా వద్ద 155,000 టన్నులు, చైనా వద్ద సుమారు 100,000 టన్నులు ఉన్నట్లు తెలుస్తోంది.

భారతదేశంలో ప్రస్తుతం ఏడు అణు విద్యుత్ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో చాలా వరకు యురేనియం ఆధారిత రియాక్టర్ల ద్వారా శక్తిని పొందుతాయి. వీటిలో అతిపెద్దది తమిళనాడులోని కుడంకుళం, దీని స్థాపిత సామర్థ్యం 2,000 మెగావాట్లుగా ఉంది. పాత కేంద్రాలలో గుజరాత్‌లోని కాక్రాపర్, రాజస్థాన్‌లోని రావత్‌భట, మహారాష్ట్రలోని తారాపూర్, కర్ణాటకలోని కైగా వంటి అణు విద్యుత్ కేంద్రాలు ఉన్నాయి. ఈ కేంద్రాలన్నింటికీ కలిపి మొత్తం అణు విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం సుమారుగా 8.8 గిగావాట్లు అని నివేదికలు వెల్లడిస్తున్నాయి.

ప్రపంచ మొత్తం నిల్వలతో పోలిస్తే భారతదేశంలో కేవలం 1 నుండి 2 శాతం యురేనియం నిల్వలు మాత్రమే ఉన్నాయి. అందువల్ల, భారతదేశానికి యురేనియం కంటే థోరియం ఎల్లప్పుడూ మరింత ప్రభావవంతంగా ఉంటుంది.

ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్లు (PHWRలు) యురేనియంను ఇంధనంగా వాడతాయి. ఇది విద్యుత్తును, ప్లూటోనియంను ఉత్పత్తి చేస్తుంది. ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్లు రెండవ దశలో ప్లూటోనియంను ఇంధనంగా వాడతాయి, ఇది విద్యుత్తుతో పాటు యురేనియం-233ను కూడా ఉత్పత్తి చేస్తుంది. మూడవ దశలో థోరియం-యురేనియం-233 ఇంధనాన్ని ఉపయోగిస్తారు. ఇది విద్యుత్తుతో పాటు యురేనియం-233ను ఉత్పత్తి చేస్తుంది. భారతదేశంలో టన్నుల కొద్దీ థోరియం నిల్వలు ఉన్నందున, ఇది వందల సంవత్సరాల పాటు దేశం మొత్తానికి విద్యుత్తును అందించగలదు.

(గమనిక: పైన పేర్కొన్న సమాచారం కేవలం కొన్ని నివేదికల ఆధారంగా సమాచారం కోసం పొందుపరిచినది. దీన్ని పాటించే ముందు సంబంధిత వెబ్‌సైట్‌ను సంప్రదించడం మేలు. దీన్ని జీ తెలుగు న్యూస్ ధ్రువీకరించడం లేదు.)

Also Read: Maharashtra Exploitation: 350 అశ్లీల వీడియోలు..180 మంది మైనర్ బాలికలతో శృంగారం..కేటుగాడు అరెస్టు!

Also Read: GT Vs KKR Match Preview: కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు 'డూ ఆర్ డై' మ్యాచ్..గుజరాత్‌తో మ్యాచ్‌లో ఓడితే అస్సాం ట్రైన్ ఎక్కాల్సిందే!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Hyderabad: మాల్టా ఉద్యోగాల పేరిట రూ.5 కోట్ల భారీ స్కామ్.. నిరుద్యోగులే లక్ష్యంగా నకిలీ ముఠా!

Hyderabad, Telangana:

Backdoor Entry Scam Latest News: విదేశీ ఉద్యోగాల పేరుతో అమాయక నిరుద్యోగులను నమ్మించి.. వారి నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసిన ఒక భారీ నెట్వర్క్ గుట్టును పోలీస్ అధికారులు రట్టు చేశారు.. మాల్టా దేశంలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ.. బ్యాక్ డోర్ ఎంట్రీ ద్వారా గ్యారెంటీ జాబ్స్ ఆశ చూపి.. సుమారు 100 మంది యువకుల నుంచి 5 కోట్ల రూపాయల వరకు దోచుకున్న వైనం ఇటీవలే వెలుగులోకి వచ్చింది.. ఇంత పెద్ద స్కాం వెనుక ఎవరున్నారు? యువత వారి ట్రాప్ లో చిక్కుకోవడానికి కారణాలు ఏంటో పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.

సికింద్రాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఒక ముఠా.. విదేశాలకు వెళ్లాలని ఆశతో ఉన్న యువతను లక్ష్యంగా చేసుకుంది. నమ్మకం కలిగించేందుకు నిందితులు నకిలీ ఆఫర్ లెటర్లతో పాటు వీసా పత్రాలను సృష్టించారు.. ఒక్కొక్కరి నుంచి దాదాపు నాలుగు లక్షల నుంచి ఆరు లక్షల వరకు వసూలు చేసినట్లు దర్యాప్తులో తేలింది. డబ్బులు తీసుకున్న తర్వాత కొన్నాళ్లు కాలయాపన చేసి.. చివరకు నకిలీ పత్రాలు చేతిలో పెట్టడంతో బాధితులు తాము మోసపోయామని గ్రహించారు.

ఈ మోసంపై కరీంనగర్, ఖానాపూర్‌తో పాటు హైదరాబాద్లోని పలు పోలీస్ స్టేషన్లలో బాధితులు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. బాధితుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో మోసం విలువ కోట్లలో ఉన్నట్లు సమాచారం. దీంతో రాష్ట్ర పోలీసులు ఈ కేసులు అన్నిటిని కలిపి ఒక తీవ్రమైన కేసుగా పరిగణించి దీనిని తదుపరి విచారణ నిమిత్తం సిఐడి కి వదిలి చేశారు. దీనివల్ల బాధితులు అందరికీ త్వరగా న్యాయం చేకూరే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. 

సిఐడి అధికారులు మెరుపు దాడులు నిర్వహించి ఈ ముఠాకు చెందిన దాదాపు ఏడుగురు ప్రధాన నిందితులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి కీలక పత్రాలతో పాటు పలు ల్యాప్టాప్ లు, మొబైల్ ఫోన్స్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు. నిందితులకు చెందిన వివిధ బ్యాంకు ఖాతాలను అధికారులు వెంటనే ఫ్రీజ్ కూడా చేశారు. ఈ దోపిడీలో ఇంకా ఎవరి ప్రమేయం ఉందని కోణంలో విచారణ కూడా కొనసాగిస్తూ వస్తున్నారు. తక్కువ సమయంలో బ్యాక్ డోర్ మార్గాల్లో విదేశాల్లో ఉద్యోగాలు వస్తాయని నమ్మవద్దు.. ఏదైనా ఏజెన్సీ ఆశ్రయించే ముందు దానిని తప్పకుండా రెండు మూడు సార్లు ఫ్యాక్ట్ చెక్ చేసుకొని వెళ్లడం మంచిది.

Read more: Cheap Luxury Cars: కేవలం రూ. 15 లక్షలకే BMW.. ఆడి కారు రూ. 7.50 లక్షలే.. ఎక్కడో తెలుసా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report
Advertisement

Tirupati Trains: కోరుట్ల, జగిత్యాల, కరీంనగర్ భక్తుల కోసం తిరుపతి రైళ్లు రెడీ!

Karimnagar, Telangana:

Karimnagar To Tirupati Trains Telugu News: ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుమలకి వెళ్లే భక్తులకు, ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే భారీ ఊరటనిచ్చింది.. కరీంనగర్ మీదుగా తిరుమలకు వెళ్లే రైళ్ల సంఖ్య పెంచుతూ.. కీలకమైన రైళ్లను క్రమబద్ధీకరిస్తూ రైల్వే శాఖ ఒక అద్భుతమైన కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఇకపై వారానికి వరుసగా నాలుగు రోజులపాటు కరీంనగర్ నుంచి తిరుపతికి రైలు సౌకర్యం అందుబాటులోకి రాబోతోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి భక్తుల రాక విపరీతంగా పెరగడంతో దక్షిణ మధ్య రైల్వే ఈ అద్భుతమైన నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, దీనికి సంబంధించిన అన్ని రకాల వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.

గతంలో తిరుపతికి వెళ్లాలంటే సికింద్రాబాద్ వెళ్లడం లేదా పరిమితంగా ఉన్న రైళ్లపై ఆధారపడాల్సి వచ్చేది.. కానీ తాజాగా దక్షిణ మధ్య రైల్వే తీసుకున్న నిర్ణయంతో ప్రయాణం మరింత సులభతరం కాబోతోంది. గురువారంతో పాటు ఆదివారాలు.. కరీంనగర్ నుంచి తిరుపతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ యధావిధిగా నడుస్తుంది. ఇక శుక్రవారం నాందేడ్ నుంచి ధర్మవరం వరకు వెళ్లే ఎక్స్ప్రెస్‌ను రైల్వే శాఖ రెగ్యులర్ చేసింది. ఇది కరీంనగర్ మీదిగా వెళ్తుంది.. శనివారం నాందేడ్ నుంచి తిరుచానూరు వెళ్లే ఎక్స్ప్రెస్ కూడా క్రమబద్దీకరించినట్లు తెలుస్తోంది. ఈ రైలు శనివారం అందుబాటులో ఉండబోతుంది. 

నాలుగు రైళ్లు అందుబాటులోకి రావడం వల్ల.. వారాంతంలో తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే ఉద్యోగులతో పాటు కుటుంబాలకు గొప్ప అవకాశం లభించబోతోంది. ఈ రైళ్లు ఉమ్మడి జిల్లాలోని ప్రధాన స్టేషన్లో మీదుగా వెళుతూ భక్తులకు సౌకర్యంగా మారబోతున్నాయి. ఈ రైళ్లు ప్రధానంగా కోరుట్లతో పాటు జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జమ్మికుంట రైల్వే స్టేషన్లో ఆగబోతున్నాయి.. దీంతో ఈ పట్టణాలకు ఆనుకొని ఉన్న పరిసరాల గ్రామాల నుంచి తిరుమల వెళ్లే వారికి చాలా సౌకర్యంగా ఉంటుంది..

రైళ్ల క్రమబద్ధీకరణ పట్ల స్థానిక ప్రయాణికులతో పాటు భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా నాందేడ్ నుంచి వచ్చే రైలు కరీంనగర్ మీదుగా వెళ్లడంతో పాటు వాటిని రెగ్యులర్ సర్వీసులుగా మార్చడం వల్ల రిజర్వేషన్లు సులభంగా దొరికే అవకాశం ఉందని చాలామంది అభిప్రాయపడుతున్నారు. దీనివల్ల బస్సుల్లో ప్రయాణించే వారికి అధిక చార్జీలు తప్పుతాయని.. తక్కువ ఖర్చుతోనే క్షేమంగా తిరుమల చేరుకోవచ్చని రైల్వే అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే ముందస్తు రిజర్వేషన్ సదుపాయం అందుబాటులోకి రావడం వల్ల.. కొన్ని రిజర్వేషన్లు కూడా జరిగినట్లు తెలుస్తోంది..

Read more: Cheap Luxury Cars: కేవలం రూ. 15 లక్షలకే BMW.. ఆడి కారు రూ. 7.50 లక్షలే.. ఎక్కడో తెలుసా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report

Hyderabad Traffic: హైదరాబాద్ ప్రజలకు బిగ్‌ రిలీఫ్‌.. పాతబస్తీలో కొత్త ఫ్లైఓవర్‌ ప్రారంభం

Hyderabad, Telangana:

Shastripuram Flyover: అంతర్జాతీయ నగరంగా గుర్తింపు పొందుతున్న హైదరాబాద్‌ నగరానికి పెద్ద ఎత్తున ఇతర ప్రాంతాల ప్రజలు జీవనోపాధి కోసం వస్తుండడంతో ఇక్కడ రోజురోజుకు ట్రాఫిక్‌ రద్దీ పెరుగుతోంది. రద్దీ పెరుగుతున్న రోడ్డు సదుపాయాలు మెరుగుకాకపోవడంతో ట్రాఫిక్‌ సమస్య ఏర్పడుతోంది. ఆ ట్రాఫిక్‌ సమస్యకు కొంత ఉపశమనం కలగనుంది. ముఖ్యంగా పాతబస్తీలో వాహనదారులకు చాలా రిలీఫ్‌ రానుంది. అక్కడ శాస్త్రీపురంలో కీలకమైన ఫ్లైఓవర్‌ అందుబాటులోకి వచ్చింది. కేసీఆర్‌ ప్రభుత్వం నిర్మించిన ఆ ఫ్లైఓవర్‌ తాజాగా ప్రారంభమైంది.

Also Read: Akshaya Tritiya Offers: అక్షయ తృతీయకు దుబాయ్‌ సంస్థలు బంపర్‌ ఆఫర్లు.. 40 నుంచి 70 శాతం డిస్కౌంట్

గత కేసీఆర్‌ ప్రభుత్వం హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున ఫ్లైఓవర్ల నిర్మాణం పూర్తి చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే దాదాపు 30కి పైగా ఫ్లైఓవర్లు, ఆర్‌ఓబీలు అందుబాటులోకి రాగా.. గత ప్రభుత్వంలో నిర్మించిన మరో ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చింది. పాతబస్తీలోని మైలార్‌దేవ్‌పల్లి నుంచి శాస్త్రీపురం మీదుగా వట్టేపల్లి వరకు రూ.71 కోట్లతో రోడ్డు ఓవర్‌ బ్రిడ్జి (ఆర్‌ఓబీ)ని శుక్రవారం ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాజేంద్రనగర్ ఫిరాయింపు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ తదితరులు పాల్గొన్నారు.

Also Read: Employees Jackpot: ఏపీ ప్రభుత్వం భారీ శుభవార్త.. ఆర్టీసీ ఉద్యోగులకు బంపర్ జాక్‌పాట్!

ఫ్లైఓవర్‌ విశేషాలు
వ్యయం రూ.71 కోట్లు
ఎక్కడ: మైలార్‌దేవ్‌పల్లి నుంచి శాస్త్రీపురం మీదుగా వట్టేపల్లి
పొడవు: 490 మీటర్లు, 4 లేన్లు

Also Read: Tejaswi Surya Apology: తెలంగాణపై విషం చిమ్మిన తేజస్వి సూర్య క్షమాపణ చెప్పాలి: కేటీఆర్‌

తీరనున్న కష్టాలు
పాతబస్తీలో ఈ బ్రిడ్జి అందుబాటులోకి రావడంతో వట్టేపల్లి దగ్గర ఉన్న రైల్వే ట్రాక్ సిగ్నల్స్ ఇబ్బందులు తప్పనున్నాయి. శాస్త్రీపురం ఫ్లైఓవర్‌ అందుబాటులోకి రావడంతో మైలార్‌దేవ్‌పల్లి, ఫలక్‌నుమా ఆర్టీసీ డిపో మార్గంలో వాహనదారుల ప్రయాణం సుగమం కానుంది. ఈ ఫ్లైఓవర్‌ అందుబాటులోకి రావడంతో కనీసం 30 నిమిషాల ప్రయాణ సమయం ఆదా కానుంది. వేగంగా వాహనాలు ప్రయాణించడమే కాకుండా రైల్వే బ్రిడ్జి రావడంతో ప్రమాదాలు కూడా తగ్గనున్నాయి. అభివృద్ధికి దూరంగా ఉన్న పాతబస్తీలో వరుసగా ఫ్లైఓవర్లు పడుతుండడంతో ఇక్కడి ప్రజలకు రోడ్డు రవాణా వ్యవస్థ మెరుగవుతోంది. ఫలక్‌నుమా ప్యాలెస్‌ సందర్శనకు వచ్చే పర్యాటకులకు ఈ ఫ్లైఓవర్‌ అందుబాటులోకి రావడంతో ఊరట లభించనుంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report
Advertisement

GT Vs KKR Match Preview: కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు 'డూ ఆర్ డై' మ్యాచ్..గుజరాత్‌తో మ్యాచ్‌లో ఓడితే అస్సాం ట్రైన్ ఎక్కాల్సిందే!

Hyderabad, Telangana:

GT Vs KKR Match Preview 2026: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026లో భాగంగా నేడు నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో కోల్‌కతా నైట్‌రైడర్స్ తలపడనుంది. ఇప్పటికే టేబుల్ చివరి స్థానంలో ఉన్న కేకేఆర్ జట్టు ఈ మ్యాచ్‌తో అయినా గెలుపు ఖాయం చేసుకోవాలని చూస్తోంది. లీగ్ ఇప్పటికే సగం చేరుకునే ముందు కేకేఆర్‌కు ఈ మ్యాచ్‌లో గెలుపు కీలకంగా మారింది. ఒకవేళ ఈ రోజు జరిగే మ్యాచ్‌లో ఓడితే.. కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు ప్లేఆఫ్స్ నుంచి దాదాపుగా తప్పుకున్నట్లే అని విశ్లేషకులు చెబుతున్నారు. 

ఐపీఎల్ లీగ్‌లో ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్‌ల్లో గుజరాత్ టైటాన్స్ జట్టు రెండింటిలో గెలిచి రెండింటిలో ఓడింది. అలాగే కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు ఆడిన 5 మ్యాచ్‌ల్లో ఒక్కటి కూడా విజయం (ఒక మ్యాచ్ డ్రా) సాధించకపోవడం గమనార్హం. అయితే ఈ మ్యాచ్‌లో గెలుపు కోల్‌కతాకు అత్యవసరం. అజింక్య రహానే కెప్టెన్సీలోని KKR ఈ సీజన్‌లో పేలవమైన ఫామ్‌తో సతమతమవుతోంది. ఐదు మ్యాచ్‌ల నుండి కేవలం ఒక పాయింట్ మాత్రమే సాధించిన ఈ జట్టు ఇంకా సరైన సమతుల్యతను సాధించలేదు. ముఖ్యంగా, ఫిన్ అలెన్, కామెరాన్ గ్రీన్ వంటి ఖరీదైన ఆటగాళ్లు ఆశించిన స్థాయిలో రాణించడం లేదు.

అదే విధంగా మిడిల్ ఆర్డర్ స్టార్ బ్యాటర్లు రింకూ సింగ్, రమన్‌దీప్ సింగ్‌ల బ్యాట్లు విఫలమవడం కూడా జట్టు యాజమాన్యానికి తలనొప్పిగా మారింది. సునీల్ నరైన్‌ను ఓపెనర్‌గా పంపిన ప్రయోగం బ్యాటింగ్ ఆర్డర్‌లో గందరగోళాన్ని సృష్టించగా, జట్టు పరాజయానికి రహానే కూడా మరో కారణంగా నిలిచాడని కేకేఆర్ ఫ్యాన్స్ అంటున్నారు.

బ్యాటింగ్‌లో ఇబ్బందులు ఉన్నప్పటికీ.. కేకేఆర్ బౌలింగ్ విభాగం మెరుగుపడుతోంది. సునీల్ నరైన్ తన పాత ఫామ్‌లోకి తిరిగి రాగా, యువ బౌలర్లు వైభవ్ అరోరా, కార్తిక్ త్యాగి తమ ప్రతిభను కనబరుస్తున్నారు. అయితే, జట్టు ప్రధాన స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి నేటి మ్యాచ్‌లో మ్యాజిక్ చేస్తాడని ఆశిస్తున్నారు. 

మరోవైపు గుజరాత్ టైటాన్స్ కూడా గత మ్యాచ్‌లతో విజయాలను అందుకొని..తిరిగి ఫామ్‌లోకి వచ్చింది. ఇప్పుడు వరుసలో మూడో గెలుపును ఖాతాలో వేసుకోవాలని గిల్ సేన సిద్ధమవుతోంది. శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని గుజరాత్ టైటాన్స్ అద్భుతమైన ఫామ్‌లో ఉంది. కెప్టెన్ గిల్, సాయి సుదర్శన్ బ్యాటింగ్‌లో నిలకడను కొనసాగిస్తుండగా.. స్టార్ బ్యాటర్ జోస్ బట్లర్ ఫామ్‌లోకి తిరిగి రావడం జట్టు ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. బౌలింగ్‌ లైనప్‌లో ప్రసిద్ధ్ కృష్ణ పేస్, రషీద్ ఖాన్ స్పిన్ ప్రత్యర్థులను కట్టడి చేసేందుకు సిద్ధంగా ఉన్నారు.

గుజరాత్ టైటాన్స్ తుదిజట్టు అంచనా..
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), సాయి సుదర్శన్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, గ్లెన్ ఫిలిప్స్, రాహుల్ తెవాటియా, షారూఖ్ ఖాన్, రషీద్ ఖాన్, కగిసో రబడ, అశోక్ శర్మ, ప్రసిద్ధ్ కృష్ణ. (ఇంపాక్ట్ ప్లేయర్: మహ్మద్ సిరాజ్)

కోల్‌కతా నైట్ రైడర్స్ తుదిజట్టు అంచనా..
అజింక్య రహానే (కెప్టెన్), ఫిన్ అలన్/టిమ్ సీఫెర్ట్, సునీల్ నరైన్, అంగ్క్రిష్ రఘువంశీ, కామెరాన్ గ్రీన్, రింకూ సింగ్, రమణదీప్ సింగ్, రోవ్‌మన్ పావెల్, అనుదు రాయ్, కార్తీక్ త్యాగి, వరుణ్ చక్రవర్తి. (ఇంపాక్ట్ ప్లేయర్: వైభవ్ అరోరా).

Also Read: Krunal Vs Mukul Choudhary: ముకుల్ చౌదరికి ఆర్సీబీ స్పిన్నర్ కృనాల్ పాండ్యా వార్నింగ్..దమ్ముంటే సిక్స్ కొట్టమని హెచ్చరిక!

Also Read: Dhoni Re-Entry Match: ధోనీ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్..సన్‌రైజర్స్‌తో మ్యాచ్‌కు 'తలా' దూరం! రీఎంట్రీ మ్యాచ్ ఫిక్స్!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
0
Report

Akshaya Tritiya Offers: అక్షయ తృతీయకు దుబాయ్‌ సంస్థలు బంపర్‌ ఆఫర్లు.. 40 నుంచి 70 శాతం డిస్కౌంట్

Dubai, Dubai:

Gold And Diamond Offers: అక్షయ తృతీయ రానే వచ్చేస్తోంది. ఎల్లుండి అంటే ఏప్రిల్‌ 19వ తేదీన హిందూవులు అక్షయ తృతీయ చేసుకోబోతున్నారు. ఈ పర్వదినం పురస్కరించుకుని ప్రజలు పెద్ద ఎత్తున బంగారం కొనేందుకు చూస్తుంటారు. మరి ఈ అక్షయ తృతీయ బంగారం దుకాణాలు ఎలాంటి ఆఫర్లు అందిస్తున్నాయో తెలుసుకుందాం. బంగారానికి ప్రసిద్ధి పొందిన దుబాయ్‌లో అక్షయ తృతీయకు పెద్ద ఎత్తున ఆఫర్లు నడుస్తున్నాయి. మరి అక్కడి సంస్థలు ఎలాంటి ఆఫర్లు అందిస్తున్నాయో చూద్దాం.

Also Read: Employees Jackpot: ఏపీ ప్రభుత్వం భారీ శుభవార్త.. ఆర్టీసీ ఉద్యోగులకు బంపర్ జాక్‌పాట్!

ప్రపంచ పసిడి రాజధానిగా దుబాయ్‌ గుర్తింపు పొందింది. అక్షయ తృతీయ సందర్భంగా అక్కడి బంగారు దుకాణాల్లో సందడి మొదలైంది. ఏప్రిల్ 19వ తేదీన అక్షయ తృతీయ రోజు బంగారం దుకాణాలు కొనుగోలుదారులతో కిటకిటలాడనున్నాయి. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని దుబాయ్‌లోని ప్రముఖ జ్యువెలరీ సంస్థలు భారీ ఆఫర్లను ప్రకటించాయి. భారతీయులకు ముఖ్యమైన రోజు కావడంతో వారిని ఆకర్షించేందుకు అక్కడి జ్యువెలరీ సంస్థలు ఆఫర్లు ఇస్తున్నాయి. జీరో మేకింగ్ ఛార్జీలు, భారీ డిస్కౌంట్లు, గిఫ్ట్ వోచర్లతోపాటు తదితర ఆఫర్లు, డిస్కౌంట్లు, లక్కీడ్రాలు వంటివి ఆయా సంస్థలు అందిస్తుండడంతో అక్కడి బంగారం మార్కెట్ కళకళలాడుతోంది.

Also Read: Tejaswi Surya Apology: తెలంగాణపై విషం చిమ్మిన తేజస్వి సూర్య క్షమాపణ చెప్పాలి: కేటీఆర్‌

దుబాయ్‌లో మలబార్ గోల్డ్, డైమండ్స్ సంస్థతోపాటు మీనా జ్యువెలర్స్, సిరోయా జ్యువెలర్స్, అరక్కల్ గోల్డ్ అండ్ డైమండ్స్ సంస్థలు గుర్తింపు పొందాయి. ఆ సంస్థలు ప్రత్యేకంగా అక్షయ తృతీయ కలెక్షన్లను అందుబాటులో ఉంచాయి. మలబార్ గోల్డ్ వజ్రాల ఆభరణాలపై 40 శాతం వరకు తగ్గింపు ఇస్తోంది. పాత బంగారం మార్పిడిపై జీరో-లాస్ పథకం అందిస్తోంది. మీనా జ్యువెలర్స్ సంస్థ వజ్రాలు, పోల్కీ ఆభరణాల కొనుగోలుపై ఉచిత బంగారు నాణేలు, భారీ కొనుగోళ్లపై గోల్డ్ బార్లను బహుమతిగా ఇస్తున్నట్లు ప్రకటించింది.

అక్కడి సిరోయా జ్యువెలర్స్ వజ్రాభరణాలపై 70 శాతం వరకు డిస్కౌంట్ ప్రకటించింది. అరక్కల్ గోల్డ్ అండ్ డైమండ్స్ మేకింగ్ ఛార్జీలపై 80 శాతం వరకు తగ్గింపు అందిస్తోంది. మే 5వ తేదీ వరకు ఈ ఆఫర్లు అమల్లో ఉండనున్నాయి. ఈ ఆఫర్లు కొనుగోలుదారులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. బంగారం ధరలు అధికంగా ఉన్న నేపథ్యంలో కొనుగోలుదారులను ఆకర్షించేందుకు అక్షయ తృతీయ ఆఫర్లను ప్రకటించాయి. బంగారం కొనుగోలు ఒక సంప్రదాయంగా భావిస్తుండగా.. దీర్ఘకాలిక పెట్టుబడిని దృష్టిలో ఉంచుకుని ఇప్పుడు కస్టమర్లు కొనుగోళ్లు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. అక్షయ తృతీయ విక్రయాలపై మార్కెట్ వర్గాలు భారీ ఆశలు పెట్టుకున్నాయి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report

Parrot Video: స్మార్ట్‌ఫోన్ వాడుతున్న చిలకమ్మ.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో!

Hyderabad, Telangana:

Parrot Scrolling Phone Video Viral: సాంకేతికత కేవలం మనుషులకే పరిమితం అనుకుంటే పొరపాటే.. ప్రస్తుత కాలంలో పక్షులతో పాటు జంతువులు కూడా టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ ముందుకు సాగుతున్నాయి. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో చూస్తే మీరు కూడా ఆశ్చర్య పోవాల్సిందే. ఒక చిన్న చిలక మనిషి కంటే వేగంగా స్మార్ట్‌ఫోన్‌ను ఆపరేట్ చేస్తూ అందరిని ఆశ్చర్యపరిచేలా చేస్తోంది. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ ఇంటర్నెట్‌ను మాత్రం షేక్ చేస్తుంది. దీనికి సంబంధించిన అన్ని రకాల వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.

సాధారణంగా చిలుకలు మనం నేర్పిన మాటలను ఎంతో సులభంగా పలుకుతూ ఉండడం అప్పుడప్పుడు సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాం. కానీ ఈ చిలుక మాత్రం అందుకు భిన్నంగా ఉంది.. ఫీల్ అవుతున్న వీడియోలో.. ఈ చిన్ని రామచిలుక తన యజమాని స్మార్ట్‌ఫోన్‌ను ఎంతో చక్కగా వాడుతోంది. ఆ చిన్ని చిలక తన ముక్కుతో స్క్రీన్‌పై టచ్ చేస్తూ.. రకరకాల యాప్‌లను ఓపెన్ చేస్తోంది. కేవలం ఓపెన్ చేయడమే కాకుండా.. మనకు నచ్చిన పోస్టులను ఎలా స్క్రోల్ చేస్తామో..  అదేవిధంగా ఎంతో ఓపికగా.. ఆ చిలుక కూడా తన ముక్కుతో స్క్రోల్ చేయడం మీరు ఈ వీడియోలో చూడొచ్చు.

 
 
 
 
 

ఈ వీడియో చూసిన సోషల్ మీడియా వినియోగదారులు రకరకాలుగా స్పందిస్తూ వస్తున్నారు. అంతేకాకుండా తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో వ్యక్తం చేస్తున్నారు. మా ఇంట్లో పిల్లల కంటే ఈ చిలుక బాగా ఫోన్ వాడుతోందని.. ఒకరు కామెంట్ చేయగా.. మరొకరు రాబోయే రోజుల్లో చిలుకలు కూడా సొంతగా రీల్స్ చేసుకుంటాయేమోనని.. కామెంట్ చేస్తున్నారు. నిజానికి పక్షులలో చిలుకలకు గ్రాహక శక్తి ఎక్కువగా ఉంటుంది. అవి చూసిన విషయాలను త్వరగా నేర్చుకోగలుగుతాయి. 

ఈ వీడియోలో చిలుక తన యజమాని ఫోన్ వాడుతుండగా చూసి.. ఆ అలవాటును నేర్చుకొని ఉంటుందని నిపుణులు భావిస్తూ ఉన్నారు. ఏది ఏమైనా.. ఎంతో ఏకాగ్రతతో ఆ చిలుక ఫోన్ చూస్తున్న తీరు చూస్తుంటే అదేదో ముఖ్యమైన సమాచారం కోసం వెతుకుతున్నట్లే కనిపిస్తోందని భావించవచ్చు. ప్రస్తుతం ఈ వీడియో ఇన్స్టాగ్రామ్‌తో పాటు యూట్యూబ్‌లో కూడా ట్రెండ్ అవుతూ వస్తోంది. ఇప్పటివరకు ఈ వీడియోను లక్షలాదిమంది వీక్షించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా చాలామంది లైక్ కూడా చేశారు.

Also Read: Child Acid Drink: తోటి కోడళ్ల పంచాయితీ.. బాలుడితో యాసిడ్‌ తాగించిన తోటి కోడలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

 

0
0
Report
Advertisement

Rare Chaturgrahi Rajayoga: 48 గంటల పాటు రాజభోగం.. చతుర్గ్రహీ యోగంతో ఈ రాశుల జాతకం మారిపోనుంది!

Hyderabad, Telangana:

Chaturgrahi Rajayoga Effect On Zodiac 2026: జ్యోతిష్య శాస్త్రంలో యోగాలు అత్యంత ప్రత్యేకతను కలిగి ఉంటాయి. ఏవైనా రెండు గ్రహాలు సంయోగం జరిపినప్పుడు ఇవి ఏర్పడుతూ ఉంటాయి. ఇవి కూడా మానవ జీవితాలను ఎంతో ప్రభావితం చేస్తూ ఉంటాయి. ముఖ్యంగా కొన్ని గ్రహాల కలయిక కారణంగా ఏర్పడే శక్తివంతమైన యోగా జీవితాల్లో ఊహించని అదృష్టాన్ని తెచ్చి పెడుతూ ఉంటాయి. ఇదిలా ఉంటే ఏప్రిల్ 16న అత్యంత శక్తివంతమైన చతుర్గ్రహీ రాజయోగం ఏర్పడింది. దీని ప్రభావం దాదాపు 48 గంటల పాటు కొనసాగుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. అయితే, ఈ అరుదైన రాజయోగం వల్ల కొన్ని రాశుల వారికి విపరీతమైన ధన లాభాలు కలగడమే కాకుండా.. వృత్తిపరమైన ఎదుగుదల కూడా కనిపిస్తుంది.

ఈ రాశులవారికి లాభాలే లాభాలు:
మేషరాశి 
ముఖ్యంగా ఈ సమయంలో మేష రాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ శక్తివంతమైన రాజయోగ ప్రభావంతో ఆర్థిక కష్టాల నుంచి విముక్తి కలుగబోతోంది. ముఖ్యంగా ఆదాయ మార్గాలు విపరీతంగా పెరుగుతాయి. చాలా కాలంగా నిలిచిపోయిన మొండి బాకీలు వసూలు కాబోతున్నా యి. అలాగే వ్యాపారస్తులకు నూతన క్లైంట్లకు ప్రాజెక్టులు తగ్గే అవకాశాలున్నాయి. దీని కారణంగా విశేషమైన ప్రయోజనాలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మిథున రాశి 
మిధున రాశి వారికి ఈ సమయంలో ఆస్తిపాస్తులు విపరీతంగా పెరుగుతాయి. ముఖ్యంగా ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ లభించడమే కాకుండా అదనపు బాధ్యతలు కూడా జ్యోతిష్యులు చెబుతున్నారు. సామాజికంగా మంచి పలుకుబడి కూడా లభిస్తుంది. అంతేకాకుండా పరిచయాన్ని మీ భవిష్యత్తుకు బంగారు బాటను వెయ్యబోతున్నాయి. ఇందులో నెలకొన్న మనస్పార్ధాలు తొలగిపోయి.. ప్రశాంతత లభించబోతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. అలాగే ఆర్థికంగా అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి.

సింహరాశి 
సింహ రాశి వారికి ఆర్థిక పరిస్థితులు ఊహించని స్థాయిలో మెరుగుపడతాయి. కార్యాలయ పనుల నిమిత్తం తప్పకుండా విదేశాలకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా గతంలో కుదుర్చుకున్న ఒప్పందాలు కూడా ఈ సమయంలో అద్భుతమైన ఫలితాలను అందించబోతున్నాయి. ముఖ్యంగా పూర్వికులు ఆస్తుల నుంచి విశేషమైన లాభాలు కలుగుతాయి. పాత అప్పులు తీరిపోయి మానసిక ప్రశాంతత లభిస్తుంది.

ధనస్సు రాశి 
ధనస్సు రాశిలో జన్మించిన వ్యక్తులకు కూడా ఈ సమయం చాలా అత్యుత్తమంగా ఉండబోతోంది. ముఖ్యంగా వీరికి సమాజంలో గౌరవ మర్యాదలు విపరీతంగా పెరుగుతాయి. కోర్టు కేసులతో పాయపరమైన చిక్కుల నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగంలో మీ పని తీరు కూడా ఊహించని స్థాయిలో ఎరుగుబడుతుంది. పాత రుణాలనుంచి విముక్తి లభించడమే కాకుండా ఆర్థికంగా నిలదొక్కుకునే అవకాశాలు ఉన్నాయి.

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
0
Report

TVK Vijay Video: పార్టీ మ్యానిఫెస్టో కార్యక్రమంలో శక్తి ఆయుధం ఇవ్వబోయిన రైతు.. టీవీకే విజయ్‌కు తప్పిన ప్రమాదం! విజువల్స్‌.. 

Hyderabad, Telangana:

TVK Vijay Viral Video: 2026 అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీవీకే నాయకుడు తన మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ కార్యక్రమం చెన్నైలోని నంగంబాక్కంలోని ఒక స్టార్ హోటల్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో, ఆయన మొదటగా ఒక రైతుకు ఎన్నికల మేనిఫెస్టో కాపీని అందజేశారు. ఈ సమయంలో టీవీకే విజయ్ తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. పార్టీ మేనిఫెస్టో ఆవిష్కరణ కార్యక్రమంలో, ఒక రైతు వేదికపైకి వచ్చి, ఆయనకు పైరుతో పాటు ఒక శక్తివంతమైన ఆయుధాన్ని ఇవ్వడానికి ప్రయత్నించాడు. అది అకస్మాత్తుగా పైకి లేచి విజయ్ కంటికి తగిలినంత పనైంది. అదృష్టవశాత్తు, విజయ్ వెంటనే ప్రమాదం నుంచి పక్కకు తప్పుకున్నారు. ఈ దృశ్యాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అనంతరం, విజయ్ ఆ రైతుపై శాలువా కప్పి ఆయనను సత్కరించారు. 

తమిళనాడులోని తూత్తుకుడిలో జరిగిన  ర్యాలీ సందర్భంగా టీవీకే నాయకుడు విజయ్ అభిమానులకు కాస్త గాయలైన విషయం తెలిసిందే. విజయ్ కాన్వాయ్‌ను అనుసరిస్తున్న ఒక అభిమాని బైక్ అదుపుతప్పి పడిపోవడంతో, వెనుక వస్తున్న ఇతర వాహనాలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. అంతేకాకుండా, అంతకుముందు జరిగిన కరూర్‌ సభలో తొక్కిసలాట జరిగి పలువురు మరణించారు

టీవీకే విజయ్‌ మేనిఫెస్టోలో ఏముందంటే?
తమిళనాడులో టీవీకే విడుదల చేసిన మేనిఫెస్టోలో ఐదు ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్న రైతుల పంట రుణాలన్నింటినీ పూర్తిగా మాఫీ చేస్తున్నట్లు ప్రకటించారు. పోలీసు అధికారుల మూల వేతనాన్ని రూ.25,000 పెంచనున్నారు. వార్షిక చేపల వేట నిషేధం సమయంలో సహాయం పొందే మత్స్యకారుల సాయాన్ని రూ.8,000 నుండి రూ.20,000కు పెంచుతారు. వారికి బ్యాంకు రుణాలు కూడా అందిస్తారు. అదనంగా, వివాహాలకు 8 గ్రాముల బంగారం.

 

 

Also Read:​ మీ 10 ఏళ్ల పాత ఆధార్‌ను జూన్ 14 లోపు ఉచితంగా అప్‌డేట్ చేసుకోండి.. స్టెప్‌ బై స్టెప్‌ ప్రాసెస్‌!

Also Read:​ లోక సభ ముందుకు మహిళా రిజర్వేషన్- డీ లిమిటేషన్ బిల్లు.. వ్యతిరేకించిన విపక్షాలు..

 60 ఏళ్లలోపు మహిళలకు రూ.2,500 ప్రతినెలా జమ చేస్తామని మేనిఫెస్టో హామీ ఇచ్చింది. అంతేకాకుండా, విజయ మేనిఫెస్టో ప్రకారం ప్రతి కుటుంబానికి ఏటా ఆరు ఉచిత గ్యాస్ సిలిండర్లు, ప్రతి పేద కుటుంబానికి సురక్షితమైన తాగునీరు అందుబాటులో ఉంటాయి. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పిల్లల కుటుంబాలకు ఏటా రూ.15,000 డిపాజిట్ లభిస్తుంది. ఉన్నత విద్య కోసం రూ.20 లక్షల వరకు రుణాలు . రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 100 రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటు చేస్తారు. తీర ప్రాంతాల్లో శాశ్వత గృహాలను నిర్మించడానికి ఒక ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేస్తారు. డీజిల్ మోటారు పడవలకు నెలవారీ కోటాను 1,800 లీటర్ల నుండి 3,500 లీటర్లకు పెంచుతారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

0
0
Report

Chandrababu Family: జనగణనలో కుటుంబ వివరాలు నింపిన సీఎం చంద్రబాబు

Undavalli, Andhra Pradesh:

Self Enumeration Census: జనాభా లెక్కల కార్యక్రమం ఆంధ్రప్రదేశ్‌లో ప్రారంభమైంది. స్వీయ జనగణనలో టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొని తమ కుటుంబ వివరాలను పొందుపర్చారు. అనంతరం నగణన ప్రక్రియలో భాగస్వాములు కావాలని ప్రజలకు సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. కుటుంబాన్ని యూనిట్‌గా తీసుకుని అభివృద్ధి ప్రణాళికలు, సంక్షేమ పథకాలు రూపొందించటం అవసరమని.. ఈ లక్ష్య సాధనలో జనగణన కార్యక్రమం అత్యంత కీలకమని స్పష్టం చేశారు.

Also Read: MI vs PBKS: చేతులెత్తేసిన ముంబై ఇండియన్స్‌.. పంజాబ్‌ కింగ్స్‌ మరో అద్భుత విజయం

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో గురువారం నుంచి స్వీయ జనగణన కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు తన వివరాలను ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా నమోదు చేసుకున్నారు. హౌస్ లిస్టింగ్- హౌస్ సెన్సెస్ కార్యక్రమంలో భాగంగా ఆన్‌లైన్ ద్వారా  వివరాల నమోదు ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది. se.census.gov.in వెబ్‌సైట్ ద్వారా ముఖ్యమంత్రి తమ కుటుంబసభ్యుల వివరాలను నమోదు చేశారు. మొత్తం 33 ప్రశ్నలతో కూడిన ఈ సెల్ఫ్ ఎన్యుమరేషన్ ప్రక్రియ విషయాలను ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఏపీ జనగణన డైరెక్టర్ నివాస్ వివరించారు. ఈ నెల 30 తేదీ వరకూ ప్రజలు స్వయంగా ఆన్‌లైన్‌లో తమ ఇళ్లకు సంబంధించిన వివరాలు నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించామని సీఎం చంద్రబాబుకు తెలిపారు. మే 1 తేదీ నుంచి 30 తేదీ వరకూ ఎన్యుమరేటర్ అధికారులు ఇంటింటికీ వెళ్లి భౌతికంగా ఇళ్ల గణన ప్రక్రియను చేపడతారని వివరించారు.

Also Read: Child Acid Drink: తోటి కోడళ్ల పంచాయితీ.. బాలుడితో యాసిడ్‌ తాగించిన తోటి కోడలు

ఎన్యుమరేషన్‌ పూర్తయిన అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలో పౌరులందరికీ సమానంగా సంక్షేమం, అభివృద్ధి ఫలాలు అందించాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. దీని కోసం కుటుంబాన్ని యూనిట్‌గా తీసుకుని అభివృద్ధి ప్రణాళికలను రూపొందించడంఅవసరమని పేర్కొన్నారు. ఈ లక్ష్య సాధనలో జనగణన కార్యక్రమం అత్యంత కీలకమని స్పష్టం చేశారు.

రాష్ట్ర విభజన తర్వాత తొలిసారిగా ఏపీలో జనగణన కార్యక్రమం జరుగుతోందని.. ఇది కేవలం సమాచార సేకరణ మాత్రమే కాకుండా అభివృద్ధికి బలమైన పునాది వేస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అభిప్రాయం వ్యక్తం చేశారు. జనాభా లెక్కల కార్యక్రమం రెండు దశల్లో జరుగనుందని.. మొదటి దశలో ఇవాల్టి నుంచే ఇండ్ల గణన ప్రారంభమైందని చెప్పారు. వచ్చే ఏడాది నుంచి ప్రారంభమయ్యే రెండో దశలో జనాభా లెక్కల సేకరణ మొదలవుతుందని వెల్లడించారు.

Also Read: Employees Jackpot: ఏపీ ప్రభుత్వం భారీ శుభవార్త.. ఆర్టీసీ ఉద్యోగులకు బంపర్ జాక్‌పాట్!

ప్రస్తుతం ప్రారంభమైన ఇండ్ల గణన( హౌస్ లిస్టింగ్- హౌస్ సెన్సెస్ కార్యక్రమంలో ప్రజలు స్వయంగా ఆన్ లైన్ ద్వారా నమోదు చేసుకునే అవకాశం ఉందని.. దీనిని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. సరైన వివరాలను నమోదు చేయడం ద్వారా రాష్ట్ర అభివృద్ధికి సహకారం అందించాలని ప్రజలను కోరారు. మొత్తం ఈ జనగణన కార్యక్రమాన్ని  విజయవంతం చేయడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report
Advertisement

MI vs PBKS: చేతులెత్తేసిన ముంబై ఇండియన్స్‌.. పంజాబ్‌ కింగ్స్‌ మరో అద్భుత విజయం

Mumbai, Maharashtra:

Punjab Kings Won By 7 Wickets: ఐపీఎల్‌ 2026 సీజన్‌ను విజయంతో ప్రారంభించిన ముంబై ఇండియన్స్‌ ఆ తర్వాత వరుసగా ఓటములను చవిచూస్తోంది. ఫుల్‌ జోష్‌లో ఉన్న పంజాబ్‌ కింగ్స్‌ అద్భుతంగా ఆడి మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. సొంత మైదానంలో భారీ లక్ష్యాన్ని నమోదు చేసిన ముంబై ఇండియన్స్‌ బౌలర్ల వైఫల్యంతో మ్యాచ్‌ను కోల్పోయింది. వాంఖడేలో 21 బంతులు మిగిలి ఉండగానే పంజాబ్‌ కింగ్స్‌ 7 వికెట్ల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

 

0
0
Report

Child Acid Drink: తోటి కోడళ్ల పంచాయితీ.. బాలుడితో యాసిడ్‌ తాగించిన తోటి కోడలు

Hyderabad, Telangana:

Co Sister Acid Incident: ఉమ్మడి కుటుంబంలో తన కొడుకుపై వివక్ష కొనసాగుతోందని ఈర్ష్యతో తన తోటి కోడలి కొడుక్కి ఓ వివాహిత యాసిడ్‌ తాగించింది. జ్యూస్‌ తాగితే చాక్లెట్‌ ఇస్తానని నమ్మించి గ్లాస్‌లో యాసిడ్‌ పోసి ఇచ్చింది. అది తాగిన పిల్లాడు విలవిలలాడుతూ బోరున ఏడ్చాడు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు నిర్ఘాంతపోయారు. వెంటనే బాలుడిని ఆస్పత్రికి తరలించగా ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. హైదరాబాద్‌లో సంచలనం రేపిన ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

Also Read: Govt Employees: రేపు ప్రభుత్వ ఉద్యోగుల భారీ నిరసన.. పీఆర్‌సీ, డీఏ కోసం పోరాటం

హైదరాబాద్‌ శివారులోని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బోడుప్పల్ ద్వారాకానగర్‌లో పర్వతం సతీశ్‌ కుమార్‌, అంజమ్మ దంపతులు. వీరికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కోడళ్లు పర్వతం నాగరాజు- సంధ్య, పర్వతం జగదీశ్‌-మంజుల. వీరంతా ఉమ్మడి కుటుంబంగా నివసిస్తున్నారు. పెద్ద కుమారుడికి ఒక కుమార్తెతోపాటు నాలుగేళ్ల కుమారుడు కార్తీక్‌ వాసు ఉన్నాడు. చిన్న కుమారుడికి ఒక పిల్లాడు ఉన్నాడు. కొంతకాలంగా కోడళ్ల మధ్య పంచాయితీ నడుస్తోంది. చిన్నకోడలు మంజుల విభేదాలతో తరచూ గొడవ పడుతుండేది. అత్తామామలు తోటి కోడలు పిల్లలను బాగా చూసుకుంటూ తన పిల్లాడిని నిర్లక్ష్యం చేస్తున్నాడని మంజుల భావిస్తోంది.

Also Read: Tejaswi Surya Apology: తెలంగాణపై విషం చిమ్మిన తేజస్వి సూర్య క్షమాపణ చెప్పాలి: కేటీఆర్‌

ఈ బాధతో ఏప్రిల్‌ 9వ తేదీన ఇంట్లో అందరూ ఉన్న సమయంలో మంజుల రాత్రి పూట తన తోటి కోడలి కుమారుడికి జ్యూస్‌ అని చెప్పి యాసిడ్‌ తాగించింది. 'నీకు చాక్లెట్‌ ఇస్తాను. బాబాయి తెచ్చిన జ్యూస్‌ తాగాలి' అని చెప్పి యాసిడ్‌ పోసిన గ్లాస్‌ ఇచ్చి ఆమె పిల్లాడితో యాసిడ్‌ తాగించే ప్రయత్నం చేసింది. యాసిడ్‌ చుక్కలు కొన్ని నోటిపై పడిన అనంతరం ఆ బాలుడు రోదిస్తూ కిచెన్‌లో నుంచి హాల్‌లోకి వచ్చాడు. వేరే గదిలో ఉన్న అత్తామామ, బాలుడి తల్లి సంధ్య కంగారుపడ్డారు. వచ్చి ఏం జరిగిందని అడగ్గా 'పిన్ని జ్యూస్‌ అని చెప్పి యాసిడ్‌ తాగించింది' అని బాలుడు చెప్పాడు. అయితే మంజుల తాను ఏం చేయలేదని.. పిల్లాడే యాసిడ్‌ తాగేశాడని కప్పిపుచ్చే ప్రయత్నం చేసింది.

Also Read: Employees Jackpot: ఏపీ ప్రభుత్వం భారీ శుభవార్త.. ఆర్టీసీ ఉద్యోగులకు బంపర్ జాక్‌పాట్!

యాసిడ్‌ ధాటికి మంట తాళలేక ఏడుస్తుండడంతో పిల్లాడిని ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో పిల్లాడు చికిత్స పొందుతున్నాడు. ఈ సంఘటనపై బాలుడి తల్లి సంధ్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన కొడుకును చంపాలని మంజుల చూస్తోందని.. ఇది తొలిసారి కాదని గతంలోనూ పలుసార్లు హత్యాయత్నం చేసిందని బాలుడి తల్లి సంధ్య సంచలన ఆరోపణలు చేశారు. గతంలో తన కొడుకు ముక్కు నోరు మూసి ఊపిరి ఆడకుండా ప్రయత్నం చేసిందని.. అది చూసి తాను దిగ్భ్రాంతికి లోనయినట్లు సంధ్య పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపింది. మరొకసారి డాబా మీదకు వెళ్లి రెయిలింగ్‌పై బాలుడిని కూర్చోపెట్టి చేతులు వదిలేసిందని.. భయంతో పిల్లాడు ఏడుస్తుంటే తన మామ వెళ్లి కాపాడాడని వెల్లడించింది. బాలుడి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read: Kavitha: తెలంగాణకు అన్యాయం జరిగితే మరో ఉద్యమం తప్పదు: కవిత హెచ్చరిక

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report

Govt Employees: రేపు ప్రభుత్వ ఉద్యోగుల భారీ నిరసన.. పీఆర్‌సీ, డీఏ కోసం పోరాటం

Baddipadaga, Telangana:

Telangana Govt Employees: రెండున్నరేళ్లుగా తమ డిమాండ్లు, సమస్యల పరిష్కారం కోసం ఎదురుచూస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఇక ఉద్యమ బాట పట్టనున్నారు. తమ న్యాయబద్ధమైన డిమాండ్ల సాధన కోసం రేపు కలెక్టరేట్‌ ఎదుట భారీ నిరసనకు దిగనున్నారు. తెలంగాణ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ (టీజీఈజేఏసీ) పిలుపు మేరకు శుక్రవారం హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో భోజన విరామ నిరసనను భారీ స్థాయిలో నిరసన చేపట్టనున్నారు. ఈ నిరసన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జేఏసీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు విక్రమ్ కుమార్, కన్వీనర్ కృష్ణ యాదవ్ పిలుపునిచ్చారు.

Also Read: Tejaswi Surya Apology: తెలంగాణపై విషం చిమ్మిన తేజస్వి సూర్య క్షమాపణ చెప్పాలి: కేటీఆర్‌

ఈ నిరసన కార్యక్రమ ఏర్పాట్లపై గురువారం హైదరాబాద్‌ నాంపల్లిలోని గృహకల్ప సముదాయంలోని టీఎన్‌జీఓ కార్యాలయంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రేపటి నిరసన కార్యక్రమ నిర్వహణపై చర్చించారు. తమ సంఘాలకు చెందిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులను పెద్ద ఎత్తున సమీకరించి రేపటి నిరసనను విజయవంతం చేయాలని సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేశారు. నల్ల బ్యాడ్జీలు ధరించి నిర్వహించే ఈ నిరసన కార్యక్రమంలో గెజిటెడ్ అధికారులు, నాన్-గెజిటెడ్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, క్లాస్-IV ఉద్యోగులు హాజరవ్వాలని జేఏసీ ప్రతినిధులు పిలుపునిచ్చారు.

Also Read: Employees Jackpot: ఏపీ ప్రభుత్వం భారీ శుభవార్త.. ఆర్టీసీ ఉద్యోగులకు బంపర్ జాక్‌పాట్!

ఈ సందర్భంగా ఉద్యోగుల జేఏసీ చేస్తున్న ప్రధాన డిమాండ్లు ఇవే

==> 2 జూన్ 2026లోపు వేతన సవరణ సంఘం (పీఆర్‌సీ) అమలు చేయాలి
==> పెండింగ్‌లో ఉన్న అన్ని రకాల బిల్లులను వెంటనే విడుదల చేయాలి
==> ఉద్యోగులందరికీ వెంటనే హెల్త్ కార్డులు మంజూరు చేయాలి
==> పాత పెన్షన్ విధానాన్ని (OPS) పునరుద్ధరించాలి

Also Read: Kavitha: తెలంగాణకు అన్యాయం జరిగితే మరో ఉద్యమం తప్పదు: కవిత హెచ్చరిక

రేపటి నిరసన ప్రదర్శనలో పాల్గొనే సంఘాలు ఇవే..
టీఎన్‌జీఓస్‌, తెలంగాణ ఉద్యోగుల సంఘం, తెలంగాణ రాష్ట్ర క్లాస్-IV ఉద్యోగుల సంఘం, పీఆర్‌టీయూ, టీఎస్‌యూటీఎఫ్‌, ఎస్‌టీయూ, సీపీఎస్‌ ఉద్యోగుల సంఘం, డీఏఓ సంఘం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
0
Report
Advertisement
Advertisement
Back to top