మధిరలో సబ్ కోర్టు నిర్మాణానికి శంకుస్థాపన
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
BRS Party News: మున్సిపల్ ఎన్నికల వేళ వివిధ జిల్లాల్లో రాజయకీల్లో ఊహించని మార్పులు వస్తున్నాయి. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీలో పెను రాజకీయ సంచలనం చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి.. గత రెండు దశాబ్దాల నుంచి పార్టీకి నియోజవర్గం స్థాయిలో వెన్నుముకగా ఉన్న కీలక నేత అనూప్ రావు బీఆర్ఎస్ పార్టీని వీడబోతున్నట్లు తెలుస్తోంది. అయితే, ఇది స్థానిక ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్కు కోలుకోలేని దెబ్బగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
బీఆర్ఎస్ పార్టీలో 2001 ఆవిర్భావం నుంచి అనూప్ రావు చాలా చురుకైన పాత్ర పోషిస్తూ వస్తున్నారు. అంతేకాకుండా ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో భాగంగా ఆయన లాఠీ దెబ్బలు తిని, జైలుకు వెళ్లిన చరిత్ర కూడా ఉంది. అలాగే పార్టీ ఎంతో కష్టకాలంలో ఉన్న సమయంలో కూడా నియోజకవర్గంలో కేడర్ను సమన్వయం చేస్తూ బలమైన శక్తిగా ఎదుగుతూ వచ్చారు. అయితే, గత కొద్ది రోజుల నుంచి పార్టీలో తనకు సరైన ప్రాధాన్యత లభించడం లేదని.. కష్టపడిన వారికి కాకుండా ఇతర ఇతరులకు పార్టీ పెద్దపీట వేస్తోందని ఆయన తీవ్ర ఆసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
ముఖ్యంగా కోరుట్ల నియోజకవర్గ అభివృద్ధి పనులకు.. నామినేటెడ్ పదవుల భర్తీలో పాతతరం నేతలను పట్టించుకోవడం లేదని, కొత్తగా వచ్చిన వారికి ఎమ్మెల్యే సంజయ్ ప్రాధాన్యత ఇస్తున్నారని.. అనూప్ రావు ప్రధాన ఆరోపణగా వినిపిస్తోంది. అయితే, మున్సిపల్ ఎన్నికలు వస్తున్న సమయంలో తన అనుచరవర్గానికి టికెట్ల కేటాయింపు విషయాల్లో కూడా సరైన స్పష్టత లేనందున, ఆయన పార్టీ వీడాలనే నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది..
Also Read: ktr On Revanth Video: రేవంత్ కాదు.. వాడి జేజేమ్మకు భయపడేది లేదు.. కేటీఆర్ ఫైర్..వీడియో..
అలాగే అనూప్ రావు పార్టీ మారడానికి ఇప్పటికే.. బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్తో ప్రత్యేకమైన సంప్రదింపులు కూడా జరిపినట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే కోరుట్ల నియోజకవర్గంలో BJPని బలోపేతం చేసేందుకు చూస్తున్న అరవింద్.. అనూప్ రావుకు ప్రత్యేమైన కీలక బాధ్యతలు కూడా అప్పగించిన్నట్లు హామీ ఇచ్చినట్లు సమాచారం.. అలాగే త్వరలోనే తన అనుచరులతో భారీ బహిరంగ సభను కూడా నిర్వహించి.. వారి సమక్షంలోనే కాషాయ కండువా కప్పుకునే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. మున్సిపల్ ఎన్నికల్లో అనూప్ రావు వంటి కీలక నేతలు పార్టీ వీడడం వల్ల BRSకు ఓటు బ్యాంకుపై తీవ్ర ప్రభావం పడే అవకాశాలు ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
Also Read: ktr On Revanth Video: రేవంత్ కాదు.. వాడి జేజేమ్మకు భయపడేది లేదు.. కేటీఆర్ ఫైర్..వీడియో..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Egg Diet For Kids: కోడిగుడ్డు ఆరోగ్యానికి ఎంత మంచిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏడాది వయసు దాటిన తర్వాత నుంచి పిల్లలకు ఈ కోడి గుడ్డును పెట్టొచ్చు. గుడ్డులో ప్రోటీన్తో పాటు చాలా రకాల విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలన్నీ మెదడు శక్తికి, ఆరోగ్యకరమైన రోగనిరోధక వ్యవస్థకు సహాయపడతాయి. కోడి గుడ్డు కేవలం మంచి అల్పాహారం మాత్రమే కాదు.. పిల్లలలో పోషకాహారాన్ని పెంచడానికి ఇది ఒక గొప్ప ఆహారం. ఒక కోడిగుడ్డులో 6 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఇది పిల్లల్లో మెదడు అభివృద్ధికి, తెలివితేటలు పెరగడానికి కూడా సహాయపడుతుంది.
పిల్లలకు రోజుకి ఒక గుడ్డు అందిస్తే..
పిల్లలకు రోజూ ఒక కోడి గుడ్డు ఇవ్వడం వల్ల అవసరమైన విటమిన్లు, ఖనిజాలను గుడ్డు అందిస్తుంది. కంటి చూపును మెరుగుపరిచే లుటిన్, జియాక్సంతిన్ కూడా గుడ్లలో ఉంటాయి. గుడ్లు ప్రోటీన్ను మాత్రమే కాదు. పిల్లలకు రోజూ అవసరమైన విటమిన్లు, ఖనిజాలను అందిస్తాయి.
ఎన్ని గుడ్లు తినొచ్చు..?
1 నుంచి 8 ఏళ్ల పిల్లలు రోజుకు 1 నుంచి 2 గుడ్లు తినడం మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఈ మోతాదు పెరుగుతున్న పిల్లలకు అవసరమైన ప్రోటీన్, పోషకాలను అందిస్తుంది. శక్తిని నిలబెట్టడంలో, మెదడును ఉత్తేజపరచడంలో, శరీర పెరుగుదలలో ఇది పాత్ర పోషిస్తుంది.
గుడ్లు తినని పిల్లలతో పోలిస్తే, గుడ్లు తినే పిల్లలకు ప్రోటీన్, మంచి కొవ్వు, డిహెచ్ఏ, కోలిన్, విటమిన్ డి వంటి పోషకాలు ఎక్కువగా అందుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ పోషకాలన్నీ శక్తిని నిలబెట్టడంలో, మెదడును ఉత్తేజపరచడంలో, శరీర పెరుగుదలలో పాత్ర పోషిస్తాయి. రోజూ గుడ్డు తినడం వల్ల పిల్లల్లో పెరుగుదల వేగవంతమవుతుందని ఓ అధ్యయనంలో నిరూపితమైంది. రోజూ ఒక గుడ్డు తినడం వల్ల పెరుగుదల లోపం 47%, బరువు తక్కువగా ఉండటం 70% నివారించవచ్చని పీడియాట్రిక్స్ జర్నల్లో ప్రచురించిన ఈ అధ్యయనం తేల్చింది.
ఏ రూపంలో ఇవ్వొచ్చు..?
ఇతర ఆహారాలతో పాటు రోజుకు 1 నుండి 2 గుడ్లు ఇవ్వండి. కూరగాయలతో కలిపి స్క్రాంబుల్డ్ ఎగ్స్ లేదా ఆమ్లెట్ రూపంలో కూడా ఇవ్వొచ్చు. ఇంకో విషయం, పిల్లలకు మొదటిసారి గుడ్డు పెట్టినప్పుడు అలర్జీ సమస్య ఉందేమో గమనించండి. ఏవైనా ఇబ్బందులు కనిపిస్తే డాక్టర్ను సంప్రదించండి.
Also Read: Cardamom: యాలకులు ఇలా తీసుకుంటే ఈ ఐదు అనారోగ్య సమస్యలకు గుడ్బై చెప్పొచ్చు..!
Also Read: Secunderabad Railway Station: సికింద్రాబాద్ వెళ్లే ప్రయాణికులకు బిగ్ అలెర్ట్.. ఎందుకంటే..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Cardamom Health Benefits: మన భారతీయ వంటకాల్లో యాలకులకు ఎంతో ప్రత్యేకత ఉంది. యాలకులు మంచి సువాసన ఇచ్చే సుగంధ ద్రవ్యం మాత్రమే కాదు. ఇందులో అద్భుతమైన ఔషధ గుణాలుంటాయి. అవి ఆరోగ్యానికి ఎంతోమేలు చేస్తాయి. అందుకే యాలకులను "సుగంధ ద్రవ్యాల రాణి''గా పిలుస్తారు. వీటిలో యాంటీఆక్సిడెంట్, యాంటీ మైక్రోబయల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. యాలకులను ఈ విధంగా తీసుకుంటే.. అనేక అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చు.
1. జీర్ణక్రియ మెరుగుపడుతుంది
యాలకులు జీర్ణశక్తిని పెంచడంలో బాగా సహాయపడుతుంది. భోజనం తర్వాత ఒక యాలక గింజ నమలడం వల్ల గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలకు చెక్ పెట్టొచ్చు. కడుపులో మంటను కూడా యాలకులు తగ్గిస్తాయి.
2. నోటి ఆరోగ్యం కాపాడుతుంది
యాలకుల్లో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు నోటిలోని బ్యాక్టీరియాను చంపి, దుర్వాసనను పోగొడతాయి. చిగుళ్ల ఇన్ఫెక్షన్లు రాకుండా రక్షిస్తాయి.
3. గుండె ఆరోగ్యానికి మేలు
యాలకులు బీపీని కంట్రోల్ చేయడంలో సహాయపడతాయి. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్స్ రక్త ప్రసరణను మెరుగుపరిచి గుండె జబ్బుల సమస్యలను చాలా వరకు తగ్గిస్తాయి.
4. శ్వాసకోస ఇబ్బందుల నుంచి ఉపశమనం
తరుచూ వచ్చే దగ్గు, జలుబు, ఆస్తమా వంటి ఇబ్బందులతో బాధపడేవారికి యాలకులు మంచి ఉపశమనం కలిగిస్తాయి. ఊపిరితిత్తులలో గాలి ప్రవాహాన్ని మెరుగుపరిచి ఈజీగా శ్వాస తీసుకునేలా చేస్తుంది.
5. డిప్రెషన్ దూరం
ఇటీవల కాలంలో చాలామంది తమ పనుల వల్ల ఒత్తిడి, డిప్రెషన్కు లోనవుతున్నారు. అలాంటివారు యాలకుల టీ లేదా యాలకులు నోట్లో వేసుకుని నమిలితే మనుసు ప్రశాంతంగా ఉంటుంది. మానసిక ఒత్తిడి, ఆందోళన దూరమవుతాయి.
Also Read: Secunderabad Railway Station: సికింద్రాబాద్ వెళ్లే ప్రయాణికులకు బిగ్ అలెర్ట్.. ఎందుకంటే..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Gajakesari Yoga Effect On Zodiac Signs: ఈ రోజే మాఘ మాసం శుక్ల పక్ష పంచమి తిథి.. అయితే, ఇదే రోజు వసంత పంచమి పండగ తిథి.. కాబట్టి ఈ రోజును సరస్వతి దేవికి అంకితం చేస్తారు. జ్యోతిష్య శాస్త్రం పరంగా చంద్రుడు మీన రాశిలోకి సంచారం చేశాడు. అయితే, ఈ సమయంలో చంద్రుడు, బృహస్పతి గ్రహాలు 10వ స్థానంలో ఉండబోతున్నాయి. దీని కారణంగానే ఈ రోజు గజకేశరి యోగం ఏర్పడిందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, గజకేశరి యోగం అత్యంత శక్తివంతమైన గ్రహాల్లో ఒకటిగా భావిస్తారు. దీంతో కెరీర్, సామాజికంగా ఊహించని స్థాయిలో గౌరవం పెరుగుతుంది. అంతేకాకుండా బుధుడు ఈ సమయంలో శ్రావణ నక్షత్రంలోకి కూడా సంచారం చేస్తాడు. దీంతో శుక్ర, బుధుల కలయిక కూడా జరిగింది.. దీని కారణంగానే లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పడింది. ఈ యోగం కారణంగా కూడా అద్భుతమైన లాభాలు కలుగుతాయి.
ఈ రాశులపై ప్రభావం:
మేషరాశి
గజకేశరి రాజయోగం ఎఫెక్ట్తో మేష రాశివారికి అనేక రకాల ఆర్థిక లాభాలు కలుగుతాయి. వీరికి కెరీర్ పరంగా అద్బుతమైన గుర్తింపు లభిస్తుంది. ఏవైనా పనులు ప్రారంభించాలనుకునేవారికి, ఇది అద్భుతమైన అవకాశంగా భావించవచ్చు. అంతేకాకుండా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వ్యక్తులకు ఈ సమయం చాలా బాగుటుంది. అంతేకాకుండా ఆనందం కూడా ఊహించని స్థాయిలో రెట్టింపు అవుతుంది. ఆస్తుల పరంగా ఈ సమయంలో లావాదేవీలు కూడా జరుగుతాయి. దీంతో పాటు ఒప్పందాలు కూడా ఖరారు చేసుకుంటారు.
మిథున రాశి
ఈ శక్తివంతమైన యోగాల ప్రభావంతో మిథున రాశివారికి వ్యాపారాల పరంగా అద్భుతమైన విజయాలు కలుగుతాయి. వీరికి ఉన్నతాధికారుల నుంచి పూర్తి సపోర్ట్ కూడా లభిస్తుంది. అంతేకాకుండా ఈ సమయంలో పెద్ద పెద్ద బాధ్యతలు కూడా పొందుతారు. అంతేకాకుండా ఆర్థిక విషయాల్లో కూడా మంచి ప్రయోజనాలు పొందుతారని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఈ సమయంలో ప్రయాణాలు చేయడం వల్ల ఊహించని స్థాయిలో ఆనందం కూడా లభిస్తుంది. తల్లిదండ్రుల నుంచి లాభాలు కూడా పొందుతారు.
కర్కాటక రాశి
శక్తివంతమైన గజకేశరి రాజయోగంతో కర్కాటక రాశివారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. వీరికి ఈ సమయంలో అదృష్టం కూడా రెట్టింపు అవుతుంది. పెండింగ్లో ఉన్న పనులు కూడా ఊహించని స్థాయిలో ఊపందుకుంటాయి. విదేశీ ప్రయాణాలు చేయడం వల్ల కెరీర్ పరంగా కూడా చాలా వరకు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. రాజకీయ రంగాల్లో ఉన్న వ్యక్తులు ఈ సమయంలో అద్భుతమైన లాభాలు పొందుతారు. ఈ సమయంలో ఊహించని స్థాయిలో నైపుణ్యం కూడా పెరుగుతుంది.
వృశ్చిక రాశి
ఈ శుక్రవారం నుంచి వృశ్చిక రాశివారికి విద్యా పరంగా అద్భుతమైన లాభాలు కలుగుతాయి. దీంతో పాటు కెరీర్ పరంగా విశేషమైన లాభాలు కలుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అలాగే వీరికి పెండింగ్లో ఉన్న పనులు కూడా సులభంగా పూర్తవుతాయి. దీంతో పాటు వ్యాపారాలు చేసేవారు యాత్రలు కూడా వెళ్లాల్సి వస్తుంది. దీంతో పాటు ఈ సమయంలో పెండింగ్లో ఉన్న పనులు కూడా సులభంగా పూర్తవుతాయి. అంతేకాకుండా వీరికి ప్రేమ జీవితం కూడా చాలా వరకు మెరుగుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Also Read: Mercury Transit 2026: మకరంలో తిష్ట వేసిన బుధుడు.. ఈ రాశుల వారికి కోటీశ్వరులయ్యే యోగం ప్రారంభం!

Also Read: Mercury Transit 2026: మకరంలో తిష్ట వేసిన బుధుడు.. ఈ రాశుల వారికి కోటీశ్వరులయ్యే యోగం ప్రారంభం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Union Budget 2026: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న పార్లమెంటులో 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్ నిర్మలమ్మ వరుసగా ప్రవేశపెడుతున్న 9వ బడ్జెట్ కావడం విశేషం. ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా పన్ను చెల్లింపుదారుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా ఆదాయపు పన్ను రేట్ల తగ్గింపు, పన్ను శ్లాబ్ల సరళీకరణ, అలాగే పాత పన్ను విధానంలో మినహాయింపులు, తగ్గింపులు పెంచుతారేమో అన్న ఆశలు వ్యక్తమవుతున్నాయి. అయితే గత కొన్ని సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న పన్ను విధానాన్ని గమనిస్తే, పాత పన్ను వ్యవస్థకు పెద్ద ఎత్తున ఉపశమనం కల్పించడం ప్రభుత్వ ప్రాధాన్యతగా కనిపించడం లేదు.
ఇటీవలి సంవత్సరాల్లో ప్రభుత్వం పాత పన్ను విధానంలో పెద్దగా మార్పులు చేయకుండా, పన్ను చెల్లింపుదారులను క్రమంగా కొత్త పన్ను విధానం వైపు మళ్లిస్తోంది. అధికారిక గణాంకాల ప్రకారం ఇప్పటికే 80 శాతం కంటే ఎక్కువ మంది పన్ను చెల్లింపుదారులు కొత్త వ్యవస్థను ఎంచుకున్నారు. అయినప్పటికీ, ఇంకా పాత విధానంలో కొనసాగుతున్న జీతభత్యాలు పొందే ఉద్యోగులు కొంత ఊరట కోసం ఎదురుచూస్తున్నారు. అయితే గత ఆరు బడ్జెట్లను పరిశీలిస్తే, తక్కువ మినహాయింపులు, తక్కువ సంక్లిష్టతతో కూడిన సరళమైన పన్ను నిర్మాణాన్ని రూపొందించడమే ప్రభుత్వ లక్ష్యంగా స్పష్టంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకుంటే, 2026–27 బడ్జెట్లో పాత పన్ను విధానంలో పెద్ద మార్పులు చోటు చేసుకునే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.
గత ఏడాది బడ్జెట్లో మాత్రం కొత్త పన్ను విధానాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రాథమిక మినహాయింపు పరిమితిని రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షలకు పెంచింది. అలాగే సెక్షన్ 87A కింద ఇచ్చే పన్ను రాయితీని రూ.25,000 నుంచి రూ.60,000కు పెంచడంతో, కొత్త విధానంలో రూ.12 లక్షల వరకు ఆదాయం పన్ను రహితంగా మారింది. జీతం పొందే ఉద్యోగులకు ఇచ్చే ప్రామాణిక మినహాయింపును కూడా రూ.50,000 నుంచి రూ.75,000కు పెంచడం జరిగింది. ఈ మార్పులతో కొత్త పన్ను విధానం ఇప్పటికే గణనీయంగా లాభదాయకంగా మారిన నేపథ్యంలో, ఈసారి మళ్లీ పెద్ద ఎత్తున శ్లాబ్ల పునర్నిర్మాణం జరిగే అవకాశాలు కనిపించడం లేదు.
పన్ను శ్లాబ్లపై పెద్ద మార్పులు ఆశించవద్దని పన్ను నిపుణులు కూడా సూచిస్తున్నారు. చార్టర్డ్ అకౌంటెంట్ డాక్టర్ సురేష్ సురానా మాట్లాడుతూ.. గత బడ్జెట్లోనే వ్యక్తిగత ఆదాయపు పన్ను వ్యవస్థలో విస్తృతమైన మార్పులు చేసిన నేపథ్యంలో, 2026–27 బడ్జెట్లో మరోసారి భారీ సవరణలు రావడం కష్టమేనని అభిప్రాయపడ్డారు. అంతేకాదు, ఆదాయపు పన్ను చట్టం–2025 ఏప్రిల్ 1, 2026 నుంచి పూర్తిగా అమల్లోకి రానున్న నేపథ్యంలో, ఈసారి బడ్జెట్లో స్థిరత్వం, విధానపరమైన కొనసాగింపు, స్పష్టతపై ప్రభుత్వం ఎక్కువ దృష్టి పెట్టే అవకాశముందని ఆయన పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా, పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జనవరి 28 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు రెండు దశల్లో జనవరి 28 నుంచి ఏప్రిల్ 2, 2026 వరకు కొనసాగనున్నాయి. ఫిబ్రవరి 1న ఉదయం 11 గంటలకు లోక్సభలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్ కోసం ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇప్పటికే తుది దశ సన్నాహాల్లో ఉంది. మోదీ ప్రభుత్వ హయాంలో నిర్మలా సీతారామన్ సమర్పించనున్న తొమ్మిదవ బడ్జెట్ కావడంతో దేశవ్యాప్తంగా ప్రజలు, వ్యాపార వర్గాలు, మధ్యతరగతి నుంచి ఉన్నత వర్గాల వరకు ప్రతి ఒక్కరూ తమకు అనుకూలమైన కీలక ప్రకటనల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Also Read: Union Budget 2026: రైతులకు కేంద్రం తీపికబురు.. ఈ సారి బడ్జెట్లో ఎవరూ ఊహించని గిఫ్ట్..!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
PM Kisan Amount Increase: అధికారంలోకి వచ్చి పుష్కర కాలం దాటిన నరేంద్ర మోదీ ప్రభుత్వం రైతులకు భారీ శుభవార్త ప్రకటించబోతున్నట్లు సమాచారం. రైతులకు అందిస్తున్న పంట పెట్టుబడి సహాయాన్ని పెంచబోతున్నట్లు తెలుస్తోంది. రైతులకు అందిస్తున్న సహాయాన్ని పెంచి కానుకగా ఇచ్చేందుకు సిద్ధమైందని వార్తలు వస్తున్నాయి. పీఎం కిసాన్ సహాయాన్ని పెంచి ఇవ్వనున్నట్లు.. రానున్న బడ్జెట్లో ఈ ప్రకటన ఉంటుందని తెలుస్తోంది.
Also Read: KTR: సిట్ నోటీసులపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు.. రేవంత్ రెడ్డి ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేస్తుండు
కేంద్ర బడ్జెట్ ఫిబ్రవరి 1వ తేదీన ప్రవేశపెట్టనున్న విషయం తెలిసిందే. కేంద్ర బడ్జెట్పై సామాన్య ప్రజానీకంతోపాటు రైతులు, ఉద్యోగులు భారీ ఆశలు పెట్టుకున్నారు. అధికారంలోకి వచ్చి 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం రైతులకు భారీ కానుక ఇవ్వనున్నట్లు సమాచారం. ఈ క్రమంలో బడ్జెట్పై అన్నీ వర్గాలు భారీగా అంచనాలు పెంచుకున్నారు. ఈ బడ్జెట్లో రైతులకు సంబంధించిన పీఎం కిసాన్ సమ్మాన్ పథకానికి సంబంధించి భారీ కానుక రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అరకొరగా అందిస్తున్న పంట పెట్టుబడి సహాయం ఈసారి పెంచనున్నట్లు తెలుస్తోంది. ప్రధానమంత్రి కిసాన్ యోజన బడ్జెట్ను పెంచవచ్చని రైతులు ఆశిస్తున్నారు. ఈ పథకం ప్రారంభమైనప్పటి నుంచి రూపాయి కూడా పెంచలేదు. ఈసారి బడ్జెట్లో పెంపు ఉండబోతున్నదని సమాచారం.
Also Read: KT Rama Rao: తెలంగాణలో సంచలన పరిణామం.. కేటీఆర్కు సిట్ నోటీసులు
ప్రధానమంత్రి కిసాన్ యోజనను కేంద్ర ప్రభుత్వం 2019లో ప్రారంభించగా.. ఈ పథకం కింద రైతులకు సంవత్సరానికి రూ.6,000 పంట పెట్టుబడి సహాయం అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సహాయం మూడు విడతలుగా పంపిణీ చేస్తున్నారు. ప్రతి నాలుగు నెలలకు ఒక విడతగా రూ.2 వేల చొప్పున విడుదల చేస్తున్నారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా రైతులకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద 21 వాయిదాలు చెల్లించారు.
ఫిబ్రవరి 1వ తేదీన ప్రవేశపెట్టే బడ్జెట్లో ప్రధానమంత్రి కిసాన్ పథకంపై కీలక ప్రకటన ఉంటుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. బడ్జెట్లో పీఎం కిసాన్ పథకానికి కేటాయింపులు పెంచనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందిస్తున్న రూ.6,000 నుంచి రూ.8,000కు పెంచవచ్చని వ్యవసాయ అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం ప్రస్తుతం చెల్లిస్తున్న రూ.6 వేలు రైతులకు ఏకోశాన సరిపోవడం లేదు. విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, డీజిల్, విద్యుత్, నీటిపారుదల, వ్యవసాయ యంత్రాలు ఇలా ప్రతి దాని ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో రైతులకు పంట పెట్టుబడి పెరిగిపోతున్నది. వ్యవసాయ ఖర్చు భారీగా పెరిగిపోతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న పీఎం కిసాన్ సహాయం ఏమాత్రం చాలడం లేదు.
Also Read: YS Jagan: మాజీ సీఎం వైఎస్ జగన్ సంచలన ప్రకటన.. 2027 తర్వాత పాదయాత్ర
ఆంక్షలతో పీఎం కిసాన్ దూరం
అందించే అరకొర సహాయానికి అడ్డమైన కొర్రీలు పెట్టారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతుబంధుకు నకలుగా అమలుచేస్తున్న పీఎం కిసాన్ పథకంలో అనేక కొర్రీలు పెట్టారు. రైతుబంధు మాదిరి అందరు రైతులకు సహాయం రావడం లేదు. భార్యాభర్తలిద్దరూ పీఎం కిసాన్ సహాయం పొందడానికి అనర్హులు. ఎవరైనా అలా చేస్తే ప్రభుత్వం వారిని మోసగాళ్లుగా ప్రకటించి వారి నుంచి డబ్బును తిరిగి పొందుతుంది. రైతు కుటుంబంలో ఎవరైనా పన్నులు చెల్లిస్తే వారు ఈ పథకం ప్రయోజనాలకు అర్హులు కారు. అంటే గత సంవత్సరం భర్త లేదా భార్య ఆదాయపు పన్ను చెల్లించినట్లయితే వారు పీఎం కిసాన్ పథకం ప్రయోజనాలకు అర్హులు కారు. ఈ నిబంధనలు ఎత్తివేయాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఒక రైతు మరొక రైతు నుంచి భూమిని సాగు చేయడానికి కౌలుకు తీసుకుంటే వారికి కూడా పీఎం కిసాన్ పథకం ప్రయోజనాలు లభించవు. పీఎం కిసాన్ సహాయం కోసం భూమి యాజమాన్యం అవసరం. ఒక రైతు లేదా కుటుంబ సభ్యుడు రాజ్యాంగ పదవిలో ఉంటే వారికి కూడా పీఎం కిసాన్ డబ్బులు రావు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
KTR SIT Notice: ఫోన్ ట్యాపింగ్ కేసులో తనకు అందిన నోటీసులపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. తనకు నోటీసులు అందించడంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. సిట్ వ్యవహార శైలి మండిపడుతూ రేవంత్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సిట్ అంటే రేవంత్ రెడ్డి సిట్ అంటే సిట్ స్టాండ్ అంటే స్టాండ్ లాగానే ఉంటదని అభివర్ణించారు. 'ఇచ్చిన హామీలు నెరవేర్చే తెలివి రేవంత్ రెడ్డికి లేదు. కాళేశ్వరం కేసు కొన్ని డ్రామాలు, ఫోన్ ట్యాపింగ్ కేసు, గొర్రెల స్కాం, ఫార్ములా ఈ అంటూ ఆ డ్రామాలు చేస్తున్నారు' అని మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు.
Also Read: KT Rama Rao: తెలంగాణలో సంచలన పరిణామం.. కేటీఆర్కు సిట్ నోటీసులు
సిరిసిల్లలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. 'మొన్న సింగరేణి కుంభకోణం బయట పెట్టాడని హరీష్ రావుకు సిట్ విచారణ చేశారు. ఇప్పుడు నాకు. కానీ పొంగులేటి కొడుకు బెదిరిస్తే కేసులు లేవు. సింగరేణి కుంభకోణంలో రేవంత్ రెడ్డి బావ మరిది హస్తం ఉంది. వీటి మీద సిట్ విచారణ ఉండదు' అని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. 'కంచ గచ్చిబౌలి భూముల విషయంలో రూ.10 వేల కోట్ల కుంభకోణానికి తెరలేపారు. ఆర్ఆర్ టాక్స్ నడుస్తుందని స్వయంగా మోదీ అన్నారు. బొగ్గు కుంభకోణంపై కేంద్రం ఎందుకు విచారణ చేయదు' అని ప్రశ్నించారు.
Also Read: RMZ Group: ఏపీ ప్రభుత్వంతో ఆర్ఎంజెడ్ గ్రూప్ భారీ ఒప్పందం.. రూ.లక్ష కోట్ల పెట్టుబడి
'ఒక సన్నాసి అడ్డంగా నోట్ల కట్టలతో దొరికారు. ఆయన మాపై కేసులు పెడుతున్నారు. కోమటిరెడ్డి వ్యవహారంలో ఒక చానల్ వార్తలు వేస్తే జర్నలిస్టులను అరెస్ట్ చేయించారు. ఫోన్ ట్యాపింగ్కు గత మంత్రులకు సంబంధం ఏముంటుంది? శాంతి భద్రతల విషయంలో పోలీసులు కేవలం నిఘా ఉంటుంది. మంత్రులకు సంబంధం ఉండదు' అని మాజీ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. గత ప్రభుత్వం లో ఇంటెలిజెన్స్ ఐజీ గా శివధర్ రెడ్డి ఉన్నారు, జితేందర్ ఉన్నారు వారిని ఎందుకు సిట్ పిలవడం లేదు? అని నిలదీశారు. రేవంత్ రెడ్డి ఇప్పుడు ప్రతిపక్ష నాయకుల ఫోన్లు ట్యాప్ చేయడం లేదా? అని మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు.
Also Read: YS Jagan: మాజీ సీఎం వైఎస్ జగన్ సంచలన ప్రకటన.. 2027 తర్వాత పాదయాత్ర
'1957 నుంచి అన్ని ప్రభుత్వాలు శాంతి భద్రతల కోసం గూఢచారి వ్యవస్థ నడుస్తుంది. దీనికి రాజకీయ నాయకులకు, మంత్రులకు సంబంధం లేదు' అని మాజీ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. 'పది రోజులు టైమ్ పాస్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. అందుకే ఎవర్నో ఒకర్ని కేసులపై విచారణకు పిలుస్తారు. డైలీ ఒక మసాలా కావడానికి ఈ వార్త. ఇది పెద్ద ట్రాష్ కేసు' అని కొట్టిపారేశారు. రెండేళ్లు అయ్యింది కేసు విచారణ ప్రారంభించి, కేసు విషయంలో ఎవరైనా నోట్ ఇచ్చారా? ఫోన్ ట్యాపింగ్ విషయం పై మాట్లాడారా? అని ప్రశ్నించారు. ఈ విషయంలో రేవంత్ రెడ్డి పీకింది ఏమి లేదని చెప్పారు. రేపు విచారణకు హాజరువుతానని ప్రకటించారు.
'రేవంత్ రెడ్డి ప్రభుత్వం జిల్లాల రద్దుకు కుట్ర చేస్తున్నాడు. ప్రజల చేతిలో పరాభవం రేవంత్ రెడ్డికి తప్పదు' అని కేటీఆర్ తెలిపారు. 'కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు తండాలు గ్రామ పంచాయతీలు చేశారు. కొత్త మున్సిపాలిటీలు ఏర్పాటు చేశారు' అని గుర్తుచేశారు. పరిపాలన వికేంద్రీకరణ కేసీఆర్ చేయగా.. తుగ్లక్లాగా జిల్లాల రద్దుకు కుట్ర చేస్తున్నారని చెప్పారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Best Fruit For Gut Health: నిపుణుల సూచన మేరకు కొన్ని రకాల పండ్లు మన డైట్ లో చేర్చుకోవడం వల్ల కడుపు ఆరోగ్యం బాగుంటుంది. అజీర్తితో కడుపు ఉబ్బరంగా మారుతుంది. రాను నాను దీర్ఘకాలిక సమస్య ఆరోగ్య కడుపు సమస్యలు వస్తాయి. మలబద్ధక సమస్యకు కూడా ఇది మంచి రెమిడీ. దీనివల్ల మూడు స్వింగ్స్, ఎనర్జీ కోల్పోవడం, నిద్రలేమి సమస్యలు కూడా వెంటాడతాయి. అయితే మీ కడుపు ఆరోగ్యం బాగుండాలంటే కొన్ని రకాల పండ్లు చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
బొప్పాయి..
రెగ్యులర్ గా బొప్పాయి పండు తీసుకోవటం వల్ల కడుపులో గ్యాస్, అజీర్తి తగ్గిపోయి. జీర్ణ సమస్యలకు చెక్ పెడుతుంది. బొప్పాయిలో పప్పైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది ఆహారాన్ని విడగొడుతుంది. ప్రోటీన్ పుష్కలంగా కలిగి ఉంటుంది. తద్వారా కడుపులో గ్యాస్ తగ్గిపోతుంది. జీర్ణం ఆరోగ్యం మృదువుగా మారేలా చేస్తుంది. ప్రోటీన్ కూడా పుష్కలంగా లభిస్తుంది. బొప్పాయి నేరుగా తినవచ్చు. లేకపోతే జ్యూస్ రూపంలోకి తీసుకోవచ్చు. అయితే తిన్న తర్వాత తీసుకోవడం వల్ల మంచి ప్రయోజనాలు పొందుతారు.
పియర్ పండు..
పియర్ పండు కూడా దీర్ఘకాలిక మలబద్ధక సమస్యకు మంచి రెమెడీ. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. వారికి ఇది మంచి రెమెడీ. నిపుణుల ప్రకారం ఇందులో లాక్సేటివ్ గుణాలు నేచురల్గా కలిగి ఉంటాయి. ఆరోగ్యకరమైన పేగు కదలికలకు తోడ్పడుతుంది. ఇందులో ఉండే ఆల్కహాల్ షుగర్ పేగుల నుంచి నీటిని గ్రహిస్తుంది.
అరటిపండు..
అరటి పండులో పొటాషియం ఉంటుంది. రక్తపోటును అదుపు చేస్తుంది. అయితే జీర్ణ ఆరోగ్యానికి కూడా ఇది మేలు చేస్తుంది. ఇందులో ఎలక్ట్రో లైట్స్ ఉంటాయి. దీర్ఘకాలిక మలబద్దక సమస్యకు మంచి రెమెడీ. అంతే కాదు ఇది డయేరియా సమస్య ఉన్న వాళ్ళు కూడా తీసుకోవాలి.
పైనాపిల్..
పైనాపిల్ కూడా జీర్ణ ఆరోగ్యానికి సహాయపడటానికి తోడ్పడుతుంది. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కలిగి ఉంటుంది. ఇందులో బ్రోమలైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. జీర్ణ ఆరోగ్యానికి తోడ్పడుతుంది. ఆహారాన్ని విడగొడుతుంది. కడుపులో మంట, నొప్పి సమస్యలను తగ్గిస్తుంది.
యాపిల్..
జీర్ణ సమస్యలతో బాధపడుతున్న వారు యాపిల్ కూడా రెగ్యులర్ డైట్లో చేర్చుకోవాలి. ఇందులో ఫ్రీ బయోటిక్ ఉంటుంది. ఇది కడుపులో మంచి బ్యాక్టీరియా పెరగడానికి తోడ్పడుతుంది. తద్వారా ఆరోగ్యకరమైన గట్కు ఇది ఎంతో ముఖ్యం. ఇమ్యూనిటీని బూస్ట్ చేసి.. మెటబాలిజం రేటును కూడా పెంచుతుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు)
ALso Read: పండుగ రోజు అందంగా మెరిసిపోవడానికి.. ఈ ఒక్క ఫేస్ప్యాక్ అప్లై చేయండి!
ALso Read: ఖరీదైన క్రీములు అవసరం లేదు.. మన ఇంట్లోనే ఉన్న ఈ 7 పదార్థాలే నిజమైన బ్యూటీ సీక్రెట్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
KTR SIT Notice: తెలంగాణ రాజకీయాల్లో సంచలన పరిణామాలు చోటుచేసుకుంటున్న వేళ తాజాగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు భారీ షాక్ తగిలింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే నోటీసులు అందించి విచారణ ఎదుర్కొన్న మాజీ మంత్రి హరీశ్ రావు తర్వాత కేటీఆర్కు నోటీసులు ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరుకావాలని కేటీఆర్కు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ననోటీసులు అందించింది. రేపు విచారణకు రావాలని కేటీఆర్కు నోటీసు ఇచ్చింది. ఈ పరిణామంతో తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
Also Read: RMZ Group: ఏపీ ప్రభుత్వంతో ఆర్ఎంజెడ్ గ్రూప్ భారీ ఒప్పందం.. రూ.లక్ష కోట్ల పెట్టుబడి
ఫోన్ ట్యాపింగ్ కేసులో భారత రాష్ట్ర సమితి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్కు సిట్ నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ కార్యాలయంలో శుక్రవారం ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని నోటీసులో కేటీఆర్కు సిట్ పేర్కొంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే మాజీ మంత్రి హరీశ్రావును సిట్ మంగళవారం విచారణ చేసిన విషయం తెలిసిందే. సుమారు ఏడున్నర గంటలపాటు హరీశ్ రావును సుదీర్ఘంగా విచారణ చేసింది.
Also Read: YS Jagan: ఇక వైసీపీ కార్యకర్తలతో ఉంటా.. ఆంధ్రప్రదేశ్ ప్రజలతో కలిసిపోతా: వైఎస్ జగన్
ఈ కేసు దర్యాప్తుతో సంబంధం ఉన్న సాక్షులను ఎట్టి పరిస్థితుల్లోనూ సంప్రదించొద్దని.. ప్రభావితం చేయొద్దని హరీశ్ రావుకు అధికారులు సూచించారు. ఈ కేసులో త్వరలో మరోసారి హరీశ్ రావును విచారణకు పిలుస్తారని ప్రచారం జరుగుతున్న తరుణంలో అనూహ్యంగా కేటీఆర్కు నోటీసులు ఇవ్వడం కలకలం రేపుతోంది. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై 2024 మార్చి 10వ తేదీ నుంచి ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ చేస్తున్న విషయం తెలిసింది. ఇప్పటికే కొందరు నిందితులపై ప్రధాన అభియోగపత్రం దాఖలవగా.. ఈ కేసులో సిట్ దర్యాప్తు వేగం పెంచింది. రేపు కేటీఆర్ విచారణ అనంతరం జరిగే పరిణామాల తర్వాత సిట్ మరికొన్ని సంచలన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అవసరమైతే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్కు కూడా సిట్ నోటీసులు ఇచ్చే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఈ కేసులో పలువురిని సిట్ అరెస్ట్ చేసింది.
Also Read: BRS Party: రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయంతో గులాబీ పార్టీలో చీలిక?
కేటీఆర్, హరీశ్ రావుకు సిట్ నోటీసులు ఇవ్వడాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా తప్పుబడుతోంది. బొగ్గు కుంభకోణం నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి ఈ నోటీసులు అని కొట్టిపారేసింది. రాజకీయంగా ఎదుర్కోలేక అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ఇలాంటి విచారణల పేరుతూ బీఆర్ఎస్ పార్టీకి దెబ్బతీయాలని రేవంత్ రెడ్డి కుట్ర పన్నుతున్నాడని బీఆర్ఎస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. కాగా రేపు కేటీఆర్ విచారణపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Jharkhand Encounter 15 Maoists Dead: ఝార్ఖండ్లో నేడు భారీ ఎన్కౌంటర్ జరిగింది. సింగ్భూం జిల్లాలోని అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 15 మంది మావోయిస్టులు మృతి చెందారు. అయితే మృతుల సంఖ్య మరింత పెరగవచ్చని అధికారులు కూడా భావిస్తున్నారు. ప్రధానంగా ఈ మావోయిస్టు మృతుల్లో పతిరం మాంఝీ అలియాస్ అనల్ ఉన్నట్లు సమాచారం. అతనిపై ఆరు రాష్ట్రాలలో కేసులు, మొత్తం ఐదు కోట్ల రివార్డు కూడా ఉంది. కొన్నేళ్లుగా ఈయన కీలకంగా ఉన్నారు. భద్రతా బలగాలపై దాడులకు ఇతడే పథకం రచిస్తున్నట్లుగా సమాచారం. ఇక సింగ్భూం జిల్లాలో ఇంకా భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నట్లు సమాచారం.
ప్రధానంగా సరణ్ణా అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు, మావోల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో సీఆర్పీఎఫ్ కు చెందిన కొబ్రా బలగాలు కీలక పాత్ర పోషించాయి. వీళ్ళు ఎప్పటికప్పుడు నక్సల్స్ కదలికలపై నిఘా వేశారు. పక్కా సమాచారంతో భద్రత బలగాలు సరణ్ణా అటవీ ప్రాంతాల్లో సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న సమయంలో మావోలు కాల్పులకు తెగబడ్డారు. ఈ క్రమంలో భద్రతా బలగాలు కూడా ఎదురుకాల్పులకు దిగారు. ఇద్దరి మధ్య భారీ ఎన్కౌంటర్ జరుగుతోంది.
ఈ ప్రాంతంలో ఇంకా భారీ ఎత్తున సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. భద్రతా బలగాలు మావోల మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. ఇక ఆ ప్రాంతం నుంచి భారీ ఆయుధాలు, పేలుడు పదార్థాలు కూడా భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఎన్కౌంటర్ మావోలకు అతి పెద్ద దెబ్బ. ఝార్ఖండ్లో నక్సలిజంపై భద్రతా బలగాలు సాధించిన అతిపెద్ద విజయం అని కూడా అభివర్ణిస్తున్నారు.
ప్రధానంగా 2026 మార్చి నాటికి మావోయిస్టు రహితంగా మార్చాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఆపరేషన్ కగర్ ప్రారంభించింది. ఎక్కువగా ఈ మావోయిస్టులపై నిఘా పెంచిన సంగతి తెలిసిందే. ప్రధానంగా తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, ఛత్తీస్గఢ్ సహా మావో ప్రభావిత ప్రాంతాల్లో భద్రతా బలగాలు పెద్ద ఎత్తున సెర్చింగ్ నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఝార్ఖండ్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. మృతుల వివరాలు, ఆయుధాలు గురించి అధికారికంగా ఇంకా ప్రకటించాల్సి ఉంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో కూంబింగ్ కూడా నిర్వహిస్తున్నారు. చత్తీస్గఢ్లోని దండకారణ్యం అయితే పూర్తిగా భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. సరిహద్దు ప్రాంతాల్లో కూడా కూంబింగ్ తీవ్రతరం చేశారు. ఆపరేషన్ కగర్ లో భాగంగా ఇటీవల చత్తీస్గఢ్లో వరుస ఎన్ కౌంటర్లు కూడా కొనసాగుతున్నాయి. పలువురు మావోయిస్టులు కూడా మృతి చెందుతున్నారు.. అందులో కొందరు లొంగిపోతున్నారు.
Also Read: ఛీ.. ఇంత కరువులో ఉన్నావేంట్రా? ఎయిర్పోర్ట్లో చెకింగ్ పేరిట కొరియన్ యువతితో స్టాఫ్ పాడుపని..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Sun Transit 2026 Effect On Zodiac: ఫిబ్రవరిలో అనేక గ్రహాలు రాశుల్లో మార్పులు చేయబోతున్నాయి. ముఖ్యంగా కొన్ని ప్రధాన గ్రహాలు ఈ నెలలో రెండు నుంచి మూడు సార్లు కూడా సంచారం చేయబోతున్నాయి. సూర్యుడు ఈ సమయంలో మూడు సార్లు సంచారం చేయనుంది. మొదట ఫిబ్రవరి నెలలో 6వ తేదిన ధనిష్ఠ నక్షత్రంలోకి సూర్యుడు సంచారం చేస్తుంది. అలాగే ఫిబ్రవరి 13వ తేదిన శతభిష నక్షత్రంలో సూర్యుడు, ఫిబ్రవరి 19న మరో సారి మార్పు, ఇలా సూర్యుడు మొత్తం మూడు సార్లు సంచారం చేస్తుంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉండబోతోందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఆర్థికంగా కూడా ఈ సమయంలో అద్భుతమైన లాభాలు కలుగుతాయి.
ఈ రాశులవారికి బంఫర్ లాభాలు:
సింహ రాశి
సూర్యుడు మూడు సార్లు కదలికలు జరపడం వల్ల సింహ రాశివారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో ఊహించని స్థాయిలో విశ్వాసం కూడా పెరుగుతుంది. అంతేకాకుండా రాజకీయాలు, ఇతర సేవా రంగాల్లో ఉన్న వ్యక్తులకు అద్భుతమైన లాభాలు కూడా కలుగుతాయి. అంతేకాకుండా సమాజంలో గౌరవం కూడా రెట్టింపు అవుతుంది. పూర్వీకుల నుంచి ఆస్తులు కూడా పొందుతారు. చిన్న చిన్న సమస్యలకు పరిష్కారం కూడా దొరుకుతుది. ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది.
ధనుస్సు రాశి
సూర్యుడి సంచారంతో ధనుస్సు రాశివారికి ఈ సమయంలో ధైర్యం కూడా ఊహించని స్థాయిలో పెరుగుతుంది. అంతేకాకుండా బలం కూడా రెట్టింపు అవుతుంది. ఏ చిన్న నిర్ణయాలు తీసుకున్న జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు. అంతేకాకుండా అదృష్టం కూడా రెట్టింపు అవుతుంది. ముఖ్యంగా ఈ సమయంలో తోబుట్టువులతో సంబంధాలు మరింత మెరుగుపడతాయి. దీంతో పాటు ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. మానిసికంగా బలంగా తయారవుతారు.
మేషరాశి
సూర్యుడి సంచారంతో మేష రాశివారికి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. వీరికి ఈ సమయంలో అపారమైన లాభాలు కూడా కలుగుతాయి. దీంతో పాటు కొత్త ఆదాయ మార్గాలు కూడా పొందుతారు. దీంతో పాటు చాలా కాలంగా నిలిపోయిన డబ్బు కూడా తిరిగి పొందుతారు. దీంతో పాటు ఉద్యోగాలు చేసేవారికి మంచి పదోన్నతులు కూడా లభిస్తాయి. కొత్త కొత్త బాధ్యతలు కూడా లభించే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు సమాజంలో విలువ కూడా ఊహించని స్థాయిలో పెరుగుతుంది.
వృషభ రాశి
ఫిబ్రవరి నెలలో వృషభ రాశివారికి కెరీర్ పరంగా బోలెడు లాభాలు కలుగుతాయి. వీరికి పనులకు తగ్గ ప్రశంసలు కూడా కలుగుతాయి. దీంతో పాటు ఉన్నతాధికారుల నుంచి పూర్తి సపోర్ట్ కూడా లభిస్తుంది. అంతేకాకుండా ప్రభుత్వ ఉద్యోగాలు పొందాలనుకుంటున్న వ్యక్తులకు ఈ సమయంలో బోలెడు ప్రయోజనాలు కలుగుతాయి. సూర్యుడి ప్రభావంతో అనుకున్న ధనలాభాలు కూడా పొందుతారు. అలాగే ఈ సమయంలో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.
కుంభ రాశి
సూర్యుడి ప్రభావంతో శని పాలించే కుంభ రాశివారికి కూడా చాలా వరకు మేలు జరుగుతుంది. వీరికి వ్యక్తుత్వం మరింత బలపడుతుంది. అంతేకాకుండా ఎలాంటి నిర్ణయాలు తీసుకున్న అద్భుతమైన లాభాలు పొందుతారు. వ్యాపార భాగస్వాములకు ఈ సమయంలో బోలెడు ప్రయోజనాలు కలుగుతాయి. దీంతో పాటు కొత్త ప్రాజెక్ట్లు ప్రారంభించడం వల్ల మంచి లాభాలు పొందుతారు. భవిష్యత్తులో అనుకున్న పనులు కూడా ఇప్పుడే చేసే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.
Also Read: Mercury Transit 2026: మకరంలో తిష్ట వేసిన బుధుడు.. ఈ రాశుల వారికి కోటీశ్వరులయ్యే యోగం ప్రారంభం!

Also Read: Mercury Transit 2026: మకరంలో తిష్ట వేసిన బుధుడు.. ఈ రాశుల వారికి కోటీశ్వరులయ్యే యోగం ప్రారంభం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Moto G67 And Moto G77 Leak Features Telugu: ప్రముఖ స్మార్ట్ఫోన్ కంపెనీ మోటరోలా అద్భుతమైన సిరీస్ స్మార్ట్ఫోన్స్ను విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఇవి ప్రీమియం ఫీచర్స్తో లాంచ్ కాబోతున్నాయి. దీనిని కంపెనీ G-సిరీస్లో అందుబాటులోకి తీసుకు రాబోతోంది. ఇది మోటో G77తో పాటు మోటో G67 పేర్లతో లాంచ్ కాబోతోంది. ఇప్పటికే ఈ స్మార్ట్ఫోన్స్కి సంబంధించిన కొన్ని ఫీచర్స్ కూడా లీక్ అయ్యాయి. దీనిని బట్టి చూస్తే ఈ మొబైల్స్ అద్భుతమైన డిజైన్తో పాటు ప్రీమియం లుక్లో కనిపించబోతున్నాయి. అయితే, ఈ స్మార్ట్ఫోన్స్కి సంబంధించిన అన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Moto G67 స్మార్ట్ఫోన్కు సంబంధించిన లీక్ అయిన వివరాల ప్రకారం, ఇది 6.8-అంగుళాల ఎక్స్ట్రీమ్ AMOLED డిస్ప్లేతో అందుబాటులోకి రాబోతోంది. ముఖ్యంగా ఇది 1.5K రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్తో పాటు 5,000 నిట్స్ వరకు పీక్ బ్రైట్నెస్తో లాంచ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే సెక్యూరుటీ కోసం ఇందులో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటక్షన్ను కూడా అందిస్తోంది. దీంతో పాటు ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్తో లాంచ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే దీనిని కంపెనీ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్తో విడుదల చేయబోతోంది.
ఈ Moto G67 స్మార్ట్ఫోన్ Android 16-ఆధారిత ఆపరేటింగ్ సిస్టమ్పై పని చేస్తున్నట్లు లీక్ అయిన వివరాలు చెబుతున్నాయి.. అలాగే మోడల్ను బట్టి కనెక్టివిటీ ఫీచర్స్ను కూడా కలిగి ఉంటుంది. ఇందులో హైబ్రిడ్ డ్యూయల్-సిమ్తో పాటు 5G, Wi-Fi, బ్లూటూత్, NFC వంటి కనెక్టివిటీ ఫీచర్స్ను కూడా కలిగి ఉంటుంది.. ఇక దీని వెనక భాగంలో 50-మెగాపిక్సెల్ సోనీ LYT600 ప్రైమరీ కెమెరాతో లభిస్తోంది. అంతేకాకుండా 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా కూడా అందుబాటులో ఉంది.
ఈ స్మార్ట్ఫోన్ వీడియో కాలీంగ్ కోసం 32-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కూడా అందిస్తోంది. అంతేకాకుండా ఎంతో శక్తివంతమైన 5,200mAh బ్యాటరీతో 30W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో లాంచ్ కానుంది. ఇక Moto G77 స్మార్ట్ఫోన్ ఫీచర్స్ వివరాల్లోకి వెళితే.. ఇది 6.8-అంగుళాల ఎక్స్ట్రీమ్ AMOLED డిస్ప్లేతో లాంచ్ కాబోతోంది. అలాగే 5,000 నిట్ల వరకు గరిష్ట బ్రైట్నెస్ సపోర్ట్ను కూడా కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
ఇది ప్రత్యేకమైన కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటక్షన్ ఫీచర్ను కూడా కలిగి ఉంటుంది. అలాగే ఇందులో డాల్బీ అట్మోస్ మద్దతుతో స్టీరియో స్పీకర్లు కూడా లభిస్తున్నాయి. ఇందులో ప్రత్యేకంగా 100-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా కూడా అందుబాటులో ఉంది. దీంతో పాటు అదనంగా 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా లభిస్తోంది. వీడియో కాలింగ్ కోసం ఇందులో 32-మెగాపిక్సెల్ కెమెరా కూడా అందుబాటులో ఉంది. ఇవేకాకుండా లీక్ అయిన వివరాల్లో ఎన్నో రకాల ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి. అలాగే కంపెనీ కూడా అతి త్వరలోనే ఈ రెండు మోడల్స్ను త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Samsung Galaxy S26 Ultra Launch Date: దక్షిణ కొరియా స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ సాంసంగ్ మార్కెట్లోకి త్వరలో అద్భుతమైన స్మార్ట్ఫోన్ సిరీస్ను విడుదల చేయబోతోంది. సాంసంగ్ గెలాక్సీ ఎస్ 26 సిరీస్లో అందుబాటులోకి తీసుకు రాబోతోంది. ఈ సిరీస్లో భాగంగా కంపెనీ మూడు మొబైల్స్ మోడల్స్ను అందుబాటులోకి తీసుకు రాబోతోంది. ఇందులో భాగంగా గెలాక్సీ ఎస్ 26, గెలాక్సీ ఎస్ 26 ప్లస్తో పాటు గెలాక్సీ ఎస్ 26 అల్ట్రా స్మార్ట్ఫోన్స్ మోడల్స్ కూడా అందుబాటులోకి రాబోతున్నాయి. అయితే, ఈ స్మార్ట్ఫోన్కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఈ Samsung Galaxy S26 Ultra స్మార్ట్ఫోన్కు సంబంధించిన వివరాలు ఇప్పటికే సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. టిప్స్టర్ ఇవాన్ బ్లాస్ తెలిపిన వివరాల ప్రకారం, ఈ మొబైల్ ఏడు కలర్ ఆప్షన్స్లో అందుబాటులోకి రాబోతోంది. ఈ సిరీస్ను కంపెనీ వైట్, స్కై బ్లూ, కోబాల్ట్ వైలెట్, పింక్ గోల్డ్, సిల్వర్ షాడోతో పాటు బ్లాక్ వంటి కలర్స్తో లాంచ్ చేయబోతోంది. Samsung వెబ్సైట్లో ఈ స్మార్ట్ఫోన్స్కి సంబంధించిన మూడు కలర్స్ను ఇప్పటికే అందుబాటులో ఉంచింది.
ఈ Samsung Galaxy S26 సిరీస్ను కంపెనీ వచ్చే నెలలో విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, కంపెనీ ఇప్పటికీ ఈ మొబైల్కి సంబంధించిన అధికారిక ప్రకటన వెల్లడించలేదు. కానీ ఇటీవలే లీక్ అయిన వివరాల ప్రకారం, ఈ Samsung Galaxy S26 సిరీస్ ఫిబ్రవరి 25న లాంచ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ స్మార్ట్ఫోన్స్కి సంబంధించిన ధరలను వివరాలను అందుబాటులోకి తీసుకువచ్చిన తర్వాత లాంచ్ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఇప్పటికే ఈ సిరీస్కి సంబంధించిన ధరలు కూడా లీక్ అయ్యాయి.
సాంసంగ్ కంపెనీ ఈ సిరీస్ను గెలాక్సీ అన్ప్యాక్డ్ ఈవెంట్లో భాగంగా అందుబాటులోకి తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, కొంతమంది టెక్ నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ ఈవెంట్ కూడా ఒక నెల ఆలస్యం అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఈ మొబైల్స్ను కంపెనీ దక్షిణ కొరియాతో సహా కొన్ని మార్కెట్లలో విడుదల చేయబోయే మొబైల్స్ను 2 nm Exynos 2600 చిప్సెట్ ప్రాసెసర్తో అందుబాటులోకి తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక ఇతర మార్కెట్లో విడుదల చేసే మోడల్స్ స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 చిప్సెట్తో లాంచ్ చేసే ఛాన్స్లు ఉన్నాయి. దీనిని కంపెనీ భారతదేశ మార్కెట్లోకి కూడా త్వరలోనే లాంచ్ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook