మధిరలో సబ్ కోర్టు నిర్మాణానికి శంకుస్థాపన
Khammam, Telangana:ఖమ్మం జిల్లా మధిరలో నూతనంగా మంజూరైనా సబ్ కోర్టు(సీనియర్ సివిల్ జడ్జి కోర్టు) భవన నిర్మాణానికి హైకోర్టు జడ్జిలు జస్టిస్ శ్రీ సుధ,కాజ శరత్,భీమపాక నగేష్ లు భూమి పూజచేశారు. అనంతరం తాత్కాలిక భవనంలో ఏర్పాటు చేసిన సబ్ కోర్టు ను హైకోర్టు జడ్జిలు ప్రారంభించారు. ప్రజలకు న్యాయ సేవలు విసృతపరచడం కోసం నూతన కోర్టులకు శ్రీకారం చుట్టినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్జితో పాటు మధిర న్యాయవాదులు పాల్గొన్నారు.हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
CSK vs PBKS: చెన్నై వరుసగా రెండో ఓటమి.. అద్భుత ప్రదర్శనతో పంజాబ్ కింగ్స్ రెండో విజయం
Chennai, Tamil Nadu:PBKS Beat CSK By 5 Wickets: ఆటగాళ్లు మారారు.. వ్యూహం మారింది.. ఇక సత్తా చాటుతుందనుకుంటే మళ్లీ చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అదే పేలవ ప్రదర్శన కొనసాగిస్తోంది. సొంత గడ్డపైనే మరో పరాజయాన్ని చవిచూసింది. పంజాబ్ కింగ్స్ అద్భుతంగా ఆడి మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. విజయం కోసం పోరాడినా కూడా పరాజయం నుంచి చెన్నై తప్పించుకోలేకపోయింది. 5 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్ విజయాన్ని ఖాతాలో వేసుకుని ఈ సీజన్లో ముందడుగు వేసింది.
Also Read: Sunrisers Hyderabad: సన్ రైజర్స్కు సొంత గడ్డపై భారీ షాక్.. ఆఫీస్ ముందు తెలంగాణ క్రికెటర్ల ధర్నా
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి 209 పరుగులు చేసింది. సంజూ శామ్సన్ 7 పరుగులతో మళ్లీ నిరాశపర్చగా.. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 28 పరుగులతో పర్వాలేదనిపించాడు. యువ బ్యాటర్ ఆయుశ్ మాత్రే బ్యాట్తో దుమ్మురేపాడు. 43 బంతుల్లో 73 పరుగులు చేసి సంచలన ప్రదర్శన కనబర్చాడు. 6 ఫోర్లు, 5 సిక్సర్లతో చెలరేగి ఆడాడు. శివమ్ దూబే 27 బంతుల్లో 45 పరుగులు (నాటౌట్) చేసి కొద్దిలో అర్ధ సెంచరీ కోల్పోయాడు. కార్తీక్ శర్మ ఒక పరుగే చేయగా.. సర్ఫరాజ్ ఖాన్ 32 పరుగులతో రాణించాడు. పంజాబ్ బౌలర్లు పరుగులను నియంత్రిస్తూనే వికెట్లు తీశారు. విజయ్ కుమార్ వైశాఖ్ 2 వికెట్లు తీయగా.. బార్ట్లెట్, మార్కో జేన్సన్, యుజువేంద్ర చాహల్ తలా ఒక్కో వికెట్ పడగొట్టారు.
Also Read: Salary Hike: ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలో శుభవార్త.. ఇదే జరిగితే పర్స్ ఫుల్
చెన్నై విధించిన లక్ష్యాన్ని 18.4 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి పంజాబ్ కింగ్స్ ఛేదించింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 29 బంతుల్లో అర్ధ సెంచరీ నమోదు చేయగా.. ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన ప్రియాన్ష్ ఆర్య 11 బంతుల్లో 39 పరుగులు చేసి తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు. 34 బంతుల్లో 43 పరుగులు చేసి దూకుడుగా ఉన్న సమయంలో ప్రభుసిమ్రాన్ సింగ్ రనౌటయ్యాడు. తొటి బ్యాటర్తో సమన్వయం లేక రనౌట్గా వెనుదిరిగాడు. గత మ్యాచ్లో అదరగొట్టిన కూపర్ కన్నోల్లీ 36 పరుగులతో రాణించగా.. నేహాల్ వదేరా 10 పరుగులు చేశాడు. శశాంక్ సింగ్ 14 పరుగులు నమోదు చేయగా.. మార్కస్ స్టోయినీస్ 9 పరుగులు చేసి విజయంతో ముగించాడు. గెలుపు కోసం చెన్నై బౌలర్లు ఏమాత్రం శ్రమించలేకపోయారు. తొలి ఓవర్ నుంచి బ్యాటర్లను నిలువరించలేకపోయారు. మ్యాట్ హెన్రీ, అన్షుల్ కంబోజ్ రెండేసి వికెట్లు తీయగా మిగతా బౌలర్లు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు.
Also Read: Pakistan Petrol Price: పాకిస్థాన్లో లీటర్ పెట్రోల్, డీజిల్ ఎంతో తెలుసా?
టాప్కు.. డౌన్కు
ఈ మ్యాచ్ ఫలితం ఐపీఎల్ పాయింట్లలో భారీ మార్పులు వచ్చాయి. రెండో విజయంతో పంజాబ్ కింగ్స్ పాయింట్ల పట్టికలో తొలి స్థానానికి దూసుకెళ్లగా.. రెండో ఓటమితో చెన్నై సూపర్ కింగ్స్ పాయింట్ల పట్టికలో ఆఖరు స్థానానికి పడిపోయింది. పంజాబ్ కింగ్స్ విజయంపై కాకుండా చెన్నై ఓటమిపై మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఒకప్పటి గొప్ప జట్టు గత సీజన్తోపాటు తాజా సీజన్లో ఇంతటి పేలవ ప్రదర్శన చేయడం చెన్నై అభిమానులను నిరాశకు గురి చేస్తోంది. అయితే ధోనీ నాయకత్వం లేకపోవడంతో చెన్నై వరుసగా ఓటమిపాలవుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Delhi NCR Earthquake: రాజధాని ఢిల్లీలో భారీ భూకంపం..ఉత్తర భారతంలో గజగజ వణికిన ఐదు రాష్ట్రాలు..పారిపోయిన జనం!
Gurugram, Haryana:Delhi NCR Earthquake News: శుక్రవారం రాత్రి (ఏప్రిల్ 3) ఢిల్లీ-ఎన్సిఆర్లో భూకంపం సంభవించింది. ఉత్తర భారతదేశంలో జమ్మూ కాశ్మీర్తో సహా అనేక రాష్ట్రాల్లో భూమి కంపించింది. పంజాబ్, రాజస్థాన్, చండీగఢ్లలో కూడా భూ ప్రకంపనలు సంభవించినట్లు తెలిసింది. ఇప్పటివరకు ఎలాంటి నష్టం జరిగినట్లు సమాచారం లేదు.
అయితే ఈ భూకంప కేంద్రం ఆఫ్ఘనిస్తాన్లోని హిందూ కుష్ పర్వతాలలో ఉంది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.9గా నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. జమ్మూ కాశ్మీర్లోని కొన్ని ప్రాంతాలలో సుమారు 10 నుండి 15 సెకన్ల పాటు ప్రకంపనలు వచ్చినట్లు తెలిసింది. అయితే భూకంపం కారణంగా భయపడిన ప్రజలు ఇళ్లలోనుంచి బయటకు పారిపోయినట్లు సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యింది.
భారత్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, తజికిస్తాన్ అనే నాలుగు దేశాల్లో భూకంప ప్రకంపనలు సంభవించినట్లు తెలుస్తోంది. ఈ భూకంప కేంద్రం ఆఫ్ఘనిస్తాన్లోని హిందూకుష్ ప్రాంతంలో ఉంది. అలాగే జమ్మూ కాశ్మీర్, భారత్ రాజధాని న్యూఢిల్లీ, పంజాబ్, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో కూడా ప్రకంపనలు సంభవించాయి. శుక్రవారం రాత్రి సమయంలో ఆఫ్ఘనిస్తాన్-తజికిస్తాన్ సరిహద్దు ప్రాంతంలో రిక్టర్ స్కేల్పై 5.9 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు అధికారులు స్పష్టం చేశారు. దీని ప్రకంపనలు జమ్మూ కాశ్మీర్తో సహా ఉత్తర భారతంతో అనేక ప్రాంతాల్లో సంభవించాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
KKR vs SRH: కేకేఆర్కు రెండో ఓటమి.. 46 పరుగుల తేడాతో హైదరాబాద్ భారీ విజయం
Kolkata, West Bengal:KKR vs SRH Highlights: ఆల్ రౌండ్ ప్రదర్శనతో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు అదరగొట్టింది. బ్యాటర్లు దుమ్మురేపగా.. బౌలర్లు బంతులతో చెలరేగి కలకత్తా నైట్రైడర్స్ జట్టును చిత్తు చేశారు. తొలి మ్యాచ్లో డిఫెండింగ్ చాంపియన్ ఆర్సీబీ చేతిలో ఓడిపోయిన సన్రైజర్స్ రెండో మ్యాచ్కు గొప్పగా పుంజుకుని ఆడి మ్యాచ్ను సొంతం చేసుకుంది. కలకత్తాపై 65 పరుగుల భారీ తేడాతో సన్రైజర్స్ విజయం సాధించింది. అన్నింటిలో విఫలమైన కలకత్తా రెండో ఓటమిని చవిచూసింది.
Also Read: Harsha Veena: బ్రేకింగ్.. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలిపై జనసేన పార్టీ దాడి
ఐపీఎల్ 2026 సీజన్లో ఆరో మ్యాచ్ కలకత్తాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరగ్గా.. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు 8 వికెట్లు కోల్పోయి 226 పరుగులు చేసింది. భారీ లక్ష్యాన్ని ఛేదించలేక కలకత్తా జట్టు 16 ఓవర్లలోనే 161కి కుప్పకూలిపోయింది. సన్రైజర్స్ బ్యాటర్లు, బౌలర్లు అద్భుతంగా ఆడడంతో కలకత్తాను సునాయాసంగా ఓడించారు. ఆడిన రెండు మ్యాచ్ల్లో ఒక ఓటమి.. విజయంతో సన్రైజర్స్ ఉండగా.. కలకత్తా జట్టు మాత్రం ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ ఓటమిని చవిచూసింది.
Also Read: Chandrababu: అమరావతి అన్స్టాపబుల్.. ఇక రాజధానిపై ఎవరూ ఏం చేయలేరు: సీఎం చంద్రబాబు
తొలుత బ్యాటింగ్కు దిగిన సన్రైజర్స్ అద్భుతంగా ఆడి 226 పరుగులు సాధించింది. తొలి ఓవర్ నుంచి ఓపెనర్లు తుఫాన్ ఇన్నింగ్స్ ఆడడంతో పవర్ ప్లే ముగిసేసరికి స్కోర్ 80 పరుగులు దాటింది. పదో ఓవర్ వచ్చేసరికి సన్రైజర్స్కు కష్టాలు మొదలయ్యాయి. ఒక్క బ్యాటర్ కూడా భారీ హిట్టింగ్ చేయలేకపోయారు. అందరూ ఔటవుతున్న వేళ క్లాసెన్ అద్భుతంగా ఆడి జట్టుకు భారీ పరుగులు అందించాడు. 35 బంతుల్లో 52 పరుగులు చేయగా... వాటిలో నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్ ఉంది. అంతకుముందు ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ భారీ హిట్టింగ్లతో శుభారంభం చేశారు. హెడ్ 21 బంతుల్లో 46 చేసి 6 ఫోర్లు, 3 సిక్సర్లు బాదితే.. అభిషేక్ శర్మ 21 బంతుల్లో 48 చేసి కొద్దిలో అర్ధ శతకాన్ని కోల్పోయాడు. కెప్టెన్ ఇషాన్ కిషన్ 14 పరుగులు మాత్రమే చేయగా. అనికేత్ వర్మ ఒక్క పరుగుకే ఔటయ్యాడు. అనంతరం నితీశ్ కుమార్ 39 పరుగులతో విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. హర్ష్ దూబే (9), శివాంగ్ కుమార్ (4) కొన్ని పరుగులు జోడించారు. కలకత్తా బౌలర్లు పవర్ప్లేతోపాటు కొన్ని ఓవర్లు బ్యాటర్లకు అనుకూలంగా వేయగా.. తర్వాత తేరుకుని బ్యాటర్లను బంతికి దొరకబుచ్చుకుని మైదానం నుంచి పంపించారు. బ్లెస్సింగ్ ముజరబానీ 4 వికెట్లతో దుమ్మురేపగా.. వైభవ్ అరోరా రెండు, కార్తీక్ త్యాగి, అనుకూల్ రాయ్ తలా ఒక్కో వికెట్ తీశారు.
భారీ లక్ష్యాన్ని ఛేదనకు దిగిన కలకత్తా నైట్రైడర్స్ బ్యాటర్లు టపాటపా వికెట్లు కోల్పోయి 161 పరుగులకు మ్యాచ్ను 16 ఓవర్లలోనే ముగించారు. అంగ్క్రిష్ రఘువంశీ 29 బంతుల్లో 52 పరుగులు చేసి జట్టు విజయానికి మార్గం చూపించాడు. కెప్టెన్ అజింక్యా రహనే 8 పరుగులకే ఔటవగా.. ఫిన్ అలెన్ 28 పరుగులతో రాణించాడు. గ్రీన్ రెండు పరుగులకే ఔటయిన పరిస్థితుల్లో మిగతా బ్యాటర్లు కూడా అదే మార్గంలో నడించారు. రింకూ సింగ్ 35 పరుగులతో రాణించగా.. అనుకూల్ రాయ్ డకౌట్ అయ్యాడు. బ్యాటర్లు చేసిన భారీ స్కోర్ను ప్రత్యర్థి బ్యాటర్లు చేయలేక సన్రైజర్స్ బౌలర్లు పటిష్టంగా బంతులు వేశారు. ఈసారి బౌలర్లకు మంచి అవకాశాలు లభించడంతో వారు రెచ్చిపోతున్నారు. ఈ విజయంతో సన్రైజర్స్ పైకి దూసుకెళ్లగా.. కలకత్తా రెండో ఓటమితో తీవ్ర దిగాలుగా పట్టికలో ఆఖరు స్థానంలో నిలిచారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Salary Hike: ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలో శుభవార్త.. ఇదే జరిగితే పర్స్ ఫుల్
Wadgaon, Maharashtra:Salary Likely Hike 34 Percent: ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్దారులు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా తమ వేతనాలు పెరగాలని ఆశిస్తున్నారు. ఆదాయం పెరగకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఉద్యోగ వర్గాలు 8వ వేతన సంఘం కోసం ఎన్నో ఆశలతో ఎదురుచూస్తున్నారు. వేతనాలు, పింఛన్లు భారీగా పెరుగుతాయని ఆశిస్తున్న వారికి కొంత ఊరట లభించే విషయం తెలిసిందే. 8వ వేతన సంఘం ఫిట్మెంట్ ఫ్యాక్టర్పై వార్తలు వెలువడుతున్నాయి. ఉద్యోగ వర్గాల్లో జరుగుతున్న చర్చ ప్రకారం భారీగా జీతాల పెంపు ఉంటుందని తెలుస్తోంది.
Also Read: Pakistan Petrol Price: పాకిస్థాన్లో లీటర్ పెట్రోల్, డీజిల్ ఎంతో తెలుసా?
8వ వేతన సంఘంలో ఫిట్మెంట్ ఫ్యాక్టర్ కీలకంగా ఉంది. ఆ ఫిట్మెంట్ ఫ్యాక్టర్తో జీతం భారీగా పెరుగుతుందని చర్చ జరుగుతోంది. ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 2.57 ఉంటే దానికి అనుగుణంగా జీతాల పెంపు 34 శాతం పెరుగుతాయని తెలుస్తోంది. ఆ మేరకు వేతన సంఘం సిఫార్సు చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ అదే జరిగితే 2026 జనవరి 1 నుంచి 49 లక్షల మంది ఉద్యోగులు, 68 లక్షల మంది పెన్షనర్ల జీతాలు, పెన్షన్లు సుమారు 34 శాతం పెరగవచ్చు.
Also Read: Traffic Alert: వాహనదారులకు అలర్ట్.. ఎల్లుండి జూబ్లీహిల్స్ ప్రధాన రోడ్డు క్లోజ్
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్దారుల కోసం 7వ వేతన సంఘం స్థానంలో 8వ వేతన సంఘం అమలులోకి వస్తుంది. రాబోయే 8వ వేతన సంఘం దాదాపు 49 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, 68 లక్షల పెన్షనర్లకు భారీ ఆర్థిక ప్రయోజనం లభించనుంది. కొత్త వేతన సంఘం 2.57 ఫిట్మెంట్ ఫ్యాక్టర్ను పరిగణనలోకి తీసుకుంటోంది. దీంతో జీతాలు, పెన్షన్లలో గణనీయమైన పెరుగుదల ఉండవచ్చని ఆశిస్తున్నారు.
ప్రభుత్వ ఉద్యోగుల మూల వేతనాన్ని సవరించడానికి ఉపయోగించే కీలక గుణకం ఫిట్మెంట్ ఫ్యాక్టర్. దీనికి ఆమోదం లభిస్తే మొత్తం జీతం, అలవెన్సులలో సగటున సుమారు 34 శాతం పెరుగుదల ఉంటుందని వార్తలు వస్తున్నాయి. ఇది ఉద్యోగులతోపాటు పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు కూడా ఉపశమనం లభిస్తుంది.
Also Read: KKR vs SRH: కేకేఆర్కు రెండో ఓటమి.. 46 పరుగుల తేడాతో హైదరాబాద్ భారీ విజయం
జీతం పెరుగుదల ఎంత?
ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అనేది ఇప్పటికే ఉన్న బేసిక్ పేనును నేరుగా గుణిస్తుంది
ప్రస్తుత మూల వేతనం రూ.18,000 ఉందని అనుకుంటే 2.57 ఫిట్మెంట్ ఫ్యాక్టర్తో కొత్త మూల వేతనం = రూ.18,000 × 2.57 = రూ.46,260 అవుతుంది. దీని అర్థం మూల వేతనంలో గణనీయమైన పెరుగుదల జరుగుతుంది. డీఏ, హెచ్ఆర్ఏ వంటి అలవెన్సులు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Nithin Kamath: మార్కెట్ మునిగిపోకముందే మేల్కోండి.. యుద్ధం వస్తే ఇన్వెస్టర్ల గతి ఏంటి? ఇన్వెస్టర్లకు జెరోధా బాస్ వార్నింగ్..!!
Lakshmapur, Telangana:How to Protect Portfolio during War: ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్లు యుద్ధ మేఘాల నీడలో ఉన్నాయి. ముఖ్యంగా అమెరికా-ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు.. ఆకాశాన్నంటుతున్న ముడి చమురు ధరలు ఇన్వెస్టర్లకు కంటి మీద కనుకు లేకుండా చేస్తున్నాయి. ఇప్పటికే నిఫ్టీ 10 శాతం మేర పతనమై.. అనేక మంది పోర్ట్ఫోలియోలు ఎరుపు రంగులోకి మారిపోయాయి. ఇలాంటి క్లిష్ట సమయంలో నితిన్ కామత్ తన ఎక్స్ వేదికగా ఇన్వెస్టర్లకు ఒక ముఖ్యమైన హెచ్చరికతో కూడిన సలహాను ఇచ్చారు.
99 శాతం మంది చేసే పొరపాటు ఇదే:
చాలా మంది ఇన్వెస్టర్లు ఏదో ఒక రంగం ఉదాహరణకు ఐటీ లేదా ఫార్మా బాగా లాభాలను ఇస్తుందని భావించి, తమ వద్ద ఉన్న డబ్బునంతా అందులోనే పెట్టుబడి పెడతారు. మార్కెట్ అనుకూలంగా ఉన్నప్పుడు ఇది బాగానే ఉన్నా.. పరిస్థితులు మారినప్పుడు ఆ ఒక్క సెక్టార్ పడిపోతే మొత్తం పెట్టుబడి ఆవిరైపోతుంది. 99 శాతం మంది పెట్టుబడిదారులు ఏ ఆస్తి ఏ సమయంలో బాగా పనిచేస్తుందో ఖచ్చితంగా ఊహించలేరు అని నితిన్ కామత్ స్పష్టం చేశారు. అందుకే ఒకే గుర్రం మీద పందెం కాయడం ప్రమాదకరమని ఆయన హెచ్చరించారు.
నిజమైన వైవిధ్యీకరణ అంటే ఏమిటి?
చాలా మంది ఐదు వేర్వేరు కంపెనీల షేర్లు కొంటే డైవర్సిఫికేషన్ అనుకుంటారు. కానీ అది నిజం కాదు. నితిన్ కామత్ ప్రకారం, నిజమైన వైవిధ్యం అంటే మీ పెట్టుబడులను కేవలం స్టాక్ మార్కెట్కే పరిమితం చేయకుండా వివిధ ఆస్తుల మధ్య పంపిణీ చేయడం.
బంగారం : యుద్ధం లేదా ఆర్థిక మాంద్యం వంటి సమయాల్లో షేర్లు పడిపోయినా, బంగారం ధరలు పెరిగి మీ నష్టాన్ని భర్తీ చేస్తాయి.
బాండ్లు : ప్రభుత్వ బాండ్లు స్థిరమైన రాబడినిస్తూ మీ పోర్ట్ఫోలియోకు రక్షణగా నిలుస్తాయి.
విభిన్న రంగాలు: షేర్లలో కూడా కేవలం ఒక్క రంగంపైనే కాకుండా బ్యాంకింగ్, ఆటోమొబైల్, ఐటీ వంటి విభిన్న రంగాల్లో పెట్టుబడులు పెట్టాలి.
ఇన్వెస్టర్లు నేర్చుకోవాల్సిన పాఠం:
నితిన్ కామత్ తన సహోద్యోగి పోర్ట్ఫోలియోను ఉదాహరణగా చూపుతూ.. ఎవరైతే తమ పెట్టుబడులను సమతుల్యంగా పంచుకుంటారో, వారే దీర్ఘకాలంలో మార్కెట్ ఇండెక్స్ కంటే ఎక్కువ లాభాలను ఆర్జిస్తారని చెప్పారు. ప్రస్తుతం మార్కెట్ అనిశ్చితిగా ఉన్న సమయంలో కొత్త ఇన్వెస్టర్లు తొందరపడి ఒక్క థీమ్ వెంట పడకూడదు.
యుద్ధం వంటి విపత్కర పరిస్థితులు తలెత్తినప్పుడు మార్కెట్ ఏ దిశగా వెళ్తుందో ఎవరూ ఊహించలేరు. కానీ.. మీ ఆర్థిక పునాది కదలకుండా ఉండాలంటే వైవిధ్యీకరణే ఏకైక మార్గం. అన్నీ ఒకే చోట పెట్టకుండా, తెలివిగా పంపిణీ చేస్తేనే ఈ యుద్ధ భూమిలో ఇన్వెస్టర్లు విజేతలుగా నిలుస్తారని చెబుతున్నారు.
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. దయచేసి దీన్ని పెట్టుబడి, ఆర్థిక లేదా వ్యాపార సలహాగా భావించవద్దు. గుర్తుంచుకోండి స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టోకరెన్సీలు, రియల్ ఎస్టేట్, విలువైన లోహాలు వంటి అన్ని రకాల పెట్టుబడులు మార్కెట్ ఆటు పోటులు రిస్కులకు లోబడి ఉంటాయి. దీని అర్థం, మీరు లాభపడవచ్చు లేదా నష్టపోవచ్చు. మీరు తీసుకునే ఎలాంటి పెట్టుబడి నిర్ణయాలు లేదా వ్యాపార కార్యకలాపాల వల్ల కలిగే నష్టాలు లేదా లాభాలకు మా సంస్థ జీ తెలుగు వెబ్ పోర్టల్ ఎట్టి పరిస్థితుల్లోనూ బాధ్యత వహించదు. ఏదైనా ఆర్థిక నిర్ణయం తీసుకునే ముందు, తప్పకుండా ఒక రిజిస్టర్డ్ లేదా సర్టిఫైడ్ ఆర్థిక నిపుణుడిని సంప్రదించి, వారి సలహా తీసుకోమని పాఠకులకు సిఫార్సు చేస్తున్నాము.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
CBSE New Curriculum: సీబీఎస్ఈ విద్యా వ్యవస్థలో పెను మార్పులు.. ఇకపై 3 భాషలు చదవాల్సిందే..విద్యార్థులపై పెరగనున్న ఒత్తిడి?
Lakshmapur, Telangana:CBSE New Curriculum 2026-27: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. 2026-27 విద్య సంవత్సరం నుంచి బోర్డు విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టబోతోంది. విద్యార్థులపై చదువుల భారాన్ని తగ్గించి.. వారిని గ్లోబల్ స్థాయిలో పోటీ పడేలా తీర్చిదిద్దడమే లక్ష్యంగా సీబీఎస్ఈ చైర్మన్ రాహుల్ సింగ్ ఈ కొత్త ప్రణాళికలను వెల్లడించారు. కేవలం అకడమిక్ మార్కులే కాకుండా.. విద్యార్థి ప్రవర్తన, ఆసక్తులు, ఇతర కళలను కూడా ఈ కొత్త విధానం గుర్తిస్తుంది.
1. మూడు భాషల ఫార్ములా:
ఇప్పటివరకు 9, 10 తరగతుల్లో విద్యార్థులు కేవలం రెండు భాషలను మాత్రమే చదువుతున్నారు. కానీ ఇకపై మూడు భాషలు తప్పనిసరి చేసింది. ఇందులో మరో కీలకమైన విషయం ఏంటంటే.. ఆ మూడింటిలో కనీసం రెండు భాషలు ఖచ్చితంగా భారతీయ భాషలై ఉండాలి. మన దేశంలోని భాషా వైవిధ్యాన్ని గౌరవించడంతో పాటు, విద్యార్థులు తమ సాంస్కృతిక మూలాలను మర్చిపోకుండా ఉండాలనేది బోర్డు ఉద్దేశమని పేర్కొంది.
2. సైన్స్లోనూ 'బేసిక్ - స్టాండర్డ్' ఆప్షన్:
గణితం అంటే భయపడే విద్యార్థుల కోసం ఇప్పటికే మ్యాథ్స్లో రెండు స్థాయిల విధానం ఉంది. ఇప్పుడు అదే ఫార్ములాను సైన్స్కు కూడా వర్తింపజేయనున్నారు. భవిష్యత్తులో డాక్టర్లు లేదా ఇంజనీర్లు కావాలనుకోని వారు.. సైన్స్ను ఒక భారంగా కాకుండా సులభతరమైన స్థాయిలో చదువుకోవచ్చు. దీనివల్ల అనవసరమైన మానసిక ఒత్తిడి తగ్గుతుంది.
3. 'అడ్వాన్స్డ్' లెవల్:
ఒక సబ్జెక్టుపై ప్రత్యేక ఆసక్తి ఉన్న విద్యార్థుల కోసం అడ్వాన్స్డ్ లెవల్ ను ప్రవేశపెడుతున్నారు. ఉదాహరణకు.. ఒక విద్యార్థికి మ్యాథ్స్ అంటే ఇష్టమైతే, వారు సాధారణ సిలబస్తో పాటు అడ్వాన్స్డ్ లెవల్ను ఎంచుకోవచ్చు. వీరు వార్షిక పరీక్షలతో పాటు 25 మార్కులకు ప్రత్యేక పరీక్ష రాస్తారు. ఇందులో పాస్ అయితే మార్క్ షీట్లో ప్రత్యేకంగా ఆ ప్రతిభను పొందుపరుస్తారు. ఒకవేళ ఫెయిల్ అయినా సరే.. దాని ప్రభావం మెయిన్ మార్కులపై పడదు. ఇది విద్యార్థులు కొత్త సవాళ్లను స్వీకరించేలా ప్రోత్సహిస్తుంది.
4. క్రెడిట్ సిస్టమ్:
ఉన్నత విద్యలో ఉండే క్రెడిట్ సిస్టమ్ ఇక పాఠశాల స్థాయి నుంచే మొదలవుతుంది. విద్యార్థి ఏడాదిలో ఎన్ని గంటలు చదువుకు వెచ్చించారనే దానిపై ఈ క్రెడిట్లు ఇస్తారు.నేషనల్ క్రెడిట్ ఫ్రేమ్వర్క్ (NCrF) ప్రకారం, ఏడాదికి 1200 గంటల అభ్యాస సమయం వెచ్చిస్తే 40 క్రెడిట్లు లభిస్తాయి. ఇందులో కేవలం క్లాస్ రూమ్ చదువులే కాకుండా యోగా, స్పోర్ట్స్, సంగీతం, సామాజిక సేవ వంటివి కూడా భాగమవుతాయి. అంటే చదువుతో పాటు ఆటపాటల్లో రాణించినా మీకు క్రెడిట్లు వస్తాయి.
5. 10 సబ్జెక్టులు.. తగ్గిన భారం:
కొత్త నిబంధనల ప్రకారం విద్యార్థులు మొత్తం 10 సబ్జెక్టులు (7 కోర్ సబ్జెక్టులు + 3 భాషలు) చదవాల్సి ఉంటుంది. సబ్జెక్టుల సంఖ్య పెరిగినప్పటికీ, సిలబస్ను తగ్గించి అనుభవపూర్వక అభ్యాసం (Experiential Learning) ద్వారా పాఠాలు అర్థమయ్యేలా చేస్తామని బోర్డు హామీ ఇచ్చింది.
మరిన్ని కీలక మార్పులు:
రెండుసార్లు బోర్డు పరీక్షలు: విద్యార్థులు తమ మార్కులను మెరుగుపరుచుకోవడానికి వీలుగా ఏడాదికి రెండుసార్లు పరీక్షలు నిర్వహించే ఆలోచనలో బోర్డు ఉంది.
సిలబస్ మార్పు: ప్రయోగాత్మక విద్యకు పెద్దపీట వేస్తూ పాఠ్యప్రణాళికను రూపొందిస్తున్నారు.
సీబీఎస్ఈ తీసుకువస్తున్న ఈ మార్పులు విద్యార్థులను కేవలం పరీక్షల యంత్రాలుగా కాకుండా, అన్ని రంగాల్లో రాణించేలా తీర్చిదిద్దుతాయని విద్యావేత్తలు భావిస్తున్నారు. వచ్చే ఏడాది 9వ తరగతిలోకి అడుగుపెట్టే విద్యార్థులు ఈ సరికొత్త విద్యా ప్రయాణానికి సిద్ధంగా ఉండాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
Traffic Alert: వాహనదారులకు అలర్ట్.. ఎల్లుండి జూబ్లీహిల్స్ ప్రధాన రోడ్డు క్లోజ్
Hyderabad, Telangana:Jubilee Hills Traffic Diversion: హైదరాబాద్లో వాహనదారులకు భారీ అలర్ట్. ప్రధాన ప్రాంతం జూబ్లీహిల్స్లో కీలకమైన రహదారిని మూసివేస్తున్నట్లు పోలీస్ శాఖ ప్రకటించింది. స్టీల్ బ్రిడ్జ్ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రయోగాత్మకంగా ఒకవైపు రోడ్డు మూసివేసి.. వనే వేలోనే రాకపోకలకు అనుమతిస్తున్నట్లు ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. కేబీఆర్ పార్క్ మార్గంలో పలు మార్గాల్లో రోడ్డు మళ్లింపు ఉంటుందని.. మూడు గంటల పాటు రోడ్డు మూసివేస్తున్నట్లు పోలీసులు వివరించారు.
Also Read: KKR vs SRH: కేకేఆర్కు రెండో ఓటమి.. 46 పరుగుల తేడాతో హైదరాబాద్ భారీ విజయం
హైదరాబాద్లోని కేబీఆర్ పార్కు చుట్టూ జరుగుతున్న స్టీల్ బ్రిడ్జి నిర్మాణంలో భాగంగా ట్రాఫిక్ డ్రైవరషన్ ట్రయల్ రన్ చేస్తున్నట్లు హైదరాబాద్ జాయింట్ సీపీ ట్రాఫిక్ జోయెల్ డెవిస్ ప్రకటించారు. 'కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ పర్యవేక్షణ కోసం ఒకరోజు వన్ వే వే ఏర్పాటు. వచ్చే ఆదివారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మూడు గంటల పాటు వన్ వే ట్రయల్ రన్ నిర్వహించనున్నాం' అని వెల్లించారు.
ఈ నెల 5వ తేదీన నిర్వహించబోతున్న ట్రాఫిక్ ట్రయల్ డైవర్షన్ రన్ ప్రజలందరూ గమనించాలని సూచించారు. రానున్న రోజుల్లో ప్రస్తుతం ఏర్పాటు చేయబోతున్న ట్రయల్ రన్ రూట్లోనే వాహన రాకపోకలను కొనసాగిస్తామని హైదరాబాద్ జాయింట్ సీపీ ట్రాఫిక్ జోయెల్ డెవిస్ తెలిపారు. పంజాగుట్ట నుంచి వచ్చే వాహనాలు మాదాపూర్కు వెళ్లేందుకు రోడ్డు నంబర్ 2లో డైవర్షన్ తీసుకొని ఇందిరానగర్, జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 5, రోడ్ నంబర్ 10 మీదుగా మాదాపూర్ రోడ్డు నంబర్ 45కి వెళ్లేందుకు వన్ వేను ఏర్పాటు చేస్తున్నాం' అని వెల్లడించారు.
Also Read: Harsha Veena: బ్రేకింగ్.. ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలిపై జనసేన పార్టీ దాడి
==> రోడ్డు నెంబర్ 45 నుంచి పంజాగుట్ట వైపు వచ్చే వాహనాలను జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ మీదుగా కేబీఆర్ పార్క్ ముందు నుంచి వన్ వేలో భాగంగా రోడ్ నెంబర్ 2 వైపు వాహనాలు మళ్లిస్తారు.
==> రోడ్డు నెంబర్ 10, 12 నుంచి వచ్చే వాహనాలన్నీ అగ్రసేన్ మహారాజ్ జంక్షన్ నుంచి జర్నలిస్ట్ కాలనీ బాలకృష్ణ ఇంటి ముందు నుంచి జూబ్లీ చెక్పోస్ట్ మీదుగా కేబీఆర్ పార్కు చేరుకునేలా దారి మళ్లింపు
హైదరాబాద్ ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించి ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని హైదరాబాద్ జాయింట్ సీపీ ట్రాఫిక్ జోయెల్ డెవిస్ విజ్ఞప్తి చేస్తున్నారు. ట్రాఫిక్ మళ్లింపు నేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాల్సి ఉందని సూచించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Strait Of Hormuz: హార్మోజ్ జలసంధి నుంచి గుజరాత్ పోర్టులకు ఎంత దూరం? ఎన్ని కిలో.మీ?
Hyderabad, Telangana:Strait Of Hormuz Distance Telugu News: మధ్య ప్రాచుర్యంలో ఉద్రిక్తతలు ఒక్కసారిగా తారాస్థాయికి చేరుకుంటూ వస్తున్నాయి. అమెరికాతో యుద్ధమేఘాలు కమ్ముకున్న నేపథ్యంలో.. ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్మోజ్ జల సంధిని ఇరాన్ మూసివేసిన సంగతి తెలిసిందే. ఈ పరిణామం ప్రపంచ దేశాలతో పాటు భారతదేశన్ని కూడా తీవ్రంగా కలవర పెడుతోంది. భారత్ తన చమురు అవసరాల కోసం అత్యధికంగా ఈ మార్గం పైనే ఆధారపడుతోంది. అంతేకాకుండా వివిధ వస్తువులకు సంబంధించిన ఎగుమతి దిగుమతి నౌకలు కూడా దీనిగుండానే ఇతర దేశాలకు రవాణా అవుతుంటాయి. అయితే హార్మోజ్ జల సంధి నుంచి భారత్ పశ్చిమ తీరానికి చేరుకోవడానికి ఎంత సమయం పడుతుందో మీకు తెలుసా? కనీసం ఎన్ని కిలోమీటర్ల దూరం ఉందో తెలుసా? వీటన్నిటికీ సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..
సాధారణ పరిస్థితుల్లో ఇరాన్ తీరంలోని హర్మోజ్ జల సంధి నుంచి భారత పశ్చిమ తీరానికి చేరుకోవడానికి షిప్పులు లేదా ఆయిల్ ట్యాంకర్లు పెద్దగా సమయం పట్టదు.. లోడుతో పాటు వాతావరణ పరిస్థితులను బట్టి సాధారణంగా రెండు నుంచి మూడు రోజుల వ్యవధిలో నౌకలు భారత తీరానికి చేరుకుంటాయి. అందుకే భారతదేశము ఏవైనా వస్తువులను మధ్య ప్రాచుర్య దేశాలకు పంపడానికి ఈ జల సంధిని ఎక్కువగా వినియోగిస్తూ ఉంటుంది.
హార్మోజ్ నుంచి గుజరాత్ లోని కాండ్లా పోర్టు దాదాపు 1000 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కేవలం 36 నుంచి 40 గంటల్లో షిప్పులు అక్కడి నుంచి ఇక్కడికి.. ఇక్కడి నుంచి అక్కడికి చేరుకోగలుగుతాయి.. ముంబై తీరానికి చేరుకోవడానికి సుమారు 50 నుంచి 55 గంటల సమయం పడుతుంది. ముడిచమురును మోసుకెళ్ళే భారీ ట్యాంకర్లు సగటున గంటకు 13 నుంచి 20 నాటికల్ మైళ్ళ వేగంతో ప్రయాణిస్తాయి. ఇంత తక్కువ సమయంలో చమురు భారత్ చేరుకునే అవకాశం ఉన్నప్పటికీ ప్రస్తుతం ఇరాన్ ఈ మార్గాన్ని మూసివేయడంతో సరఫరా గొలుసు పూర్తిగా దెబ్బ తినే ప్రమాదం కనిపిస్తోంది.
Read more: INS Taragiri: భారత నౌకాదళంలోకి తారాగిరి.. శత్రువుల గుండెల్లో వణుకే!
ప్రపంచవ్యాప్తంగా రవాణా అయ్యే చమురులో దాదాపు 20 శాతం హార్మోజ్ జల సంధి గుండానే వెళ్తుంది. భారత్ దిగుమతి చేసుకునే ముడిచమురులో మూడింటి రెండువంతులు ఈ మార్గం నుండే వస్తుంది. సరఫరా నిలిచిపోతే అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు ఆకాశాన్ని తాకే అవకాశాలున్నాయి. ప్రస్తుతానికి భారత్ వద్ద కొన్ని రోజులకు సరిపడా అత్యవసర చమురు నిల్వలు ఉన్నప్పటికీ.. ఇరాన్తో సంప్రదింపులు జరపడం వల్ల హార్మోజ్ జల సంధిలో మన నౌకలకు అనుమతులు లభించుతున్నాయి. దీనివల్ల ముడి చెమురుపై ప్రభావం పడే అవకాశం ఉండదని నిపుణులు చెబుతున్నారు.
Read more: INS Taragiri: భారత నౌకాదళంలోకి తారాగిరి.. శత్రువుల గుండెల్లో వణుకే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Jonathan: వయసు 193 ఏళ్లు.. పవర్ ఇంకా తగ్గలేదు.. జోనాథన్ తాబేలు ప్రస్తుత పరిస్థితి ఇది!
Hyderabad, Telangana:Oldest Jonathan Tortoise Latest News: ప్రపంచంలో అత్యంత వృద్ధ తాబేలుగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సృష్టించిన జోనాథన్ మరణించినట్లు సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా వార్తలు విపరీతంగా వస్తున్నాయి. అయితే వీటికి తెరపడుతూ అసలు విషయాలు బయటకు వచ్చాయి. ఈ వార్తలన్నీ కేవలం పుకార్లేనని..జోనాథన్ ఆరోగ్యంగా, ఎంతో ఉత్సాహంగా ఉందని బ్రిటీష్ సెయింట్ హెలెనా ద్వీప అధికారులు అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ తాబేలు చూడడానికి చాలా వింతగా కనిపించేసరికి చాలామంది.. ఇది చనిపోయిందంటూ వార్తలు ప్రచురించడం ప్రారంభించారు..
గత వారం రోజులగా ఇంటర్నెట్లో జోనాథన్ చనిపోయిందంటూ.. కొన్ని ఫోటోలతో పాటు పోస్టర్లు విపరీతంగా వైరల్ అవుతూ వస్తున్నాయి. దీంతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న జంతువు ప్రేమికులు కూడా ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఈ నేపథ్యంలో స్పందించిన అధికారులు జోనాథన్ ప్రస్తుతం సెయింట్ హెలెనాలోని గవర్నర్ నివాసం (ప్లాంటేషన్ హౌస్)లోని తోటలో హాయిగా అటు ఇటు తిరుగుతోందని తెలిపారు. 193 ఏళ్ల వయస్సు వచ్చినప్పటికీ.. అది తగినంత ఆహారం తీసుకుంటూ యాక్టివ్ గా ఉందని వారు వెల్లడించారు..
కేవలం ప్రకటన తోనే సరిపెట్టకుండా..జోనాథన్ ప్రస్తుత పరిస్థితిని వివరిస్తూ అధికారులు ఒక వీడియోను కూడా విడుదల చేశారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ఆ వీడియోలో తాబేలు తనకి ఇష్టమైన పండ్లతో పాటు కూరగాయలను తింటూ ఎంతో ఉల్లాసంగా అటు ఇటు తిరుగుతూ కనిపిస్తోంది. జోనాథన్ చనిపోయిందన్న వార్తలు ఏమాత్రం నిజం లేదు.. అది ఇప్పటికే తన రోజువారి కార్యకలాపాలను ఎంతో చురుగ్గా నిర్వహిస్తుందని.. ప్లాంటేషన్ హౌస్ ప్రతినిధులు పేర్కొనడం విశేషం..
Read more: INS Taragiri: భారత నౌకాదళంలోకి తారాగిరి.. శత్రువుల గుండెల్లో వణుకే!
సెయిషెల్స్ జెయింట్ టోర్టాయిస్ జాతికి చెందిన జోనాథన్.. 1832లో జన్మించినట్లు సమాచారం... 1882లో సెయింట్ హెలెనాకు తీసుకువచ్చినప్పటి నుంచి అది అక్కడే ఏళ్ల నుంచి నివసిస్తుందట.. అంతేకాకుండా భూమిపై జీవించిన అత్యంత వృద్ధ జంతువుగా ఇది వరల్డ్ రికార్డ్ కూడా సాధించింది. అంతేకాకుండా బ్రిటన్ పాలించిన ఎనిమిది మంది రాజులు, రాణులు, అమెరికాకు చెందిన 40 మంది అధ్యక్షులను ఈ తాబేలు తన జీవితకాలంలో చూసింది. వృద్ధాప్యం కారణంగా ఈ తాబేలు చూపు మందగించిన.. వాసన పసిగట్టే శక్తి తగ్గినప్పటికీ.. వినికిడి శక్తి మాత్రం అద్భుతంగా ఉందని వైద్యులు చెబు. ప్రస్తుతానికి అది సంపూర్ణ ఆరోగ్యంతో ఉందని తెలియడంతో సోషల్ మీడియా వినియోగదారులు ఊపిరి పీల్చుకుంటున్నారు.
Read more: INS Taragiri: భారత నౌకాదళంలోకి తారాగిరి.. శత్రువుల గుండెల్లో వణుకే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
INS Taragiri: భారత నౌకాదళంలోకి తారాగిరి.. శత్రువుల గుండెల్లో వణుకే!
Hyderabad, Telangana:INS Taragiri Commissioned Latest News: భారత నవకాదళం మరింత మరింత శక్తివంతంగా తయారయ్యింది. సముద్ర సరిహద్దుల్లో శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించేలా అత్యాధునిక యుద్ధనౌక INS Taragiri అధికారికంగా ఇండియన్ నేవీలో చేరింది. శుక్రవారం విశాఖ నేవీ యార్డులో జరిగిన అత్యంత ముఖ్యమైన కార్యక్రమంలో భాగంగా రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఈ యుద్ధనౌకను జాతికి అంకితం చేశారు. స్వదేశీ పరిజ్ఞానంతో రూపుదిద్దుకున్న ఈ నౌక రాకతో హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారత ఆధిపత్యం మరింత పెరగబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ యుద్ధ నౌకలో వినియోగించిన టెక్నాలజీ ఏంటో? దీని ఫీచర్స్ వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..
మేక్ ఇన్ ఇండియా నినాదానికి నిలువెత్తు నిదర్శనం గా నిలుస్తున్న ఈ యుద్ధ నౌకను దాదాపు 75% స్వదేశీ టెక్నాలజీతో నిర్మించడం విశేషం.. ప్రాజెక్ట్ 17aలో భాగంగా నిర్మితమైన ఈ యుద్ధనౌక అత్యాధునిక స్ట్రెంత్ ఫీచర్లతో అందుబాటులోకి వచ్చినట్లు తెలుస్తోంది. అంటే శత్రుద్దేశాల రాడార్లకు చిక్కకుండా ఇది సముద్రంలో దూసుకుపోయే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. దీంతోపాటు గంటకు 28 నాటికల్ మైళ్ల వేగంతో ప్రయాణించగల సామర్థ్యం దీని సొంతం..
తారాగిరి కేవలం నౌక మాత్రమే కాదు.. సముద్రంపై కదిలే ఒక భారీ ఆయుధగారం.. ఇందులో ఉన్న టీచర్స్ వివరాల్లోకి వెళితే.. గాలిలోని లక్ష్యాలతో పాటు ఇతర నౌకలను క్షణాల్లో ధ్వంసం చేసేందుకు సూపర్ సోనిక్ మిస్సైల్ లను కలిగి ఉంటుంది. అంతేకాకుండా సముద్ర గర్భంలో దాగివున్న శత్రువు జలంథర్ గాములను పసిగట్టి అడ్డుకునే యాంటీ సబ్మెరైన్ సిస్టం కూడా ఇందులో అందుబాటులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ముప్పును ముందే పసిగట్టి హెచ్చరించే అధునాతన రాడార్ సిస్టం కూడా ఉంటుంది. అలాగే ఎలక్ట్రానిక్ యుద్ద తంత్రాలను తిప్పికొట్టేలా ప్రత్యేకమైన యాంటీ వార్ఫేర్ సిస్టమ్ కూడా ఉంటుంది.
Read more: Scorpio, Ertiga సగం ధరకే.. ఢిల్లీ కార్ బజార్లో రూ.30 వేలకే కారు మీ సొంతం!
తారాగిరితో పాటు మరో కీలక పరిణామం నేవీలో చోటుచేసుకుంది.. దేశీయంగా నిర్మించిన రెండో అరిహంత్ క్లాస్ అను అంతర్గామి INS Aridhaman కూడా కమిషన్ అయినట్లు సమాచారం అందుతుంది. ఇది లాంగ్ రేంజ్ బాలిస్టిక్ మిస్సైడ్లను ప్రయోగించగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. తద్వారా భారత్ భూమి ఆకాశం మరింత బలోపేతం కాబోతోంది. ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ.. భారత్ ఇకపై రక్షణ రంగంలో దిగుమతులపై ఆధారపడకుండా.. ప్రపంచానికి ఆయుధాలను ఎగుమతి చేసే స్థాయికి ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తారాగిరి చేరికతో బంగాళాఖాతం నుంచి అరేబియా సముద్రం వరకు భారత భద్రతా మరింత పెరిగిందన్నారు..
Read more: Scorpio, Ertiga సగం ధరకే.. ఢిల్లీ కార్ బజార్లో రూ.30 వేలకే కారు మీ సొంతం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Viral Video: ఫోన్లో మాట్లాడుతూ బిడ్డను ఫ్రిజ్లో పెట్టిన తల్లి..చివరికి బిడ్డ పరిస్థితి ఏమయ్యింది? వైరల్ వీడియో!
Hyderabad, Telangana:Baby In Fridge Video: స్మార్ట్ఫోన్ల వాడకం వచ్చిన తర్వాత ప్రపంచం మొత్తం మారిపోయింది. మన అరచేతిలో యావత్ ప్రపంచాన్ని చూసే అవకాశం వచ్చింది. కేవలం కాల్స్ మాట్లాడడమే కాకుండా.. మొబైల్ ఫోన్ల ద్వారానే మన పనుల్లో చాలా వరకు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మనలో చాలామంది దైనందికి జీవితంలో నేడు, చాలా మందికి మొబైల్ ఫోన్లు తప్పనిసరిగా మారాయి. ప్రస్తుతం మొబైల్స్ లేకుండా మన జీవితంలో ఒక్కపని కూడా ముందుకు సాగదు. చాలా మంది ఒక్క క్షణం కూడా తమ మొబైల్ ఫోన్లను వదిలిపెట్టలేని పరిస్థితి ఏర్పడింది.
మొబైల్ ఫోన్ల మితిమీరిన వాడకం మన ఆరోగ్యానికే కాక.. మన కళ్లకు కూడా హాని కలిగిస్తుంది. మొబైల్ వాడకం వల్ల చాలా మంది తీవ్రమైన ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈతరం చాలామంది పిల్లల నుంచి పెద్దల వరకు మొబైల్ ఫోన్ వాడకం వ్యసనంగా మారింది. స్మార్ట్ఫోన్ లేకుండా అస్సలు ఉండలేకపోతున్నారు. ఫోన్లను ఉపయోగిస్తూ.. ప్రపంచాన్నే మర్చిపోతున్నారు. మొబైల్ ఫోన్లకు బానిసలైన వారు తమ చుట్టూ ఏం జరుగుతుందో కూడా పట్టించుకోవడం లేదు. దీనికి ఉదాహరణగా ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వైరల్ అయిన వీడియో ప్రకారం.. ఒక మహిళ తన మొబైల్ ఫోన్లో మాట్లాడుతూ ఫ్రిజ్లో తన బిడ్డను ఉంచింది. అయితే ఫోన్లో కాల్ మాట్లాడుతూ నిమగ్నమైన ఆ మహిళ తన బిడ్డకు ఏం జరుగుతుందో అనే ధ్యాసే లేకుండా పోయింది. ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతూ తన బిడ్డను ఫ్రిజ్లో ఉంచే ఆ మహిళ తన మొబైల్ ఫోన్లో అలానే కొనసాగిస్తోంది.
ఫ్రిజ్లో బిడ్డను ఉంచిన ఆవిడ తన మొబైల్ ఫోన్లో మాట్లాడుతూనే ఉంది. ఆమె ప్రశాంతంగా సోఫాలో కూర్చుని మాట్లాడుతూనే ఉంది. ఈ సమయంలో అక్కడికి వచ్చిన ఆమె భర్త.. బిడ్డ అక్కడ లేకపోవడం చూసి ఖంగుతిన్నాడు. అతను ఆమెను, "బిడ్డ ఎక్కడ?" అని ప్రశ్నిస్తాడు. కానీ బిడ్డ గురించి ఏమాత్రం తెలియని ఆవిడ, తన మొబైల్ ఫోన్లో నిమగ్నమై ఉంది. ఈ సమయంలో మరింత ఆందోళనకు గురైన భర్త.. "ముందు, మొబైల్ ఫోన్లో మాట్లాడటం ఆపు" అని ఆమెను వారిస్తాడు. కానీ ఆవిడ తన భర్త మాట వినకుండా మొబైల్లో కాల్స్ మాట్లాడుతూనే ఉంటుంది. ఈ సమయంలో అతనికి కోపం వచ్చి తన భార్య చేతిలోంచి మొబైల్ ఫోన్ను లాక్కుంటాడు. ఈ సమయంలో బిడ్డ కనిపించకపోవడంతో తాను చేసిన తప్పుకు ఆవిడ తన తల బాదుకుంటుంది.
Horrible Addiction 😰 pic.twitter.com/D3Pl0a4rsv
— Prof cheems ॐ (@Prof_Cheems) March 30, 2024
ఈ సంఘటన ఎక్కడ జరిగిందో తెలియడం లేదు. కానీ @Prof_Cheems అనే ట్విట్టర్ ఖాతాలో ఈ వీడియో పోస్ట్ చేశారు. ఇప్పటికే ఈ వీడియోను లక్షలాది మంది వీక్షించగా.. వేలాది మంది కామెంట్స్ చేశారు. వైరల్ అయిన ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఈ విధంగా స్పందించారు. "మొబైల్ ఫోన్ను ఎక్కువగా వాడితే ఇలాగే జరుగుతుంది" అని కామెంట్ చేశారు. ఆ మహిళ చేసిన తప్పు పట్ల చాలా మంది ఆమెపై మండిపడ్డారు. మొబైల్ ఫోన్ను ఎక్కువగా వాడేవారు ఈ వీడియో చూసి చాలా నేర్చుకోవచ్చని కొందరు కామెంట్ చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Kondagattu: మతాలకతీతంగా..మారుతీ సేవలో.. హనుమాన్ దీక్ష చేపట్టిన ముస్లిం యువకుడు!
Kondagattu, Telangana:Kondagattu Telugu Latest News: కుల మతాలు వేరైనా దైవం ఒక్కటేనని.. మానవత్వమే మిన్న అని జగిత్యాల జిల్లాకు చెందిన ఒక ముస్లిం యువకుడు చాటి చెప్పారు. కొడిమ్యాల మండలం పూడూరు గ్రామానికి చెందిన మహమ్మద్ యూసుఫ్.. హనుమాన్ జయంతిని పురస్కరించుకొని 11 రోజులపాటు అత్యంత భక్తి శ్రద్దలతో హనుమాన్ దీక్షను చేపట్టి అందరి దృష్టిని ఆకర్షించారు.. మత సామరస్యానికి ప్రతీకగా.. నిలిచిన యూసుఫ్ ను గ్రామస్తులు అభినందనలతో ముంచేత్తుతున్నారు..
మహమ్మద్ యూసుఫ్ కేవలం దీక్షకే పరిమితం కాకుండా ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లోనూ.. చురుగ్గా పాల్గొన్నారు. ఇటీవల అయోధ్య నుంచి పూడూరు గ్రామం వరకు శ్రీరామచంద్రుడి పాదాలను పాదయాత్రగా తీసుకురావడంలో ఆయన కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా తన సొంత గ్రామమైన పూడూరులో నూతనంగా నిర్మిస్తున్న రామాలయ నిర్మాణ పనుల్లో స్వచ్ఛందంగా పాల్గొంటూ.. శ్రమదానం చేస్తూ తన భక్తిని చాటుకున్నారు..
హనుమాన్ జయంతి సందర్భంగా యూసుఫ్ కాళీ నడకన ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు అంజన్న సన్నిధిని చేరుకున్నారు.. 11 రోజులపాటు కఠిన నియమాలతో కూడిన దీక్షను పూర్తి చేసి.. స్వామివారిని దర్శించుకున్న అనంతరం మాలవిరమణ చేశారు.. కాషాయ వస్త్రాదరణలో.. నుదుట తిలకంతో హనుమాన్ నామస్మరణ చేస్తూ ఆయన కనిపిస్తుంటే.. అక్కడ ఉన్న భక్తులు ఆశ్చర్యంతో పాటు హర్షం వ్యక్తం చేశారు..
ఈ సందర్భంగా యూసుఫ్ మాట్లాడుతూ.. మతం ఏమైనా.. బోధించేది మంచినే.. మానవత్వంతో పాటు సోదర భావం కంటే మంచిది ఏదీ లేదు.. రాముడు, రహీం ఇద్దరు ఒకటేనన్న భావంతోనే నేను ఈ దీక్ష చేపట్టాను అని.. అన్నారు. గ్రామస్తులు స్పందిస్తూ.. మా గ్రామంలో యూసుఫ్ అందరితో కలిసి మెలిసి ఉంటాడు. ఇలాంటి వ్యక్తి సమాజానికి గొప్ప ఆదర్శం.. అన్ని మతాల సారాంశం ఒకటేనని ఆయన నిరూపించాడు. అని గ్రామస్తులు కొనియాడుతున్నారు.. ఇప్పుడు యూసుఫ్ జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారారు..
Read more: Scorpio, Ertiga సగం ధరకే.. ఢిల్లీ కార్ బజార్లో రూ.30 వేలకే కారు మీ సొంతం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Car Deals: రూ. 11 లక్షలకే మహీంద్రా థార్.. రూ. 3 లక్షలకే డిజైర్! ఎక్కడో తెలుసా?
Hyderabad, Telangana:Best Second Hand Car Showroom Delhi: సొంత కారు ఉండాలని ప్రతి సామాన్యుడి చిరకాల కల.. కానీ పెరుగుతున్న ధరల దృశ్య కొత్త కారు కొనడం అందరికీ సాధ్యం కావడం లేదు.. ముఖ్యంగా మధ్యతరగతి వారికైతే అస్సలు సాధ్యం అవడం లేదు. ఇలాంటి వారి కోసం దేశ రాజధాని ఢిల్లీలోని నేతాజీ సుభాష్ ప్లేస్ (NSP)లో ఉన్న సెకండ్ హ్యాండ్ కార్ షోరూమ్స్ అద్భుతమైన ఆఫర్స్తో ముందుకొస్తున్నాయి. అత్యంత తక్కువ ధరల్లోనే కార్లను విక్రయిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా కొన్ని కార్లు అయితే ఇక్కడ కేవలం రూ.40 వేల రూపాయలకే లభించడం విశేషం. మంచి కండిషన్ కలిగిన సెకండ్ హ్యాండ్ కార్లు కేవలం రూ.50 వేల లోపే అందుబాటులో ఉండి.. మధ్యతరగతి వినియోగదారుడు కలను నెరవేర్చుతున్నాయి. మీరు కూడా మంచి కారు కొనుగోలు చేయాలనుకుంటే ఇదే బెస్ట్ ప్లేస్..
ముఖ్యంగా ఈ ప్రాంతాల్లో ఉన్న సెకండ్ హ్యాండ్ కార్ల షోరూంలో బడ్జెట్ కార్ల నుంచి లగ్జరీ ఎస్యూవీల వరకు అన్నీ లభిస్తున్నాయి.. ముఖ్యంగా యువతను ఆకట్టుకునే మహింద్రా తార్ 2024 మోడల్ కేవలం రూ.11 లక్షల రూపాయల నుంచే ప్రారంభం అవ్వడం విశేషం. ఫ్యామిలీ కార్లలో టాప్ గేర్లో ఉన్న మారుతీ సుజుకి డిజైర్ సిఎన్జీ మోడల్ రూ.3.15 లక్షల నుంచే ప్రారంభమవుతోంది. ఇవే కాకుండా మల్టీ నేషనల్ బ్రాండ్లకు సంబంధించిన లగ్జరీ కార్లు కేవలం ఇక్కడ రూ.10 లక్షల నుంచి ప్రారంభమవుతున్నాయి. కాబట్టి మంచి కారు కొనాలనుకునేవారు తప్పకుండా ఒకసారి ఈ మార్కెట్ను సందర్శించండి..
ఢిల్లీలోని నేతాజీ సుభాష్ ప్లేస్లో ఉన్న కొన్ని సెకండ్ హ్యాండ్ కార్ల షోరూంలో మారుతి బ్రెజ్జా 2017 మోడల్ ZDI ప్లస్ వేరియంట్ కేవలం రూ.4 లక్షలకే లభిస్తోంది. అంతేకాకుండా దీనికి సర్వీస్ రికార్డ్స్ తో పాటు వివిధ రకాల స్పెసిఫికేషన్స్ ను అందిస్తున్నారు. ఇక డిజిటల్ ఆటోమేటిక్ వేరియంట్ టాటా నెక్సాన్ కేవలం ఇక్కడ రూ.5 లక్షల నుంచి అందుబాటులో ఉంది. దీంతోపాటు 2020 మోడల్ పనోరమిక్ సన్రూఫ్ కలిగిన కారు ఎంజీ హెక్టర్ కేవలం రూ.8 లక్షల నుంచి అందుబాటులో ఉంది. దీంతోపాటు మారుతి ఆల్టో కేవలం ఇక్కడ రూ.3 లక్షల లోపు.. టాటా టియాగో 2 లక్షల లోపు అందుబాటులో ఉండడం విశేషం..
Read more: Scorpio, Ertiga సగం ధరకే.. ఢిల్లీ కార్ బజార్లో రూ.30 వేలకే కారు మీ సొంతం!
ఇక్కడ లభించే ప్రతి కారు నాని యాక్సిడెంట్ అని.. ఇంజన్ కండిషన్ చాలా బాగుంటుందని ఈ షోరూమ్స్ను రన్ చేస్తున్న నిర్వాహకులు చెబుతూ ఉన్నారు. అంతేకాకుండా కొన్ని రకాల కార్లకు సంబంధించిన ఇంజన్లపై ప్రత్యేకమైన వారంటీని కూడా అందిస్తున్నారు. కేవలం తక్కువ ధరలకే కాకుండా కారు కొనుగోలు చేసిన తర్వాత ట్రాన్స్ఫర్ బాధ్యత కూడా ఈ షోరూంలదేనని వారు చెబుతున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారి కోసం ఎన్ఓసి సదుపాయాన్ని కూడా అందిస్తున్నారు. దీంతోపాటు రవాణా సౌకర్యంతో పాటు బ్యాంకు లోన్ సదుపాయాన్ని కూడా అందిస్తున్నారు. తక్కువ మార్జిన్తో ఎక్కువ మంది కస్టమర్లకు చేరువ కావాలనే లక్ష్యంతో ఈ ధరల్లో కార్లను విక్రయించుకున్నట్లు అక్కడి షో రూమ్స్ యజమానులు చెబుతున్నారు..
Read more: Scorpio, Ertiga సగం ధరకే.. ఢిల్లీ కార్ బజార్లో రూ.30 వేలకే కారు మీ సొంతం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Siddipet: ప్రేమ గెలిచింది.. కానీ ప్రాణాలు పోయాయి! ప్రేమకు బలైన నిండు ప్రాణాలు..
Hyderabad, Telangana:Lovers Death Within Two Days In Cherial: సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం ముస్త్యాల గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. ప్రాణంగా ప్రేమించుకున్న ఇద్దరు యువతి యువకులు.. తమ పెళ్లి జరగదన్న ఆందోళనతో మృతి చెందారు. రెండు రోజుల వ్యవధిలో ప్రేమికులిద్దరూ చనిపోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అసలు వీరిద్దరి మరణానికి ప్రధాన కారణం ఏంటి? పోలీసుల దర్యాప్తులో ఏం తేలింది? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..
ముస్త్యాల విలేజ్ కి చెందిన రాకేష్.. అదే గ్రామానికి చెందిన హారిక గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని భావించినప్పటికీ.. పెద్దలు అంగీకరిస్తారో లేదో నాన్న సందేహం వారిని వేధించింది.. తమ ప్రేమ వివాహం కాదేమోనని బెంగతో తీవ్ర మనస్థాపానికి గురైన రాకేష్.. రెండు రోజుల క్రితం ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకి పాల్పడ్డాడు.. గమనించిన కుటుంబ సభ్యుల ఆసుపత్రికి తరలించినప్పటికీ చికిత్స పొందుతూ రాకేష్ మృతి చెందాడు..
కళ్ళ ముందే ప్రియుడు విగత జీవిగా మారడాన్ని హారిక మనసు తట్టుకోలేకపోయింది.. రాకేష్ లేని జీవితం తనకు వద్దని భావించిన ఆ యువతి.. తీవ్ర విషాదంలో మునిగిపోయింది.. రాకేష్ మరణించిన బాధ నుంచి కోలుకోక ముందే.. హారిక గురువారం ఫ్యాన్ కు ఉరేసుకొని..ఆత్మహత్య చేసుకుంది. కొద్దిసేపటి తర్వాత గమనించిన కుటుంబ సభ్యులు కన్నీరు నీరయ్యారు.. ఒకే గ్రామంలో ఇద్దరు ప్రేమికులు మృతి చెందడంతో స్థానికులు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
సమాచారం అందుకున్న చేర్యాల పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీస్ అధికారులు తెలిపారు. ప్రేమ వ్యవహారంలో పెళ్లి కాదన్న భయంతోనే వీరిద్దరూ ఈ అఘాయిత్యానికి పాల్పడ్డట్లు ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసులు వెల్లడించారు..
Read more: Scorpio, Ertiga సగం ధరకే.. ఢిల్లీ కార్ బజార్లో రూ.30 వేలకే కారు మీ సొంతం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
