మధిరలో సబ్ కోర్టు నిర్మాణానికి శంకుస్థాపన
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Snake in Cabbage Video Watch Here: ప్రస్తుతం మార్కెట్ నుంచి తెచ్చుకునే కూరగాయల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించే ఒక షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. సాధారణంగా కూరగాయల అన్నాక క్రిములు.. కీటకాలు, చిన్న చిన్న పురుగులు రావడం సర్వసాధారణం. కానీ మనం రోజు తినే క్యాబేజీలో ఏకంగా పాము ప్రత్యక్షమవడం ఇప్పుడు సంచలనంగా మారింది. ప్రమాదకరమైన పాము క్యాబేజీలోకి వెళ్తున్న దృశ్యాలు చూసి నేటిజెన్లు షాక్ అయిపోతున్నారు. ఇంతకీ ఈ వీడియో నిజమేనా? దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
వైరల్ అవుతున్న వీడియోకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. ఒక క్యాబేజీ లోపల పొరల మధ్య ఒక చిన్న పాము నక్కి ఉండడం మీరు క్లియర్ గా ఈ వీడియోలో చూడొచ్చు. అయితే ఈ పాము క్యాబేజీ చిన్న చిన్న ఆకుల పొరల మధ్యలో ఉండడం.. దాని తోక భాగం మాత్రం బయటికి కనిపించేలా ఉండడం మీరు చూడొచ్చు. అంతేకాకుండా ఈ పాము క్యాబేజీ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడం కూడా గమనించవచ్చు. అయితే, ఇలాంటి కూరగాయలను తీసుకువచ్చే క్రమంలో తప్పకుండా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. మార్కెట్లోని ఒకటికి రెండుసార్లు చూసి కొనుగోలు చేయడం మంచిది.. లేదంటే వీటిని పట్టుకునే క్రమంలో దాడి చేసే అవకాశాలు కూడా ఉన్నాయని కొంతమంది నిపుణులు భావిస్తున్నారు.
ఈ వీడియోని చూసిన కొంతమంది నిపుణులు స్పందిస్తూ వస్తున్నారు.. ముఖ్యంగా క్యాబేజీ లాంటి ఆకుకూరలతో పాటు కొన్ని రకాల కూరగాయలు కొనుగోలు చేసిన తర్వాత శుభ్రం చేసే క్రమంలో తప్పకుండా కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుందట. ముఖ్యంగా వీటిని కొనుగోలు చేసే సమయంలోనే వాటిని క్షుణ్ణంగా పరిశీలించి.. రంధ్రాలు కలిగిన వాటిని కొనుగోలు చేయకపోవడం చాలా మంచిదని వారు చెబుతున్నారు. ముఖ్యంగా క్యాబేజీ లాంటి కూరగాయలను నేరుగా కోయకుండా.. ఒక్కొక్క పొరను విడదీసి చూసుకొని మరి జాగ్రత్తగా కోసుకోవడం మంచిది.
అలాగే మార్కెట్లలో ఈ క్యాబేజీని కొనుగోలు చేసిన తర్వాత తప్పకుండా వన్డే క్రమంలో గోరువెచ్చని నీటిలో శుభ్రం చేయడం చాలా మంచిది. ఇలా చేయడం వల్ల ఏవైనా క్రిమి కీటకాలు లేదా మరేమైనా పురుగులు ఉంటే చనిపోయే అవకాశాలున్నాయి. ఇదిలా ఉంటే ప్రస్తుతం చాలా పాములు ఆహారం లభించలేకపోవడం కారణంగా.. పొలాల్లో చేరి.. ఇలాంటి ఆహారాలతో కడుపు నింపుకుంటున్నాయి. ఇటీవల వివిధ కూరగాయలను తింటున్న పాములకు సంబంధించిన దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి అందరికీ తెలిసిందే.. అయితే ఈ వీడియో చూసిన చాలా మంది మాత్రం ఇది అసలైన వీడియో కాదని.. ఎవరో కావాలని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఎడిట్ చేసి పోస్ట్ చేశారని చెబుతున్నారు. ఫ్యాక్ట్ చెక్ లో భాగంగా ఈ వీడియో నిజమైంది కాదని తెలింది.
Also Read: Old Woman Video: పాపం.. 70 ఏళ్ల వృద్ధురాలు తిప్పలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Cobra Hair Video Here: ప్రకృతిలో మనకు తెలిసిన వింతలు ఎన్నో జరుగుతూ ఉంటాయి.. కొన్నిసార్లు మనం చూసే దృశ్యాలు ఆశ్చర్యానికి గురి చేయడమే కాకుండా భయాందోళన కూడా సృష్టిస్తూ ఉంటాయి. తాజాగా ఇలాంటి దృశ్యాలకు సంబంధించిన వీడియోలే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలు అత్యంత ప్రమాదకరమైన నాగుపాము కూడా ఉంది. అయితే, ఈ పాము అన్ని పాములు కంటే చాలా భిన్నంగా ఉంది. అంతేకాకుండా చాలా ప్రత్యేకంగా కూడా కనిపిస్తూ ఉంది. సాధారణ పాములకు జుట్టు ఉండదు.. కానీ ఈ వీడియోలో కోబ్రాకు జుట్టు ఉన్న దృశ్యాలు మీరు చూడొచ్చు. ఈ వింత వీడియోను చూసిన చాలా మంది సోషల్ మీడియా వినియోగదారు ఆశ్చర్యానికి గురవుతున్నారు.
వైరల్ అవుతున్న వీడియోలో.. అత్యంత ప్రమాదకరమైన కోబ్రా పాము పడగవిప్పి ఉండడం మీరు గమనించవచ్చు.. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఆ పాము పడగ వెనక భాగంలో మనుషుల జుట్టు లాంటి నల్లటి వెంట్రుకలు కనిపిస్తూ ఉన్నాయి. గాలికి ఆ జుట్టు అటు ఇటు ఊగడం మీరు క్లియర్గా చూడొచ్చు. పాము పడక విప్పినప్పుడు ఆ నల్లటి జుట్టు దాని తల నుంచి కిందకు వేలాడుతూ ఉండడం మీరు ఈ వీడియోలో గమనించవచ్చు. సాధారణంగా పాములు ఎలాంటి జుట్టును కలిగి ఉండవు. కానీ ఈ వీడియోలో మాత్రం అత్యంత ప్రమాదకరమైన పాముకు జుట్టు ఉండడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
ఈ వింత దృశ్యాన్ని చూసిన సోషల్ మీడియా వినియోగదారులు రకరకాలుగా స్పందిస్తూ వస్తున్నారు. కొందరు ఇది నిజమైన పామేనా అని అనుమానం వ్యక్తం చేస్తుంటే. మరి కొంతమంది అయితే ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ సృష్టించిన వీడియో అని కామెంట్లు రాస్తూ వస్తున్నారు. అలాగే మరికొందరైతే పురాణాల్లో ఇలాంటి పాముల గురించి ప్రస్తావించారని.. ఇలా జుట్టు ఉన్న పాములు అనేక కథల్లో ఉన్నాయని వింత వింతగా కామెంట్లలో చెబుతూ వస్తున్నారు. మరి కొంతమంది అయితే.. ఎవరో కావాలని పాము తల భాగంలో వెంట్రుకలను పెట్టారని అంటున్నారు.
శాస్త్రీయంగా చూస్తే.. పాములకు ఎలాంటి జుట్టు ఉండే అవకాశం లేదట.. అలాంటిది ఈ పాము కు జుట్టు ఉండడం ఆశ్చర్యమేస్తుంది కదూ.. సాధారణంగా పాముల శరీర భాగం క్లియర్ గా పరిశీలిస్తే.. పొలుసులుగా ఉంటుంది.. కానీ ఈ వీడియోలో పాము స్మూత్ గా కనిపించడం చూసి.. చాలామంది ఇది ఎడిటింగ్ చేసిన వీడియో అని అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ వచ్చిన తర్వాత.. ఇలా ప్రమాదకరమైన పాములకు వింత వింత వస్తువులను జోడించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వస్తున్నారు.
Also Read: Old Woman Video: పాపం.. 70 ఏళ్ల వృద్ధురాలు తిప్పలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Cobra In Shoe Video Watch Here: ప్రతి ఒక్కరికి ఇంటి బయట లేదా వరండాల్లో తప్పకుండా చెప్పులు విడిచే అలవాటు ఉంటుంది.. ఈ అలవాటు మీకు కూడా ఉందా? అయితే, ఈ వీడియో మీ కోసమే. షూ రాక్లోని దాక్కున్న ఓ భారీ నాగుపాము కు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ వీడియోలో కోబ్రా ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ.. షూ పెట్టుకునే రాక్ లో దర్శనమిచ్చింది. ఇప్పుడు దీనికి సంబంధించిన దృశ్యాలు అందర్నీ ఆశ్చర్యపరిచేలా చేస్తున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణంగా మనం ఎక్కడి నుంచైనా బయటికి వెళ్లి ఇంటికి రాగానే చెప్పులు లేదా షూస్ ను తప్పకుండా పక్కనే ఉన్న స్టాండ్లో పెట్టుకుంటూ ఉంటా. అయితే అలా పెట్టిన స్టాండ్ లో ఉన్న షూలో అత్యంత ప్రమాదకరమైన కోబ్రా కనిపించింది.. ఓ వ్యక్తి ఆ షూను వేసుకుందామని వెళ్లగా అక్కడ ఊహించని దృశ్యాలు అతనికి కనిపించాయి.. షూ లోపల ఒక నాగుపాము దూరి ఉంది.. ఆ పాము నెమ్మదిగా అందులో నుంచి బయటికి రావడం ఆయన గమనించారు.. వెంటనే అతను అతని కుటుంబ సభ్యులకు కూడా తెలియజేయడంతో వారు ఆ పామును చూసేందుకు అక్కడికి వచ్చారు..
ఈ వీడియోలో కనిపిస్తున్న గ్రే కలర్ షూలోపల నాగుపాము తన శరీరాన్ని చుట్టుకొని ఉండటం మీకు క్లియర్గా కనిపిస్తుంది. ఆ పాము నెమ్మదిగా షూ లోపలి నుంచి బయటికి పాకుతూ కింద ఉన్న ఇతరు చెప్పుల వైపుగా వెళ్తోంది. అదృష్టవశాత్తు ఆ వ్యక్తికి షూ వేసుకోక ముందే పాము కనిపించింది.. దీంతో పెద్ద ప్రమాదమే తప్పింది అనవచ్చు. ఎందుకంటే ఆ వ్యక్తి ఆ పామును గమనించకపోతే తప్పకుండా దాని కాటు బారిన పడేవాడు.
ముఖ్యంగా వర్షాకాలంలో లేదా ఎండాకాలంలో విష సర్పాలు ఇలా ఆహ్వానం కోసం ఇళ్లలోకి వస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఇంటి లోపల ఎక్కువగా వస్తువులు ఉన్న చోటికి ఇలాంటి పాములు వస్తూ ఉంటాయి. కాబట్టి అడవికి దగ్గరగా ఉండేవారు తప్పకుండా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఇంటి బయట ఉన్న వస్తువులు ఒకటికి రెండుసార్లు చూసి వాటిని పట్టుకోవడం మంచిది. లేదంటే ఇలాంటి విషపూరితమైన పాము కాటున పడాల్సి వస్తుందని కొంతమంది వన్యప్రాణి సంరక్షకులు చెబుతున్నారు.
Also Read: Old Woman Video: పాపం.. 70 ఏళ్ల వృద్ధురాలు తిప్పలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Employee Bonus Telugu Latest News: ప్రస్తుత కాలంలో కంపెనీ లాభాల కోసం ఎంప్లాయిస్పై ఊహించని ఒత్తిడి పెడుతుంటే.. ఒక చైనీస్ కంపెనీ మాత్రం తన ఉద్యోగుల పట్ల అపారమైన ప్రేమను చాటుకుంది. తమ వార్షిక లాభాల్లో పెద్ద భాగాన్ని ఉద్యోగులకే బోనస్ గా ప్రకటించి వార్తల్లో నిలిచాడు ఆ కంపెనీ యజమాని.. చైనాకు చెందిన హెనాన్ కువాంగ్షాన్ క్రేన్ కంపెనీ ఉద్యోగులకు ఏకంగా 180 మిలియన్ యువాన్ల బోనస్ ను పంపిణీ చేశారు. ఇప్పటికీ ఇంత ఊహించని స్థాయిలో బోనస్ ప్రకటించిన కంపెనీలో ఈ కంపెనీ నిలిచిపోయింది.
అయితే, కంపెనీకి సంబంధించిన యజమాని బోనస్ పంపిణీ కార్యక్రమాన్ని కూడా అత్యంత వైభవంగా సెలబ్రేట్ చేశారు. కంపెనీ నిర్వహించిన వార్షిక వేడుకలో సుమారు 7000 మంది ఉద్యోగులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వేదికపై భారీ టేబుల్ ల మీద నగదు కట్టలను కుప్పలుగా పేర్చారు. సుమారు 80 కోట్లను అక్కడక్కడే నగదు రూపంలో పంపిణీ చేయడం విశేషం.. అంతేకాకుండా ఉద్యోగులకు ఒక ఆసక్తికరమైన టాస్కులు కూడా పెట్టారు.. వేదికపై ఉన్న నగదును వారు చెప్పిన సమయంలో ఎంత లెక్కపెట్టగలిగితే.. ఆ మొత్తాన్ని వారి ఇంటికి తీసుకెళ్లవచ్చు అని తెలిపారు. దీంతో ఉద్యోగులు ఎంతో ఉత్సాహంగా నగదు కట్టలను చేతిలోకి తీసుకుంటున్న వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
2025 సంవత్సరం ఈ కంపెనీ సుమారు 270 మిలియన్ల యువాన్ల లాభాలు పొందినట్లు సమాచారం. ఇందులో దాదాపు 70 శాతం మొత్తాన్ని అంటే 180 మిలియన్ యువాన్లను ఉద్యోగులకు బోనస్ రూపంలో ఇవ్వడం ఇప్పుడు విశేషం.. కంపెనీ చైర్మన్ పీజున్ మాట్లాడుతూ.. యువత ప్రస్తుతం కారులోన్లతో పాటు ఇంటి లోన్లతో సతమతమవుతున్నారు.. వారికి మా వంతుగా కొంత ఉపశమనం కలిగించాలన్నదే కంపెనీ ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు..
Also Read: Garikapati Narasimha Rao: లివింగ్ రిలేషన్ ఒక కొత్త దరిద్రం.. మంథనిలో గరికిపాటి సంచలన వ్యాఖ్యలు!
గతంలో కూడా ఈ కంపెనీ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా ఉద్యోగులకు భారీ గిఫ్ట్లను అందించింది. దీంతో ఈ యజమానికి డబ్బులు పంచెయ్ బాస్గా పేరు ఉంది. కేవలం గిఫ్టులతో పాటు వస్తువులకు పరిమితం కాకుండానే.. ఈ కంపెనీకి సంబంధించిన బాస్ నేరుగా నగదును చేతిలో పెడతారు. దీనివల్ల ఉద్యోగులకు వస్తువుల కంటే ఎక్కువగా నగదుతో ఉపయోగముంటుందనే అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఇలా చేస్తారని కంపెనీలోని కొంతమంది అధికారులు చెబుతున్నారు. అయితే ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియోలను చూసి సోషల్ మీడియా వినియోగదారులు ఆశ్చర్యానికి గురవుతున్నారు.
Also Read: Garikapati Narasimha Rao: లివింగ్ రిలేషన్ ఒక కొత్త దరిద్రం.. మంథనిలో గరికిపాటి సంచలన వ్యాఖ్యలు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
YCP MLCs Attack On Somu Veerraju: ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో గురువారం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం కాస్తా తోపులాట వరకు వెళ్లడంతో సభలో గందరగోళం నెలకొంది. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ (BJP) ఎమ్మెల్సీ సోము వీర్రాజుపై వైకాపా సభ్యులు దాడికి యత్నించడం సంచలనంగా మారింది.
అసలేం జరిగింది?
మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో రాయలసీమ ఎత్తిపోతల పథకంపై చర్చ జరిగింది. దీనిపై నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సుదీర్ఘంగా సమాధానం ఇచ్చారు. మంత్రి సమాధానం పూర్తయిన వెంటనే, ఈ అంశంపై మరింత చర్చ జరపాలని వైకాపా సభ్యులు పట్టుబట్టారు.
అయితే, మంత్రి సమాధానం ముగియడంతో మండలి ఛైర్మన్ మోషేనురాజు తదుపరి ప్రశ్నకు అవకాశం కల్పించారు. ఈ క్రమంలో భాజపా ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడేందుకు ప్రయత్నించగా, నిరసన తెలుపుతున్న వైకాపా సభ్యులు ఒక్కసారిగా ఆయనపైకి దూసుకెళ్లారు.
ముగ్గురు ఎమ్మెల్సీల దూకుడు
వైకాపా ఎమ్మెల్సీలు ఇజ్రాయెల్, విక్రాంత్, రమేశ్ యాదవ్లు సోము వీర్రాజు వైపు వేగంగా దూసుకువచ్చారు. "మేము నిరసన తెలుపుతుంటే మీరు మైక్ ఎలా తీసుకుంటారు?" అంటూ ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ దాడికి యత్నించారు. ఈ అనూహ్య పరిణామంతో సభలో ఒక్కసారిగా ఉత్కంఠ నెలకొంది.
అడ్డుకున్న మంత్రులు - సభ వాయిదా
సోము వీర్రాజుపై వైకాపా సభ్యులు దూసుకురావడాన్ని గమనించిన మంత్రులు వంగలపూడి అనిత, గొట్టిపాటి రవికుమార్ తక్షణమే స్పందించారు. వారు వీర్రాజుకు మద్దతుగా నిలిచి, వైకాపా సభ్యులను అడ్డుకున్నారు. ఉభయ పక్షాల మధ్య వాగ్వాదం పెరగడంతో సభ నియంత్రణ తప్పింది.
పరిస్థితిని చక్కదిద్దేందుకు మండలి ఛైర్మన్ మోషేనురాజు సభను కొద్దిసేపు వాయిదా వేశారు. శాసన సభ, మండలిలో సభ్యులు హుందాగా వ్యవహరించాల్సింది పోయి, ఇలా భౌతిక దాడులకు దిగడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
TTD Room Booking Fraud: తిరుమల శ్రీవారి దర్శనం, వసతి గదుల బుకింగ్ పేరుతో భక్తులు మరోసారి నిలువునా మోసపోతున్నారు. భక్తులను మోసం చేస్తున్న దళారులు, నకిలీ వెబ్సైట్లపై తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) తీవ్రస్థాయిలో మండిపడింది. భక్తులు మోసపోకుండా ఉండేందుకు టీటీడీ విజిలెన్స్ విభాగం ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసింది.
వెలుగులోకి వచ్చిన ఘటన
కేరళకు చెందిన సి.కె. సురేష్ బాబు అనే భక్తుడు తిరుమలలో గదులు ఇప్పిస్తామన్న దళారుల మాటలు నమ్మి మోసపోయారు. 'కర్ణాటక ప్రవాసి సౌధ' పేరుతో గదులు బుక్ చేస్తామని చెప్పి ఆయన దగ్గర డబ్బులు వసూలు చేశారు. ఈ ఘటనపై ఫిర్యాదు అందడంతో రంగంలోకి దిగిన టీటీడీ విజిలెన్స్ విభాగం, దళారుల నెట్వర్క్ను ఛేదించే పనిలో పడింది.
నకిలీ వెబ్సైట్లు ఎలా గుర్తిస్తారు?
టీటీడీ ఐటీ విభాగం జరిపిన విచారణలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. టీటీడీ అధికారిక చిహ్నాలు, శ్రీవారి ఆలయ చిత్రాలను వాడుతూ అచ్చం ఒరిజినల్ వెబ్సైట్లాగే భక్తులను నమ్మిస్తున్నారు. గూగుల్లో సర్చ్ చేసినప్పుడు ఈ ఫేక్ సైట్లు ముందుగా కనిపిస్తూ, ఆన్లైన్ పేమెంట్ల ద్వారా భక్తుల సొమ్మును కాజేస్తున్నాయి. ఇప్పటికే అటువంటి వెబ్సైట్లపై కాపీరైట్ చట్టం కింద పోలీసులు కేసులు నమోదు చేశారు.
భక్తులు పాటించాల్సిన జాగ్రత్తలు..
శ్రీవారి భక్తులు కింది విషయాలను గుర్తుంచుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. దర్శనం, వసతి, సేవ టికెట్ల కోసం కేవలం అధికారిక వెబ్సైట్ను మాత్రమే సంప్రదించండి. తిరుమలలో వసతి గదులు ఇప్పిస్తామనే దళారులను అస్సలు నమ్మకండి. ఏదైనా అనుమానాస్పద ఫోన్ కాల్స్ లేదా వెబ్సైట్లు కనిపిస్తే వెంటనే టీటీడీ అధికారులకు సమాచారం అందించండి.
ముఖ్య సూచన: భక్తుల సౌకర్యార్థం టీటీడీ ఒకే ఒక అధికారిక వెబ్సైట్ను నిర్వహిస్తోంది. దయచేసి ఇతర ప్రైవేట్ లింకుల ద్వారా డబ్బులు చెల్లించి మోసపోవద్దు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Telangana Crime News: ఒకే రోజు డబుల్ షాక్.. రూ.7 లక్షల ఫేక్ గోల్డ్ స్కాం.. 6 తులాల బంగారం దోపిడి..!!
Fake Gold Scam: తెలంగాణలోని రెండు జిల్లాల్లో చోటుచేసుకున్న వేర్వేరు ఘటనలు ప్రజల్లో భయాందోళన రేపుతున్నాయి. ఒకటి ఫేక్ గోల్డ్ పేరుతో జరిగిన ఘరానా మోసం కాగా, మరొకటి పట్టపగలే జరిగిన ఇంటి దొంగతనం. నల్లగొండ జిల్లాలో ఫేక్ గోల్డ్ పేరుతో 7 లక్షల వరకు మోసపోయిన బాధితులు బోరుమంటుంటే.. నాగర్ కర్నూల్ జిల్లాలోని అచ్చంపేట మండలం హాజీపూర్ గ్రామంలో ఓ ఇంట్లోకి చొరబడిన దుండగలు 6 తులాల బంగారాన్ని ఎత్తుకెళ్లారు. ఈ రెండు సంఘటనలు అప్రమత్తత ఎంత ముఖ్యమో మళ్లీ గుర్తు చేస్తున్నాయి.
నల్లగొండ జిల్లాలోని శాలిగౌరారం మండలం రామానుజపురంలో మోసగాళ్ల ముఠా చాకచక్యంగా పన్నిన పథకం వెలుగులోకి వచ్చింది. విజయవాడ ప్రాంతానికి చెందిన భార్యాభర్తలు మరో వ్యక్తితో కలిసి గ్రామాల్లో సంచరిస్తూ అమాయకులను టార్గెట్ చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. విజయవాడ వరదల్లో దొరికిన బంగారం అని చెప్పి తక్కువ ధరకు అమ్ముతామని నమ్మబలికారు. మొదట అసలు బంగారం ముక్కను నమూనాగా చూపించి నమ్మకం కలిగించారు. ఆ నమ్మకంతో గ్రామానికి చెందిన వ్యక్తి రూ.7 లక్షలు చెల్లించి ఆభరణాలు కొనుగోలు చేశాడు. అయితే తర్వాత పరీక్షించగా అవి ఇత్తడి అని తేలడంతో అసలు మోసం బయటపడింది. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని, ఈ ముఠా వెనుక మరెవరైనా ఉన్నారా అనే దిశగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. తక్కువ ధరకు బంగారం ఇస్తామంటూ వస్తే నమ్మవద్దని అధికారులు ప్రజలకు హెచ్చరిక జారీ చేశారు.
ఇక మరో ఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో చోటుచేసుకుంది. అచ్చంపేట మండలం హాజీపూర్ గ్రామంలో సైదులు అనే వ్యక్తి ఇంట్లో మధ్యాహ్నం సమయంలోనే దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఇంటి యజమాని పనిమీద బయటకు వెళ్లిన సమయంలో తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. బీరువాను పగలగొట్టి నగదు, సుమారు 6 తులాల బంగారం అపహరించారు. సాయంత్రం ఇంటికి చేరుకున్న కుటుంబ సభ్యులు ఇల్లు చిందరవందరగా ఉండటాన్ని చూసి షాక్కు గురయ్యారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించారు. క్లూస్ టీమ్ సహాయంతో దర్యాప్తు ముమ్మరం చేశారు. గ్రామాల్లో కొత్త వ్యక్తుల కదలికలపై సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు. రెండు జిల్లాల్లో జరిగిన ఈ ఘటనలు గ్రామీణ ప్రాంతాల్లోనూ నేరగాళ్లు చురుగ్గా ఉన్నారనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.
ఇక ఫేక్ గోల్డ్ పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు చెబుతున్నారు. బంగారం పేరుతో కాపర్, బ్రాస్ వంటి లోహాలను ప్రత్యేక్షంగా పాలిస్ చేసి గోల్డ్ లుక్ వచ్చే విధంగా తయారు చేస్తారు. రెడ్ కలర్ షేడ్ ఉండటంతో ఇది సాధారణ బంగారం వలే కనిపిస్తుంది. మొదట కొనుగోలు చేసినప్పుడు మెరుస్తుంది. కానీ కొద్ది వారాల్లోనే రంగు తగ్గుతుంది. మచ్చలు పడటం, మెటల్ వెలిసిపోతుంది. ముఖ్యంగా ఇందులో గోల్డ్ కంటెంట్ జీరో. అందుకే రీసేల్ వాల్యూ ఉండదు. లోన్ తీసుకోవడం కూడా సాధ్యం కాదు. ఈ స్కామ్ ఎక్కువగా రూడ్లపై.. చిన్న మార్కెట్లో సోషల్ మీడియాలో గ్రూపుల్లో సర్క్యూలేట్ అవుతోంది. ఇంపోర్ట్ గోల్డ్, స్మగ్లింగ్ స్టాక్, డ్యూటీ లేకుండా వచ్చిన బంగారం అంటూ మార్కెట్ ధర కంటే 20శాతం నుంచి 40శాతం తక్కువ ఇస్తామని నమ్మబలుకుతున్నారు. వెంటనే నిర్ణయం తీసుకోవాలంటూ ఒత్తిడి చేస్తుంటారు. బిల్లు ఉండదు. అసలు బిస్ హాల్ మార్క్ఉండదు. ఫేక్ స్టాంప్ వేసి ఇస్తారు. కొన్న తర్వాత వారి ఫోన్ నెంబర్స్ కూడా పనిచేయవు. ఇదే వారి మోసం. ఇలాంటి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు కోరుతున్నారు.
Also Read: Gold: మార్కెట్లో బంగ్లాదేశ్ ఫేక్ గోల్డ్ చక్కర్లు.. గుర్తు పట్టడం దేవుడి వల్ల కూడా కాదు..!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
India Vs Zimbabwe Match Preview: చెన్నైలోని చెపాక్ స్టేడియం నేడు బ్లూ జెర్సీలతో నిండిపోనుంది. టీ20 ప్రపంచకప్ సూపర్-8లో టీమ్ఇండియా ఈ రోజు కీలక మ్యాచ్ ఆడనుంది. టోర్నీ సెమీఫైనల్కు వెళ్లేందుకు ఈ మ్యాచ్ చావోరేవో తేల్చుకోవాల్సిన సమయం సూర్యసేన ఎదురుకొంటోంది. జింబాబ్వేతో జరిగే ఈ మ్యాచ్లో తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితి ఉండడం వల్ల అభిమానుల్లో కూడా అంచనాలు భారీగా పెరిగిపోయాయి. మరోవైపు ప్రత్యర్థి జట్టు కూడా బలంగా కనిపించడం వల్ల ఇప్పుడు ఫ్యాన్స్లో మరింత టెన్షన్ వాతావరణం నెలకొంది.
మ్యాచ్ సమాచారం:
టీ20 ప్రపంచకప్ సూపర్-8లో భాగంగా నేడు అనగా ఫిబ్రవరి 26న భారత్, జింబాబ్వే మధ్య మ్యాచ్ జరగనుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 7:00 గంటలకు (IST) చెన్నైలోని చెపాక్ స్టేడియం ఈమ్యాచ్కు వేదిక కానుంది. సెంట్రల్ పిచ్ (నెం. 5)పై మ్యాచ్ జరగనుంది. ఇది నల్లరేగడి నేల పిచ్.. గత మ్యాచ్ల్లో ఈ పిచ్ పై జరిగిన స్కోర్లు 200 వరకు నమోదయ్యాయి. దీంతో ఈ పిచ్లో జరిగే మ్యాచ్ బ్యాటర్లకు పండగే.
భారత జట్టు
భారత బ్యాటింగ్ లైనప్పై ఇప్పుడు తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా టాప్-ఆర్డర్ విఫలం కావడం ఆందోళన కలిగిస్తోంది. లెఫ్ట్-రైట్ కాంబినేషన్ కోసం సంజు శామ్సన్ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. మరోవైపు తన తండ్రి అనారోగ్యం కారణంగా జట్టుకు దూరమైన రింకూ, బుధవారం సాయంత్రం తిరిగి జట్టుతో చేరాడు. జింబాబ్వేలో ఎక్కువ మంది కుడిచేతి వాటం బ్యాటర్లు ఉన్నందున అక్షర్ పటేల్ తిరిగి జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది.
టీమ్ఇండియా జట్టు అంచనా..
అభిషేక్ శర్మ, సంజు శామ్సన్ (wk), ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ (c), శివం దుబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, అర్ష్దీప్ సింగ్, వరుణ్ CV, జస్ప్రీత్ బుమ్రా.
జింబాబ్వే తుదిజట్టు విశ్లేషణ..
వెస్టిండీస్ చేతిలో ఓటమి తర్వాత జింబాబ్వే కూడా ఇప్పుడు గెలిచి తీరాల్సిన స్థితిలో ఉంది. ముంబై మ్యాచ్లో గాయపడిన కెప్టెన్ సికందర్ రజా కోలుకున్నాడు, అతను 100% ఆడుతున్నట్లు జట్టు వర్గాలు తెలిపాయి. జింబాబ్వేలో వైవిధ్యమైన బౌలింగ్ ఆప్షన్లు ఉన్నాయి. ముఖ్యంగా లెగ్ స్పిన్నర్ ర్యాన్ బర్ల్ భారత్కు సవాల్ విసరే అవకాశం ఉంది.
జింబాబ్వే తుదిజట్టు అంచనా..
బ్రియాన్ బెన్నెట్, తడివానాషే మరుమాని (wk), డియోన్ మైయర్స్, ర్యాన్ బర్ల్, సికందర్ రాజా (c), టోనీ మున్యోంగా, తషింగా ముసేకివా, బ్రాడ్ ఎవాన్స్, గ్రేమ్ క్రీమర్, రిచర్డ్ న్గారావ, బ్లెస్సింగ్ ముజారబాని.
మీకు తెలుసా?
1) ఈ ప్రపంచకప్లో భారత ఓపెనింగ్ వికెట్ సగటు కేవలం 6.80 మాత్రమే. ఇది అన్ని జట్ల కంటే తక్కువ.
2) 2024 నుంచి ఇప్పటివరకు T20Iలలో 1748 పరుగులతో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా బెన్నెట్ రికార్డు సృష్టించాడు.
3)భారత్ తరపున బుమ్రా (33), అర్ష్దీప్ (32) వికెట్లతో టాప్ ఫామ్లో ఉన్నారు.
దక్షిణాఫ్రికా చేతిలో ఓటమి తర్వాత సెమీఫైనల్ బెర్త్ కోసం నెట్ రన్ రేట్ (-3.800) కీలకం కానుంది. కాబట్టి జింబాబ్వేపై భారీ విజయం సాధించడం టీమ్ ఇండియాకు అత్యవసరం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Cardiac Arrest Death: పాఠశాలలో తన స్నేహితులతో సరదాగా ఆడుకుంటున్న బాలిక అకస్మాత్తుగా కుప్పకూలిపోయింది. ఆట స్థలంలో ఆడుకుంటున్న సమయంలో బాలిక కూలిపోయింది. తోటి విద్యార్థులు.. ఉపాధ్యాయులు బాలికను లేపి చూడగా ఎంతకీ లేవలేదు. వెంటనే హడావుడిగా ఆస్పత్రికి తరలించగా.. పరిశీలించిన వైద్యులు అప్పటికే బాలిక మృతి చెందిందని వాపోయారు. ఈ సంఘటన రాజస్థాన్లోని ఓ పట్టణంలో జరిగింది. బాలిక కుప్పకూలుతున్న వీడియో వైరల్గా మారింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
Also Read: Milk Tragedy: తెలంగాణలో కల్తీపాలు తయారీ.. డబ్బు కోసం వ్యాపారి కక్కుర్తి
రాజస్థాన్లోని నాగౌర్ జిల్లా గోటన్ పట్టణానికి చెందిన రాజేంద్ర బపేడియా కుమార్తె దివ్య (9) స్థానికంగా ఉన్న ఇంటర్నేషనల్ స్కూల్లో 5వ తరతగతి చదువుతుండేది. నిత్యం పాఠశాలకు వెళ్లి బుద్ధిగా చదువుకునేది. ఆటల సమయంలో ఆటలు ఆడేది. ఈనెల 23వ తేదీన యథావిధిగా పాఠశాలకు వచ్చిన దివ్య పాఠశాల తరగతులు అయిపోయిన తర్వాత మైదానంలో ఆటలాడుకుంటోంది. ఈ సమయంలో అకస్మాత్తుగా దివ్య కుప్పకూలిపోయింది.
Also Read: Save Punarvika: చిన్నారి పునర్వికకు నారా లోకేశ్ అండ.. రూ.6 కోట్ల భారీ విరాళం
తమ స్నేహితురాలు కుప్పకూలిపోవడంతో తోటి స్నేహితులు లేపి చూసినా లేవలేదు. దీంతో అక్కడే ఉన్న పాఠశాల సిబ్బందితోపాటు టీచర్లు దివ్యను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే బాలిక మృతిచెందారని వైద్యులు ధ్రువీకరించారు. అయితే బాలికకు ఎలాంటి గాయాలు కాకపోవడం గమనార్హం. ఎలాంటి గాయాలతో మృతి చెందలేదని.. గుండెపోటు కారణంగా బాలిక మృతి చెంది ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. దీంతో దివ్య కుటుంబం తీవ్ర విషాదంలో మునిగింది. అయితే ఆ కుటుంబంలో ఇలాంటి సంఘటన రెండోది కావడం కలచివేస్తోంది.
రాజేంద్ర బపేడియాకు గతంలో కుమారుడు కూడా ఉండేవాడు. ఆ బాలుడు కూడా దివ్య మాదిరి చనిపోయాడు. దివ్య సోదరుడు అభిషేక్ గుండెపోటుతోనే మరణించినట్లు వారి బంధుమిత్రులు గుర్తుచేస్తున్నారు. గతేడాది సెప్టెంబర్లో ఆ బాలుడు ఇంట్లో ఆడుకుంటూ కూలిపోయాడు. ఆందోళన చెందిన కుటుంబసభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే అభిషేక్ మరణించాడు. ఇప్పుడు బాలుడి చెల్లెలు దివ్య కూడా అదే తీరున మరణించడంతో ఆ కుటుంబం తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యింది. నెలల వ్యవధిలో ఇద్దరు పిల్లలను కోల్పోయిన ఆ కుటుంబం తీరని విషాదంలో మునిగింది. ఒక కుటుంబంలోని ఇద్దరు ఇలా హఠాన్మరణం చెందడం చూస్తే జన్యుపరమైన లోపం ఏమైనా ఉంటుందా? అనే చర్చ జరుగుతోంది. వంశపారంపర్యగా వచ్చిన అనారోగ్య సమస్యలతో ఇలా మరణిస్తున్నారా? అనే చర్చ జరుగుతోంది. దీంతో ఆ కుటుంబం వైద్య పరీక్షలు చేయించుకోనుంది. కాగా తోటి బాలిక మృతితో ఆ పాఠశాలలో తీవ్ర విషాదం ఏర్పడింది. పాఠశాలలో బాలిక కుప్పకూలిపోయిన వీడియో నెట్టింట్లో వైరల్గా మారింది.
Nagaur में 9 साल की बच्ची की हार्ट अटैक से मौत!
खेल के मैदान में मासूम की अचानक तबीयत बिगड़ी और जान चली गई। pic.twitter.com/C7yxKEb1KM— एक नजर (@1K_Nazar) February 26, 2026
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
SCSS: రిటైర్మెంట్ తర్వాత స్థిరమైన ఆదాయం ఎలా పొందాలన్న ఆందోళన చాలామందిలో ఉంటుంది. ముఖ్యంగా పెన్షన్ సౌకర్యం లేని వారికి భద్రమైన పెట్టుబడి మార్గం అవసరం అవుతుంది. అలాంటి వృద్ధుల కోసం పోస్టాఫీసు అందిస్తున్న సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS) ఒక విశ్వసనీయమైన ఎంపికగా నిలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం మద్దతుతో అమలవుతున్న ఈ పథకం ప్రస్తుతం 8.2 శాతం వార్షిక వడ్డీ రేటును అందిస్తోంది. ఇది సాధారణ ఫిక్స్డ్ డిపాజిట్లతో పోలిస్తే ఆకర్షణీయమైన రాబడిగా భావిస్తున్నారు.
ఈ పథకంలో పెట్టుబడి పెట్టిన మొత్తంపై వడ్డీ ప్రతి మూడు నెలలకు ఒకసారి నేరుగా ఖాతాదారుడి సేవింగ్స్ ఖాతాలో జమ అవుతుంది. దీని వల్ల నెలనెలా ఖర్చులకు అవసరమైన స్థిరమైన నగదు ప్రవాహం లభిస్తుంది. ఉదాహరణకు.. గరిష్ట పరిమితి అయిన రూ.30 లక్షలు ఒకేసారి డిపాజిట్ చేస్తే, 8.2 శాతం వడ్డీ ప్రకారం సంవత్సరానికి సుమారు రూ.2,46,000 ఆదాయం వస్తుంది. దాన్ని నెలవారీ సగటుగా లెక్కిస్తే దాదాపు రూ.20,500 వరకు పొందవచ్చు. అయితే వడ్డీ చెల్లింపులు త్రైమాసికంగా జరుగుతాయి.
పన్ను ప్రయోజనాల పరంగా కూడా ఈ పథకం ప్రయోజనకరంగా ఉంటుంది. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సి కింద రూ.1.5 లక్షల వరకు మినహాయింపు పొందే అవకాశం ఉంది. దీని ద్వారా పెట్టుబడిదారులకు అదనపు ఆర్థిక ఉపశమనం లభిస్తుంది. ఇక అర్హత విషయానికి వస్తే, సాధారణంగా 60 ఏళ్లు నిండినవారు ఇందులో చేరవచ్చు. స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్నవారు 55 ఏళ్ల వయస్సు నుంచే అర్హులవుతారు. మాజీ సైనికోద్యోగులకు వయస్సు పరిమితి 50 ఏళ్లు. కనీస పెట్టుబడి రూ.1,000 కాగా, గరిష్టంగా రూ.30 లక్షలు వరకు ఒకేసారి డిపాజిట్ చేయాలి; విడతలుగా పెట్టుబడి పెట్టే అవకాశం లేదు.
అయితే.. రిస్క్ తక్కువగా ఉండే, ప్రభుత్వ హామీతో కూడిన స్థిర ఆదాయం కోరుకునే సీనియర్ సిటిజన్లకు ఈ పథకం ఒక భరోసా మార్గంగా నిలుస్తోంది. పదవీ విరమణ తర్వాత ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుకోవాలనుకునే వారికి ఇది సముచితమైన ఎంపికగా నిపుణులు సూచిస్తున్నారు.
Also Read: Gold: మార్కెట్లో బంగ్లాదేశ్ ఫేక్ గోల్డ్ చక్కర్లు.. గుర్తు పట్టడం దేవుడి వల్ల కూడా కాదు..!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
AP Assembly Session: '2047 విజన్లో భాగంగా నీటి భద్రతపైనే కూటమి ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించింది. గోదావరి, కృష్ణా పుష్కరాలను కూడా ఘనంగా నిర్వహించే బాధ్యత మా ప్రభుత్వానికే వచ్చింది' అని తెలిపారు. గోదావరికి అఖండ హారతి, కృష్ణా నదికి పవిత్ర హారతి ఇచ్చి జలాలను అత్యంత విలువైన వనరుగా భావిస్తున్నట్లు సీఎం చంద్రబాబు చెప్పారు. సాగునీటి రంగంపై శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగించారు. ఈ సందర్భంగా సాగునీటిపై కీలక ప్రకటనలు చేశారు.
Also Read: Milk Tragedy: తెలంగాణలో కల్తీపాలు తయారీ.. డబ్బు కోసం వ్యాపారి కక్కుర్తి
'గోదావరి నది నుంచి సగటున ఏడాదికి 3 వేల టీఎంసీల నీళ్లు సముద్రంలోకి వృథాగా పోతున్నాయి. వంశధార నుంచి పెన్నా వరకూ రాష్ట్రంలో నదులను అనుసంధానిస్తే సమస్యలు పరిష్కారం అవుతాయి. గంగా-కావేరీ అనుసంధానం జరగాలన్నది నా ప్రగాఢమైన ఆకాంక్ష' అని అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ప్రకటించారు. 'గంగా-కావేరి అనుసంధానం సాధ్యాసాధ్యాలపై ఆనాడే చర్చలు జరిగాయి. నదులు అనుసంధానం చేసి తెలుగు తల్లికి జలహారతి ఇచ్చేలా ప్రణాళికలు చేస్తున్నాం. హంద్రీనీవా కాలువ ద్వారా 738 కిలోమీటర్ల మేర కాలువల విస్తరించి కుప్పంలో పరమ సముద్రం చెరువు వరకూ నీరిచ్చాం. మడకశిర వరకూ నీళ్లు తీసుకెళ్లి ఆ ప్రాంత దాహార్తిని తీర్చాం' అని వివరించారు.
Also Read: Save Punarvika: చిన్నారి పునర్వికకు నారా లోకేశ్ అండ.. రూ.6 కోట్ల భారీ విరాళం
'ఆంధ్రప్రదేశ్లో కట్టిన ప్రాజెక్టులన్నీ టీడీపీ, కూటమి హయాంలో వచ్చినవే. ధవళేశ్వరం బ్యారేజి కట్టిన కాటన్ దొరను ఇప్పటికీ గుర్తుంచుకుంటున్నాం. ఆనాడు రాయలసీమకు తెలుగు గంగ, గాలేరు నగరి, హంద్రినీవా లాంటి ప్రాజెక్టులు చేపట్టింది ఎన్టీఆర్' సీఎం చంద్రబాబు ప్రకటించారు. '2014-19లో రూ.68 వేల కోట్లు సాగునీటిపై వ్యయం చేశాం. గడచిన 20 నెలలుగా రూ.20 వేల కోట్ల వరకూ ఖర్చు చేయగలిగాం. పట్టిసీమ ద్వారా కృష్ణాడెల్టాకు నీరిచ్చి, శ్రీశైలంలో నీటిని పొదుపు చేసి 100 టీఎంసీలను రాయలసీమకు తరలించాం. అందుకే ఆ ప్రాంతం రతనాల సీమగా మారింది' అని సీఎం చంద్రబాబు తెలిపారు.
Also Read: VK Sasikala: తమిళనాడు రాజకీయాల్లో సంచలనం.. కొత్త పార్టీ పెట్టనున్న చిన్నమ్మ
వెలిగొండ పూర్తి చేసి మార్కాపురం సహా వివిధ ప్రాంతాలకు న్యాయం చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఆర్ధిక ఇబ్బందులు ఉన్నా మార్కాపురం, ఒంగోలు జిల్లాలను సస్యశ్యామలం చేస్తామని తెలిపారు. '30 ఏళ్ల ముందు ఆ ప్రాజెక్టు శంకుస్థాపన చేసి.. మొదటి దశను ఈ ఏడాది జూలైలోనే పూర్తి చేసి నీళ్లు ఇస్తాం. వెలిగొండ ప్రాజెక్టుకు రూ.2500 కోట్ల మేర ఇంకా ఖర్చు చేయాల్సి ఉంది. రూ.456 కోట్లతో ఫీడర్ కాలువ లైనింగ్ పనులకు శంకుస్థాపన చేశాం. క్రెడిట్ చోరీ చేసే అంశం ఆ పార్టీదే. వెలిగొండకు నీళ్లు రాకుండా రిబ్బన్ కట్ చేశారు. కుప్పంలోనూ ట్యాంకర్లు తీసుకువచ్చి కాలువలో పోశారు. ఉత్తరాంధ్ర ప్రాజెక్టులపై 5 ఏళ్ల పాటు గత పాలకులు నిర్లక్ష్యం చేశారు' అని సీఎం చంద్రబాబు వివరించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Congress AIMIM Party Alliance: తెలంగాణలో ఎంఐఎం దోస్తానాపై కాంగ్రెస్ పెద్దలు.. సీఎం రేవంత్ రెడ్డి అప్రమత్తం చేసినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో ఎంఐఎం తమ మిత్రపక్షమని భావిస్తున్న సీఎం రేవంత్ రెడ్డిని జాగ్రత్తగా ఉండాలని రాహుల్ గాంధీ సూచించినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలను నిలువరించడంతో పాటు మజ్లిస్ పార్టీని కట్టడి చేసే అంశం రాహుల్ గాంధీ ప్రస్తావించినట్లు టాక్ వినిపిస్తోంది. ఎంఐఎం ఎంతగా విస్తరిస్తే అంతగా బీజేపీ ఎదుగుతుందని రాహుల్ అభిప్రాయపడినట్టు సమాచారం. ఇప్పటికే అనేక ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీ ఎదు గుదలకు ఎంఐఎం పరోక్షంగా సహకరిస్తోందని రాహుల్ గాంధీ నేతలను వారించినట్టు తెలిసింది. ఎంఐఎంను కాంగ్రెస్ భాగస్వామిగా ప్రజలు భావిస్తే గ్రామీణ ప్రాంతాల్లో హిందువుల ఓట్లలో చీలిక వచ్చే అవకాశాలపై అనుమానాలు లేవనెత్తినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. దీనిపై మరోమారు విస్తృతంగా చర్చిద్దామని ఖర్గే అన్నట్టు చెబుతున్నారు.
ఇటీవల మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సీట్లను దక్కించుకుంది. అయినప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో బీఆర్ఎస్, పట్టణ ప్రాంతాల్లో బీజేపీ బలంగా ఉన్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ 29 శాతం ఓట్లు సాధిస్తే, బీజేపీ 16 శాతం ఓట్లును దక్కించుకుంది. అంతకుముందు సర్పంచ్ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ పార్టీకి 30 శాతం సీట్లు వచ్చాయి. బలం మరింత పెంచుకునేందుకు రెండు పార్టీలు గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్ నేతలను జాతీయ నాయకత్వం అలర్ట్ చేసినట్టు తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసుకుంటేనే ఆ పార్టీలను నిలువరించాలని ఆదేశించినట్టు సమాచారం. దీనికి తోడు కొన్ని సామాజిక వర్గాల్లో ఈ రెండు పార్టీలు పట్టు సాధిస్తున్నాయి. దీనిని అభివృద్ధి మంత్రంతో అడ్డుకోవాలని చెప్పారట. అటు యువత, మహిళలను మరింతగా పార్టీకి చేరువ చేయాలని కాంగ్రెస్ హైకమాండ్ చెప్పినట్లు తెలుస్తోంది.
Also Read: Collectors Transfer: మున్సిపల్ ఎన్నికల ఎఫెక్ట్.. తెలంగాణలో 10 జిల్లాల కలెక్టర్లు బదిలీ
మరోవైపు ఇటీవల పలు రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి. ముఖ్యంగా బీహార్, ఢిల్లీ లాంటి పెద్ద రాష్ట్రంలో కాంగ్రెస్ గెలుస్తుందని అన్ని సర్వేలు అంచనా వేశాయి. కానీ కాంగ్రెస్ గెలుపు అవకాశాలను ఎంఐఎం పార్టీ దెబ్బ తీసినట్టు తెలిసింది. ఎంఐఎం పార్టీ పోటీకి దిగిపోయి బీజేపీ గెలుపు అవకాశాలను సులువు చేసిందని అంటున్నారు. అంతకుముందు ఇతర రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ గెలుపు అవకాశాలను ఎంఐఎం పార్టీనే దెబ్బ కొట్టిందని కాంగ్రెస్ హైకమాండ్ పెద్దలు భావిస్తున్నారట. అందుకే ఎంఐఎం పార్టీ విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఆదేశించినట్టు తెలుస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. అయినప్పటికీ ఏమాత్రం ఏమరుపాటు తగదని, ప్రధాన పక్షాలైన బీజేపీ, బీఆర్ఎస్ సైతం బలంగా ఉన్న నేపథ్యంలో మరింత అప్రమత్తతతో వ్యవహరించాలని రాష్ట్ర కాంగ్రెస్ నేతలకు హైకమాండ్ ఆదేశించిందట. సామాజిక న్యాయం అంశంతో కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తున్నప్పటికీ.. జాతీయవాదం, ప్రాంతీయ వాదం నినాదాలతో ప్రతిపక్షాలు జనంలోకి వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని హెచ్చరించినట్టు తెలుస్తోంది.
Also Read: Milk Tragedy: తెలంగాణలో కల్తీపాలు తయారీ.. డబ్బు కోసం వ్యాపారి కక్కుర్తి
మొత్తంమీద ఎంఐఎం విషయంలో కాంగ్రెస్ పెద్దలు అలర్ట్ అయ్యారని తెలుస్తోంది. ఎందుకంటే.. ఎంఐఎం పార్టీ కారణంగా బీజేపీ, బీఆర్ఎస్ బలపడొద్దని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారట. తెలంగాణలో కూడా ఎంఐఎం కారణంగా రెండు పార్టీ పార్టీలు బలపడితే.. తమ అడ్రస్ గల్లంతు అవుతుందని హైకమాండ్ పెద్దలు భావిస్తున్నారట. అందుకే మజ్లిస్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఆదేశించినట్టు తెలుస్తోంది. అయితే రాహుల్ గాంధీ ఆదేశాల తర్వాత.. ఎంఐఎం పార్టీ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ఎలా వ్యవహారిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం రేవంత్ సర్కార్కు అనేక విషయాల్లో ఎంఐఎం మద్దతుగా నిలుస్తోంది. త్వరలోనే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ ఎన్నికలో ఎంఐఎం మద్దతు తప్పనిసరిగా తీసుకుని గ్రేటర్ లో పాగా వేయాలని రేవంత్ భావిస్తున్నారు. ఈ సమయంలో ఎంఐఎం ను కంట్రోల్ చేస్తూ.. మిగతా పార్టీలను ఎలా కట్టడి చేస్తారనేది మాత్రం ఇంట్రెస్టింగ్ మారింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Iran Fertility Rate Fall: ఇస్లామిక్ విప్లవం తర్వాత ఇరాన్లో సంతానోత్పత్తి రేటు గణనీయంగా తగ్గింది. ఒకప్పుడు ప్రతి మహిళకు సగటున 5–6 మంది పిల్లలు ఉండేవారు. ఇప్పుడు ఈ సంఖ్య రెండు కంటే తక్కువకు పడిపోయింది. ఇది చిన్న కుటుంబాలను ప్రోత్సహించే ప్రభుత్వం విధానాలు, ఆర్థిక ఒత్తిడి, మహిళల విద్యా స్థాయిల పెరుగుదల, సమాజంలోని మార్పుల ఫలితంగా ఏర్పడింది.
1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత.. ప్రారంభ దశల్లో ప్రభుత్వ వ్యూహం ఎక్కువ మంది పిల్లలను ప్రోత్సహించడం దిశగా ఉండేది. 1980–1988 ఇరాన్-ఇరాక్ యుద్ధం సమయంలో జనన రేటు మరింత పెరిగింది. అయితే యుద్ధం ముగిసి ఆర్థిక పరిస్థితులు క్షీణించినప్పటి నుండి.. 1990లలో ఇరాన్ ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన కుటుంబ నియంత్రణ కార్యక్రమాలను అమలు చేసింది. ఉచిత గర్భనిరోధక మందులు, వివాహానికి ముందు కుటుంబ నియంత్రణ శిక్షణ, గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవల విస్తరణ వంటి చర్యల ద్వారా పిల్లల సంఖ్య వేగంగా తగ్గింది.
ఇరాన్లో మహిళల విద్యా స్థాయిలు వేగంగా పెరిగాయి. విశ్వవిద్యాలయాల్లో విద్యార్థినుల సంఖ్య పెరిగింది. ఉద్యోగ అవకాశాలు పెరిగాయి. సగటు వివాహ వయస్సు కూడా పెరిగింది. మహిళలు విద్య.. కెరీర్లపై దృష్టి సారించినప్పుడు, వారు సాధారణంగా ఆలస్యంగా వివాహం చేసుకుంటారు. తక్కువ మంది పిల్లలను కనేందుకు ఆసక్తి చూపిస్తుంటారు.ఇప్పుడు ఈ ధోరణి ఇరాన్లో కూడా స్పష్టంగా కనిపిస్తుంది. గతంలో వివాహం, ఎక్కువ మంది పిల్లలు ఉండటం సర్వసాధారణం అయితే, పట్టణ కుటుంబాలు ఇప్పుడు ఒకటి లేదా ఇద్దరు పిల్లలకు పరిమితం కావడానికి ఎంచుకుంటున్నాయి.
Also Read: Gold Silver Rate: బంగారం.. వెండిపై చైనా కీలక ప్రకటన.. ధరలు భారీగా తగ్గే అవకాశం..?
ఇరాన్ మాత్రమే కాదు.. అనేక దేశాలు జనన రేటులో వేగంగా తగ్గుదల చూశాయి. 1970లలో ఒక మహిళకు సుమారు ఐదుగురు పిల్లలు ఉన్న భారతదేశంలో, ఇప్పుడు ఆ సంఖ్య రెండుకు చేరింది. దక్షిణ కొరియాలో పరిస్థితి మరింత దిగ్భ్రాంతికరంగా ఉంది. 1950లలో ఒక మహిళకు సుమారు ఆరుగురు పిల్లలు ఉండగా, 2023లో ఈ రేటు ఒకటి కంటే తక్కువకు పడిపోయింది. అయితే, ఈ తగ్గుదల ప్రతి దేశంలోనూ సరళంగా లేదు. జనన రేటు పెరిగిన 1940, 1960 మధ్య యునైటెడ్ స్టేట్స్ బేబీ బూమ్ను అనుభవించింది.
అయితే ఇరాన్ ప్రభుత్వం ఇప్పుడు తగ్గుతున్న జనన రేటు గురించి ఆందోళన చెందుతోంది. దేశ జనాభా వేగంగా వృద్ధాప్యం అవుతోంది. పని చేసే వయస్సు జనాభాలో తగ్గుదల భవిష్యత్తులో ఆర్థిక ఒత్తిడిని పెంచుతుంది. అందువల్ల, ఇటీవలి సంవత్సరాలలో, ప్రభుత్వం ఎక్కువ మంది పిల్లలను ప్రోత్సహించడానికి ప్రోత్సాహకాలను ప్రారంభించింది. అయితే, మారుతున్న సామాజిక వైఖరులు , ఆర్థిక వాస్తవాల దృష్ట్యా ఈ సవాలు కష్టంగా కనిపిస్తోంది.
Also Read: Gold Rate Today: పసిడి ప్రియులకు అలర్ట్.. ఫిబ్రవరి 26వ తేదీ గురువారం ధరలు ఎలా ఉన్నాయో చూడండి..!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Garikapati Narasimha Rao Telugu Latest News: ప్రస్తుతం సమాజంలో యువత అనుసరిస్తున్న కొన్ని ఇతర దేశాలకు సంబంధించిన పాశ్చాత్య ధోరణులపై ప్రముఖ ప్రవచనకర్త, సహస్రావధాని గరికిపాటి నరసింహారావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.. పెద్దపల్లి జిల్లా మంథనిలోని బుధవారం రాత్రి ఏర్పాటుచేసిన ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగానే ప్రసంగిస్తూ.. లివింగ్ రిలేషన్షిప్ సాంస్కృతిపై కీలక వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ వేదికగా గరికపాటి ఏమన్నారు? చర్చనీ అంశానికి గల కారణాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
హైదరాబాద్ వంటి కొన్ని ప్రధాన నగరాల్లో లీవింగ్ రిలేషన్షిప్ అనే ఒక కొత్త దరిద్రం మొదలైందని గరికపాటి వ్యాఖ్యానించారు.. పెళ్లి అనే పవిత్ర బంధం లేకుండా ఒక అబ్బాయి తో పాటు ఒక అమ్మాయి కలిసి ఉండడం భారతీయ సాంస్కృతికి విరుద్ధమని ఆయన తన ప్రసంగంలో పేర్కొన్నారు.. ఇటువంటి పద్ధతులు సమాజానికి ఏ మాత్రం మంచివి కాదని.. వీటిని ప్రతి ఒక్కరు ఖండించాలని ఆయన పిలుపునిచ్చారు.. అంతేకాకుండా ఇలాంటి ధోరణి వల్ల చాలామంది యువత చెడిపోతున్నారని ఆయన అన్నారు.
అంతేకాకుండా ప్రస్తుత కాలంలో యువత అంతా ప్రేమ పేరుతో తప్పుదోవ పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పెళ్లికి ముందే కలిసి ఉండడం అనేది ప్రేమ కాదని.. అది కేవలం కా**మం మాత్రమేనని ఆయన కుండలు బద్దలు కొట్టి చెప్పారు. ప్రేమకు ఇష్టానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఆయన ఈ సందర్భంగా వివరించారు.. ప్రేమ అనేది విశ్వవ్యాప్తమైనదని.. చాలా పవిత్రమైందని తెలిపారు. ఇష్టమనేది వ్యక్తికి సంబంధించిన తాత్కాలిక భావన మాత్రమేనని ఆయన అన్నారు..
ఇలాంటి వికృత పోగడాలు పెరగకుండా చూడాల్సిన బాధ్యత సమాజంపై తప్పకుండా ఉందన్నారు.. యువత తమ బాధ్యతలను గుర్తించి విలువతో కూడిన జీవనాన్ని గడపాలని ఆయన కోరారు.. మన సాంప్రదాయాలను గౌరవించినప్పుడే సమాజం ఆరోగ్యవంతంగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.. మంథనిలో జరిగిన ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులతో పాటు స్థానికులు పాల్గొని గరికపాటి ప్రవచనాలను ఎంతో ఆసక్తిగా విన్నారు. అంతేకాకుండా అక్కడి పెద్దలు ఆయనకు ప్రత్యేకమైన సత్కారం కూడా చేశారు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి