మధిరలో సబ్ కోర్టు నిర్మాణానికి శంకుస్థాపన
Khammam, Telangana:ఖమ్మం జిల్లా మధిరలో నూతనంగా మంజూరైనా సబ్ కోర్టు(సీనియర్ సివిల్ జడ్జి కోర్టు) భవన నిర్మాణానికి హైకోర్టు జడ్జిలు జస్టిస్ శ్రీ సుధ,కాజ శరత్,భీమపాక నగేష్ లు భూమి పూజచేశారు. అనంతరం తాత్కాలిక భవనంలో ఏర్పాటు చేసిన సబ్ కోర్టు ను హైకోర్టు జడ్జిలు ప్రారంభించారు. ప్రజలకు న్యాయ సేవలు విసృతపరచడం కోసం నూతన కోర్టులకు శ్రీకారం చుట్టినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్జితో పాటు మధిర న్యాయవాదులు పాల్గొన్నారు.हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
నిన్న శ్రీకాళహస్తి.. నేడు తిరుమలలో కీర్తి సురేశ్
Dharmavaram, Andhra Pradesh:Keerthi Suresh Visits Tirumala Temple With VIP Break Darshanప్రభుత్వ ఉద్యోగులకు 'ఆరోగ్యమస్తు'.. జూలై 15వ తేదీన కొత్త ఆరోగ్య పథకం
Hyderabad, Telangana:Employees New Health Scheme: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు పూర్తి ఆరోగ్యం అందించేలా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులకు నిండు ఆరోగ్యం కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం కొత్త ఆరోగ్య పథకాన్ని ప్రారంభించింది. ఉద్యోగ సంఘాలతో చర్చలు, సంప్రదింపులు చేసిన అనంతరం వారి అభిప్రాయాలు తీసుకున్న ప్రభుత్వం కొత్త ఆరోగ్య పథకాన్ని ప్రారంభించబోతున్నది. జూలై 15వ తేదీన ఉద్యోగులకు కానుక అందించనుంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
తెలంగాణ ఉద్యోగులకు సంబంధించి ఆరోగ్య పథకానికి సంబంధించి ఎంప్లాయీస్ హెల్త్కేర్ ట్రస్టు సమావేశమైంది. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో కొత్త ఆరోగ్య పథకం ప్రారంభానికి ముహూర్తం నిర్ణయం తీసుకుంది. జూలై 15వ తేదీ నుంచి నూతన ఆరోగ్య పథకం ప్రారంభిస్తామని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. వారం రోజుల్లో సమగ్రమైన నిబంధనలు విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్యాకేజీ రేట్లు, ఆస్పత్రుల జాబితాను వచ్చే సమావేశంలో ఖరారు చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.
భార్యాభర్తల్లో ఒకరి నుంచి మాత్రమే చందా మినహాయింపు ఇవ్వాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వారం రోజుల్లో హాస్పిటల్ యాజమాన్య ప్రతినిధులతో ఆరోగ్య శాఖ అధికారులు, ట్రస్ట్ సభ్యుల సమావేశం కానుంది. ఈ సమావేశం అనంతరం కీలక నిర్ణయం తీసుకున్నాక కొత్త ఆరోగ్య పథకాన్ని ప్రారంభం చేయనున్నారు. తమ ఆరోగ్య సంరక్షణ కోసం ప్రభుత్వం తీసుకువస్తున్న కొత్త ఆరోగ్య పథకం ఎలా ఉంటుందనేది ఇప్పటివరకు ఉద్యోగులకు ఒక స్పష్టత రాలేదు.
Ireland Vs India: ఐర్లాండ్పై ఓటమి తర్వాత కోచ్ కీలక నిర్ణయం..రేపు జరిగే మ్యాచ్లో టీమ్ఇండియాలో కీలక మార్పులు!
Hyderabad, Telangana:Ireland Vs India Playing 11: ఐర్లాండ్తో జరిగిన తొలి టీ20 మ్యాచ్లో ఎదురైన ఊహించని పరాజయం తర్వాత టీమిండియా మేనేజ్మెంట్ అప్రమత్తమైంది. మూడు మ్యాచ్ల ఈ సిరీస్లో నిలవాలంటే శనివారం జరగబోయే రెండో మ్యాచ్లో భారత్ కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ తుది జట్టులో మూడు కీలక మార్పులు చేసేందుకు వ్యూహాలు రచిస్తున్నట్లు సమాచారం.
భారత జట్టులో జరగబోయే ఆ 3 మార్పుల వివరాలు ఇవేనా?
ప్రసిద్ధ్ కృష్ణపై వేటు..
తొలి మ్యాచ్లో భారత బౌలింగ్ దారుణంగా విఫలమైంది. ముఖ్యంగా పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ 4 ఓవర్లలో వికెట్లేమీ తీయకుండా ఏకంగా 57 పరుగులు సమర్పించుకున్నాడు. డెత్ ఓవర్లలో పరుగులను నియంత్రించడంలో విఫలమవ్వడంతో, రెండో మ్యాచ్లో అతడిని పక్కనబెట్టి బెంచ్పై ఉన్న మరో ప్రతిభావంతుడైన యువ ఫాస్ట్ బౌలర్కు అవకాశం ఇవ్వడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది.
వాషింగ్టన్ సుందర్ ఔట్?
గత మ్యాచ్లో ఆల్రౌండర్గా నిరాశపరిచిన వాషింగ్టన్ సుందర్పై కూడా వేటు పడే అవకాశం ఉంది. తొలి వన్డేలో కేవలం ఒకే ఒక్క ఓవర్ వేసి 19 పరుగులు ఇచ్చిన సుందర్, బ్యాటింగ్లోనూ రాణించలేకపోయాడు. దీంతో స్పిన్ విభాగంతో పాటు లోయర్ ఆర్డర్ బ్యాటింగ్ను బలోపేతం చేసేందుకు అతడి స్థానంలో మరో సమర్థుడైన ఆల్రౌండర్ను బరిలోకి దించనున్నారు.
వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ?
భారత బ్యాటింగ్ ఆర్డర్కు మరింత దూకుడును జోడించేందుకు యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని తుది జట్టులోకి తీసుకోవాలనే డిమాండ్ సోషల్ మీడియాలో గట్టిగా వినిపిస్తోంది. పవర్ప్లేలో వేగంగా పరుగులు రాబట్టగల సూర్యవంశీని జట్టులోకి తీసుకుంటే, భారత ఇన్నింగ్స్కు గట్టి పునాది పడుతుందని కెప్టెన్, కోచ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read: టీ20 ప్రపంచకప్లో దూసుకోపోతున్న భారత్..5 వికెట్ల తేడాతో బంగ్లాను మట్టికరిపించింది!
Also Read: వన్డే జట్టులో ఎట్టకేలకు విరాట్ కోహ్లీ ఆగమనం..కానీ, ఆ పని చేస్తేనే ఆడే ఛాన్స్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
మాజీ మంత్రులకు భారీ షాక్! తెలంగాణలో 100 మంది వీఐపీలకు సెక్యూరిటీ తగ్గింపు
Hyderabad, Telangana:Security Withdraw To RS Praveen Kumar: తెలంగాణలో రాజకీయ నాయకులకు భారీ షాక్ తగిలింది. మాజీ ప్రజాప్రతినిధులకు భారీ షాక్ ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మాజీ మంత్రులు, మాజీ ఎంపీలతోపాటు మాజీ అధికారులు భద్రతా కుదించినట్లు సమాచారం. మొత్తం 100 మంది వీఐపీలకు భద్రత తొలగించడం.. బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు తొలగించినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రజాప్రతినిధుల భద్రతకు సంబంధించి కొత్త నిబంధనలు జూలై 1వ తేదీ నుంచి అమలవుతాయని చర్చ జరుగుతోంది.
కొత్త నిబంధనలు
తెలంగాణలో 100 మంది వీఐపీలకు సెక్యూరిటీ తగ్గించారని విశ్వసనీయ సమాచారం. జూలై 1వ తేదీ నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు వస్తాయని వాటిలో భాగంగా బుల్లెట్ప్రూఫ్ వాహనాలు, గన్మెన్ల ఉపసంహరణ ఉంటుందని తెలుస్తోంది. కొత్త నిబంధనల్లో భాగంగా మాజీ మంత్రులు, మాజీ ఎంపీల సెక్యూరిటీ తగ్గించే అవకాశం ఉంది. రాష్ట్రంలో మావోయిస్టుల కదలికలు, నక్సల్స్ ముప్పు పూర్తిగా అదుపులోకి రావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మావోయిస్టుల హెచ్చరికలు, తమ ప్రాణానికి ముప్పు ఉందని భావించిన ప్రజలు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఇన్నాళ్లూ వివిధ రంగాల ప్రముఖులకు, రాజకీయ నాయకులకు అందిస్తున్న అదనపు భద్రతను భారీగా తగ్గించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు కుదింపు
ఈ క్రమంలో ఐపీఎస్ మాజీ అధికారి, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు ప్రభుత్వం భద్రత కుదించింది. సెక్యూరిటీతోపాటు బుల్లెట్ ప్రూఫ్ వాహనం కూడా తొలగించినట్లు తెలుస్తోంది. ప్రజాప్రతినిధులకు వాహనం తగ్గించడంతోపాటు గన్మెన్ల ఉపసంహరించుకోవడంతో ప్రభుత్వంపై ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. రేవంత్ రెడ్డి లక్ష్యంగా కేటీఆర్, హరీశ్ రావుతోపాటు కీలక నాయకులు తప్పుబడుతున్నాయి.
భద్రత ఉపసంహరణ
తమ పార్టీ నాయకులు, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు భద్రతా కుదించడాన్ని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. భద్రత ఉపసంహరించుకోవడాన్ని ఖండిస్తూ కీలక ప్రకటన చేశారు. '25 సంవత్సరాల పాటు ఐపీఎస్ అధికారిగా దేశానికి, సుమారు దశాబ్దం పాటు గురుకుల విద్యా సంస్థల ద్వారా పేద విద్యార్థుల విద్యకు ఎన్నో సేవలందించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు భద్రత తగ్గించడం పూర్తిగా కక్షసాధింపు చర్యే' అని స్పష్టం చేశారు.
కేటీఆర్ ఆగ్రహం
'రేవంత్ రెడ్డి ప్రభుత్వ అవినీతి, వైఫల్యాలను ప్రజల్లో ఎప్పటికప్పుడు ఎండగడుతున్నందుకే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు భద్రతా తగ్గిస్తూ ప్రభుత్వం ఈ చర్యకు పాల్పడింది. ఇప్పటికే పలుమార్లు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్పై హత్యాయత్నాలు జరిగాయని.. తన ప్రాణాలకు ముప్పు ఉందని ఆయన స్వయంగా వెల్లడించినప్పటికీ కావాలనే భద్రతను తగ్గించడం వెనుక కుట్ర దాగి ఉంది' అని ఆరోపించారు. ప్రశ్నించే గొంతుకలను అణచివేయాలనే ప్రయత్నంలో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి చర్యలకు దిగుతోందని రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం కక్షసాధింపు రాజకీయాలను మానుకుని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు వెంటనే భద్రతను పునరుద్ధరించాలని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు.
తిరుమలలో ఒక్కసారిగా పెరిగిన భక్తులు.. వీఐపీ బ్రేక్ దర్శనం, శ్రీవాణి బుకింగ్ రద్దు!
Tirupati Urban, Andhra Pradesh:VIP Break Darshan: వేసవి సెలవులు ముగియడం.. వేసవికాలం పూర్తయినా కూడా తిరుమల ఆలయానికి భక్తుల సంఖ్య ఏమాత్రం తగ్గడం లేదు. భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. వారాంతం కావడంతో ఒక్కసారిగా శనివారం భక్తుల రద్దీ తిరుమలలో పెరిగింది. అనూహ్యంగా భక్తులు పెరగడంతో తిరుమల ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. వరుసగా సెలవులు రావడంతో భక్తుల సంఖ్య పెరిగిందని టీటీడీ అధికారులు అంచనా వేశారు. స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తుతుండడంతో టీటీడీ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. వీఐపీ బ్రేక్ దర్శనం, శ్రీవాణి కరెంట్ బుకింగ్ను రద్దు చేశారు.
తిరుమలలో శనివారం అనూహ్యంగా భక్తుల రద్దీ పెరిగింది. సోమవారం వరకు వీఐపీ బ్రేక్ దర్శనంతోపాటు శ్రీవాణి దర్శనాల కరెంట్ బుకింగ్ను రద్దు చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రద్దు చేసింది. ఈ కారణంగా సుమారు 7 కిలోమీటర్ల వరకు క్యూలైన్లలో భక్తులు వేచి ఉన్నారు. ఆదివారం సిఫార్సు లేఖలు స్వీకరించబోమని టీటీడీ ప్రకటన చేసింది. సోమవారం శ్రీవాణి కరెంట్ బుకింగ్ దర్శన టికెట్లు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.
ప్రత్యేక దర్శనం రద్దు
వీఐపీ బ్రేక్ దర్శనం, శ్రీవాణి కరెంట్ బుకింగ్ దర్శనం రద్దుతో అధిక మంది భక్తులకు దర్శనం కల్పించేందుకే నిర్ణయం తీసుకుంది. తిరుమలలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండాయి. ప్రస్తుతం బాలాజీ నగర్ వద్దకు భక్తుల క్యూలైన్లు చేరుకున్నాయి. రేపు, ఎల్లుండి తిరుమలకు మరింత మంది భక్తులు తిరుమలకు వచ్చే అవకాశం అవకాశం ఉండడంతో టీటీడీ అధికారులు అప్రమత్తం అయ్యారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా టీటీడీ సీనియర్ అధికారులు పర్యవేక్షణ చేస్తున్నారు. పెరిగిన రద్దీని దృష్టిలో ఉంచుకొని తిరుమల ప్రణాళికను పునః సమీక్షించుకోవాలని ఈ సందర్భంగా భక్తులకు టీటీడీ అధికారులు విజ్ఞప్తి చేశారు.
స్వామి సేవలో కీర్తి సురేశ్
తిరుమల వేంకటేశ్వర స్వామిని శనివారం ప్రముఖ సినీ నటి కీర్తి సురేష్ దర్శించుకున్నారు. ఉదయం ఆలయానికి చేరుకున్న ఆమెకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. వీఐపీ విరామ సమయంలో ఆమె శ్రీవారి దివ్య దర్శనం చేసుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించారు. టీటీడీ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు, శేషవస్త్రం, జ్ఞాపిక అందజేశారు. తిరుమలకు వచ్చిన ఆమె అభిమానులు కీర్తి సురేష్ను చూసేందుకు ఆసక్తి చూపారు. ఆమెతో ఫొటోలు, సెల్ఫీలు తీసుకోవడానికి పోటీపడ్డారు.
నిన్న ఆలయంలో రద్దీ
తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ కొనసాగింది. వైకుంఠంలోని వేచి ఉన్న 27 కంపార్ట్మెంట్ల వరకు క్యూలైన్లలో భక్తులు వేచి ఉన్నారు. ఉచిత సర్వదర్శనానికి సుమారు 28-24 గంటల సమయం పట్టగా.. టైమ్ స్లాట్ (ఎస్ఎస్డీ) టోకెన్లు కలిగిన భక్తులకు 18- 24 గంటల సమయం దర్శనానికి పట్టింది. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సుమారు 2-5 గంటల సమయం పడుతోంది. నిన్న స్వామివారిని 81,340 మంది భక్తులు దర్శించుకోగా.. తలనీలాలు 44,874 మంది భక్తులు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.3.76 కోట్లు వచ్చింది.
AP Rain Alert: ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..ఆ జిల్లాలకు భారీ వర్ష సూచన!
Nunna, Vijayawada, Andhra Pradesh:AP Heavy Rain Alert: ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతం నుంచి మధ్య మహారాష్ట్ర వరకు (తెలంగాణ మీదుగా) ఉపరితల ఆవర్తనం, ద్రోణి విస్తరించి ఉండటంతో రాష్ట్రంలో వర్షాల ప్రభావం పెరగనుంది. శని, ఆదివారాల్లో ఏపీలోని పలు జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ సూచించారు.'మన రాజధాని అమరావతి అని కాలర్ ఎగరేసి చెప్పేలా అభివృద్ది చేస్తా': సీఎం చంద్రబాబు
Giddaluru, Andhra Pradesh:Amaravati: 'అమరావతి చట్టం కూడా అయిపోయాక మావిగన్ అంటున్నారు. మావిగన్ అంటే ఎవరికీ అర్థం కాదు. అందరూ ఛీ కొడుతున్నారు. బాధ్యత లేని రాజకీయ పార్టీ ప్రజలను, వారి నిర్ణయాన్ని అపహాస్యం చేస్తోంది' అని మాజీ సీఎం వైఎస్ జగన్పై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తుంగభద్ర గేటు కొట్టుకుపోతే వెంటనే స్పందించి ఆ గేటు బిగించి కొత్తగా 33 క్రస్ట్ గేట్లు ఏర్పాటు చేశామని.. ఏపీ, తెలంగాణ, కర్ణాటక ప్రభుత్వాలు కలిసి రైతుల ప్రయోజనాల కోసం పనిచేస్తున్నట్లు చెప్పారు. గంగా- కావేరి నదులతో పాటు గోదావరి- నల్లమల సాగర్ లింక్తో రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు.
కాలర్ ఎగరేసి చెప్పేలా
ప్రకాశం జిల్లా వెలిగొండ ప్రాజెక్టుపై సమీక్ష చేసిన అనంతరం గిద్దలూరులో జరిగిన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక ప్రసంగం చేశారు. 'అమరావతిని హరిత నగరంగా, నివాస యోగ్య ప్రాంతంగా నిర్మిస్తున్నాం. మన రాజధాని అమరావతి అని కాలర్ ఎగరేసి చెప్పేలా అభివృద్ది చేస్తాం' అని సీఎం చంద్రబాబు ప్రకటించారు. గొడ్డలి పార్టీ ముందు అమరావతిని అంగీకరించి ఆ తర్వాత మూడు ముక్కలాట ఆడిందని మండిపడ్డారు. ఐదేళ్ల పాటు తాత్సారం చేసిన గొడ్డలి పార్టీ అభివృద్ధిని ఆమడదూరం పెట్టిందని గుర్తుచేశారు. గొడ్డలి పార్టీ నాయకులు మోసాలు చేయటంలో దిట్టలు అని విమర్శించారు.
రాష్ట్రాలకు అదే శ్రీరామ రక్ష
'గోదావరి నుంచి కావేరి నది వరకూ నీటిని తీసుకెళ్తాం. నదుల అనుసంధానమే రాష్ట్రాలకు శ్రీరామ రక్ష. ఈ ప్రాజెక్టుల విషయంలో ఎవరికీ కడుపు ఉబ్బరం అవసరం లేదు' అని ప్రతిపక్షాలకు చంద్రబాబు స్పష్టం చేశారు. 'రైతు ప్రయోజనాలే ముఖ్యం కావాలి. ఎల్నినోతో వర్షాలు లేక నదుల్లో నీటి ప్రవాహాలు తగ్గాయి. పర్యావరణం, నీటిని పొదుపుగా వాడుకోవాలి. వర్షపు నీటిని భూగర్భజలాలుగా మార్చటమే ఇప్పుడు మన తక్షణ కర్తవ్యం' అని అప్రమత్తత ప్రకటించారు. చెక్డ్యామ్లు కడితే ఎగతాళి చేశారని.. కానీ సాగునీరు ఇచ్చి రాష్ట్రాన్ని ప్రగతి పథం వైపు నడపాలన్నదే తన లక్ష్యం అని సీఎం చంద్రబాబు ప్రకటించారు.
రెచ్చగొట్టే ప్రయత్నాలు
'జలధార ద్వారా భూగర్భజలాలు పెంచి అన్నమయ్య జిల్లా విజయం సాధించింది. ఇంత చేస్తుంటే కులం, మతం, ప్రాంతం అని కొందరు కుట్రలు చేస్తున్నారు. సమర్ధవంతమైన ప్రభుత్వమే ప్రజల సమస్యల్ని పరిష్కారం చేయగలుగుతుంది. కొందరు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు' అని వైఎస్సార్సీపీ నాయకులపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. 'ఇటీవల విజయవాడలో జరిగిన ఓ ఘటనకు కులం రంగు పులిమి పవన్ కల్యాణ్పై విమర్శలు చేశారు. హోం మంత్రి అనిత మేకప్ గురించి కొందరు మాట్లాడుతున్నారు. వారికి సిగ్గు అనిపించటం లేదు' అని మండిపడ్డారు.
చూస్తూ ఊరుకోం
పోలీసులపై ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తున్నారని.. తాము చూస్తూ ఊరుకోం అని చంద్రబాబు హెచ్చరించారు. 'కుట్ర చేయడానికే అమరావతికి వెళ్లారు. బాధలో కోపంలో ఉన్న రాజధాని రైతులను రెచ్చగొట్టడానికే అమరావతికి వెళ్లారు. రాజధాని నిర్మాణం జరుగుతుంటే దానిని అడ్డుకోడానికే వైఎస్సార్సీపీ నాయకులు రాజధాని ప్రాంతానికి వెళితే రైతులు అడ్డుకున్నారు' అని సీఎం చంద్రబాబు వివరించారు. గొడ్డలి పార్టీ నిరంతరం కుట్రలు చేస్తూనే ఉందని.. గొడ్డలి పార్టీ రాజకీయాలు చేసేందుకు అర్హత లేదని స్పష్టం చేశారు.
మనది పాజిటివ్ పాలిటిక్స్
'మత సామరస్యంతో వ్యవహరించాలి. దేవాలయాలపై దాడులు చేసిన వ్యక్తులు ఇప్పుడు దేవాలయాల సందర్శనకు వెళ్లి ఒంగిఒంగి దండాలు పెట్టి నాటకాలు ఆడుతున్నారు. కళ్లార్పకుండా అబద్దాలు, మోసాలు చేస్తున్నారు. నేరాలు చేస్తారు, ఘోరాలు చేస్తారు' అని వైఎస్సార్సీపీపై చంద్రబాబు విమర్శలు చేశారు. 'రాజకీయ నాయకులతో పోరాడాను కానీ నేరస్తులుగా ఉన్న రాజకీయ పార్టీలతో పోరాడలేదు. మనది పాజిటివ్ పాలిటిక్స్ వారిది క్రిమినల్ పాలిటిక్స్ . గంజాయి బ్యాచ్ , రౌడీ బ్యాచ్ ను తయారు చేసి అరాచకం చేస్తున్నారు. ఇలాంటి వ్యక్తులతో ఆడబిడ్డలకు, సమాజానికి రక్షణ లేదు' అని చంద్రబాబు వివరించారు. వారు చేసిన విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని బాగు చేయడానికి సుదీర్ఘ సమయం పడుతోందని.. ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లటమే లక్ష్యంగా తాము పనిచేస్తున్నట్లు చంద్రబాబు వెల్లడించారు.
Undavalli YCP Leaders: పేర్ని నాని, అంబటి రాంబాబులపై కోడిగుడ్లతో దాడి..వైసీపీ నేతలపై అమరావతి రైతుల ఆగ్రహం!
Undavalli, Andhra Pradesh:Undavalli YCP Leaders Visit: రాజధాని అమరావతి ప్రాంతంలో మరోసారి రాజకీయ సెగ రాజుకుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) సీఆర్డీఏ పరిరక్షణ బృందం చేపట్టిన పర్యటన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. తాడేపల్లి మండలం ఉండవల్లి సెంటర్ వద్ద పర్యటించేందుకు వచ్చిన వైసీపీ నేతలను కూటమి సానుభూతిపరులు, అమరావతి రాజధాని రైతులు పెద్ద ఎత్తున అడ్డుకున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
'గో బ్యాక్ వైసీపీ' నినాదాలు..
వైసీపీ నేతలు పేర్ని నాని, అంబటి రాంబాబు, లేళ్ల అప్పిరెడ్డి తదితరుల బృందం రాజధాని భూములను పరిశీలించేందుకు ఉండవల్లి సెంటర్ వద్దకు చేరుకుంది. అయితే, వీరి రాకను తీవ్రంగా నిరసిస్తూ స్థానిక రైతులు, కూటమి కార్యకర్తలు నల్ల బ్యాడ్జీలు ధరించి అడ్డుకున్నారు. "గో బ్యాక్ వైసీపీ" అంటూ భారీగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య మాటల యుద్ధం జరిగి, అది కాస్తా పరస్పర తోపులాటకు దారితీసింది.
కోడిగుడ్లు, రాళ్లతో దాడి..
ఉద్రిక్తత అంతటితో ఆగకుండా మరింత తీవ్రరూపం దాల్చింది. నిరసనకారులు వైసీపీ నేతలను లక్ష్యంగా చేసుకుని కోడిగుడ్లు విసిరారు. ఈ గందరగోళంలో వైసీపీ కీలక నేత లేళ్ల అప్పిరెడ్డి ప్రయాణిస్తున్న కారుపై కొందరు రాళ్లు రువ్వారు. ఈ దాడిలో ఆయన వాహనం అద్దాలు పగిలి, తీవ్రంగా దెబ్బతిన్నట్లు సమాచారం.
రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. అయితే, ఆగ్రహంతో ఉన్న నిరసనకారులు పోలీసులను కూడా వదలకుండా వారిపైకి రాళ్లు విసిరినట్లు తెలుస్తోంది. ఈ రాళ్ల దాడిలో పలువురు పోలీసు సిబ్బందికి గాయాలయ్యాయి.
ఉండవల్లి ప్రాంతం రణరంగంగా మారడంతో పోలీసులు అక్కడ అదనపు బలగాలను భారీగా మోహరించారు. ఇరువర్గాలను చెల్లాచెదురు చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. అయినప్పటికీ, రాజధాని ప్రాంతంలో ప్రస్తుతం తీవ్ర ఉద్వేగభరిత, ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది.
Also REad: జొన్నగిరిలో తయారైన బంగారం వచ్చేసింది..'మేడ్ ఇన్ ఆంధ్ర' బ్రాండ్తో మార్కెట్లో విక్రయం
Also Read: విద్యార్థులకు గుడ్న్యూస్..జూన్ 29న స్కూళ్లు కాలేజీలకు సెలవు..ఎక్కడంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
OG Universe OST: పవర్ స్టార్ ఫ్యాన్స్కు మరో సర్ప్రైజ్..'ఓజీ యూనివర్స్' నుంచి మరో వీడియో రిలీజ్ చేసిన మేకర్స్!
Hyderabad, Telangana:The Origin Of Fire OST: పవర్స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులకు అదిరిపోయే ట్రీట్ వచ్చేసింది. సుజీత్ దర్శకత్వంలో డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై అత్యంత ప్రతిష్టాతాత్మకంగా నిర్మించిన గ్యాంగ్స్టార్ డ్రామా చిత్రం 'ఓజీ' (ఓరిజినల్ గ్యాంగ్స్టర్). ఈ చిత్రం గతేడాది థియేటర్లలో విడుదలై సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. పవన్ కల్యాణ్ కెరీర్లోనే ఈ చిత్రం అత్యధిక కలెక్షన్స్ వసూలు చేసిన సినిమాగా నిలిచింది. ఇప్పుడు అదే ఊపులో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్కు ఇటీవలే తీపి కబురు అందింది.
సూపర్ హిట్ అయిన ఆ సినిమాకు సీక్వెల్ను రూపొందించేందుకు అటు డైరెక్టర్తో పాటు హీరో పవర్స్టార్ కూడా పచ్చజెండా ఉపినట్లు మనకు తెలిసిన విషయమే. ఆ తర్వాత హీరోతో డైరెక్టర్ స్టోరీ సిట్టింగ్ సంగతి కూడా చకచకా జరిగిపోయింది. అయితే ఈ 'ఓజీ' యూనివర్స్లోని సీక్వెల్ మూవీ అనౌన్స్మెంట్ నాడు రిలీజ్ చేసిన వీడియోకు ఫ్యాన్స్ నుంచి విపరీతమైన స్పందన లభించింది.
మరీముఖ్యంగా ఆ వీడియో బ్యాగ్రౌండ్ మ్యూజిక్కు పవన్ ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. దీంతో మేకర్స్ (పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్) తాజాగా ఈ చిత్రం నుంచి ఒక సర్ప్రైజ్ అప్డేట్తో వచ్చారు. 'ఓజీ యూనివర్స్' నుంచి "ది ఆరిజిన్ ఆఫ్ ఫైర్' (#TheOriginOfFire) అనే పవర్ఫుల్ ఒరిజినల్ సౌండ్ట్రాక్ (OST) నెట్టింట విడుదలై హల్చల్ చేస్తోంది. ఈ ప్రత్యేకమైన థీమ్ ట్రాక్ను 'పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్' (PKCW) అధికారిక యూట్యూబ్ ఛానల్ ద్వారా విడుదల చేయడం విశేషం.
థమన్ మార్క్ మ్యూజిక్
టాలీవుడ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్. థమన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. తాజాగా విడుదలైన 'ది ఆరిజన్ ఆఫ్ ఫైర్' ట్రాక్ పవన్ కల్యాణ్ ఎలివేషన్లకు పక్కాగా సరిపోయేలా ఉంది. హెవీ బేస్, గూస్బంప్స్ తెప్పించే బ్యాక్గ్రౌండ్ స్కోర్తో థమన్ మరోసారి తన మార్క్ చూపించారు. ఈ సౌండ్ట్రాక్ వింటుంటేనే థియేటర్లలో 'ఓజీ' విధ్వంసం ఏ రేంజ్లో ఉండబోతోందో అర్థమవుతోంది. పవన్ కల్యాణ్ పవర్-ప్యాక్డ్ స్క్రీన్ ప్రెజెన్స్ను ఎలివేట్ చేసేలా ఈ థీమ్ మ్యూజిక్ను కంపోజ్ చేశారు.
గ్యాంగ్స్టర్ సామ్రాజ్యం..
దర్శకుడు సుజీత్ ఈ చిత్రాన్ని జపాన్ బ్యాక్డ్రాప్లో ఒక పవర్ఫుల్ గ్యాంగ్స్టర్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా సీక్వెల్తో కలిసి 'ఓజీ యూనివర్స్'గా మేకర్స్ అభివర్ణించారు. 'ది ఆరిజన్ ఆఫ్ ఫైర్' అనే టైటిల్కు తగ్గట్టుగానే, సినిమాలో పవన్ కల్యాణ్ పాత్ర ఎంత ఉగ్రంగా, పవర్ఫుల్గా ఉండబోతోందో ఈ ఓఎస్టీ (OST) హింట్ ఇస్తోంది. కేవలం ఆడియోతోనే సోషల్ మీడియాలో రికార్డు వ్యూస్ సాధిస్తూ, #OGUniverseOST హ్యాష్ట్యాగ్ గ్లోబల్ ట్రెండింగ్లో నిలిచింది.
అంచనాలు రెట్టింపు
తొలి పార్ట్ లాగే పవన్ కల్యాణ్ సరసన ప్రియాంక అరుళ్ మోహన్ నటిస్తుండగా, బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మీ విలన్ పాత్ర ఉంటుందా లేదా అనేది క్లారిటీ రావాల్సి ఉంది. ఇప్పటికే విడుదలైన స్టోరీ సిట్టింగ్ గ్లింప్స్ సినిమాపై భారీ అంచనాలను పెంచేయగా, తాజాగా వచ్చిన ఈ మ్యూజికల్ అప్డేట్ ఆ అంచనాలను స్కై-హైకి తీసుకెళ్లింది. 'పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్' ఈ ఒరిజినల్ ట్రాక్ను ప్రెజెంట్ చేయడంతో మెగా ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.
"థమన్ మళ్లీ పూనకాలు తెప్పించాడు", "థియేటర్లలో మరోమారు స్పీకర్లు పగిలిపోవడం ఖాయం" అంటూ సోషల్ మీడియా ప్లాట్ఫారమ్స్ లో కామెంట్ల వర్షం కురుస్తోంది. సినిమా విడుదల కోసం పవర్ స్టార్ ఫ్యాన్స్ వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు.
ALso Read: 'ఇడుపు కాయితం' వివాదంపై నిర్మాత బన్నీవాసు.."తగ్గే ప్రసక్తే లేదు, నచ్చింది చేసుకోండి"
Also REad: Nainika Photos: డాన్సర్ నైనిక అందాల విందు..బీచ్లో సొగసులు ఆరబోసింది!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
బీఆర్ఎస్ పార్టీ గెలిచేది పక్కా.. రాష్ట్రంలో గులాబీ జెండా ఎగిరేది పక్కా: కేటీఆర్
Maheshwaram, Telangana:BRS Party: 'బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడంతో ఎవరు నష్టపోయారో ఆలోచించండి. కేసీఆర్కు పదవులు కొత్త కాదు. ఎన్నో పదవులను త్యాగం చేశారు. 50 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కేసీఆర్ సొంతం. కేంద్ర కేబినెట్ మంత్రి వరకూ అన్ని పదవుల్లో పనిచేశారు. ఇవాళ కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ప్రజలకు కోలుకోని నష్టం జరిగింది' అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. 'మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ కే సంగ్మా నిన్న హైదరాబాద్కు వచ్చారు. కేసీఆర్ నిర్మించిన కమాండ్ కంట్రోల్ సెంటర్ను చూసి ఆశ్యర్యపోయారు. మేఘాలయ సీఎం సంగ్మా నాకు స్వయంగా ఫోన్ చేసి.. కేసీఆర్ దార్శనికత అద్భుతమని కొనియాడారు' అని మాజీ మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు. ఇంత అద్భుతమైన వ్యవస్థ దేశంలో ఎక్కడా లేదని గుండెలనిండా అభినందించారని చెప్పారు. పోరాటయోధుడే పాలకుడైతే పరిపాలన ఎలా ఉంటుందో ఇదో ఉదాహరణ అని పేర్కొన్నారు.
కుంభకోణాల జాతర
బీఆర్ఎస్ పార్టీ మహేశ్వరం నియోజకవర్గ సమావేశంలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక ప్రసంగం చేశారు. 'రాష్ట్రంలో వికాసం పోయింది. విధ్వంసం, విషాదం మాత్రమే మిగిలింది. కేసీఆర్ కిట్ పోయింది.. కరెంటు కోతల కాలం వచ్చింది. రైతుబంధు పోయింది.. రాహుల్ బంధు వచ్చింది. రాష్ట్రంలో సంక్షేమ పథకాల పాతర.. కుంభకోణాల జాతర నడుస్తోంది' అని మాజీ మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు. రేవంత్ రెడ్డి ఉన్నా ప్రజలు ఇంకా ముఖ్యమంత్రిగా కేసీఆర్ను తలుచుకుంటున్నారని చెప్పారు. 'తెలంగాణ ఉద్యమంలో మహేశ్వరం ముద్దుబిడ్డ సిరిపురం యాదయ్య ఓయూ వద్ద రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేశారు. ఎంతోమంది అమరవీరుల త్యాగాల స్ఫూర్తితోనే.. పదేళ్ల పాలన సాగింది. ప్రజాసంక్షేమం.. ప్రగతిపథం.. రెండు జోడెడ్లలా ముందుకు సాగాయి' అని మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు.
సబితమ్మ గెలుపు తథ్యం
'కార్యకర్తల జోష్ చూస్తుంటే.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలిచిపోయిన భావన కలుగుతోంది. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అయిపోయారని అనిపిస్తోంది. మహేశ్వరంలో మరోసారి సబితమ్మ గెలుపు తథ్యమని తేలిపోయింది. అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడొచ్చినా కాంగ్రెస్ బంగాళాఖాతంలో కలిసేది పక్కా' అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. 'బ్రహ్మాండంగా బీఆర్ఎస్ పార్టీ గెలిచేది పక్కా.. రాష్ట్రంలో గులాబీ జెండా ఎగిరేది పక్కా. తెలంగాణ నలుదిశలా ఒకే నినాదం మారుమోగుతోంది. అదే కాంగ్రెస్ పోవాలె.. కేసీఆర్ రావాలె' అని పిలుపునిచ్చారు.
పిచ్చోడి చేతిలో రాష్ట్రం
'నాడు ఉద్యమ నాయకుడికి ప్రజలు పాలనా పగ్గాలు అప్పగిస్తే.. తెలంగాణను నంబర్ వన్ స్థానంలో నిలబెట్టారు. రాష్ట్రం రాకెట్ వేగంతో దూసుకుపోయే సమయంలో పొరపాటునో, గ్రహపాటునో ఇప్పుడు ఒక తెలంగాణ ద్రోహి ముఖ్యమంత్రి అయ్యిండు. ఓ పిచ్చోడి చేతిలో రాయి ఉంటే చుట్టుపక్కల ఉన్న వారికి నష్టం. అదే పిచ్చోడి చేతిలో.. రాష్ట్రం ఉంటే నాలుగు కోట్ల ప్రజలకు నష్టం. ఇవాళ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నది.. ఓ హిట్లర్ రెడ్డి. తనకు హిట్లరే ఆదర్శం అని రేవంతే స్వయంగా అంగీకరించాడు' అని రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
'ఎవరైనా శ్రీరామచంద్రుడు, బాబాసాహెబ్ అంబేద్కర్ను ఆదర్శంగా తీసుకుంటారు. నరకాసురుడు, రావణాసురుడిని మించిన హిట్లర్ రేవంత్ రెడ్డికి ఆదర్శమట. అందుకే ఆయన పేరు.. ఇక నుంచి హిట్లర్ రెడ్డి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మూడో పంటకు రైతుబంధు ఎందుకు ఇవ్వరు అని రేవంత్ రెడ్డి అడిగాడు. ఒక్కరికే పెన్షన్ ఇస్తున్నరు.. నేను కుటుంబంలో ఇద్దరికి ఇస్తా అని మాయమాటలు చెప్పాడు' అని రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు.
రైతుబంధు దేవుడెరుగు
'రైతుబంధు రూ.15 వేలు చేస్తా అని డైలాగులు కొట్టాడు. 420 అబద్ధాలతో ఆగంచేసి గద్దెనెక్కాడు. రైతుబంధు దేవుడెరుగు, కనీసం యూరియాకు రాష్ట్రంలో దిక్కులేదు. సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన నాటి దరిద్రాలన్నీ మళ్లీ దాపురించాయి. షాపులో కాదు.. యూరియాను యాపులో పెడతాం అన్నారు. ఇప్పుడు యాప్లో యూరియా కాదు కదా చివరికి రంగారెడ్డి జిల్లా పేరు లేదు.. మల్కాజ్గిరి పేరు లేదు. ఇక్కడ బ్రహ్మాండమైన రైతులున్నా రేవంత్ రెడ్డికి కనిపించడం లేదా?' అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. రంగారెడ్డి, మల్కాజ్గిరి రైతులకు యూరియా అవసరం లేదా? అని నిలదీశారు. ప్రభుత్వానికి ఎంత తెలివి ఉన్నదో దీంతో అర్థమైపోతుందని రేవంత్ రెడ్డి తీరును ఎద్దేవా చేశారు.
అబద్ధపు మాటలు
'అసెంబ్లీ ఎన్నికల్లో లెక్కలేనన్ని అబద్ధాలతో మభ్యపెట్టారు. రేవంత్ రెడ్డి, రజనీకాంత్ను మించిన డైలాగులు కొట్టాడు. భట్టి కమల్ హసన్ను మించి యాక్టింగ్ చేశారు. వంద రోజులు గ్యారెంటీ కార్డు జాగ్రత్తగా పెట్టుకోమన్నారు. రెండున్నరేళ్లయినా నాలుక గీసి పరేయడానికి కూడా ఈ గ్యారెంటీ కార్డు పనికి రావడం లేదు' అని మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఎస్సీ, ఎస్టీలకు అసైన్డ్ భూముల పట్టాలిస్తాం అని దగా చేశారని.. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం అప్పులపై కూడా అబద్ధపు మాటలు అని విమర్శించారు.
'తెలంగాణ సాదించిన నాడు రాష్ట్రంపై అప్పు రూ.72 వేల కోట్లు. పదేళ్లలో చేసిన అప్పు కేవలం రూ.2 లక్షల 80 వేల కోట్లు. అంటే సంవత్సరానికి రూ.28 వేల కోట్లు మాత్రమే. కేసీఆర్ అప్పుచేసి 1020 గురుకుల పాఠశాలలు పెట్టారు. ఆరున్నర లక్షల మంది పిల్లలకు లక్షా 20 వేల కోట్ల చొప్పున ఖర్చుపెట్టి అత్యుత్తమ విద్యను అందించారు. రూ.లక్ష కోట్లు ఖర్చుపెట్టి ఆరు దశాబ్దాల కరెంట్ కష్టాలను తీర్చారు' అని మాజీ మంత్రి కేటీఆర్ వివరించారు.
Khalistani Terror Threat: ఖలిస్థానీ ఉగ్రవాదుల ముప్పు.. ఢిల్లీ, ఉత్తరాఖండ్ రాష్ట్రాలకు భారీ ముప్పు..రంగంలోకి కేంద్ర బలగాలు!
New Delhi, Delhi:Delhi Uttarakhand Terror Threat: ఖలిస్తానీ ఉగ్రవాద ముప్పు పొంచి ఉందంటూ నిఘా సంస్థల నుంచి వచ్చిన హెచ్చరికలతో దేశ రాజధాని ఢిల్లీతో పాటు ఉత్తరాఖండ్ రాష్ట్రం ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. ఈ రెండు ప్రాంతాల్లోని ప్రముఖ దేవాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలు, రైల్వే స్టేషన్లే లక్ష్యంగా ఉగ్రదాడులు జరిగే ప్రమాదం ఉందని భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి.
ఈమెయిల్ బెదిరింపులతో హై అలర్ట్!
ఢిల్లీ, ఉత్తరాఖండ్లలో పెద్ద ఎత్తున ఉగ్రదాడులు జరగొచ్చని హెచ్చరిస్తూ భద్రతా సంస్థలకు బెదిరింపు ఈమెయిళ్లు వచ్చాయి. అందులోని సమాచారం ప్రకారం.. పలు ప్రముఖ దేవాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలు, రైల్వే స్టేషన్లు, రాజకీయ నాయకులు, అలాగే పోలీసు సిబ్బందిని లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉంది.
రాబోయే రోజుల్లో ఖలిస్తానీ ఉగ్రవాదులు ఈ దాడులకు పాల్పడవచ్చని నిఘా సంస్థలు గట్టిగా అనుమానిస్తున్నాయి. ఢిల్లీ పోలీసులు ప్రస్తుతం ఈ ఈమెయిళ్ల మూలాలపై ముమ్మర దర్యాప్తు జరుపుతున్నారు. ఇటీవల ఉత్తరాఖండ్లో నిహాంగ్ సిక్కులకు, స్థానిక పోలీసులకు మధ్య జరిగిన తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలోనే ఈ భద్రతా హెచ్చరికలు రావడం గమనార్హం.
అసలేం జరిగింది?
జూన్ 16 (చమోలి ఘటన): హేమకుండ్ సాహిబ్ యాత్ర ముగించుకుని తిరిగి వస్తున్న నిహాంగ్ యాత్రికులకు, కర్ణప్రయాగ్లోని స్థానిక వ్యాపారులకు మధ్య చిన్న గొడవ జరిగింది. ఇది కాస్తా హింసాత్మకంగా మారి, నలుగురు నిహాంగ్ సిక్కులు కత్తులతో దాడి చేయడంతో నలుగురు స్థానికులు గాయపడ్డారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు నలుగురు నిహాంగ్లను అరెస్ట్ చేశారు. తమ వారిని విడుదల చేయాలంటూ నిహాంగ్ సిక్కుల బృందం జూన్ 20న రుద్రప్రయాగ్లోని ఒక గురుద్వారాను ఆక్రమించింది. ఆ తర్వాత జూన్ 25న డెహ్రాడూన్కు భారీ పాదయాత్ర చేపట్టింది.
సద్దుమణిగిన ఉద్రిక్తతలు
హిమాచల్ ప్రదేశ్ - ఉత్తరాఖండ్ సరిహద్దుల వద్ద నిహాంగ్ సిక్కులకు, పోలీసులకు మధ్య కొన్ని రోజులుగా కొనసాగిన ప్రతిష్టంభన ఎట్టకేలకు శాంతించింది. ఈ కేసు దర్యాప్తులో ఎలాంటి పక్షపాతం లేకుండా నిష్పాక్షికంగా వ్యవహరిస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో, నిహాంగ్ బృందం తమ ఆందోళనను విరమించుకుని వెనుదిరిగింది.
ఉద్రిక్తతలు ప్రస్తుతానికి తగ్గినప్పటికీ, ఖలిస్తానీ ముప్పు పొంచి ఉందన్న నిఘా హెచ్చరికల నేపథ్యంలో దేవాలయాలు, రద్దీ ప్రాంతాలు, ప్రభుత్వ సంస్థల వద్ద రక్షణ వలయాన్ని భారీగా పెంచారు.
Also REad: 2005 ముందు నాటి కరెన్సీ నోట్లు పనిచేయవా? షాకింగ్ న్యూస్ చెప్పిన నేషనల్ బ్యాంక్!
Also Read: విద్యార్థులకు గుడ్న్యూస్..జూన్ 29న స్కూళ్లు కాలేజీలకు సెలవు..ఎక్కడంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Singareni: సింగరేణిలో బొగ్గు మాయం కాలేదు.. రాజకీయ పార్టీలపై AITUC ఆగ్రహం!
Hyderabad, Telangana:No Coal Missing in Singareni: పెద్దపెల్లి జిల్లా సింగరేణి బొగ్గు గనులలో బొగ్గు మాయమైంది అంటూ వస్తున్న వార్తలను ఏఐటియుసి (AITUC) తీవ్రంగా ఖండించింది. రాజకీయ ప్రయోజనాల కోసమే.. కొన్ని రాజకీయ పార్టీలు సంస్థపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడింది.. పెద్దపెల్లి జిల్లా గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన.. మీడియా సమావేశంలో ఏఐటియుసి రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ పలు కీలకమైన వ్యాఖ్యలు చేశారు.
బొగ్గు మాయం కాలేదు.. టార్గెట్ కోసమే ఆ లెక్కలు..
సింగరేణిలో బొగ్గు మాయమైందని బిజెపితో పాటు టిఆర్ఎస్ పార్టీ చేస్తున్న ప్రచారం పూర్తిగా బూటకమని ఏఐటియుసి నేతలు స్పష్టం చేశారు. అధికారులు అన్యువల్ టార్గెట్ చేరుకోవడం కోసం లెక్కల్లో అదనపు బొగ్గును కలిపి చూపించడం వాస్తవమేనని.. అయితే ఆ విధానం తప్పే కావచ్చు కానీ.. బొగ్గు మాయమైందని ప్రచారంలో ఎలాంటి నిజం లేదన్నారు.. గత బిఆర్ఎస్ హయాంలో బొగ్గు మాయమైందని ఆరోపించిన కాంగ్రెస్ నాయకుడే.. ఇప్పుడు BRS లో చేరి రాజకీయాల అద్దె కోసం మాట్లాడుతున్నారని విమర్శించారు.. రాజకీయ పార్టీలు సింగరేణి పరిరక్షణతో పాటు కార్మికుల హక్కులను పక్కనపెట్టి బూటక మాటలు మాట్లాడుతూ సమస్త ప్రతిష్టను దెబ్బతీయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వాల వైఫల్యాలు.. పెరిగిన రాజకీయ జోక్యం..
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సింగరేణిలో రాజకీయ జోక్యం విపరీతంగా పెరిగిపోతోందని నేతలు ఆరోపించారు.. సింగరేణిలో మెడికల్ బోర్డు నిర్వహణను నిలిపివేసింది యాజమాన్యం కాదని.. రాష్ట్ర ప్రభుత్వమేనని వారు మండిపడ్డారు.. అదేవిధంగా, గత కెసిఆర్ ప్రభుత్వం మూలంగానే సింగరేణి బోర్డు పరిశ్రమ నాశనమైందని.. గత హయాంలోనే బొగ్గు గులాకులను అమ్ముకున్నారని విమర్శించారు. 2014 నుంచి సింగరేణికి చెందిన CSR, DMFT నిధులను ఇతర ప్రాంతాలకు అక్రమంగా తరలిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు..
Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!
కార్మికుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం జూన్ 8న ప్రత్యేకమైన 31 డిమాండ్లతో యాజమాన్యానికి సమ్మె నోటీసు ఇచ్చినట్లు నేతలు వెల్లడించారు. దీనిపై హైదరాబాద్ లోని రీజనల్ లేబర్ కమిషనర్ (RLC) వద్ద చర్చలు జరిగాయని.. జూలై 10 లోపు యూనియన్ తో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి సానుకూల నిర్ణయం తీసుకోవాలని ఆర్.ఎల్.సి యాజమాన్యానికి సూచించిందని తెలిపారు. ఒకవేళ యాజమాన్యం గనుక నిర్లక్ష్యం వహిస్తే.. అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని ఉమ్మడిగా సమ్మెకు వెళ్తామని హెచ్చరించారు. 12వ వేజ్ బోర్డు సాధన.. కొత్త గనుల ఏర్పాటు కోసం ఏఐటియుసి ఎల్లప్పుడూ ముందుండి పోరాడుతుందని స్పష్టం చేశారు.
Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
వాన దేవుడా రావా ఉయ్యాలో.. వర్షాల కోసం సిరిసిల్ల పల్లెలో బతుకమ్మలు..
Hyderabad, Telangana:Telangana Rain Deficit: రాష్ట్రవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం లోని మర్రిగడ్డ గ్రామంలో రైతాంగం తీవ్ర ఆందోళనలో మునిగిపోయినట్లు తెలుస్తోంది. సకాలంలో రుతుపవనాలు రాకపోవడంతో పాటు.. ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో ఇప్పటికే విత్తనాలు వేసిన రైతులు దిక్కుతోచని పరిస్థితుల్లో పడ్డారు. ఎండల తీవ్రతకు మొలకలు మాడిపోతుండడంతో.. పెట్టుబడి మట్టి పాలవుతుందేమోనని అన్నదాతలు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రకృతి కరుణించాలని.. కరువు నుంచి రక్షించాలని కోరుతూ గ్రామస్తులు కప్పలకు సంబంధించిన పెళ్లిళ్ల లతో పాటు వివిధ కార్యక్రమాలు చేపడుతున్నారు..
మర్రిగడ్డ గ్రామంలో శనివారం ఒక అద్భుతమైన దృశ్యం ఆవిష్కృతమైంది.. సాధారణంగా దసరా నవరాత్రుల్లో ఆడే బతుకమ్మను.. వర్షాలు సమృద్ధిగా కురవాలని ఏకైక సంకల్పంతో మహిళలు ముందుగానే పేర్చారు.. ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న మహిళకు లేదా తో పాటు గ్రామ మహిళలు అందరూ ఏకమై ఈ నూతన సాంప్రదాయానికి శ్రీకారం చుట్టారు.. రంగురంగు పూలతో బతుకమ్మను అందంగా అలంకరించి.. వాటితో పాటు నీటి కోరత తీరాలని సంకేతిస్తూ.. నీటి బిందెలను కూడా పూల మాలలతో ముస్తాబు చేశారు..
మహిళలంతా ఒకే చోట చేరి.. బతుకమ్మల చుట్టూ తిరుగుతూ.. వానలు కురవాలి ఉయ్యాలో.. మా కష్టాలు తీరాలి ఉయ్యాలో అంటూ భక్తి శ్రద్ధలతో సామూహికంగా పాడిన పాటలు పల్లె గుండెలను కదిలించాయి.. తమ సుఖ సంతోషాల కంటే.. లోకానికి అన్నం పెట్టే రైతుల కష్టాలు తీరని ముఖ్యమని వరుణ దేవుడిని వేడుకున్నారు.. ఈ సమయంలో గ్రామంలో ఉన్న ప్రతి ఒక మహిళ వరుడిని వానలు సక్రమంగా కురవాలని బతుకమ్మ ఆడుతూ ప్రత్యేకమైన పూజలు చేసినట్లు తెలుస్తోంది.
Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!
ఈ వినూత్న కార్యక్రమం మర్రిగడ్డ గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించినట్లు తెలుస్తోంది. పంచాయతీ ప్రతినిధులతో పాటు అధికారులు మహిళా కూలీలు పెద్ద సంఖ్యలో పాల్గొని.. వ్యవసాయం బాగుంటేనే గ్రామం సురక్షితంగా ఉంటుందని బతుకమ్మల ఆడుతూ చాటి చెప్పారు.. పూజల అనంతరం సాంప్రదాయ పద్ధతుల్లో వరుణ యాగం తరహా ప్రార్థనలు చేసి, ప్రకృతి మాత కరుణిస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. అయితే ఈ సమయంలో తీసిన కొన్ని వీడియోలు వైరల్గా మారాయి.
Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
వెలిగొండ ప్రాజెక్టుతో మార్కాపురం కరువు తీరిపోతుంది: సీఎం చంద్రబాబు ఆకాంక్ష
Jammana Palle, Andhra Pradesh:Veligonda Project: 'ప్రాజెక్టుకు భూములివ్వడం అంటే త్యాగం చేసినట్టే. పూర్వీకుల నుంచి వచ్చిన భూములను ప్రాజెక్టు కోసం వదులుకున్నారు. వెలిగొండ ప్రాజెక్టు నాలుగు జిల్లాల తలరాతను మారుస్తుంది' అని ఆకాంక్షించారు. ఈ ప్రాంత నీళ్లల్లో ఫ్లోరైడ్ సమస్యలు ఉండడంతో ఇక్కడి స్థానికులు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. మార్కాపురం ప్రాంతం అంటే కరవు ప్రాంతమని పేరు.. ఈ ప్రాంతానికి కృష్ణా నీళ్లు వస్తాయని ఎవరూ అనుకోలేదని పేర్కొన్నారు.
ఆనాడే ఎన్టీఆర్ ఆలోచన
ప్రకాశం జిల్లా యర్రగొండ నియోజకవర్గం గంటవానిపల్లెలో వెలిగొండ ప్రాజెక్టు పరిధిలోని రైతులు, నిర్వాసితులతో ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. 'మార్కాపురం ప్రాంతానికి కృష్ణా నీళ్లిచ్చేందుకు ఎన్టీఆర్ 1985లోనే ఆలోచన చేశారు. దీని కోసం ఓ కమిటీని వేశారు. ఎన్టీఆర్ హయాంలో వెలిగొండ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. 1995లో ప్రకాశం జిల్లా పర్యటనకు ఎప్పుడు వచ్చినా వెలిగొండ ప్రాజెక్టు గురించే అడిగేవాళ్లు. వరద వస్తే ఆ జలాలను మళ్లిస్తే ఆ నీళ్లతో తాము జీవనం సాగిస్తామని ఇక్కడి రైతులు చెప్పేవారు. 1996లో వెలిగొండకు శంకుస్థాపన చేశాం' అని సీఎం చంద్రబాబు తెలిపారు.
నిర్వాసితుల ఖాతాల్లో
'వెలిగొండ ప్రాజెక్టుకు ప్రస్తుత లెక్కల ప్రకారం రూ.10,580 కోట్లు ఖర్చు అవుతుంది. ఇప్పటివరకు రూ.6,736 కోట్లు ఖర్చు చేశాం. ఇంకా రూ.3,844 కోట్లు ఖర్చు పెట్టాలి. రూ.1,932 కోట్లు తొలి విడతలో ఖర్చుచేయాలి. రూ.1,906 కోట్లు ఖర్చు పెట్టాల్సి ఉంది' అని సీఎం చంద్రబాబు వివరించారు. 2024లో ప్రభుత్వం వచ్చాక రూ.759 కోట్లు ఖర్చు చేశామని.. నిర్వాసితుల కోసం రూ.905 కోట్లు మంజూరు చేసి రూ.300 కోట్లు ఈ రోజు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. రెండు రోజుల్లో నిర్వాసితుల ఖాతాల్లో ఆర్ అండ్ ఆర్ డబ్బులు జమ అవుతాయని చంద్రబాబు చెప్పారు.
'గత పాలకులతో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. రాష్ట్రం విధ్వంసమైంది. శాంతి భద్రతలకు తీవ్రమైన విఘాతం కలిగించేలా వ్యవస్థలను నిర్వర్యం చేశారు. పరిశ్రమలను తరిమేశారు.. పెట్టుబడులు రాకుండా అడ్డుకున్నారు... అప్పుల భారాన్ని పెంచారు' అని వైఎస్సార్సీపీ పాలనపై సీఎం చంద్రబాబు విమర్శలు చేశారు. 'నిమ్మల రామానాయుడు వెలిగొండ ప్రాజెక్టు వద్దే ఉంటారు. టన్నెల్లోకి వెళ్తున్నారు.. పుట్టినరోజు కూడా ఇక్కడే చేసుకున్నారు. వచ్చే ఏడాది నాటికి వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తాం' అని తెలిపారు.
ఆర్ అండ్ ఆర్ నిధులు
వెలిగొండ ప్రాజెక్టు కోసం త్యాగాలు చేసిన రైతులు, నిర్వాసితుల జీవితాలు మెరుగ్గా ఉంటాయని సీఎం చంద్రబాబు చెప్పారు. 'ఇవాళ 2,351 మంది నిర్వాసితులకు రూ.300 కోట్లు జమ చేస్తున్నాం. కలనూతల, సుంకేశుల, చింతలముడిపి, బుడుంచెర్ల, కాటంరాజు తండా, సాయిరాంనగర్, మెట్టి గొంది, బసవాయిపల్లి, లక్ష్మీపురం, అక్కచెరువు, గొట్టిపాడు గ్రామాల నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ నిధులు ఇస్తున్నాం' అని సీఎం చంద్రబాబు వెల్లడించారు.
'కలెక్టరేట్ పక్కన కొన్ని గ్రామాలకు నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తున్నాం. కొత్త జిల్లా ఏర్పాటుచేయడంతోపాటు నిర్వాసితుల కాలనీలో కలెక్టరేట్ ఏర్పాటు చేస్తున్నాం. నిర్వాసితుల కాలనీల్లో మౌళిక సదుపాయాలు పూర్తి చేశాం' అని సీఎం చంద్రబాబు వెల్లడించారు. 'నిర్వాసితుల త్యాగంతో 4.47 లక్షల ఎకరాలకు నీళ్లు అందుతాయి. 23 లక్షల మందికి తాగునీరు లభిస్తాయి. జూలై 31 నాటికి వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 నీళ్లను త్వరితగతిన ఇస్తాం' అని సీఎం చంద్రబాబు ప్రకటించారు.
వెలిగొండ ప్రాజెక్టు స్వరూపం
ఫేజ్-1 కింద 1.19 లక్షల ఎకరాలకు నీళ్లు, 4 లక్షల మందికి తాగునీరు
ఫేజ్-2 కింద 3.25 లక్షల ఎకరాలకు సాగునీరు, 11.25 లక్షల మందికి తాగునీరు
Cobra Video: బాబోయ్ షూలో బ్లాక్ కింగ్ కోబ్రా.. వీడియో ఇదే..
Hyderabad, Telangana:Cobra Inside Shoe Video Watch: సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు విపరీతంగా వైరల్ అవుతూ ఉంటాయి. వాటిలో కొన్ని ఎంతగానో నవ్వుపుట్టిస్తే.. మరికొన్ని ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి.. కానీ తాజాగా వైరల్ అవుతున్న ఒక వీడియో మాత్రం చూసే ప్రతి ఒక్కరి ఆశ్చర్యపోవడం ఖాయం.. ఒక ఇంటి బయట విడిచిన షూ లోపల అత్యంత ప్రమాదకరమైన, విషపూరితమైన బ్లాక్ కింగ్ కోబ్రా నక్కి కూర్చుంది. అయితే, ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలిదు.. కానీ, ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో వైరల్ అవుతోంది..
సాధారణంగా వర్షాకాలం, చలికాలంలో లేదా వేడి ఎక్కువగా ఉన్నప్పుడు చల్లదనం కోసం పాములు ఇలాంటి చీకటి ప్రదేశాలలో ఆశ్రయం పొందుతూ ఉంటాయి. ఈ ఘటనలో కూడా ఇలాగే ఉన్నట్లు తెలుస్తోంది. షూ లోపల స్థావరం ఏర్పరచుకున్న ఆ నల్లత్రాచు, ఎవరికీ కనిపించకుండా లోపల నక్కి ఉంది. సాధారణంగా ఆడవులకు దగ్గరగా ఉండే ప్రదేశాల్లో ఇళ్లు ఉన్నవారికి ఇలా జరగడం సర్వసాధారణం..
కదిలిస్తే ఊగిపోయిన కోబ్రా..
వైరల్ అవుతున్న వీడియోలో ఒక వ్యక్తి కర్ర సహాయంతో ఆ షూను నెమ్మదిగా కదిలించడం మనం చూడవచ్చు. అలా కదిలించిన వెంటనే.. లోపల ఉన్న నల్లటి కింగ్ కోబ్రా తీవ్ర ఆగ్రహానికి గురైంది. ఒక్కసారిగా షూ లోపలి నుంచి తన పడగను పైకి లేపి.. కెమెరా వైపు చూస్తూ భయంకరంగా బుసలు కొట్టడం మొదలు పెట్టింది.. ఆ పాము కోపం, దాని సైజు చూస్తుంటే ఎవరికైనా చెమటలు పట్టాల్సిందే.. ఒకవేళ అందులో పాము ఉందని గమనించకుండా ఎవరైనా నేరుగా అందులో కాలు పెట్టి ఉంటే.. ఎంత ఘోరంగా ఉండేదో ఊహించుకుంటేనే ఒళ్లు గగుర్పొడుస్తుంది.. ఆ వ్యక్తి సకాలంలో గమనించి కర్రతో పరిశీలించడం వల్ల పెద్ద ప్రమాదమే తప్పిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
Also Read: నాగమణికి కాపలాగా రెండు భారీ కింగ్ కోబ్రాలు.. వీడియో వైరల్..
నెటిజన్ల కామెంట్లు..
ఈ వీడియోను ఇప్పటి వరకు చాలా మంది సోషల్ మీడియా వినియోగదారులు వీక్షించిన్నట్లు తెలుస్తోంది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇకపై నేను షూ వేసుకునే ముందు వంద సార్లు చెక్ చేసుకుంటానని ఒకరు కామెంట్ చేయగా.. పాములు ఎక్కడ దాక్కుంటాయో చెప్పలేం.. కాబట్టి ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని మరొకరు రాసుకొచ్చారు. షూస్, చెప్పులను ఎప్పుడూ ఇంటి బయట పడేయకూడదని.. వీలైతే క్లోజ్డ్ షూ రాక్స్లో పెట్టుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. లేకపోతే పాములు ఇలా చొరబడే అవకాశాలు కూడా ఉన్నాయి.
Also Read: నాగమణికి కాపలాగా రెండు భారీ కింగ్ కోబ్రాలు.. వీడియో వైరల్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్.. - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..Twitter, Facebook
