చింతకాని: పోలీసుల అదుపులో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు
Khammam, Telangana:చింతకానిలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పెంట్యాల పుల్లయ్యను పోలీసులు అరెస్టు చేసారు. అయితే ఏ కేసులో అరెస్ట్ చేసారో చెప్పులంటూ పార్టీ నాయకులు, కుటుంబ సభ్యులు పోలీసులతో వాగ్వాదం చేసారు. ఈక్రమంలో పోలీసుల వాహనాన్ని వారు అడ్డుకున్నారు. ఈ నేపాథ్యంలో కాసేపు ఉద్రిక్తత పరిస్థితి కనిపించింది. అనంతరం బలవంతంగా పుల్లయ్య ను స్టేషన్ కు తరలించారు. ఏ కేసులో అరెస్ట్ చేసారో చెప్పకుండా అక్రమంగా అరెస్ట్ చేసారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
Amazonలో బంపర్ ఆఫర్.. రూ.4,599 పీట్రాన్ 20000mAh పవర్ బ్యాంక్ కేవలం రూ.1,299కే!
Hyderabad, Telangana:Ptron Dynamo Power 20000mah Amazon Discount: ప్రస్తుత రోజుల్లో స్మార్ట్ఫోన్ అనేది జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారిపోయింది. ఉదయం నిద్రలేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఫోన్ లేనిదే క్షణం గడవదు... నిరంతరం ఇంటర్నెట్ బ్రౌజింగ్, సోషల్ మీడియా వినియోగం, వీడియోలు చూడటం, గేమ్స్ ఆడటం వల్ల ఫోన్ బ్యాటరీ చాలా త్వరగా డిఛార్జ్ అవుతుంది. ముఖ్యంగా ప్రయాణాలు చేసే క్రమంలో లేదా కరెంట్ లేని సమయాల్లో ఛార్జింగ్ అయిపోతే వచ్చే ఇబ్బంది అంతా ఇంతా కాదు.. ఇలాంటి సమస్యలకు శాశ్వత చెక్ పెట్టడానికి పవర్ బ్యాంక్ అనేది ప్రతి ఒక్కరికీ అత్యవసర Gadget మారింది. నేటి యువత చాలా మంది వీటిని కొనుగోలు చేస్తున్నారు. అయితే, మీరు కూడా ఎప్పటి నుంచో మంచి వపర్బ్యాంక్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఇదే మంచి అవకాశంగా భావించవచ్చు.
అమెజాన్లో బంపర్ ఆఫర్..
pTron సంస్థకు సంబంధించిన Dynamo Power 20000mAh స్మార్ట్ పవర్ బ్యాంక్పై ప్రస్తుతం ప్రముఖ ఈ-కామర్స్ కంపెనీ అమెజాన్ (Amazon)లో మునుపెన్నడూ చూడని రీతిలో అద్భుతమైన ఆఫర్స్ అందిస్తూ వస్తోంది. ఎన్నో ప్రీమియం ఫీచర్లతో కూడిన ఈ పవర్ బ్యాంక్ అసలు ధర (MRP) మార్కెట్లో రూ.4,599 ధరతో లభిస్తోంది. అయితే, ప్రస్తుతం అమెజాన్లో జరుగుతున్న స్పెషల్ సేల్లో భాగంగా దీనిపై భారీ ఫ్లాట్ తగ్గింపును అందిస్తున్నారు. ఈ స్పెషల్ ఆఫర్ను వినియోగించి ఈ భారీ 20000mAh కెపాసిటీ పవర్ బ్యాంక్ను కేవలం రూ.1,299 లకే సొంతం చేసుకోవచ్చు. అంటే ఇప్పుడే కొనుగోలు చేసేవారికి ఏకంగా రూ.3,300 వరకు డిస్కౌంట్ లభిస్తోంది.
pTron Dynamo Power 20000mAh ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ వివరాలు..
ఇందులో 20000mAh బ్యాటరీ ఉండటం వల్ల, స్మార్ట్ఫోన్ను సులభంగా 4 నుంచి 5 సార్లు ఫుల్ ఛార్జ్ చేసుకునే అవకాశం లభిస్తోంది. దూర ప్రయాణాలు చేసేవారికి ఇది బెస్ట్ పవర్ హౌజ్ మారుతుందని భావించవచ్చు. అలాగే ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. చేతిలో పట్టుకోవడానికి సౌకర్యవంతంగా ఉండేలా కాంపాక్ట్ డిజైన్తో దీన్ని తయారు చేశారు. ఈ స్మార్ట్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో మీ మొబైల్స్, ఇయర్బడ్స్, స్మార్ట్ వాచ్లను సింపుల్గా వేగంగా ఛార్జ్ చేస్తుంది. అంతేకాకుండా ఒకేసారి రెండు పరికరాలను ఛార్జ్ చేసుకునే సపోర్ట్ కూడా అందుబాటులో ఉండడం విశేషం. ఇది టైప్-సి (Type-C), మైక్రో USB అవుట్పుట్ ఆప్షన్స్ యూజర్లకు మరింత అద్బుతంగా ఉంటుంది.
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
అదనపు బ్యాంక్ ఆఫర్లతో మరింత తగ్గింపు..
ఈ పవర్ బ్యాంక్ ధర కేవలం రూ. 1,299కే ఉండడమే కాకుండా.. కస్టమర్ల కోసం అమెజాన్ అదనంగా పలు బ్యాంక్ ఆఫర్లను కూడా అందుబాటులో ఉన్నాయి. మీరు కొనుగోలు చేసే సమయంలో కొన్ని క్రెడిట్స్ లేదా డెబిట్ కార్డులను ఉపయోగిస్తే తక్షణ క్యాష్బ్యాక్ లేదా అదనపు డిస్కౌంట్ లభిస్తుంది.. ఒకవేళ మీరు ఆ ఆఫర్లను కూడా వినియోగించుకుంటే.. ఈ ప్రీమియం స్మార్ట్ పవర్ బ్యాంక్ను రూ.1,299 కంటే ఇంకా తగ్గింపు ధరకే మీ సొంతం చేసుకునే అవకాశం లభిస్తోంది.
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Flipkart ధమాకా ఆఫర్.. రూ.29 వేలకే గూగుల్ పిక్సెల్ 10a.. మిస్ అవ్వకండి!
Hyderabad, Telangana:Google Pixel 10a Offer On Flipkart: గూగుల్ పిక్సెల్ సిరీస్ స్మార్ట్ఫోన్లకు మార్కెట్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా పెద్దగా చెప్పక్కర్లేదు.. ముఖ్యంగా అద్భుతమైన కెమెరా క్వాలిటీ, క్లీన్ సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ కోరుకునే వారికి ఇవి బెస్ట్ ఛాయిస్గా భావించవచ్చు. అయితే, గూగుల్ నుంచి వచ్చిన మోస్ట్ అవేటెడ్ ప్రీమియం స్మార్ట్ఫోన్ Google Pixel 10aపై ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ (Flipkart) అద్భుతమైన డిస్కౌంట్లను అందిస్తోంది.. అదిరిపోయే ఫీచర్లతో లభించే ఈ ప్రీమియం ఫోన్ను ఇప్పుడు మునుపెన్నడూ లేని విధంగా అత్యంత తక్కువ ధరకే సొంతం చేసుకునే సువర్ణావకాశం లభిస్తోంది.
భారీగా తగ్గిన ధర.. ఫ్లాట్ డిస్కౌంట్ వివరాలు..
గూగుల్ పిక్సెల్ 10a స్మార్ట్ఫోన్ అసలు ధర (MRP) మార్కెట్లో రూ. 49,999తో అందుబాటులో ఉంది. అయితే లోకేషన్ బట్టి ప్రస్తుతం ఫ్లిప్కార్ట్లో నడుస్తున్న స్పెషల్ ఆఫర్స్లో భాగంగా ఈ ఫోన్పై రూ. 1,000 ఫ్లాట్ తగ్గింపు అందుబాటులో ఉంది. ఈ ఇన్స్టంట్ డిస్కౌంట్ తర్వాత ఈ ప్రీమియం స్మార్ట్ఫోన్ ధర రూ. 48,999కే లభిస్తుంది. ఇవే కాకుండా అదనంగా భారీ బ్యాంక్ ఆఫర్స్ కూడా లభించడం విశేషం..
క్రెడిట్ కార్డ్లపై అదనపు బ్యాంక్ ఆఫర్స్..
ఫ్లాట్ డిస్కౌంట్ మాత్రమే కాకుండా.. కొనుగోలుదారులను దృష్టిలో పెట్టుకుని.. ఫ్లిప్కార్ట్ అద్భుతమైన బ్యాంక్ ఆఫర్లను కూడా అందిస్తూ వస్తోంది.. మీరు ఈ ఫోన్ను కొనుగోలు చేసేటప్పుడు యాక్సిస్ బ్యాంక్ (Axis Bank) లేదా HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్లను ఉపయోగించి పేమెంట్ చేస్తే.. అదనంగా రూ.2,500 వరకు ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. దీనివల్ల ఫోన్ ధర మరింత తగ్గి.. బడ్జెట్ లభించబోతోంది.
ఊహించని రేంజ్లో ఎక్చేంజ్ బోనస్..
ఈ డీల్లోనే అత్యంత ఆకర్షణీయమైన విషయం.. ఎక్చేంజ్ ఆఫర్. మీ పాత స్మార్ట్ఫోన్ను ఎక్చేంజ్ చేస్తే.. గరిష్టంగా రూ. 21,550 వరకు భారీ బోనస్ పొందవచ్చు. ఫ్లాట్ డిస్కౌంట్తో పాటు బ్యాంక్ ఆఫర్స్, పూర్తి ఎక్చేంజ్ వాల్యూ వర్తిస్తే.. రూ.49,999 విలువైన గూగుల్ పిక్సెల్ 10a స్మార్ట్ఫోన్ను కేవలం రూ.28,999 లోపే సొంతం చేసుకోవచ్చు. అయితే, ఈ ఎక్చేంజ్ బోనస్ అనేది మీరు ఎక్చేంజ్ చేసే పాత స్మార్ట్ఫోన్ మోడల్తో పాటు బ్రాండ్, అది ఎంతవరకు వర్కింగ్ కండీషన్లో ఉందనే అంశాలపై ఆధారపడి ఉంటుంది. పాత ఫోన్ కండీషన్ ఎంత బాగుంటే, అంత ఎక్కువ డిస్కౌంట్ లభిస్తుంది.
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
గూగుల్ పిక్సెల్ 10a ఎందుకు కొనుగోలు చేయాలి?
ఈ స్మార్ట్ఫోన్ కేవలం బ్రాండ్ వాల్యూ మాత్రమే కాదు.. ఎన్నో అద్భుతమైన ఏఐ (AI) ఫీచర్లు, అడ్వాన్స్డ్ కెమెరా సెటప్, పవర్ఫుల్ ప్రాసెసర్తో పాటు లాంగ్-లాస్టింగ్ బ్యాటరీ లైఫ్తో వస్తుంది. ప్రీమియం లుక్ అండ్ ఫీల్తో ఉండే ఈ ఫోన్ను రూ.30 వేల బడ్జెట్ రేంజ్లో దక్కించుకోవడం నిజంగా క్రేజీ డీల్ అనే చెప్పవచ్చు. స్టాక్ ముగిసేలోపే ఫ్లిప్కార్ట్ను సందర్శించి ఈ ఆఫర్ను ఉపయోగించుకోండి.
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
ACB Raids: సబ్-రిజిస్ట్రార్ సుచరిత ACBకి ఎలా చిక్కింది? MRO ఇంట్లో దొరికిన వజ్రాల కథేంటి?
Hyderabad, Telangana:Sub-Registrar Sucharitha Disproportionate Assets Case: అవినీతి నిరోధక శాఖ అధికారుల తనిఖీల్లో మరో భారీ అవినీతి తిమింగలం చిక్కింది.. 30 లక్షల భారీ లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయి.. ఇప్పటికే సస్పెన్షన్ను గురైన సబ్ రిజిస్ట్రార్ తుమ్మ కొమ్మ సుచరిత లీలలు ఒక్కటి ఒక్కటిగా బయట పడుతూ ఉన్నాయి. తాజాగా ఆమెపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసిన ఏసీబీ(ACB) అధికారులు, ఆమె నివాసాలతో పాటు కార్యాలయాలపై ఏకకాలంలో సోదరులు నిర్వహించారు. ఈ సోదరులు తేలిన ఆస్తుల విలువ చూసి స్వయంగా అధికారులే ఆశ్చర్యపోతున్నట్లు తెలుస్తోంది..
రూ. 5.05 కోట్ల అక్రమాస్తుల గుర్తింపు..
కేవలం ప్రభుత్వ జీతం పై ఆధారపడి ఒక అధికారిని ఇంత స్వల్ప కాలంలో కోట్లాది రూపాయల ఆస్తులను ఎలా కూడబెట్టిందని కోణంలో ఏసీబీ ఆరా తీస్తూ వస్తుంది.. ప్రాథమిక సోదాల ప్రకారం.. ప్రస్తుతం సుచరిత పేరిట.. సుమారు రూ.5.05 కోట్ల విలువైన అక్రమాస్తులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అయితే ప్రభుత్వ విలువల ప్రకారమే ఈ ఆస్తులు ఉంటే.. బహిరంగ మార్కెట్లో వీటి విలువ పదులకోట్లలో ఉంటుందని అంచనా వేస్తున్నారు..
వజ్రాల వెలుగులు.. లగ్జరీ కార్ల జోరు..
సోదాల్లో దొరికిన ఆస్తుల వివరాలు చూస్తే సుచరిత లగ్జరీ లైఫ్ కు ఎంతగానో అలవాటు పడిందని అర్థమవుతుంది. ముఖ్యంగా ఆమె ఇంట్లో లభ్యమైన బంగారంతో పాటు వజ్రాభరణాల విలువ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.. రూ.1.2 కోట్ల విలువైన బంగారు ఆభరణాలతో పాటు అరుదైన వజ్రాలను ఏసీబీ అధికారులు సోదాల్లో గుర్తించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా రూ.12 లక్షల వరకు లిక్విడ్ క్యాష్ తో పాటు వివిధ బ్యాంకుల్లో దాదాపు రూ.38 లక్షల వరకు ఫిక్స్డ్ డిపాజిట్లు.. మరో రెండు ఓపెన్ ఫ్లాట్లు, వ్యవసాయ భూములు ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా సిద్దిపేట ప్రాంతంలో 2.17 ఎగురాల విలువైన వ్యవసాయ భూమి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీంతోపాటు వోక్స్వ్యాగన్ (Volkswagen) లగ్జరీ కార్ తో పాటు మరొక కారు ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!
సస్పెన్షన్ నుంచి జైలు ఊచల వైపు..
గతంలో రూ.30 లక్షల లంచం కేసులో దొరికిపోయినప్పుడే ఈమె అవినీతి సామ్రాజ్యంపై అధికారులకు అనుమానాలు వచ్చాయి. ఆ కేసు దర్యాప్తులో భాగంగానే ఆదాయానికి మించిన ఆస్తుల కోణాన్ని పరిశీలించగా.. ఊహించని స్థాయిలో నల్లధనం వెలుగు చూసినట్లు తెలుస్తోంది.. సబ్ రిజిస్టర్ హోదాను అడ్డం పెట్టుకొని.. పెద్ద ఎత్తున భూములతో పాటు రిజిస్టర్లలో అక్రమాలకు పాల్పడి.. ఈ సొమ్ము వెనకేసుకున్నట్లు సమాచారం.. ప్రస్తుతం ఈ ఆస్తులు అన్నింటిని సీజ్ చేసిన ఏసీబీ.. కేసును మరింత లోతుగా విచారిస్తోంది. లంచగొండి అధికారులకు ఈ కేసు ఒక గట్టి హెచ్చరిక లాంటిదని ఏసీబీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి..
Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
Dvidvadasa Yoga Effect: మోస్ట్ పవర్ఫుల్ ద్విద్వాదశ యోగం.. ఈ 4 రాశుల వారికి తిరుగులేని లక్ష్మీ కటాక్షం..
Hyderabad, Telangana:Dvidvadasa Yoga Effect On Zodiac: జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారంతో పాటు వాటి స్థాన మార్పులకు ఎంతో ప్రాధాన్యత ఉంటుందని మన అందరికీ తెలుసు. గ్రహాలు నిర్దిష్ట కాల పరిమితుల్లో ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశించడం లేదా ఒకదానికొకటి ప్రత్యేక కోణాల్లో వెళ్తూ అనేక శక్తివంతమైన యోగాలు ఏర్పడుతుంటాయి. ఈ క్రమంలోనే 2026 జూలై 22, బుధవారం మధ్యాహ్నం 12 గంటల 13 నిమిషాలకు ఒక అద్భుత ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. బుధుడతో పాటు కుజుడు ఒకదానికొకటి.. సరిగ్గా 30 డిగ్రీల దూరంలోకి రాబోతున్నాయి. దీని కారణంగానే అత్యంత శక్తివంతమైన ద్విద్వాదశ యోగం ఏర్పడనుంది.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. బుధుడు బుద్ధికి, వ్యాపారంతో పాటు వాక్చాతుర్యానికి ప్రతీక కాగా.. కుజుడు శారీరక శక్తికి, ధైర్యంతో పాటు పరాక్రమానికి చిహ్నంగా భావిస్తారు. ఈ రెండు భిన్న స్వభావాలు కలిగిన గ్రహాల ప్రత్యేక దృష్టి కలయిక వల్ల ఏర్పడే ద్విద్వాదశ యోగం కొన్ని రాశుల వారి జాతకాలను పూర్తిగా మార్చబోతోందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా 4 రాశుల వారికి ఈ యోగం అపారమైన సంపదను, కెరీర్లో ఊహించని విజయాలను తెచ్చి పెట్టే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఆ అదృష్ట రాశులేవో? వారికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
వృషభ రాశి:
ద్విద్వాదశ యోగం వృషభ రాశి వారికి అత్యంత శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఈ సమయంలో కెరీర్ పరంగా పెద్ద మైలురాయిని అధిగమించే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరగడంతో పాటు మీ ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుందని నిపుణులు తెలుపుతున్నారు. మీ మాటతీరు ఇతరులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. దీర్ఘకాలంగా నిలిచిపోయిన పనులు వేగంగా పూర్తవుతాయి. ఉద్యోగస్తులకు ఆఫీసులో ఉన్నతాధికారుల నుంచి పూర్తి సపోర్ట్ లభించి.. పదోన్నతులు పొందే అవకాశం ఉందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.
మిథున రాశి:
మిథున రాశి వారికి ఈ యోగం అద్భుతమైన సానుకూల ఫలితాలను అందిస్తుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా గత కొంతకాలంగా వేధిస్తున్న ఆర్థిక పరమైన ఇబ్బందుల నుంచి పెద్ద ఉపశమనం లభిస్తుంది. ఆదాయానికి కొత్త మార్గాలు సుగమవుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. గతంలో మీరు చేసిన పెట్టుబడుల నుంచి ఊహించని లాభాలు కలుగుతాయి.. వ్యాపార రంగంలో ఉన్నవారు ఈ సమయంలో కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల భవిష్యత్తులో మంచి లాభాలు పొందుతారు. మానసిక ప్రశాంతతతో పాటు సమాజంలో కీర్తి, ప్రతిష్టలు పెరుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు..
సింహ రాశి:
బుధ, మంగళ గ్రహాల అద్భుత కలయిక సింహ రాశి వారికి బంపర్ విజయాలను తెచ్చిపెట్టబోతోంది. కెరీర్తో పాటు ఆర్థిక రంగానికి సంబంధించిన అన్ని సమస్యలు, అడ్డంకులు తొలగిపోతాయి. కార్యాలయంలో మీ కష్టానికి తగిన గుర్తింపు లభించబోతోంది. కొత్త బాధ్యతలు, ప్రమోషన్స్ లభించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ కాలంలో పెట్టుబడులు దీర్ఘకాలికంగా భారీ లాభాలను అందిస్తాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.
మీన రాశి:
మీన రాశి వారికి ఈ ద్విద్వాదశ యోగం అద్భుతమైన అవకాశాలను లభించబోతున్నాయి.. చాలా కాలంగా వేధిస్తున్న వ్యక్తిగత, వృత్తిపరమైన సమస్యలు ఈ సమయంలో తొలగిపోతాయి. ఆర్థికపరమైన అప్పుల బాధలు తొలగిపోతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వ్యాపార రంగంలో ఊహించని పురోగతి సాధిస్తారు. నిలిచిపోయిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
గమనిక.. 
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..
Venus-Ketu Conjunction 2026: సింహరాశిలో ప్రమాదకర కూటమి.. ఆ 4 రాశుల వారు జరభద్రం..
Hyderabad, Telangana:Venus-Ketu Conjunction 2026 Effect On Zodiac: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. గ్రహాల మార్పులు, వాటి కలయికలకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఇవి మానవ జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే జూలై 4న ఒక కీలకమైన గ్రహాల కూటమి ఏర్పడబోతోంది. సంపద, వైభవం, ప్రేమకు కారకుడైన శుక్రుడు సింహరాశిలోకి సంచారం చేస్తాడు.. అయితే, అక్కడ అప్పటికే మాయా గ్రహంగా చెప్పుకునే కేతువు తిష్ట వేసి సంచార దశ కొనసాగిస్తున్నాడు. వేద జ్యోతిష్యం ప్రకారం.. శుక్రుడు, కేతువుల మధ్య తీవ్ర శతృత్వం ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. శుక్రుడు భౌతిక సుఖాలకు ప్రతీక అయితే, కేతువు వైరాగ్యానికి, భ్రమలకు కారకుడి భావిస్తారు. వీరిద్దరి కలయిక వల్ల జూలై 4 నుంచి కొన్ని రాశుల వారి జీవితాల్లో పెను మార్పులు, ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ క్రింది 4 రాశుల వారు తప్పకుండా చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది.
ఈ రాశులవారికి బంపర్ లాభాలు:
వృషభ రాశి (Taurus):
వృషభ రాశికి అధిపతి శుక్రుడే కావడం వల్ల ఈ గ్రహాల కలయిక వీరిపై నేరుగా ప్రభావం చూపుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. సింహరాశిలోని 4వ స్థానంలో ఈ కూటమి ఏర్పడటం వల్ల భౌతిక సుఖాలు, సౌకర్యాలు విపరీతంగా తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్థలు, ఆస్తి వివాదాలు తలెత్తి.. ఇంటికి శాంతి దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సమయంలో కొత్త వాహనాలు లేదా ఆస్తులను కొనుగోలు చేయకపోవడమే మంచిది. ప్రయాణాల సమయంలో ప్రమాదాల భయం ఉంది.. కాబట్టి జాగ్రత్త అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. అనుకోని ఖర్చులు బడ్జెట్ను దెబ్బతీస్తాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.
వృశ్చిక రాశి (Scorpio):
ఈ వృశ్చిక రాశివారికి 10వ స్థానంలో ఈ కూటమి ఏర్పడుతోంది. దీనివల్ల ఉద్యోగులు, వ్యాపారస్తులు ఇద్దరికీ ఒడిదుడుకులు తప్పవని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఆఫీసులో మీపై కుట్రలు జరిగే అవకాశం ఉంది.. కాబట్టి సహోద్యోగులతో జాగ్రత్తగా ఉండాలి. పైఅధికారులతో సత్సంబంధాలు దెబ్బతినే ఛాన్స్ కూడా కనిపిస్తుంది. తొందరపాటుతో ఉద్యోగం మారాలనే నిర్ణయం అస్సలు తీసుకోవద్దు.
తులా రాశి (Libra):
తులా రాశికి కూడా శుక్రుడే అధిపతి కావడం విశేషం.. 11వ స్థానంలో ఏర్పడే ఈ రెండు గ్రహాల కలయిక.. మీ ఆదాయాన్ని, సామాజిక జీవితాన్ని దెబ్బతీస్తుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఈ సమయంలో పెట్టుబడుల విషయంలో ఎలాంటి సాహసాలు చేయకపోవడం చాలా మంచిది. ఎవరికైనా ఇచ్చిన అప్పులు తిరిగి రావడం కష్టమవుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. సమాజంలో లేదా స్నేహితుల మధ్య మీరు మాట్లాడే మాటలను తప్పుగా అర్థం చేసుకునే ప్రమాదం కూడా కనిపిస్తుంది.. దీనివల్ల మంచి స్నేహాలు దెబ్బతింటాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఆఫీసులో మీ కష్టానికి రావాల్సిన క్రెడిట్ వేరొకరికి దక్కడం మిమ్మల్ని నిరాశకు గురి చేస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.
సింహ రాశి (Leo):
ఈ శుక్ర-కేతువుల కలయిక సింహరాశిలోనే జరగబోతోంది. కాబట్టి దీని ప్రభావం వీరి స్వభావం, మానసిక స్థితిపై ఎక్కువగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. జీవిత భాగస్వామి లేదా ప్రేమ భాగస్వామితో తీవ్రమైన అపార్థాలు తలెత్తవచ్చు. కేతువు ప్రభావం వల్ల భాగస్వామి నుంచి మానసిక దూరం పెరిగే అవకాశం ఉంది. కారణం లేని భయాలతో మానసిక ఒత్తిడి మిమ్మల్ని వేధించే ఛాన్స్లు కూడా ఉన్నాయి. మాట్లాడేటప్పుడు ఓపిక వహించకపోతే, చేతికి వచ్చిన పనులు కూడా చెడిపోతాయి.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
గమనిక.. 
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..
IND W Vs BAN W: టీ20 ప్రపంచకప్లో దూసుకోపోతున్న భారత్..5 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ను మట్టికరిపించింది!
Hyderabad, Telangana:IND W Vs BAN W T20 World Cup 2026: ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్లో టీమ్ఇండియా మరో విజయం సాధించింది. బంగ్లాదేశ్తో జరిగిన ఆసక్తికర పోరులో ఐదు వికెట్ల తేడాతో హర్మన్ ప్రీత్ కౌర్ సేన గెలుపును నమోదు చేసింది. 137 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన భారత మహిళా జట్టులో ఓపెనర్ షఫాలీ వర్మ మెరుపు వేగంతో చేసిన 53 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడింది. 16.5 ఓవర్లకే లక్ష్యాన్ని ఛేదించింది భారత మహిళల జట్టు. అటు బౌలింగ్లో రాధా యాదవ్ 3 వికెట్లు, శ్రీ చరణీ చివర్లో చేసిన 2 వికెట్లతో బంగ్లాదేశ్ 136/8 పరుగులకే పరిమితమైంది.
తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ జట్టు తడబాటుతో ప్రారంభమైన ఊపందుకోవడానికి ఇబ్బంది పడింది. దిలారా అక్తర్ త్వరగా అవుటవ్వగా, జువైరియా ఫెర్దౌస్ (33), శోభనా మోస్టరీ (22) ఇన్నింగ్స్ను నిలబెట్టేందుకు ప్రయత్నించారు. అయితే, రాధా యాదవ్ నేతృత్వంలోని భారత స్పిన్నర్లు మిడిల్, చివరి ఓవర్లలో బంగ్లాదేశ్ పతనాన్ని శాసించారు.
నిగర్ సుల్తానా కీలక వికెట్తో సహా, రాధా 3/28 అనే అద్భుతమైన ప్రదర్శనతో బంగ్లాదేశ్ జట్టును ఉక్కిరిబిక్కిరి చేసింది. చివరి ఓవర్లో శ్రీ చరణీ కూడా రెండుసార్లు వికెట్లు తీయడంతో బంగ్లాదేశ్ 136 స్కోరుతో ఆలౌట్ అయింది. ఇన్నింగ్స్ ప్రారంభంలో భారత్ పలు క్యాచ్లను జారవిడిచినా, వారి బౌలర్లు వాటి ప్రభావం స్కోరుపై పడకుండా చేయడంలో విజయం సాధించారు.
137 పరుగుల లక్ష్య ఛేదనలో బరిలో దిగిన భారత్.. ఓపెనర్ స్మృతి మంధాన త్వరగా పెవీలియన్ బాట పట్టగా.. మరో బ్యాటర్ షెఫాలీ వర్మ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడింది. షఫాలీ వర్మ 34 బంతుల్లో 53 పరుగులతో ఆధిపత్య ఇన్నింగ్స్ ఆడింది. 8 ఫోర్లు, 1 సిక్సర్తో ఆమె దూకుడు బ్యాటింగ్, భారత్ను అవసరమైన రన్ రేట్ కంటే చాలా ముందు ఉంచింది. షఫాలీ స్టంపింగ్ తర్వాత.. యస్తికా భాటియా, రిచా ఘోష్ వెంటవెంటనే అవుటయ్యారు. అయితే జెమీమా రోడ్రిగ్స్ (26), హర్మన్ప్రీత్ కౌర్ కీలక భాగస్వామ్యంతో ఇన్నింగ్స్ను నిలబెట్టారు.
19 బంతులు మిగిలి ఉండగానే, నహిదా అక్తర్ బౌలింగ్లో దీప్తి శర్మ విన్నింగ్ షాట్ కొట్టడంతో భారత్ను విజయం వరించింది. ఈ విజయంతో భారత్ నెట్ రన్ రేట్ పటిష్టంగా ఉండటంతో పాటు గ్రూప్ 'ఎ'లో వారి స్థానం కూడా బలపడింది.
భారత్, బంగ్లాదేశ్ ప్లేయింగ్ XIలు
భారత్: స్మృతి మంధాన, షఫాలీ వర్మ, యాస్తికా భాటియా, జెమిమా రోడ్రిగ్స్, హర్మన్ప్రీత్ కౌర్(కెప్టెన్), రిచా ఘోష్(వికెట్ కీపర్), దీప్తి శర్మ, రాధా యాదవ్, శ్రీ చరణి, రేణుకా సింగ్ ఠాకూర్, నందిని శర్మ.
బంగ్లాదేశ్: దిలారా అక్టర్, జుయారియా ఫెర్దౌస్, షర్మిన్ అక్తర్, నిగర్ సుల్తానా(కెప్టెన్, వికెట్ కీపర్), శోభనా మోస్తరీ, రీతు మోని, షోర్నా అక్టర్, రబెయా ఖాన్, నహిదా అక్టర్, శంజిదా అక్టర్ మేఘ్లా, మరుఫా అక్టర్.
Also Read: వన్డే జట్టులో ఎట్టకేలకు విరాట్ కోహ్లీ ఆగమనం..కానీ, ఆ పని
Also REad: హృదయాలను గెలిచిన జపాన్ ఫ్యాన్స్..మ్యాచ్ తర్వాత చెత్తను
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Gold Price Crash: గోల్డ్, సిల్వర్ మార్కెట్ క్రాష్.. బంగారం ధర ఇంకా దిగొస్తుందా? గోల్డ్ కొనుగోలుకు ఇదే సరైన సమయమా?
Hyderabad, Telangana:Gold Price Crash News: గత కొంతకాలంగా ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన బంగారం, వెండి ధరలు అంతర్జాతీయ మార్కెట్ ఒత్తిళ్లతో ఒక్కసారిగా పతనమయ్యాయి. గడిచిన ఏడు నెలల కాలంలోనే అత్యల్ప స్థాయికి ఇరు లోహాల ధరలు పడిపోవడంతో ఇన్వెస్టర్లలో ఆందోళన మొదలైంది. ముఖ్యంగా జనవరి 30 నుండి మార్కెట్లో ప్రారంభమైన ఈ కరెక్షన్ ట్రెండ్ ప్రస్తుతం కొనసాగుతోంది.
ధరలు భారీగా తగ్గడానికి 3 ప్రధాన కారణాలు
అంతర్జాతీయ మార్కెట్లో చోటుచేసుకున్న ఈ మూడు ముఖ్య పరిణామాలు బంగారం, వెండి ధరలను క్రిందికి లాగుతున్నాయి.
యూఎస్ ఫెడ్ కఠిన వైఖరి: అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను వేగంగా తగ్గిస్తుందని మార్కెట్ ఆశించింది. అయితే, ద్రవ్యోల్బణ భయాల కారణంగా వడ్డీ రేట్లను ఎక్కువ కాలం పాటు అధిక స్థాయిలోనే కొనసాగించే సూచనలు కనిపిస్తున్నాయి. వడ్డీ రేట్లు ఎక్కువగా ఉన్నప్పుడు బాండ్లు వంటి రాబడి ఇచ్చే ఆస్తులకే ఇన్వెస్టర్లు ప్రాధాన్యత ఇస్తారు. దీంతో వడ్డీ లేని బంగారంపై డిమాండ్ తగ్గుతుంది.
బలమైన డాలర్ ఇండెక్స్: గ్లోబల్ మార్కెట్లో అమెరికన్ డాలర్ పుంజుకోవడంతో, ఇతర కరెన్సీలు ఉపయోగించే దేశాలకు బంగారం కొనుగోలు భారం పెరిగింది. ఫలితంగా అంతర్జాతీయంగా కొనుగోళ్లు తగ్గాయి.
రిస్క్-ఆన్ సెంటిమెంట్: ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కొంతమేర శాంతించడంతో ఇన్వెస్టర్లు సురక్షితమైన బంగారం నుండి తమ పెట్టుబడులను లాభాలనిచ్చే షేర్ మార్కెట్ల వైపు మళ్లిస్తున్నారు.
వెండి మార్కెట్లో తీవ్ర అమ్మకాల ఒత్తిడి!
బంగారంతో పోలిస్తే వెండి ధరల్లోనే అత్యధిక క్షీణత నమోదవుతోంది. వెండి కేవలం విలువైన లోహమే కాకుండా పరిశ్రమలలో కూడా ఎక్కువగా వాడుతుండటమే దీనికి కారణం. జనవరిలో నమోదైన గరిష్ట స్థాయి (ఔన్స్కు 121 డాలర్లు)తో పోలిస్తే ప్రస్తుతం వెండి ధర సగానికి పైగా పడిపోయింది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ సిల్వర్ ఔన్స్కు 56-57 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. ఇది నవంబర్ 2025 తర్వాత అత్యల్ప రికార్డు కావడం గమనార్హం.
ప్రస్తుత ట్రెండ్ ప్రకారం మార్కెట్ మరికొంత కాలం ఒత్తిడిలోనే ఉండే అవకాశం ఉంది. కాబట్టి ట్రేడర్లు లేదా కొనుగోలుదారులు భావోద్వేగాలకు లోనుకాకుండా, పైన పేర్కొన్న సపోర్ట్, రెసిస్టెన్స్ స్థాయిలను గమనిస్తూ వ్యూహాత్మకంగా నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమం.
(గమనిక: ఈ కథనం కేవలం మార్కెట్ సమాచారం, నిపుణుల విశ్లేషణ ఆధారంగా అందించబడింది. దీనిని పెట్టుబడి సలహాగా (Investment Advice) పరిగణించరాదు. మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది కాబట్టి, పెట్టుబడి పెట్టే ముందు మీ ఆర్థిక సలహాదారుని సంప్రదించడం శ్రేయస్కరం. దీన్ని జీ తెలుగు న్యూస్ ధ్రువీకరించడం లేదు.)
Also Read: ఏనుగు పేడతో ఖరీదైన కాఫీ..ప్రపంచంలోనే అత్యంత లగ్జరీ కాఫీ ఇది..కప్పు రూ.4,720 మాత్రమే!
Also REad: Jonnagiri Gold Mines: ఏపీలో భారీ బంగారు గని.. సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Telangana Rains: ద్రోణి ప్రభావం..తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు..
Hyderabad, Telangana:Telangana Rain Alert: నైరుతి రుతుపవనాలు మూగబోయిన వేళ.. వాతావరణ శాఖ మరో ఆసక్తికరమైన వార్త తెలిపింది. రాబోయే 72 గంటల పాటు ఉపరితల ఆవర్తన ద్రోణి కారణంగా తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది.Krishi Thapanda Apartment: హీరోయిన్ ఇంట్లో బిజినెస్ మ్యాన్ మృతదేహం..షాక్లో సినీ ఇండస్ట్రీ..రంగంలో దిగిన పోలీసులు!
Bengaluru, Karnataka:Krishi Thapanda Apartment News: బెంగళూరులోని ఆర్ఆర్ నగర్ (రాజరాజేశ్వరి నగర్)లో గల ప్రముఖ కన్నడ నటి కృషి థపండా విలాసవంతమైన 'ఎలిగెంట్స్ అపార్ట్మెంట్' ఫ్లాట్లో 33 ఏళ్ల వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ విషయం కన్నడ చలనచిత్ర పరిశ్రమలో తీవ్ర కలకలం సృష్టిస్తోంది.
ఏం జరిగిందంటే?
మృతుడిని వైశాక్ (33)గా పోలీసులు గుర్తించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. వైశాక్ బుధవారం రాత్రి నటి అపార్ట్మెంట్కు వచ్చాడు. అయితే, గురువారం ఆయన ఫ్లాట్లో శవమై కనిపించాడు. ఆ సమయంలో ఫ్లాట్లో ఎవరూ లేకపోవడంతో, అతను సీలింగ్ ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు బలంగా అనుమానిస్తున్నారు. ఈ ఘటన జరిగిన సమయంలో నటి కృషి థపండా ఇంట్లో లేరని అధికారులు స్పష్టం చేశారు.
సమాచారం అందుకున్న ఆర్ఆర్ నగర్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, ఫోరెన్సిక్ ఆధారాలను సేకరించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నివేదిక నిమిత్తం విక్టోరియా ఆసుపత్రికి తరలించారు.
మృతుడి వివాదాస్పద నేపథ్యం
పోలీసుల ప్రాథమిక విచారణలో వైశాక్కు సంబంధించిన పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. వైశాక్కు తన భార్యతో తీవ్రమైన విభేదాలు ఉన్నట్లు తెలుస్తోంది. భార్యతో గొడవల కారణంగానే అతను నటి కృషి థపండా నివాసంలో ఆశ్రయం పొందుతున్నాడని లేదా తరచుగా అక్కడికి వచ్చి వెళ్తుండేవాడని సమాచారం.
వైశాక్కు గతంలో నేర చరిత్ర కూడా ఉందని సమాచాం అందుతోంది. ప్రముఖ వ్యాపారవేత్త అరవింద్ రెడ్డికి ప్రాణహాని తలపెడతామంటూ బెదిరింపులకు పాల్పడిన కేసులో వైశాక్ గతంలో అరెస్టయ్యాడు. ఈ మేరకు బెంగళూరులోని హెచ్ఏఎల్ (HAL) పోలీస్ స్టేషన్లో అతనిపై కేసు కూడా నమోదైంది.
రంగంలోకి దిగిన పోలీసులు
ఈ మరణం వెనుక ఉన్న అసలు కారణాలను వెలికితీసేందుకు ఆర్ఆర్ నగర్ పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తును వేగవంతం చేశారు. ప్రస్తుతానికి ఈ ఘటనపై'అసాధారణ మరణం'గా కేసు నమోదు చేసుకున్నారు.
దర్యాప్తులో భాగంగా నటి కృషి థపండాతో పాటు, మృతుడి కుటుంబ సభ్యులను కూడా పోలీసులు విచారించనున్నారు. అయితే, కేసు ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నందున, పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే మరణానికి గల ఖచ్చితమైన కారణాలు తెలుస్తాయని, అప్పటివరకు ఎలాంటి ఊహాగానాలను నమ్మవద్దని పోలీస్ అధికారులు ప్రజలను కోరారు.
Also Read: సినిమాలకు శాశ్వతంగా గుడ్బై చెప్పనున్న కాజల్ అగర్వాల్! అసలు గుట్టువిప్పిన హీరోయిన్!
Also Read: "నా బాడీ నా ఇష్టం అంటే.. నా కళ్లు నా ఇష్టం అంటారు".. సునీత సంచలన వ్యాఖ్యలు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
రూ.కోటి 25 లక్షల ప్రమాద బీమా.. ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ బంపర్ ఆఫర్
Hyderabad, Telangana:Telangana Govt Employees: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం భారీ ప్రకటన చేసింది. ఉద్యోగ కుటుంబాలకు రూ.కోటి 25 లక్షల ఉచిత ప్రమాద బీమాను ప్రారంభించింది. ఉద్యోగ కుటుంబాల్లో భద్రత, భరోసా కల్పించేందుకు ఈ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. ఉద్యోగుల సంక్షేమం కోసం ఎక్కడా లేని విధంగా సరికొత్త ఉచిత బీమా పథకాన్ని తీసుకువచ్చినట్లు వెల్లడించారు. ఈ పథకంతో ప్రభుత్వంపై, ఉద్యోగులపై ఒక్క రూపాయి కూడా అదనపు భారం పడదని.. బ్యాంకులతో మాట్లాడి ఈ భారీ బీమా రక్షణను కల్పిస్తున్నట్లు వివరించారు.
ఉచిత బీమా
హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో ఉచిత బీమా పథకాన్ని ప్రారంభించిన అనంతరం భట్టి విక్రమార్క కీలక ప్రసంగం చేశారు. ఈ అద్భుతమైన బీమా పథకం ద్వారా సాధారణ ప్రమాదాల్లో మరణిస్తే రూ.కోటి 25 లక్షలు, విమాన ప్రమాదం జరిగితే రూ.2 కోట్ల నుంచి రూ.3 కోట్ల వరకు బీమా పరిహారం అందుతుందని తెలిపారు. 18 నుంచి 60 సంవత్సరాల వయస్సు గల ఉద్యోగులకు రూ.10 లక్షల జీవిత బీమా రక్షణ ఉంటుందని చెప్పారు. ప్రమాదవశాత్తూ శాశ్వత సంపూర్ణ వైకల్యం లేదా పాక్షిక వైకల్యం సంభవించినా ఈ పథకం ద్వారా ఉద్యోగులకు ఆర్థిక అండ లభిస్తుందని.. కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్, ఇతర తాత్కాలిక ఉద్యోగులందరికీ కూడా ఉచిత బీమా పథకాన్ని వర్తింపజేస్తున్నట్లు డిప్యూటీ సీఎం ప్రకటించారు.
ఒక పెద్ద దిక్కుగా
తమ కుటుంబంలో సంపాదించే వ్యక్తికి ఏదైనా ఆపద వస్తే ఆ కుటుంబం రాత్రికి రాత్రే రోడ్డున పడే పరిస్థితి ఉండకూడదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఉద్యోగులు కేవలం జీతగాళ్లు కాదని.. వారి కుటుంబాలకు ఈ ప్రభుత్వం ఒక పెద్ద దిక్కుగా ఉంటుందని నమ్మకం కలిగించడమే తమ లక్ష్యమని ప్రకటించారు. ప్రస్తుత కాలంలో ఇళ్లు, వాహనాలు, పిల్లల చదువుల కోసం ప్రతి ఒక్కరూ బ్యాంక్ ఈఎంఐలు కడుతున్నారని.. సకాలంలో జీతాలు రాకపోతే వారి అకౌంట్లు బ్యాడ్ అకౌంట్స్గా మారి సిబిల్ స్కోర్ దెబ్బతినేదని వివరించారు. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉన్నప్పటికీ ఉద్యోగుల హక్కులను కాపాడాలనే ఉద్దేశంతో ఒకటో తేదీ నాడే జీతాలు ఇచ్చేలా కఠినమైన ప్రణాళికను అమలు చేస్తున్నట్లు భట్టి విక్రమార్క వెల్లడించారు.
శాశ్వత పరిష్కారం
ఉద్యోగ సంఘాలు ఎప్పటి నుంచో కోరుతున్న హెల్త్ కార్డ్ల సమస్యకు తాము శాశ్వత పరిష్కారం చూపిస్తామని డిప్యూటీ సీఎం తెలిపారు. ఒక ప్రత్యేక ట్రస్ట్ ద్వారా ఉద్యోగులందరికీ పూర్తి స్థాయిలో నగదు రహిత వైద్య సేవలు అందించేలా నిర్ణయం తీసుకోవడంతో ఆరోగ్య భద్రత మరింత మెరుగవుతుందని పేర్కొన్నారు. కోటి 15 లక్షల కుటుంబాల సంక్షేమమే పరమావధిగా ప్రభుత్వం పనిచేస్తోందని వెల్లడించారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ కింద రూ.10 లక్షల ఉచిత వైద్యం, ఫీజు రీయింబర్స్మెంట్, రేషన్ కార్డులపై సన్నబియ్యం, కల్యాణలక్ష్మి/షాదీ ముబారక్ ద్వారా రూ.1,11,116 ఆర్థిక సాయం వంటి ఎన్నో పథకాలను అందిస్తున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. సంక్షేమ ఫలాలను లబ్ధిదారులకు చేర్చడంలో డెలివరీ మెకానిజంగా ఉద్యోగులే కీలక పాత్ర పోషిస్తున్నారని.. వారి కుటుంబ సంక్షేమాన్ని ప్రభుత్వం తన బాధ్యతగా తీసుకుందని భట్టి విక్రమార్క తెలిపారు.
పీఆర్సీపై బిగ్ అప్డేట్.. ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ముఖ్యమంత్రి తీపి కబురు
Baddipadaga, Telangana:Telangana Pay Revision Commission: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త. ఉద్యోగ వర్గాలు కొన్నాళ్లుగా ఎదురుచూస్తున్న వేతన సవరణ సంఘం (పీఆర్సీ)పై బిగ్ అప్డేట్ వచ్చింది. ఉద్యోగులకు సంబంధించిన పీఆర్సీపై తెలంగాణ సీఎం కీలక ప్రకటన చేశారు. సాధ్యమైనంత త్వరగా పీఆర్సీని ఇస్తామని ప్రకటన చేశారు. ఎప్పుడో ఇవ్వాల్సిన పీఆర్సీ వాయిదా పడుతుండగా.. ఈ క్రమంలో తాజాగా అప్డేట్ రావడంతో ఉద్యోగ వర్గాలు ఆశాభావంలో ఉన్నారు.
ఆరోగ్య బీమా
ఉద్యోగులకు ఆరోగ్య బీమా పథకం ప్రారంభం సందర్భంగా హైదరాబాద్లో నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి కీలక ప్రసంగం చేశారు. 'తెలంగాణ అంటే నమ్మకం.. ఉద్యోగులుగా ఈ ప్రభుత్వంలో బాధ్యత తీసుకోవడం అంటే భద్రత. ప్రమాదవశాత్తు మరణించిన 45 మంది సింగరేణి కార్మికుల కుటుంబాలకు రూ.కోటి బీమా సొమ్ము అందించాం. వారి మాదిరే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా బీమాను అమలు చేస్తున్నాం' అని తెలంగాణ సీఎం తెలిపారు.
నేను గుంపు మేస్త్రీనే
'ప్రమాద బీమా ఉద్యోగుల కుటుంబానికి ఒక ధైర్యాన్ని, ఒక భరోసాను ఇస్తుంది. ఉద్యోగుల భద్రత యజమానిదే… తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే మీకు యజమాని. అందుకే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమాద బీమా అందిచేందుకు ఇవాళ బ్యాంకర్లతో ఒప్పందం కుదుర్చుకున్నాం' అని రేవంత్ రెడ్డి వివరించారు. 'కొందరు నన్ను గుంపుమేస్త్రీ అని అవహేళన చేస్తుంటారు. ఎవరు ఎలా మాట్లాడినా.. నేను గుంపు మేస్త్రీనే.. ఈ గుంపంతా నాదే. ఈ గుంపే నా బలం.. ఈ గుంపే నా ప్రతిష్ఠ. ఈ గుంపే పేదలకు ప్రభుత్వానికి మధ్య వారధులు' అని చెప్పుకొచ్చారు.
నెంబర్ వన్గా తీర్చిదిద్దుదాం
'నా హోదా, పదవి మారినా నేను మీకు ఎప్పటికీ రేవంతన్ననే. మన మధ్య ఉన్నది అన్నదమ్ముల అనుబంధమే. మనందరం కలిసి తెలంగాణను దేశంలోనే నెంబర్ వన్గా తీర్చిదిద్దుదాం' అని రేవంత్ రెడ్డి తెలిపారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా మొదటి తారీఖున ఉద్యోగులకు జీతాలు అందిస్తున్నామని చెప్పారు. చెప్పిన మాట ప్రకారం విడతల వారీగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ నిధులు విడుదల చేస్తున్నట్లు వివరించారు. మీకు సమస్యలుంటే మా దృష్టికి తీసుకురండి.. చర్చించుకుని పరిష్కరించుకుందామని ఉద్యోగ సంఘాలకు ఆహ్వానం పలికారు.
ఆదాయం పెంచండి
'రోజుకో గంట ఎక్కువ పనిచేయండి.. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం పెంచండి. పెంచిన ఆదాయాన్ని మీ అవసరాలను తీర్చడానికి ఉపయోగిస్తాం' అని ఉద్యోగులకు తెలంగాణ సీఎం విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వానికి మంచి పేరు రావాలంటే అది ప్రభుత్వ ఉద్యోగుల చేతుల్లోనే ఉందని ప్రకటించారు. 30 నెలలుగా తాను ఒక్క రోజు కూడా సెలవు తీసుకోలేదని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే కదా తాను పదే పదే ఢిల్లీ వెళ్తున్నట్లు తెలిపారు.
ఎక్కువ పని చేయండి
'నేను మిమ్మల్ని కోరేది ఒక్కటే రోజుకు ఒక గంట ఎక్కువ పని చేయండి. మార్పు తీసుకొద్దాం.. 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ ఎకానమీగా తెలంగాణను తీర్చిదిద్దుదాం. రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడి పెట్టుబడులను ఆకర్షించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. దేశంలో తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్గా ఎదగాలంటే మీ అందరి సహకారం అవసరం' అని రేవంత్ రెడ్డి తెలిపారు.
తొమ్మిదేళ్ల ప్రేమ బంధాన్ని వివాహంగా మార్చుకున్న జబర్దస్త్ కమెడియన్ ఫైమా
Dichpally, Telangana:Faima Marriage: బుల్లితెరపై ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్న జబర్దస్త్ ఫైమా వివాహం చేసుకుంది. పటాస్, జబర్దస్త్, బిగ్బాస్ షోలలో మెరిసిన ఫైమా ఎట్టకేలకు తన వ్యక్తిగత జీవితంలో కీలక ముందడుగు వేసింది. ఎలాంటి హడావుడి.. ఆడంబరం లేకుండా సాదాసీదాగా ఆమె ఓ ప్రముఖ ఆలయంలో మూడు మూళ్లు వేయించుకుంది. కొన్నేళ్లుగా ప్రేమిస్తున్న తన ప్రియుడితో కొత్త జీవితాన్ని ప్రారంభించింది.
కొన్నేళ్లుగా ప్రవీణ్ నాయక్ అనే యువకుడితో ఫైమా ప్రేమాయణం కొనసాగిస్తోంది. అతడితో సహజీవనం కూడా చేస్తున్నట్లు అప్పట్లో పుకార్లు వచ్చాయి. ఎన్ని రూమర్లు వచ్చినా వాటికి సమాధానం చెప్పకుండా ఇప్పుడు ఏకంగా వివాహం చేసుకుంది. మొదట రిజస్టర్ కార్యాలయంలో చాలా సింపుల్గా ఫైమా, ప్రవీణ్తో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంది. ఈ వీడియోను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తర్వాత హల్దీ వేడుక ఎంతో ఘనంగా జరిగింది.
తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలోని ప్రముఖ ఖిల్లా రామాలయంలో గురువారం సాదాసీదాగా ఫైమా వివాహ వేడుక జరిగింది. తన ప్రియుడు ప్రవీణ్ నాయక్తో ఫైమా మూడు ముళ్లు వేయించుకుంది. తాళి కట్టించుకునే సమయంలో ఫైమా కన్నీటి పర్యంతమైంది. తన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న ఆమె చివరికి విజయవంతంగా ప్రేమించిన యువకుడు ప్రవీణ్తో వివాహం చేసుకోవడంతో ఫైమా గుర్తుచేసుకున్నట్టు తెలుస్తోంది. తొమ్మిదేళ్ల పాటు వీరి ప్రేమాయణం కొనసాగిందని సమాచారం. జీవితంలో ప్రేమ, ఆర్థిక ఇబ్బందులు, అవమానాలు ఎదుర్కొన్నట్లు గతంలో ఫైమా వాపోయింది.
బుల్లితెరపై ఓ టీవీ చానల్లో కామెడీ షో పటాస్తో ఫైమా వెలుగులోకి వచ్చింది. తనదైన కామెడీతో.. టైమింగ్తో నవ్వులు పూయించిన ఫైమా అనంతరం ఆమె జీవితం తిరిగింది. అనంతరం జబర్దస్త్ షోలోకి అడుగుపెట్టి దాదాపు అందరి టీమ్లలో ఫైమా పనిచేశారు. సీనియర్లకు దీటుగా కామెడీ చేస్తూ ఫైమా తనదైన ప్రత్యేకతను సాధించుకుంది. బుల్లెట్ భాస్కర్ టీమ్లో ఫైమా ప్రధాన కమెడియన్గా కొనసాగారు.
Venu Swamy: అందమైన అమ్మాయిల మొగుళ్లు తొందరగా చనిపోతారు.!. రచ్చగా మారిన వేణు స్వామి కామెంట్స్...
Hyderabad, Telangana:Venu swamy controversy comments on marriages: సెలబ్రీటీల జ్యోతిష్యుడు వేణు స్వామి మరో సారి వార్తలలో నిలిచారు. ఇప్పటికే నాగార్జున కుటుంబం, ప్రభాస్ పెళ్లి, సమంతపై రచ్చ, రష్మికమందన్నలపై వేణు స్వామి ఏ రెంజ్ లో కాంట్రవర్సీ చేశారో అందరికి తెలిసిందే. ఇక కొన్ని నెలల క్రితం నటి ప్రగతి పతకాలు గెల్చిన కూడా తన క్రెడిట్ అంటూ మాట్లాడి వివాదంలో ఇరుక్కున్నారు. వేణుస్వామి వివాదం తెలంగాణ మహిళ కమిషన్ వరకు సైతం వెళ్లిన విషయం తెలిసిందే. ఆ తర్వాత కాంట్రవర్సీ జ్యోతిష్యాల జోలికి పోనని కూడా చెప్పారు. కానీ మరల రోటీన్ గా వేణు స్వామిఏదో ఒక కాంట్రవర్సీలతో నిత్యం వార్తలలో ఉంటున్నారు. తాజాగా.. ఆయన ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు నెట్టింట దుమారంగా మారాయి.
వేణుస్వామి మాట్లాడుతూ.. అందమైన అమ్మాయిల్ని భార్యలుగా చేసుకున్న వారు తొందరగా చచ్చిపోతారని బాంబు పేల్చారు. వీరిలో చాలా మంది తొందరగా విడిపోవడం లేదా డైవర్స్ లు తీసుకొవడం జరుగుతుందన్నారు. అంతే కాకుండా అమ్మాయిలు ఎక్కువగా తులసీ మొక్కల లాంటి మంచి వారిని కాదని గంజాయి మొక్కల లాంటి చెడు గుణాల్ని ఉన్నవారిని ఎక్కువగా ఇష్టపడుతారని అన్నారు.
ఇది కలియుగం అని అందుకు దీని ప్రభావంతో అమ్మాయిలు ఎక్కువగా చెడు గుణాలు ఉన్నవారి పట్ల ఎక్కువగా అట్రాక్ట్ అవుతారని మాట్లాడారు. కొంత మంది పెళ్లిళ్ల సమయంలో జాతకాలు కలవక పోతే పేర్లు మార్చుకుని పెళ్లిళ్లు చేసుకుంటున్నారని దీని వల్ల కూడా చాలా దోషాలు వస్తాయని అన్నారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
Read more: Ketan Agarwal Death Case: పూణె బిజినెస్ మెన్ ఘటన.. కాబోయే భర్తను చంపిన కిల్లర్ లేడికి చెప్పుల దండ.. వీడియో వైరల్..
దీనిపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. అమ్మాయిల్ని టార్గెట్ చేసుకుని వేణుస్వామి చేసిన వ్యాఖ్యలు సరైనవి కాదని ఏకీపారేస్తున్నారు. అందరు ఒకలా ఉండరని ఈవ్యాఖ్యలు మహిళల్ని కించపర్చే విధంగా ఉన్నాయని నెటిజన్లు వేణుస్వామిని మరోసారి ట్రోల్స్ చేస్తున్నారు.
Jagtial: టీచర్గా మారిన జగిత్యాల కలెక్టర్.. విద్యార్థులతో కలిసి కూర్చుని భోజనం..
Hyderabad, Telangana:Jagtial Collector Satya Prasad News: మేడిపల్లి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (KGBV)లో గురువారం ఒక అద్భుతం జరిగింది. ఎప్పుడూ ఫైళ్లు, అధికారిక సమీక్షలతో బిజీగా ఉండే జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్.. ఒక్కసారిగా ఉపాధ్యాయుడి అవతారమెత్తి ఆశ్చర్యపరిచారు. పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన.. విద్యార్థుల మధ్యకు వెళ్లి వారితో ముచ్చటించడమే కాకుండా బ్లాక్బోర్డు ముందుకు వచ్చి స్వయంగా పాఠాలు చెప్పి అందరినీ టీచర్స్తో పాటు విద్యార్థులను ఆశ్చర్యపరిచారు..
క్లాస్ రూమ్లో టీచర్గా మారిన కలెక్టర్..
తనిఖీల్లో భాగంగా పాఠశాలలోని తరగతి గదులను సందర్శించిన కలెక్టర్ సత్యప్రసాద్.. విద్యార్థుల టీచింగ్తో పాటు లెర్నీంగ్ లెవల్స్ను(Learning Levels) స్వయంగా పరీక్షించారు. విద్యార్థుల విద్యా ప్రమాణాల గురించి ఉపాధ్యాయులను ఆరా తీశారు. అనంతరం కాసేపు విద్యార్థులకు గురువుగా మారి సబ్జెక్టుల్లోని పలు అంశాలను సులువుగా వివరించే ప్రయత్నం చేశారు.. కలెక్టర్ స్వయంగా పాఠాలు చెబుతుంటే విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా విన్నారు.. ఆయన అడిగిన ప్రశ్నలకు విద్యార్థులు అంతే చురుగ్గా సమాధానాలు ఇవ్వడంతో కలెక్టర్ వారిని ప్రత్యేకంగా అభినందించిన్నట్లు తెలుస్తోంది.. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంలో ఎలాంటి రాజీ పడకూడదని ఈ సందర్భంగా ఉపాధ్యాయులను ఆదేశించారు.
విద్యార్థులతో కలిసి భోజనం..
కేవలం చదువుకే పరిమితం కాకుండా.. విద్యార్థులకు అందుతున్న వసతులను కూడా కలెక్టర్ క్షుణ్ణంగా పరిశీలించిన్నట్లు తెలుస్తోంది. పాఠశాలలోని వంట గదిని సందర్శించి పరిశుభ్రతను చెక్ చేశారు. విద్యార్థులకు నిత్యం మెనూ ప్రకారం పౌష్టికాహారం అందుతుందా లేదా అని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మధ్యాహ్న భోజన సమయంలో విద్యార్థులతో కలిసి నేలపై కూర్చుని భోజనం చేశారు. అన్నం, కూరల నాణ్యతను స్వయంగా రుచి చూసి పరిశీలించారు.. కలెక్టర్ తమతో కలిసి భోజనం చేయడంతో విద్యార్థుల ముఖాల్లో ఆనందం రెట్టింపు అయ్యింది.. పాఠశాల వాతావరణం, భోజన సదుపాయాలపై విద్యార్థుల నుంచి ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నట్లు సమాచారం..
Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!
అధికారుల సమక్షంలో తనిఖీలు..
కలెక్టర్ చేపట్టిన ఈ ఆకస్మిక తనిఖీలు స్థానికంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఒక అత్యున్నత స్థాయి అధికారి క్షేత్రస్థాయికి వచ్చి.. విద్యార్థుల్లో ఒకరిగా కలిసిపోవడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీఓ) జీవాకర్ రెడ్డితో పాటు స్థానిక రెవెన్యూ, విద్యాశాఖ అధికారులు, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నట్లు తెలుస్తోంది..
Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
Organ Donation: మరణించి ఆరేళ్లు అయినా ఫొటోకి దండ వేయలేదు..చనిపోతూ ఆరుగురికి ప్రాణం పోసిన హేమంత్ అగర్వాల్!
New Delhi, Delhi:Zee Media Organ Donation: "కొందరు ఈ లోకాన్ని విడిచి వెళ్ళినా.. ఇతరుల రూపంలో ఇక్కడే జీవిస్తూ ఉంటారు" అనే మాటను నిజం చేశారు మీరట్కు చెందిన హేమంత్ కుమార్ అగర్వాల్. కుటుంబం కోసం అహర్నిశలు శ్రమించిన హేమంత్, సుమారు పదేళ్ల క్రితం ఢిల్లీలోని ద్వారకలో తన కలల ఇల్లాంటి ఒక అందమైన ఇంటిని నిర్మించుకున్నారు. కానీ, ఆ సంతోషాన్ని అనుభవించేందుకు విధి ఆయనకు ఎక్కువ సమయాన్ని ఇవ్వలేదు.
ఊహించని మలుపు..
2020, ఫిబ్రవరి 29న హేమంత్కు అకస్మాత్తుగా తీవ్ర జ్వరం, వాంతులు అయ్యాయి. మానసిక స్థితిలో మార్పు రావడంతో మొదట స్థానిక ఆసుపత్రికి తరలించారు. అక్కడ చేసిన CT స్కాన్లో బ్రెయిన్ హెమరేజ్ (ఇంట్రావెంట్రిక్యులర్ హెమరేజ్) ఉన్నట్లు తేలింది. పరిస్థితి విషమించడంతో వెంటనే గుర్గావ్లోని ఆర్టెమిస్ ఆసుపత్రికి తరలించి శస్త్రచికిత్స చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. మార్చి 12, 2020న వైద్యులు ఆయనను 'బ్రెయిన్ డెడ్'గా ప్రకటించారు.
ఆ తీరని శోకసమయంలో ఆర్టెమిస్ ఆసుపత్రి వైద్యులు, మోహన్ ఫౌండేషన్ కౌన్సిలర్లు అవయవ దానం గురించి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. తండ్రి ఆశయాలను తెలిసిన కుమార్తె అపూర్వ, కుమారుడు ఆర్యన్లతో పాటు భార్య బర్ఖా అగర్వాల్ భారమైన హృదయంతోనే ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. హేమంత్ రెండు మూత్రపిండాలు, కాలేయాన్ని దానం చేశారు. ఆయన కాలేయాన్ని విభజించడం ద్వారా ఒక చిన్నారికి, ఒక వయోజనుడికి పునర్జన్మ లభించింది.
"ఆయన చనిపోయి ఆరేళ్లు గడిచినా, నేను ఇంకా ఆయన ఫోటోకి దండ వేయలేదు. ఎందుకంటే ఆయన ఈ ప్రపంచంలో వేరొకరి రూపంలో ఇంకా బతుకుతూనే ఉన్నారు" అని హేమంత్ అగర్వాల్ కుమార్తె బర్ఖా అగర్వాల్ పేర్కొన్నారు.
అవయవ మార్పిడి: భయాలు - వాస్తవాలు
సమాజంలో అవగాహన లోపం వల్ల అవయవాలు అమ్ముకుంటారనే అపోహలు ఉన్నాయి. కానీ, భారత ప్రభుత్వ పారదర్శక వ్యవస్థ దీనిని పూర్తిగా అడ్డుకుంటుంది. దానం చేసిన అవయవం సరైన వ్యక్తికే చెందుతుందని నమ్మడానికి గల కారణాలు అనేకం ఉన్నాయి.
NOTTO (నేషనల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్ప్లాంట్ ఆర్గనైజేషన్).. దేశంలో ఎక్కడ అవయవ దానం జరిగినా, దాని పూర్తి రికార్డు ఈ ప్రభుత్వ ఆన్లైన్ నెట్వర్క్లో నమోదవుతుంది. ధనిక, పేద అనే భేదం లేకుండా కేవలం రోగి అనారోగ్య తీవ్రత, రక్త వర్గం (బ్లడ్ గ్రూప్), అవయవాల సరిపోలిక ఆధారంగా మాత్రమే కంప్యూటర్ ఆటోమేటిక్గా స్వీకర్తను ఎంపిక చేస్తుంది. ఇందులో మానవ జోక్యం సాధ్యం కాదు.
కఠినమైన చట్టాలు..
మానవ అవయవ మార్పిడి చట్టం (THOA) ప్రకారం, అవయవాల అక్రమ రవాణా, విక్రయాలు పూర్తిగా చట్టవిరుద్ధం. ఏ ఆసుపత్రి లేదా వైద్యుడు స్వచ్ఛందంగా ఎవరికీ అవయవాలను ఇవ్వలేరు. ఎలాంటి ఒత్తిళ్లు, వాణిజ్య లావాదేవీలకు తావులేకుండా ఉండేందుకు దాత, గ్రహీత వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతారు.
అవయవ దానం గురించి తెలుసుకోవలసిన 6 ముఖ్య విషయాలు..
1) ఎవరు దానం చేయవచ్చు?: జీవించి ఉన్నవారు (ఒక మూత్రపిండం లేదా కాలేయంలో కొంత భాగం) లేదా బ్రెయిన్ డెడ్ అయిన తర్వాత (గుండె, కళ్ళు, కాలేయం, మూత్రపిండాలు) దానం చేయవచ్చు.
2) ప్రక్రియ ఎలా ఉంటుంది?: మీ ప్రియమైన వారికి బ్రెయిన్ డెడ్ అని వైద్యులు ధృవీకరించిన వెంటనే ఆసుపత్రి సిబ్బందిని సంప్రదించాలి లేదా ప్రభుత్వ హెల్ప్లైన్ 1800-11-4770 కు కాల్ చేయవచ్చు.
3) ఖర్చులు ఉంటాయా?
అవయవ దానానికి ఎలాంటి రుసుము ఉండదు. దాత కుటుంబం నుండి ఎలాంటి అదనపు చికిత్స ఖర్చులు వసూలు చేయరు.
4) మృతదేహానికి గౌరవం
అవయవాల సేకరణ ఆపరేషన్ అత్యంత గౌరవప్రదంగా జరుగుతుంది. శరీరంపై ఎలాంటి వికృత మచ్చలు పడకుండా జాగ్రత్త వహిస్తారు.
5) అంతిమ సంస్కారాలు: ఆపరేషన్ పూర్తయిన వెంటనే మృతదేహాన్ని అంత్యక్రియల కోసం కుటుంబ సభ్యులకు అప్పగిస్తారు.
6) ఒక్కరి నిర్ణయం - ఎందరికో ప్రాణం: ఒకరి అవయవ దానం ద్వారా దాదాపు 8 మంది ప్రాణాలను కాపాడవచ్చు.
జీ మీడియా విజ్ఞప్తి..
భారతదేశంలో ప్రతి ఏడాది అవయవాలు సకాలంలో దొరక్క లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. జీ మీడియా చేపట్టిన 'జిందగీ కే బాద్ భీ' అవగాహన ప్రచారంలో భాగస్వామ్యం అవ్వండి. అపోహలను వీడి అవయవ దానానికి ప్రతిజ్ఞ చేయండి. మీ ఒకే ఒక్క నిర్ణయం మరొక కుటుంబంలో వెలుగులు నింపగలదు.
Also Read: ఉద్యోగులకు గుడ్న్యూస్..20 శాతం డీఏ పెంచుతూ ఉత్తర్వులు..ఆ రోజు నుంచే అమలు!
Also REad: విద్యార్థులకు చుక్కలు చూపిన నీట్ రీ-ఎగ్జామ్..కటాఫ్ భారీగా తగ్గే ఛాన్స్ ఉందా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
