చింతకాని: పోలీసుల అదుపులో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు
చింతకానిలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పెంట్యాల పుల్లయ్యను పోలీసులు అరెస్టు చేసారు. అయితే ఏ కేసులో అరెస్ట్ చేసారో చెప్పులంటూ పార్టీ నాయకులు, కుటుంబ సభ్యులు పోలీసులతో వాగ్వాదం చేసారు. ఈక్రమంలో పోలీసుల వాహనాన్ని వారు అడ్డుకున్నారు. ఈ నేపాథ్యంలో కాసేపు ఉద్రిక్తత పరిస్థితి కనిపించింది. అనంతరం బలవంతంగా పుల్లయ్య ను స్టేషన్ కు తరలించారు. ఏ కేసులో అరెస్ట్ చేసారో చెప్పకుండా అక్రమంగా అరెస్ట్ చేసారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Manjeera Water Pipeline Burst: హైదరాబాద్లో ఆకస్మికంగా వరద వచ్చింది. ఐటీ ప్రాంతం వారు నివసించే మణికొండలో అకస్మాత్తుగా వరద రావడంతో ఆ ప్రాంతం మొత్తం చెరువును తలపించింది. మోకాల్లోతు నీళ్లు చేరడంతో మణికొండవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వేసవికాలం ప్రారంభమవుతున్న సమయంలో భారీ వరద ముంచెత్తడం ఏమిటంటే.. హైదరాబాద్కు తాగునీరు అందించే మంజీరా పైపులైన్ ఒక్కసారిగా పేలిపోయింది. పైపులైన్ పేలడంతో వరద ముంచెత్తింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Also Read: KCR Birthday Gift: తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ బర్త్డేకు 5 మున్సిపాలిటీలు గిఫ్ట్!
రంగారెడ్డి జిల్లా మణికొండలో మంజీరా నీటి పైప్లైన్ సోమవారం అర్ధ రాత్రి పేలిపోయింది. అర్ధరాత్రి 3 గంటల ప్రాంతంలో మణికొండ పైప్లైన్ రోడ్డులో భారీ శబ్దంతో మంజీరా నీటి పైప్లైన్ పేలడంతో ఐదు నిమిషాల్లోనే అపార్ట్మెంట్ల సెల్లార్లలో నీరు నిండిపోయింది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో రంగంలోకి దిగిన హైడ్రా, విపత్తు నిర్వహణ బృందాలు చర్యలు చేపట్టాయి. మణికొండ పైప్లైన్ రోడ్డులో ఈ ప్రమాదం జరగడంతో మంజీరా నీరంతా వృథాగా పోయింది.
Also Read: Seethakka: వెన్నుపోటుదారులను వదల.. కాంగ్రెస్ రెబెల్స్కు సీతక్క మాస్ వార్నింగ్!
లక్షలాది లీటర్ల మంజీరా నీరు పోటెత్తడంతో మణికొండలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఐదు నిమిషాల వ్యవధిలోనే దాదాపు ఆరు అడుగుల మేర నీరు అపార్ట్మెంట్ సెల్లార్లలోకి చేరింది. అపార్ట్మెంట్లలో పార్క్ చేసిన దాదాపు 7 నుంచి 8 కార్లు, ద్విచక్ర వాహనాలు నీటిలో మునిగిపోయి భారీగా దెబ్బతిన్నాయి. సెల్లార్లో ఉన్న వస్తువులు, విద్యుత్ వ్యవస్థ కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి. సమాచారం అందిన వెంటనే హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ) బలగాలు, అగ్నిమాపక శాఖ, స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పైప్లైన్ నీటిని వెంటనే నిలిపివేసి, సెల్లార్లలో ఉన్న నీటిని తోడే ప్రక్రియను ప్రారంభించారు. అదృష్టవశాత్తూ ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు కానీ, స్థానికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. అధికారులు తక్షణమే స్పందించడంతో కొంత ప్రమాదం తప్పింది.
Also Read: India vs Pakistan: పాకిస్థాన్ దిమ్మతిరిగింది.. టీ20 ప్రపంచకప్లో టీమిండియా హ్యాట్రిక్ విజయం
నీటి సరఫరాకు ఆటంకం
భారీ పైపులైన్ పేలిపోవడంతో హైదరాబాద్లో తాగునీటి సరఫరాకు ఆటంకం ఏర్పడింది. హైదరాబాద్కు తాగునీటి సరఫరా అందించే మంజీరా పైపులైన్ పగిలిపోవడంతో మణికొండతోపాటు చుట్టు పక్కల పరిసరాల ప్రాంతాల్లో వారం రోజుల పాటు తాగునీటి సరఫరాకు ఇబ్బంది ఎదురవుతుందని సమాచారం. అధికారులు తక్షణమే మంజీరా పైపులైన్ మరమ్మత్తులు ప్రారంభించినా.. కూడా ఆ పనులు అయ్యేందుకు సమయం పడుతుందని.. ప్రజలు సహకరించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Huge Cobra Video Watch: సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి.. వాటిల్లో కొన్ని మనకు ఫన్నీగా అనిపిస్తే..మరికొన్ని మాత్రం ఒళ్ళు గగుర్పొడిచేలా ఉంటాయని మనందరికీ తెలుసు. అయితే అప్పుడప్పుడు ఇంటర్నెట్లో కొన్ని పాములకు సంబంధించిన వీడియోలు కూడా హల్చల్ చేస్తూ ఉంటాయి. ఇలాంటి వీడియోలు చూస్తే ఎవరికైనా చెమటలు పట్టాల్సిందే.. ఈ పాముల వీడియోలు నిత్యం ఒకటో రెండో తప్పకుండా వైరల్ అవుతూనే ఉంటాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వ్యక్తి కాలుకు అత్యంత భారీ నాగుపాము చుట్టుకొని ఉండడానికి సంబంధించిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. అయితే, ఈ ఘటన ఎక్కడ జరిగింది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
వైరల్ అవుతున్న ఈ వీడియోకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఈ వీడియోలో ఒక వ్యక్తి కూర్చొని ఉండడం మీరు గమనించవచ్చు. అతని కాలుకు ఒక పొడవైన నాగుపాము గట్టిగా చుట్టేసుకొని ఉండటం కూడా మీరు చూడొచ్చు. సాధారణంగా మనకు చిన్న పాము కనిపిస్తేనే.. కేకలు వేస్తూ మరి అక్కడి నుంచి పరిగెడుతూ ఉంటాం.. అలాంటిది ఈ వ్యక్తి కాలుకు అత్యంత ప్రమాదకరమైన భారీ నాగుపాము చుట్టుకొని ఉండడం చూస్తుంటే.. ఆ పరిస్థితి ఊహించడానికి భయానకారంగా ఉంటుంది. అయితే ఈ వీడియోలో మాత్రం ఆ వ్యక్తి ఏమాత్రం కంగారు పడకుండా.. చాలా ప్రశాంతంగా ఉండడం ఆశ్చర్యమేస్తోంది..
అయితే, ఈ వీడియోలో పాము మాత్రం.. అతని కాలును ఏమాత్రం విడిచిపెట్టకుండా అలాగే పట్టుకొని ఉంది.. ఆ వ్యక్తి తన కాలును నెమ్మదిగా కదిలిస్తున్నప్పటికీ.. పాము మాత్రం అలాగే కదలకుండా ఉండిపోయింది.. దీన్ని చూస్తుంటే ఆ వ్యక్తి ఒక స్నేక్ క్యాచర్ అయి ఉండచ్చని.. నేటిజన్లు భావిస్తున్నారు. అందుకే అంత ప్రమాదకరమైన పాము అతని కాలుకు చుట్టుకుని ఉన్నప్పటికీ భయపడకుండా చాలా నిశ్శబ్దంగా.. నెమ్మదిగా కాలును కదుపుతూ ఉండిపోతున్నాడు..
ఏది ఏమైనా ఇలాంటి ప్రమాదకరమైన పాముల పట్ల ఎంతో జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది.. ఎంత స్నేక్ క్యాచర్ అయినప్పటికీ.. అది ఎప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉంటుందో.. ఎప్పుడు దాడి చేస్తుందో అనే విషయం ఎవరికీ తెలియదు.. కొంతమంది వన్యప్రాణి సంరక్షకులు కూడా ఇదే చెబుతున్నారు. ఇలాంటి సమయాల్లో చాలా జాగ్రత్తగా ఉండడం మేలని వారంటున్నారు.. అయితే, ఈ వీడియో చూసిన చాలామంది నెటిజన్లు అతని ధైర్యాన్ని మెచ్చుకోవాలి అంటూ కామెంట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోను యూట్యూబ్ ఛానల్ నుంచి పోస్ట్ చేశారు.
Also Read: Thief Viral Video: వధూవరులు ఫోటోలు దిగుతుండగా వచ్చి.. దొంగ బ్యాగ్ కొట్టుకెళ్లాడు.. వీడియో..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Japan Baby Monkey Video: ప్రకృతి సృష్టించిన విపత్తుల్లో కొన్నిసార్లు మనస్సును కదిలించే ఘటనలు వెలుగులోకి వస్తూ ఉంటాయి.. తాజాగా జపాన్లోని ఇచికావా సిటీలో ఉన్న జూలో వెలుగు చూసిన ఒక దృశ్యం ఇప్పుడు సోషల్ మీడియాలో అందరినీ కన్నీళ్లు పెట్టిస్తోంది.. పుట్టిన కొద్దిసేపటికి తల్లి వదిలేసిన ఓ కోతి పిల్ల.. తల్లి ప్రేమను పొందడానికి.. కోతి బొమ్మను హత్తుకొని ఆడుకుంటున్న దృశ్యాలు అందరికీ కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. ఇప్పుడు ఈ వీడియో ప్రపంచవ్యాప్తంగా విపరీతంగా వైరల్ అవుతుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
పంచ్ అనే మకాక్ జాతికి చెందిన కోతి పిల్ల 2025 సంవత్సరంలో జన్మించింది.. దురదృష్టవశాత్తూ.. ఈ పిల్ల కోతిని పుట్టిన కొద్దిసేపటికి దాని తల్లి వదిలేసి వెళ్లిపోయింది.. అప్పటినుంచి జూకీపర్లు ఈ బుజ్జి కోతి పిల్లను అల్లారుముద్దుగా కంటికి రెప్పలా కాపాడుతూ వస్తున్నారు. కొంతమంది జూ కీపర్లు స్వయంగా తమ పిల్లలుగా భావించి.. పెంచుకుంటున్నారు. అయితే అమ్మలేని లోటు ఆ పిల్లలు ఒత్తిడిని పెంచకుండా ఉంచేందుకు.. జూ కీపర్లు ఆ పిల్ల కోతికి దాని తల్లిలా కనిపించి ఒక బొమ్మ అందించారు..
ఈ క్రమంలోని ఆ పంచ్ పిల్ల కోతి.. తన తల్లిలా భావించే బొమ్మకు ఎంతో దగ్గర అయింది.. ఆ బొమ్మని తన తల్లిలా భావిస్తూ తింటున్నప్పుడు.. నిద్రపోతున్నప్పుడు.. దాన్ని పక్కనే ఉంచుకోవడం ప్రారంభించింది. చివరకు ఆ బుజ్జి కోతి ఇతర కోతులతో ఆడుకోవడానికి వెళ్తున్నప్పుడు కూడా ఆ బొమ్మను తనతో పాటే తీసుకెళ్తోంది. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో ఎక్స్ ఖాతాల్లో ఊహించని స్థాయిలో వైరల్ అవుతుంది. జపాన్లోనైతే ఈ వీడియో పెద్ద సంచలనంగా మారింది.. ఒక వీడియోలు పంచ్ ఆ బొమ్మను గట్టిగా కౌగిలించుకొని నిద్రపోవడం చూసి సోషల్ మీడియా వినియోగదారులు కన్నీరు మున్నీరవుతున్నారు.
Also Read: Thief Viral Video: వధూవరులు ఫోటోలు దిగుతుండగా వచ్చి.. దొంగ బ్యాగ్ కొట్టుకెళ్లాడు.. వీడియో..
అయితే, గత కొద్ది రోజుల నుంచి ఆ కోతి పిల్ల బొమ్మను వదిలిపెట్టి ఉండలేకపోవడంతో జూ అధికారులు ఇతర మకాక్ కోతుల గుంపులో నెమ్మదిగా అలవాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.. జనవరి నెల నుంచి ఈ కోతి పిల్ల ఇతర కోతులతో కలవడం ప్రారంభించినప్పటికీ.. కొత్త వాతావరణం లో భయం వేసినప్పుడల్లా.. అక్కడి నుంచి పరుగున వెళ్లి తన బొమ్మ తల్లిని హత్తుకుంటుంది. " ఆ పంచ్ కోతి పిల్ల.. ఇతర కోతులతో స్నేహం చేసినప్పటికీ.. తనకు నచ్చని సమయాల్లో.. ఇతర కోతులు దాడి చేస్తున్న సమయంలో తల్లి గుర్తుకు వచ్చినప్పుడు ఆ బొమ్మ దగ్గరికే వెళుతోందని.." జూవర్గాలు చెబుతున్నాయి..
Also Read: Thief Viral Video: వధూవరులు ఫోటోలు దిగుతుండగా వచ్చి.. దొంగ బ్యాగ్ కొట్టుకెళ్లాడు.. వీడియో..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
High Professional Thief Viral Video Watch: రాజస్థాన్ రాజధాని జైపూర్లో ఓ వివాహ వేడుకలు ఎవరు ఊహించని ఒక దొంగతనం జరిగింది.. దొంగ సూటు.. బూటు ధరించి.. రాజ్యసం ఉట్టిపడేలా అతిధి రూపంలో వచ్చి.. అందరూ కల్లప్పగించి చూస్తుండగానే వధువు హ్యాండ్ బ్యాగ్ను అత్యంత సులభంగా దొంగిలించి అక్కడి నుంచి పరారయ్యాడు.. ఆ బ్యాగులు సుమారు నాలుగు లక్షల పైగా విలువ చేసే నగదుతో పాటు బంగారు ఆభరణాలు ఉన్నట్లు సమాచారం. ఇప్పుడు ఈ ప్రొఫెషనల్ దొంగకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..
ఈ ఘటన ఫిబ్రవరి 7వ తేదీన జైపూర్ లోని చందన వన్ మ్యారేజ్ గార్డెన్లో జరిగినట్లు తెలుస్తోంది.. అయితే రాత్రి పది గంటల సమయంలో వధువు వరుడు స్టేజిపై ఉండి.. ఎంతో ఆనందంగా బంధుమిత్రులతో కలిసి ఫోటోలకు ఫోజులిస్తున్నారు.. ఈ సమయంలో అందరి దృష్టి ఫోటోలపైనే ఉంది.. ఇంతలోనే సూట్ ధరించిన ఓ గుర్తు తెలియని వ్యక్తి ఎంతో నిశ్శబ్దంగా నెమ్మదిగా స్టేజ్ పైకి వెళ్ళాడు.. వధువు పక్కనే ఉన్న ఆమె హ్యాండ్ బ్యాగ్ను సింపుల్ గా తీసుకొని.. ఎవరికి అనుమానం రాకుండా తన బ్లేజర్ లోపల దాచుకున్నాడు.. ఇలా చేసిన క్షణాల్లోనే అతను జనాల్లో నుంచి కనిపించకుండా మాయమైపోయాడు..
చివరగా..
వధువు ఫోటోషూట్ అయిన తర్వాత తన బ్యాగు కనిపించకపోవడంతో.. వెంటనే ఆమె తమ కుటుంబ సభ్యులకు తెలియజేస్తుంది.. అక్కడే ఉన్న బంధువులతో కలిసి ఆ పెళ్లి వేదికను మొత్తం వెతుకుతారు.. అయితే, వారి ఎంత వెతికినప్పటికీ ఫలితం లేకపోవడంతో.. వెంటనే వారు అక్కడే ఉన్న కెమెరా మాన్ తో వారు తీసిన వీడియో రికార్డులను పరిశీలిస్తారు.. అందులో ఒక వ్యక్తి తన హ్యాండ్ బ్యాగ్ను సింపుల్గా పట్టుకొని వెళుతున్న దృశ్యాలు చూసి అందరూ షాక్ అవుతారు. ఇప్పుడు దీనికి సంబంధించిన ఘటనే సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వస్తోంది. వీడియో చూస్తుంటే ఆ దొంగ ఎంతో అనుభవం ఉన్నవాడిలా.. ఈ పని చేసినట్లు తెలుస్తోంది.
అయితే, ఈ ఘటనపై వరుడు సోదరుడు నితిన్ సమీప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం.. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు వీడియో ఆధారంగా దొంగను గుర్తించే పనిలో పడ్డారు. అంతేకాకుండా కొంతమంది పోలీస్ అధికారులు సూచించిన వివరాల ప్రకారం.. పెళ్లిలు వంటి రద్దీగా ఉండే వేడుకల్లో విలువైన వస్తువుల పట్ల అప్రమత్తంగా ఉండాలని.. లేదంటే ఇలాంటి ప్రొఫెషనల్ దొంగలు ఇదే ఆసరాగా చేసుకుని లక్షల రూపాయల విలువైన వస్తువులను దోచేస్తున్నారని వారి తెలిపారు..
Also Read: మూడేళ్ల బాలుడిపై అంగన్వాడీ టీచర్ దాష్టీకం.. అల్లరి చేస్తున్నాడని కన్ను పోయేలా దారుణం..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Mancherial Latest Telugu News: మంచిర్యాల జిల్లాలోని క్యాతంపల్లి మున్సిపాలిటీ వేదికగా రాజకీయం ఒక్కసారిగా ఊహించని స్థాయిలో వేడెక్కింది.. అధికార కాంగ్రెస్తో పాటు ప్రతిపక్ష BRS శ్రేణుల మధ్య పోటాపోటీ నినాదాలు.. పోలీసుల జోక్యంతో మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.. అయితే, ఈ సమయంలో పోలీసులంతా కాంగ్రెస్ కార్యకర్తలు లాగా వ్యవహరిస్తున్నారని బిఆర్ఎస్ నేతలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు..
అసలు విషయం ఇదే..
క్యాతంపల్లి మున్సిపాలిటీ పరిధిలో 21వ వార్డుకు చెందిన BRS కౌన్సిలర్ అభ్యర్థి స్వర్ణలత మున్సిపల్ కార్యాలయానికి వెళ్లే సమయంలో ఆమెను ఒక్కసారిగా పోలీసులు అడ్డుకున్నారు.. అయితే, ఆమెపై కేసు నమోదు కావడంతో లోపలికి వెళ్లను ఇవ్వకపోవడంతో అక్కడ ఈ వివాదం ప్రారంభమైంది.. అయితే, వెంటనే విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కోవా లక్ష్మీతో పాటు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ వెంటనే అక్కడికి చేరుకోవడంతో పాటు పోలీసులు వ్యవహరిస్తున్న తీరును తప్పుబట్టారు.
BRS అభ్యర్థులను భయభ్రాంతులను గురి చేసేందుకు ఇలాంటి అక్రమ కేసులు పెడుతున్నారని వారు మండిపడ్డారు.. అంతేకాకుండా పోలీసులు కాకి దుస్తుల్లో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తల వ్యవహరిస్తున్నారని.. ప్రజాస్వామ్య బద్దంగా పోటీ చేస్తున్న అభ్యర్థులపై అక్రమ కేసులు పెడితే, అసలు ఊరుకోమని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ హెచ్చరించారు.
Also Read: మూడేళ్ల బాలుడిపై అంగన్వాడీ టీచర్ దాష్టీకం.. అల్లరి చేస్తున్నాడని కన్ను పోయేలా దారుణం..!
అయితే, ఇదే సమయంలో ఖతంపల్లి ఫ్లై ఓవర్ మీదుగా వెళుతున్న తెలంగాణ రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి కాన్వాయ్ను BRSకు సంబంధించిన కార్యకర్తలు అడ్డుకున్నారు.. మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. అలాగే వారు రోడ్డుపై బైఠాయించారు.. దీంతో అటు కాంగ్రెస్ కార్యకర్తలు కూడా అక్కడికి చేరుకోవడంతో ఇరువర్గాల మధ్య ఒక పెద్ద వాగ్వాదమే చోటుచేసుకుంది.. గో బ్యాక్ వివేక్ వెంకటస్వామి అంటూ టిఆర్ఎస్ శ్రేణులు.. జై కాంగ్రెస్ అంటూ ఇటు కాంగ్రెస్ కార్యకర్తలు నినాదం చేయడంతో అక్కడి పరిస్థితి ఒక్కసారిగా వేడెక్కింది.
Also Read: మూడేళ్ల బాలుడిపై అంగన్వాడీ టీచర్ దాష్టీకం.. అల్లరి చేస్తున్నాడని కన్ను పోయేలా దారుణం..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Praying Dead Body In House Since 4 Days: ఏసు కాపాడతాడు.. ప్రాణం పోస్తాడు.. ప్రార్థనలు చేస్తున్నామంటూ హైదరాబాద్లో ఓ కుటుంబం వింతగా ప్రవర్తించింది. కూకట్పల్లిలోని రామకృష్ణ నగర్ లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ కుటుంబం డెడ్ బాడీని ఇంట్లోనే నాలుగు రోజులుగా పెట్టి ప్రార్థనలు చేస్తున్నారు. 40 ఏళ్ల క్రితం ఏసురత్నం హైదరాబాద్కు వచ్చి స్థిరపడ్డాడు. ఏఎస్ఐగా పనిచేసి ఆయన పదవీ విరమణ కూడా పొంది మృతి చెందాడు. అయితే ప్రస్తుతం ఆయన భార్య శమంతకమణి, ఇద్దరు కుమార్తెలు సునీత, శైలజ కుమారుడు జయరాజులు కూడా ఉన్నారు.
అయితే వారం రోజులుగా చిన్న కుమార్తె శైలజ అనారోగ్యం బారిన పడింద. ఈ నేపథ్యంలో స్థానిక ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించారు. అయితే ఆమె రక్తహీనతతో బాధపడింది. కుటుంబ సభ్యులను రక్తం ఎక్కించాలని వైద్యులు సూచించినా.. పరిశుద్ధమైన రక్తం మాత్రమే ఎక్కించాలంటూ వారు నిర్లక్ష్యంగా ప్రవర్తించారు. దీంతో శైలజ ఈ నెల 13వ తేదీన చనిపోయింది. అయితే మృతదేహాన్ని కూడా అదే రోజు ఇంటికి తీసుకువెళ్లిపోయారు. కానీ అప్పటి నుంచి నేటి వరకు ఆమె అంత్యక్రియలు మాత్రం నిర్వహించలేరు. ఆ మృతదేహాన్ని రిఫ్రిజిరేటర్ పేటికలో అలాగే పెట్టి ఇంట్లోనే పెట్టుకొని తలుపులు బిగించుకొని ఉన్నారు.
ఇక ఎప్పటి మాదిరిగానే ఇంటి నుంచి బయటకు వెళ్తూ వస్తున్నారు . అయితే ఈ విషయం తెలిసిన స్థానికులు అంత్యక్రియలు చేయడం లేదు ఏంటని ప్రశ్నించగా.. పొంతన లేని సమాధానం చెబుతున్నారు. మేము ప్రార్థనలు చేస్తున్నాం.. యేసు కాపాడుతాడు.. అంత్యక్రియలు మా ఇష్టం వచ్చినప్పుడు చేస్తాం. అడగడానికి మీరు ఎవరు? అంటూ వారు అపార్ట్మెంట్ వాసులతో గొడవలకు దిగారు. దీంతో దుర్వాసన కూడా ఇంట్లోంచి ఎక్కువగా రావడంతో స్థానికులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంకా సోమవారం సమాచారం అందుకున్న పోలీసులు ఆ కుటుంబం వద్దకు వచ్చి ఆరా తీయగా కాసేపు ఎంతకీ తలుపులు తీయకుండా అలాగే ఉన్నారు . వారితో కూడా వాగ్వాదానికి దిగారు. అయితే చివరికి పోలీసులకు అంత్యక్రియలు జీహెచ్ఎంసీ వారికి అప్పగిస్తామని హెచ్చరించడంతో ఇక ఆ మృతదేహాన్ని తీసుకొని సొంతూరు వెళ్లారు. అయితే ఆ కుటుంబం కాస్త వింతగా ప్రవర్తిస్తుందని.. ఆ ముగ్గురు పిల్లలకు 40 ఏళ్లు పైబడినా ఎవరూ వివాహం చేసుకోకుండా తల్లి వద్దే ఉంటున్నారని స్థానికులు చెబుతున్నారు. అంతేకాదు ఎవరితో మాట్లాడారని మానసిక ఆరోగ్యంతో కూడా బాధపడుతున్నారని సమాచారం. అయితే, చనిపోయిన శైలజ కూడా మానసికంగా పరిస్థితి బాగా లేకపోవడం వల్ల అలా జరిగిందన్నారు.
Also Read: ఫిబ్రవరి 25 నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం.. టైమ్ టేబుల్ పీడీఎఫ్ ఇలా డౌన్లోడ్ చేసుకోండి..!
Also Read: మూడేళ్ల బాలుడిపై అంగన్వాడీ టీచర్ దాష్టీకం.. అల్లరి చేస్తున్నాడని కన్ను పోయేలా దారుణం..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Mars And Mercury Transit Effect On Zodiac Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కుజుడితో పాటు బుధుల సంచారం చాలా ప్రభావవంతమైందిగా భావిస్తారు. ధనిష్ట నక్షత్రంలో కుజుడు ఉండటం వల్ల ధైర్యంతో పాటు సంపాదన పెరుగుతుంది. అలాగే బుధుడు పూర్వభద్రపాదనక్షత్రంలో సంచార దశలో ఉండటం వల్ల మేధో వికాసం ఊహించని స్థాయిలో రెట్టింపు అవుతుంది. ఈ రెండు గ్రహాల సంచారం చాలా శుభ్రమైందిగా భావిస్తారు. ఎందుకంటే ఫిబ్రవరి 15వ తేదీన కుజుడితో పాటు బుధ గ్రహాలు సంచారం చేశాయి. ముఖ్యంగా ఈ రెండు గ్రహాలు నక్షత్ర సంచారంతో కొన్ని రాశుల వారికి అపారమైన ధన లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా ఆర్థికంగా కూడా చాలా వరకు కలిసి రాబోతోంది.
ఈ రాశులవారికి ఊహించని లాభాలు:
మేషరాశి
మేష రాశి వారికి కుజుడు అధిపతిగా వ్యవహరిస్తూ ఉంటాడు. ధనిష్ట నక్షత్రం లోకి కుజుడు సంచారం చేయడం కారణంగా ఆత్మవిశ్వాసం ఊహించని స్థాయిలో పెరుగుతుంది. ఏదైనా చట్టపరమైన కేసుల్లో ఇరుక్కున్న వారికి ఈ సమయంలో ఊహించని స్థాయిలో ఆత్మవిశ్వాసం లభిస్తుంది. అంతేకాకుండా వాటిల్లో విజయాలు కూడా సాధించగలుగుతారు. నాయకత్వ లక్షణాలున్నవారు పనుల్లో అద్భుతంగా రాణించగలుగుతారు. కొత్త భాగ్యదలు పొందడమే కాకుండా.. ఈ సమయంలో ఊహించని లాభాలు కూడా సొంతం చేసుకుంటారు. వ్యాపారాల్లో ఆర్థిక విస్తరణ కూడా సాధ్యమవుతుంది. ఈ సమయంలో ఊహించని ఆర్థిక లాభాలు కూడా కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మిథున రాశి
మిధున రాశికి బుధుడు అధిపతిగా వ్యవహరిస్తాడు.. అయితే, నక్షత్ర మార్పుల కారణంగా వీరికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ముఖ్యంగా వీరు కీలకమైన ఒప్పందాలు కుదుర్చుకుంటారు. అలాగే కొన్ని రకాల కీరకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కమ్యూనికేషన్ రంగంలో పనులు చేస్తున్న వ్యక్తులకు.. ఈ సమయం అద్భుతమైన అవకాశాలను అందించబోతోంది. రచనల్లో కూడా మిమ్మల్ని మించిన వారు లేకుండా ఉంటారు. అంతేకాకుండా ఆకస్మికంగా ఉద్యోగాలు కూడా లభిస్తాయి. అలాగే గణనీయమైన పురోగతి లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
సింహరాశి
సింహరాశి వారికి ఆర్థికంగా ఊహించని స్థాయిలో బలం పెరుగుతుంది. అదృష్టం కూడా చాలా వరకు సహకరించి విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. పూర్వీకుల ఆస్తుల నుంచి భారీ మొత్తంలో డబ్బులు కూడా పొందగలుగుతారు. ఉద్యోగాలు చేస్తున్న వ్యక్తులు పదోన్నతులు పొందే అవకాశాలు కూడా లభిస్తున్నాయి. ముఖ్యంగా ఈ సమయంలో పెట్టుబడులు పెట్టడం వల్ల మంచి లాభాలు కూడా పొందుతారు. రియల్ ఎస్టేట్ రంగాల్లో స్థిరపడిన వ్యక్తులకు ఈ సమయం చాలా అనుకూలంగా మారబోతోంది.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశిలో జన్మించిన వ్యక్తులకు కూడా కుజుడు ధనిష్ట నక్షత్రంలోకి సంచారం చేయడం కారణంగా ధైర్యం పెరగబోతుంది. ముఖ్యంగా వీరికి చాలా రకాల ప్రయత్నాలు విజయవంతమవుతాయి. శత్రువులపై ఊహించని విజయాలు సాధించగలుగుతారు. సామాజిక స్థితి కూడా ఊహించని స్థాయిలో పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం మెరుగుపడడమే కాకుండా.. వ్యాపారాల్లో ఆర్థిక పురోగతి కూడా లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతోపాటు దీర్ఘకాలిక సమస్యలు పూర్తిగా తొలగిపోబోతున్నాయి.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Ardha Kendra Raja Yoga Effect On Zodiac: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని ఎంతో శక్తివంతమైన గ్రహంగా పరిగణిస్తారు.. ఈ గ్రహం రెండున్నర సంవత్సరాలు ఒకే రాశిలో సంచార దశలో ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో ఎన్నో రకాల సంయోగాలు ఏర్పడుతూ ఉంటాయి. అయితే ప్రస్తుతం శని మీనరాశిలో సంచార దశలో ఉంది. ఫిబ్రవరి 11వ తేదీన ఉదయం 9 గంటల సమయంలో కుజుడు శని గ్రహం ఒకదానికొకటి 45 డిగ్రీల కోణం లోకి వచ్చి సంయోగం జరిపాయి. జ్యోతిష్య శాస్త్రంలో ఇలా అరుదుగా జరుగుతుంది. అయితే ఈ సమయంలోనే ఎంతో శక్తివంతమైన అర్థకేంద్ర రాజయోగం ఏర్పడింది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఇది చాలా శుభప్రదమైనదిగా చెప్పుకుంటారు.. ఈ యోగ ప్రభావం వల్ల అన్ని రాశుల వారికి ఎంతో కొంత మేలు జరుగుతుంది. అనుకోకుండా ఆర్థికపరమైన ఇబ్బందులు కూడా తొలగిపోయే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే, అర్థ కేంద్ర రాజయోగం వల్ల ఊహించని లాభాలు పొందుపై రాశులేవో.. ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఈ రాశులవారికి ప్రయోజనాలు:
మేషరాశి
మేషరాశి వారికి అర్థ కేంద్ర రాజయోగ ప్రభావంతో ఎన్నో రకాల అనుకూలమైన సంఘటనలు ఎదురవుతాయి. ముఖ్యంగా కుజుడు వీరికి ఉన్నత స్థానంలో ఉండడం వల్ల ఎలాంటి పనులు చేసిన అద్భుతమైన లాభాలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగాలు చేస్తున్న వ్యక్తులకు ఈ సమయం మంచి అవకాశాలను కలిగిస్తుంది. కొత్త కొత్త బాధ్యతలు కూడా లభిస్తాయి. వృత్తిపరమైన జీవితం కూడా చాలా వరకు మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో హోదా కూడా పెరిగి ఊహించని స్థాయిలో ప్రతిష్టలు పెరుగుతాయి. ముఖ్యంగా అనుకున్నంత స్థాయిలో ఆదాయం కూడా పెరుగుతుంది. జీవితం ఎంతో ఉత్సాహంగా ముందుకు సాగుతుంది.
కర్కాటక రాశి
కర్కాటక రాశిలో జన్మించిన వ్యక్తులకు కూడా ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా ఉన్నతాధికారుల నుంచి పనుల్లో సంతృప్తి కూడా లభిస్తుంది. దీంతోపాటు పదోన్నతులు పెరిగి జీతం కూడా విపరీతంగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే కుటుంబ జీవితం కూడా చాలా వరకు మెరుగుపడే సూచనలు ఉన్నాయి. ఆత్మవిశ్వాసం కూడా అనుకున్నంత స్థాయిలో పెరుగుతుంది. జీవితంలో ఊహించని ధన లాభాలు కూడా కలుగుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు.
ధనస్సు రాశి
ధనస్సు రాశి వారికి అర్థ కేంద్ర రాజయోగం కారణంగా అనుకున్న పనుల్లో అద్భుతమైన విజయాలు సాధించగలుగుతారు. దీంతోపాటు సంపాదన కూడా విపరీతంగా పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితులు గతంలో కంటే ఇప్పుడు మరింత మెరుగుపడతాయి. అంతేకాకుండా వ్యక్తిగత జీవితం కూడా మెరుగుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వ్యాపారవేత్తలు ఈ సమయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఈ సమయంలో ఎలాంటి పనులు చేసిన మిశ్రమ ఫలితాలు పొందే అవకాశాలున్నాయి. కొన్ని నిర్ణయాలు తీసుకునే క్రమంలో చాలా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Mahalakshmi Raja Yoga Effect On Zodiac: ఫిబ్రవరిలోని కొత్త వారంలో మకర రాశిలో చంద్రుడి గుజుడి కలయిక జరిగింది. అయితే ప్రారంభ సమయంలోనే ఈ రెండు గ్రహాల కలయిక జరగడం వల్ల ఎంతో ప్రత్యేకమైన మహాలక్ష్మి రాజయోగం ఏర్పడింది. ఈ యోగాన్ని అత్యంత అరుదైనదిగా భావిస్తారు. అయితే దీని ప్రభావం కొన్ని రోజులపాటు కొనసాగుతూ వస్తుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. దీనిని చంద్ర మంగళ రాజయోగంగా కూడా చెప్పుకుంటారు. ఈ వారం ఎంతో శక్తివంతమైన మహాపురుష రాజయోగం కూడా ఏర్పడబోతోంది. దీనివల్ల కొన్ని రాశుల వారి జీవితాల్లో కీలకమైన మార్పులు రాబోతున్నాయి. ముఖ్యంగా వీరికి ఈ సమయంలో ధైర్యం పెరగడమే కాకుండా.. రాజకీయాల్లో అపారమైన విజయాలు లభించబోతున్నాయి. మేష రాశి వారికి అన్నింటి పరంగా విపరీతమైన ఆర్థిక లాభాలు కలుగుతాయి. డబ్బు కూడా భారీ మొత్తంలో లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈ రాశుల వారికి బంపర్ జాక్పాట్..
మేషరాశి
మేష రాశి వారికి మహాలక్ష్మి రాజయోగం (Mahalakshmi Raja Yoga) కారణంగా విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి. పనుల్లో సానుకూలమైన ఫలితాలు లభిస్తాయి. ఆరోగ్య పరిస్థితులు కూడా చాలా అనుకూలంగా మారే అవకాశాలు ఉన్నాయి. ఈ వారం ప్రయాణాలు చేయడం వల్ల విపరీతమైన ఆనందం కూడా లభిస్తుంది. మీ కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం కూడా నెలకొంటుంది. ఆర్థికంగా ఖర్చులు విపరీతంగా ఉన్నప్పటికీ.. ఈ సమయంలో కొన్ని రకాల ప్రయోజనాలు కలుగుతాయి. దీర్ఘకాలిక సమస్యలకు కాస్త పరిష్కారం కూడా దొరుకుతుంది.
వృషభ రాశి
వృషభ రాశిలో జన్మించిన వారికి ఈ సమయంలో విపరీతమైన ధన లాభాలు కలుగుతాయి. ఈ సమయంలో కొన్ని రకాల ఆర్థికపరమైన నిర్ణయాలు కూడా తీసుకుంటారు. పెట్టుబడులు పెట్టడం వల్ల జీవితం చాలా వరకు ప్రశాంతంగా ముందుకు కొనసాగుతుంది. దీంతోపాటు కుటుంబంలో ఆనందం విపరీతంగా పెరుగుతుంది. ఈ వారం ప్రయాణాలు చేయాలనుకుంటున్న వ్యక్తులకు విశేషమైన లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా కాస్త వీరు ఆరోగ్యంపై ప్రత్యేకమైన శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. అలాగే ఆహార సంబంధిత సమస్యలు కూడా రావచ్చు.
మిథున రాశి
మిథున రాశిలో జన్మించిన వ్యక్తులకు ఈ సమయం విశేషమైన ప్రయోజనాలను అందించబోతోంది. ముఖ్యంగా వీరికి కార్యాలయాల్లో విశేషమైన గుర్తింపు లభిస్తుంది. ఆర్థికపరమైన శ్రేయస్సు లభించడమే కాకుండా.. ప్రయాణాలు చేయడం వల్ల అద్భుతమైన విజయాలు సాధించగలుగుతారు. ఇక భాగస్వామ్య జీవితంలో సంబంధాలు మరింత మెరుగుపడతాయి. వ్యాపారాల్లో భాగస్వాములు ఒకరినొకరు అర్థం చేసుకుంటూ విశేషమైన ప్రయోజనాలు పొందుతారు. అంతేకాకుండా కుటుంబ విషయాలపై అద్భుతమైన నిర్ణయాలు తీసుకునే అవకాశాలున్నాయి. ఈ సమయంలో కాస్త రిస్కు తీసుకున్నప్పటికీ ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి.
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
HBD KCR: కాంగ్రెస్ అధికార బలం.. గూండాగిరి.. దౌర్జన్యం చేసినా కూడా పటాన్చెరు నియోజకవర్గంలోని ఐదుకు ఐదు మున్సిపాలిటీలు గెలిచి తెలంగాణ తొలి సీఎం కేసీఆర్కు బర్త్ డే గిఫ్ట్ ఇస్తామని బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రకటించారు. రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. 'పటాన్చెరు నియోజకవర్గంలోని ఐదు మునిసిపాలిటీల గెలుపును కేసీఆర్కు గిఫ్ట్గా ఇస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు బిఆర్ఎస్కే పట్టం కట్టింది' అని తెలిపారు. ప్రభుత్వం 420 హమీలు గుప్పించి ఇప్పటికీ ఏం వాగ్దానం నెరవేర్చలేదని చెప్పారు.
Also Read: Seethakka: వెన్నుపోటుదారులను వదల.. కాంగ్రెస్ రెబెల్స్కు సీతక్క మాస్ వార్నింగ్!
'అధికార దుర్వినియోగానికి కాంగ్రెస్ ప్రభుత్వం దిగింది. బీఆర్ఎస్ పార్టీ తరఫున కౌన్సిలర్గా గెలిచిన కౌన్సిలర్లను కౌంటింగ్ కేంద్రాల నుంచి కిడ్నాప్ చేయటం ఎంత వరకు సమంజసం?' రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ప్రశ్నించారు. అవినీతికి, గతంలో జరిగిన అభివృద్ధికి మధ్య జరిగిన పోరులో అభివృద్ధి విజయం సాధించిందని తెలిపారు. 'ప్రజల సంక్షేమం కోసం పుట్టిన పార్టీ బీఆర్ఎస్. నియోజకవర్గంలోని ఐదు మున్సిపాలిటీలకు రావాల్సిన నిధులను తీసుకువచ్చి అభివృద్ధి చేస్తాం' అని ప్రకటించారు.
Also Read: India vs Pakistan: పాకిస్థాన్ దిమ్మతిరిగింది.. టీ20 ప్రపంచకప్లో టీమిండియా హ్యాట్రిక్ విజయం
'పోలీస్, అధికార విభాగం ప్రభుత్వానికి కట్టుబానిసగా పనిచేసింది. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్లలు, ప్రజాప్రతినిధులపై దాడులు జరుగుతున్నాయి. విలువైన భూములపై రేవంత్ రెడ్డి, ఆయన అనుచరులకు తమ భూమిలో కన్నుపడింది. అవినీతికి తెరలేపింది కాంగ్రెస్ పార్టీయే' అని రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఆదర్శ్ రెడ్డి మాట్లాడుతూ.. 'పటాన్చెరు నియోజకవర్గంలోని ఐదు మున్సిపాలిటీలలో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగురవేయటం సంతోషంగా ఉంది. ఈ విజయానికి బాటలు వేసిన మాజీ మంత్రి హరీశ్ రావుకు కృతజ్ఞతలు. ప్రతిపక్షంలో ఉండి కూడా పటాన్చెరు నియోజకవర్గంలోని ఐదు మునిసిపాలిటీలలో విజయం సాధించటం ఆనందంగా ఉంది. అన్ని మునిసిపాలిటీలలో ఇస్నాపూర్ మునిసిపాలిటీ గెలుపు చాలా ప్రత్యేకమైనది' అని తెలిపారు.
Also Read: IND vs PAK: చెలరేగిన పాకిస్థాన్.. ఇషాన్ కిషన్ శ్రమించినా భారత్ స్కోర్ ఏడు వికెట్లకు 175
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Chiranjeevi Shoulder Surgery Update: మెగాస్టార్ చిరంజీవి గత కొన్ని రోజులుగా చేతికి కట్టు కట్టుకుని కనిపిస్తుండటంతో అభిమానుల్లో నెలకొన్న ఆందోళనకు ఆయన స్వయంగా తెరదించారు. సోషల్ మీడియా వేదికగా తన ఆరోగ్య పరిస్థితిపై క్లారిటీ ఇస్తూ, సర్జరీ జరిగిన విషయాన్ని ధృవీకరించారు.
ఇటీవల అల్లు అరవింద్ కుటుంబం అల్లు శిరీష్ వివాహ ఆహ్వాన పత్రికను చిరంజీవికి అందించిన సమయంలో, ఆయన చేతికి కట్టు ఉండటాన్ని గమనించిన అభిమానులు కంగారు పడ్డారు. దీనిపై చిరు స్పందిస్తూ అసలు విషయం చెప్పారు.
ఏం జరిగింది?
చిరంజీవి తన భుజానికి సంబంధించి ఒక చిన్న శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఆయన భుజానికి ఆర్థోస్కోపీ జరిగినట్లు వెల్లడించారు. ఈ సర్జరీని విజయవంతంగా పూర్తి చేసిన డాక్టర్ నితిన్కు చిరంజీవి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. వారి నైపుణ్యం వల్ల సర్జరీ ప్రక్రియ అంతా చాలా సౌకర్యవంతంగా సాగిందని పేర్కొన్నారు.
Several well-wishers have enquired about my health after noticing the arm sling.
It was just a minor shoulder keyhole surgery. I am recovering well and already getting back to my routine.
My heartfelt thanks to Dr. Nithin, one of the finest arthroscopy surgeons, for his care… pic.twitter.com/txLNH2yNFQ
— Chiranjeevi Konidela (@KChiruTweets) February 16, 2026
అంతకుముందు చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంక్ను సందర్శించినప్పుడు కూడా చేతికి కట్టుతోనే కనిపించారు. నొప్పి ఉన్నప్పటికీ అభిమానులతో ఫోటోలు దిగుతూ ఎంతో ఓపికగా గడిపారు. తాజాగా అల్లు అరవింద్ దంపతులు, శిరీష్ స్వయంగా చిరు ఇంటికి వెళ్లి మొదటి శుభలేఖ అందించారు. మెగా-అల్లు కుటుంబాలు కలిసి కనిపించిన ఆనందంలో ఉన్న ఫ్యాన్స్కు చిరు చేతి కట్టు మాత్రం టెన్షన్ పెట్టింది.
ప్రస్తుత పరిస్థితి
చిరంజీవి ప్రస్తుతం వేగంగా కోలుకుంటున్నారు. ఇప్పటికే తాను సాధారణ జీవితానికి తిరిగి వస్తున్నానని, త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో పనుల్లో నిమగ్నమవుతానని భరోసా ఇచ్చారు. తన ఆరోగ్యం గురించి ఆరా తీసిన శ్రేయోభిలాషులకు, దీవెనలు అందించిన అభిమానులకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేశారు. మెగాస్టార్ క్లారిటీ ఇవ్వడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.
Also Read: Solar Eclipse 2026: రేపే సూర్యగ్రహణం..సమయం, సూతక కాలం ఎప్పుడో తెలుసా? భారతదేశంలో ప్రభావం ఉందా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Srisailam Bus Accident Today: శ్రీశైలం వెళ్లే భక్తులకు ఘాట్ రోడ్డులో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న లోతైన గుంతలోకి ఒరిగిపోవడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. శ్రీశైల మల్లికార్జున స్వామి దర్శనానికి వెళ్తున్న భక్తులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. తృటిలో పెను ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ప్రమాదం జరిగిన తీరు
శ్రీశైలం ఘాట్ రోడ్డులోని దోర్నాల సమీపంలో ఈ ఘటన జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. సరిగ్గా అదే చోట పెద్ద గుంత ఉండటంతో బస్సు అమాంతం అందులోకి ఒరిగిపోయింది. బస్సు గుంతలోకి ఒరిగిపోవడాన్ని గమనించిన తోటి వాహనదారులు వెంటనే స్పందించారు.
ఏమాత్రం ఆలస్యం చేయకుండా బస్సులో ఉన్న ప్రయాణికులందరినీ సురక్షితంగా కిందకు దించేశారు. సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో ఎవరికీ ఎటువంటి గాయాలు కాకుండానే ప్రాణాపాయం తప్పింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు మరియు రెస్క్యూ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. గుంతలో ఇరుక్కుపోయిన బస్సును బయటకు తీసేందుకు క్రేన్ల సహాయంతో ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదం కారణంగా ఘాట్ రోడ్డులో కాసేపు ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది.
ఘాట్ రోడ్లలో ప్రయాణించేటప్పుడు డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా మలుపుల వద్ద వేగాన్ని నియంత్రించాలని అధికారులు సూచిస్తున్నారు. అదృష్టవశాత్తూ ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
Also Read: Solar Eclipse 2026: రేపే సూర్యగ్రహణం..సమయం, సూతక కాలం ఎప్పుడో తెలుసా? భారతదేశంలో ప్రభావం ఉందా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Tata Motors EV Offers: ఎలక్ట్రిక్ కారు కొనాలనుకునే వారికి టాటా మోటార్స్ అదిరిపోయే శుభవార్త అందించింది. పర్యావరణ హితమైన వాహనాలను ప్రోత్సహించే దిశగా, ఫిబ్రవరి నెలలో తన ఎలక్ట్రిక్ వాహనాలపై (EVs) భారీ తగ్గింపులను ప్రకటించింది. మోడల్ను బట్టి ఏకంగా రూ.3.80 లక్షల వరకు ఆదా చేసుకునే అవకాశం కల్పిస్తోంది. భారత ఈవీ మార్కెట్లో రారాజుగా వెలుగుతున్న టాటా మోటార్స్, ఈ నెలలో కస్టమర్లను ఆకట్టుకునేందుకు సిద్ధమైంది.
ఈ నెలకు సంబంధించి అత్యధిక తగ్గింపు టాటా కర్వ్ EV పైనే ఉంది. గరిష్టంగా ₹3.80 లక్షల వరకు ఆదా చేసుకోవచ్చు. పాత స్టాక్ (మోడల్ ఇయర్) ఉన్న వాహనాలపై ఈ డిస్కౌంట్ వర్తిస్తుంది. కేవలం కర్వ్ మాత్రమే కాకుండా, మిగిలిన ప్రధాన ఈవీలపై కూడా టాటా ఆకర్షణీయమైన ధరలను అందిస్తోంది.
నెక్సాన్ EV ఫ్యామిలీ ఈవీ సెగ్మెంట్లో టాప్ లో ఉండే ఈ కారుపై కూడా మంచి డిస్కౌంట్లు ఉన్నాయి. అలాగే పంచ్ EV మైక్రో ఎస్యూవీ విభాగంలో క్రేజ్ సంపాదించుకున్న పంచ్ ఈవీపై ఈ నెల ప్రత్యేక ఆఫర్లు ప్రకటించారు. చివరిగా టియాగో EV బడ్జెట్ ఈవీ ప్రియులకు ఇది ఒక మంచి అవకాశం.
డిస్కౌంట్లు ఎలా నిర్ణయిస్తారు?
ఈ తగ్గింపులు అన్ని కార్లపై ఒకేలా ఉండవు, కింద పేర్కొన్న అంశాలపై ఆధారపడి ఉంటాయి. 2024 లేదా అంతకంటే పాత మోడల్ ఇయర్ స్టాక్ (MY24) వాహనాలపై డిస్కౌంట్లు అత్యధికంగా ఉంటాయి. ఆఫర్లు నగరాలు, డీలర్షిప్ల ఆధారంగా స్వల్పంగా మారుతుంటాయి. అదనంగా ఎక్స్ఛేంజ్ బోనస్ లేదా కార్పొరేట్ డిస్కౌంట్లు కూడా లభించే అవకాశం ఉంది.
ఎలక్ట్రిక్ కారు ఎందుకు కొనాలి?
పెట్రోల్, డీజిల్ ధరలతో పోలిస్తే ఈవీ ఖర్చు చాలా తక్కువే కాకుండా కాలుష్యం లేని ప్రయాణాన్ని అందిస్తాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీలు, రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపులను కల్పిస్తున్నాయి.
మీరు టాటా ఎలక్ట్రిక్ కారు కొనే ఆలోచనలో ఉంటే, మీ సమీప టాటా మోటార్స్ డీలర్షిప్ను సందర్శించి అక్చువల్ స్టాక్, ఫైనల్ ప్రైస్ గురించి తెలుసుకోవడం ఉత్తమం. ఈ నెలలో లభించే భారీ తగ్గింపులను వినియోగించుకుని లక్షల రూపాయలు ఆదా చేసుకోండి.
Also Read: Solar Eclipse 2026: రేపే సూర్యగ్రహణం..సమయం, సూతక కాలం ఎప్పుడో తెలుసా? భారతదేశంలో ప్రభావం ఉందా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook