Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Khammam507002

చింతకాని: పోలీసుల అదుపులో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు

Oct 24, 2024 10:03:56
Khammam, Telangana

చింతకానిలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పెంట్యాల పుల్లయ్యను పోలీసులు అరెస్టు చేసారు. అయితే ఏ కేసులో అరెస్ట్ చేసారో చెప్పులంటూ పార్టీ నాయకులు, కుటుంబ సభ్యులు పోలీసులతో వాగ్వాదం చేసారు. ఈక్రమంలో పోలీసుల వాహనాన్ని వారు అడ్డుకున్నారు. ఈ నేపాథ్యంలో కాసేపు ఉద్రిక్తత పరిస్థితి కనిపించింది. అనంతరం బలవంతంగా పుల్లయ్య ను స్టేషన్ కు తరలించారు. ఏ కేసులో అరెస్ట్ చేసారో చెప్పకుండా అక్రమంగా అరెస్ట్ చేసారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
HDHarish Darla
Jan 19, 2026 08:11:58
Keraniganj, Dhaka Division:

ICC Ultimatum To Bangladesh Update: 2026 టీ20 ప్రపంచకప్ ఆతిథ్యంపై నెలకొన్న సందిగ్ధత ఇప్పుడు క్లైమాక్స్‌కు చేరుకుంది. భద్రతా కారణాల సాకుతో భారత్‌లో ఆడేందుకు నిరాకరిస్తున్న బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB)కు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) గట్టి హెచ్చరిక జారీ చేసింది.

భారత్, శ్రీలంక వేదికలుగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్ పాల్గొనడంపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ విషయంలో ఐసీసీ తన వైఖరిని స్పష్టం చేస్తూ, నిర్ణయం తీసుకోవడానికి జనవరి 21ని ఆఖరి తేదీగా (Deadline) నిర్ణయించింది.

వివాదం ఎక్కడ మొదలైంది?
ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) జట్టు నుంచి బంగ్లా పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్‌ను తొలగించాలనే బీసీసీఐ నిర్ణయం తర్వాత రెండు బోర్డుల మధ్య విభేదాలు మొదలయ్యాయి. దీనికి తోడు రాజకీయ పరిస్థితులను సాకుగా చూపిస్తూ, భారత్‌లో ఆడితే తమ ఆటగాళ్లకు భద్రత ఉండదని బంగ్లాదేశ్ వాదిస్తోంది.

ఐసీసీ మీటింగ్‌లో కీలక అంశాలు:
వేదిక మార్పు కుదరదు: తమ గ్రూప్ మ్యాచ్‌లను భారత్ నుంచి శ్రీలంకకు మార్చాలన్న బంగ్లాదేశ్ విన్నపాన్ని ఐసీసీ తోసిపుచ్చింది. ముందుగా నిర్ణయించినట్లు కోల్‌కతా, ముంబైలలోనే మ్యాచ్‌లు ఆడాలని స్పష్టం చేసింది. ఐర్లాండ్‌తో గ్రూప్ మార్చుకుంటామన్న ప్రతిపాదనను కూడా ఐసీసీ తిరస్కరించింది. భారత్‌లో బంగ్లాదేశ్ జట్టుకు ఎటువంటి ముప్పు లేదని, పూర్తి స్థాయి భద్రత కల్పిస్తామని ఐసీసీ హామీ ఇచ్చింది.

బంగ్లాదేశ్ తప్పుకుంటే ఏమవుతుంది?
జనవరి 21లోపు బంగ్లాదేశ్ తన నిర్ణయాన్ని వెల్లడించకపోతే, ఐసీసీ కఠిన చర్యలకు సిద్ధమవుతోంది. బంగ్లాదేశ్ స్థానంలో ఐసీసీ ర్యాంకింగ్స్ ప్రకారం స్కాట్లాండ్ జట్టును ప్రపంచకప్‌లోకి తీసుకునే అవకాశం ఉంది.

మరోవైపు, బంగ్లాదేశ్‌కు మద్దతుగా పాకిస్తాన్ కూడా తన భాగస్వామ్యంపై ఆలోచిస్తామని ప్రకటించడం గమనార్హం. ఒకవేళ శ్రీలంక వీలుకాకపోతే బంగ్లాదేశ్ మ్యాచ్‌లను తమ దేశంలో (పాకిస్తాన్) నిర్వహించడానికి సిద్ధమని పీసీబీ ప్రతిపాదించింది.

వచ్చే 48 గంటలు బంగ్లాదేశ్ క్రికెట్ భవిష్యత్తుకు అత్యంత కీలకం. ఐసీసీ హెచ్చరికకు తలొగ్గి భారత్‌కు వస్తారా? లేక ప్రతిష్టాత్మక ప్రపంచకప్ నుంచి తప్పుకుంటారా? అన్నది ఇప్పుడు క్రీడా లోకంలో హాట్ టాపిక్‌గా మారింది.

Also Read: School Holiday: విద్యార్థులకు మరో గుడ్‌న్యూస్..తెలంగాణలో వరుసగా 4 రోజులు సెలవులు..ఎప్పటి నుంచి ఎప్పటివరకు?

Also REad: Dmart Business Model: డీమార్ట్‌ ఆఫర్ల వెనుక ఎవ్వరికీ తెలియని సీక్రెట్స్..తక్కువ ధరకే సరుకులు అమ్మడానికి కారణం ఇదే!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
BBhoomi
Jan 19, 2026 07:59:55
Secunderabad, Telangana:

Union Budgets 2026: జనవరి నెల పూర్తవ్వడానికి వస్తుంది. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాల సవరణ అమల్లోకి రాలేదు. దీంతో 8వ వేతన సంఘం అమలు ఆలస్యం అవుతుందన్న విషయం స్పష్టమవుతోంది. రేటింగ్ సంస్థ ఐసీఆర్ఏ తాజాగా విడుదల చేసిన నివేదికలో ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ.. ఈ జాప్యం వల్ల కేంద్ర ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థపై గణనీయమైన ప్రభావం పడే ఛాన్స్ ఉందని హెచ్చరించింది. ముఖ్యంగా వేతన సంఘ సిఫార్సులు చివరకు జనవరి 1నుంచి అమలు చేస్తే ఆ ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందని పేర్కొంది. 

సాధారణంగా కేంద్ర వేతన సంఘాలు ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి అమల్లోకి వస్తాయి. అదే విధంగా  7వ వేతన సంఘం జనవరి 1, 2016 నుంచి అమలులోకి వచ్చిన నేపథ్యంలో.. 8వ వేతన సంఘం కూడా జనవరి 2026 నుంచే అమల్లోకి వస్తుందని చాలా కాలంగా భావించారు. అయితే, ప్రస్తుతం కమిషన్ తన నివేదికను సమర్పించేందుకు ఇంకా 15 నుంచి 18 నెలల సమయం పట్టే అవకాశం ఉందని ఐసీఆర్‌ఏ వెల్లడించింది. దీనివల్ల సమీప భవిష్యత్తులో జీతాల సవరణ జరగడం అసాధ్యమని సంస్థ అభిప్రాయపడింది. ఈ విషయాన్ని ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్ నివేదిక కూడా ప్రస్తావించింది.

ఐసీఆర్‌ఏ రూపొందించిన ఈ విశ్లేషణను బడ్జెట్ 2026–27పై ఇచ్చిన అవుట్‌లుక్‌లో చేర్చారు. దాని ప్రకారం, 8వ వేతన సంఘం వల్ల కేంద్ర ప్రభుత్వంపై పడే ఆర్థిక భారం తక్షణం కాకుండా 2028 ఆర్థిక సంవత్సరంలోనే స్పష్టంగా కనిపించే అవకాశం ఉంది. ఒకసారి సిఫార్సులు అమలులోకి వస్తే జీతాలు, పెన్షన్లపై ప్రభుత్వ ఖర్చు భారీగా పెరుగుతుందని, ఇది ఆర్థిక స్థిరత్వంపై ఒత్తిడిని పెంచుతుందని అంచనా వేస్తున్నారు.అయితే, వేతన సంఘం అమలు ఎప్పుడు జరిగినా ప్రభుత్వం దానిని జనవరి 1, 2026 నుంచి వెనుకటి తేదీ నుంచి అమలు చేసే అవకాశమే ఎక్కువగా ఉందని ఐసీఆర్‌ఏ భావిస్తోంది. అలా జరిగితే, కనీసం 15 నెలలు లేదా అంతకంటే ఎక్కువ కాలానికి సంబంధించిన బకాయిలను ఒకేసారి చెల్లించాల్సి వస్తుంది. ఇది ప్రభుత్వ ఖజానాపై ఒక్కసారిగా భారీ భారం మోపుతుంది. ఐసీఆర్‌ఏ అంచనా ప్రకారం, ఈ కారణంగా 2028 ఆర్థిక సంవత్సరంలో జీతాల వ్యయం 40 నుంచి 50 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది.

గత అనుభవాలను ఉదాహరణగా తీసుకుంటే, బకాయిల పరిమాణం బడ్జెట్‌పై ఎంత ప్రభావం చూపుతుందో స్పష్టంగా తెలుస్తుంది. 7వ వేతన సంఘం అమలు సమయంలో బకాయిలను కేవలం ఆరు నెలలకు మాత్రమే పరిమితం చేసినప్పటికీ, ఒకే ఏడాదిలో జీతాల వ్యయం 20 శాతానికి పైగా పెరిగింది. దీనికి భిన్నంగా, 6వ వేతన సంఘం అమలులో జాప్యం ఎక్కువగా ఉండటంతో బకాయిలు రెండున్నర సంవత్సరాలకు మించి పేరుకుపోయాయి. దీని వల్ల అనేక సంవత్సరాల పాటు ప్రభుత్వంపై నిరంతర ఆర్థిక ఒత్తిడి కొనసాగింది.

Also Read: Pension: తమ సంబంధాన్ని ఎప్పుడూ దాచలేదు..లివ్‌-ఇన్‌-పార్ట్‌నెర్‌కు పెన్షన్ ఇవ్వాల్సిందే.. కేంద్రానికి హైకోర్టు ఆదేశాలు..!

రాబోయే కాలంలో జీతాలు, పెన్షన్ల భారం వల్ల వచ్చే ప్రభావాన్ని కొంత మేర తగ్గించేందుకు ప్రభుత్వం 2027 ఆర్థిక సంవత్సరంలో మూలధన వ్యయాన్ని ముందుగానే పెంచే అవకాశం ఉందని ఐసీఆర్‌ఏ అంచనా వేస్తోంది. ఈ నివేదిక ప్రకారం, మూలధన వ్యయం దాదాపు 14 శాతం పెరిగి సుమారు రూ. 13.1 లక్షల కోట్లకు చేరుకోవచ్చు. దీని ద్వారా మౌలిక సదుపాయాలు, అభివృద్ధి ప్రాజెక్టులు కొనసాగుతూనే, ఆర్థిక స్థలం కొంత సమతుల్యంగా ఉండే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల దృష్టిలో చూస్తే, ఈ ఆలస్యం అంటే జీతాల పెంపు రద్దు అయినట్టు కాదు, కేవలం వాయిదా పడినట్టే. చివరకు వేతన సంఘం అమలులోకి వచ్చినప్పుడు భారీ మొత్తంలో బకాయిలు అందుకునే అవకాశం ఉన్నప్పటికీ, ఈ దీర్ఘకాలిక నిరీక్షణ ఉద్యోగుల్లో అనిశ్చితిని పెంచుతోంది. మరోవైపు, ప్రభుత్వానికి బడ్జెట్ ప్రణాళిక రూపొందించడాన్ని మరింత క్లిష్టంగా మారుస్తోంది.

ఐసీఆర్‌ఏ అంచనా ప్రకారం 8వ కేంద్ర వేతన సంఘం ఇకపై ఒక సాధారణ జీత సవరణ ప్రక్రియగా మాత్రమే ఉండదు. ఇది కేంద్ర ప్రభుత్వ వ్యయ ప్రాధాన్యతలను తిరిగి నిర్వచించే స్థాయికి చేరుకుని.. రాబోయే సంవత్సరాల్లో వరుసగా వచ్చే కేంద్ర బడ్జెట్‌లపై కూడా గణనీయమైన ప్రభావం చూపించే ప్రధాన ఆర్థిక పరిణామంగా మారే అవకాశం ఉందని నివేదిక స్పష్టం చేస్తోంది.

Also Read: Yogi Adityanath: అంతా టీచరే చేశారు.. యోగి బాల్డ్ హెడ్‌కి కారణం తెలుసుకుంటే మైండ్ బ్లాక్‌ అవుతుంది.. ఓసారి ఈ యూపీ సీఎం బాల్యంలోకి తొంగిచూద్దామా?

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
HDHarish Darla
Jan 19, 2026 07:36:24
Medaram, Telangana:

School Holidays In Telangana: తెలంగాణలో సంక్రాంతి సెలవులు ముగిసిన వెంటనే విద్యార్థులకు మరో శుభవార్త వినిపిస్తోంది. ఈ నెల చివరలో మేడారం జాతర సందర్భంగా వరుస సెలవులు వచ్చే అవకాశం ఉందన్న వార్తలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. తెలంగాణ కుంభమేళాగా పిలుచుకునే మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర సందర్భంగా రాష్ట్రంలో పాఠశాలలకు సెలవులు ప్రకటించాలని ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి.

మేడారం జాతర ఎప్పుడంటే?
ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తింపు పొందిన మేడారం జాతర ఈ నెల జనవరి 28 నుండి 31 వరకు నాలుగు రోజుల పాటు అత్యంత వైభవంగా జరగనుంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి లక్షలాది మంది భక్తులు ఈ జాతరకు తరలివెళ్తుంటారు.

సెలవులపై విన్నపం..
జాతర సమయంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు తమ కుటుంబాలతో కలిసి దేవతలను దర్శించుకునేందుకు వీలుగా సెలవులు ప్రకటించాలని పీర్టీయూ (PRTU) నాయకులు ప్రభుత్వానికి విన్నవించారు. జాతర జరిగే నాలుగు రోజులు (జనవరి 28, 29, 30, 31) సెలవులు ఇవ్వాలని వారు కోరుతున్నారు. ఒకవేళ ప్రభుత్వం ఈ ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే, విద్యార్థులకు వరుసగా నాలుగు రోజులు సెలవులు లభించనున్నాయి.

సాధారణంగా మేడారం జాతర సమయంలో ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో స్థానిక సెలవులు ప్రకటించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే, రాష్ట్రవ్యాప్తంగా సెలవులు ఇస్తారా లేదా అనేది ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. సెలవులపై విద్యాశాఖ నుండి క్లారిటీ వస్తే విద్యార్థులు, తల్లిదండ్రులకు స్పష్టత లభిస్తుంది.

వరుస సెలవుల వార్తలతో విద్యార్థులు సంబరపడుతుండగా, జాతర ఏర్పాట్లు కూడా శరవేగంగా సాగుతున్నాయి. ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపైనే ఇప్పుడు అందరి దృష్టి ఉంది.

Also Read: Dmart Business Model: డీమార్ట్‌ ఆఫర్ల వెనుక ఎవ్వరికీ తెలియని సీక్రెట్స్..తక్కువ ధరకే సరుకులు అమ్మడానికి కారణం ఇదే!

Also REad: Most Gold Reserves: మూడో ప్రపంచయుద్ధానికి ముందు ఎవరి వద్ద ఎంత బంగారం? భారత్‌తో ఎన్ని టన్నులు ఉన్నాయి?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
BBhoomi
Jan 18, 2026 15:37:45
Lakshmapur, Telangana:

BRICS Currency Future:  ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఆధారస్తంభంగా ఉన్న అమెరికా డాలర్ ఆధిపత్యం భవిష్యత్తులో బలహీనపడే అవకాశముందా అనే ప్రశ్న ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. అమెరికా అనుసరిస్తున్న కఠినమైన సుంకాల విధానాలు, ఆర్థిక ఆంక్షలు, ఏకపక్ష నిర్ణయాలతో అనేక దేశాలు అసంతృప్తికి లోనవుతున్నాయి. ఈ పరిస్థితుల్లోనే కొన్ని దేశాలు డాలర్‌పై ఆధారపడకుండా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నాయి. ఈ క్రమంలో బ్రిక్స్ దేశాలు ఉమ్మడి కరెన్సీపై చేస్తున్న చర్చలు ప్రపంచ మార్కెట్లలో ఆసక్తిని, ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. బ్రిక్స్ నిజంగా తన సొంత కరెన్సీని ప్రవేశపెడితే, డాలర్ ప్రభావం తగ్గుతుందా అన్నది ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా నిలుస్తోంది.

అమెరికా డాలర్ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన కరెన్సీగా ఎందుకు నిలిచిందంటే, దానికి చారిత్రక, ఆర్థిక కారణాలు ఉన్నాయి. నేటి అంతర్జాతీయ వాణిజ్యంలో డాలర్ అత్యధికంగా ఉపయోగిస్తోంది. చమురు లావాదేవీల నుంచి అంతర్జాతీయ ఒప్పందాల వరకు చాలా వ్యవహారాలు డాలర్లలోనే జరుగుతాయి. ఈ కారణంగా డాలర్ కేవలం ఒక కరెన్సీగా కాకుండా, అమెరికా ఆర్థిక, రాజకీయ ప్రభావాన్ని ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చేసే సాధనంగా మారింది. అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలు నేరుగా లేదా పరోక్షంగా డాలర్‌తో ముడిపడి ఉండటం కూడా దీనికి బలం చేకూర్చింది.

డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అమెరికా వాణిజ్య విధానాల్లో స్పష్టమైన మార్పులు కనిపించాయి. భారీ సుంకాలు విధించడం, ఆంక్షలు విధించడం, ఆర్థిక ఒత్తిడిని ఒక రాజకీయ ఆయుధంగా ఉపయోగించడం వంటి చర్యలు అనేక దేశాలను ఇబ్బందులకు గురిచేశాయి. భారతదేశం, చైనా, బ్రెజిల్ వంటి దేశాలతో వాణిజ్య ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ పరిస్థితులు అనేక దేశాలను  డాలర్‌పై ఇంతగా ఆధారపడటం సరైందేనా?  అనే ప్రశ్న వేయించేలా చేశాయి. ఫలితంగా, డాలర్‌కు ప్రత్యామ్నాయ వ్యవస్థలపై ఆలోచనలు బలపడుతున్నాయి.

బ్రిక్స్ అనేది బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా దేశాల సమాఖ్య. ఈ దేశాలు ప్రపంచంలోనే అతిపెద్ద జనాభా, వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలకు ప్రతినిధులుగా ఉన్నాయి. బ్రిక్స్ దేశాల మధ్య వాణిజ్యం ఏటా పెరుగుతూ వస్తోంది. అంతేకాదు, అమెరికా ఆర్థిక ఒత్తిడిని తప్పించుకోవాలనే ఆకాంక్ష కూడా ఈ దేశాల్లో బలంగా ఉంది. అందుకే పరస్పర లావాదేవీల కోసం డాలర్‌కు ప్రత్యామ్నాయ మార్గాలపై వారు దృష్టి పెట్టారు.

Also Read: Vietnam VS India Currency: ఈ దేశంలో ఇండియన్ రూపీ డామినేషన్.. అక్కడకు లక్ష రూపాయలు తీసుకెళ్తే జాక్ పాట్ కొట్టినట్టే..!!

బ్రిక్స్ దేశాలకు ఉమ్మడి కరెన్సీ అనే ఆలోచన కొత్తది కాదు. గత కొన్ని సంవత్సరాలుగా ఈ అంశంపై అంతర్గతంగా చర్చలు జరుగుతున్నాయి. ప్రధానంగా డాలర్, యూరో వంటి పాశ్చాత్య కరెన్సీలపై ఆధారపడటాన్ని తగ్గించడమే లక్ష్యంగా ఈ ప్రయత్నాలు సాగుతున్నాయి. ఒక దేశం అమెరికా విధించే ఆంక్షల వల్ల ఆర్థికంగా దెబ్బతింటే, దాని ప్రభావం మొత్తం వ్యవస్థపై పడుతుంది. అలాంటి పరిస్థితులను నివారించేందుకు బ్రిక్స్ దేశాలు స్వంత చెల్లింపు వ్యవస్థ లేదా ఉమ్మడి కరెన్సీ గురించి ఆలోచిస్తున్నాయి.

బ్రిక్స్ కరెన్సీ అమలులోకి వస్తే కొన్ని స్పష్టమైన ప్రయోజనాలు ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు. సరిహద్దులు దాటే వాణిజ్య లావాదేవీలు సులభంగా, తక్కువ ఖర్చుతో జరిగే అవకాశం ఉంటుంది. డిజిటల్ సాంకేతికత, బ్లాక్‌చెయిన్ వంటి ఆధునిక విధానాలను వినియోగిస్తే చెల్లింపులు వేగంగా పూర్తవుతాయి. ఇది బ్రిక్స్ దేశాల మధ్య వాణిజ్యాన్ని మరింత ప్రోత్సహించడమే కాకుండా, వారి విదేశీ మారక నిల్వలపై ఉన్న ఒత్తిడిని కూడా తగ్గించగలదు. అంతేకాదు, అభివృద్ధి చెందుతున్న చిన్న దేశాలకు కూడా డాలర్‌కు ప్రత్యామ్నాయంగా ఒక కొత్త అవకాశం లభించవచ్చు.

అయితే బ్రిక్స్ కరెన్సీ ప్రవేశంతో డాలర్ వెంటనే బలహీనపడిపోతుందని భావించడం సరైంది కాదని ఆర్థిక నిపుణులు అంటున్నారు. డాలర్ బలం దాని విస్తృత వినియోగం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న విశ్వాసం, అమెరికా ఆర్థిక వ్యవస్థతో ఉన్న గాఢమైన అనుబంధం మీద ఆధారపడి ఉంది. కానీ బ్రిక్స్ దేశాలు క్రమంగా తమ వాణిజ్యంలో కొత్త కరెన్సీలను ఉపయోగించడం ప్రారంభిస్తే, దీర్ఘకాలంలో డాలర్ ఆధిపత్యం తగ్గే అవకాశాన్ని పూర్తిగా కొట్టిపారేయలేము. అయితే ఈ మార్పు ఒక్కసారిగా కాకుండా నెమ్మదిగా, దశలవారీగా జరిగే ప్రక్రియగానే ఉంటుంది.

Also Read:  Union Budget 2026:బడ్జెట్‌లో రియల్ ఎస్టేట్ రంగానికి GST ఉపశమనం లభిస్తుందా? డెవలపర్లు, గృహ కొనుగోలుదారుల డిమాండ్లు ఇవే..!!

ఈ పరిణామాలను అమెరికా కూడా జాగ్రత్తగా గమనిస్తోంది. ఎక్కువ దేశాలు డాలర్ వినియోగాన్ని తగ్గిస్తే, అమెరికా ఆర్థిక మరియు రాజకీయ ప్రభావం దెబ్బతినే అవకాశం ఉందనే ఆందోళన అక్కడ నెలకొంది. అందుకే బ్రిక్స్ వంటి ప్రత్యామ్నాయ ప్రయత్నాలను అమెరికా అనుమానంతో చూస్తోంది. డాలర్‌పై డిమాండ్ తగ్గితే, అమెరికా తన ఆర్థిక నిర్ణయాల్లో మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన పరిస్థితి కూడా తలెత్తవచ్చు. అందుకే బ్రిక్స్ కరెన్సీపై జరుగుతున్న చర్చలు కేవలం ఆర్థిక అంశంగా మాత్రమే కాకుండా, భవిష్యత్ ప్రపంచ శక్తి సమీకరణాలను ప్రభావితం చేసే అంశంగా మారుతున్నాయి.

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
RKRavi Kumar Sargam
Jan 18, 2026 15:04:25
Hyderabad, Telangana:

KTR Condemns Revanth Reddy: శాంతిభద్రతలను కాపాడాల్సిన రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి, అసాంఘిక చర్యలను, నేరాలను ప్రోత్సహించేలా రేవంత్ రెడ్డి మాట్లాడటం కనీసం సిగ్గుచేటు బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ అని ప్రకటించారు. రేవంత్ రెడ్డికి పూర్తిగా మతిభ్రమించిందని ఇవాల్టి సభ సాక్షిగా తేలిపోయిందని తెలిపారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా తెలుగుదేశం పార్టీ పాట పాడడం వెనుక ఉన్న అసలు కుట్ర ఇవాళ తెలంగాణ సమాజానికి అర్థమైందని చెప్పారు.

Also Read: Tomorrow Holiday: రేపు అన్నీ స్కూళ్లకు సెలవు.. బ్యాంకులకు కూడా! ఎందుకో తెలుసా?

బీఆర్ఎస్ జెండా గద్దెలను ధ్వంసం చేయాలని ఖమ్మం సభలో రేవంత్ రెడ్డి పిలుపునివ్వడాన్ని బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నువ్వు ముఖ్యమంత్రివా లేక ముఠా నాయకుడివా? అని రేవంత్‌ రెడ్డిని ప్రశ్నించారు. ముఖ్యమంత్రిగానే కాకుండా హోంమంత్రి బాధ్యతలు కూడా నిర్వహిస్తున్న రేవంత్ రెడ్డి కనీస సోయి లేకుండా బీఆర్ఎస్ పార్టీ జెండా గద్దెలను ధ్వంసం చేయాలని పిలుపునివ్వడాన్ని కేటీఆర్ తప్పుబట్టారు. పదేళ్ల కాలంలో శాంతిభద్రతల నిర్వహణలో దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణలో నేడు అరాచక పర్వానికి ద్వారాలు తెరిచే వారు అధికారంలో ఉండడం రాష్ట్రానికి పట్టిన దరిద్రమని కేటీఆర్‌ దుయ్యబట్టారు.

Also Read: Women Dress: మహిళలు ఏం ధరించాలి? సనాతన ధర్మం చెబుతోంది తెలుసా?

తెలంగాణ ప్రజల గుండెల్లో గులాబీ జెండాపై ఉన్న చెక్కుచెదరని అభిమానాన్ని చూసి రేవంత్‌ రెడ్డికి మైండ్ బ్లాక్ అయ్యిందని మాజీ మంత్రి కేటీఆర్‌ ప్రకటించారు. అందులో భాగంగానే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని తెలిపారు. రెండేళ్ల కాలంలోనే అట్టర్ ఫ్లాప్ పాలనతో ప్రజల్లో వ్యతిరేకతను మూటగట్టుకున్న రేవంత్ రెడ్డికి పూర్తిగా మతిభ్రమించిందని ఇవాల్టి సభ సాక్షిగా తేలిపోయిందని ప్రకటించారు. సోషల్ మీడియాలో చిన్న పోస్టు పెడితేనే చురుగ్గా స్పందించి అరెస్టులు చేసే పోలీసు శాఖ, డీజీపీ రేవంత్‌ రెడ్డి చేసిన ఈ తీవ్రమైన, హింసను ప్రేరేపించే వ్యాఖ్యలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి కేటీఆర్‌ డిమాండ్ చేశారు.

Also Read: Shashtipoorthi: షష్టిపూర్తి ఎందుకు చేస్తారు? 60 ఏళ్లకు ఎందుకు చేయాలో హిందూ శాస్త్రం ఏం చెబుతోంది?

కాంగ్రెస్ ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా తెలుగుదేశం పార్టీ పాట పాడటం వెనుక ఉన్న అసలు కుట్ర ఇవాళ తెలంగాణ సమాజానికి అర్థమైందని మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. రెండేళ్లుగా తన పాత బాసు ఆదేశాల మేరకు తెలంగాణకు తీరని నష్టం చేసేలా జలహక్కులను రేవంత్ రెడ్డి కాలరాశారని గుర్తుచేశారు. నేడు ఆయన చేసిన ప్రకటనతో నిజస్వరూపం బట్టబయలైందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఒక మునిగిపోయే నావ అని అర్థం కావడంతోనే రేవంత్ రెడ్డి ఏ క్షణమైనా దాని నుంచి బయటకు దూకేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని మాజీ మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు.

బీఆర్ఎస్ పార్టీని రాజకీయంగా ఎదుర్కోలేక ఒకవైపు బీజేపీతో చీకటి ఒప్పందాలు చేసుకుంటూ.. మరోవైపు తెలంగాణ ప్రజలు తిరస్కరించిన టీడీపిని తిరిగి ఈ గడ్డపైకి తెచ్చేందుకు రేవంత్ రెడ్డి పన్నాగం పన్నుతున్నారని మాజీ మంత్రి కేటీఆర్‌ సంచలన ప్రకటన చేశారు. దీనిని 4 కోట్ల తెలంగాణ సమాజం తప్పకుండా తిప్పికొడుతుందని కేటీఆర్ తెలిపారు. నీళ్ల నుంచి మొదలుకొని నిధులు, నియామకాల వరకూ తెలంగాణ ప్రయోజనాలను పాతాళంలోకి నెట్టిన కోవర్టు రాజకీయాలకు, రాష్ట్రానికి చేసిన ద్రోహానికి రేవంత్ రెడ్డి భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
DDDharmaraju Dhurishetty
Jan 18, 2026 14:30:53
Hyderabad, Telangana:

Horoscope 2026 Telugu: ఒక గ్రహం నక్షత్రం సంచారం చేసినప్పుడు దాని కారణంగా ఏర్పడే ప్రభావం అనేక రాశుల వారి జీవితాల్లో కీలకమైన మార్పులు తీసుకువస్తుంది. ముఖ్యంగా ఇది వ్యక్తి జీవితంపై ప్రత్యక్షంగాను పరోక్షంగాను పడుతుంది. కాబట్టి నక్షత్ర సంచారం కూడా చాలా కీలకమైందిగా భావిస్తారు. ముఖ్యంగా కొన్ని గ్రహాలు సంచారం చేస్తే వ్యక్తిగత జీవితంలో పనుల్లో మార్పులు రావడమే కాకుండా ఆర్థిక సంబంధాల్లో కూడా అనేక మార్పులు సంభవిస్తూ ఉంటాయి. 2026 జనవరి చివరి మూడు రోజులపాటు అరుదైన యాదృచ్ఛికలో ఏర్పడిపోతున్నాయి. 

ప్రధాన గ్రహాలైన కుజుడు, బృహస్పతి, బుధుడు, శుక్రుడు ఒకదాని తర్వాత ఒకటి రాశులు సంచారం చేయబోతున్నాయి. దీని ప్రభావం జనవరి 29 నుంచి 31వ తేదీ మధ్యలో అన్ని రాశుల వారిపై పడుతుంది. ముఖ్యంగా ఈ సమయంలో కుజుడు ఉత్తరాషాడ నక్షత్రం నుంచి శ్రవణా నక్షత్రంలోకి సంచారం చేస్తాడు. అలాగే జనవరి 30వ తేదీన బృహస్పతి పునర్వాసు నక్షత్రం లో ఒక దశ నుంచి మరొక దశకు మారబోతోంది. జనవరి 31వ తేదీన బుధుడు శుక్రుడు ఒకే రోజు ధనిష్ట నక్షత్రంలోకి ప్రవేశిస్తాయి. దీని కారణంగా ఈ సమయం ఎంతో కీలకంగా మారబోతోంది. 

 వృషభ రాశి 
వృషభ రాశిలో జన్మించిన వ్యక్తులకు ఈ మూడు రోజులు ఎంతో ప్రయోజనకరంగా ఉండబోతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా ఆర్థిక విషయాల నుంచి ఉపశమనం తులబంగా లభించబోతోంది. ఉద్యోగాలతో పాటు వ్యాపారాలు చేస్తున్న వ్యక్తులకు ఈ సమయం చాలా లాభదాయకంగా ఉంటుంది. అలాగే కష్టపడి పనిచేయడం వల్ల సానుకూలమైన ఫలితాలు కూడా పొందుతారు. కుటుంబ జీవితంలో ప్రేమ సంబందాలు మరింత మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో పిల్లల ఆరోగ్యంతో పాటు మీ ఆరోగ్యం కూడా చాలావరకు మెరుగుపడుతుంది.

మిధున రాశి 
మిథున రాశిలో జన్మించిన వ్యక్తులకు కూడా ఈ సమయంలో అద్భుతమైన పురోగతి లభించబోతోంది. కెరీర్ పరంగా విశేషమైన ప్రయోజనాలు కలిగే అవకాశాలున్నాయి. అలాగే ఆకస్మిక ఆర్థిక లాభాలు కూడా కలగవచ్చని జ్యోతిష్యులు చెబుతున్నారు. అలాగే ఈ సమయంలో పెండింగ్లో ఉన్న పనులు కూడా పూర్తవుతాయి. ముఖ్యంగా ఆర్థిక సంబంధాలు మెరుగుపడే అవకాశాలు కూడా ఉన్నాయి. శక్తి స్థాయిలు కూడా విపరీతంగా పెరిగి అనేక రకాల పనులు చేయగలుగుతాయి.

Also Read: Rahu Transit 2026: యవ్వన దశలో రాహువు.. ఈ రాశుల వారికి గోల్డెన్ జాక్‌పాట్.. ఏప్రిల్ నెల వరకు ఊహించని డబ్బు!

కర్కాటక రాశి 
కర్కాటక రాశి వారికి ఆత్మవిశ్వాసం కూడా అనుకున్నంత స్థాయిలో పెరుగుతుంది. వీరికి ఆర్థిక పరిస్థితులు అనుకున్న దానికంటే ఎక్కువగా మెరుగుపడతాయి. ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణ నెలకొంటుంది. పనుల్లో కొత్త బాధ్యతలు కూడా పెరుగుతాయి. మానసిక భక్తుడు కూడా విపరీతంగా తగ్గి.. అనుకోని లాభాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలాగే అనుకున్న పనుల్లో విజయాలు కూడా సాధించగలుగుతారు.

సింహరాశి 
సింహరాశి వారికి ఈ సమయంలో గౌరవం ఊహించని స్థాయిలో పెరుగుతుంది. పురోగతి కూడా ఎంతో లభిస్తుంది. ముఖ్యంగా విద్యాబుద్ధులు విపరీతంగా పెరగడమే కాకుండా.. ఈ సమయంలో జ్ఞానంతో పని చేయగలుగుతారు.. అలాగే కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులతో చాలా బాగుంటారు. ముఖ్యంగా కొత్త ఆదాయ వనరులు కూడా లభిస్తాయి. అలాగే అనుకున్న పనుల్లో ఎన్నో రకాల ప్రయోజనాలు పొందుతారు. దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ సమయంలో ఉపశమనం కలుగుతుంది.

Also Read: Rahu Transit 2026: యవ్వన దశలో రాహువు.. ఈ రాశుల వారికి గోల్డెన్ జాక్‌పాట్.. ఏప్రిల్ నెల వరకు ఊహించని డబ్బు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

0
comment0
Report
HDHarish Darla
Jan 18, 2026 13:59:45
New Delhi, Delhi:

Whatsapp Admissible In Court: నేటి డిజిటల్ కాలంలో వాట్సాప్ సందేశాలు మన దైనందిన జీవితంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. మరి గొడవలు, మోసాలు లేదా కోర్టు కేసుల విషయానికి వస్తే, ఈ వాట్సాప్ స్క్రీన్‌షాట్‌లకు చట్టబద్ధత ఎంత? కోర్టు వీటిని సాక్ష్యంగా అంగీకరిస్తుందా? అనే విషయాలను చట్టపరమైన కోణంలో ఇప్పుడు విశ్లేషిద్దాం.

చాలామంది వాట్సాప్ చాట్‌లను కేవలం స్క్రీన్‌షాట్ తీసి ప్రింట్ ఇస్తే సాక్ష్యంగా సరిపోతుందని భావిస్తారు. కానీ, భారతీయ సాక్ష్యాధారాల చట్టం ప్రకారం ఇది అంత సులభం కాదు.

చట్టం ఏం చెబుతోంది?
డిజిటల్ సాక్ష్యాలకు సంబంధించి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ (Indian Evidence Act) లోని సెక్షన్ 65B అత్యంత కీలకమైనది. వాట్సాప్ స్క్రీన్‌షాట్‌లు, ఇమెయిల్‌లు, ఆడియో లేదా వీడియో క్లిప్‌లను 'ఎలక్ట్రానిక్ రికార్డ్స్'గా పరిగణిస్తారు. వీటిని కోర్టులో సాక్ష్యంగా సమర్పించాలంటే 65B సర్టిఫికేట్ తప్పనిసరి.

ఏమిటీ 65B సర్టిఫికేట్?
ఇది మీరు సమర్పించే డిజిటల్ సాక్ష్యం అసలైనదని ధృవీకరించే ఒక పత్రం. ఇందులో ప్రధానంగా ఈ కింది అంశాలను ధృవీకరించాల్సి ఉంటుంది.

1) స్క్రీన్‌షాట్ తీసిన మొబైల్ సక్రమంగా పనిచేస్తోంది.

2) మెసేజ్‌లు ఎడిట్ చేయడం లేదా ట్యాంపరింగ్ చేయడం జరగలేదు.

3) సదరు వ్యక్తికి ఆ డివైజ్‌పై పూర్తి నియంత్రణ ఉందనే ధ్రువీకరణ పత్రాలు ఉండాలి

ఈ సర్టిఫికేట్ లేకుండా మీరు ఎన్ని స్క్రీన్‌షాట్‌లు సమర్పించినా కోర్టు వాటిని ప్రాథమిక సాక్ష్యంగా అంగీకరించదు.

కోర్టులో సాక్ష్యం నిలబడాలంటే ఈ నియమాలు పాటించాలి
సందర్భోచితంగా ఉండాలి: కేవలం ఒక మెసేజ్ స్క్రీన్‌షాట్ మాత్రమే కాకుండా, పూర్తి సంభాషణ (Context) అర్థమయ్యేలా ఉండాలి. ఎంపిక చేసిన (Selective) స్క్రీన్‌షాట్‌లను కోర్టు తిరస్కరించే అవకాశం ఉంది.

ఫోన్ నంబర్ స్పష్టత: స్క్రీన్‌షాట్‌లో అవతలి వ్యక్తి ఫోన్ నంబర్ స్పష్టంగా కనిపించాలి. కేవలం పేరు ఉంటే సరిపోదు, ఎందుకంటే పేరును ఎలాగైనా సేవ్ చేసుకోవచ్చు.

ఫోరెన్సిక్ పరీక్ష: అవతలి పక్షం ఆ సాక్ష్యాన్ని సవాల్ చేస్తే, కోర్టు సదరు మొబైల్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపమని ఆదేశించవచ్చు.

మెటాడేటా: సందేశం పంపిన సమయం, తేదీ వంటి వివరాలు (Metadata) సరిపోలాలి.

ఏయే కేసుల్లో ఉపయోగపడుతుంది?
గృహ హింస, విడాకుల కేసులు... బ్లాక్‌మెయిల్ లేదా బెదిరింపులకు సంబంధించిన నేరాలు.. ఆర్థిక మోసాలు, వ్యాపార ఒప్పందాల వివాదాలు.. కార్యాలయాల్లో వేధింపులు (Workplace Harassment) వంటి వాటి కోసం ఈ సాక్ష్యాలు సందర్భాన్ని బట్టి పనిచేయవచ్చు.

వాట్సాప్ స్క్రీన్‌షాట్ కోర్టులో సాక్ష్యంగా చెల్లుతుంది, కానీ దానికి సెక్షన్ 65B సర్టిఫికేట్ తోడవ్వాలి. స్క్రీన్‌షాట్‌ను ఎడిట్ చేయడం లేదా ఫార్వార్డ్ చేసిన మెసేజ్‌లను సాక్ష్యంగా చూపడం వల్ల ప్రయోజనం ఉండదు. న్యాయపరమైన చిక్కులు ఎదురైనప్పుడు అనుభవజ్ఞుడైన న్యాయవాదిని సంప్రదించి, డిజిటల్ సాక్ష్యాలను సరిగ్గా సిద్ధం చేసుకోవడం ముఖ్యం.

(గమనిక: ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. చట్టపరమైన సమస్యల కోసం నిపుణులైన లాయర్లను సంప్రదించండి. పైన పేర్కొన్న సమాచారాన్ని జీ తెలుగు న్యూస్ ధ్రువీకరించడం లేదు.)

Also Read: Dmart Business Model: డీమార్ట్‌ ఆఫర్ల వెనుక ఎవ్వరికీ తెలియని సీక్రెట్స్..తక్కువ ధరకే సరుకులు అమ్మడానికి కారణం ఇదే!

Also REad: Rashmi Sudheer Clashes: సుడిగాలి సుధీర్‌తో యాంకర్ రష్మికి గొడవ? ఇద్దరూ శాశ్వతంగా దూరమైనట్లేనా? రష్మీ ఏం చెబుతుందంటే?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

91
comment0
Report
RKRavi Kumar Sargam
Jan 18, 2026 12:26:38
Dhamsalapuram, Telangana:

CPI Centenary Meeting: 'బీజేపీ అంటే బ్రిటిష్ జనతా పార్టీ. కాంగ్రెస్, కమ్యూనిస్టులు కలిసి ఉపాధి హామీ పథకం తెస్తే బీజేపీ ప్రభుత్వం దానిని రద్దు చేసింది. ఉపాధి హామీ రద్దుతో అగ్గువకో సగ్గువకో అదానీ అంబానీలకు కూలీలు దొరికే పరిస్థితి. బ్రిటీషర్లకు వ్యతిరేకంగా నాడు పోరాటం చేశాం. పేదల హక్కులు కొల్లగొట్టడానికి, రాజ్యాంగం మార్చడానికి 400 సీట్లు ఇవ్వాలని బీజేపీ నాయకులు కోరారు. రాజ్యాంగాన్ని చెర పట్టడానికి బీజేపీ ప్రయత్నిస్తోంది' అని రేవంత్‌ రెడ్డి ఆరోపించారు.

Also Read: Lakshmi Parvathi: చంద్రబాబు లోకేశ్‌పై ఎన్టీఆర్‌ భార్య లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు

ఖమ్మంలో జరుగుతున్న సీపీఐ శతాబ్ది ఉత్సవాల ముగింపు సభలో రేవంత్‌ రెడ్డి కీలక ప్రసంగం చేశారు. పేదల హక్కుల పోరాటాల్లో ప్రాణాలు కోల్పోతామే కానీ ఎర్ర జెండా వదలమని ప్రకటించిన కామ్రేడ్లకు రేవంత్‌ రెడ్డి వందనం చేశారు. రైతులు, రైతు కూలీలు, హరిజనులు, గిరిజనులు కోసం కమ్యూనిస్టులు పోరాడారని.. దున్నే వాడిదే భూమి అని కమ్యూనిస్టులు పిలుపునిస్తే దానిని అమల్లోకి తెచ్చింది ఇందిరాగాంధీ, పీవీ నరసింహారావు, బూర్గుల రామకృష్ణారావు అని గుర్తుచేశారు.

Also Read: Shashtipoorthi: షష్టిపూర్తి ఎందుకు చేస్తారు? 60 ఏళ్లకు ఎందుకు చేయాలో హిందూ శాస్త్రం ఏం చెబుతోంది?

'రైతులు ధర నిర్ణయించలేనప్పుడు కనీస మద్దతు ధర కోసం కమ్యూనిస్టులు పోరాడారు. 4 వేల అమరవీరుల త్యాగాలతో హైదరాబాద్ రాష్ట్రం నిజాం నుంచి విముక్తి అయింది. పుచ్చలపల్లి సుందరయ్య, చండ్ర రాజేశ్వరరావు, నల్లమల గిరిప్రసాద్, శేషగిరి రావు వంటి వారెందరో నాడు పోరాడారు' అని రేవంత్‌ రెడ్డి వివరించారు. 'పేదల ఓటు హక్కు రద్దు చేసేందుకు సర్‌ తీసుకువచ్చారు. రాజ్యాంగ సభ సమయంలోనూ గోల్వాల్కర్ వారసులు పేదలకు ఓటు హక్కు లేకుండా చేసేందుకు ప్రయత్నించారు' అని మోదీ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read: Women Dress: మహిళలు ఏం ధరించాలి? సనాతన ధర్మం చెబుతోంది తెలుసా?

'మూల వాసులు ఎక్కడ నుంచి ఆధారాలు తెస్తారు. ఓటు హక్కు లేకపోతే రేషన్ కార్డు, ఇల్లు, పింఛన్ పోతుంది. కాంగ్రెస్, కమ్యూనిస్ట్ తేడా లేకుండా మోదీకి వ్యతిరేకంగా దండు కట్టాలి' అని రేవంత్‌ రెడ్డి పిలుపునిచ్చారు. కమ్యూనిస్టులు పేదల కోసం కొట్లాడతారని.. నేటి ఈ ప్రభుత్వంలో మీ శ్రమ ఉందని చెప్పారు. 'నరేంద్ర మోదీ, అమిత్ షా కలిసి వచ్చినా బీజేపీ ఒక్క సీటు లేదు. తులసీ వనంలో గంజాయి మొక్కకు చోటు లేదు. ఖమ్మం జిల్లాలో బీజేపీకి చోటు లేదు. ఖమ్మం జిల్లాలో బీజేపీకి సర్పంచులు కూడా లేరు' అని రేవంత్ రెడ్డి తెలిపారు. సీపీఐ శతాబ్ది ఉత్సవాల ముగింపు కార్యక్రమం ఖమ్మంలో సంబరంగా ప్రారంభమైంది. మరో రెండు రోజుల పాటు ఈ శతాబ్ది ఉత్సవాలు జరుగుతున్నాయి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
RKRavi Kumar Sargam
Jan 18, 2026 12:00:49
Hyderabad, Telangana:

Nandamuri Lakshmi Parvathi: ఎన్టీఆర్ అభిమానులు చంద్ర‌బాబు మోసాల‌ను గ్ర‌హించాలని ఎన్టీఆర్‌ సతీమణి లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్టీఆర్ విగ్ర‌హం పేరుతో చంద్ర‌బాబు డైవ‌ర్ష‌న్ పాలిటిక్స్ చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే గ‌తంలోనే నీరుకొండ‌పై విగ్ర‌హం పెట్టేవాడని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నంద‌మూరి ల‌క్ష్మీ పార్వ‌తి పేర్కొన్నారు. త‌న‌ప్ర‌తిష్ట దిగజారుతున్న‌ప్పుడ‌ల్లా ఎన్టీఆర్ పేరుతో రాజకీయం చేయడం చంద్ర‌బాబుకి అలవాటేన‌ని, ఎన్టీఆర్ విగ్ర‌హం పేరుతో ఆయ‌న చేస్తున్న హ‌డావుడి కూడా అలాంటిదేన‌ని ప్రకటించారు.

Also Read: Shashtipoorthi: షష్టిపూర్తి ఎందుకు చేస్తారు? 60 ఏళ్లకు ఎందుకు చేయాలో హిందూ శాస్త్రం ఏం చెబుతోంది?

ఎన్టీఆర్‌ వర్ధంతి సందర్భంగా హైద‌రాబాద్‌లోని త‌న నివాసంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నంద‌మూరి ల‌క్ష్మీపార్వ‌తి కీలక ప్రెస్‌మీట్‌ నిర్వహించారు. చంద్ర‌బాబుకి చేతనైతే మెడిక‌ల్ కాలేజీలు నిర్మించాలని.. ప్రధాని మోదీతో మాట్లాడి ఎన్టీఆర్‌కి భార‌త‌ర‌త్న ఇప్పించాలని డిమాండ్‌ చేశారు. చంద్ర‌బాబు, లోకేష్ దుర్మార్గాల‌పై బీజేపీ నాయ‌కులు స్పందించాలని విజ్ఞప్తి చేశారు. 2014లోనే నీరుకొండ‌పై ఎన్టీఆర్ విగ్ర‌హం పెడ‌తాన‌ని చెప్పి ప‌క్క‌న భూములు కాజేశాడ‌ని, చిత్త‌శుద్ధి ఉంటే ఐదేళ్ల‌లో విగ్ర‌హం నిర్మాణం పూర్తి చేయ‌లేడా అని ల‌క్ష్మీపార్వ‌తి ప్ర‌శ్నించారు. ఎన్టీఆర్ అభిమానులు ఇప్ప‌టికైనా చంద్ర‌బాబు మోసాల‌ను గుర్తించాల‌ని విజ్ఙ‌ప్తి చేశారు.

Also Read: Women Dress: మహిళలు ఏం ధరించాలి? సనాతన ధర్మం చెబుతోంది తెలుసా?

చేత‌నైతే మోడీతో మాట్లాడి చంద్ర‌బాబు ఎన్టీఆర్‌కి భార‌త‌ర‌త్న ఇప్పించాల‌ని, వైద్య కళాశాలల ప్రైవేటీక‌ర‌ణ నిర్ణ‌యాన్ని వెనక్కి తీసుకుని పెండింగ్ ప‌నులు పూర్తి చేయాల‌ని ల‌క్ష్మీపార్వ‌తి డిమాండ్ చేశారు.   చంద్ర‌బాబు, లోకేష్ దోపిడీలు, అరాచ‌కాల‌పై తాను కూడా ప్ర‌ధాని మోడీకి లేఖ రాస్తాన‌ని చెప్పారు. జూదాలు, కోడి పందేలు, కేసినోలు, అర్థ‌న‌గ్న నృత్యాల‌తో రాష్ట్ర ప్ర‌తిష్ట‌ను చంద్ర‌బాబు న‌డి బ‌జారున నిల‌బెట్టాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాపం పండిన రోజు చంద్ర‌బాబు సంపాదించిన ల‌క్ష‌ల కోట్ల అక్ర‌మ సంపాద‌న కూడా ఆయ‌న్ను కాపాడ‌లేదని, నారా లోకేష్ అమ‌లు చేస్తున్న రెడ్ బుక్ రాజ్యాంగం ఆయ‌న కాళ్ల‌కే చుట్టుకుని ఆయ‌న్ను జైలుపాలు చేయ‌డం ఖాయమ‌ని ల‌క్ష్మీపార్వ‌తి ప్రకటించారు.

జ‌యంతి, వ‌ర్ధంతి వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా ఎన్టీఆర్ మీద చంద్ర‌బాబు ప్రేమ ఒల‌క‌బోస్తుంటాడని నందమూరి ల‌క్ష్మీపార్వ‌తి విమర్శించారు. గ‌తంలోనూ 2014 అధికారంలోకి వ‌చ్చిన‌ప్పుడు నీరుకొండ మీద ఎన్టీఆర్ విగ్ర‌హం పెడ‌తాన‌ని హ‌డావుడి చేసి చుట్టుప‌క్క‌ల భూములు కాజేశాడు. మ‌ళ్లీ ఇప్పుడు ఎన్టీఆర్ పేరుతో రాజ‌కీయాలు చేస్తున్నాడని.. ఎన్టీఆర్ ఆశ‌యాల‌ను కాపాడ‌తాన‌ని న‌క్క విన‌యాలు ప్ర‌ద‌ర్శిస్తున్నాడని మండిపడ్డారు. కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చి 20 నెల‌ల‌వుతున్నా ఎన్నిక‌ల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని అమ‌లు చేయ‌కుండా చంద్ర‌బాబు ప్ర‌జ‌ల‌కు వెన్నుపోటు పొడిచాడని ల‌క్ష్మీపార్వ‌తి ఆరోపించారు. 

మోస‌పు హామీల‌తో రైతులు, విద్యార్థులు, యువ‌త‌, ఉద్యోగులు, నిరుద్యోగులు, మ‌హిళ‌లు.. ఇలా అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌ను చంద్ర‌బాబు దారుణంగా మోసం చేశాడని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నంద‌మూరి ల‌క్ష్మీపార్వ‌తి తెలిపారు. మోస‌పు హామీల‌తో అధికారంలోకి రావ‌డం వ‌చ్చాక ప్ర‌జ‌ల‌కు వెన్నుపోటు పొడిచి రాష్ట్రాన్ని దోచుకోవ‌డమే చంద్ర‌బాబు విధానం అని విమర్శించారు. మళ్లీ జగన్‌ ప్రభుత్వం రాగానే తండ్రీకొడుకుల అరాచాక‌ల‌పై త‌క్ష‌ణ విచార‌ణ జ‌రిపి చ‌ట్ట‌ప‌రంగా వారిని శిక్షించ‌కుండా వ‌దిలిపెట్టమని లక్ష్మీ పార్వతి హెచ్చరించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

.Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

0
comment0
Report
HDHarish Darla
Jan 18, 2026 10:52:23
Dhaka, Dhaka Division:

Bangladesh Ireland T20 World Cup: టీ20 ప్రపంచకప్‌ 2026ను భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న వేళ, టోర్నీ ప్రారంభానికి ముందే ఆసక్తికరమైన సంఘటనలు జరుగుతున్నాయి. భారత్‌లో ఆడేందుకు బంగ్లాదేశ్ విముఖత చూపడం, దానికి ఐర్లాండ్ షాక్ ఇవ్వడం ఇప్పుడు క్రీడా వర్గాల్లో చర్చనీయాంశమైంది. బంగ్లాదేశ్‌లో ప్రస్తుత పరిస్థితులతో పాటు భారత్-బంగ్లా మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది.

భద్రతా కారణాలే సాకుగా..
ప్రస్తుత షెడ్యూల్ ప్రకారం.. గ్రూప్-సిలో ఉన్న బంగ్లాదేశ్ తన మ్యాచ్‌లను కోల్‌కతా, ముంబై వేదికలుగా ఆడాల్సి ఉంది. అయితే, భారత్‌లో తమకు భద్రతా సమస్యలు తలెత్తుతాయని బంగ్లా బోర్డు ఆందోళన వ్యక్తం చేస్తోంది.

ఐపీఎల్ జట్టు కేకేఆర్ నుంచి ముస్తాఫిజుర్ రెహ్మన్‌ను తప్పించడం కూడా రెండు బోర్డుల మధ్య దూరాన్ని పెంచిందని సమాచారం. భారత్ నుంచి తమ మ్యాచ్‌లను శ్రీలంకకు తరలించాలని లేదా తమ గ్రూప్‌ను మార్చాలని ఐసీసీని (ICC) బంగ్లాదేశ్ కోరింది.

ఐర్లాండ్‌తో 'గ్రూప్' గేమ్..
బంగ్లాదేశ్ ఒక వినూత్న ప్రతిపాదనను ఐసీసీ ముందు ఉంచింది. ఐర్లాండ్ ఉన్న గ్రూప్-బి లోని మ్యాచ్‌న్నీ శ్రీలంకలోనే జరగనున్నాయి. దీంతో, తమను గ్రూప్-బి కి మార్చి, ఐర్లాండ్‌ను గ్రూప్-సి కి పంపాలని బంగ్లాదేశ్ ప్రతిపాదించింది. తద్వారా తాము భారత్‌కు రాకుండా శ్రీలంకలోనే మ్యాచ్‌లు పూర్తి చేయవచ్చని వారి ప్లాన్.

బిగ్ ట్విస్ట్..
బంగ్లాదేశ్ చేసిన ఈ ప్రతిపాదనను ఐర్లాండ్ క్రికెట్ బోర్డు (CI) నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. తమ షెడ్యూల్‌లో ఎలాంటి మార్పులు ఉండబోవని ఐర్లాండ్ స్పష్టం చేసింది. గ్రూప్ దశలో తాము శ్రీలంకలోనే ఆడతామని ఇప్పటికే తమకు స్పష్టమైన హామీలు లభించాయని ఐర్లాండ్ అధికారులు వెల్లడించారు. బంగ్లాదేశ్ కోసం తమ గ్రూప్‌ను మార్చుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.

ప్రస్తుత గ్రూపుల పరిస్థితి..
గ్రూప్ B (శ్రీలంక వేదిక): ఐర్లాండ్, ఆస్ట్రేలియా, శ్రీలంక, జింబాబ్వే, ఒమన్.
గ్రూప్ C (భారత్ వేదిక): బంగ్లాదేశ్, వెస్టిండీస్, ఇటలీ, ఇంగ్లాండ్, నేపాల్.

ఐర్లాండ్ ససేమిరా అనడంతో ఇప్పుడు ఐసీసీ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. బంగ్లాదేశ్ భద్రతా కారణాలను ఐసీసీ పరిగణనలోకి తీసుకుంటుందా? లేక షెడ్యూల్ ప్రకారమే భారత్‌కు రావాలని ఆదేశిస్తుందా? అనేది చూడాలి.

Also Read: Dmart Business Model: డీమార్ట్‌ ఆఫర్ల వెనుక ఎవ్వరికీ తెలియని సీక్రెట్స్..తక్కువ ధరకే సరుకులు అమ్మడానికి కారణం ఇదే!

Also Read: Weight Loss Workout: 30 రోజుల్లో 10 కిలోల బరువు తగ్గడం ఎలా? పొట్ట, తొడల కొవ్వును కరగదీసే 5 అద్భుతమైన వ్యాయామాలు!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
HDHarish Darla
Jan 18, 2026 10:21:51
Hyderabad, Telangana:

Dmart Business Strategy: నిత్యావసర సరుకులు అనగానే సామాన్యుడికి గుర్తొచ్చే మొదటి పేరు డీమార్ట్ (DMart). ఎంఆర్‌పి (MRP) ధర కంటే తక్కువకే వస్తువులు విక్రయించడం డీమార్ట్ ప్రత్యేకత. అయితే, అందరూ ఎక్కువ ధరకు అమ్ముతుంటే డీమార్ట్ మాత్రం ఇంత తక్కువకు ఎలా ఇస్తోంది? దీని వెనుక ఉన్న బిజినెస్ సీక్రెట్స్ (Business Secrets) గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

డీమార్ట్ విజయం వెనుక ఎటువంటి మాయాజాలం లేదు, కేవలం పక్కా వ్యాపార ప్రణాళిక మాత్రమే ఉంది. ఇతర రిటైల్ సంస్థలకు, డీమార్ట్‌కు ఉన్న ప్రధాన వ్యత్యాసాలు ఇవే..

1. మధ్యవర్తులు లేని వ్యాపారం (Direct Sourcing)
సాధారణంగా వస్తువులు తయారీదారు నుండి డిస్ట్రిబ్యూటర్లకు, అక్కడి నుండి రిటైలర్లకు చేరుతాయి. కానీ డీమార్ట్ మధ్యలో ఎవరినీ ఉంచదు. నేరుగా కంపెనీల నుంచే భారీ మొత్తంలో (Bulk) సరుకులను కొనుగోలు చేస్తుంది. దీనివల్ల మధ్యవర్తులకు వెళ్లే కమీషన్ తగ్గుతుంది. ఆ ప్రయోజనాన్ని కస్టమర్లకు బదిలీ చేస్తుంది.

2. తక్షణ చెల్లింపులు (Quick Payments)
చాలా సూపర్ మార్కెట్లు వస్తువులను కొనుగోలు చేసిన తర్వాత కంపెనీలకు నెలల తరబడి బిల్లులు చెల్లించవు. కానీ డీమార్ట్ సరఫరాదారులకు (Suppliers) కేవలం కొద్ది రోజుల్లోనే బిల్లులు క్లియర్ చేస్తుంది. ఈ నమ్మకంతో కంపెనీలు డీమార్ట్‌కు 'క్యాష్ డిస్కౌంట్' కింద తక్కువ ధరకు సరుకులను అందిస్తాయి.

3. సొంత భవనాలు - అద్దె భారం లేదు
డీమార్ట్ అనుసరించే అతిపెద్ద వ్యూహం ఇదే. చాలా రిటైల్ సంస్థలు మాల్స్‌లో భారీ అద్దెలు చెల్లించి స్టోర్లు నడుపుతాయి. కానీ డీమార్ట్ తన స్టోర్ల కోసం స్థలాలను సొంతంగా కొనుగోలు చేస్తుంది లేదా శాశ్వత భవనాలను నిర్మిస్తుంది. దీని వెనుక ఉన్న లాభం ఏమిటంటే.. ప్రతి నెలా లక్షల రూపాయల అద్దె భారం తప్పుతుంది. ఈ ఆదా చేసిన మొత్తాన్నే కస్టమర్లకు డిస్కౌంట్ల రూపంలో ఇస్తుంది.

4. లో-కాస్ట్ ఇంటీరియర్ (Simple Setup)
డీమార్ట్‌లో మీరు గమనిస్తే ఆకర్షణీయమైన డెకరేషన్లు, ఖరీదైన లైటింగ్ ఉండవు. స్టోర్ సెటప్ చాలా సాదాసీదాగా ఉంటుంది. అనవసరపు ఖర్చులను తగ్గించుకుని, కేవలం వస్తువుల విక్రయంపైనే దృష్టి పెడుతుంది.

5. ఫాస్ట్ మూవింగ్ గూడ్స్ (FMCG Focus)
ప్రజలకు ప్రతిరోజూ అవసరమయ్యే నిత్యావసర వస్తువులనే డీమార్ట్ ఎక్కువగా విక్రయిస్తుంది. వీటిని ఎవరైనా సరే కొని తీరాల్సిందే. దీనివల్ల వస్తువులు స్టాక్ పేరుకుపోకుండా వేగంగా అమ్ముడవుతాయి. ఫలితంగా తక్కువ మార్జిన్ ఉన్నప్పటికీ లాభాలు ఎక్కువగా వస్తాయి.

చివరిగా ఒక్క మాటలో చెప్పాలంటే.. "తక్కువ లాభం - ఎక్కువ అమ్మకాలు" అనే సూత్రంపై డీమార్ట్ నడుస్తోంది. ఒక్కో వస్తువుపై తక్కువ లాభం తీసుకున్నా, వేల సంఖ్యలో కస్టమర్లు రావడం వల్ల డీమార్ట్ దేశంలోనే అత్యంత విజయవంతమైన రిటైల్ బ్రాండ్‌గా నిలిచింది.

Also Read: Weight Loss Workout: 30 రోజుల్లో 10 కిలోల బరువు తగ్గడం ఎలా? పొట్ట, తొడల కొవ్వును కరగదీసే 5 అద్భుతమైన వ్యాయామాలు!

Also Read: Rashmi Sudheer Clashes: సుడిగాలి సుధీర్‌తో యాంకర్ రష్మికి గొడవ? ఇద్దరూ శాశ్వతంగా దూరమైనట్లేనా? రష్మీ ఏం చెబుతుందంటే?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
HDHarish Darla
Jan 18, 2026 09:43:06
Hyderabad, Telangana:

Weight Loss Exercises Plan: బరువు తగ్గడం అనేది కేవలం సౌందర్యానికి సంబంధించింది మాత్రమే కాదు, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కూడా చాలా ముఖ్యం. ముఖ్యంగా మహిళల్లో వచ్చే హార్మోన్ల అసమతుల్యత, పీరియడ్స్ సమస్యలను నివారించడంలో ఈ వ్యాయామాలు ఎంతో తోడ్పడతాయి.

1. జంపింగ్ జాక్స్ (Jumping Jacks)
ఇది పూర్తి శరీరానికి మంచి కదలికను ఇస్తుంది. అందుకు కోసం నిటారుగా నిలబడి గాలిలోకి ఎగురుతూ కాళ్లను పక్కకు జరపాలి, అదే సమయంలో చేతులను పైకి ఎత్తి చప్పట్లు కొట్టినట్లుగా చేయాలి. ఇలా చేయడం వల్ల బొడ్డు దగ్గర తొడల దగ్గర పేరుకుపోయిన మొండి కొవ్వును కరిగించడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది.

2. ఫ్రంట్ హ్యాండ్ జంప్స్ (Front Hand Jumps)
నిలబడి రెండు చేతులను నేరుగా ముందుకు చాచాలి. చిన్నగా దూకుతూ చేతులను పైకి, కిందకు ఆడిస్తూ ఉండాలి. ఇలా రోజుకు 30 నుండి 60 సార్లు చేయడం వల్ల చేతులు, భుజాల దగ్గర కొవ్వు తగ్గడమే కాకుండా మొత్తం శరీర బరువు అదుపులోకి వస్తుంది.

3. మౌంటైన్ క్లైంబర్స్ (Mountain Climbers)
నేలపై బోర్లా పడుకుని పుష్-అప్ భంగిమలోకి రావాలి. చేతులపై బ్యాలెన్స్ చేస్తూ, పరిగెడుతున్నట్లుగా ఒక్కో కాలును ఛాతీ వరకు వేగంగా మడిచి మళ్ళీ వెనక్కి చాచాలి. అలా చేయడం వల్ల పొట్ట కండరాలను దృఢంగా మార్చి, నడుము చుట్టుకొలతను తగ్గిస్తుంది.

4. సైడ్ స్ట్రెచెస్ (Side Stretches)
ఈ వ్యాయామం చేయాలంటే కాళ్లను కొద్దిగా దూరం జరిపి నిలబడాలి. కుడి చేతితో కుడి కాలు పాదాన్ని తాకడానికి ప్రయత్నిస్తూ నడుమును వంచాలి. అదే సమయంలో ఎడమ చేతిని నిటారుగా పైకి ఎత్తాలి. ఇలా రెండు వైపులా మార్చి మార్చి చేయాలి. అలా చేయడం వల్ల సైడ్ ఫ్యాట్ (నడుము పక్కల ఉండే కొవ్వు) కరగడానికి ఇది ఉత్తమ వ్యాయామం.

5. నీ-టు-ఎల్బో జంప్స్ (Knee-to-Elbow Jumps)
ఇది చేసే విధానం.. చేతులను తల వెనుక లేదా చెవుల దగ్గర ఉంచుకోవాలి. గాలిలోకి ఎగురుతూ కుడి మోకాలిని ఎడమ మోచేతికి తాకించడానికి ప్రయత్నించాలి. ఇలా రెండు కాళ్లతో మార్చి మార్చి చేయాలి. ఇది గుండె స్పందన రేటును పెంచి (Cardio), శరీరంలోని క్యాలరీలను వేగంగా ఖర్చు చేస్తుంది.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
క్రమం తప్పకుండా: ఈ వ్యాయామాలను ప్రతిరోజూ 30 నుండి 60 సార్లు (సెట్ల రూపంలో) పునరావృతం చేయాలి.

నీరు: వ్యాయామం చేసే సమయంలో శరీరం డీహైడ్రేషన్ అవ్వకుండా తగినంత నీరు తాగుతూ ఉండాలి.

ఆహారం: నూనె పదార్థాలు, చక్కెర తగ్గించి ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి.

(గమనిక: ఈ సమాచారం ప్రాథమిక అవగాహన కోసం మాత్రమే. ఏదైనా తీవ్రమైన ఆరోగ్య సమస్యలు లేదా వెన్నునొప్పి ఉన్నవారు నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ వ్యాయామాలు ప్రారంభించడం మంచిది. దీన్ని జీ తెలుగు న్యూస్ ధ్రువీకరించడం లేదు.)

Also Read: Rashmi Sudheer Clashes: సుడిగాలి సుధీర్‌తో యాంకర్ రష్మికి గొడవ? ఇద్దరూ శాశ్వతంగా దూరమైనట్లేనా? రష్మీ ఏం చెబుతుందంటే?

Also REad: TTD Special Darshan Tickets: తిరుమల వెళ్లే భక్తులకు సూపర్ గుడ్ న్యూస్..స్పెషల్ దర్శనం టికెట్లు విడుదల! ఎప్పుడో తెలుసా?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
RGRenuka Godugu
Jan 18, 2026 09:30:33
Hyderabad, Telangana:

Night Skin Care Routine: చాలామంది ఉదయం స్కిన్ కేర్ రొటీన్ ఫాలో అయితే సరిపోతుందని అనుకుంటారు. ఉదయం అంతా అలసిపోయిన తర్వాత రాత్రి సమయంలో మంచి స్కిన్ కేర్ రొటీన్ ఫాలో అవ్వడం చాలా ముఖ్యం. దీనివల్ల మీ చర్మం తాజాగా అందంగా మెరుస్తూ కనిపిస్తుంది. రాత్రి పడుకునే ముందు మీ చర్మానికి మంచి పోషణ అందించే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే డే మాత్రమే కాదు.. మీ నైట్ స్కిన్ కేర్ రొటీన్‌ కూడా ఎలా ఉండాలో తెలుసుకుందాం..

 మేకప్..
 చాలామంది రోజంతా మేకప్ వేసుకొని ఉంటారు. రాత్రి పడుకునే ముందు ఆ మేకప్ తప్పనిసరిగా తీసి వేయాలి. ముఖాన్ని కాటన్‌ వైప్స్‌తో క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ముఖంపై రంధ్రాలు రాకుండా.. జీవం కోల్పోకుండా చేస్తాయి. లేకపోతే రాను రాను ముఖం పాడయ్యే అవకాశం ఉంది.

 ఆ తర్వాత ముఖాన్ని క్లెన్స్‌ చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. తద్వారా ముఖంపై ఉండే మలినాలు ,అదనపు నూనె తొలగిపోతాయి. ప్రతిరోజు ముఖాన్ని క్లెన్స్‌ చేసుకోవాలి. ముందుగా గోరువెచ్చని నీటితో ముఖాన్ని వాష్ చేసుకోవాలి. ఆ తర్వాత మీ చర్మానికి మంచి టోనర్ కూడా అందించాలి. ఇది చర్మం పీహెచ్ స్థాయిలను సమతులం చేస్తుంది. మంచి హైడ్రేషన్ కూడా మన చర్మానికి అందిస్తుంది.

 ఆ తర్వాత వెంటనే ముఖానికి మంచి హైరోలోనిక్ యాసిడ్ వంటి సీరమ్స్ అప్లై చేయాలి. ఇందులో ముఖానికి హైడ్రేషన్ అందించే గుణాలు ఉంటాయి. ఇలాంటి టోనర్స్ లో విటమిన్ సీ ముఖానికి కాంతివంతం చేస్తుంది. యాక్నే తొలగిపోతుంది.ఆ తర్వాత ముఖానికి మాయిశ్చర్ రాయాలి. రోజు రాత్రి పడుకునే ముందు తప్పకుండా ముఖానికి మాయిశ్చర్ రాయడం అలవాటు చేసుకోవాలి. తద్వారా ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు స్కిన్ రిపేర్ చేసే గుణాలు ఉంటాయి.

 రాత్రి పడుకునే ముందు మాయిశ్చరైజర్ మాత్రమే కాదు.. మీ కంటికి ఐ క్రీం రాయడం మర్చిపోకూడదు. ఇది లైట్ వెయిట్ ఐ క్రీమ్ అయితే బెస్ట్‌. తద్వారా కళ్ల కింద ఉండే నల్ల మచ్చలు, గీతాలు తొలగిపోతాయి. ప్రతి వారానికి రెండుసార్లు ఓవర్ నైట్ మాస్కులు కూడా వేసుకోవడం అలవాటు చేసుకోవాలి. ఇది చర్మానికి మంచి హైడ్రేషన్ అందించి పునరుజ్జీవనం కూడా అందిస్తుంది.

 ఇక హైడ్రేషన్ అంటే కేవలం మాయిశ్చరైజర్‌ మాత్రమే కాదు.. రోజు సరిపడా నీళ్లు తాగడం అలవాటు చేసుకోవాలి. ప్రతిరోజు కనీసం 8 గంటల నిద్ర అవసరం. ఇది బ్యూటీ స్లీప్‌ అని కూడా పిలుస్తారు. ముఖానికి మంచి నిద్ర ఎక్కువగా నీరు తీసుకోవడం వల్ల మీ స్కిన్ కేర్ రొటీన్ లో మీ ముఖం కాంతివంతంగా మారిపోతుంది. (Disclaimer: ఈ కథనం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు) 

ALso Read:​ గుడ్లతో ఈ 5 ఫుడ్స్ తింటున్నారా? అయితే వెంటనే ఆపేయండి, నిపుణుల షాకింగ్‌ సలహా..

ALso Read:​ ఖరీదైన క్రీములు అవసరం లేదు.. మన ఇంట్లోనే ఉన్న ఈ 7 పదార్థాలే నిజమైన బ్యూటీ సీక్రెట్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
HDHarish Darla
Jan 18, 2026 09:09:21
Hyderabad, Telangana:

Sudheer Rashmi Latest News: యాంకర్ రష్మీ గౌతమ్ అంటే బుల్లితెర ప్రేక్షకులకు ఒక ప్రత్యేకమైన అభిమానం. ముఖ్యంగా సుడిగాలి సుధీర్, రష్మీల ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీకి విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉంది. అయితే గత కొంతకాలంగా వీరిద్దరూ కలిసి కనిపించకపోవడంతో రకరకాల పుకార్లు షికారు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రష్మీ ఒక ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు.

సుధీర్‌తో తనకు గొడవ జరిగిందన్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని యాంకర్ రష్మీ స్పష్టం చేశారు. తన సినిమా ప్రమోషన్ల కోసం సుధీర్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడని, వారి మధ్య స్నేహం అలాగే ఉందని తెలిపారు. అలాగే తన సినిమా గురించి తెలిసి సుధీర్ స్వయంగా ఫోన్ చేసి, "నీ సినిమా కోసం నేను ఏం చేయగలను?" అని అడిగారని రష్మీ గుర్తు చేసుకున్నారు. ప్రదీప్, రోషన్ వంటి స్నేహితుల తరహాలోనే సుధీర్ కూడా తనకు అండగా నిలుస్తాడని ఆమె పేర్కొన్నారు.

టీవీ షోలకు సుధీర్ రాకపై..
సుధీర్ మళ్లీ టీవీ షోలకు తిరిగి రావాలన్నది తన వ్యక్తిగత నిర్ణయం కాదని, అది పూర్తిగా మేనేజ్‌మెంట్ తీసుకునే నిర్ణయమని రష్మీ వెల్లడించారు. సుధీర్‌కు తానెప్పుడూ ప్రత్యేకంగా మెసేజ్ చేయాల్సిన అవసరం లేదని, అవసరమైనప్పుడు తను ఎప్పుడూ తనకు తోడుగా ఉంటాడనే నమ్మకం ఉందని ఆమె చెప్పుకొచ్చారు.

ప్రస్తుతం ఒక పెద్ద షోను రెండు గంటల పాటు ఒంటరిగా నడుపుతుండటంపై రష్మీ సంతోషం వ్యక్తం చేశారు. ఈ షో రేటింగ్ పరంగా అద్భుతంగా దూసుకుపోతోందని, తన చిలిపి పనులు కూడా షో విజయానికి తోడ్పడుతున్నాయని ఆమె తెలిపారు. ఆడియన్స్ తనను సొంత ఇంట్లోని అమ్మాయిలా చూసుకుంటున్నారని, తన విజయానికి వారే ప్రధాన కారణమని కృతజ్ఞతలు తెలిపారు.

బయట జరుగుతున్న ప్రచారం కేవలం వదంతులేనని.. సుధీర్, తన మధ్య స్నేహబంధం ఇప్పటికీ బలంగానే ఉందని రష్మీ క్లారిటీ ఇవ్వడంతో అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు. ప్రస్తుతం రష్మీ అటు షోలతో పాటు సినిమాలపై కూడా దృష్టి సారిస్తోంది.

Also Read: TTD Special Darshan Tickets: తిరుమల వెళ్లే భక్తులకు సూపర్ గుడ్ న్యూస్..స్పెషల్ దర్శనం టికెట్లు విడుదల! ఎప్పుడో తెలుసా?

Also REad: EPS-95 Pension Hike: ఉద్యోగులకు పెన్షన్ ధమాకా..కనీస పెన్షన్ రూ.6,000కి పెంపు? బడ్జెట్‌లో ప్రకటన వచ్చే ఛాన్స్!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

0
comment0
Report
TKTA Kiran Kumar
Jan 18, 2026 08:58:41
Hyderabad, Telangana:

AR Rehman controversy Said Sorry: ఆస్కార్ విజేత, భారతీయ సంగీత దిగ్గజం ఏఆర్ రెహమాన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సినీ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. గత కొన్నేళ్లుగా హిందీ చిత్ర పరిశ్రమలో తనకు అవకాశాలు తగ్గడానికి గల కారణాల గురించి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో రెహమాన్ విశ్లేషిస్తూ ‘‘ఎనిమిదేళ్లుగా ఇండస్ట్రీలో పవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షిప్ట్ జరిగింది క్రియేటివిటీ లేని వాళ్ల చేతుల్లోకి అధికారం వెళ్లింది. దీనికి మతపరమైన వివక్ష కూడా కారణమై ఉండొచ్చన్నారు. త‌న వ్యాఖ్య‌ల ఉద్దేశం సంగీతానికి గౌర‌వం ద‌గ్గ‌డ‌మేన‌ని చెప్పారు. తాను ఎప్పుడూ బాధ పెట్టాలని అనుకోలేదన్నారు. తన నిజాయితీని గుర్తిస్తారని ఆశిస్తున్నానని వ్యాఖ్యానించారు ఏఆర్ రెహమాన్.రెహమాన్ చేసిన మత వివక్ష ఆరోపణలను చాలామంది తప్పుబడుతున్నారు. రెహమాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి ఇలాంటి స్టేట్మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రావడం నమ్మలేకపోతున్నానని, అంతర్జాతీయ ప్రాజెక్ట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, విదేశీ కాన్సర్ట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, పెద్ద సినిమాలతో ఆయన బిజీగా ఉంటారనే ఉద్దేశ్యంతో చాలామంది నిర్మాతలు ఆయన్ను సంప్రదించలేకపోవచ్చు అని సీనియర్ స్క్రీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రైటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జావేద్ అక్తర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అన్నారు.

ఒకవేళ మత వివక్ష ఉంటే కొందరు హీరోలు ఇప్పటికీ స్టార్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ఉండేవారు కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక తనకు కూడా అవకాశాలు తగ్గాయని, అంతమాత్రాన అవకాశాలు రాకపోవడానికి మతాన్ని ముడిపెట్టడం సరికాదని  సింగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అన్నారు. రెహమాన్ డేంజరస్ కామెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారని, వ్యక్తిగత వైఫల్యాలకు ఇండస్ట్రీని నిందించడం సరికాదని రచయిత్రి శోభా డే మండిపడ్డారు.

Read more:​  సమంత బాటలో దర్శకులను పెళ్లి చేసుకున్న హీరోయిన్స్ వీళ్లే..

Read more:​ సమంత కంటే ముందు రెండో పెళ్లి చేసుకున్న హీరోయిన్స్ వీళ్లే..! పూర్తి లిస్ట్ ఇదే..!

రెహమాన్ కామెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రాజకీయ చర్చకు కూడా దారితీశాయి. ఒకప్పుడు హిందువు అయిన రెహమాన్ , తనకు మళ్లీ అవకాశాలు కావాలంటే ఘర్ వాపసీ అవ్వాలని వీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పీ నేత వినోద్ బన్సల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అన్నారు. ఇండస్ట్రీని నిందించే ముందు రెహమాన్ ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. గతేడాది ఈయన ‘ఛావా’ సినిమాకు అద్భుతమైన మ్యూజిక్ కంపోజ్ చేశారు. 

Also Read: వెయ్యి కోట్ల దర్శకులు.. ‘దురంధర్’తో ఈ క్లబ్బులో ఎంట్రీ ఇచ్చిన ఆదిత్యధర్..

Also Read: ఒకప్పుడు తెలుగు సహా అన్ని భాషల్లో సత్తా చాటిన హీరోయిన్.. నేడు రూ.2 వేల కోట్లకు యజమాని.. 5 కంపెనీలకు బాస్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.

0
comment0
Report
Advertisement
Back to top