Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Khammam507001

ఖమ్మంలో శిక్షణపూర్తి చేసుకున్న ఏఆర్, సివిల్ కానిస్టేబుల్స్ అభ్యర్థులు

Nov 21, 2024 08:39:34
Khammam, Telangana
శిక్షణపూర్తి చేసుకున్న సివిల్, ఏఆర్ కానిస్టేబుల్ అభ్యర్థుల అవుట్ పాసింగ్ ఖమ్మంలో జరిగింది. రామగుండం, రాచకొండ కమిషనరేట్ పరిధిలో 263 అభ్యర్థులు తొమ్మిది నెలల పాటు నగరంలోని సిటీ పోలీస్ ట్రైనింగ్ సెంటర్ లో అవుట్ పాసింగ్ కొనసాగింది. ఈ కార్యక్రమానికి మల్టీజోన్_1 ఐజీ ఎస్. చంద్రశేఖర్ రెడ్డి, సిపి సునీల్ దత్ తదితరులు హాజరయ్యారు. అభ్యర్థుల కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు.
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
HDHarish Darla
Mar 14, 2026 09:32:54
Hyderabad, Telangana:

Train Fight Viral Video News: భారత రైళ్లలో జనరల్ బోగీలు ఎప్పుడూ రద్దీగా ఉంటాయనే సంగతి తెలిసిందే. అయితే చాలా సార్లు సీట్ల విషయంలో ప్రయాణికుల మధ్య గొడవలు సహజంగా జరుగుతుంటాయి. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలో ఓ ఆంటీ చెప్పు చూపించిందని ఓ యువకుడు ఆమెను చావకొట్టాడు. దీంతో రైలులో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. ఈ సంఘటన గుర్తుతెలియని రైలులోని ఓ జనరల్ కంపార్ట్‌మెంట్‌లో జరిగింది. సీటు విషయంలో ఓ వ్యక్తితో మరో మహిళకు మధ్య జరిగిన వాగ్వాదం ఇది. అది మొదట్లో వాగ్వాదంగా ఉన్నా.. ఆ తర్వాత తీవ్ర ఘర్షణకు దారితీసింది. ఈ వీడియోలో ఓ మహిళ యువకుడ్ని అవమానిస్తూ, చెప్పు చూపిస్తూ బెదిరించడం మొదలుపెట్టింది. ఆ యువకుడు తొలుత ఎంతో ప్రశాంతంగా మాట్లాడాడు. 

సీటు విషయంలో వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఆ యువకుడు ఎన్నోసార్లు చెప్పు కిందికి దించి మాట్లాడండి అని చెప్పినా.. ఆమె వినకుండా రెచ్చగొట్టే ధోరణిలో వెళ్లింది. ఎంతో సమయమనంతో అతడు మరో సీటుకు వెళ్లి కూర్చున్నా.. ఆ చెప్పుతో మహిళ మరింత బెదిరింపులకు దిగింది. ఆ వెంటనే ఉన్న ఓ మహిళతో కూడా ఆమె వాగ్వాదినికి దిగింది. ఆ మహిళ "నా కొడుకు ఇంజనీర్, నా భర్త సూపర్‌వైజర్" అని చెప్పడం మీరు వినవచ్చు. 

అయితే ఆమె ఆ యువకుడి బంధువో లేదా భార్యో తెలియడంలేదు. కానీ, సీన్‌లోకి ఆ మహిళపై వాగ్వాదానికి రాగానే.. చెప్పు చూపిన ఆంటీపై యువకుడు దూసుకొచ్చాడు. ముఖంపై గ్యాప్ లేకుండా చెంపదెబ్బలు కొడుతూనే ఉన్నాడు. ఆమె బెదిరింపులకు తాళలేకపోయిన ఆ వ్యక్తి దాడి చేసినట్లు చెబుతున్నాడు. 

ఆంటీపై తీవ్రంగా దాడి చేసిన యువకుడ్ని వారించేందుకు ప్రయాణికులు ఎంతో ప్రయత్నించారు. అయితే మహిళను కొట్టడం మంచి పద్ధతి కాదంటూ కొందరు అంటుంటే.. ఆమె చేసిన వ్యాఖ్యలకు తగిన శాస్తి జరిగిందని కొందరు నవ్వుకుంటున్నారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

Also Read: Plants To Avoid In Home: ఈ మొక్కలు ఇంట్లో ఉంటే వెంటనే పీకేయండి.. డబ్బు సమస్యలు, అప్పుల బాధ తప్పదు!

Also Read: CSK Jailer Jersey: చెన్నై సూపర్‌కింగ్స్‌కు మరో షాక్..ఐపీఎల్ టీమ్‌పై కేసు పెట్టిన 'జైలర్' నిర్మాత..రూ.కోటి పరిహారం కోసం డిమాండ్!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

38
comment0
Report
HDHarish Darla
Mar 14, 2026 08:09:34
Hyderabad, Telangana:

Vastu Shastra Plants To Avoid: జ్యోతిషశాస్త్రంలో వాస్తు శాస్త్రానికి ఎంతో ప్రాముఖ్యం ఉంది. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం, ఈ రకాల మొక్కలను ఇంట్లోకి అస్సలు రానివ్వకూడదట. వాటిని పెంచడం వల్ల ఆర్థిక సమస్యలు పెరగడమే కాకుండా కష్టాలు వస్తాయట. ఇంతకీ ఆ మొక్కలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

చింతకాయల చెట్టు 
వాస్తు శాస్త్రం చెబుతున్న సమాచారం ప్రకారం.. ఇంటి ప్రాంగణంలో ప్రధాన ద్వారం వద్ద చింత చెట్టు ఉంటే అది ఇంటికి చేటు, ఎంతో అశుభమని అంటున్నారు. ఈ చెట్టు ఉండడం వల్ల ఇంట్లో ప్రతికూల శక్తులను ఆకర్షిస్తుందట. అంతే కాకుండా ఇది ఇంటి సభ్యులను అనారోగ్యానికి గురిచేస్తుంది.

మర్రి చెట్టు
వాస్తు శాస్త్రం చెప్పినట్లు ఇంట్లో మర్రి చెట్టు ఉండటం అస్సలు మంచిది కాదు. దీన్ని పెంచడం వల్ల అనేక దోషాలు ఇంటిని చుట్టుముడతాయని నిపుణులు చెబుతున్నారు. మర్రిచెట్టును పెంచడం వల్ల ఇంట్లో ఆర్థిక, ఆరోగ్య సమస్యలు కూడా పెరుగుతాయని జోతిష్య్కులు చెబుతున్నారు. ఇంట్లో మర్రిచెట్టును పెంచడం ముమ్మాటికి అశుభమే అని అంటున్నారు. 

జిల్లెడు చెట్టు 
ఇంట్లో జిల్లెడు చెట్టు పెంచడం అశుభం. అంతేకాకుండా మొక్క ఇంట్లో ఉంటే ఆర్థిక సమస్యలు పెరుగుతాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఇది ఇంట్లో ఉంటే ఆర్థిక సమస్యలు పెరిగిపోతాయట. అందుకే ఈ మొక్కను ఇళ్లలో పెంచకూడదు. 

నల్లతుమ్మ చెట్టు 
ఇంటి ముందు లేదా లోపల నల్లతుమ్మ చెట్టు ఉంటే ఇంట్లో ఎప్పుడు ఏదో ఒక తగాదాలు ఉంటూనే ఉంటాయట. అనవసరమైన వాదనలు, ఆర్థిక సమస్యలను చుట్టుముడతాయట. కుటుంబసభ్యుల మధ్య పొతపత్యాలు వంటి అనేక సమస్యలు వస్తాయట. 

కాక్టస్ (బ్రహ్మ జెముడు, నాగజెముడు) 
ఇంట్లో కాక్టస్ లేదా ముళ్ల మొక్కలు ఉండటం ఎంతో అశుభం. ఈ మొక్కలు ఇంట్లో ఉంటే కుటుంబ సభ్యులలో ఉద్రిక్తత, ఒత్తిడి వంటి సమస్యలను కలిగిస్తాయి. అలాగే అవి జీవితంలో అడ్డంకులను తెచ్చిపెట్టి ఆర్థిక నష్టాన్ని కలిగిస్తాయి.  

ALso Read: Salman Ali Agha Run Out: అండగా నిలిచిన పాకిస్థాన్‌ను దెబ్బకొట్టిన బంగ్లాదేశ్..రెండో వన్డేలో పాక్ కెప్టెన్ పరువు తీసిన బంగ్లా కెప్టెన్!

Also Read: Sadhvi Prachi Monalisa: "మోనాలిసా 35 ముక్కలుగా మారిపోతుంది..జాగ్రత్త!" 'లవ్ జిహాద్' పై సాధ్వీ ప్రాచీ కీలక వ్యాఖ్యలు!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

97
comment0
Report
DDDharmaraju Dhurishetty
Mar 14, 2026 08:07:20
Hyderabad, Telangana:

Kodada Oil Mafia Exposed: సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణం కల్తీ మాఫియా కు అడ్డాగా మారుతూ వస్తోంది. పక్క రాష్ట్రాల నుంచి నగరాలకు వెళ్లే వంటనూనె ట్యాంకర్లే లక్ష్యంగా ఇక్కడ భారీ ఎత్తున కల్తీ వ్యాపారం సాగుతోంది. గుంటూరు నుంచి హైదరాబాద్కు బయలుదేరిన ఆయిల్ ట్యాంకర్లు మధ్య మార్గంలో కోదాడలో ఆగి.. అందులో అసలైన నూనెను దించి.. కల్తీ మిశ్రమాలను కలిపి తరలిస్తున్నట్లు సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే, ఈ నూనెలను ఆయా ప్రాంతాల్లో అత్యంత తక్కువ ధరలకే విక్రయిస్తున్నట్లు కూడా తెలుస్తోంది. ఈ అంశానికి సంబంధించిన పూర్తి వివరాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం 

ఈ అక్రమ దండ ఎవరికి అనుమానం రాకుండా పక్క ప్లాన్‌తో కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది.. అర్ధరాత్రి సమయాల్లో జనసంచారం లేని ప్రదేశాల్లో ట్యాంకర్లను రహస్యంగా ఒకచోట ఉంచి.. సీల్లను తొలగించి నూనెను దొంగలిస్తున్నారు.. బయట చూస్తే అచ్చం పామ్ ఆయిల్ లాగే కనిపించే.. ఒక ద్రవాన్ని వివిధ రకాల రసాయనాలు, నాణ్యతలేని పదార్థాలను కలిపి తిరిగి బ్యాక్ చేస్తున్నారు. ఈ నకిలీ నూనెను హైదరాబాదులోని కొంతమంది దళారుల ద్వారా మార్కెట్లోకి పంపిస్తూ అక్రమార్కులు కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నారు..

మార్కెట్ ధర కంటే చాలా తక్కువ ధరలకు ఈ నూనెను లభించడంతో హోటళ్లతో పాటు రెస్టారెంట్లు, ఫుడ్ సెంటర్లు, బేకరీ యజమానులు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారట.. లాభాల కోసం ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెడుతున్నారు. ఇప్పటికే కొన్ని చోట్ల ఈ నకిలీ నూనెలు చాలామంది అనారోగ్య సమస్యల బారిన పడేలా చేస్తున్నాయి. ముఖ్యంగా ఇలాంటి నకిలీ నూనెలో తినడం వల్ల రక్తనాళాల్లోని పూడికలు ఏర్పడే ప్రమాదం కూడా ఉంది. దీనివల్ల గుండె సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

Read more:  Rajendra Prasad Video: ఉద్దేశపూర్వకంగా అనలేదు.!. ఎంజీఆర్ పై వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చిన రాజేంద్ర ప్రసాద్.. వీడియో..

కోదాడ కేంద్రంగా ఇంత పెద్ద ఎత్తున దందా సాగుతున్న.. సంబంధిత ఫుడ్ సేఫ్టీ అధికారులు, పోలీసులు పట్టించుకోవడం లేదనే విమర్శలు ఊహించని స్థాయిలో వెల్లువెత్తుతున్నాయి.. అధికారుల పర్యవేక్షణ లోపం కల్తి రాయులకు ఒక అద్భుతమైన వరంగా మారుతోందని అక్కడే ఉన్న కొంతమంది స్థానికులు చెబుతున్నారు. అమాయక ప్రజల ప్రాణాలతో ఆటలాడుతున్న ఈ మాఫియా పై కఠిన చర్యలు తీసుకోవాలని.. తనిఖీలు ముమ్మరం చేయాలని స్థానికులు కూడా డిమాండ్ చేస్తున్నారు. మరి మున్ముందైన అధికారులు ఈ కల్తీ రాయుళ్లపై చర్యలు  తీసుకుంటారో లేదో చూడాల్సిందే..

Read more:  Rajendra Prasad Video: ఉద్దేశపూర్వకంగా అనలేదు.!. ఎంజీఆర్ పై వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చిన రాజేంద్ర ప్రసాద్.. వీడియో..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.

92
comment0
Report
DDDharmaraju Dhurishetty
Mar 14, 2026 07:56:50
Hyderabad, Telangana:

Instagram Encryption Removal News: ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం మేటర్ తన ఇంస్టాగ్రామ్ వినియోగదారులకు ఊహించని షాకింగ్ వార్తను వెల్లడించింది. ఇంస్టాగ్రామ్ ఫ్లాట్ ఫామ్ లో చాటింగ్ కోసం అందుబాటులో ఉన్న అత్యంత కీలకమైన భద్రతా ఫీచర్ ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ను మే 8వ తేదీ నుంచి తొలగించుకున్నట్లు సమస్త తెలిపింది. ఈ నిర్ణయంతో ఇంస్టాగ్రామ్ లోని యూజర్లు ప్రైవసీకి ఊహించని స్థాయిలో అంతరాయం ఏర్పడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే మెటా ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలేంటి? అసలు ఏం జరుగుంటుంది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ఫీచర్ అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి మెసేజ్ చేసే వ్యక్తి.. దానిని చదివే వ్యక్తికి తప్ప ఇతరులకు ఆ కంటెంట్ చదివే అవకాశం అస్సలు ఉండదు. చివరికి మెటా కంపెనీకి కూడా ఈ అవకాశం లేకపోవడం విశేషం. కానీ తాజా మార్పులతో ఇకపై యూసర్లు పంపే ఫోటోలతో పాటు వీడియోలు, టెక్స్ట్ మెసేజ్లు మిఠా యాజమాన్యం పర్యవేక్షించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారికంగా కంపెనీ ఎలాంటి కారణాలు వెల్లడించ లేకపోయినప్పటికీ.. అంతర్గత వర్గాల సమాచారం ప్రకారం.. పిల్లల భద్రతను దృష్టిలో పెట్టుకొని ఆ ఫీచర్ ని తొలగించబోతున్నట్లు తెలుస్తోంది. 

ప్రపంచవ్యాప్తంగా ఇన్స్టాగ్రామ్ వేదికగా పిల్లల పట్ల లైంగిక దాడులతో పాటు వేధింపులు, హానికరమైన కంటెంట్ వ్యాప్తి జరుగుతుందని పలు దేశాలకు సంబంధించిన ప్రభుత్వాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా అశ్లీలమైన కంటెంట్ తో పాటు వేధింపులకు గురి చేసే మెసేజ్లు ఏఐ సహాయంతో ముందుగానే గుర్తించేందుకు ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే సోషల్ మీడియాలో నేరాలను అరికట్టేందుకు వీలుకా కంటెంట్ పర్యవేక్షణ అధికారము ఉండాలని బ్రిటన్‌తో పాటు అమెరికా వంటి దేశాలు గతంలో డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే..

Also Read: Redmi 14C 5G Offer: రెడ్‌మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్‌ఫోన్..అదిరిపోయే ఆఫర్!

అంతేకాకుండా ఇంస్టాగ్రామ్ త్వరలోనే నేరాలకు సంబంధించిన చాటింగ్ చేసే వారిని గుర్తించేందుకు ప్రత్యేకమైన సిస్టం తీసుకురావడమే కాకుండా.. వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చే టీచర్ ని కూడా అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. సాధారణ వినియోగదారులు మాత్రం ఈ నిర్ణయం స్వాగతిస్తున్న.. కొంతమంది మాత్రం దీనిని వ్యతిరేకిస్తున్నారు. తమ వ్యక్తిగత సంభాషణలు సంస్థ పర్యవేక్షణలోకి వెళ్లడం సీక్రెట్ దెబ్బతింటుందని వారి భావిస్తున్నారు. ఇది కేవలం అనుమాదాస్పద కంటెంట్‌తో పాటు పిల్లల భద్రత కోసం మాత్రమే పరిమితం అవుతుందా? లేక అందరి డేటా పై మెటా కన్నెస్తుందా అనేది వేచి చూడాల్సిందే.

Also Read: Redmi 14C 5G Offer: రెడ్‌మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్‌ఫోన్..అదిరిపోయే ఆఫర్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

140
comment0
Report
DDDharmaraju Dhurishetty
Mar 14, 2026 05:34:30
Hyderabad, Telangana:

Is Netanyahu Dead Or Alive Latest News: ఇజ్రాయిల్ ప్రధాని బెన్జమిన్ నెతన్యాహు అసలు  ప్రాణాలతో ఉన్నారా? లేక ఆయన మృతిని ఆ దేశం సీక్రెట్‌గా ఉంచుతోందా? అసలు ఏం జరిగి ఉంటుంది? ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో ఈ ప్రశ్నలను తెర లేపుతూ వస్తోంది.. సాధారణంగా ఏ చిన్న విషయంలోనైనా అత్యంత స్పష్టంగా వివరించి ఇజ్రాయిల్ ప్రధాని.. తాజాగా వీడియోలో కనిపిస్తున్న తీరు అనేక సందేహాలకు దారితీస్తుంది. ఈ వీడియో చూసిన చాలామంది భిన్నభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

వీడియోను స్పష్టంగా పరిశీలిస్తే.. నెతన్యాహు చేతికి సంబంధించిన వేళ్ళు అక్కడక్కడ స్పష్టంగా కనిపించలేకపోవడం.. సాధారణంగా మనిషికి ఉండే ఐదు వేలకు బదులుగా.. ఈ వీడియోలో కొన్నిచోట్ల ఆయనకు 6 వేళ్ళు కనిపించడం చర్చనీయంగా మారింది.. సాంకేతిక నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఆర్టిఫిషియన్ ఇంటెలిజెన్సీ రూపొందించిన డీప్ ఫేక్ వీడియోలు ఇటువంటి లోపాలు సహజంగానే కనిపిస్తుంటాయని అంటున్నారు. దీంతో ఇది అసలు నెతన్యాహు చేసిన ప్రసంగమేనా.. లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సృష్టించిన డిజిటల్ వెర్షన్ అనే చర్చ కూడా ఇప్పటికే మొదలైంది..

అయితే వీడియో చిత్రీకరిస్తున్న సమయంలో యుద్ధ ప్రాంతాల్లో వినిపించే అత్యవసర అలర్ట్ సైరన్ కూడా స్పష్టంగా వినిపిస్తోంది.. సాధారణంగా ఇజ్రాయిల్ ప్రధాని ఇటువంటి పరిస్థితుల్లో వెంటనే స్పందిస్తారు.. భద్రత కారణాల దృశ్య ప్రసంగాన్ని కూడా నిలిపివేసే అవకాశాలు కూడా ఉంటాయి.. కానీ ఈ వీడియోలో ఆయన ఏ మాత్రం భయపడకుండా.. కనీసం కనురెప్ప వేయకుండా తన ప్రసంగాన్ని కొనసాగించడం ఇప్పుడు పెద్ద చర్చనీ అంశానికి దారితీసింది. ఇది ముందే రికార్డు చేసిన వీడియో నా లేక ఎడిటింగ్ టేబుల్ పై తయారైన దృశ్యమా అనే అనుమానాలు కూడా బలపడుతున్నట్లు తెలుస్తోంది.

వీడియోలో నెతన్యాహు ఏ వీడియో ప్రతినిధితోను ఇందులో మాట్లాడలేకపోవడం విశేషం.. కేవలం కెమెరా వైపు చూస్తూనే ఏకపక్షంగా మాట్లాడుతూ సందేశాన్ని పూర్తి చేశారు. అంతర్జాతీయ మీడియాలోనూ ఆయన మృతి చెందినట్లు కథనాలు వస్తున్న తరుణంలో.. ఆయన నేరుగా ప్రజల ముందు రాకుండా ఇలాంటి అనుమానస్పద వీడియోలు విడుదల చేయడం వెనక ఏదో పెద్ద మిస్టరీ ఉందని అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఏం జరుగుతుందనే అంశం  మున్ముందు తేలుతుంది.

Also Read: Redmi 14C 5G Offer: రెడ్‌మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్‌ఫోన్..అదిరిపోయే ఆఫర్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

100
comment0
Report
DDDharmaraju Dhurishetty
Mar 14, 2026 05:12:14
Hyderabad, Telangana:

Trigraha Asthamayam 2026 Effect On Zodiac Telugu: గ్రహాల గమనాలు మానవ జీవితాలపై ఊహించని ప్రభావాన్ని చెబుతాయి. ఈ క్రమంలో మార్చి నెలలో అత్యంత శక్తివంతమైన ఓ ఘటన చోటు చేసుకోబోతోంది ముఖ్యంగా  ఖగోళంలో ఎంతో శక్తివంతమైన శని బుధ అంగారకర గ్రహాలు చాలా రోజుల తర్వాత అస్తమించబోతున్నాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. అస్తమించడం వల్ల సానుకూలమైన ప్రభావం ఏర్పడడమే కాకుండా ప్రతికూల ప్రభావం కూడా ఏర్పడుతుంది. అయితే, మూడు గ్రహాలు అస్తమించడాన్ని జ్యోతిష్య శాస్త్రంలో త్రిగ్రహ అస్తమయంగా పిలుస్తారు.  ఈ పరిణామం వల్ల మొత్తం వాదశరాశుల వారిపై ప్రభావం పడినప్పటికీ కొన్ని రాశుల వారికి అదృష్టం ఊహించని స్థాయిలో లభిస్తుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఈ సమయంలో ఆర్థికంగా కలిసి రాబోతోంది. 

అస్తమించడం అంటే మీకు తెలుసా? 
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యుడికి అతి సమీపంలోకి ఏ  గ్రహం వచ్చినా.. అది తన ప్రభావాన్ని కోల్పోయి.. అస్తమించినట్లు పరిగణిస్తారు. మార్చి 12వ తేదీన శని, బుధ, కుజ గ్రహాలు వరుసగా అస్తమించాయి. సాధారణ గ్రహాల అస్తమయం వల్ల అశుభంగా ఫలితాలు ఉన్నప్పటికీ.. కొన్ని రాశుల వారికి మాత్రం ఇది రాజయోగాన్ని తెచ్చిపెడుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. 

సింహరాశి 
సింహరాశిలో జన్మించిన వ్యక్తులకు ఈ మూడు గ్రహాలు అస్తమించడం వల్ల ఊహించని విజయాలు కలుగుతాయి. ముఖ్యంగా నీరు ఉద్యోగులకు కోరుకున్న ఉద్యోగం లభించే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రభుత్వ సంబంధిత పనులు త్వరగా పూర్తయ్యే అవకాశాలున్నాయి.. దీంతోపాటు ఆర్థికంగా స్థిరపడడమే కాకుండా పాత బాకీలు కూడా వసూలు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఆరోగ్య విషయంలో స్వల్పంగా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది.

ధనస్సు రాశి 
ధనస్సు రాశిలో జన్మించిన వ్యక్తులకు ఈ సమయం చాలా అద్భుతంగా ఉంటుంది. వీరికి ఈ సమయం స్వర్ణ యుగం కంటే అద్భుతమైనదిగా భావించవచ్చు. పెండింగ్లో ఉన్న కోర్టు కేసులు కూడా ఎంతో సులభంగా పరిష్కారం అవుతాయి. వ్యాపారస్తులకు భారీ విజయాలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. విద్యార్థులకు విదేశీ విద్యా యోగం కలుగుతుంది. కుటుంబంలో సుఖశాంతులు లభిస్తాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. సామాజికంగా గౌరవం కూడా ఊహించని స్థాయిలో పెరుగుతుంది.

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

కుంభరాశి 
కుంభ రాశిలో జన్మించిన వ్యక్తులకు మానసిక ఆందోళన నుంచి ఎంతో సులభంగా విముక్తి కలుగుతుంది. ముఖ్యంగా శని అస్తమించడం వల్ల వీరికి ఏలినాటి శని ప్రభావం కొంతవరకు తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే స్థిరాస్తులు నుంచి కొన్ని రకాల ప్రయోజనాలు కూడా పొందుతారు నూతన ప్రాజెక్టులు ప్రారంభించడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అనుకున్నది అనుకున్నట్లుగా జరిగి అద్భుతమైన ప్రయోజనాలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

164
comment0
Report
HDHarish Darla
Mar 13, 2026 16:32:56
Chennai, Tamil Nadu:

Chennai Super Kings Vs Sun TV: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 ప్రారంభానికి ముందే సన్‌రైజర్స్ హైదరాబాద్‌ జట్టుపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతున్న సంగతి తెలిసిందే. 'ది హండ్రెడ్' లీగ్ కోసం వేలంలో పాక్ ఆటగాడ్ని సన్‌రైజర్స్ లీడ్స్ (కావ్యామారన్ యజమాని) కొనుగోలు చేయడం వల్ల SRH టీమ్‌పై భారత్‌లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఈ క్రమంలో రాబోయే ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకి సంబంధించిన మ్యాచ్‌లను బ్యాన్ చేయాలని సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. 

ఇప్పుడీ గందరగోళం నడుమ మద్రాస్ హైకోర్టు మరో ఐపీఎల్ టీమ్‌కు షాకింగ్ న్యూస్ ఇచ్చింది. తమకు సంబంధించిన సినిమా సాంగ్‌ను చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అనుమతి లేకుండా వినియోగించిందంటూ సన్ నెట్‌వర్క్ కోర్టును ఆశ్రయించింది. రజినీకాంత్ హీరోగా నటించిన 'జైలర్', 'జైలర్ 2', 'కూలీ' సినిమాలకు సంబంధించిన కొన్ని మ్యూజిక్ బిట్లను చెన్నై సూపర్‌కింగ్స్ జట్టు వినియోగించినట్లు ఫిర్యాదులో ఆరోపించింది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు జెర్సీ ఆవిష్కరించిన వీడియోలో సోషల్ మీడియాలో వ్యాప్తంగా ఈ మ్యూజిక్‌ను వినియోగించినట్లు కోర్టుకు సన్ నెట్‌వర్క్ విన్నవించుకుంది.

అయితే దీనిపై ప్రతిస్పందనగా చెన్నై సూపర్ కింగ్స్ తరఫున న్యాయవాది.. మార్చి 1న కాపీరైట్ ఇష్యూ చేసిన మెటీరియల్‌ను సీఎస్కే టీమ్ మేనేజ్‌మెంట్ తొలగించిందని ఆయన కోర్టుకు తెలిపారు. అయితే దాన్ని అనుమతి లేకుండా వినియోగించడం వల్ల అది కాపీరైట్ యాక్ట్ కిందికి వస్తుందని సన్ టీవీ తరఫున వారు వాదించారు. భవిష్యత్తులోనూ తమకు సంబంధించిన మ్యాజిక్ ఆల్బమ్స్‌ను వినియోగించకుండా తగిన చర్యలు తీసుకోవాలంటూ సన్ నెట్‌వర్క్ కోరింది. అయితే ప్రస్తుతం అలాంటి వాటిని తొలగించామని.. భవిష్యత్తులో అవసరమైతే ముందస్తు అనుమతి తీసుకుంటామని సీఎస్కే కోర్టుకు విన్నవించింది. 

అయితే చెన్నై సూపర్‌కింగ్స్ జట్టు వినియోగించిన వివాదాస్పదమైన మ్యూజిక్‌ను 'జైలర్', 'జైలర్ 2', 'కూలీ' సినిమాల నుంచి సేకరించింది. రజినీ కాంత్ హీరోగా తెరకెక్కిన ఈ మూడు సినిమాలను సన్‌ టీవీ నెట్‌వర్క్ యాజమాన్యం నిర్మించింది. ఈ సినిమాలుకు సంగీతాన్ని అనిరుథ్ రవిచందర్ అందించారు. అయితే ఈ మ్యూజిక్ హక్కులన్నీ ప్రస్తుతం సన్ నెట్‌వర్క్ వద్ద ఉన్నాయి. 

అయితే తమకు సంబంధించిన మ్యూజిక్ కాపీరైట్ ఇష్యూ జరగడం వల్ల..చెన్నై సూపర్ కింగ్స్ జట్టు దాని వినియోగించి ఎంత మేర సంపాదించిందో సన్ నెట్‌వర్క్ వివరణ కోరింది. అందుకు నష్టపరిహారంగా రూ.కోటి పరిహారంగా ఇవ్వాలని కోర్టును కోరింది.

Also Read: Salman Ali Agha Run Out: అండగా నిలిచిన పాకిస్థాన్‌ను దెబ్బకొట్టిన బంగ్లాదేశ్..రెండో వన్డేలో పాక్ కెప్టెన్ పరువు తీసిన బంగ్లా కెప్టెన్!

Also Read: IPL 2026 Postponed: ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా ఐపీఎల్ 2026 వాయిదా? బీసీసీఐ నుంచి బిగ్ అప్‌డేట్!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

165
comment0
Report
RKRavi Kumar Sargam
Mar 13, 2026 16:01:35
Peddadinne, Telangana:
179
comment0
Report
HDHarish Darla
Mar 13, 2026 15:26:58
Hyderabad, Telangana:

Salman Ali Agha Run Out Vs Bangladesh: ఇటీవలే టీ20 ప్రపంచకప్‌లో వివాదాస్పదంగా మారిన పాకిస్థాన్, బంగ్లాదేశ్ జట్లు ఇప్పుడు ద్వైపాక్షిక సిరీస్‌లు ప్రారంభించాయి. ఢాకా వేదికగా పాక్, బంగ్లా మధ్య జరుగుతున్న వన్డే మ్యాచ్‌లో ఆసక్తికర సంఘటన జరిగింది. పాక్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా రనౌట్ ఇప్పుడు తీవ్ర వివాదాస్పదంగా మారింది. ఇది క్రీడా స్ఫూర్తికి పూర్తి విరుద్ధమని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. 

ఏం జరిగిందంటే? 
పాకిస్థాన్ క్రికెట్ జట్టు ప్రస్తుతం మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్ కోసం బంగ్లాదేశ్‌లో పర్యటిస్తోంది. తొలి మ్యాచ్‌లో గెలిచిన ఆతిథ్య జట్టు సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో ఉంది. అయితే రెండో వన్డేలో పాక్ కెప్టెన్ రనౌట్ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు తావిస్తోంది. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 

అలా 39వ ఓవర్‌లో.. 
వైరల్ అయిన వీడియో ప్రకారం.. పాకిస్తాన్ ఇన్నింగ్స్ 39వ ఓవర్లో కెప్టెన్ సల్మాన్ అలీ అఘా రనౌట్ జరిగింది. బంగ్లాదేశ్ కెప్టెన్ మెహిదీ హాసన్ మీరాజ్ చేసిన కన్ఫూజన్ కారణంగా అతడు రనౌట్ అయినట్లు తెలుస్తోంది. మొహమ్మద్ రిజ్వాన్ బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో బౌలర్ వైపు స్ట్రైట్ షాట్ కొట్టాడు. అయితే ఈ క్రమంలో రన్నర్‌గా ఉన్న కెప్టెన్ సల్మాన్.. క్రీజ్ నుంచి బయటకు వెళ్లి ఆ తర్వాత వెనుదిరిగాడు. బంతి బౌలర్ చేతికి అందుకునే క్రమంలో బౌలర్ అడ్డుగా తగిలాడు. దీంతో సల్మాన్ క్రీజ్‌లో బ్యాట్ పెట్టేందుకు వీలు కుదరలేదు. అది గమనించిన బౌలర్ వెంటనే బంతిని అందుకొని స్టంప్ చేశాడు. దీంతో అది ఔట్ గా రివ్యూలో తేలింది. దీంతో చేసేదేమి లేక తిట్టుకుంటూ పాక్ కెప్టెన్ డకౌట్ చేరుకున్నాడు. 

అయితే ఈ వీడియోలో బంగ్లాదేశ్ కెప్టెన్ మెహిదీ హాసన్ చేసిన చర్యలపై క్రీడా అభిమానులు మండిపడుతున్నారు. ఇది క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని వారు వాదిస్తున్నారు. అయితే ఈ రనౌట్ విషయంలో పాక్, బంగ్లా కెప్టెన్ల మధ్య వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ వాదన మధ్య వికెట్ కీపర్ లిటన్ దాస్ కూడా చేరినట్లు వీడియోలో కనిపిస్తుంది. ఆ తర్వాత మిగిలిన ఆటగాళ్లు వాళ్లిద్దర్ని శాంతింపజేశారు. అయితే సల్మాన్ అలీ అఘా 62 బంతుల్లో 64 పరుగులు రాబట్టి రనౌట్‌గా నిలిచాడు.

ఇన్నింగ్స్ ప్రారంభంలో ఆధిపత్యం చూపించిన పాకిస్థాన్ జట్టు 50 ఓవర్లు చేరకముందే ఆలౌట్‌ అయ్యింది. 47.3 ఓవర్లలో 274 పరుగులకి కుప్పకూలిపోయింది. ప్రస్తుతం వర్షం కారణంగా ఈ మ్యాచ్‌లో రెండో ఇన్నింగ్స్ జాప్యం కలిగింది. ప్రస్తుతం బంగ్లాదేశ్ 6.3 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 27 పరుగులు చేసింది. అయితే డక్‌వర్త్ లూయిస్ ప్రకారం.. బంగ్లాదేశ్ గెలుపుకోసం మరో 216 రన్స్ చేస్తే సరిపోతుంది.

Also Read; Sadhvi Prachi Monalisa: "మోనాలిసా 35 ముక్కలుగా మారిపోతుంది..జాగ్రత్త!" 'లవ్ జిహాద్' పై సాధ్వీ ప్రాచీ కీలక వ్యాఖ్యలు!

Also Read: LPG Shortage: గ్యాస్ సిలిండర్ ఆదా చేసే అద్భుతమైన చిట్కాలు..ఈ చిన్న మార్పు చేస్తే నెల రోజుల సిలిండర్ 2 నెలల పనిచేస్తుంది!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

193
comment0
Report
Advertisement
Back to top