ఖమ్మంలో 4 కోట్ల గంజాయిని దహనం: ఎక్సైజ్ పోలీసుల శక్తివంతమైన చర్య!
Kamanchikal, Telangana:ఖమ్మం ఎక్సైజ్ పరిధిలోని నాలుగు పోలీస్ స్టేషన్ లో రికవరీ చేసిన రూ. 4 కోట్ల విలువైన గంజాయిని దహనం చేసారు. 1611.947 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్న ఎక్సైజ్ పోలీసులు నగరంలోని ఐఎన్టీసీ కాంప్లెక్స్ లో దహనం చేసినట్లు అసిస్టెంట్ కమీషనర్ జి. గణేష్ తెలిపారు. జిల్లా నుండి వివిధ ప్రాంతాలకు గంజాయి సరఫరా అవుతుండగా అడ్డుకుని ప్రభుత్వ అనుమతితో దహనం చేసామన్నారు.हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
AP Assembly Sessions: అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ అధినేత జగన్? ఆగస్టు 17న అసెంబ్లీలో అడుగుపెడతారా?
Vijayawada, Andhra Pradesh:YS Jagan AP Assembly Sessions: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 17 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయాలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. సమావేశాల వ్యూహం, పార్టీ ఎమ్మెల్యేల హాజరు, శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ నియామకంపై జగన్ పార్టీ నేతలతో ప్రత్యేకంగా చర్చించి స్పష్టతనిచ్చారు.
అసెంబ్లీ సమావేశాలు - జగన్ వ్యూహం
ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడం వల్ల తమ గొంతు నొక్కుతున్నారని, సభలో మాట్లాడే అవకాశం లేకుండా చేస్తున్నారని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశాలకు వెళ్లాలనుకునే ఎమ్మెల్యేలు హాజరుకావచ్చని ఆయన సూచించారు.
ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేసే క్రమంలో.. శాసనమండలిలో డీఎస్పీ (DSC) నియామకాలు, రాష్ట్రంలో శాంతిభద్రతల (Law & Order) తీరుపై తీవ్రంగా చర్చించాలని ఎమ్మెల్సీలను జగన్ ఆదేశించారు.
అయితే సభకు హాజరు కాని ఎమ్మెల్యేలపై ప్రభుత్వం వేటు వేస్తుందనే ప్రచారంపై స్పందిస్తూ.. ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తాము ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని జగన్ స్పష్టం చేసినట్లు సమాచారం.
శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్గా తూమాటి మాధవరావు
శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్గా బాధ్యతలు నిర్వర్తించిన జకియా ఖానం పదవీకాలం ముగియడంతో, ఆ స్థానానికి కొత్త అభ్యర్థి ఎంపిక అనివార్యమైంది. సీనియారిటీ, సామాజిక సమీకరణాలను బేరీజు వేసుకున్న వైఎస్ జగన్.. ఈ పదవికి తూమాటి మాధవరావు పేరును ఖరారు చేశారు. శాసనమండలిలో వైఎస్సార్సీపీకి స్పష్టమైన మెజారిటీ ఉండటంతో తూమాటి మాధవరావు ఎన్నిక ఏకగ్రీవంగా లాంఛనప్రాయం కానుంది.
మండలిలో పార్టీ తరఫున గట్టిగా గళం వినిపించే నేతగా గుర్తింపు ఉండటంతో ఆయనకు ఈ అవకాశం లభించింది. మరోవైపు, బీసీ వర్గానికి చెందిన మహిళా నేత వరుదు కల్యాణి పేరు కూడా పరిశీలనకు వచ్చినప్పటికీ, ఆమెను పార్టీ బాధ్యతల్లోనే కొనసాగించడం మంచిదని జగన్ భావించినట్లు తెలుస్తోంది.
Also Read: గోవింద నామాలతో వైసీపీ నేతలు పేరడీలు..ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహం!
Also REad: ఏపీ EAPCET 2026 సీట్ అలాట్మెంట్ విడుదల..ఆగస్టు 15లోపు ఈ పని చేయకపోతే సీటు రద్దు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
IND Vs SL Test Series: భారత్ Vs శ్రీలంక టెస్ట్ సిరీస్..మ్యాచ్ షెడ్యూల్ టైమింగ్స్, లైవ్ టెలికాస్ట్ ఎందులో?
Hyderabad, Telangana:IND Vs SL Test Series: టీ20 ప్రపంచకప్ 2026 ముగిసిన తర్వాత, భారత క్రికెట్ జట్టు పూర్తిగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) 2025-27 పై దృష్టి సారించింది. శుభ్మన్ గిల్ సారథ్యంలోని టీమిండియా.. ఆగస్టు 15 నుంచి శ్రీలంకతో రెండు మ్యాచ్ల ప్రతిష్టాత్మక టెస్ట్ సిరీస్లో తలపడనుంది. WTC పాయింట్ల పట్టికలో అగ్రస్థానం దిశగా దూసుకెళ్లేందుకు భారత్కు ఈ సిరీస్ ఎంతో కీలకం కానుంది.
భారత్ - శ్రీలంక టెస్ట్ సిరీస్ షెడ్యూల్
ఈ సిరీస్లో భాగంగా రెండు టెస్ట్ మ్యాచ్లు శ్రీలంకలోని ప్రముఖ వేదికల్లో జరగనున్నాయి. అన్ని మ్యాచ్లు భారత కాలమానం ప్రకారం ఉదయం 10:00 గంటలకు ప్రారంభమవుతాయి.
భారత్, శ్రీలంక టెస్ట్ సిరీస్లో భాగంగా రెండు మ్యాచ్లు జరగనున్నాయి. గాలే ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా తొలి టెస్ట్ మ్యాచ్ ఆగస్టు 15 నుంచి 19 వరకు జరగనుంది. అలాగే రాజధాని కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ వేదికగా ఆగస్టు 23 నుంచి ఆగస్టు 27 రెండో టెస్ట్ మ్యాచ్ జరగనుంది.
WTC పాయింట్ల పట్టిక దృష్ట్యా ప్రాధాన్యత
ఈ సిరీస్ WTC 2025-27 సైకిల్లో భాగం కావడంతో, రెండు మ్యాచ్ల్లోనూ విజయం సాధించడం భారత్కు అత్యవసరం. శ్రీలంక పిచ్లు సాధారణంగా స్పిన్ బౌలింగ్కు ఎక్కువగా సహకరిస్తాయి. కాబట్టి, భారత బ్యాటర్లకు లంక స్పిన్నర్ల నుంచి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది. విదేశీ గడ్డపై మెరుగైన ప్రదర్శన కనబర్చి, పాయింట్ల పట్టికలో తమ స్థానాన్ని మరింత సుస్థిరం చేసుకోవాలని టీమిండియా భావిస్తోంది.
లైవ్ టెలికాస్ట్, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు
క్రికెట్ అభిమానులు ఈ సిరీస్ను ప్రత్యక్షంగా వీక్షించడానికి కింద పేర్కొన్న ప్లాట్ఫామ్లను ఉపయోగించవచ్చు. ఈ క్రికెట్ మ్యాచ్లను బుల్లితెరలో సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్ ఛానల్స్లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. అలాగే ఓటీటీ ప్రేక్షకుల కోసం సోనీలివ్ యాప్ లేదా వెబ్సైట్లో డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది.
Also Read: ముంబై ఇండియన్స్ కెప్టెన్గా హార్దిక్ పాండ్యా కొనసాగింపు! ఐపీఎల్ ట్రేడింగ్లో షాకింగ్
Also REad; క్రికెట్ ప్రపంచకప్ 2027 రేసు నుంచి ఆ రెండు టీమ్స్ ఔట్?! టీమ్ఇండియా పరిస్థితి ఏంటంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Pocharam Uturn: రేవంత్ రెడ్డికి భారీ షాక్.. ఫిరాయింపు ఎమ్మెల్యే పోచారం తిరుగుబాటు
Banswada, Telangana:Pocharam Srinivas Reddy Big Twist And Sensational Comments On Revanth Reddy At BanswadaBest Independence Day Songs: స్వాతంత్ర్య దినోత్సవం ఎవర్ గ్రీన్ టాప్ 5 సాంగ్స్..
Hyderabad, Telangana:Independence Day Songs: స్వాతంత్ర్య దినోత్సవాన్ని భారతదేశ వ్యాప్తంగా ఎంతో ఘనంగా జరుపుకుంటారు. అంతేకాకుండా ఈ రోజు ప్రతి ఒక్కరి గుండెల్లో దేశభక్తి ఉప్పొంగుతుంది. దేశ వ్యాప్తంగా ఉన్న ప్రతి గల్లీలో త్రివర్ణ పతాకాన్ని ఎగరేస్తూ ఉంటారు. అంతేకాకుండా ఈ సమయంలో చాలా మంది ప్రజల్లో దేశభక్తిని నింపేందుకు దేశభక్తి గీతాలను స్పీకర్స్లో పెడుతూ ఉంటారు.. ప్రతి భారతీయుడి రోమాలు నిక్కబొడుచుకునేలా చేసి.. దేశభక్తిని పెంచే ఎవర్ గ్రీన్ టాప్ 5 తెలుగు పాటల క్రియాశీలక పాత్ర పోషిస్తూ ఉంటాయి. ఏ గల్లీకి వెళ్లిన ఈ పాటలు వినిపిస్తునే ఉంటాయి. అయితే, ఈ టాప్ 5 పాటలేంటో వాటికి సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
టాప్ 5 సాంగ్స్ ఇవే..
పుణ్యభూమి నా దేశం (మేజర్ చంద్రకాంత్)..
Punyabhumi Nadesam అంటూ ప్రారంభమయ్యే.. ఈ సాంగ్ దేశభక్తి గీతాల్లో అగ్రస్థానంలో ఉంటుంది.. నందమూరి తారక రామారావు అద్భుత నటనతో పాటు SP బాలసుబ్రహ్మణ్యం పాడిన ఈ పాట.. భారతీయ చరిత్రను, ఎందరో వీరుల త్యాగాలను కళ్లకు కట్టినట్లు చూపించేలా చేస్తుంది.. అంతేకాకుండా గుండెల్లో దేశభక్తిని కూడా నింపుతుంది..
భారత మాతకు జేజేలు (బడి పంతులు)
Bharatha Maathaku Jejelu అనే ఈ పాట దశాబ్దాలు గడుస్తున్నా చెరగని ముద్ర వేసిందిగా భావించవచ్చు. స్వాతంత్ర్య దినోత్సవ ఉత్సవాల్లో ఎక్కువగా వినిపించే గీతాల్లో కూడా ఇది ఒకటి.. మన దేశ పవిత్రతను స్మరించుకుంటూ ప్రతి పాఠశాల వేడుకల్లో ఈ పాట నేటికీ మారుమోగుతూనే ఉంటుంది.
వందేమాతరం (వందేమాతరం)
ప్రముఖ యాక్టర్ డాక్టర్ రాజశేఖర్ నటించిన.. ఈ Vande Mataram సినిమాలోని టైటిల్ సాంగ్ యువతలో అంతులేని ఆవేశాన్ని నింపడమే కాకుండా.. సమాజం పట్ల బాధ్యతను పెంచేందుకు ఎంతగానో సహాయపడుతుంది.. చాలా చోట్ల కూడా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో యువతలో దేశభక్తి నింపేందుకు ఈ పాటను పెడుతూ ఉంటారు..
నేను సైతం ప్రపంచాగ్నికి (ఠాగూర్)
మహాకవి శ్రీశ్రీ రాసిన మహా ప్రస్థానంలోని కవితా పాదాల నుంచి సేకరించి.. చిరంజీవి ఠాగూర్ సినిమాలో వినిపించిన అద్భుతమైన పాట.. సామాన్యుడిలో సైతం సామాజిక బాధ్యతను తట్టిలేపేందుకు ఈ పాట ఎంతగానో సహాయపడుతుంది.. దేశం కోసం మనవంతు పాత్ర పోషించాలనే స్ఫూర్తిని ఈ గీతం నింపుతుంది. ఇప్పటికీ ఈ పాటను చాలా చోట్ల వేడుకల్లో పెడుతూ ఉంటారు..
Vande Mataram
ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ A. R. రెహమాన్ ఆల్బమ్స్లో Vande Mataram సాంగ్ కూడా ఇప్పటికీ స్కూల్స్లో ఈ స్వతంత్ర దినోత్సవం వేడుకల్లో వినిపిస్తునే ఉంటుంది. సోనీకి సంబంధించిన మ్యూజిక్ నాన్-ఫిల్మ్ ఆల్బమ్లో ఇది ఎక్కువగా అమ్ముడైన్నట్లు కూడా రికార్డ్ ఉంది. ఇది 12 ఆగస్టు 1997న విడుదలైంది. ఈ పాట కూడా భారత ప్రజల్లో దేశభక్తి నింపుతుంది.
Also Read: బంగాళాఖాతంలో వేగంగా మారుతున్న వాతావరణం..తెలుగు రాష్ట్రాలకు తుఫాన్ ముప్పు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Nara Lokesh Resign: నారా లోకేశ్ రాజీనామా కోరుతూ నగరిలో మాజీ మంత్రి రోజా భారీ నిరసన
Nagari, Andhra Pradesh:Former Minister RK Roja Protest In Nagari For Nara Lokesh Resign Watch Her Speechయూట్యూబర్లు, పోశమ్మ తల్లి, జగిత్యాల, గాయనీగాయకులు,
Jagtial, Telangana:Youtubers Offers Bonalu To Goddess Posamma In Jagtial Watch VisualsKhelo India Games 2026: హైదరాబాద్లో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026.. తెలంగాణ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు
Hyderabad, Telangana:Govt of Telangana: దేశీయంగా జరిగే ప్రతిష్టాత్మక క్రీడా పోటీలు ఖేలో ఇండియా యూత్ గేమ్స్-2026కు తెలంగాణ ఆతిథ్యం ఇస్తుండగా.. ఈ క్రీడా పోటీలకు భారీ ఏర్పాట్లు చేయడంలో తెలంగాణ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేయనుంది. తెలంగాణ ప్రభుత్వం ఆతిథ్యం ఇవ్వనున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026 పోటీలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ లోని స్టేడియంలలో ప్రస్తుత పరిస్థితిని పరిశీలించి, క్రీడా పోటీలకు అనుగుణంగా శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు
హైదరాబాద్ ఎంసీఆర్ హెఆర్డీలోని బోధి పెవిలియన్లో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఏర్పాట్లు, నిర్వహణపై క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరితోపాటు క్రీడా శాఖ ఉన్నతాధికారులతో మంగళవారం ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఖేలో ఇండియా జాతీయ స్థాయిలో వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున క్రీడాకారులు ఈ పోటీపడుతుండడంతో వాటికి సంబంధించి మౌలిక వసతులను అభివృద్ధి చేయాలని సీఎం సూచించారు. డిసెంబర్లో ఖేల్ ఇండియా పోటీలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
ఖేలో ఇండియా క్రీడా పోటీల సందర్భంగా హైదరాబాద్లోని స్టేడియంలలో ప్రస్తుత పరిస్థితిని పరిశీలించి క్రీడా పోటీలకు అనుగుణంగా శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికార యంత్రాంగానికి ఆదేశించారు. దీనిక అవసరమైన నిధులను అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు. ఖేలో ఇండియా క్రీడా పోటీల ప్రారంభోత్సవ, ముగింపు వేడుకలకు సంబంధించిన ముఖ్య అతిథులు, ప్రముఖ క్రీడాకారులు, సినీ ప్రముఖులను కార్యక్రమాల్లో భాగస్వాములను చేసేందుకు వెంటనే కసరత్తు ప్రారంభించాలని సూచించారు.
ఈ క్రీడా పోటీల సందర్భంగా మౌలిక వసతులు, క్రీడల నిర్వహణ, అతిథులకు కావాల్సిన సౌకర్యాల ఏర్పాట్లకు సంబంధించి పని విభజన చేసుకుని బాధ్యత తీసుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి తెలిపారు. తెలంగాణకు చెందిన అర్జున అవార్డు గ్రహీతలు, తెలంగాణ స్పోర్ట్స్ హబ్ బోర్డు సభ్యులు, ఒలింపిక్స్ అసోసియేషన్తో పాటు జాతీయస్థాయి క్రీడా ప్రతినిధులను ఈ క్రీడా పోటీల్లో భాగస్వాములను చేయాలని సూచించారు. ఖేలో ఇండియా గేమ్స్ కోసం ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేయాలని స్పష్టం చేశారు. ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో భాగంగా 20 రకాల క్రీడలకు సంబంధించిన పోటీలు నిర్వహించనున్న నేపథ్యంలో క్రీడా విభాగాల వారీగా పోటీ ప్రదేశాలను గుర్తించి ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. క్రీడా స్ఫూర్తిని చాటేలా నిర్వహణ ఉండాలని అధికార యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలు చేశారు.
Tragedy Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ఆటోను ట్యాంకర్ ఢీకొట్టడంతో ఏడుగురు దుర్మరణం
Mallikarjunpally, Telangana:Sangareddy District Accidents: కూలీలతో వెళ్తున్న ఆటోను ట్యాంకర్ ఢీకొట్టడంతో ఘోర ప్రమాదం సంభవించింది. ఈ రోడ్డు ప్రమాదంలో ఏడుగురు కార్మికులు దుర్మరణం పాలయ్యారు. మరికొందరు క్షతగాత్రులయ్యారు. సంగారెడ్డి జిల్లాలో ఈ సంఘటన తీవ్ర విషాదం అలుముకుంది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం సత్వార్ గ్రామం సమీపంలో యూటర్న్ తీసుకుంటున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతులు కర్ణాటక రాష్ట్రం బీదర్ జిల్లా రాజగిరి గ్రామానికి చెందినవారిగా గుర్తించారు.
ఆటోలో డ్రైవర్ సహా మొత్తం 12 మంది కూలీలు ఉన్నారు. ప్రతి రోజు కూలీ పని కోసం జహీరాబాద్ పరిసర ప్రాంతాలకు వస్తుంటారు. గాయాలపాలైన మిగతా వారిని జహీరాబాద్లోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. వారికి వెంటనే వైద్యులు అత్యవసర వైద్యం అందిస్తున్నారు. ట్యాంకర్ కర్ణాటక రాష్ట్రం హుమనాబాద్ నుంచి జహీరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది.
తెలంగాణ సీఎం సంతాపం
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం సత్వార్ గ్రామ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.
మరో ప్రమాదం
సంగారెడ్డి జిల్లాలో మరో రోడ్డు ప్రమాదం సంభవించి ఇద్దరు మృతిచెందారు. మూడు కార్లు ఢీకొనడంతో ఇద్దరు ప్రాణాలు విడవగా.. మరికొందరు గాయపడ్డారు. కోహీర్ మండలం వెంకటాపూర్ కూడలి సమీపంలో జాతీయ రహదారిపై ఓ కారు అదుపు తప్పి అవతలి రోడ్డుపైకి ఎగిరి పడింది. ఆ రోడ్డుపై వెళ్తున్న కారుతోపాటు మరికొన్ని వాహనాలను ఢీకొట్టింది. దీంతో ఇద్దరు దుర్మరణం చెందగా.. కొందరు గాయపడ్డారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను, క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై కొంత వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
కంపెనీలో ప్రమాదం.. ఒకరు మృతి
పటాన్చెరు మండలం రుద్రారం గ్రామంలోని యంఎస్ఎన్ కంపెనీలో ప్రమాదం చోటుచేసుకుంది. కంపెనీ ప్రమాదంలో వెంకటేశ్వర్లు (45) అనే ఉద్యోగి తీవ్ర గాయాలతో మృతిచెందాడు. కొన్ని సంవత్సరాలుగా ఎంఎస్ఎన్ కంపెనీలో రెగ్యులర్ ఎంప్లాయ్గా వెంకటేశ్వర్లు పనిచేస్తుండేవాడు. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం హైదరాబాద్ కంచన్బాగ్లోని డీఆర్డీఓ అపోలో హాస్పిటల్కు తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. ప్రమాదానికి గల పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Hyderabad Metro: హైదరాబాద్ పాతబస్తీ మెట్రో రైలుపై తెలంగాణ సీఎం కీలక నిర్ణయం
Hyderabad, Telangana:Old City Metro Rail: హైదరాబాద్లోని పాతబస్తీ రూపురేఖలు మార్చే మెట్రో రైలు ప్రాజెక్టుపై తెలంగాణ ముఖ్యమంత్రి కీలక నిర్ణయం తీసుకున్నారు. దశాబ్ద కాలంపైగా పెండింగ్లో ఉన్న పాతబస్తీ మెట్రో రైలు ప్రాజెక్టుపై వెంటనే చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ మెట్రో విస్తరణ రెండో దశలో భాగంగా పాతబస్తీ మెట్రో రైల్ పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. 7.5 కిలోమీటర్ల మెట్రో విస్తరణ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (హెచ్ఎంఆర్ఎల్)పై మంగళవారం హైదరాబాద్లో ముఖ్యమంత్రి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. పాతబస్తీ మెట్రో నిర్మాణంపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్న అనంరతం ముఖ్యమంత్రి పలు ఆదేశాలిచ్చారు. ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు 7.5 కిలోమీటర్ల మెట్రో విస్తరణ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని.. ఈ కారిడార్లో పనులకు సంబంధించిన టెండర్ ప్రక్రియను ప్రారంభించాలని ఆదేశించారు. పెండింగ్లో ఉన్న భూ సేకరణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. హైదరాబాద్ మెట్రోకు పెరుగుతున్న ప్రయాణికుల రద్దీ తీవ్రమవుతుండడంతో అదనపు కోచ్లను జత చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. దీనికి అవసరమైన కోచ్ల కొనుగోలు ప్రక్రియకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట కారిడార్కు సంబంధించి సాంకేతికతపై ఢిల్లీ మెట్రోను సంప్రదించి, అవసరమైన సలహాలు తీసుకోవాలని సూచించారు.
అనంతరం డిసెంబర్లో నిర్వహించనున్న 'ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్'పై ముఖ్యమంత్రి సమీక్ష చేశారు. తెలంగాణలో పెట్టుబడులను మరింతగా ఆకర్షించేలా ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్నామని.. దానికి అవసరమైన ఏర్పాట్లు చేపట్టాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. వ్యాపార రంగంలోని వివిధ సెక్టార్లలో గుర్తింపు పొందిన ప్రముఖులను సమ్మిట్లో సన్మానించేలా కార్యాచరణ రూపొందించాలని.. తెలంగాణలో పెట్టుబడులను ఆకర్షించేలా అంతర్జాతీయ ప్రమాణాలతో సమ్మిట్ ఏర్పాట్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. గతేడాది నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్తో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు.. వాటి పురోగతికి సంబంధించిన పూర్తి వివరాలను నివేదించాలని చెప్పారు. పెట్టుబడుల్లో మరింత పురోగతి సాధించేందుకు అవసరమైన ప్రణాళికలను తయారు చేయాలని ముఖ్యమంత్రి అధికార యంత్రాంగానికి సూచించారు.
KTR: కొండల్ రెడ్డికి భూమి కేటాయింపు అతిపెద్ద కుంభకోణం.. పోరాటం చేస్తాం: కేటీఆర్
Hyderabad, Telangana:Revanth Reddy Brothers: అధికారం ఉంది కదా అని ఇష్టారీతిన భూకేటాయింపులు చేసుకుంటున్నారని.. అప్పనంగా కోట్ల విలువైన భూములు చవకగా పొందుతున్నారని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు. రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్ రెడ్డికి రూ.200 కోట్ల విలువైన భూమి రూ.7 కోట్లకు ఎలా కేటాయించని ప్రశ్నించారు. ఇది అతిపెద్ద కుంభకోణం అని.. అనుముల కొండల్ రెడ్డి వ్యవహారంపై పోరాటం చేస్తామని మాజీ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. త్వరలోనే గవర్నర్ను కలిసి ఫిర్యాదు చేస్తామని తెలిపారు.
హైదరాబాద్లోని బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్లో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియా సమావేశం నిర్వహించి కీలక వ్యాఖ్యలు చేశారు. 'తెలంగాణలో టెసరాక్ట్ అనే కంపెనీకి అప్పనంగా భూమి కేటాయించారు. టెసరాక్ట్ కంపెనీకి రేవంత్ సోదరుడు కొండల్ రెడ్డి చైర్మన్. ఆ విషయాన్ని కొండల్ రెడ్డే లింక్డ్ ఇన్ ప్రొఫైల్లో పెట్టుకున్నారు. టెసరాక్ట్ కంపెనీ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పరికరాలను తయారు చేస్తుందట. అమెరికా ఎంబసీ ప్రతినిధితో హైదరాబాద్లో మీటింగ్ కూడా పెట్టారు. యూఎస్ ఇండియా స్ట్రాటెజిక్ డెవలప్మెంట్ ఫోరంలో ఎగ్జిక్యూటివ్ బోర్డులో కొండల్ రెడ్డికి సభ్యత్వం ఇచ్చారు' అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వివరించారు. కొండల్ రెడ్డి ఏం చదివారో నాకు తెలియదని పేర్కొన్నారు.
🚨🕵️♂️ అనుముల బ్రదర్స్ 200 కోట్ల భారీ భూ స్కాం!
అధికారాన్ని అడ్డం పెట్టుకుని..
సొంత తమ్ముడు కొండల్ రెడ్డికి
అత్యంత విలువైన ప్రభుత్వ భూమిని
కట్టబెట్టిన రేవంత్ రెడ్డి.#SCAMgress #CongressLootingTelangana pic.twitter.com/Q1NmMCs9M2— BRS Party (@BRSparty) August 11, 2026
టెసరాక్ట్ కంపెనీకి కొండల్ రెడ్డి చైర్మన్ అని అమెరికా కాన్సులేట్ కూడా స్టేట్మెంట్ ఇచ్చింది. చదువురాని రేవంత్ బ్రదర్స్ అందరూ సూట్లు కోట్లు వేసుకుని చైర్మన్లు అయిపోతున్నారు. టెసరాక్ట్ కంపెనీ కథ ఏమిటని మేం ఆరా తీశాం. ఆ కంపెనీ ఫోన్ నంబర్ 123456789. ఇలాంటి నంబర్లు ఉంటాయని మాకు తెలియదు. రేవంత్ ఏదైనా కొత్త టెక్నాలజీ కనిపెట్టిండేమో?' అని మాజీ మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. విచిత్రం ఏంటంటే టెసరాక్ట్ కంపెనీలో ఒక్క ఉద్యోగి కూడా లేడని చెప్పారు.
'2025 మార్చి 31 నాడు వాళ్లే ప్రకటన చేశారు. తమ కంపెనీలో ఒక్క ఉద్యోగి కూడా లేడని చెప్పారు. ఊరూ పేరు లేని చోట ఆ కంపెనీ అడ్రస్ ఉంది. టెసరాక్ట్ మూలధనం లక్ష రూపాయలు. ఈ కంపెనీకి రేవంత్ ప్రభుత్వం రూ.200 కోట్ల విలువైన భూమి కట్టబెట్టింది. ఐదెకరాల భూమిని కేటాయించి, అతిపెద్ద కుంభకోణానికి పాల్పడ్డారు. ఇది అనుముల కొండల్ రెడ్డి వ్యవహారం' అని కేటీఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు.
రేవంత్ రెడ్డి కుటుంబం నడుపుతున్న పాలనే ప్రజా పాలనా?
తిరుపతి రెడ్డికి ఏ అధికారం లేకపోయినా.. కలెక్టర్, ఎస్పీల సమక్షంలో కొడంగల్లో ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు.
రేవంత్ అల్లుడి కోసం, ఆయన పార్ట్నర్గా ఉన్న కంపెనీ కోసం, కొడంగల్లోని లగచర్లలో గిరిజనుల భూములను… pic.twitter.com/3j6ZkBYCht
— BRS Party (@BRSparty) August 11, 2026
అనుముల జగదీష్ రెడ్డి అని రేవంత్ రెడ్డికి ఇంకో తమ్ముడు ఉన్నాడు. జగదీష్ రెడ్డి అమెరికాలో ఉంటాడు. రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు పోయినప్పుడు రూ.వెయ్యి కోట్ల డీల్ చేసుకున్నారు. స్వచ్ఛ్ బయో అనే కంపెనీతో ఒక మెమోరాండం సైన్ చేశారు. వాళ్లకు ఎక్కడ భూములు ఇచ్చారో తవ్వి తీస్తాం. రేవంత్ బామ్మర్ది సృజన్ రెడ్డికి రూ.1,137 కోట్ల అమృత్ కాంట్రాక్టు దక్కింది. రేవంత్ రెడ్డి, మోదీ ప్రభుత్వం కలిసి నడుపుతున్న సింగరేణిలో.. సృజన్ రెడ్డి కనుసన్నల్లోనే అంతా నడుస్తోంది. సైట్ విజిటేషన్ సర్టిఫికెట్లు, వేల కోట్ల కుంభకోణాలు అన్నీ బయటపెట్టాం' అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వివరించారు.
'ఈ పరంపరలో మేం బయటపెట్టిన తాజా కుంభకోణమే టెసరాక్ట్. వడ్డించే వాడే మనోడే అన్నట్టు భూములు కొట్టేశారు. రూ.200 కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాన్ని రూ.7 కోట్లకు రాసిచ్చారు. ఇది కుంభకోణం కాదా? పక్క రాష్ట్రం కర్ణాటకలో ఒక న్యాయం, ఇక్కడ ఒక న్యాయమా?' అని మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. టెసరాక్ట్ కథేంటో తేల్చేదాకా వదిలిపెట్టమని స్పష్టం చేశారు. 'ఆ కంపెనీకి, రేవంత్ రెడ్డి సోదరుడికి ఏ సంబంధం లేదని శ్రీధర్ బాబు అంటున్నడు. చైర్మన్ అనుముల కొండల్ రెడ్డి అని వాళ్లే ప్రొఫైల్లో రాసుకున్నారు. కానీ మంత్రి శ్రీధర్ బాబు సిగ్గులేకుండా బుకాయిస్తున్నారు. అసలు ఇవన్నీ మంత్రికి తెలిసి జరుగుతున్నాయా?' అని కేటీఆర్ సందేహం వ్యక్తం చేశారు.
చదువూ సంధ్యా లేని అనుముల అన్నదమ్ములు..
కోట్లు, సూట్లు వేసుకుని కొత్త దందాలకు తెరలేపారు.అనుముల కొండల్ రెడ్డి చైర్మన్గా ఉన్న 'టెసారాక్ట్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్' అనే దొంగ కంపెనీకి,
రూ. 200 కోట్ల విలువైన భూమిని అతి చౌకగా రేవంత్ రెడ్డి దోచిపెట్టాడు.ఆ కంపెనీకి ఊరూ పేరూ లేదు,… pic.twitter.com/d4LkIEn6v1
— BRS Party (@BRSparty) August 11, 2026
మీ శాఖలో ఏం జరుగుతుందో మీకు తెలుస్తుందా శ్రీధర్ బాబు అని మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. ఈ భూకేటాయింపుల కుంభకోణంలో ఎవరినీ వదిలిపెట్టమని హెచ్చరించారు. ముఖ్యమంత్రి సోదరులైతే ఏమైనా చేయొచ్చా? అని రేవంత్ రెడ్డి సోదరులపై మండిపడ్డారు. రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డికి ఏ అధికారిక హోదా ఉందని నిలదీశారు. ఎందుకు అతడికి కలెక్టర్లు, ఎస్పీలు వంగివంగి దండాలు పెడుతున్నారని ప్రశ్నించారు.
Tirumala: తిరుమలలో నిర్మాత నాగవంశీ, దర్శకుడు మురళీ కిశోర్
Dharmavaram, Andhra Pradesh:Film Producer Naga Vamsi And Director Murali Kishore Abburu Visits Tirumala TempleAbishek Porel: ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ క్రికెటర్ అభిషేక్ పరేల్ అరెస్ట్.. ఎందుకో తెలుసా?
Kolkata, West Bengal:Abishek Porel Arrest: పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడనే ఆరోపణలపై ఐపీఎల్ ఢిల్లీ క్యాపిటల్స్ స్టార్ ఆటగాడు అభిషేక్ పరేల్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అత్యాచారం, క్రిమినల్ బెదిరింపులు, దాడి తదితర తీవ్రమైన ఆరోపణలు ఓ యువతి చేయగా.. అతడిపై పోలీసులకు ఓ వైద్య విద్యార్థిని ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. అయితే హైకోర్టులో ఈ కేసుపై విచారణ జరగ్గా అభిషేక్ను అరెస్ట్ చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. న్యాయస్థానం ఆదేశాలతో యువ క్రికెటర్ అభిషేక్ పరేల్ను అరెస్ట్ చేయడం క్రికెట్ రంగంలో కలకలం రేపుతోంది.
ఏం జరిగింది..?
అభిషేక్ పరేల్ తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి లైంగిక సంబంధం ఏర్పరచుకున్నాడని.. తర్వాత బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఓ మెడికల్ విద్యార్థిని డమ్ డమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. జూన్లో వైద్య విద్యార్థిని ఫిర్యాదు మేరకు అభిషేక్పై క్రిమినల్ కేసు నమోదైంది. అత్యాచారం, క్రిమినల్ బెదిరింపులు, దాడి తదితర తీవ్రమైన ఆరోపణలు ఆ యువతి చేసింది. అభిషేక్తో తనకు మూడేళ్లు తాను సంబంధం కొనసాగిస్తున్నట్లు.. గతేడాది నుంచి ఇద్దరి మధ్య విభేదాలు మొదలయ్యాయని ఆ యువతి ఆరోపణలు చేసింది.
Indian cricketer and Delhi Capitals wicketkeeper-batter Abishek Porel arrested on Tuesday in connection with a case involving allegations of sexual relations on the promise of marriage. pic.twitter.com/AJs6qD7KdK
— Taanusree Bose তণুশ্রী বোস (@tanvibose) August 11, 2026
అనంతరం కేసులో పోరెల్ను అరెస్ట్ చేయాలని కోల్కతా హైకోర్టు పోలీసులను ఆదేశించింది. దీంతో ఎమామి సిటీలో పోలీసులు అభిషేక్ను అరెస్టు చేసినట్లు హుగ్లీ రూరల్ పోలీస్ ఎస్పీ కున్వర్ భూషణ్ సింగ్ ప్రకటించారు.
Pawan Kalyan Govinda Namalu: గోవింద నామాలతో వైసీపీ నేతలు పేరడీలు..ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర ఆగ్రహం!
Nellore, Andhra Pradesh:Pawan Kalyan Govinda Namalu News: తిరుమల శ్రీవారిని భక్తిశ్రద్ధలతో కొలుస్తూ ఆలపించే పవిత్ర దైవ నామాలు, భక్తి గీతాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) నేతలు పేరడీలుగా మలచి ఆలపించడంపై జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తీవ్రంగా మండిపడ్డారు. నెల్లూరులో ఇటీవల నిర్వహించిన ఒక నిరసన కార్యక్రమంలో వైకాపా నేతలు వ్యవహరించిన తీరు ధార్మిక విశ్వాసాలను కించపరిచేలా ఉందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ మేరకు జనసేన పార్టీ అధికారిక 'ఎక్స్'(ట్విట్టర్) వేదికగా ఈ విషయాలను వెల్లడించింది. ఈ ఘటనపై తగిన చట్టపరమైన చర్యలతో ముందుకు వెళ్లాలని పార్టీ శ్రేణులకు ఆయన దిశానిర్దేశం చేసినట్లు పార్టీ పేర్కొంది.
భక్తుల మనోభావాలను దెబ్బతీసే కుట్ర: పవన్ కల్యాణ్
ఈ సందర్భంగా వైకాపా నేతల తీరును తప్పుపడుతూ పవన్ కల్యాణ్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కని పార్టీ, కేవలం రాజకీయ లబ్ధి కోసం పవిత్రమైన గోవింద నామాలను పేరడీలుగా మలచడం అత్యంత దురదృష్టకరమని ఆయన పేర్కొన్నారు.
ఇది కోట్ల మంది భక్తుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచేలా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆ కార్యక్రమంలో పాల్గొన్నవారు వ్యవహరించిన తీరు పూర్తిగా మత విద్వేషాలను రెచ్చగొట్టేలా, కుట్రపూరిత ఆలోచనలతో కూడినదిగా ఉందని ఆయన ధ్వజమెత్తారు.
చట్టపరమైన చర్యలకు ఆదేశం
సమాజంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా, ధార్మిక విశ్వాసాలను అపహాస్యం పాలుజేసే సంస్కృతిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించకూడదని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. దైవ నామాలు, భక్తి కీర్తనలను కేవలం రాజకీయ విమర్శల కోసం, అపహాస్యం కోసం వాడుకునే విధానాన్ని ప్రతి ఒక్కరూ విడనాడాలని ఆయన హితవు పలికారు.
ఈ ఘటనకు బాధ్యులైన వారిపై నిబంధనల ప్రకారం చట్టపరంగా తగిన చర్యలు తీసుకోవాలని పార్టీ నేతలను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అప్రమత్తం చేశారు. హిందూ ధర్మం, భక్తుల మనోభావాల పరిరక్షణకు జనసేన పార్టీ ఎప్పుడూ ముందుంటుందని స్పష్టం చేస్తూ, ఈ వివాదం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Also Read: ఏపీ EAPCET 2026 సీట్ అలాట్మెంట్ విడుదల..ఆగస్టు 15లోపు ఈ పని చేయకపోతే సీటు రద్దు!
Also REad: యూపీఐ లావాదేవీలపై భారీగా ఛార్జీలు?! అదనపు ఛార్జీలపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
స్కూల్ ఫీజుల పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. 5శాతం మాత్రమే పెంచేందుకు బిల్లు ఆమోదం..!!
Lakshmapur, Telangana:School Fees: పాఠశాల ఫీజుల పెంపునకు సంబంధించి పంజాబ్ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాల ఫీజులను కేవలం 5శాతం మాత్రమే పెంచడానికి అనుమతించిన బిల్లును రాష్ట్ర అసెంబ్లీ సోమవారం ఏకగ్రీవకంగా ఆమోదించింది. 'పంజాబ్ రెగ్యులేషన్ ఆఫ్ ఫీస్ ఆఫ్ అన్ఎయిడెడ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ (సవరణ) బిల్లు, 2026'కు సోమవారం ఆమోదం తెలిపింది. ఈ బిల్లు ప్రకారం, రాష్ట్రంలోని అన్ఎయిడెడ్ పాఠశాలలు, ఇతర విద్యాసంస్థలు ప్రతి సంవత్సరం ఫీజులను 5శాతం కంటే ఎక్కువగా పెంచకూడదు.
ప్రస్తుతం పంజాబ్ లో వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సందర్బంగా బిల్లును రాష్ట్ర విద్యాశాఖ మంత్రి హర్జోత్ సింగ్ బెయిన్స్ లో సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ఏకగ్రీవకంగా ఆమోదం పొందింది. రాష్ట్రంలోని ప్రైవేట్ పాఠశాలలు ప్రతి ఏడాది 5శాతం మాత్రమే ఫీజులు పెంచాలి. దీంతో ప్రైవేట్ స్కూల్స్ లో చదువుకునే విద్యార్థుల తల్లిదండ్రులకు భారీగా ఉపశమనం లబిస్తుందని ముఖ్యమంత్రి భగవంత్ మన్ అన్నారు. ఈ నిర్ణయం అన్ని రకాల ఫీజులకు వర్తిస్తుంది. ట్యూషన్ ఫీజులు, అభివృద్ధి ఫీజులు, వార్షిక రుసుములు, యాక్టివిటీ ఛార్జీలు, స్మార్ట్ క్లాస్ ఫీజులు, టెక్నాలజీ ఛార్జీలు, రవాణా ఛార్జీలు, ల్యాబ్ ఫీజులు, లైబ్రరీ ఫీజులు, పరీక్షల ఛార్జీలు మొదలైనవాటిని కేవలం ఐదు శాతం మాత్రమే పెంచాలి.
ఇతర ఫీజులు వసూలు చేసినట్లయితే, వాటిని ఐదు శాతానికి మించి పెంచకూడదు. ప్రస్తుతం పంజాబ్లో 7,800 వరకు ప్రైవేట్ పాఠశాలలు ఉండగా, వాటిలో 32 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ప్రతి సంవత్సరం, విద్యా సంస్థలు తమ ఇష్టానుసారం ఫీజులను పెంచుతున్నాయి. దీనివల్ల తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. భారీ ఫీజుల నుంచి తల్లిదండ్రులను విముక్తి చేసేందుకు ఈ బిల్లును ప్రభుత్వం రూపొందించింది. ఒకవేళ అదనపు ఫీజులు వసూలు చేసినా.. వాటిని యాజమాన్యం నుండి తిరిగి రాబట్టడం జరుగుతుంది. ఈ నిర్ణయం ప్రకారం, మూడేళ్ల కాలంలో ఫీజులు 15 శాతానికి మించి పెరగకూడదు.
Also Read:ఎస్బీఐలో 1,538 ఉద్యోగాలు.. డిగ్రీ అర్హతతో భారీ నోటిఫికేషన్.. దరఖాస్తు వివరాలు ఇవే..!!
Also Read:ఏమిటీ 'సావోజీ మటన్'? ఒకే ఒక్క కామెంట్తో రగిలిన వివాదం.. మహారాష్ట్రలో ఎందుకీ తీవ్ర దుమారం..?
Also Read: రోజూ ఈ గింజలు తింటే కిలో మటన్ తినంత బలం..!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
