ఖమ్మంలో 4 కోట్ల గంజాయిని దహనం: ఎక్సైజ్ పోలీసుల శక్తివంతమైన చర్య!
Kamanchikal, Telangana:ఖమ్మం ఎక్సైజ్ పరిధిలోని నాలుగు పోలీస్ స్టేషన్ లో రికవరీ చేసిన రూ. 4 కోట్ల విలువైన గంజాయిని దహనం చేసారు. 1611.947 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్న ఎక్సైజ్ పోలీసులు నగరంలోని ఐఎన్టీసీ కాంప్లెక్స్ లో దహనం చేసినట్లు అసిస్టెంట్ కమీషనర్ జి. గణేష్ తెలిపారు. జిల్లా నుండి వివిధ ప్రాంతాలకు గంజాయి సరఫరా అవుతుండగా అడ్డుకుని ప్రభుత్వ అనుమతితో దహనం చేసామన్నారు.हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
Cobra Video: ప్రాణాలకు తెగించి నాగుపాము నోటిని సూది, దారంతో కుట్టేసిన వృద్ధుడు.. వీడియో..
Hyderabad, Telangana:Cobra Mouth Stitching Video Watch Now: సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రతిరోజు ఎన్నో రకాల వింతలతో పాటు విశేషాలు ప్రమాదకరమైన వీడియోలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. అయితే తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో చూస్తే.. మాత్రం ఎవరికైనా ఆశ్చర్యం కలగడం ఖాయం. అత్యంత విషపూరితమైన, ప్రమాదకరమైన ఒక పెద్ద నాగుపామును ఒక వృద్ధుడు పట్టుకొని చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర సంచలనంగా మారింది. ఈ వీడియో చూసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
సూదితో పాము నోరు కుట్టేసిన వృద్ధుడు..
సాధారణంగా నాగుపాము పేరు చెబితేనే జనాలు ఆమడ దూరం పరిగెడుతూ ఉంటారు.. ఇక పిరికివారైతే ఎక్కడ పాము ఉంటే అక్కడికి కిలోమీటర్ దూరంలోకి పరిగెడుతూ ఉంటారు.. అలాంటిది ఈ వైరల్ అవుతున్న వీడియోలో ఒక వృద్ధుడు ఏ మాత్రం భయం లేకుండా.. ఒక అత్యంత ప్రమాదకరమైన నాగుపామును పట్టుకున్నాడు. అంతటితో ఆగకుండా అతను.. ఆ పాము తలభాగాన్ని గట్టిగా నొక్కి పట్టి.. ఒక చేతిలోకి సూదితో పాటు దారం తీసుకున్నాడు.. పాము విలవిలలాడుతున్నప్పటికీ సరే.. ఏమాత్రం జాలి లేకుండా దాని మూతి భాగాన్ని సూదితో పొడుస్తూ.. దారంతో నోటిని కొట్టడం ప్రారంభించాడు..
ఆ వృద్ధుడు సూదితో పొడుస్తున్నప్పుడు.. ఆ మూగ జీవి ఎంతో నొప్పితో విలవిలలాడిపోయింది. దాని నోటి భాగం నుంచి కొంచెం రక్తం కారినట్లు కూడా అనిపించింది.. అయినప్పటికీ సరే ఆ వృద్ధుడు ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా.. ఆ నాగుపాము నోటిని పూర్తిగా దారంతో కుట్టేసి బంధించాడు.. దాదాపు 15 నిమిషాల పాటు ఆ పాముని పట్టుకొని ఆ వ్యక్తి అలా నెమ్మదిగా పాము నోటిభాగాన్ని కుడుతూనే కనిపించాడు..
ఈ దారుణమైన దృశ్యానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో అన్ని ప్లాట్ఫామ్స్ లోను విపరీతంగా వైరల్ అవుతోంది. ముఖ్యంగా ఇంస్టాగ్రామ్ లో ఈ వీడియో ట్రెండింగ్ లోకి వచ్చింది. అయితే ఈ వీడియో చూసిన సోషల్ మీడియా వినియోగదారులు రకరకాలుగా స్పందిస్తూ వస్తున్నారు. కొందరు ఆ వృద్ధుడి ధైర్యానికి ఆశ్చర్యపోతూ ఉంటే.. మరి కొంతమంది మెజారిటీ సోషల్ మీడియా వినియోగదారులు, జంతు ప్రేమికులు మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..
ఇంతకీ ఆ వృద్ధుడు ఎందుకు అలా చేశాడు?
సాధారణంగా కొందరు పాములు పట్టేవారు తాము పట్టుకున్న పాములు ఎవరినీ కరవకుండా ఉండేందుకు.. లేదా వాటి విషాన్ని పిండేసి ఇలా నోర్లు కుట్టేస్తూ ఉంటారని కొంతమంది అభిప్రాయపడుతూ ఉన్నారు. అయితే ఈ వీడియో ఎక్కడ జరిగింది.. ఆ వృద్ధుడు ఎవరు అనే విషయాలపై ఇంకా పూర్తిగా స్పష్టత రాలేదు.. కానీ ప్రస్తుతం మాత్రం ఆ వృద్ధుడు చేసిన పనికి సంబంధించిన దృశ్యాలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఇది చూసిన సోషల్ మీడియా వినియోగదారులు వివిధ రకాలుగా కామెంట్ల రూపంలో స్పందిస్తూ వస్తున్నారు..
Also Read: Video Viral: సాయం ముసుగులో అరాచకం.. యువతి ప్రైవేటు పార్ట్ మీద చెయ్యి వేసి మరీ.!. వీడియోపై దుమారం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్.. - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..
Indiramma Indlu: ఇందిరమ్మ ఇళ్లపై భారీ గుడ్న్యూస్.. తెలంగాణ ప్రభుత్వం ప్రకటన ఇదే!
Baddipadaga, Telangana:Indiramma Indlu 2nd Phase: ప్రతి ఒక్కరికీ నివాసం ప్రాంతం కల్పించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు చేస్తోంది. స్థలం ఉన్న వారికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. గుడిసెలు లేని తెలంగాణే ప్రభుత్వ లక్ష్యమని ప్రకటించింది. ఇందిరమ్మ ఇళ్ల రెండో విడతలో గుడిసెల వాసులకే తొలి ప్రాధాన్యం ఇస్తామని ప్రభుత్వం తెలిపింది. యుద్ధప్రాతిపదికన క్షేత్రస్థాయి సర్వే నిర్వహించి అర్హులను ఎంపిక చేస్తామని ప్రభుత్వం వెల్లడించింది. రూఫ్ రీప్లేస్మెంట్ పథకం కింద రూ.2 లక్షల వరకు ఆర్థిక సాయం అందిస్తామని.. ప్రతి నియోజకవర్గానికి 500 ఇళ్లు, రాష్ట్రవ్యాప్తంగా 50 వేల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది.
మంత్రి టెలికాన్ఫరెన్స్
హైదరాబాద్లోని సచివాలయంలో బుధవారం హౌసింగ్ శాఖ అధికారులతో తెలంగాణ గృహ నిర్మాణ శాఖ మంత్రి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందిరమ్మ ఇండ్ల రెండో విడత అమలు, గుడిసెల గుర్తింపు, రూఫ్ రీప్లేస్మెంట్ పథకం, అసంపూర్తి గృహాల వివరాల సేకరణ తదితర అంశాలపై అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో గుడిసెల్లో నివసిస్తున్న నిరుపేద కుటుంబాలకే మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. గుడిసెల్లో నివసిస్తున్న అర్హులందరికీ ఇళ్లు మంజూరు చేసిన తర్వాతే ఇతర దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొన్నారు.
గుడిసెలు లేని రాష్ట్రంగా
రాష్ట్రంలో ఒక్క నిరుపేద కుటుంబం కూడా గుడిసెల్లో జీవించకుండా.. ప్రతి కుటుంబం సురక్షితమైన సొంత ఇంటిలో గౌరవప్రదంగా జీవించేలా చేయడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. తెలంగాణను గుడిసెలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణతో ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. గుడిసెల గుర్తింపునకు ప్రత్యేక సర్వే రాష్ట్రంలోని ప్రతి గ్రామం, వార్డు, మున్సిపాలిటీ పరిధిలో ఉన్న గుడిసెలను యుద్ధప్రాతిపదికన గుర్తించేందుకు సమగ్ర సర్వే చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ వద్ద ఇప్పటికే ఉన్న సమాచారాన్ని క్షేత్రస్థాయిలో ధృవీకరించి, వాస్తవ పరిస్థితులను పరిశీలించి అర్హుల జాబితాను సిద్ధం చేయాలని గృహ నిర్మాణ శాఖ మంత్రి సూచించారు.
ప్రజాపాలన కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 75 వేల మంది తాము గుడిసెల్లో నివసిస్తున్నామని దరఖాస్తు చేసుకున్నారని, ఆ దరఖాస్తులన్నింటినీ ప్రత్యక్షంగా పరిశీలించి నిజమైన అర్హులను గుర్తించాలని ఆదేశాలు జారీ చేశారు. సర్వే ప్రక్రియలో పూర్తి పారదర్శకత పాటించాలని, అర్హుల ఎంపికలో కులం, మతం, పార్టీ అనే తేడా లేకుండా ఎటువంటి పొరపాట్లు, వివక్షకు తావు లేకుండా అనర్హుల చొరబాటుకు అవకాశం లేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశాలు ఇచ్చారు.
గుడిసెవాసులకు అవకాశం
గుడిసెల్లో నివసిస్తూ గతంలో ప్రజాపాలన లేదా ఇతర కార్యక్రమాల్లో దరఖాస్తు చేసుకోని నిరుపేద కుటుంబాలు ఇప్పుడు కూడా స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చు. అటువంటి దరఖాస్తులను కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హులైన వారికి అవకాశం కల్పించనున్నారు.
రెండో విడతలో 2.50 లక్షల ఇళ్లు
==> ఇందిరమ్మ ఇళ్ల రెండో విడతలో రాష్ట్రవ్యాప్తంగా 2.50 లక్షల ఇళ్ల నిర్మాణం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
==> ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 2,000 ఇళ్ల చొప్పున మంజూరు
==> త్వరలో అర్హుల ఎంపికను పూర్తిస్థాయి పారదర్శకతతో నిర్వహించనుంది.
==> రూఫ్ రీప్లేస్మెంట్ పథకానికి ప్రత్యేక ప్రాధాన్యం
==> గోడలు, పునాదులు బలంగా ఉన్నప్పటికీ పైకప్పులు టార్పాలిన్ షీట్లు, రేకులు, నాపరాళ్లు లేదా ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న పైకప్పుల కింద నివసిస్తూ ఇబ్బందులు పడుతున్న కుటుంబాలను గుర్తించి వారికి ఆర్సీసీ స్లాబ్ నిర్మాణం కోసం రూ.2 లక్షల వరకు ఆర్థిక సహాయం
అసంపూర్తి ఇళ్లకు కూడా అవకాశం
==> గతంలో వివిధ గృహ నిర్మాణ పథకాల కింద మంజూరై ఇప్పటికీ అసంపూర్తిగా ఉన్న ఇళ్లను క్షేత్రస్థాయిలో మరోసారి పరిశీలన
==> పాత ఇందిరమ్మ పథకం కింద మంజూరై పునాది స్థాయి లేదా పైకప్పు స్థాయిలో నిలిచిపోయిన ఇళ్లను కూడా ఈ పథకంలో చేర్చవచ్చు
==> గృహలక్ష్మి పథకం కింద నిర్మాణాలు మధ్యలో నిలిచిపోయిన గృహాలను కూడా గుర్తించి రూఫ్ అప్గ్రేడేషన్ కార్యక్రమం ద్వారా పూర్తి చేయడానికి చర్యలు
లబ్ధిదారుడే ఇంటి నిర్మాణదారు
బీఎల్సీ (బెనిఫిషియరీ లెడ్ కన్స్ట్రక్షన్) విధానంలో లబ్ధిదారుడే తన ఇంటిని నిర్మించుకొనే అవకాశం కల్పించామని మంత్రి తెలిపారు. ప్రధానంగా పట్టణ ప్రాంతాల్లో స్థలాల కొరతను దృష్టిలో పెట్టుకొని చిన్న స్థలాలు కలిగిన లబ్ధిదారులకు అవసరాన్ని బట్టి గ్రౌండ్ ప్లస్ వన్ (జి+1) నిర్మాణాలకు కూడా అనుమతి ఇవ్వవచ్చు.
Cobra Vs Cat Video: కింగ్ కోబ్రాతో పిల్లి హై-వోల్టేజ్ ఫైట్.. నెట్టింట షాకింగ్ వీడియో వైరల్!
Hyderabad, Telangana:King Cobra Vs Cat Fight Video Watch: సృష్టిలో కొన్ని జంతువుల మధ్య పగ పుట్టుకతోనే వస్తుంది. ముఖ్యంగా విష సర్పాల బారిన పడితే ఎంతటి జీవి అయినా ప్రాణాలు కోల్పోవాల్సిందే.. అయితే, ప్రాణహాని కలిగినప్పుడు. ఎంతటి చిన్నజీవి అయినప్పటికీ సింహంలా మారుతుందని నిరూపించింది ఒక పిల్లి.. అత్యంత ప్రమాదకరమైన నాగుపాముతో ఒక పిల్లి ఎంతో పోరాడిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.. దీనిని చూసిన సోషల్ మీడియా వినియోగదారులు ఆశ్చర్యానికి గురవుతున్నారు..
క్షణాల్లో దాడి..
ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ షార్ట్ వీడియోలో.. ఒక పిల్లి.. పడక విప్పి భారీ నాగుపాము ముఖాముఖి తలపడడం మీరు క్లియర్ గా చూడొచ్చు. పాము తన ప్రాణాంతకమైన విషపూరితమైన కోరాలతో పెళ్లిపై దాడి చేసేందుకు సిద్ధమైంది. ఒక్కసారి కాటేస్తే క్షణాల్లో ప్రాణాలు పోతాయని తెలిసినప్పటికీ కూడా ఆ పిల్లి ఏ మాత్రం భయపడలేదు..
నాగుపాము అత్యంత భయానకంగా పడగవిప్పి.. మెరుపు వేగంతో పిల్లిపై దూసుకెళ్తూ దాడికి ప్రయత్నించడం మీరు ఈ వీడియోలో చూడొచ్చు.. అయితే, ఇక్కడే పిల్లి తన టాలెంట్ మొత్తం చూపించింది.. పిల్లి తనకున్న మెదడును ప్రదర్శించింది. పాముకాటు వేయడానికి ముందుకు వచ్చిన ప్రతిసారి.. ఆ పిల్లి ఎంతో చాకచక్యంగా వెనక్కి తబ్బుకుంటూ తన ప్రాణాలను కాపాడుకుంది..
సినిమా ఫైట్ను తలపించేలా పిల్లి పంజా..
ఈ పోరాటంలో పాము దాడి చేయడమే కాకుండా.. పెళ్లి కూడా ఎదురుదాడికి దిగడం విశేషం.. పాము పడకపై తన పంజాతో కొట్టడానికి పిల్లి ప్రయత్నించిన దృశ్యాలు సోషల్ మీడియా వినియోగదారులను ఆశ్చర్యపోయేలా చేస్తున్నాయి.. వీటి మధ్య జరిగిన ఈ హై వోల్టేజ్ ఫైట్ చూస్తుంటే ఏదో గ్రాఫిక్స్ సినిమా చూసినట్లు అనిపిస్తుంది కదూ.. నిజంగా జరుగుతున్నట్లు నమ్మలేకపోతున్నామని కొంతమంది సోషల్ మీడియా వినియోగదారులు కామెంట్లు పెడుతున్నారు..
Also Read: Video Viral: సాయం ముసుగులో అరాచకం.. యువతి ప్రైవేటు పార్ట్ మీద చెయ్యి వేసి మరీ.!. వీడియోపై దుమారం..
నెట్టింట కామెంట్ల వర్షం..
ఈ వీడియో పోస్ట్ చేసిన కొద్ది గంటల్లోనే కొన్ని లక్షల మందికి పైగా సోషల్ మీడియా వినియోగదారులు వీక్షించినట్లు తెలుస్తోంది.. అంతేకాకుండా వేల సంఖ్యలో లైకులు కూడా పొందినట్లు సమాచారం. ఈ వీడియో పై సోషల్ మీడియా వినియోగదారులు రకరకాలుగా స్పందిస్తూ వస్తున్నారు.. పిల్లికి 9 ప్రాణాలు ఉంటాయని ఊరికే అనలేదు.. ఆ వేగంతో పాటు ఆ ధైర్యం నిజంగా అద్భుతం అని ఒక యూజర్ కామెంట్ చేయగా.. నాగుపాము ముందు నిలబడడానికి సింహాలు సైతం భయపడుతూ ఉంటాయి. అలాంటిది ఈ పిల్లి ధైర్యానికి సెల్యూట్ చేయాల్సిందే అంటూ మరొకరు కామెంట్ రాసుకోచ్చారు..
Also Read: Video Viral: సాయం ముసుగులో అరాచకం.. యువతి ప్రైవేటు పార్ట్ మీద చెయ్యి వేసి మరీ.!. వీడియోపై దుమారం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్.. - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..
Airdopes 219 Price: అమెజాన్లో రూ.899లకే boAt Airdopes 219 ఇయర్బడ్స్.. ఏకంగా 77 శాతం డిస్కౌంట్!
Hyderabad, Telangana:boAt Airdopes 219 Earbuds Under 1000: అమెజాన్లో ఎప్పటినుంచో boAt Airdopes 219 బ్లూటూత్ ఇయర్బడ్స్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఇదే మంచి అవకా నేటి యువత ఎక్కువగా ఇయర్ ఫోన్స్కి బదులుగా బ్లూటూత్ ఇయర్బడ్స్ కొనుగోలు చేస్తున్నారు. ముఖ్యంగా తక్కువ ధరల్లో మంచి ప్రీమియం సౌండ్ అందించే ఇయర్బడ్స్ విక్రయిస్తున్నారు. అయితే, మీరు కూడా ఎప్పటినుంచో బ్లూటూత్ ఇయర్బడ్స్ కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఇదే అద్భుతమైన అవకాశం గా భావించవచ్చు. ఎందుకంటే ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్ లో కొన్ని బ్రాండ్లకు సంబంధించిన వీటిపై ప్రత్యేకమైన స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్స్ లభిస్తున్నాయి..
boAt Airdopes 219 బ్లూటూత్ ఇయర్బడ్స్కి సంబంధించిన ఫీచర్స్ వివరాల్లోకి వెళితే.. దీనిని కంపెనీ ఎన్నో రకాల అద్భుతమైన ఫీచర్లతో అందుబాటులోకి తీసుకువచ్చింది ముఖ్యంగా ఇందులో నాలుగు ప్రత్యేకమైన మైక్రోఫోన్లు అందుబాటులో ఉన్నాయి. దీంతోపాటు బ్యాగ్రౌండ్ నైస్ డిడక్షన్ కూడా అందుబాటులో ఉంది. అదేవిధంగా కాల్స్ మాట్లాడేటప్పుడు అవతలి వాయిస్ ను తగ్గించి మీ వాయిస్ క్లియర్గా అందిస్తుంది..
ఇందులో కంపెనీ చాలా ప్రత్యేకమైన కేసును తీసుకువచ్చింది. 40 గంటల ప్లే బ్యాక్ టైమ్ కలిగి ఉన్నట్లు కంపెనీ క్లైమ్ చేస్తోంది. దీనివల్ల మీరు 40 గంటల పాటు మ్యూజిక్ వినవచ్చు. అలాగే ఇందులో కంపెనీ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ను కూడా తీసుకువచ్చింది. కేవలం 10 నిమిషాల్లోనే చార్జ్ చేస్తే చాలు 120 నిమిషాల ప్లేబ్యాక్ లభిస్తుంది. ఇందులో ప్రత్యేకంగా బీస్ట్ మోడ్ కూడా అందుబాటులో ఉంది. గేమింగ్ ఆడే వారికోసం 45ms లో-ల్యాటెన్సీ మోడ్ కూడా లభిస్తోంది. దీనివల్ల గేమ్ ఆడేటప్పుడు ఆడియో ఆలస్యంగా కాకుండా సింక్ అవుతుంది. అదేవిధంగా బోటి యాప్ సపోర్ట్ ద్వారా.. ఎలాంటి ప్రకటనలు లేని మ్యూజిక్స్ స్ట్రీమింగ్ కూడా అందిస్తోంది. ఇలా ఎన్నో రకాల అద్భుతమైన ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
boAt Airdopes 219 బ్లూటూత్ ఇయర్బడ్స్కి ధరలకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. కంపెనీ దీనిని మార్కెట్లో ధర (MRP) రూ.3,990 లకు విక్రయిస్తోంది. ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్ లో దీనిని కొనుగోలు చేసే వారికి డే సేల్ లో భాగంగా 77 శాతం వరకు ఫ్లాట్ డిస్కౌంట్ లభిస్తుంది.. అయితే, ఈ 77 శాతం వరకు ఫ్లాట్ డిస్కౌంట్ అసలు ధర నుంచి మైనస్ చేస్తే దీనిని కేవలం రూ.899 లోపే సొంతం చేసుకోవచ్చు. ఇవే కాకుండా ఇందులో కొనుగోలు చేసే వారికి అదనంగా బ్యాంకు క్యాష్ బ్యాక్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది.. దీనిని పొందాలనుకునేవారు అమెజాన్ పే ఐసిఐసిఐ బ్యాంకు క్రెడిట్ కార్డు వినియోగించి పేమెంట్ చేయాల్సి ఉంటుంది..
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Husband Wife Solution: భర్త ఇల్లు దాటగానే భార్యలు ఈ 7 పనులు చేయకూడదా? జోతిష్య శాస్త్రం ఏం చెబుతున్నాయి?
Hyderabad, Telangana:Husband Wife Solution Tips: భారతదేశం అనేక సంప్రదాయాలకు నెలవు. మన సమాజంలో భార్యాభర్తల అనుబంధానికి ఆచారాలు సంప్రదాయాలను పాటిస్తూ వస్తున్నారు. కుటుంబ శ్రేయస్సు, ఆర్థిక అభివృద్ధి, భర్త విజయానికి సంబంధించిన కొన్ని ఆచారాలను, నమ్మకాలను మన పెద్దలు పాటిస్తూ వస్తున్నారు. ముఖ్యంగా భర్త ఏదైనా పని కోసం ఇంటి నుంచి బయలుదేరిన వెంటనే భార్యలు కొన్ని పనులు చేయకూడదని జ్యోతిష్య శాస్త్రం, జానపద విశ్వాసాలు చెబుతున్నాయి. ఇవి శాస్త్రీయంగా నిరూపితం కాకపోయినా.. తరాలుగా వస్తున్న కొన్ని సంప్రదాయ నమ్మకాల ప్రకారం ఏ పనులు భార్యలు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.
భర్తలు ఇంటి నుంచి బయటకు వెళ్లిన తర్వాత భార్యలు చేయకూడని ఏడు పనులు ఏమిటంటే..
ఇల్లు ఊడవడం, తుడవడం..
భర్త ఇంటి నుంచి బయటకు వెళ్లిన వెంటనే ఇల్లు ఊడవడం లేదా కడగడం వంటి పనులు చేయకూడదట. అలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గుతుంది అనే చాలా మంది నమ్ముతారు. ఈ క్రమంలో భర్త ఇంటి నుంచి బయటకు వెళ్లిన వెంటనే కాకుండా కొంత సమయం తర్వాతే ఆ పనులు చక్కదిద్దుకోవడం మంచిది.
తలస్నానం చేయటం..
భర్త ముఖ్యమైన పనిపై ఇంటి నుంచి బయటకు వెళ్ళిన వెంటనే భార్య తలస్నానం చేయడం సరైన పద్ధతి కాదని కొన్ని పురాణ గ్రంథాలు చెబుతున్నాయి. ఇలా చేయడం వల్ల భర్త చేపట్టే పనులు ఆటంకాలు ఎదురవుతాయని భావిస్తున్నారు.
జడ వేసుకోవడం, గోళ్లు కత్తిరించడం..
కొంతమంది భర్త బయటకు వెళ్లిన వెంటనే వారివారి భార్యలు తల దువ్వుకోవడం మేకప్ లు వేసుకోవడం, ఆభరణాలతో ముస్తాబవ్వటం వంటివి చేస్తుంటారు. అయితే జానపద నమ్మకాల ప్రకారం.. భర్త సురక్షితంగా తన పని పూర్తి చేసుకుని ఇంటికి వచ్చేవరకు భార్యలు తమ అలంకరణలను తొలగించకపోవడం మంచిది.
వంటగదిని, పాత్రలను శుభ్రం చేయటం..
భర్త భోజనం చేసిన వెంటనే లేదా ఇంటి నుంచి బయటకు బయలుదేరిన వెంటనే అతని ఎంగిలి పాత్రలు తోమటం వంటి సాంప్రదాయం నివారించ మంటారు. అన్నపూర్ణ దేవి అనుగ్రహం ఇంట్లో ఉండాలంటే కొంతసేపు ఆగి ఈ పనులు చేయాలని మన పెద్దలు సూచిస్తున్నారు.
ఉప్పు లేదా పదునున్న వస్తువులు అప్పు ఇవ్వటం..
భర్తలు ఇంటి నుంచి బయటకు వెళ్లి నా వెంటనే పొరుగు ఇంటి వారికి భార్యలు తమ ఇంట్లోని ఉప్పు, సూది, కత్తెర, కత్తి వంటి మొదలైన వస్తువులను అప్పుగా ఇవ్వకూడదు. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఆర్థిక శ్రేయస్సు తగ్గి ప్రతి పనిలో నష్టం చేకూరి అవకాశం ఉందని పెద్దలు నమ్ముతారు.
గుమ్మం ఎదుట నీళ్లు చల్లడం లేదా కాలిపాత్రను ఉంచడం..
భర్త ఇంటి నుంచి బయటికి వెళ్లిన వెంటనే ముఖద్వారం ఎదుట నీళ్లు చల్లడం ఆశుభ సూచికంగా భావిస్తారట. అలాగే ఇంట్లో నీటి బకెట్లు, కుండలు పూర్తిగా ఖాళీగా ఉంచకూడదట. ఒకవేళ ఖాళీ పాత్రలను బోర్లించి లేదా తలకిందులుగా ఉంచటం మంచిదని జానపద విశ్వాసకులు చెబుతున్నారు.
(గమనిక: పైన పేర్కొన్న విషయాలు జ్యోతిష్య నమ్మకాలు లేదా జానపద విశ్వాసాల ఆధారంగా మాత్రమే పొందుపరచబడింది. వీటికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. వీటిని పాటించాలా లేదా అనేది మీ పూర్తి వ్యక్తిగత నమ్మకంపై ఆధారపడి ఉంటుంది. జీ తెలుగు న్యూస్ ఈ సమాచారాన్ని ధ్రువీకరించడం లేదు.)
Also Read: మిథున రాశిలోకి సూర్యుడి ప్రవేశం.. జూన్ 15 నుంచి ఈ
Also Read: Somvati Amavasya 2026: 396 ఏళ్ల తర్వాత సోమవతి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Varikapudisela Project: పల్నాడు రైతాంగానికి శుభవార్త..వరికపుడిశెల ప్రాజెక్టుకు గ్రీన్సిగ్నల్..రెండేళ్లలో ఇచ్చిన హామీ అమలు!
Gottipalla, Andhra Pradesh:Varikapudisela Project Latest News: పల్నాడు జిల్లా ప్రజలకు ఎట్టకేలకు శుభవార్త అందింది. జిల్లాలోని రైతులు, ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వరికపుడిశెల ఎత్తిపోతల పథకానికి సంబంధించిన పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. ఈ ఎత్తిపోతల పథకానికి సంబంధించిన పైప్లైన్ నెట్వర్క్ పనులు వేగవంతం చేసేందుకు వీలుగా నేడు కూటమి ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులను జారీ చేసింది. మెట్ట ప్రాంత రైతులకు సాగునీరు అందించి, వారి పొలాలను సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది.
రైతు సంక్షేమమే ధ్యేయమంటూ ఈ నిర్ణయం తీసుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, ఈ ప్రాజెక్టు పరిధిలో భూసేకరణ పనుల కోసం రూ.63.14 కోట్లు నిధులు మంజూరు చేసింది. మొత్తం ప్రాజెక్ట్ అంచనా వ్యయం రూ.88.00 కోట్లు కాగా, ప్రస్తుతానికి భూసేకరణకు సంబంధించి మొదటి విడతగా రూ.63.14 కోట్లను తక్షణమే కేటాయించింది.
ఆ మండలాల రూపురేఖలు మారిపోతాయి!
ఈ నిధులతో వెల్దుర్తి, దుర్గి, మాచర్ల, కారంపూడి.. మండలాల్లో భూసేకరణ చేపట్టి, పైప్లైన్ ద్వారా నీటి సరఫరా చేయనున్నారు. స్థానిక రైతులతో సమన్వయం చేసుకుంటూ, వీలైనంత త్వరగా భూసేకరణ ప్రక్రియ పూర్తి చేసి, పైప్లైన్ నెట్ వర్క్ పనులను వేగవంతం చేయాలని కృష్ణా డెల్టా చీఫ్ ఇంజనీర్ను ప్రభుత్వం ఆదేశించింది.
ప్రతి ఎకరాకు నీరందిస్తాం: పల్నాడు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు
"రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది" అనే నినాదంతో పనిచేస్తున్న ప్రభుత్వం.. పల్నాడు జిల్లాలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందించే వరకు విశ్రమించదని, వరికపుడిసెల ప్రాజెక్టును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్ణీత కాలవ్యవధిలో పూర్తి చేస్తామని నరసరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు గారు స్పష్టం చేశారు. ఈ పైప్లైన్ పనులు పూర్తయితే పల్నాడు జిల్లాలోని వేలాది ఎకరాలకు సాగునీరు అందడమే కాకుండా, నాలుగు మండలాల రైతుల ముఖాల్లో కొత్త వెలుగులు నిండుతాయని నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు ఆశాభావం వ్యక్తం చేశారు.
60 ఏళ్లుగా నోచుకోలేనిది..కేవలం రెండేళ్లలో!
గత ఆరు దశాబ్దాలుగా అమలుకు నోచుకోని ఈ వరికపూడిశెల ప్రాజెక్టుకు ఎట్టకేలకు తొలి అడుగుపడింది. టైగర్ రిజర్వ్ ఫారెస్టులో ఉన్న ఈ ప్రాజెక్టు భూసేకరణకు అటవీ శాఖ నుంచి అనుమతులు రావడమే అందుకు ఆలస్యంగా మారింది. అయితే 2024 ఎన్నికల్లో భాగంగా పల్నాడులోని వెల్దుర్తి, దుర్గి, మాచర్ల, కారంపూడి ప్రజలకు ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు ఇచ్చిన హామీని ఈ సందర్భంగా నెరవేర్చినట్లు అయ్యింది. గత ఏడేళ్లుగా నర్సరావుపేట పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు.. గత ప్రభుత్వం హయం నుంచే ఈ ప్రాజెక్టు కోసం అహర్నిశలు శ్రమించారు.
మెట్ట ప్రాంత రైతులకు నీరు అందించి.. వారి కష్టానికి బాసటగా నిలవాలని ఎంపీ చేసిన కృషికి రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు కదిలి వచ్చింది. అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే.. 2024లో ఇచ్చిన హామీ మేరకు వరికపుడిశెల ప్రాజెక్టుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రాజెక్టు ద్వారా ఎన్నో ఎకరాల భూమికి నీరు అంది.. పల్నాడు ప్రాంతమంతా సస్యశామలం కానుంది.
Also Read: పల్నాడు జిల్లాలో విషాదం..కృష్ణా నదిలో పడవ బోల్తా..నలుగురు విద్యార్థులు మృతి!
Also Read: వైఎస్ జగన్ ఇంటి దగ్గరకు వెళ్లి మంత్రి లోకేష్ సవాల్..దమ్ముంటే డీఎస్సీపై చర్చకు రండి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Cobra Video: శివుడి మెడలో ప్రత్యక్షమైన భారీ కింగ్ కోబ్రా.. వీడియో ఇదే..
Hyderabad, Telangana:Lord Shiva Snake Viral Video Watch: భక్తి భావంతో పాటు అద్భుతం కలిస్తే ఎలా ఉంటుందో చూపే ఒక అరుదైన దృశ్యం ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. సాధారణంగా గుడులలో లేదా రాతి విగ్రహాలపై పాములు కనిపించడం మనం అప్పుడప్పుడు సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ ఏకంగా ఒక భారీ నాగుపాము సాక్షాత్తు ఆ పరమశివుడి విగ్రహం మెడలో ప్రత్యక్షమైంది. పురాణాల్లో మనం చదువుకునే నాగేంద్రహారుడు అనే మాటకు ప్రత్యక్ష నిదర్శనంగా ఈ ఘటన నిలిచింది. ప్రమాదకరమైన ఆ సర్పం.. శివుడి మెడ చుట్టూ మాల లాగా అలంకరించినట్లు కూర్చుని ఉండడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసేలా చేస్తోంది. దీనికి సంబంధించిన అన్ని వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..
భారీగా తరలివస్తున్న భక్తులు..
ఈ అద్భుతమైన దృశ్యాన్ని కల్లారా వీక్షించడానికి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు భారీ ఎత్తున తరలివస్తున్నారు. పామును చూసి భయపడాల్సింది పోయి.. భక్తులు భక్తిశ్రద్ధలతో హారతులు పడుతున్నారు. అంతేకాకుండా ఓం నమశ్శివాయ అనే నామస్మరణతో ఆ ప్రాంతమంతా మారుమోగిపోతోంది. శివుడే స్వయంగా నాగుపాము రూపంలో దర్శనం ఇచ్చాడని కొందరు.. సోమవారం రోజునే విగ్రహంపై పాము ప్రత్యక్షమవడం విశేషమని కొంతమంది చెబుతూ వస్తున్నారు..
అక్కడికి వచ్చిన భక్తులు. ఇలాంటి దృశ్యాలు మేమెప్పుడూ చూడలేదు.. టీవీల్లో, సినిమాల్లో గ్రాఫిక్స్ ద్వారా మాత్రమే ఇలాంటివి చూసామని.. కానీ ఈ రోజుల్లో కళ్ళే నాగుపాము స్వామివారి మెడలో అలా ప్రశాంతంగా కూర్చోవడం చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుందని చెబుతూ వస్తున్నారు.. సాధారణంగా ఇలా ఇప్పటివరకు అనేక సంఘటనలు జరిగాయి. గతంలో మహాశివరాత్రి రోజున ఓ ఆలయంలో ఏకంగా శివుడి విగ్రహం మెడలో పాము ప్రత్యక్షమవడం అప్పట్లో సంచలనంగా మారింది. అంతేకాకుండా లింగంపై పాము పడక విప్పి కూర్చున్న దృశ్యాలు కూడా గతంలో సోషల్ మీడియాలో మనం చూసి ఉన్నాం..
ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవ్వడమే కాకుండా వ్యూస్ తో పాటు ఊహించని స్థాయిలో లైకులు కూడా వస్తున్నాయి. ఎంతమంది సోషల్ మీడియా వినియోగదారులు ఈ వీడియోని చూసి ఆశ్చర్యపోతున్నారు.. నిజమైన భక్తికి నిదర్శనమని.. పాటు హరహర మహాదేవ అంటూ కామెంట్లు కూడా చేస్తున్నారు.. ఇప్పుడు ఈ వీడియో ఇంస్టాగ్రామ్ రీల్స్లో ట్రెండింగ్లో నిలిచింది.. విష సర్పమైనప్పటికీ.. అది ఎవరికి ఎలాంటి హాని తలపెట్టకుండా.. అలా శివుడి విగ్రహం పైనే గంటల తరబడి ఉండిపోవడం గమనార్హం.. ప్రకృతి సృష్టించిన ఈ ఈ వింత.. భక్తుల నమ్మకం కలిసి ఈ వీడియోను సోషల్ మీడియాలో ఒక సంచలనంగా మార్చేశాయి..
Also Read: Video Viral: సాయం ముసుగులో అరాచకం.. యువతి ప్రైవేటు పార్ట్ మీద చెయ్యి వేసి మరీ.!. వీడియోపై దుమారం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్.. - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి..Twitter, Facebook
Rythu Bima Scheme: అన్నదాతలకు తీరని అన్యాయం.. నిలిచిపోయిన రైతు బీమా?
Hyderabad, Telangana:Rythu Bima Scheme Telangana Latest News: తెలుగు రాష్ట్రాల్లోని తెలంగాణ రాష్ట్రంలో అన్నదాతల కుటుంబాలకు ధీమాగా నిలవాల్సిన రైతు బీమా పథకం ప్రస్తుతం నిలిచిపోయింది. ప్రభుత్వం నుంచి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ సంస్థకు చెల్లించాల్సిన ప్రీమియం సొమ్ము సకాలంలో విడుదల కాకపోవడంతో బీమా క్లెయిమ్ల ప్రక్రియ పూర్తిగా స్తంభించిపోయింది. ఫలితంగా.. అటు అప్పుల బాధతోనో.. అకాల మరణంతోనో.. ఇళ్లకు పెద్దదిక్కుని కోల్పోయిన వందలాది పేద రైతు కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి దాపురించినట్లు తెలుస్తోంది..
రైతు బీమా క్లెయిమ్లు ఎందుకు ఆగిపోయాయి?
విశ్వసనీయమైన సమాచారం ప్రకారం.. రైతు బీమా పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఐసి(LIC) సంస్థకు సుమారు రూ.441 కోట్లకు పైగా ప్రీమియం బకాయిలను చెల్లించాల్సి ఉంది. గత కొంతకాలంగా ఈ నిధుల విడుదల ఆలస్యం అవ్వడంతో.. ఎల్ఐసి యాజమాన్యం కొత్త క్లైమ్ల పరిష్కారాన్ని తాత్కాలికంగా పక్కన పెట్టేసినట్లు సమాచారం. ప్రభుత్వ ఒప్పందం ప్రకారం ప్రీమియం మొత్తం అందితేనే క్లైమ్ డబ్బులు విడుదలవుతాయని.. లేనిపక్షంలో ప్రక్రియ ముందుకు సాగదని సమస్త స్పష్టం చేసినట్లు సమాచారం..
పెండింగ్లో 7,606 క్లెయిమ్లు..
ప్రీమియం వివాదం కారణంగా రాష్ట్రవ్యాప్తంగా మరణించిన రైతులకు సంబంధించిన ఫైల్స్ ఆఫీస్కే పరిమితమయ్యాయి. మొత్తం ఇప్పటివరకు 7600కు పైగా ఫైల్స్ ఆఫీస్కి పరిమితమైనట్లు తెలుస్తోంది. దీని ద్వారా దాదాపు రూ.380 కోట్ల బీమా డబ్బు ఫ్రీజ్ అయినట్లు తెలుస్తోంది.. ప్రతి బాధిత రైతు కుటుంబానికి అందాల్సిన ఐదు లక్షల బీమా సహాయం అందకపోవడంతో క్షేత్రస్థాయిలో తీవ్ర గందరగోళంతో పాటు ఆందోళన వ్యక్తం అవుతున్నట్లు తెలుస్తోంది.
బాధిత కుటుంబాల ఆవేదన..
ఇంటి పెద్ద చనిపోయి పుట్టెడు దుఃఖంలో ఉన్నప్పటికీ.. చేసిన అప్పులు తీర్చే మార్గం లేక, పిల్లల చదువులకు పైసల్ లేక ఇబ్బంది పడుతున్నామని.. రైతు బీమా ఐదులక్షలు వస్తే అప్పులైన తీరుతాయని ఆశపడ్డామని.. కానీ నెలలు గడుస్తున్నప్పటికీ ఆఫీసుల చుట్టూ తిరగడం తప్ప రూపాయి చేతికి అందడం లేదని బాధిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాయి..
అప్పుల ఊబిలో అన్నదాతల కుటుంబాలు..
వ్యవసాయం కలిసి రాకపోవడంతో పాటు పంట నష్టాలు, అప్పుల భారంతో మరణించిన రైతుల కుటుంబాలను ఆదుకునేందుకు తెచ్చిన ఈ పథకం.. ఇప్పుడు బకాయిల ఉచ్చులో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ప్రైవేటు వడ్డీ వ్యాపారుల వేధింపులు తట్టుకోలేక.. చేతిలో పైసా లేక వందనాది రైతు కుటుంబాలు అల్లాడిపోతున్నాయి.. ఈ తీవ్రమైన సమస్యపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని.. ఎల్ఐసికి చెల్లించాల్సిన రూ.441 కోట్లకు పైగా బకాయిలు తక్షణమే విడుదల చేసి క్లైమ్లను క్లియర్ చేయాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అన్నదాతల కుటుంబాలను ఆదుకోవడంలో నిర్లక్ష్యం తగదని.. మానవీయ కోణంలో ఆలోచించి యుద్ద ప్రాతిపదికన నిధులను విడుదల చేయాలని కోరుతున్నారు..
Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
Sircilla: సిరిసిల్ల జిల్లాలో ఫుడ్ పాయిజన్.. పానీపూరి తిని ఆస్పత్రి పాలైన 10 మంది చిన్నారులు..
Karimnagar, Telangana:Sircilla Panipuri Food Poisoning Case: రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలంలో తీవ్ర కలకలం రేగింది. కెసిఆర్ నగర్ కాలనీలో పానీ పూరి తిన్న పలువురు చిన్నారులు ఫుడ్ పాయిజన్కు గురై తీవ్ర అస్వస్థత బారిన పడ్డారు.. ఒకేసారి పదిమందికి పైగా పిల్లలు వాంతులతో పాటు విరోచనాలు, కడుపునొప్పి, జ్వరంతో ఆస్పత్రి పాలవడంతో స్థానిక వాసులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అసలు ఆ పానీ పూరిలో ఏం కలిసింది? పిల్లలు తీవ్ర అస్వస్థకు గురవ్వడానికి గల కారణాలేంటి? పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..
అసలేం జరిగిందంటే..?
స్థానికులు అందించిన సమాచారం ప్రకారం. కేసీఆర్ నగర్ కాలనీలోని ఒక పానీపూరి బండి వద్ద స్థానిక చిన్నారులు రోజులాగే పానిపూరి తిన్నారు.. అయితే, మరుసటి రోజు ఉదయం నుంచి చిన్నారుల ఆరోగ్యం క్షీణించడం ప్రారంభమైంది.. ఒకరి తర్వాత ఒకరు వరుసగా సుమారు పదిమందికి పైగా పిల్లలు తీవ్ర కడుపునొప్పితో పాటు వాంతులు, విరేచనాలతో ఇబ్బంది పడ్డారు కొంతమందికి తీవ్రమైన జ్వరం కూడా వచ్చేసింది.. పరిస్థితి విషమించడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు చిన్నారులను వెంటనే సిరిసిల్ల జిల్లాకు చెందిన ప్రభుత్వ ఆసుపత్రితో పాటు పలు ప్రైవేట్ ఆస్పత్రులకు తరలించారు.
బాలుడికి తీవ్ర జ్వరం.. ఫిట్స్ రావడంతో ఆందోళన..
అస్వస్థకు గురైన చిన్నారుల్లో రిషికేష్ అనే బాలుడి పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. సదరు బాలుడికి తీవ్రమైన జ్వరం రావడంతో పాటు ఒక్కసారిగా ఫిట్స్ రావడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం వైద్యులు ఆ బాలుడి ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తూ.. అత్యవసర విభాగంలో మెరుగైన చికిత్స అందిస్తున్నారు. కాగా మిగిలిన చిన్నారుల పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉన్నట్లు వైద్య వర్గాలు తెలిపాయి.
రంగంలోకి దిగిన వైద్య సిబ్బంది..
ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే స్థానిక వైద్య సిబ్బందితో పాటు ఆరోగ్య శాఖ అధికారులు కేసీఆర్ నగర్ కాలనీకి చేరుకుని పరిస్థితిని సమక్షిస్తున్నారు.. చిన్నారుల అందరికీ ఒకే రకమైన లక్షణాలు ఉండటం వల్ల ఇది కచ్చితంగా ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశాలే ఎక్కువ ఉన్నాయని.. చిన్నారుల అనారోగ్యానికి గల అసలు కారణాలను నిర్ధారించేందుకు తగిన వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామని.. సదరు పానీపూరి బండి వద్ద ఉన్న ఆహార పదార్థాలతో పాటు నీటి నమూనాలు సేకరించి ల్యాబ్ కు పంపిస్తున్నామని అధికారులు తెలిపారు..
Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!
తల్లిదండ్రుల్లో భయాందోళనలు..
ఈ ఘటనతో కెసిఆర్ నగర్ కాలనీలో భయాందోళన వాతావరణం నెలకొంది. కేవలం పానీ పూరి తినడం వల్లే ఇలా జరిగిందా? లేక స్థానిక తాగునీరు ఏమైనా కలుషితమైందా? అనే కోణాల్లో కూడా తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. వీధి వ్యాపారులు విక్రయించే ఆహార పదార్థాల నాణ్యత పై అధికారులు నిరంతరం నిఘా ఉంచాలని.. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చూడాలని స్థానికులు డిమాండ్ చేస్తూ వస్తున్నారు..
Also Read: కొండగట్టులో కొబ్బరికాయ దోపిడీ.. ఒక్కో కాయకు రూ.10 వసూలు, వైరల్ వీడియో!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook.
Pawan Kalyan Niranjan: హనుమకొండ పర్యటనలో పవన్కు తప్పిన ముప్పు..డిప్యూటీ సీఎంపైకి దూసుకొచ్చిన అభిమాని!
Warangal, Telangana:Pawan Kalyan Fan Niranjan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప-ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఓ యువ అభిమానికి చిరకాల కోరిక తీర్చారు. సినీ పరిశ్రమలోనే కాకుండా రాజకీయాల్లోనూ తనదైన శైలిలో దూసుకుపోతున్న ఆయన.. మరోసారి తన పెద్ద మనసును చాటుకున్నారు. వరంగల్లోని హనుమకొండకు చెందిన నిరంజన్ అనే అభిమాని కోసం డిప్యూటీ సీఎం స్వయంగా కదిలారు. అయితే ఈ క్రమంలో ఓ అభిమాని పవన్ కల్యాణ్పైకి దూసుకొచ్చాడు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
నిరంజన్ పరామర్శ కోసం హనుమకొండ వెళ్లిన టాలీవుడ్ కథానాయకుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కు ఫ్యాన్స్ అడుగుడుగునా బ్రహ్మరథం పట్టారు. తమ అభిమాన నటుడ్ని చూసేందుకు ప్రేక్షకులు తరలివచ్చారు. అయితే ఈ క్రమంలో పవన్ కల్యాణ్కు అభిమానుల తాకిడి భారీగా పెరిగింది. అయితే నిరంజన్ ను పరామర్శించేందుకు తన కాన్వాయ్ నుంచి బయటకు వచ్చిన క్రమంలో ఓ అభిమాని పవన్ వైపు దూసుకెళ్లాడు. అంతలోనే ఆయన భద్రతా సిబ్బంది అభిమానిని పక్కకు నెట్టేశారు.
అభిమాని కోసం కదలి వచ్చి..రూ.1 లక్ష సాయం!
అనారోగ్యంతో మంచాన పట్టిన ఆ వ్యక్తి కోసం ఏకంగా పవర్స్టార్ ఆ అభిమాని ఇంటికి వెళ్లి పరామర్శించారు. అరుదైన వ్యాధితో ప్రాణాలతో పోరాడుతున్న ఓ నిరుపేద అభిమాని చిరకాల కోరిక తీర్చిన పవన్ కల్యాణ్.. ఆర్థిక సాయంగా రూ. లక్ష ఇచ్చి తనలోని మానవత్వాన్ని మరోసారి చాటుకున్నారు. అభిమానిని పరామర్శిస్తున్న ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
తెలంగాణ రాష్ట్రం హనుమకొండ పట్టణంలోని హనుమాన్ నగర్కు చెందిన నిరంజన్ (17) అనే యువకుడు డి.ఎన్.డి (Duchenne Muscular Dystrophy) అనే అరుదైన జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్నాడు. శరీర ఎదుగుదల లేని స్థితిలో పూర్తిగా మంచానికే పరిమితమైన నిరంజన్.. తన చివరి కోరికగా తన అభిమాన హీరో అయిన పవన్ కల్యాణ్ను ఒక్కసారైనా చూడాలని తల్లిదండ్రులకు తెలిపాడు.
ఈ విషయాన్ని నిరంజన్ తల్లిదండ్రులు తెలంగాణ జనసేన నాయకుల దృష్టికి తీసుకెళ్లగా, వారు వెంటనే అధినేత పవన్ కల్యాణ్కు సమాచారం అందించారు. అభిమాని పరిస్థితిని వినగానే చలించిపోయిన పవన్ కల్యాణ్.. ఏమాత్రం ఆలస్యం చేయకుండా హుటాహుటీన హనుమకొండలోని నిరంజన్ నివాసానికి చేరుకున్నారు.
అభిమాని నిరంజన్ ను పరామర్శించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. తన వ్యక్తిగత బ్యాంకు ఖాతా నుంచి రూ.1 లక్ష ఆర్థిక సాయాన్ని వారి కుటుంబానికి అందజేశారు. ఆ తర్వాత నిరంజన్ తల్లిదండ్రుల వృత్తి వివరాలను అడిగి తెలుసుకున్న పవన్.. వారి కుటుంబానికి శాశ్వత జీవనోపాధి లభించేలా ఒక 'క్యాంటిన్' ఏర్పాటు చేయించాలని తెలంగాణకు చెందిన జనసేన నేతలను ఆదేశించారు.
అభిమాని కోసం ప్రత్యేక పూజలు..
ఈ సందర్భంగా బాలుడికి భద్రకాళి అమ్మావారి తీర్థప్రసాదాలు అందజేసి ధైర్యం చెప్పారు. నిరంజన్ త్వరగా కోలుకోవాలని వరంగల్లోని ప్రసిద్ధ భద్రకాళి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయిస్తానని ఈ సందర్భంగా ఆయన మాట ఇచ్చారు. అనారోగ్యంతో బాధపడుతున్న బాలుడితో పవన్ కల్యాణ్ ఎంతో ఆప్యాయంగా మాట్లాడి, ధైర్యం చెప్పడంతో ఆ కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కష్టాల్లో ఉన్న అభిమానికి దేవుడిలా వచ్చి అండగా నిలిచిన పవన్ కల్యాణ్ రియల్ హీరో అంటూ స్థానికులు, అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
Also REad: పల్నాడు జిల్లాలో విషాదం..కృష్ణా నదిలో పడవ బోల్తా..నలుగురు విద్యార్థులు మృతి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Nara Lokesh DSC: వైఎస్ జగన్ ఇంటి దగ్గరకు వెళ్లి సవాల్ చేసిన మంత్రి లోకేష్.."దమ్ముంటే డీఎస్సీపై చర్చకు రండి!"
Vijayawada, Andhra Pradesh:Nara Lokesh On DSC: ఏపీలో గతేడాది జరిగిన మెగా డీఎస్సీ నియామకంపై ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ నాయకుల నుంచి వస్తున్న అనేక ఆరోపణలకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పందించారు. ఈ సందర్భంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇంటికి 200 మీటర్ల దూరంలో ఉండి పెద్ద సవాల్ విసిరారు. మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశిస్తూ..తాను 'గొడ్డలి' పార్టీ నాయకుల్లా బురదచల్లి పారిపాయే రకాన్ని కాదని అన్నారు. అలాగే డీఎస్సీపై ఎవరికైనా అనుమానాలు ఉంటే అదే ప్రదేశంలో బహిరంగ చర్చకు సిద్ధమని ఈ సందర్భంగా ఆయన గట్టిగా కౌంటర్ ఇచ్చారు.
మంత్రి లోకేష్ సవాలు ఇదే!
మెగా డీఎస్సీ నియామకంపై, దాని ప్రక్రియపై ఎవరికైనా ఎలాంటి అనుమానాలు ఉన్నా.. వాటిని ఇక్కడే (జగన్ ఇంటికి 200 మీటర్ల దూరంలో) నిలబడి సమాధానం చెప్తానని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. సవాస్ స్వీకరించే దమ్ము, ధైర్యం ఉంటే చర్చకు రావాలని ప్రతిపక్ష వైసీపీ నేతలకు సవాల్ విసిరారు.
అయితే మెగా డీఎస్సీపై వస్తున్న విమర్శలపై స్పందించిన మంత్రి నారా లోకేష్.. వైఎస్ జగన్ ఎన్ని జన్మలెత్తినా.. ప్రస్తుతం జరుగుతున్న, జరగబోతున్న డీఎస్సీ నియామకాలను ఆపలేరని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
అదే విధంగా గత వైసీపీ ప్రభుత్వ పాలనలో జాబ్ క్యాలెండర్లు కేవలం 'సాక్షి' పత్రికకే పరిమితమయ్యే క్యాలెండర్ల తాము రెడీ చేయలేదని మంత్రి నారా లోకేష్ ధ్వజమెత్తారు. నిరుద్యోగులకు మేలు చేసే విధంగా తమ కూటమి ప్రభుత్వం ఉద్యోగాల క్యాలెండర్ విడుదల చేసిందని.. అదే విధంగా వాటి అమలుకు కృషి చేస్తున్నామని ఆయన అన్నారు. అలాగే తాము అమలు చేసే జాబ్ నోటిఫికేషన్లను మాత్రమే రిలీజ్ చేస్తున్నట్లు నారా లోకేష్ ప్రకటించారు.
గత ఐదేళ్ల పాలనలో కనీసం ఒక్క డీఎస్సీని కూడా సరిగ్గా నిర్వహించని వారికి.. హారిజాంటల్, వర్టికల్ రిజర్వేషన్ల ప్రక్రియ గురించి ఏం తెలుస్తుందని ఆయన ఎద్దేవా చేశారు. ఒక్కసారి డీఎస్సీ నిర్వహిస్తే కదా ఆ రిజర్వేషన్ల విధానంపై అవగాహన వచ్చేదంటూ మంత్రి చురకలు అంటించారు.
Also Read: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్తో అల్లు అర్జున్ సీక్రెట్ మీటింగ్..ఏం జరిగిదంటే?
Also Read: భక్తుల కోసం టీటీడీ మరో కీలక నిర్ణయం..జూన్ 10 నుంచి ఆ టికెట్ల జారీకి ఆదేశం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Shani Vakragati: శని వక్రగతి, శశ రాజయోగం.. జులై నుంచి ఈ 4 రాశుల వారికి బంపర్ జాక్పాట్!
Hyderabad, Telangana:Shani Vakragati Effect On Zodiac: జులై 27వ తేదీన కర్మ ప్రధాన ప్రధాన శని దేవుడు మీనరాశిలోకి వక్రగతిలోకి ప్రవేశించబోతున్నాడు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. శనిగ్రహం వక్రగతి లోకి వెళ్లడం ఒక ముఖ్యమైన సంఘటనగా పరిగణిస్తారు. ఎందుకంటే వక్రగతిలోకి వెళ్లిన తర్వాత శని ప్రభావం మరింత లోతుగా.. తీవ్రంగా మారుతుంది. సాధారణంగా శని వక్రగతిని చెడుగా భావించినప్పటికీ.. కొన్ని రాశుల వారికి ఈ సమయంలో ఆశుభానికి బదులుగా శుభాలు కలుగుతూ ఉంటాయి. అయితే, శని ప్రభావం.. అనేది వ్యక్తులు చేసే కర్మలను బట్టి ఆధారపడి ఉంటుంది. కర్మలకు అనుకూలంగానే ఫలితాలు అందిస్తాడు. ఇదిలా ఉంటే శని వక్రగతిలోకి వెళ్లిన వెంటనే ఎంతో శక్తివంతమైన శశ మహాపురుష రాజయోగం కూడా ఏర్పడుతుంది. ఈ యోగానికి కూడా ఎంతో ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. అయితే శని వక్రగతిలోకి వెళ్లడం వల్ల నాలుగు రాశుల వారికి ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. ముఖ్యంగా వీరికి అద్భుతమైన పురోగతి లభించడమే కాకుండా సామర్థ్యం కూడా విపరీతంగా పెరుగుతుంది.. అనుకున్న పనుల్లో విపరీతమైన ధన లాభాలు పొందగలుగుతారు.
ఈ రాశులవారికి బంపర్ జాక్పాట్..
వృషభరాశి
ముఖ్యంగా ఈ రాశికి శుక్రుడు అధిపతిగా వ్యవహరిస్తూ ఉంటాడు. అయితే, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. శని, శుక్ర గ్రహాలు ఒకదానికొకటి సన్నిహిత గ్రహాలుగా పరిగణిస్తూ ఉంటారు. దీని కారణంగా వీరికి కర్మలను బట్టి అద్భుతమైన ధన లాభాలు కలుగుతాయి. ఈ సమయంలో వీరికి చాలా శుభప్రదంగా ఉంటుంది. ఉద్యోగాలు చేసే వారికి అద్భుతమైన పదోన్నతులు లభించి జీతాలు విపరీతంగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా కోరుకున్న చోటికి బదిలీలు కూడా జరిగే అవకాశాలున్నాయి. నిలిచిపోయిన వ్యాపారాలకు సంబంధించిన ప్రాజెక్టులు తిరిగి ప్రారంభమవుతాయి. ఆస్తులతో పాటు రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్న వారికి అపారమైన ప్రయోజనాలు కలుగుతాయి. సమాజంలో వీరికి అద్భుతమైన గుర్తింపు లభించబోతోంది..
మిథున రాశి
శని శక్తివంతమైన శశ మహాపురుష రాజయోగంతో మిధున రాశి వారికి అదృష్టంతో పాటు ఆనందం కూడా విపరీతంగా పెరుగుతుంది. కొంతకాలంగా మీ పనికి వస్తున్న ఆటంకాలు పూర్తిగా తొలగిపోతాయి. అనుకున్న పనుల్లో అన్ని రకాల సమస్యలు తొలగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్న వ్యక్తులందరికీ అద్భుతమైన విజయాలు కలుగుతాయి. వ్యాపారాలపరంగా విపరీతమైన ధన లాభాలు కలుగుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా పర్యటనలు చేయడం వల్ల ఈ సమయంలో ఎంతో లాభదాయకంగా ఉంటుంది. సౌకర్యాలతో పాటు విలాసవంతం కూడా పెరుగుతుంది. కొత్త వాహనాలతో పాటు ఇండ్లు కొనుగోలు చేయాలనుకునే వ్యక్తులందరికీ మంచి ధన లాభాలు కలుగుతాయి..
తులారాశి
శక్తివంతమైన శశ మహాపురుష రాజయోగ ప్రభావంతో తులా రాశి వారికి ఈ సమయం ఎంతో లాభదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా ఐదవ స్థానంలో ఈ రాజయోగం ఏర్పడడం కారణంగా విశేషమైన ప్రయోజనాలు కలుగబోతున్నాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు అద్భుతమైన శుభవార్తలు లభిస్తాయి. ఆకస్మిక ఆర్థిక లాభాలు కలగడమే కాకుండా గతంలో చిక్కుకుపోయిన డబ్బులు కూడా తిరిగి పొందగలుగుతారు. ముఖ్యంగా ప్రేమ సంబంధాలు మరింత లోతుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎప్పటినుంచో మంచి భాగస్వామితో ప్రయాణం చేస్తున్న వ్యక్తులందరికీ ఈ సమయంలో తప్పకుండా వివాహ యోగం మెండుగా కనిపిస్తుంది.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశిలో జన్మించిన వ్యక్తులందరికీ శని ప్రభావంతో విపరీతమైన ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా గణనీయమైన సమస్యల నుంచి ఈ సమయంలో పరిష్కారం లభించబోతోంది. ముఖ్యంగా కుటుంబ కలహాలు లేదా మానసిక ఒత్తిడి వంటి సమస్యలతో బాధపడుతున్న వారికి గొప్ప పరిష్కారం లభించబోతోంది. ముఖ్యంగా కొత్త ఇల్లులతో పాటు భూములు లేదా వాహనాలు కొనుగోలు చేయాలనుకుంటున్న వ్యక్తులందరికీ ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది. పూర్వికుల ఆస్తులకు సంబంధించిన విషయాల్లో కూడా అద్భుతమైన ధన లాభాలు కలుగుతాయి. పాత వివాదాలు మీకు అనుకూలంగా పరిష్కారం కావచ్చు. పని ప్రదేశాల్లో ప్రశంసలు లభించడమే కాకుండా మానసిక ఒత్తిడి నుంచి విముక్తి లభిస్తుంది..
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
గమనిక.. 
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Lionel Messi: మెస్సీ హిస్టారికల్ రికార్డ్.. హాట్రిక్ గోల్స్తో అల్జీరియా ఊచకోత.. వరల్డ్ కప్ ఆల్టైమ్ రికార్డ్ సమం..!
Secunderabad, Telangana:Argentina vs Algeria FIFA World Cup 2026 match Marathi report : 20 ఏళ్ల అనుభవం ఉన్న లియోనెల్ మెస్సీ తన మాయాజాలాన్ని మరోసారి ప్రదర్శించాడు. 38 ఏళ్ల మెస్సీకి ఇది బహుశా చివరి ప్రపంచ కప్ కావడంతో.. అతను మైదానంలోకి అడుగుపెట్టిన వెంటనే వాతావరణం చాలా భావోద్వేగభరితంగా మారింది. అర్జెంటీనా అభిమానులు కన్నీళ్ల ద్వారా తమ భావోద్వేగాలను వెలిబుచ్చడం కనిపించింది. మెస్సీ మూడు అద్భుతమైన గోల్స్ చేసి అభిమానుల నమ్మకాన్ని నిలబెట్టడమే కాకుండా ఫీఫా ఫుట్బాల్ ప్రపంచ కప్ చరిత్రలో అనేక రికార్డులను నెలకొల్పాడు. అతను అర్జెంటీనా తరఫున గోల్స్ చేసిన అతి పిన్న వయస్కుడైన.. అతి పెద్ద వయస్కుడైన ఆటగాడిగా నిలిచాడు. గొప్ప ఫుట్బాల్ ఆటగాడు పీలే రికార్డును కూడా బద్దలు కొట్టాడు. మెస్సీ మాయాజాలపు హ్యాట్రిక్ బలంతో, అర్జెంటీనా 3-0 తేడాతో అల్జీరియాను ఓడించింది.
కాన్సాస్ సిటీలోని ఆరోహెడ్ స్టేడియం మెస్సీతో నిండిపోయింది. 2006 జూన్ 16న తన ప్రపంచ కప్ అరంగేట్రం చేసిన యువ మెస్సీ, ఇప్పుడు అర్జెంటీనా తరపున వయోజనుడిగా ఆడుతున్నాడు. కానీ అతని వేగం, గోల్స్ చేయాలనే తపన ఇప్పటికీ అలాగే ఉన్నాయి. అందుకే అతను మ్యాచ్ ఐదవ నిమిషంలో ఒక అద్భుతమైన గోల్ చేశాడు. కానీ దురదృష్టవశాత్తు అది ఆఫ్ సైడ్ అయింది. అతనికి అల్జీరియా నుంచి కూడా వెంటనే సమాధానం లభించింది. కానీ అంపైర్ ఆఫ్ సైడ్ జెండా చూపడంతో వారు కూడా నిరాశపడాల్సి వచ్చింది. ఇరు జట్లు సమానంగా తలపడుతుండగా, మెస్సీ తన ఆకర్షణను ప్రదర్శించాడు. 17వ నిమిషంలో, అతను బాక్స్ వెలుపల నుంచి ఒక అద్భుతమైన గోల్ చేసి అర్జెంటీనాకు 1-0 ఆధిక్యాన్ని అందించడమే కాకుండా, అనేక రికార్డులను నెలకొల్పాడు.
డి పాల్ కొట్టిన ఫ్రీ కిక్ను ఒక డిఫెండర్ అడ్డుకున్నాడు. అతను మైదానం మధ్య నుండి ముందుకు దూసుకొచ్చి దూరం నుండి బలమైన షాట్ కొట్టాడు. ఆ బంతి గోల్ కీపర్ లూకా జిదాన్ వేళ్లను తాకుతూ నేరుగా నెట్లోకి దూసుకెళ్లింది. దీంతో స్టేడియం మొత్తం కేకలతో మారుమోగింది. మెస్సీ సాధించిన ఈ 14వ ప్రపంచ కప్ గోల్ అర్జెంటీనాకు ఆధిక్యాన్ని ఇచ్చింది. వారు మ్యాచ్పై తమ పట్టును నిలుపుకున్నారు. అల్జీరియా కూడా స్కోరును సమం చేయడానికి ప్రయత్నించింది, కానీ అర్జెంటీనా రక్షణ బలంగా ఉంది. రెండవ అర్ధభాగంలో కూడా అర్జెంటీనా దాడిని కొనసాగించింది. 60వ నిమిషంలో మెస్సీ సులభమైన గోల్ చేసి అర్జెంటీనా ఆధిక్యాన్ని 2-0కి పెంచాడు.
ప్రపంచ కప్లో ఇది అతనికి 15వ గోల్, దీనితో అతను టోర్నమెంట్ ఆల్-టైమ్ లీడింగ్ స్కోరర్గా బ్రెజిల్కు చెందిన రొనాల్డోతో కలిసి రెండవ స్థానానికి చేరుకున్నాడు. జర్మనీకి చెందిన మిరోస్లావ్ క్లోస్ (16) అగ్రస్థానంలో ఉన్నాడు. అలెక్సిస్ మెక్అలిస్టర్ దూరం నుండి కొట్టిన పవర్ ఫుల్ షాట్ను జిదాన్ అడ్డుకున్నాడు, అతను అక్కడే ఉండి రీబౌండ్ను ప్రశాంతంగా గోల్లోకి నెట్టాడు. 66వ నిమిషంలో మెస్సీ హ్యాట్రిక్ను అల్జీరియన్ గోల్ కీపర్ అడ్డుకున్నాడు.
ఫ్రాన్స్కు చెందిన కైలియన్ ఎంబాపే, నార్వేకు చెందిన ఎర్లింగ్ హాలాండ్ .. ఇప్పుడు అర్జెంటీనాకు చెందిన మెస్సీ తలా రెండు గోల్స్ చేసి ఈ ప్రపంచ కప్ను ఈరోజు చిరస్మరణీయం చేశారు. మెస్సీ 76వ నిమిషంలో ఒక అడుగు ముందుకు వేసి తన హ్యాట్రిక్ను పూర్తి చేశాడు. ఇది ప్రపంచ కప్లో అతనికి తొలి హ్యాట్రిక్. దీనితో, అతను ప్రపంచ కప్లో 16 గోల్స్తో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడి రికార్డును సమం చేశాడు. ప్రపంచ కప్లో హ్యాట్రిక్ సాధించిన అత్యంత పెద్ద వయసు ఆటగాడిగా నిలిచాడు. అర్జెంటీనా 3-0 తేడాతో విజయం సాధించింది.
Also Read: Business Ideas: మోదీ సర్కార్ అందిస్తున్న రూ.5 లక్షల లోన్ తీసుకుని
Also Read: కేంద్రంలోని మోదీ సర్కార్ అందించే రూ. 10లక్షలతో ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
UGC NET 2026: నెట్ రాసే అభ్యర్థులకు అలర్ట్.. అడ్మిట్ కార్డ్ లింక్ యాక్టివ్, ఇలా నిమిషాల్లో డౌన్లోడ్ చేసుకోండి!
Hyderabad, Telangana:UGC NET 2026 Admit Card Out: జూన్ 22, 23, 24, 25, 30 తేదీల్లో జరగబోయే పరీక్షల కోసం అడ్మిట్ కార్డులను NTA విడుదల చేసింది. అభ్యర్థులు తమ అప్లికేషన్ నంబర్, లాగిన్ క్రెడియన్షియల్స్ ఉపయోగించి వీటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. జూన్ 2026 నెట్ పరీక్షలు కంప్యూటర్ ఆధారితంగా (CBT) దేశవ్యాప్తంగా వివిధ కేంద్రాల్లో జూన్ 22 నుండి 30 వరకు నిర్వహించబడతాయి. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు తప్పనిసరిగా హాల్ టికెట్ను వెంట తెచ్చుకోవాలి.
యూజీసీ నెట్ అడ్మిట్ కార్డ్ 2026 డౌన్లోడ్ చేసే విధానం:
యూజీసీ నెట్ పరీక్ష రాసే అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ https://ugcnet.nta.nic.in/ ను ఓపెన్ చేసి, అక్కడ ఉన్న 'UGC NET Admit Card 2026' లింక్పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత తమ లాగిన్ వివరాలను సబ్మిట్ చేస్తే అడ్మిట్ కార్డ్ కనిపిస్తుంది. అందులో మీ వివరాలన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో తనిఖీ చేసుకుని వెంటనే ప్రింట్ తీసుకోవాలి.
యూజీసీ నెట్ జూన్ 2026 పరీక్షలు రెండు షిఫ్టులలో నిర్వహిస్తారు. మొదటి షిఫ్ట్ ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో షిఫ్ట్ మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఉంటుంది. అభ్యర్థులు తమ హాల్ టికెట్పై ఉన్న పేరు, ఫోటోగ్రాఫ్, పరీక్ష తేదీ, షిఫ్ట్ సమయాలను క్షుణ్ణంగా పరిశీలించుకోవాలి. పరీక్షా కేంద్రానికి అడ్మిట్ కార్డ్తో పాటు ఒక గుర్తింపు కార్డును (ID Proof) తప్పనిసరిగా తీసుకురావాలి.. లేనిపక్షంలో పరీక్ష రాయడానికి అనుమతించబడరు.
Also Read: యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల.. ఆ లిస్ట్లో మీ నెంబర్ ఉందో లేదో వెంటనే చూసుకోండి!
Also Read: జూన్ 21న నీట్ రాసే వారికి అలర్ట్.. పరీక్ష సమయం పెంపు, ఎన్టీఏ కీలక మార్పులు!
ఈ పరీక్షలో అర్హత సాధించిన వారు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (JRF), వివిధ యూనివర్సిటీలు లేదా కాలేజీల్లో పీహెచ్డీ ప్రోగ్రామ్లకు ప్రవేశం పొందవచ్చు. ఇప్పటికే NTA ఎగ్జామినేషన్ సిటీ డేట్ అడ్వాన్స్ స్లిప్స్ను జూన్ 10న విడుదల చేసింది. అభ్యర్థులు తమ ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవడానికి ఈ స్లిప్ ఉపయోగపడుతుంది.
అడ్మిట్ కార్డులు డౌన్లోడ్ చేయడంలో ఏవైనా ఇబ్బందులు ఎదురైతే, అభ్యర్థులు 011-4075900 నంబర్ను సంప్రదించవచ్చు లేదా NTA హెల్ప్ లైన్ డెస్క్ ఈమెయిల్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. పరీక్ష నిర్వహణకు సంబంధించిన తాజా సమాచారం కోసం అభ్యర్థులు క్రమం తప్పకుండా అధికారిక యూజీసీ నెట్ వెబ్సైట్ను పర్యవేక్షించాలని NTA కోరింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
KTR: రేవంత్ రెడ్డికి కేటీఆర్ హితవు.. 'నిరుద్యోగులను 5 వేల పోస్టులతో మోసం చేయొద్దు'
Hyderabad, Telangana:Police Aspirants Protest: ఏడాదికి రెండు లక్షలు ఉద్యోగాలు అంటూ హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మోసం చేయడంపై నిరుద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళన చేస్తుండగా వారికి అండగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ నిలిచారు. నిరుద్యోగులపై కాంగ్రెస్ ప్రభుత్వం లాఠీఛార్జ్ ప్రయోగించడాన్ని ఖండించారు. ఇది అత్యంత హేయమైన చర్యగా ప్రకటించారు. 5 వేల పోస్టులతో మరో మోసం చేయొద్దని.. 20,000 కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ చేయాలని మాజీ మంత్రి డిమాండ్ చేశారు.
లాఠీచార్జ్ ఖండన
హైదరాబాద్లోని దిల్సుఖ్నగర్లో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల అభ్యర్థులు ఆందోళన చేయగా.. పోలీసులు లాఠీచార్జి చేయడాన్ని ఖండిస్తూ కేటీఆర్ ఓ ప్రకటన విడుదల చేశారు. దిల్సుఖ్నగర్లో తమ న్యాయమైన డిమాండ్ల కోసం, ఉద్యోగాల భర్తీ కోసం శాంతియుతంగా ఆందోళన చేస్తున్న నిరుద్యోగ యువతపై, పోలీస్ అభ్యర్థులపై ప్రభుత్వం పోలీసులను ప్రయోగించి లాఠీఛార్జ్ చేయించడాన్ని తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యయుతంగా నిరసన తెలుపుతున్న అభ్యర్థులను వీధుల వెంట వెంటాడి వేటాడటం, అక్రమంగా అరెస్ట్ చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ అహంకారానికి, నిరంకుశత్వానికి నిదర్శనమని కేటీఆర్ మండిపడ్డారు.
పోలీసులతో అణగదొక్కడమే ఇందిరమ్మ పాలనా?
విద్యార్థులను నిరుద్యోగులను పోలీసులతో అణగదొక్కడమే కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన ఇందిరమ్మ ప్రజా పాలననా అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. ఇప్పటికే హైదరాబాద్తో పాటు అన్ని విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్లు జారీ చేయాలని అనేక రోజులుగా నిరసన కార్యక్రమాలు చేస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 20 వేల కానిస్టేబుల్ ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వాల్సిందేనని మాజీ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.
20 వేల పోలీస్ కానిస్టేబుల్ పోస్టులు
'ఎన్నికల ముందు ఒకే ఏడాది రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, 'మెగా నోటిఫికేషన్లు', 'జాబ్ క్యాలెండర్' అంటూ కోతలు కోసి.. నిరుద్యోగ యువతను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ, నేడు నిరుద్యోగుల నోట్లో మట్టి కొడుతోంది' అని రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో 20 వేలకు పైగా పోలీస్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా.. 5 వేల పోస్టులతో చేతులు దులుపుకోవాలని చూడడం అన్యాయమని తెలిపారు. సుదీర్ఘకాలంగా కోచింగ్ సెంటర్లలో శిక్షణ తీసుకుంటూ.. ఆర్థిక ఇబ్బందులు పడుతున్న అభ్యర్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వెంటనే 20,000 పోలీస్ కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేస్తూ మెగా నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
తక్షణమే విడుదల చేయాలి
దిల్సుఖ్నగర్లో హక్కుల కోసం పోరాడిన నిరుద్యోగ జేఏసీ నేతలను, విద్యార్థులను అక్రమంగా అరెస్ట్ చేసి పలు పోలీస్ స్టేషన్లకు తరలించడాన్ని కేటీఆర్ తప్పుపట్టారు. అరెస్టయిన ప్రతి ఒక్క నిరుద్యోగ బిడ్డను బేషరతుగా తక్షణమే విడుదల చేయాలని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. లాఠీలతో నిరుద్యోగుల గొంతు నొక్కాలని చూస్తే ఈ ప్రభుత్వానికి కాలం దగ్గరపడినట్టేనని హెచ్చరించారు.
లాఠీలతో అణచివేయలేరు
నిరుద్యోగుల ఆవేదనను, వారి న్యాయమైన డిమాండ్లను లాఠీలతో అణచివేయలేరని మాజీ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి ఇప్పటికైనా తన మొండివైఖరి వీడి 20 వేల కానిస్టేబుల్ పోస్టుల భర్తీ చేయాలని కోరారు. అంతేకాకుండా వయో పరిమితి సడలింపు చేసి నిరుద్యోగుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చకపోతే.. నిరుద్యోగ, విద్యార్థి సమాజానికి అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని ప్రకటించారు. భవిష్యత్లో తీవ్రస్థాయిలో ఉద్యమం చేస్తామని రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి కేటీఆర్ హెచ్చరించారు.
