Become a News Creator

Your local stories, Your voice

Follow us on
Download App fromplay-storeapp-store
Advertisement
Back
Khammam507003

ఖమ్మంలో 4 కోట్ల గంజాయిని దహనం: ఎక్సైజ్ పోలీసుల శక్తివంతమైన చర్య!

Oct 04, 2024 10:03:16
Kamanchikal, Telangana
ఖమ్మం ఎక్సైజ్ పరిధిలోని నాలుగు పోలీస్ స్టేషన్ లో రికవరీ చేసిన రూ. 4 కోట్ల విలువైన గంజాయిని దహనం చేసారు. 1611.947 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్న ఎక్సైజ్ పోలీసులు నగరంలోని ఐఎన్టీసీ కాంప్లెక్స్ లో దహనం చేసినట్లు అసిస్టెంట్ కమీషనర్ జి. గణేష్ తెలిపారు. జిల్లా నుండి వివిధ ప్రాంతాలకు గంజాయి సరఫరా అవుతుండగా అడ్డుకుని ప్రభుత్వ అనుమతితో దహనం చేసామన్నారు.
0
comment0
Report

For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com

Advertisement
HDHarish Darla
Mar 18, 2026 05:55:17
Hyderabad, Telangana:

EPS-95 Pension Hike 2026: ఉద్యోగులకు ముఖ్య గమనిక! దేశంలోని ప్రైవేట్ ఉద్యోగులకు ఇచ్చే కనీస పెన్షన్ రూ.1,000 నుంచి రూ.7,500లకు పెంచాలని డిమాండ్స్ వెల్లువెత్తుతున్న క్రమంలో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. అందుకు సంబంధించిన నిర్ణయాన్ని కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ లోక్‌సభ వేదికగా వెల్లడించారు.

ఉద్యోగులకు చెందిన ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) నుంచి ఓ కీలక అప్‌డేట్ రానుంది. 1995 నాటి ఉద్యోగుల పెన్షన్ కోసం ప్రవేశపెట్టిన ఈ పథకం కింద కనీస నెలసరి పెన్షన్‌ను రూ.7,500కు పెంచాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నారు. తాజాగా మార్చి 16న లోక్‌సభలో కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా ఓ కీలక ప్రకటన చేశారు. ప్రభుత్వానికి ఈపీఎస్-95 పెన్షన్ పెంచే యోచన లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ పథకం కింద పెన్షనర్లకు ప్రస్తుతం రూ.1,000 ఇస్తున్నారు. 

అదే విధంగా కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ నివేదించిన గ్రాంట్ల డిమాండ్లు (2026-27)పై 15వ నివేదికలో కూడా ఉద్యోగుల పెన్షన్ పథకం కింద నెలకు రూ.1,000 కనీస పెన్షన్‌గా పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది EPS-95 పెన్షనర్లు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని కనీస పెన్షన్‌ను పెంచాలని కోరుతూ పెన్షనర్లు పలు పిటిషన్లు దాఖలు చేశారు. 

రూ.15,000 కంటే తక్కువ మూల వేతనం (బేసిక్ పే) ఉన్నవారు మాత్రమే పింఛను పథకం పరిధిలోకి వస్తారు. 1995 నాటి ఉద్యోగుల పింఛను పథకానికి భారత సర్కార్ ఇప్పటికే ఆర్థిక సహాయం అందిస్తోందని కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇది ప్రభుత్వ వార్షిక వేతన వాటా అయిన 1.16 శాతానికి సమానం, దీనికి బడ్జెట్ మద్దతు కూడా ఉంది. ఈ క్రమంలో ఈపీఎస్ పెన్షన్‌ను పెంచే ఉద్దేశం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. 

నిజానికి, ఈపీఎస్-95 ఉద్యోగుల పెన్షన్ పథకం కింద ప్రస్తుతం రూ.1,000 నెలసరి ఇస్తున్న పింఛను సరిపోడం లేదనే వాదనలు వస్తున్నాయి. ఈ క్రమంలో కనీస పెన్షన్‌ను రూ.7,500లకు పెంచాలని పెన్షనర్లు, ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. అయితే పెన్షనర్ల డిమాండ్‌పై ప్రభుత్వం నుంచి ఎలాంటి సుముఖత లేకపోవడం వల్ల ఇటీవలే పెన్షనర్లు ఉద్యోగ సంఘాలు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మూడు రోజుల నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.

Also Read: Redmi A5 Sale: కేవలం రూ.7,599 ధరకే కొత్త మొబైల్ కొనేయండి! 5200mAh బ్యాటరీతో మార్కెట్లోకి బ్రాండ్‌ న్యూ స్మార్ట్‌ఫోన్!

Also Read: Vijay Trisha Relationship: హీరో విజయ్, త్రిష పెళ్లికి గ్రీన్‌ సిగ్నల్! హింట్ ఇచ్చిన హీరోయిన్..పెళ్లి డేట్ ప్రకటించేంది ఆ రోజే!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

1060
comment0
Report
DDDharmaraju Dhurishetty
Mar 18, 2026 05:25:24
Hyderabad, Telangana:

Mahalakshmi Rajayoga Effect On Zodiac Telugu: గ్రహాల గమనాలు మానవ జీవితాలపై ఎంత ప్రభావం చూపుతాయో మనందరికీ తెలిసిందే. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ప్రస్తుతం విగ్రహ స్థితిగతుల్లో వస్తున్న మార్పులు కొన్ని రాశుల వారికి అద్భుతమైన యోగాలను తెచ్చిపెట్టబోతున్నాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా మార్చి 16వ తేదీ సోమవారం సాయంత్రం కుంభరాశిలోకి సేనాధిపతిగా భావించే.. కుజుడు సంచారం చేశాడు. అలాగే అదే సమయంలో చంద్రుడితో కలయిక జరపడం విశేషం. అయితే, చంద్రుడు, కుజుడు కలయిక కారణంగానే ఎంతో శక్తివంతమైన మహాలక్ష్మి రాజయోగం కూడా ఏర్పడింది. ఈ యోగం చాలా శక్తివంతమైనదిగా చెప్పుకుంటారు.

సోమవారం సాయంత్రం 6 గంటల సమయంలో చంద్రుడు కుంభరాశిలోకి ప్రవేశించడంతో ఈ రాజయోగ ప్రభావం ప్రారంభమైంది. మార్చి 18వ తేదీ రాత్రి 11 గంటల వరకు అంటే, దాదాపు రెండున్నర రోజులపాటు దీని ప్రభావం బలంగా ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. అంతేకాకుండా ఆ తర్వాత రోజుల్లో కూడా దీని ప్రభావం కాస్త ఉండే అవకాశాలు ఉన్నాయని వారు చెబుతున్నారు. అయితే, తక్కువ సమయంలోనే ఈ రెండు గ్రహాల కలయిక జరగడం వల్ల కొన్ని రాశుల వారికి ఊహించని ధన లాభాలతో పాటు వృత్తిపరమైన జీవితంలో ఎదుగుదల కనిపించబోతోంది. అంతేకాకుండా ఆర్థికంగా చాలా వరకు కలిసి రాబోతోంది.

మేషరాశి 
మేషరాశి వారికి ప్రస్తుతం శని ప్రభావం కొంత ఇబ్బందులు కలిగిస్తున్నప్పటికీ.. ఈ మహాలక్ష్మి రాజయోగం కాస్త ఉపశమనం అందిస్తుంది. ముఖ్యంగా ఈ సమయంలో పెండింగ్‌లో ఉన్న ప్రతి పని వేగంగా పూర్తవుతుంది. అలాగే అకస్మాత్తుగా కూడా భారీ మొత్తంలో ధన లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడటమే కాకుండా మానసిక ప్రశాంతత కూడా లభించబోతోంది. దీర్ఘకాలిక సమస్యలు కూడా ఎంతో సులభంగా తొలగిపోతాయి..

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

కర్కాటక రాశి 
కర్కాటక రాశిలో జన్మించిన వ్యక్తులకు కూడా చంద్రుడి ప్రభావం అద్భుతమైన ప్రయోజనాలను అందించబోతోంది. వీరికి అదృష్టం రెట్టింపు కాబోతోంది. దీంతోపాటు భూమి లేదా ఆస్తి తగాదాలు కూడా తొలగిపోతాయి. కోర్టు సంబంధిత కేసుల్లో ఉన్న వ్యక్తులకు ఈ సమయంలో అనుకూలమైన తీర్పులు వస్తాయి. దీంతోపాటు గతంలో నిలిచిపోయిన డబ్బులు కూడా తిరిగి పొందగలుగుతారు. వ్యాపారస్తులకు నూతన పెట్టుబడులు చాలా లాభదాయకంగా ఉంటాయి. అంతేకాకుండా వ్యాపారాలను విస్తరించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.

వృశ్చిక రాశి 
వృశ్చిక రాశిలో జన్మించిన వ్యక్తులకు అధిపతి కుజుడుగా ఉంటాడు. కాబట్టి వృశ్చిక రాశి వారికి కూడా కుజుడు, చంద్రుడి కలయిక అద్భుతమైన ప్రయోజనాలను అందించబోతోంది. వీరికి ఈ సమయంలో గౌరవ మర్యాదలు కూడా విపరీతంగా పెరుగుతాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ లేదా జీతాలు కూడా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా గతంలో చేసిన కష్టాలకు తగిన ప్రతిఫలం కూడా లభించబోతోంది. అలాగే అనుకూలమైన ధన లాభాలు సొంతం చేసుకోవడం వల్ల అన్నింట్లో విజయాలు సాధించగలుగుతారు.

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

1042
comment0
Report
DDDharmaraju Dhurishetty
Mar 18, 2026 05:12:47
Hyderabad, Telangana:

Saturn Mars Effect Zodiac 2026: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహ కదలికలాన్ని మానవ జీవితాల పై తీవ్ర ప్రభావాన్ని చూపుతూ ఉంటాయి. ముఖ్యంగా 2026 సంవత్సరం ఏప్రిల్ రెండవ తేదీన ఒక కీలక పరిణామం చోటు చేసుకోబోతోంది. సుమారు 18 నెలల తర్వాత అంగారకుడు గురుగ్రహానికి చెందిన మీనరాశిలోకి సంచారం చేయబోతున్నాడు. అక్కడ అప్పటికి సూర్యుడుతో పాటు శని శుక్ర గ్రహాలు సంచార దశలో ఉన్నాయి.. దీనివల్ల మీన రాశిలో అనేక గ్రహాల కలయిక ఏర్పడబోతోంది. ముఖ్యంగా జ్యోతిష్య పరిభాషలో శని మంగళ సంయోగం కూడా ఏర్పడుతుంది. అయితే, ఈ సంయోగం అత్యంత ప్రమాదకరమైనదిగా చెప్పుకుంటారు.. 

ఈ రెండు గ్రహాల సంయోగం వల్ల ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ప్రభావం పడుతుందట. ముఖ్యంగా అన్ని దేశాల్లో అశాంతి నెలకొనే అవకాశాలు ఉన్నాయి. కొన్ని దేశాల మధ్య యుద్ధ వాతావరణం ముదిరే ప్రమాదం కూడా ఉందని జ్యోతిష్య శాస్త్రాన్ని గునులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ మార్పులు ఐదు రాశుల వారిపై ఆర్థికంగాను.. ఆరోగ్యంగాను అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నాయి. అయితే, ఈ సమయంలో తప్పకుండా జాగ్రత్తలు పాటించాల్సిన రాశులేవో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ప్రభావితం కాబోతున్న రాశులు ఇవే..
మేషరాశి 
మేష రాశి వారికి 12వ స్థానంలో శని మంగళ గ్రహాల కలయిక జరగబోతోంది. దీని కారణంగా ఎలాంటి పనులు చేపట్టిన వీరు తీవ్ర ఒత్తిడికి గురవుతూ ఉంటారు.. అంతేకాకుండా అనేక సవాళ్లు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. నమ్మిన వారు నుంచి మోసాలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. శక్తి సామర్థ్యాలు తగ్గినట్లు అనిపించినప్పటికీ.. కాస్త జాగ్రత్తగా ముందుకు వెళ్లడం వల్ల మంచి ప్రయోజనాలు పొందగలుగుతారు. ముఖ్యంగా వీరు అపరిచితులతో చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది.

కన్య రాశి 
కన్యా రాశి వారికి ఏడవ స్థానంలో శని మంగళ యోగం ఏర్పడటం వల్ల వైవాహిక జీవితంలో అనేక సమస్యలు రావచ్చని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారాల్లో ఊహించని గొడవలు కూడా చోటు చేసుకోబోతున్నాయని వారు చెబుతున్నారు. అలాగే ఈ సమయంలో వ్యాపారాలు చేసేవారు కాస్త జాగ్రత్తగా ఉండడం మంచిది. ముఖ్యంగా అనేక సంక్లిష్టమైన పరిస్థితులు ఏర్పడినప్పటికీ, ఈ సమయంలో కాస్త జాగ్రత్తగా ఉంటే మంచి ఫలితాలు పొందడం ఖాయమని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.

వృశ్చిక రాశి 
వృశ్చిక రాశి వారికి ఐదవ స్థానంలో ఈ రెండు గ్రహాల కలయిక జరిగింది.. దీని కారణంగా పిల్లల విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం వస్తుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఆర్థిక పరిస్థితులు కూడా గతంలో కంటే మరింత ఒడిదుడుకులకు దారి తీసే అవకాశాలున్నాయి. ప్రేమ వ్యవహారాల్లో మనస్పార్ధాలు వచ్చే ఛాన్స్ కూడా ఉంది. అంతేకాకుండా మాటపై నియంత్రణ కూడా చాలా అవసరమని నిపుణులు తెలుపుతున్నారు. 

మకర రాశి 
మూడవ స్థానంలో మకర రాశి వారికి ఈ రెండు గ్రహాల కలయిక జరుగుతుంది.. అయితే, వీరికి ఈ సమయంలో ధైర్యం పెరిగినప్పటికీ మొండితనం వల్ల అనేక ఇబ్బందులు ఎదురవుతాయి. తోబుట్టులతో లేదా కుటుంబ సభ్యులతో వివాదాలు కూడా తరలితే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్థిక లాభాలు ఉన్నప్పటికీ.. మానసిక ఒత్తిడి తీవ్రంగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ఆరోగ్యం కాస్త జాగ్రత్తగా ఉంచుకోవడం చాలా మంచిది.

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

1068
comment0
Report
DDDharmaraju Dhurishetty
Mar 18, 2026 04:57:37
Hyderabad, Telangana:

Saturn Transit 2026 Effect On Zodiac: జ్యోతిష్య శాస్త్రం పరంగా గ్రహాల గమనంలో మార్పులు మానవ జీవితంపై ఊహించని ప్రభావాన్ని చూపుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా కర్మ ఫలాదాతగా భావించి శని దేవుడు ఒక నక్షత్రం నుంచి మరొక నక్షత్రం వెళ్లడం వల్ల అత్యంత కీలక ఘట్టంగా జ్యోతిష శాస్త్రంలో పరిగణిస్తారు. ఇదిలా ఉంటే ఏప్రిల్ నెలలోని శని దేవుడు భాద్రపద నక్షత్రంలో కదలికలు జరపబోతున్నాడు. ఈ మార్పుల కారణంగా ఎంతో శక్తివంతమైన రాజయోగం కూడా ఏర్పడబోతోంది. దీనివల్ల కొన్ని రాశుల వారికి ఆర్థిక లాభాలు కూడా చేకూరబోతున్నట్లు జ్యోతిష్య శాస్త్రం ఎప్పుడు చెబుతున్నారు..

ప్రస్తుతం శని మీనరాశిలో సంచార దశలో ఉంది.. తన సొంత నక్షత్రమైన ఉత్తరాభాద్ర నక్షత్రంలోని కదలికలు జరపడం వల్ల శని ప్రభావం రెట్టింపు అవుతుంది. దీనివల్ల ఆయా రాశుల వారికి క్రమశిక్షణ విపరీతంగా పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దీంతోపాటు కష్టపడే తత్వం పెరిగి.. అనుకూలమైన శక్తులు కూడా పొందగలుగుతారు. అంతేకాకుండా కొన్ని రాశుల వారికి ఇది సువర్ణ కాలంగా భావించవచ్చు..

మేషరాశి 
శని నక్షత్రంలో కదలికలు జరపడం వల్ల మేష రాశి వారికి అద్భుతమైన ప్రయోజనాలు కలగబోతున్నాయి. ముఖ్యంగా నిలిచిపోయిన పనులు వేగవంతమవుతాయి. అంతేకాకుండా నిరుద్యోగులకు కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయి. కార్యాలయాల్లో పై అధికారుల ప్రశంసలు కూడా దక్కుతాయి. ఆర్థిక స్థిరత్వం కూడా ఏర్పడటమే కాకుండా పాత బాకీలు వసూళ్లయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మిథున రాశి 
మిథున రాశిలో జన్మించిన వ్యక్తులకు అదృష్టం కూడా విపరీతంగా పెరుగుతుంది. వ్యాపారస్తులకు నూతన పెట్టుబడులు లాభసాటిగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. విదేశీ ప్రయాణాలు కలిసి రాబోతున్నా. సమాజంలో గౌరవ మర్యాదలు పెరగడమే కాకుండా.. కుటుంబంలో చిన్నపాటి కలహాలు సర్దుమనిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనుకున్న పనుల్లో అడ్డంకులు తొలగిపోయి.. భారీ మొత్తంలో ఆర్థిక లాభాలు కూడా పొందుతారు.

ధనస్సు రాశి 
ధనస్సు రాశిలో జన్మించిన వ్యక్తులకు శని దేవుడి అనుగ్రహం వల్ల ఆకస్మిక ధనలాపాలు కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ లేదా మార్కెట్ రంగాల్లో పెట్టుబడులు పెట్టే, వ్యక్తులకు భారీ లాభాలు కూడా చేకూరుతాయి. అలాగే వ్యాపారాలు చేస్తున్న వ్యక్తులు ఈ సమయంలో మంచి లాభాలు కూడా పొందుతారు. విద్యార్థులు పోటీల్లో అద్భుతమైన ఫలితాలు పొందుతారు. ఆరోగ్యపరంగా ఉన్న దీర్ఘకాలిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. అంతేకాకుండా ఎలాంటి పనులు చేసిన మంచి లాభాలు పొందుతారు.

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

1021
comment0
Report
HDHarish Darla
Mar 18, 2026 02:58:12
Hyderabad, Telangana:

Redmi A5 Price Specifications: ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ రెడ్‌మీ నుంచి మరో సరికొత్త స్మార్ట్‌ఫోన్ అందుబాటులోకి రానుంది. ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్ ప్రవేశపెట్టిన సేల్‌లో రెడ్‌మీ A5 స్మార్ట్‌ఫోన్ చాలా తక్కువ ధరకు అందుబాటులోకి వచ్చిసేంది. రెడ్‌మీ వర్షెన్‌లో ఇది బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌గా విశ్లేషకులు చెబుతున్నారు. 5200mAh బ్యాటరీ కెపాసిటీతో కేవలం రూ.7,599 ప్రారంభ ధరతో ఈ స్మార్ట్‌ఫోన్‌ అందుబాటులోకి వచ్చింది. 

ఈ రెడ్‌మీ ఏ5 స్మార్ట్ ఫోన్ ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్‌లో అమ్మకానికి ఉంది. అందులో 3GB RAM + 64GBతో పాటు 4GB RAM + 64GB అనే రెండు స్టోరేజ్ వేరియంట్లలో వస్తుంది. అయితే ఈ మోడల్ వేరియంట్లను రూ.8,999 ప్రారంభ ధరతో భారత విపణిలోకి విడుదల చేశారు. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ జరుగుతున్న సేల్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ రూ.7,999 కే కస్టమర్లకు అందుబాటులో ఉంది. అయితే ఈ మొబైల్ కొనుగోలు సమయంలో మీరు అదనంగా రూ.400 తగ్గింపు కూడా పొందవచ్చు. ఈ రెడ్‌మి A5 స్మార్ట్‌ఫోన్ 6.88-అంగుళాల HD+ డిస్‌ప్లేతో వస్తుంది. ఈ డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది. అయితే ఈ ఫోన్ గరిష్టంగా 600 నిట్స్ ప్రకాశాన్ని సపోర్ట్ చేస్తుంది.

అలాగే ఈ ఫోన్‌లో యూనిసోక్ T7250 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇది 4GB RAM, 128GB వరకు స్టోరేజ్‌తో వస్తుంది. దీనిలో 5,200mAh బ్యాటరీ ఉంది. ఇది 10W USB టైప్-సి ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఎక్స్‌ట్రార్డినరీ ఫొటోల కోసం 32MP బ్యాక్ కెమెరాతో పాటు 8MP సెకండరీ కెమెరా కూడా ఉంది. ఇది ఆండ్రాయిడ్ 15 గో ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేస్తుంది. ఇది డ్యూయల్ 4G సిమ్ కార్డులకు సపోర్ట్ చేస్తుంది.

Also Read: Vijay Trisha Relationship: హీరో విజయ్, త్రిష పెళ్లికి గ్రీన్‌ సిగ్నల్! హింట్ ఇచ్చిన హీరోయిన్..పెళ్లి డేట్ ప్రకటించేంది ఆ రోజే!

Also Read: IPL Winner Prediction: "ఈసారి కూడా చెన్నై సూపర్‌కింగ్స్ ట్రోఫీ గెలవదు" ఎంఎస్ ధోనీపై మాజీ క్రికెటర్ షాకింగ్ కామెంట్స్!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

1072
comment0
Report
HDHarish Darla
Mar 18, 2026 01:46:33
Tamil Nadu:

Vijay Trisha Relationship Rumors: ప్రముఖ తమిళ నటుడు విజయ్ పేరు ఇప్పుడు తమిళ నాట రాజకీయాల్లోనే కాకుండా ఇప్పుడు దేశ వ్యాప్తంగా మారుమ్రోగుతుంది. సినిమాల్లో హీరోగా రాణించిన విజయ్.. ఇప్పుడు పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలని ప్లాన్ చేసుకున్నాడు. రాబోతున్న తమిళనాడు ఎలక్షన్‌ టార్గెట్ చేసుకోని తమిళ వెట్రి కజగం అనే రాజకీయ పార్టీ పెట్టిన విజయ్.. విజయవంతంగా కొన్ని రోడ్‌ షోలు, సభలు నిర్వహించారు. అయితే ఇప్పుడు రాజకీయంగా, వ్యక్తిగతంగా, వృత్తిపరంగా కొన్ని చిక్కులు ఎదురుపడ్డాయి. 

హీరో విజయ్ రాజకీయంగా కరూర్ తొక్కిసలాట ఘటన కారణంగా సీబీఐ కేసు విచారణ చేపట్టింది. అలాగే వ్యక్తిగతంలో ఆయన భార్య విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కిన సంగతి తెలిసిందే. గత కొన్నేళ్లుగా తన భర్త విజయ్ మరో హీరోయిన్‌తో సన్నిహితంగా ఉంటున్నాడని.. తనకు విడాకులు కావాలని ఆమె కోర్టుకు విన్నవించింది. అయితే ఆ హీరోయిన్ మరెవరో కాదు త్రిష అంటూ కొన్ని కథనాలు వెలువడ్డాయి. అయితే ఈ ఆరోపణలు వచ్చిన మరుసటి రోజే హీరో విజయ్, హీరోయిన్ త్రిష కలిసి ఓ పెళ్లి ఈవెంట్‌కు హాజరయ్యారు. దీంతో ఆ హీరోయిన్ త్రిషానే అంటూ తెగ చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలో విజయ్ తన భార్యతో విడాకులు అయిపోయిన తర్వాత త్రిష, విజయ్ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు వస్తున్నాయి. 

హీరో విజయ్, త్రిష కలిసి అనేక సినిమాల్లో కలిసి నటించారు. వీరిద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉందని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే విజయ్ రాజకీయ పార్టీ టీవీకేలో త్రిష చేరనుందని..త్వరలోనే ఆమె అసెంబ్లీ ఎన్నికల్లోనూ పోటీ చేస్తుందని తమిళనాట కోడై కూస్తోంది. ఇటీవలే విజయ్, త్రిష ఓ పెళ్లి వేడుకలో పాల్గొనడం హాట్ టాపిక్ గా మారిన క్రమంలో అందుకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అయ్యాయి. 

ఇప్పుడు నెట్టింట ఈ వీడియోకు హీరోయిన్ త్రిష లైక్ కొట్టడమే ఇప్పుడు మరో ఆరోపణకి తెర లేపింది. అలాగే హీరో విజయ్, త్రిషలకు పెళ్లైనట్లు ఓ ఫ్యాన్స్ కృతిమ మేధా ఆధారంగా వీడియో క్రియేట్ చేశాడు. అందుకు హీరోయిన్ త్రిష లైక్ కొట్టింది. ఈ వీడియోలో పలువురు సెలబ్రిటీలు వారి పెళ్లికి వచ్చినట్లు వైరల్ చేశారు. దీంతో విజయ్‌తో ఆమెకు ఉన్న సంబంధం నిజమే అని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. 

ఇంటర్నెట్‌లో ఈ వీడియో చక్కర్లు కొడుతోంది. వీడియోకు హీరోయిన్ త్రిష కృష్ణన్ కూడా లైక్ కొట్టడం వల్ల వీరిద్దరి పెళ్లి లాంఛనమే అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. త్రిష పుట్టినరోజు 2026 మే 4 రోజునే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాబట్టి.. అదే రోజున సీఎంగా గెలిచి త్రిషకు గిఫ్ట్ ఇవ్వాలని విజయ్ నిర్ణయించుకున్నట్లు సోషల్ మీడియాలో 'పుష్ప 2' మీమ్స్ వైరల్ అవుతున్నాయి.  

మరోవైపు హీరో విజయ్‌కు వృత్తిపరంగానూ కొన్ని చిక్కులు వచ్చిపడ్డాయి. ఆయన నటించిన చివరి సినిమా 'జన నాయగన్' సంక్రాంతికి రిలీజ్ చేయాల్సి ఉండగా.. అనేక చిక్కులు కారణంగా ఇప్పటికీ ఆ చిత్రం రిలీజ్ కు నోచుకోలేదు. తాజాగా ఓటీటీ సంస్థ కూడా సినిమాను కొనుగోలు చేయడం లేదని తేల్చి చెప్పడంతో నిర్మాతలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

Also Read: Bengali Wedding Lip Kiss: పెళ్లిపీటలపై వధూవరులు రోతపని..బంధువులు చూస్తుండగానే 35 సెకన్ల పాటు..ఏందీ చెండాలం!

Also Read: LPG Cylinder Price: సామాన్యుడికి షాకింగ్ న్యూస్..ఒక్కో గ్యాస్ సిలిండర్ ధర రూ.7,000 అమ్మకం..ఎక్కడంటే?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

1097
comment0
Report
RKRavi Kumar Sargam
Mar 17, 2026 17:53:57
Wadgaon, Maharashtra:

Minimum Pension Hike Rs 7,500: ఉద్యోగ లోకం దశాబ్దాలుగా కనీస పింఛన్‌ పెంపు కోసం ఎదురుచూస్తోంది. ద్రవ్యోల్బణం తీవ్ర స్థాయిలో ఉన్నా కూడా తమకు పింఛన్‌లో మాత్రం ఎలాంటి మార్పు ఉండడం లేదు. మూడు దశాబ్దాలుగా కనీస పింఛన్‌ రూ.వెయ్యి మాత్రమే ఉంది. దేశవ్యాప్తంగా అన్నీ ధరలు పెరుగుతుండగా.. దానికి అనుగుణంగా తమ పింఛన్‌ పెరగకపోవడంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే పింఛన్‌ పెంపుపై వార్తలు వస్తున్నాయి. కనీస పింఛన్‌ను రూ.7,500కు పెంచాలని ఉద్యోగ సంఘాలు, కార్మికులు డిమాండ్‌ చేస్తున్నారు. తాజాగా వారి డిమాండ్‌కు ఆమోద ముద్ర పడే అవకాశాలు ఉన్నాయి. కనీస పింఛన్‌ సవరణకు పార్లమెంటరీ కమిటీ ఆమోదం తెలిపినట్టు సమాచారం. ఈ సందర్భంగా పార్లమెంటరీ కమిటీ కీలక ప్రతిపాదనలు చేసింది.

Also Read: One Crore Robbery: 24 గంటల్లో రూ.కోటి దోపిడీ కేసు ఛేదన.. శభాష్‌ హైదరాబాద్‌ పోలీస్‌!

ఈపీఎఫ్ పెన్షన్‌ను పెంచాలని పార్లమెంటరీ ప్యానెల్ సూచించింది. పింఛన్‌దారులు తమ ప్రాథమిక అవసరాలు రూ.1,000తో తీర్చుకోలేరని స్పష్టం చేసింది. ఈపీఎఫ్ చందాదారులు రిటైర్మెంట్ తర్వాత పొందే పెన్షన్‌కు సంబంధించి పార్లమెంటరీ ప్యానెల్ కేంద్ర ప్రభుత్వానికి కొన్ని కీలక ప్రతిపాదనలు చేసింది. ఉద్యోగ పింఛన్‌ పథకం (ఈపీఎస్‌ 1995) కింద ప్రస్తుతం పొందుతున్న కనీస పింఛన్‌ రూ.1000 మొత్తాన్ని పెంచాలని పార్లమెంటరీ కమిటీ కేంద్రానికి సూచించింది. కనీస పింఛన్‌ పింఛన్‌దారులకు గౌరవప్రదంగా ఉండాలని కమిటీ తెలిపింది.

Also Read: School Holiday: విద్యార్థులకు 'పండుగే'.. వరుసగా నాలుగు రోజులు స్కూల్స్‌కు హలీడే

కార్మిక, జౌళి, నైపుణ్య అభివృద్ధిపై ఏర్పాటుచేసిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఇటీవల తన 15వ నివేదికను సమర్పించింది. ఆ నివేదికలో కనీస పింఛన్‌పై పలు కీలక అంశాలను ప్రస్తావించింది. ఈపీఎస్ కనీస పెన్షన్ పెంచాలని పెన్షనర్లు దశాబ్దాలుగా డిమాండ్ చేస్తున్నారని... ప్రస్తుత ద్రవోల్బణ పరిస్థితులకు ఇప్పుడు పొందుతున్న పింఛన్‌ మొత్తం ఏమాత్రం సరిపోవడం లేదని.. దాన్ని రూ.7,500కు పెంచాలని డిమాండ్‌ చేస్తున్న విషయాన్ని నివేదికలో ప్రస్తావించినట్లు సమాచారం.

Also Read: Ugadi Gift: ఏపీ ప్రభుత్వం ఉగాది గిఫ్ట్‌.. రేపు మంగళగిరిలో దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రారంభం

పింఛన్‌దారులు తమకు అందుతున్న రూ.వెయ్యి పింఛన్‌ ఏమాత్రం సరిపోవడం లేదని.. కనీస పింఛన్‌ రూ.7,500కు పెంచానలి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మూడు రోజుల పాటు ధర్నా నిర్వహించిన విషయం తెలిసిందే. పింఛన్‌దారుల ఆవేదన.. నిరసనపై పార్లమెంటరీ స్థాయీ సంఘం స్పందించింది. కనీస పెన్షన్‌పై పింఛన్‌దారుల నుంచి విజ్ఞప్తులు వచ్చినట్లు.. ద్రవ్యోల్బణం, ఆరోగ్యం, రోజువారీ ఖర్చు పెరగడంతో ప్రస్తుతం ఉన్న కనీస మొత్తం ఏమాత్రం సరిపోదని కమిటీ తన నివేదికలో అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో ఉద్యోగుల పింఛన్‌ పథకం (ఈపీఎస్‌ 1995)ను సవరణ చేసి.. కనీస పెన్షన్ మొత్తాన్ని పెంచాలని పార్లమెంటరీ స్థాయీ సంఘం ప్రతిపాదన చేసింది. కనీస పింఛన్‌ పెంపు కోసం కేటాయింపులు చేయాలని పార్లమెంటరీ స్థాయీ సంఘం కేంద్ర ప్రభుత్వానికి సూచనలు చేసింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

1091
comment0
Report
RKRavi Kumar Sargam
Mar 17, 2026 17:23:26
Hyderabad, Telangana:

Kukatpally Rs 1 Crore Robbery Case: తెలంగాణలో శాంతిభద్రతలపై ఆందోళన కొనసాగుతున్న సమయంలో పోలీసులు కేసుల పరిష్కారంలో వేగంగా స్పందిస్తున్నారు. హత్యలు, అత్యాచారాలు, దోపిడీలు, దొంగతనాలు పెరుగుతున్నా అదే స్థాయిలో పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఓ భారీ దోపిడీ జరగ్గా 24 గంటలు కూడా గడవకముందే కేసును ఛేదించి శభాష్‌ అనిపించుకున్నారు. హైదరాబాద్‌ పోలీసులు అత్యంత వేగంగా స్పందించి దుండగులను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. కూకట్‌పల్లిలో సంచలనం రూ.కోటి నగదు దారి దోపిడీ కేసు వివరాలు ఇలా ఉన్నాయి.

Also Read: School Holiday: విద్యార్థులకు 'పండుగే'.. వరుసగా నాలుగు రోజులు స్కూల్స్‌కు హలీడే

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి పరిధిలోని మెట్రో పిల్లర్‌ వద్ద సోమవారం రాత్రి దాదాపు 10 గంటల సమయంలో రూ.కోటి నగదు తీసుకెళ్తున్న వారిని కొందరు దుండగులు కారం పొడి చల్లి దారి దోపిడీకి పాల్పడ్డారు. ఈ సంఘటన ఒక్కసారిగా తీవ్ర సంచలనం రేపింది. రూ.కోటి దోపిడీ కేసును పోలీసులు చాలెంజింగ్‌గా తీసుకుని వెంటనే స్పందించి నిందితులను గుర్తించే పనిలో పడ్డారు. బాధితుడిని పరిశీలించి వివరాలు సేకరించగా అతడిపైనే అనుమానం వ్యక్తమైంది. అనంతరం లోతుగా విచారించడంతోపాటు దుండగులను ట్రాక్‌ చేయడంతో వారు సులువుగా దొరికిపోయారు. 24 గంటల్లోనే కేసును ఛేదించిన కూకట్‌పల్లి పోలీసులు ప్రధాన సూత్రధారితోపాటు నలుగురిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.77.39 లక్షల నగదు, రూ.39,195 విలువైన విమాన టికెట్లను స్వాధీనం చేసుకున్నట్లు కూకట్‌పల్లి జోన్ డీసీపీ రీతీరాజ్ వెల్లడించారు.

Also Read: Ugadi Gift: ఏపీ ప్రభుత్వం ఉగాది గిఫ్ట్‌.. రేపు మంగళగిరిలో దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రారంభం

ఏం జరిగింది?
హైదరాబాద్‌ పాతబస్తీలోని బహదూర్‌పురాకు చెందిన ఖుస్రోద్దీన్ తన యజమాని పంపిన హవాలా నగదుపై కన్నేశాడు. తన స్నేహితుడు ఒమర్ షరీఫ్ గ్యాంగ్‌తో కలిసి దోపిడీకి స్కెచ్ వేశాడు. సోమవారం రాత్రి కూకట్‌పల్లిలో కోటి రూపాయల నగదు తీసుకుని వెళ్తుండగా ముందస్తు పథకం ప్రకారం నిందితులు వెంబడించారు. కూకట్‌పల్లిలోని పిల్లర్ నం.836 వద్ద రాగానే ఖుస్రోద్దీన్, అజీముద్దీన్‌ కళ్లలో కారం పొడి చల్లారు. వారిపై దాడి చేసినట్టు చేసి రూ.కోటి నగదుతో దుండగులు పరారయ్యారు. అయితే ఆ సమయంలో కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో సీసీటీఎన్ఎస్ విభాగంలో పనిచేస్తున్న కానిస్టేబుల్‌ సీఐ సుబ్బారావుకు సమాచారం అందించారు. దీనితో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Also Read: Harish Rao: తెలంగాణను చంద్రబాబుకు రేవంత్ రెడ్డి తాకట్టు..  నదీ జలాలపై హరీశ్ రావు తీవ్ర వ్యాఖ్యలు

నిందితులు వదిలేసిన హోండా యాక్టివా ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారాలతో నిందితులు శంషాబాద్ విమానాశ్రయంలో ఉన్నట్లు గుర్తించారు. దండుగులు లక్నో పారిపోయేందుకు ప్రయత్నించగా అక్కడే ఎయిర్‌పోర్టులో అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన వారిలో ఒమర్ షరీఫ్, గౌస్ సద్దాం, హమీద్, ఖుస్రోద్దీన్ ఉన్నారు. పరారీలో ఉన్న మరో ఐదుగురి కోసం పోలీసులు గాలింపు చేస్తున్నారు. ఈ కేసులో బాధితుడిగా ప్లాన్ ప్రకారం వ్యవహరించిన ఖుస్రోద్దీన్‌నే ప్రధాన సూత్రధారిగా గుర్తించారు. డబ్బుల కోసం ఆశపడి ఈ తతంగాన్ని నడిపించాడని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. 24 గంటల వ్యవధిలో కేసును చేదించిన కూకట్‌పల్లి, సీసీఎస్ పోలీసులను అభినందించి వారికి నగదు ప్రోత్సాహక బహుమతి అందించారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

1096
comment0
Report
RKRavi Kumar Sargam
Mar 17, 2026 16:16:28
Wadgaon, Maharashtra:

Four Days Schools To Remain Closed: విద్యా సంవత్సరం ముగుస్తున్నా కూడా ఈ ఏడాది విద్యార్థులకు భారీ సెలవులు వస్తున్నాయి. ఈ విద్యా సంవత్సరం భారీగా సెలవులు రాగా.. ముగింపు దశలోనూ మళ్లీ విద్యార్థులకు భారీగా సెలవులు వస్తున్నాయి. వరుసగా నాలుగు రోజులు స్కూళ్లకు సెలవులు రానున్నాయి. అయితే వాటిలో ఒకటి వ్యక్తిగతంగా డుమ్మా కొడితే మాత్రం ఆ నాలుగు సెలవులు వస్తాయి. ఎందుకంటే ఉగాది, రంజాన్‌ పండుగల మధ్య ఒక రోజు సెలవు లేదు. ఆ తర్వాత ఆదివారం వచ్చేసింది. శుక్రవారం సెలవు పెడితే వరుసగా నాలుగు రోజుల సెలవులను ఎంజాయ్‌ చేయవచ్చు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Also Read: Ugadi Gift: ఏపీ ప్రభుత్వం ఉగాది గిఫ్ట్‌.. రేపు మంగళగిరిలో దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రారంభం

ప్రపంచవ్యాప్తంగా రంజాన్‌ పండుగతోపాటు భారతదేశంలో ఉగాది, గుడి పడ్వా అనే పండుగలు పెద్ద ఎత్తున చేసుకుంటారు. హిందూవులకు ఉగాది, ముస్లింలకు రంజాన్‌ అతి పెద్ద పండుగలు. ఈ పండుగల సందర్భంగా ఆయా వర్గాలకు భారీగా సెలవులు వస్తున్నాయి. మొదటి ఉగాది పండుగ వస్తుండగా.. ఒక రోజు తర్వాత రంజాన్‌ వస్తోంది. దీంతో పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ఎన్ని వస్తున్నాయో తెలుసా? వరుసగా నాలుగు రానున్నాయి.

Also Read: Harish Rao: తెలంగాణను చంద్రబాబుకు రేవంత్ రెడ్డి తాకట్టు..  నదీ జలాలపై హరీశ్ రావు తీవ్ర వ్యాఖ్యలు

భారతదేశంలో ఈద్-ఉల్-ఫితర్ 2026తోపాటు ఉగాదికి పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించారు. వాస్తవంగా ఉగాది, రంజాన్‌కు పబ్లిక్‌ హలీడే. ఈ సందర్భంగా ఆ పండుగ రోజుల్లో ప్రభుత్వ కార్యాలయాలతోపాటు కళాశాలలు, పాఠశాలలు ఇలా అన్నింటికీ సెలవులు ఉంటాయి. ఉగాది పండుగ మార్చి 19వ తేదీన వస్తోంది. అంటే గురువారం విద్యాలయాలతోపాటు ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు సెలవు ఉంటుంది. ఆ తర్వాత మార్చి 20వ తేదీ శుక్రవారం ఏ పండుగ లేకపోవడంతో ఆ రోజు సెలవు లేదు. తర్వాతి రోజు అంటే శనివారం మార్చి 21వ తేదీన రంజాన్‌ పండుగ ఉంది. ఈ పండుగకు దేశంతోపాటు ప్రపంచ దేశాల్లో సెలవు ఉంది. పండుగల తర్వాత మార్చి 22వ తేదీ ఆదివారం వచ్చింది. సాధారణంగా మొత్తం మూడు సెలవులు ఉండగా.. శుక్రవారం ఒక్క సెలవు పెడితే మాత్రం వరుసగా నాలుగు సెలవులు మారుతాయి.

Also Read: KCR Wishes: నందిని సిద్దారెడ్డికి అభినందనల వెల్లువ.. కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్ రావు శుభాకాంక్షలు

దాదాపుగా ఈ సెలవులు అన్నీ దేశవ్యాప్తంగా ఉండనున్నాయి. తెలంగాణ, ఏపీతోపాటు దేశవ్యాప్తంగా ఉగాది, రంజాన్‌ సెలవులు ఉండనున్నాయి. విద్యా సంవత్సరం ముగింపు సమయంలో ఈ సెలవులు రావడం విశేషం. అయితే పరీక్షల కాలం కావడంతో సెలవులు వచ్చాయని చెప్పి చదువును పక్కనపెడితే మాత్రం విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. కావున విద్యార్థులు సెలవులను వృథా చేసుకోకుండా పరీక్షలకు ఇంకాస్త ఎక్కువ చదివితే మార్కులు బాగా వస్తాయి. ఈ విషయాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు కూడా తెలుసుకుంటే మంచిది. ఇప్పటికే ఎండలు తీవ్ర రూపం దాల్చడంతో సెలవులను వృథాగా చేసుకోరాదు. కొన్ని రోజుల్లో ఎలాగో వేసవికాల సెలవులు వస్తాయి. అప్పుడు ఎంతైనా ఎంజాయ్‌ చేసుకోవచ్చు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

1074
comment0
Report
RKRavi Kumar Sargam
Mar 17, 2026 09:53:08
Mangalagiri, Andhra Pradesh:

APSRTC Free Bus Travel Scheme: ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు ప్రభుత్వం ఉగాది కానుక అందిస్తోంది. ఇప్పటికే అమలులో ఉన్న ఉచిత ఆర్టీసీ బస్సు పథకాన్ని మరికొంత మందికి విస్తరిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మహిళలకు అందిస్తున్న ఉచిత బస్సు పథకాన్ని పురుషులకు కూడా అందిస్తూ ప్రభుత్వం ప్రకటన చేసింది. రేపు ఆ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది. దివ్యాంగులకు అందిస్తున్న కొత్త పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించనుంది.

Also Read: Harish Rao: తెలంగాణను చంద్రబాబుకు రేవంత్ రెడ్డి తాకట్టు..  నదీ జలాలపై హరీశ్ రావు తీవ్ర వ్యాఖ్యలు

దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే దివ్యాంగ శక్తి పథకాన్ని రేపు మంగళగిరిలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్నారు. రాష్ట్రంలోని 11.16 లక్షల దివ్యాంగులకు కూటమి ప్రభుత్వ ఉగాది కానుక అందిస్తోందని.. దివ్యాంగ్ శక్తి పథకం ద్వారా 12.76 లక్షల మంది దివ్యాంగులు, సహాయకులకు లబ్ది జరుగుతుందని ఏపీఎస్‌ ఆర్టీసీ ప్రకటించింది. దివ్యాంగులకు సహయకులుగా వచ్చే వారికి 50 శాతం టికెట్ రాయితీ కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది.

Also Read: KCR Wishes: నందిని సిద్దారెడ్డికి అభినందనల వెల్లువ.. కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్ రావు శుభాకాంక్షలు

ఉచిత బస్సు పథకంలో 40 శాతం వైకల్యం దాటిన దివ్యాంగులకు వర్తిస్తుందని ఏపీఎస్‌ఆర్టీసీ తెలిపింది. 4 నుంచి 21 వర్గాల దివ్యాంగులకు ‘దివ్యాంగ శక్తి’ పథకం విస్తరణ చేయనున్నట్లు ఆర్టీసీ సంస్థ వెల్లడించింది. దివ్యాంగులకు అందిస్తున్న ఈ పథకం అమలు కోసం ఏపీ ప్రభుత్వం ఏడాదికి రూ.207 కోట్లను ఆర్టీసీకి చెల్లించనుంది. రూ.207 కోట్ల భారాన్ని దివ్యాంగుల సంక్షేమం కోసం ఏపీ ప్రభుత్వం భరించనుంది. మంగళగిరి నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్, బీజేపీ ఏపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్‌లతో కలిసి రేపు దివ్యాంగ శక్తి పథకాన్ని  ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభిస్తారని ఏపీఎస్‌ఆర్టీసీ తెలిపింది. పథకాన్ని ప్రారంభించిన దివ్యాంగులతో కలిసి చంద్రబాబు, పవన్ కల్యాణ్ ప్రయాణం చేయనున్నారు. అనంతరం దివ్యాంగులతో ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం ఆత్మీయ విందు జరగనుంది.

Also Read: Govt Employees: ప్రభుత్వ ఉద్యోగులు కీలక నిర్ణయం.. పీఆర్‌సీ, ఐఆర్‌, డీఏ పెంపు కోసం ఉగాదికి డెడ్‌లైన్‌

దివ్యాంగ శక్తి రేపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో దివ్యాంగ్ శక్తి కార్యక్రమాన్ని ఎమ్మెల్యేలు ప్రారంభించనున్నారు. ఆర్టీసీ బస్సులో దివ్యాంగులతో కలిసి ప్రయాణించనున్నారు. అనంతరం దివ్యాంగులతో కలిసి భోజనం చేస్తారు. స్త్రీ శక్తి బస్సుల్లో దివ్యాంగులు ఉచితంగా ప్రయాణించే వెసులుబాటు కల్పించడంతో దివ్యాంగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మహిళలకు అందిస్తున్న స్త్రీ శక్తి పథకం ద్వారా 52 కోట్లకు పైగా మహిళలు ఉచిత ప్రయాణాలు చేశారు. ఉచిత బస్సు పథకం కోసం ఇప్పటివరకు రూ.1,826 కోట్లకు పైగా ఏపీ ప్రభుత్వం ఖర్చు చేసింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

1064
comment0
Report
DDDharmaraju Dhurishetty
Mar 17, 2026 09:53:03
Hyderabad, Telangana:

 Kid Holding Snakes Viral Video Watch: ప్రస్తుతం సోషల్ మీడియాలో పిల్లలు ఎలాంటి పనులు చేసిన దృశ్యాలైన రీల్స్ రూపంలో పోస్ట్ చేస్తే వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా సోషల్ మీడియాలో ఓ బాలుడికి సంబంధించిన వీడియో విపరీతంగా వైరల్ అవుతూ వస్తుంది. ఈ వీడియోలో ఆ బాలుడు ప్రమాదకరమైన రెండు పాములను ఎడమ కుడి చేతుల్లో పట్టుకోవడం చూసి అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు. దీనికి సంబంధించిన దృశ్యాలు అన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వస్తున్నాయి. ముఖ్యంగా ఈ వీడియోలను చూసి వన్యప్రాణి సంరక్షకులు కూడా ఆశ్చర్యానికి గురవుతున్నారు. అయితే, దీనికి సంబంధించిన అన్ని రకాల వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో ఓ బాలుడు అత్యంత ప్రమాదకరమైన రెండు పాములను రెండు చేతుల్లో పట్టుకుని అందరినీ ఆశ్చర్యపోయేలా చేసాడు. సాధారణంగా పెద్దలే పాములను చూసి భయపడిపోతూ ఉంటారు. అలాంటిది ఈ వీడియోలో బాలుడు అత్యంత ప్రమాదకరమైన రెండు పాములను పట్టుకుని వాటితో ఆటలాడడం చూసి ఇప్పుడంతా ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఈ వీడియోకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. ఇందులో బాలుడు అతని పక్కనే మరో ఇద్దరు బాలుర్లు కనిపించడం మీరు చూడొచ్చు. 

అయితే, ఆ బాలుడు తన రెండు చేతుల్లో ప్రమాదకరమైన నాగుపాములను పట్టుకున్నారు. అంతేకాకుండా ఆ పాములను పట్టుకొని అటూ ఇటూ ఊపడం మీరు చూడొచ్చు. పంట పొలాల్లో తిరుగుతున్న పాములను పట్టుకుని ఉండొచ్చని వన్యప్రాణి సంరక్షకులు చెబుతున్నారు. ఆ బాలుడు పాములను పట్టుకుని అటు ఇటు ఊపుతుంటే.. అతని పక్కనే ఉన్న మరో బాలుడు దానిని చూసి భయపడిపోతూ దూరం జరగడం కూడా మీరు చూడొచ్చు. ఇలా ఆ బాలుడు పాములను పట్టుకున్న సందర్భంలో అక్కడే ఉన్న ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడు ఇది కాస్త వైరల్ గా మారింది..

 
 
 
 
 

Read more: Video Viral: వామ్మో.. రన్నింగ్ ట్రైన్ లో యువతి అరాచకం... ఇద్దరు మహిళలు, యువకుడిని కింద పడేసి మరీ.. వీడియో వైరల్..

ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోను ఓ ఇంస్టాగ్రామ్ ఖాతా నుంచి పోస్ట్ చేశారు. ఈ వీడియోను 8 లక్షల మందికి పైగా సోషల్ మీడియా వినియోగదారులు వీక్షించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా దీనిని చూసి చాలామంది లైక్ కూడా చేశారు. అయితే, ఈ వీడియో చూసిన కొంతమంది మాత్రం.. ఇవి ప్రమాదకరమైన పాములు కావని జెర్రీబోతు జాతికి సంబంధించిన పాములని కామెంట్లు చేస్తున్నారు. అంతేకాకుండా మరికొంతమంది అయితే బాలుడు సూపర్ అంటూ కామెంట్లు చేస్తూ వస్తున్నారు. ఏది ఏమైనా ఇలాంటి ప్రమాదకరమైన పాములను పట్టుకోవడం చాలా డేంజర్..

Read more: Video Viral: వామ్మో.. రన్నింగ్ ట్రైన్ లో యువతి అరాచకం... ఇద్దరు మహిళలు, యువకుడిని కింద పడేసి మరీ.. వీడియో వైరల్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

  

1078
comment0
Report
DDDharmaraju Dhurishetty
Mar 17, 2026 09:41:33
Hyderabad, Telangana:

 Venomous Cobra Video Watch: ప్రస్తుతం సోషల్ మీడియాలో లైక్స్‌తో పాటు వ్యూస్ పెంచుకోవడానికి యువత ఎంత సాహసానికైనా వెనకాడడం లేదు.. రియల్ స్పీచ్‌తో ప్రమాదకరమైన విన్యాసాలు చేస్తూ చివరికి ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన ఎన్నో వీడియోలు మనం సోషల్ మీడియాలో తరచుగా చూస్తూనే ఉన్నాం.. ముఖ్యంగా కొంతమందైతే ప్రమాదకరమైన పాములను పట్టుకుని.. వ్యూస్ కోసం విన్యాసాలు చేస్తూ ఉన్నారు. అయితే, ఇప్పుడు పిల్లలు instagramలో ఫేమస్ అవ్వడానికి ప్రమాదకరమైన పాములతో చెలగాటమాడుతూ వీడియోలు రీల్స్ పోస్ట్ చేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి..

ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోను చూస్తే అందరూ ఆశ్చర్య పోవాల్సిందే. ఎందుకంటే ఈ వీడియోలో ఓ చిన్న బాలుడు అత్యంత ప్రమాదకరమైన నాగుపామును పట్టుకొని.. అది నివసించే ఓ పుట్టలో చేతులు పెడుతున్నాడు.. ఇప్పుడు ఈ దృశ్యాలు అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసేలా చేస్తున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. ఈ వీడియోలో ఆ బాలుడు ఏకంగా ఓ పుట్టలో నుంచి ప్రమాదకరమైన నాగుపామును బయటకు తీసి దానిని ఎడమ చేతితో పట్టుకొని ఉండడం మీరు చూడొచ్చు..

అంతేకాకుండా ఆ  బాలుడు దాని పుట్టలో పెట్టిన గుడ్లను కూడా బయటికి ఒక్కటొక్కటిగా తీసి అక్కడే పక్కన పెట్టడం మీరు గమనించవచ్చు. ఈ వీడియోలో ఆ  బాలుడు తీసిన గుడ్లతో పాటు అత్యంత ప్రమాదకరమైన పాము కూడా చేతిలో కనిపిస్తుంది. అయితే, అంత చిన్న వయసులో ఏ మాత్రం భయపడకుండా పుట్టలో నుంచి పామును తీసిన వీడియోను చూసి సోషల్ మీడియా వినియోగదారులు ఒక్కసారిగా కంగు తిన్నారు. చిన్న బుడతడైన ఆ బాబు అత్యంత ప్రమాదకరమైన పాములు పుట్టలోంచి తీయడం చూసి ఆశ్చర్యపోయారు..

 
 
 
 
 

Read more: Video Viral: వామ్మో.. రన్నింగ్ ట్రైన్ లో యువతి అరాచకం... ఇద్దరు మహిళలు, యువకుడిని కింద పడేసి మరీ.. వీడియో వైరల్..

సాధారణంగా అత్యంత ప్రమాదకరమైన నాగుపాములను చూసి పెద్దవారి ఎంతో భయపడిపోతూ ఉంటారు.. అలాంటిది ఆ బాలుడు అంత పెద్ద నాగుపాము పట్టుకొని ఆటలాడుతుంటే.. వన్యప్రాణి సంరక్షకులు సైతం ఆశ్చర్య పోవాల్సి వస్తుంది. అంతేకాకుండా ఆ  బాలుడు పాము తలను పట్టుకున్న సందర్భంలో.. ఆ పాము దాని నోటిని గట్టిగా తెరిచేందుకు ప్రయత్నిస్తుంది. అయితే, ఈ సమయంలో ఏమాత్రం భయపడకుండా ఆ బాలుడు దాని తలను మరో చేతితో గట్టిగా పట్టుకోవడం మీరు వీడియోలో చూడొచ్చు. ఈ వీడియో చూసిన సోషల్ మీడియా వినియోగదారులు వారి అభిప్రాయాలను కామెంట్ల రూపంలో వ్యక్తం చేస్తున్నారు.

Read more: Video Viral: వామ్మో.. రన్నింగ్ ట్రైన్ లో యువతి అరాచకం... ఇద్దరు మహిళలు, యువకుడిని కింద పడేసి మరీ.. వీడియో వైరల్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

  

1099
comment0
Report
DDDharmaraju Dhurishetty
Mar 17, 2026 09:26:43
Hyderabad, Telangana:

Carrier 2026 Model AC Price Cut: ఎప్పటినుంచో Carrier 2026 Model AC Price:మంచి ఏసీని కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే, ఇది మీకోసమే.. ఎందుకంటే ఫ్లిప్‌కార్ట్‌లో వేసవి సందర్భంగా కొన్ని ఏసీలు అత్యంత తక్కువ ధరకే అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా భీమియం ఫీచర్స్ కలిగిన ఏసీలు కూడా అతి తక్కువ ధరల్లో లభించడం విశేషం. ఎప్పటినుంచో చీప్ ధరలో ఏసీలు కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది అద్భుతమైన అవకాశం గా భావించవచ్చు. 

ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌లో క్యారియర్ (Carrier) 2026 మోడల్ 1 Ton 3 Star Split AI Inverter ఏసీ అత్యంత చవక ధరలో అందుబాటులో ఉంది. ఇది ఇప్పుడే కొనుగోలు చేసే వారికి 40 శాతం పైగా ప్రత్యేకమైన ఫ్లాట్ డిస్కౌంట్‌తో లభిస్తుంది. అద్భుతమైన ఫీచర్స్ కూడా అందుబాటులో ఉండడం విశేషం.. ఇక ఈ ఏసీకి సంబంధించిన ఫీచర్స్ వివరాల్లోకి వెళితే.. దీనిని కంపెనీ ప్రత్యేకమైన ఏఐ ఇన్వర్టర్ టెక్నాలజీతో అందుబాటులోకి తీసుకువచ్చింది. దీన్నిబట్టి గదిలో ఉష్ణోగ్రతకు అనుకూలంగా ఆటోమేటిక్‌గా కూలింగ్‌తో పాటు ఇతర అంశాలను అడ్జస్ట్ చేస్తుంది. దీనివల్ల విద్యుత్ కూడా పూర్తిగా ఆదా అవుతుంది. అలాగే ఇది అవసరానికి తగ్గట్టుగా ఆరు రకాలుగా ఏసీ కెపాసిటీని మార్చుకోవచ్చు.

ఈ ఏసీలో అద్భుతమైన స్మార్ట్ ఎనర్జీ డిస్ప్లే కూడా అందుబాటులో ఉంది. ఏసి ఎంత విద్యుత్ వినియోగిస్తుందో.. ఈ డిస్ప్లే ను వినియోగించి రియల్ టైం తెలుసుకోవచ్చు. అంతేకాకుండా వేసవిలో గదిని వేగంగా చల్లపరిచేందుకు ఇన్స్టా కూలింగ్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. దీనివల్ల గదిలో ఎంత ఉష్ణోగ్రతలు ఉన్నప్పటికీ.. గదిని చల్లగా చేసేందుకు ఎంతగానో సహాయపడుతుంది.

అంతేకాకుండా ఇందులో ఆటో డీ ఫారెస్ట్ క్లీనింగ్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. ఇది ఇండోర్ యూనిట్‌లోని దుమ్ముతో పాటు మంచును ఆటోమేటిక్గా క్లీన్ చేసి.. స్వచ్ఛమైన గాలిన అందించేందుకు క్రియాశీలక పాత్ర పోషిస్తుంది. దీంతోపాటు ఇందులో PM 2.5 ఫిల్టర్ అందుబాటులో ఉంది ఇది గాలిలోని సూక్ష్మ ధూళికణాలను తొలగించేందుకు సహాయపడుతుంది.

Also Read: Redmi 14C 5G Offer: రెడ్‌మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్‌ఫోన్..అదిరిపోయే ఆఫర్!

అంతేకాకుండా మెరుగైన కూలింగ్ కోసం.. 100 శాతం కాపర్ కండెన్సర్ కాయిల్‌తో లభిస్తోంది. ప్రస్తుతం ఈ ఏసీ ధరకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. దీనిని మార్కెట్లో కంపెనీ MRP ధర రూ.55,100తో అందుబాటులో ఉంచింది. అయితే, ఇప్పుడే దీనిని కొనుగోలు చేసే వారికి ఫ్లిప్‌కార్ట్‌ అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్స్ అందిస్తుంది. ముఖ్యంగా ఇప్పుడే ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేస్తే భారీ డిస్కౌంట్‌తో రూ.29,990 లోపే పొందవచ్చు..

అంతేకాకుండా ఈ ఏసీ పై ప్రత్యేకమైన బ్యాంకు డిస్కౌంట్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి. అయితే, వీటిని వినియోగించు కొనుగోలు చేయాలనుకునే వారు తప్పకుండా.. యాక్సిస్ బ్యాంక్ కోటక్ మహీంద్రా బ్యాంకులకు సంబంధించిన క్రెడిట్ కార్డులను వినియోగించి పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేస్తే ఏకంగా రూ.3000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. అంతేకాకుండా ఎక్స్చేంజ్ బోనస్ కూడా అందుబాటులో ఉంది. దీనిని వినియోగిస్తే రూ.6 వేల తగ్గింపు లభిస్తుంది. దీంతో వీటన్నింటిని వినియోగించి పేమెంట్ చేసే వారికి రూ. 20 వేళలోపే దీనిని పొందవచ్చు..

Also Read: Redmi 14C 5G Offer: రెడ్‌మీ 5G ఫోన్ కేవలం రూ.6,500కే! సగం ధరకే స్మార్ట్‌ఫోన్..అదిరిపోయే ఆఫర్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

987
comment0
Report
DDDharmaraju Dhurishetty
Mar 17, 2026 07:28:10
Hyderabad, Telangana:

Dhanusu Rasi Parabhava Nama Samvatsaram Predictions 2026: రాబోయే 2026 పరాభవనామ సంవత్సరంలో ధనస్సు రాశి వారికి మిశ్రమ ఫలితాలు కలగబోతున్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ ఏడాది ధనస్సు రాశి వారికి ఆదాయం 14 ఉండగా..వ్యయం 11గా ఉంది. రాజ్యపూజం ఐదు తో పాటు అవమానం ఆరుగా ఉంది.. ఈ లెక్కల ప్రకారం ఆర్థికంగా బాగున్నప్పటికీ.. మానసిక ధైర్యంతో పాటు కష్టపడే తత్వం ఈ ఏడాది అత్యంత కీలకము కాబోతోంది. అంతేకాకుండా ధనస్సు రాశి వారికి ఈ సమయంలో మిశ్రమ ఫలితాలు కలిగినప్పటికీ.. కొన్ని రకాల అవకాశాలు మాత్రం తప్పకుండా లభించబోతున్నాయి.. 

వృత్తి, వ్యాపారాల పరంగా..
ధనస్సు రాశి వారికి ఈ ఏడాది విజయాలు అంత సులభంగా దక్కమని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన స్థాయి కంటే కొంచెం తక్కువ లాభాలు కలిగే అవకాశాలున్నాయి. ఉద్యోగాలు చేస్తున్న వారికి పని ఒత్తిడి విపరీతంగా పెరుగుతుంది. అంతేకాకుండా ఈ సమయంలో అదనపు బాధ్యతలు కూడా పెరిగే అవకాశాలున్నాయి. అయితే పట్టుదలతో పని చేయడం వల్ల ప్రమోషన్లు కూడా లభిస్తాయి. వ్యాపారస్తులు ఈ సమయంలో భారీ పెట్టుబడులకు దూరంగా ఉండటం చాలా మంచిది. దీంతోపాటు చిన్న చిన్న పెట్టుబడులతో వ్యాపారాలు విస్తరిస్తేనే అద్భుతమైన లాభాలు పొందుతారు. ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారాల్లో నమ్మకద్రోహం జరిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఈ సమయంలో తప్పకుండా అప్రమత్తంగా ఉండాలి..

కుటుంబం, ఆరోగ్యం..
అర్ధాష్టమి శని ప్రభావం వల్ల అప్పుడప్పుడు ధనస్సు రాశి వారికి అనారోగ్య సమస్యలు తలెత్తినప్పటికీ.. వీరు ఎంతో ఉత్సాహంతో పాటు చురుకుదనం చూపిస్తూ ముందుకు వెళ్తారు. అంతేకాకుండా కొన్ని సందర్భాల్లో ఉత్సాహం తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు కాస్ట్ జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. లేనిపక్షంలో చిన్నపాటి విభేదాలు వచ్చి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఈ సమయంలో నమ్మినవారే వెన్నుపోటు పొడిచే ప్రమాదం ఉన్నట్లు జ్యోతిష్యులు తెలుపుతున్నారు. వ్యక్తిగత విషయాలను అందరితో పంచుకోవడం శ్రేయస్కరమని వారు చెబుతున్నారు..

విద్యార్థులకు, ఇతర రంగాల్లో పనిచేసే వ్యక్తులకు..
ఈ ఏడాది విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పూర్తిగా తగ్గే అవకాశాలున్నాయి. కానీ పట్టుదలతో చదివితే మంచిర్యాంకులు కూడా పొందే అవకాశాలు ఉన్నాయి. సీట్లు సాధించడమే కాకుండా పెద్దపెద్ద యూనివర్సిటీల్లో అనుకున్న స్థాయిలో ర్యాంకులు సాధించగలుగుతారు. ఇక క్రీడా రంగాల్లో రాణించగలిగి అద్భుతమైన విజయాలు సాధించగలుగుతారు. స్త్రీలకు ఈ ఏడాది పరిస్థితులు ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటాయి.. కాబట్టి మీరు కూడా పరిస్థితులను బట్టి ముందుకు సాగాల్సి ఉంటుంది. వివాహం కోసం వేచి చూస్తున్న వారికి కొంత ఆలస్యమైన మంచి సంబంధం కుదురుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.

పరిహారాలు..
ఈ ఏడాది మీ జీవితంలో వస్తున్న ప్రతికూలతను పోగొట్టడానికి తప్పకుండా గురు, శని, కేతు గ్రహాల జపాలు చేసుకోవడం చాలా మంచిది. అంతేకాకుండా శనగల తో పాటు నల్ల నువ్వులను, ఉలవలను దానం చేయడం వల్ల శుభ ఫలితాలు కూడా కలుగుతాయి. ముఖ్యంగా శ్రీకాళహస్తితో పాటు అరుణాచలం, అయ్యప్ప స్వామి దేవాలయాలను సందర్శించుకోవడం వల్ల అద్భుతమైన ఫలితాలు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పాటించడం వల్ల ఈ సమయంలో వస్తున్న అనేక రకాల సమస్యలు పరిష్కారం అవుతాయి. అంతేకాకుండా ఇతరులతో బాగా ఉండటం వల్ల కూడా మంచి ఫలితాలు పొందుతారు.

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook 

1070
comment0
Report
Advertisement
Back to top