ఖమ్మంలో 4 కోట్ల గంజాయిని దహనం: ఎక్సైజ్ పోలీసుల శక్తివంతమైన చర్య!
Kamanchikal, Telangana:ఖమ్మం ఎక్సైజ్ పరిధిలోని నాలుగు పోలీస్ స్టేషన్ లో రికవరీ చేసిన రూ. 4 కోట్ల విలువైన గంజాయిని దహనం చేసారు. 1611.947 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్న ఎక్సైజ్ పోలీసులు నగరంలోని ఐఎన్టీసీ కాంప్లెక్స్ లో దహనం చేసినట్లు అసిస్టెంట్ కమీషనర్ జి. గణేష్ తెలిపారు. జిల్లా నుండి వివిధ ప్రాంతాలకు గంజాయి సరఫరా అవుతుండగా అడ్డుకుని ప్రభుత్వ అనుమతితో దహనం చేసామన్నారు.हमें फेसबुक पर लाइक करें, ट्विटर पर फॉलो और यूट्यूब पर सब्सक्राइब्ड करें ताकि आप ताजा खबरें और लाइव अपडेट्स प्राप्त कर सकें| और यदि आप विस्तार से पढ़ना चाहते हैं तो https://pinewz.com/hindi से जुड़े और पाए अपने इलाके की हर छोटी सी छोटी खबर|
Google Pixel ప్రియులకు షాక్.. భారీ ధరతో మార్కెట్లోకి Google Pixel 11 సిరీస్?
Hyderabad, Telangana:Google Pixel 11 Series Price Hike: ప్రముఖ అంతర్జాతీయ టెక్ దిగ్గజం గూగుల్ (Google) త్వరలో మార్కెట్లోకి విడుదల చేయబోతున్న పిక్సెల్ 11 (Pixel 11) సిరీస్ స్మార్ట్ఫోన్ల విషయంలో వినియోగదారులకు కొంత నిరాశ కలిగించే వార్తగా భావించవచ్చు. రాబోయే పిక్సెల్ 11 సిరీస్ ఫోన్ల ధరలు ఊహించిన దానికంటే చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.. స్మార్ట్ఫోన్ తయారీలో అత్యంత కీలకమైన రామ్ (RAM), ఇంటర్నల్ స్టోరేజ్ పరికరాల ఉత్పత్తి వ్యయం భారీగా పెరగడమే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది..
గ్లోబల్ మార్కెట్లో మెమరీ కాంపొనెంట్స్ ధరలు ఒక్కసారిగా పెరగడంతో.. గూగుల్ హార్డ్వేర్ విభాగం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోందని కంపెనీ ఉన్నతాధికారి ఇటీవలే ఒకరు స్పష్టం చేసిన్నట్లు సమాచారం.. కేవలం గూగుల్ మాత్రమే కాకుండా.. ప్రస్తుతం దాదాపు అన్ని ప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థలు కూడా ఇదే సమస్యను ఎదుర్కొంటున్నాయట.. ఈ భారాన్ని తగ్గించుకోవడానికి నూతన మోడళ్ల ధరలను పెంచక తప్పడం లేదని కంపెనీ సూచించిన్నట్లు సమాచారం.. అంతేకాకుండా, ప్రస్తుతం ఉన్న పిక్సెల్ 10 (Pixel 10) సిరీస్ ఫోన్ల ధరలపై కూడా దీని ప్రభావం పడే ఛాన్స్ ఉందని సమాచారం.
పిక్సెల్ 11 సిరీస్ మోడళ్లు, ఎక్పెక్టెడ్ ధరలు..
ఆగస్టు 12న జరగబోతున్న Made by Google ఈవెంట్లో ఈ సిరీస్ను అధికారికంగా విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.. ఈ సిరీస్లో మొత్తం నాలుగు మోడళ్లు ఉండే అవకాశం ఉంది. ఇందులోని మొదటి మోడల్ Google Pixel 11 పేరుతో అందుబాటులోకి రాబోతోంది. ఇక మిగిత మోడల్స్ Google Pixel 11 Proతో పాటు Google Pixel 11 Pro XL, Google Pixel 11 Pro Foldతో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది.
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
యూరోపియన్ మార్కెట్ అంచనాల ప్రకారం.. పిక్సెల్ 11 ప్రారంభ ధర 999 యూరోలు (భారతీయ కరెన్సీలో సుమారు రూ.1,09,200) ఉండే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా పిక్సెల్ 11 ప్రో ధర 1,199 యూరోలు (సుమారు రూ.1,31,000)తో పాటు పిక్సెల్ 11 ప్రో ఎక్స్ఎల్ ధర 1,399 యూరోలు (సుమారు రూ.1,53,000) వరకు ఉండే అవకాశాలు ఉన్నాయని సమాచారం..
పిక్సెల్ గ్లో (Pixel Glow)..
ధరలు పెరిగినప్పటికీ.. పిక్సెల్ 11 సిరీస్లో ఎన్నో రకాల అద్భుతమైన ఫీచర్లను గూగుల్ పరిచయం చేయబోతున్నట్లు సమాచారం.. ఇందులో ప్రత్యేకంగా Pixel Glow అనే విజువల్ ఎలిమెంట్ను ప్రవేశపెడుతున్నారు. స్మార్ట్ఫోన్కు సంబంధించి వెనక భాగంలో లైట్ స్ట్రిప్కు బదులుగా.. కెమెరా బార్తో కూడిన గుండ్రటి భాగంలో ఫ్లాష్ స్థానంలో ఈ వినూత్న లైటింగ్ ఇంటిగ్రేట్ను అందుబాటులో ఉంచబోతోంది.. గూగుల్ స్టోర్ హోమ్పేజీలో విడుదల చేసిన ప్రోమో క్లిప్లో గోల్డెన్ కలర్ పిక్సెల్ ఫోన్ ఈ పిక్సెల్ గ్లో లైటింగ్తో ఎంతో ఆకర్షణీయంగా కనిపించింది.
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Add Zee News as a Preferred Source
Redmi Note 17 సిరీస్ గ్రాండ్ ఎంట్రీ.. ధర, అద్భుతమైన ఫీచర్ల వివరాలు లీక్!
Hyderabad, Telangana:Redmi Note 17 Series: ప్రసిద్ధ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ షావోమీ (Xiaomi) సబ్ బ్రాండ్ రెడ్మీ, త్వరలోనే తన మోస్ట్ ఎవైటెడ్ రెడ్మీ నోట్ 17 (Redmi Note 17) సిరీస్ను భారతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో విడుదల చేసేందుకు సిద్ధం కాబోతున్నట్లు తెలుస్తోంది.. ఇటీవల చైనా మార్కెట్లో గ్రాండ్గా ఎంట్రీ ఇచ్చిన ఈ మోడళ్లు, త్వరలోనే గ్లోబల్ మార్కెట్తో పాటు భారతదేశంలోనూ అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది.. అయితే, లాంచ్కు ముందే ఈ సిరీస్ ధరలు, వేరియంట్ల వివరాలు సోషల్ మీడియాలో భారీగా హల్చల్ చేస్తున్నాయి. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
గ్లోబల్ మార్కెట్లో 4 వేరియంట్లు..
లీక్ అయిన వివరాల ప్రకారం.. రెడ్మీ నోట్ 17 సిరీస్లో గ్లోబల్గా మొత్తం నాలుగు మోడళ్లను పరిచయం చేయబోతున్నట్లు లీక్ అయిన వివరాలు చెబుతున్నాయి. ఇందులోని మొదటి వేరియంట్ Redmi Note 17తో అందుబాటులోకి రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇది 4GB ర్యామ్, 128GB స్టోరేజ్ వేరియంట్ను కలిగి ఉంటుంది. భారత మార్కెట్లో ధర సుమారు దాదాపు రూ.27,000 ఉండే అవకాశాలు ఉన్నాయి. అలాగే 6GB ర్యామ్, 256GB మోడల్ ధర రూ.33,000గా ఉండే అవకాశం ఉంది. ఇది బ్లాక్, బ్లూతో పాటు పర్పుల్ రంగుల్లో అందుబాటులోకి రాబోతోంది..
ఇక మరో మోడల్ Redmi Note 17 5G స్మార్ట్ఫోన్.. ఇది 6GB ర్యామ్తో పాటు 256GB స్టోరేజ్ ఆప్షన్ ధర దాదాపు రూ.44,000 వరకు ఉండవచ్చని సమాచారం. మూడవ మోడల్ Redmi Note 17 Pro 5G స్మార్ట్ఫోన్ 6GB ర్యామ్తో పాటు 256GB స్టోరేజ్ వేరియంట్ ధర దాదాపు రూ.55,000 గా ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక చివరి వేరియంట్ Redmi Note 17 Pro Max 5G స్మార్ట్ఫోన్ టాప్ ఎండ్ 8GB ర్యామ్తో పాటు 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.65,000కే లభించే అవకాశం ఉంది.
భారత్లో ధర ఎంత ఉండవచ్చు?
ప్రముఖ టెక్ టిప్స్టర్ల అంచనా ప్రకారం.. భారత మార్కెట్లో రెడ్మీ నోట్ 17 స్మార్ట్ఫోన్ ధర రూ. 30,000ల నుంచి ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక దీని బేస్ మోడల్ 6GB ర్యామ్తో పాటు 128GB స్టోరేజ్ వేరియంట్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. భారతీయ కస్టమర్ల అవసరాలకు తగినట్లుగా డిజైన్, స్పెసిఫికేషన్లలో కొన్ని స్వల్ప మార్పులు చేసే అవకాశం ఉందని సమాచారం.
లీక్ల వివరాల ప్రకారం.. ఈ కొత్త నోట్ సిరీస్లో దాదాపు 8,000mAh లేదా 9,000mAh వరకు భారీ బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉండే ఛాన్స్ ఉంది. దాదాపు 7 అంగుళాల పెద్ద డిస్ప్లేను కూడా కలిగి ఉంటుందని ప్రచారం జరుగుతోంది. గేమింగ్, మల్టీ టాస్కింగ్ ఇది సూపర్ ఎక్స్పీరియన్స్ను ఇస్తుందని టెక్ వర్గాలు భావిస్తున్నాయి. స్మార్ట్ఫోన్ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ నోట్ 17 సిరీస్ అధికారిక లాంచ్ తేదీ మరియు తుది వివరాలపై కంపెనీ త్వరలోనే అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది.
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
10,000mAh భారీ బ్యాటరీతో OPPO సరికొత్త సంచలనం.. Oppo A7 Pro Max పూర్తి వివరాలు!
Hyderabad, Telangana:OPPO A7 Pro Max: స్మార్ట్ఫోన్ వినియోగదారులకు పవర్ బ్యాంక్లతో పనిలేకుండా చేసేందుకు ప్రముఖ చైనీస్ స్మార్ట్ఫోన్ దిగ్గజం Oppo భారీ స్కెచ్ వేసిందని చెప్పొచ్చు. అద్బుతమైన టెక్నాలజీతో, వినియోగదారుల సుదీర్ఘ బ్యాటరీ లైఫ్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని Oppo A7 Pro Max పేరుతో ఒక పవర్ఫుల్ స్మార్ట్ఫోన్ను మార్కెట్లోకి విడుదల చేసేందుకు సిద్ధమైంది.. ఈ ఫోన్కు సంబంధించిన టీజర్ను కంపెనీ అధికారికంగా చైనాలోని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వేబోలో విడుదల చేయడంతో టెక్ ప్రియుల్లో తీవ్ర ఆసక్తి నెలకొన్నట్లు తెలుస్తోంది. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
10,000mAh పవర్ఫుల్ బ్యాటరీ..
ఈ స్మార్ట్ఫోన్కు ఉన్న అతిపెద్ద ప్లస్ పాయింట్ దీని 10,000mAh సింగిల్-సెల్ భారీ బ్యాటరీగా భావించవచ్చు.. సాధారణంగా స్మార్ట్ఫోన్లలో 5,000mAh నుంచి 6,000mAh వరకు బ్యాటరీలను చూస్తూ ఉంటాం.. కానీ ఒప్పో ఏకంగా 10,000mAh బ్యాటరీని అందుబాటులోకి తీసుకు రావడం ఇదే మొదటిసారిగా భావించవచ్చు. నాన్స్టాప్ గేమింగ్ ఆడేవారికి.. ఎక్కువగా ప్రయాణాలు చేసేవారికి, హెవీ యూజర్లకు ఇది ఒక సరికొత్త అనుభూతిని అందిస్తుంది. అంతేకాకుండా ఈ భారీ బ్యాటరీని త్వరగా ఛార్జ్ చేయడానికి 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ను కూడా అందిస్తోంది..
అద్భుతమైన డిస్ప్లే, ప్రాసెసర్..
లీక్ అయిన వివరాల ప్రకారం.. ఈ స్మార్ట్ఫోన్ 6.78 అంగుళాల ఫ్లాట్ OLED డిస్ప్లేను కలిగి ఉంటుంది.. ఇది 1.5K రెజల్యూషన్తో పాటు 120Hz రిఫ్రెష్ రేట్ను కలిగి ఉంటుందని కంపెనీ వెల్లడించింది.. మల్టీమీడియాతో పాటు గేమింగ్ సమయంలో క్రిస్టల్ క్లియర్ విజువల్స్ను అందిస్తుంది.. గీక్బెంచ్ లిస్టింగ్ ప్రకారం.. ఈ హ్యాండ్సెట్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 4 Gen 5 (Snapdragon 4 Gen 5) ప్రాసెసర్పై పని చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.. కొత్తగా రాబోతున్న ఆండ్రాయిడ్ 16 ఆధారిత ColorOS 16 ఆపరేటింగ్ సిస్టమ్తో ఇది రన్ అవుతుంది.
పవర్ఫుల్ 50MP సెల్ఫీ కెమెరా..
కెమెరా విభాగంలో OPPO ప్రత్యేక శ్రద్ధ వహించిన్నట్లు తెలుస్తోంది. ఫోన్ వెనుక భాగంలో రెక్టాంగ్యులర్ కెమెరా మాడ్యూల్తో 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో పాటు 2 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరాను అందుబాటులోకి తీసుకు వచ్చింది. రాత్రివేళల్లో అద్భుతమైన ఫోటోలు తీయడానికి ప్రత్యేకంగా Power Flash బ్రాండింగ్తో కూడిన LED ఫ్లాష్ను కూడా ఇందులో అందించారు. ఇక సెల్ఫీ ప్రియుల కోసం ఫ్రంట్ భాగంలోనూ 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను అందించడం విశేషం..
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
ప్రస్తుతం చైనాలో Oppo A7 Pro Max స్మార్ట్ఫోన్ కోసం ప్రీ-ఆర్డర్లు కూడా మొదలయ్యాయి.. త్వరలోనే దీనిని అధికారికంగా గ్లోబల్ మార్కెట్లోకి, భారత మార్కెట్లోకి విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రీమియం ఫీచర్లతో పాటు భారీ బ్యాటరీతో రాబోతున్న ఈ స్మార్ట్ఫోన్ మిడ్-రేంజ్ ధరల విభాగంలో ఇతర బ్రాండ్లకు గట్టి పోటీని ఇవ్వడం ఖాయమని సమాచారం..
Also Read: 7000mAh బ్యాటరీ, 100W ఛార్జింగ్.. షావోమి 17T సిరీస్ ఫీచర్స్, ధరలు లీక్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Add Zee News as a Preferred Source
ఉదయాన్నే హై-ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ తింటే ఏం జరుగుతుందో తెలుసా? కాలిఫోర్నియా బాదంపై న్యూట్రిషన్ ఎక్స్పర్ట్స్ కీలక సీక్రెట్స్!
Hyderabad, Telangana:California Almonds Breakfast Benefits: ప్రస్తుత బిజీ లైఫ్ స్టైల్లో కొంతమంది ఫిట్నెస్కు దూరమవుతున్నారు.. అలాగే ఏది దొరికితే అది తినేయాలనే ధోరణి కూడా పెరిగింది. అయితే, ఉదయం బ్రేక్ఫాస్ట్ నుండి రాత్రి డిన్నర్ వరకు సరైన పోషకాలు, ఖనిజాలు ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ముఖ్యంగా మనం ఉదయం తీసుకునే ఆహారం ఆ రోజంతా మన శరీరంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. అయితే, రానురాను చాలామంది తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెంచుకుంటూ ఫిట్నెస్పై దృష్టి సారిస్తున్నారు. దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం మన జీవనశైలిని మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సరైన పోషకాహారంతో రోజును ప్రారంభించడం ఎంతో ముఖ్యమని వైద్య నిపుణులు చెబుతున్నారు. రాత్రంతా కడుపు ఖాళీగా ఉండటం వల్ల, రోజంతా అవసరమైన శక్తి లభించాలంటే ప్రోటీన్ అధికంగా ఉండే బెస్ట్ బ్రేక్ఫాస్ట్ను ఎంచుకోవాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.
అంతేకాకుండా, ప్రోటీన్ కణజాలాల నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తుంది. ప్రోటీన్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల ఎక్కువ సమయం ఆకలి వేయదు.. తద్వారా అతిగా తినకుండా బరువును నియంత్రణలో ఉంచుకోవచ్చు. దీనివల్ల అనారోగ్యకరమైన ఆహారం తినాలనే కోరిక కూడా తగ్గుతుంది. ఈ బిజీ లైఫ్ స్టైల్లో ఆరోగ్యంపై ప్రాధాన్యత చూపడం చాలా ముఖ్యం, లేదంటే తప్పుడు ఆహారపు అలవాట్లు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి.
కొన్ని రకాల ఆహారాలు తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరిగిపోతాయి. కార్బోహైడ్రేట్లతో పాటు ప్రోటీన్ ఉండే ఆహారాన్ని ఉదయం అల్పాహారంలో చేర్చుకుంటే రోజంతా శక్తి లభిస్తుంది. కండరాల నిర్మాణం కూడా బాగుంటుంది. ఇటువంటి చిన్న మార్పులే దీర్ఘకాలిక ఆరోగ్యానికి దోహదపడతాయని న్యూట్రిషన్ అండ్ వెల్నెస్ కన్సల్టెంట్ షీలా కృష్ణస్వామి పేర్కొంటున్నారు.
ప్రోటీన్ ప్రధానంగా గింజలు, విత్తనాలు, పాల ఉత్పత్తులు, కొన్ని రకాల పప్పు ధాన్యాలలో పుష్కలంగా ఉంటుంది. బాదం పప్పులో కూడా ప్రోటీన్ సమృద్ధిగా లభిస్తుంది. ముఖ్యంగా కాలిఫోర్నియా బాదంపప్పు ప్రోటీన్తో పాటు ఫైబర్, మెగ్నీషియం, విటమిన్ ఇ, మొత్తం 24 రకాల పోషకాలను అందిస్తుంది. ఈ బాదంపప్పును నేరుగా తినవచ్చు, నానబెట్టి తీసుకోవచ్చు లేదా బ్రేక్ఫాస్ట్లో కలిపి స్మూతీ రూపంలో కూడా తీసుకోవచ్చు.
Also Read: ఒత్తుగా, పట్టులాంటి జుట్టు కోసం మందార పూల షాంపూ.. సింపుల్ స్టెప్స్లో ఇంట్లోనే తయారు చేసుకోండి!
Also Read: కోడిగుడ్డు ఇలా తింటేనే విటమిన్ డి పూర్తిగా అందుతుందట! డైటీషియన్లు చెప్పే అసలు రహస్యం ఇదే!
బ్రేక్ఫాస్ట్, దీర్ఘకాలిక ఆరోగ్యం గురించి నటి సోహ అలీఖాన్ కూడా మాట్లాడారు. మనం ఉదయం తీసుకునే ఆహారమే రోజంతా మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుందని, కాబట్టి అల్పాహారం సమతుల్యంగా ఉండాలని ఆమె చెప్పారు. కాలిఫోర్నియా బాదంపప్పు పోషకాలు పుష్కలంగా ఉండటం వల్ల అది తన బెస్ట్ బ్రేక్ఫాస్ట్ అని ఆమె పేర్కొన్నారు. ఆరోగ్యకరమైన జీవనం కోసం పెద్దగా మార్పులు అవసరం లేదని, చిన్నపాటి స్థిరమైన అలవాట్లను పెంపొందించుకుంటే సరిపోతుందని ఆమె అభిప్రాయపడ్డారు.
అందుకే మనం ప్రతిరోజూ తీసుకునే అల్పాహారం పోషకయుక్తంగా ఉండేలా చూసుకోవాలి. కాలిఫోర్నియా బాదంపప్పును పోహా లేదా ఉప్మాలో కూడా కలిపి తీసుకోవచ్చు. అలాగే పరాటాల్లో కూడా వీటిని చేర్చుకోవడం ద్వారా రోజంతా కావాల్సిన ప్రోటీన్ అందుతుంది. దీనివల్ల ఆకలి త్వరగా వేయదు, అనవసరంగా అనారోగ్యకరమైన ఆహారం తీసుకోకుండా ఉంటారు. రోజంతా కావాల్సిన శక్తి కూడా లభిస్తుంది.(Disclaimer: పాఠకులారా ఈ వ్యాసం కేవలం సాధారణ సమాచారం, సలహాలను మాత్రమే అందిస్తుంది. ఇది ఎంతమాత్రం వృత్తిపరమైన సలహా కాదు. ఈ సమాచారానికి జీ తెలుగు న్యూస్ ఎటువంటి బాధ్యత వహించదు.)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
రోడ్డుపై ఉన్న యువతిని వేధించి వ్యక్తి.. ఆ మహిళ ఇన్స్టాగ్రామ్లో ఏం చేసిందో తెలుసా?
Hyderabad, Telangana:IT రాజధాని బెంగళూరులో మహిళల రక్షణపై మళ్లీ ప్రశ్నలు రేకెత్తించేలా.. ఒక ఊహించని ఘటన వెలుగు చూసింది. నగరంలోని రామమూర్తి నగర్ ప్రాంతంలో క్యాబ్ కోసం వేచి చూస్తున్న ఓ మహిళ పట్ల ఒక వ్యక్తి తీవ్రంగా అసభ్యకరంగా ప్రవర్తించాడు. అయితే, ఆ ఆకతాయి చేష్టలకు భయపడిపోకుండా.. ఆ యువతి చూపించిన సమయస్ఫూర్తి ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
ఏం జరిగింది?
రామమూర్తి నగర్లోని ప్రధాన రహదారిపై ఒక యువతి తన ఇంటికి వెళ్లేందుకు క్యాబ్ కోసం వేచి చూస్తోంది. అదే సమయంలో అక్కడికి వచ్చిన ఒక వ్యక్తి.. ఆమెతో వింతగా ప్రవర్తించడం మొదలు పెట్టాడు... అంతటితో ఆగకుండా అత్యంత బూతు పదజాలాన్ని ఉపయోగిస్తూ.. ఆమెను మానసికంగా వేధించేందుకు యత్నించాడు.
సదరు యువతి ఆ ఘటనతో కంగారు పడకుండా.. వెంటనే తన స్మార్ట్ఫోన్ తీసి ఆ వ్యక్తి చేస్తున్న చేష్టలను, అసభ్య పదజాలాన్ని రికార్డ్ చేసింది. పోకిరీ ఆకతాయి తనను బెదిరిస్తున్నప్పటికీ.. ధైర్యంగా నిలబడి వీడియోలు తీసింది.
ఇన్స్టాగ్రామ్లో వీడియో పోస్ట్..
తనకు ఎదురైన ఈ చేదు అనుభవాన్ని, సదరు వ్యక్తి ప్రవర్తనను సమాజానికి తెలియజేసేందుకు బాధితురాలు ఆ వీడియోను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. మహిళలకు బహిరంగ ప్రదేశాల్లో రక్షణ ఏది? అనే ప్రశ్నిస్తూ ఆ వీడియోను షేర్ చేయడంతో.. అది కొన్ని గంటల్లోనే నెట్టింట వైరల్గా మారింది. నెటిజన్లు ఆ యువతి ధైర్యాన్ని మెచ్చుకుంటూ.. వేధింపులకు పాల్పడిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నగర పోలీసుల దృష్టికి వెళ్లింది.. అధికారులు తక్షణమే స్పందించారు. రామమూర్తి నగర్ పోలీస్ స్టేషన్లో సదరు వ్యక్తిపై వివిధ సెక్షన్ల కింద కేసు (FIR) నమోదు చేశారు. వీడియో ఆధారంగా నిందితుడిని గుర్తించి.. అత్యంత వేగంగా అదుపులోకి తీసుకున్నారు.
బహిరంగ ప్రదేశాల్లో మహిళల పట్ల ఇలా వేధింపులకు పాల్పడితే సహించేది లేదని.. నిందితుడిపై చట్టరీత్య కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు. ఈ తరహా ఘటనలు ఎదురైనప్పుడు మహిళలు భయపడకుండా వెంటనే హెల్ప్లైన్ నంబర్లకు లేదా సమీప పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలని సూచించారు. మహిళల భద్రతపై ఎన్ని చట్టాలు ఉన్నప్పటికీ.. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే కఠిన శిక్షలతో పాటు సమాజంలో కూడా మార్పు రావాల్సిన అవసరం ఉందని సోషల్ మీడియాలో నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు.
Also Read: పోలీస్ వ్యాన్ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం.. యువతను ప్రేరేపిస్తున్న పర్యావరణవేత్త సత్యం దీక్షిత్ స్ఫూర్తిదాయక ప్రయాణం!
Hyderabad, Telangana:World Nature Conservation Day: తన జీవితంలో ఎదురైన అనేక వ్యక్తిగత సంక్షోభాలను , కష్టాలను కూడా పక్కన పెట్టి, కేవలం పర్యావరణ పరిరక్షణ అనే ఉన్నతమైన ధ్యేయంతోనే ఆయన తన జీవిత ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. ఈ విషయంపై పూర్తి వివరాలను మనం ఇప్పుడు పరిశీలిద్దాం. పర్యావరణ పరిరక్షణ కోసం అందరూ తాము కూడా కృషి చేయాలని కోరుకుంటారు.. కానీ అందులో కేవలం కొంతమంది మాత్రమే ఆ మాటలను ఆచరణలో పెడతారు. అయితే, ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం సందర్భంగా సత్యం దీక్షిత్ అసాధారణ జీవిత ప్రయాణం గురించి ప్రతి ఒక్కరు తప్పనిసరిగా తెలుసుకోవాల్సి ఉంది. ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మేము నిర్వహిస్తున్న ప్రత్యేక సిరీస్ ద్వారా ఈయన అద్భుతమైన కథను మన ముందుకు తీసుకువస్తున్నాం.
సత్యం ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టి, పెరిగారు. ఆయన తండ్రి జీవనోపాధి కోసం రిక్షా నడిపేవాడు, ఆ తర్వాత సెక్యూరిటీ గార్డుగా కూడా పనిచేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఆయన ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం ఎదుర్కొనే ఎన్నో ఆర్థిక ఇబ్బందులను, కష్టాలను స్వయంగా అనుభవించారు. తన చదువును పూర్తి చేసుకోవడమే కాకుండా, కుటుంబాన్ని పోషించడానికి పాఠశాలల్లో మోమోలు అమ్ముతూ, కళాశాల రోజుల్లో డెలివరీ బాయ్గా కూడా పని చేస్తూ ఎంతో శ్రమించారు. కోవిడ్ మహమ్మారి కాలం సత్యం జీవితంలో ఒక అత్యంత కీలకమైన మలుపుగా నిలిచింది. ఆ క్లిష్ట సమయంలోనే యూపీఎస్సీ పరీక్షలకు ఎలాగైనా సన్నద్ధం కావాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆయన తన నిర్ణయాన్ని ఆచరణలో పెట్టడమే కాకుండా, అదే సమయంలో పర్యావరణ పరిశుభ్రత, వ్యర్థాల నిర్వహణ, ప్రజల్లో అవగాహన కల్పించే దిశగా తన కార్యక్రమాలను ప్రారంభించారు. 'మై ఎర్త్.. మై డ్యూటీ' ద్వారా ఆయన అనేక మంది ప్రజలలో మార్పును తీసుకురాగలిగారు.
కొంతమంది స్వచ్ఛంద కార్యకర్తలతో కలిసి ఆయన ప్రారంభించిన ఈ కార్యక్రమం, నేడు సుమారు 200 నగరాలకు విస్తరించిన ఒక పెద్ద ఉద్యమంగా రూపాంతరం చెందింది. వీరు బహిరంగ ప్రదేశాలలో, నది తీర ప్రాంతాలలో క్రమం తప్పకుండా పారిశుద్ధ్య కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా, పర్యావరణానికి హాని చేసే పెద్ద ఎత్తున వ్యర్థాలను కూడా సమర్థవంతంగా తొలగిస్తున్నారు.
ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, మతపరమైన ప్రదేశాలలో పేరుకుపోయిన వ్యర్థాలను పునర్వినియోగం చేయడం, సామాజిక భాగస్వామ్యం ద్వారా పౌరులు తమ పరిసరాల పట్ల బాధ్యతగా ఉండేలా ప్రోత్సహించడం వంటి అనేక కీలకమైన పనులను వీరు చేపడుతున్నారు. ఈ విధంగా సత్యం దీక్షిత్ తన ప్రగాఢమైన విశ్వాసంతో సమాజంలోని ఎంతో మందికి గొప్ప స్ఫూర్తినిస్తున్నారు.
Also Read: ట్రైన్లో ఖాళీ సీట్లు ఎలా చూడాలో తెలుసా? IRCTC యాప్లో సులభమైన ప్రాసెస్ ఇదిగో!
Also Read: ఇకపై క్షణాల్లో తత్కాల్ టికెట్ బుకింగ్.. ఐఆర్సీటీసీ తెచ్చిన ఆ 5 కొత్త ఫీచర్లు ఇవే!
ఆయన చేస్తున్న 'నా భూమి - నా కర్తవ్యం' అనే ప్రచారం, సందేశం ఆయన తపనను స్పష్టంగా ప్రతిబింబిస్తున్నాయి. ఆయన చేసే పని కేవలం చెత్త సేకరణకు మాత్రమే పరిమితం కాలేదు.. ప్రజల ఆలోచనా విధానాన్ని మార్చడం, పర్యావరణం పట్ల అవగాహన పెంచడం, ప్రతి పౌరుడు తన పరిసరాలను శుభ్రంగా ఉంచుకునేలా వారిని శక్తివంతం చేయడమే ఈ సంఘం ప్రధాన ఉద్దేశ్యం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
చంకలో పాప.. చేతిలో కల్యాణలక్ష్మి చెక్కు.. వైరల్ అవుతున్న వీడియో..
Hyderabad, Telangana:Kalyana Lakshmi Scheme Delay News: పెళ్లయిన కొత్తలో.. పుట్టింటి నుంచి అత్తవారింటికి వెళ్లేటప్పుడు ఆ కొత్తపెళ్లికూతురి కళ్లలో ఎన్నో ఆశలు. ప్రభుత్వం ఇచ్చే కల్యాణలక్ష్మి ఆర్థిక సాయం అందుతుంది.. తమ కొత్త కాపురానికి ఆసరాగా నిలుస్తుంది.. అని భావించింది. కానీ, నెలలు గడిచాయి.. కాలం మారింది.. ప్రభుత్వాలు మారాయి.. చివరికి ఆమె కడుపున ఒక ప్రాణం ఊపిరి పోసుకొని.. పండంటి పాపలా కూడా జన్మించింది. బిడ్డ పుట్టిన తర్వాత గానీ ఆ పేద తల్లికి కల్యాణలక్ష్మి చెక్కు చేతికందలేదు..
ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గం భీంపూర్ మండల కేంద్రంలో గురువారం నాడు చోటుచేసుకున్న ఈ ఘటన, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ పాలనా తీరుకు అద్దం పడుతోంది. అంతేకాకుండా దీనికి సంబంధించిన వీడియోస్ కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి స్థానిక BRS ఎమ్మెల్యే అనిల్ జాదవ్ హాజరయ్యారు. ఈ క్రమంలో ఒక లబ్ధిదారురాలు తన చంకలో కొన్ని నెలల పసిపాపను పట్టుకుని.. ఎంతో ఆశగా చెక్కు కోసం క్యూలైన్ లో నిలబడటం అందరినీ ఆశ్చర్యపోయేలా చేసింది..
ఆ దృశ్యాన్ని చూసి చలించిపోయిన MLA అనిల్ జాదవ్.. స్వయంగా ఆమె దగ్గరకు వెళ్లారు. ఎంతో ఆప్యాయంగా ఆ పసికందును కూడా చంకన ఎత్తుకుని.. తల్లిని యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఆ తల్లి చేతికి కల్యాణలక్ష్మి చెక్కును అందజేస్తూ.. అక్కా.. పెళ్లి సమయానికి అందాల్సిన సాయం, ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల బిడ్డ పుట్టేదాకా ఆలస్యమైంది అని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వ వైఫల్యంపై మండిపడ్డ లబ్ధిదారులు..
BRS ప్రభుత్వ హయాంలో KCR తీసుకొచ్చిన కల్యాణలక్ష్మి పథకం పేదింటి ఆడబిడ్డలకు ఎంతో ఆసరాగా నిలిచిందని.. కానీ నేడు కాంగ్రెస్ పాలనలో లబ్ధిదారులకు చెక్కులు అందక నెలల తరబడి నిరీక్షించాల్సి వస్తోందని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ విమర్శించారు. పెళ్లి ఖర్చుల కోసం తెచ్చిన అప్పులకు వడ్డీలు పెరుగుతున్నాయని.. ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్లో ఉన్న కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
Also Read: పోలీస్ వ్యాన్ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Jantar Mantar Protest: జంతర్ మంతర్ నిరసనల్లో 2,873 మంది నేరస్థులు?
Hyderabad, Telangana:Jantar Mantar Protest Latest News: జంతర్ మంతర్ వద్ద జరుగిన నిరసనల వెనుక ఆశ్చర్యం కలిగించే నిజాలు వెలుగులోకి వచ్చాయి. హక్కుల కోసం, న్యాయం కోసం సాగిన ఆందోళనల ముసుగులో నేర చరిత్ర ఉన్న శక్తులు చొరబడ్డాయా అనే అనుమానాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. జూలై 20 నుంచి 25 మధ్య జంతర్ మంతర్ పరిసర ప్రాంతాల్లో జరిగిన ఆందోళనల్లో ఏకంగా 2,873 మంది పాత నేరస్థులు ఆందోళనలు సృష్టించిన్నట్లు ఢిల్లీ పోలీసులు సాంకేతిక ఆధారాలతో సహా సంచలన ప్రకటన చేశారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో..
అత్యాధునిక ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ (FRS)తో పాటు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా చేపట్టిన విస్తృత పరిశీలనలో ఈ భయాందోళనకర విషయాలు బయటపడ్డాయి. పోలీసులు వెల్లడించిన కథనం ప్రకారం.. అక్కడ గుర్తించిన వారిలో ఏకంగా 989 మంది తీవ్రమైన నేరాల్లో (Heinous Offences) నిందితులుగా ఉన్నారు. హత్యలు, హత్యాయత్నాలు, దారిదోపిడీలు, అత్యాచారాలు, కిడ్నాప్లతో పాటు ఆర్మ్స్ యాక్ట్ వంటి కేసులలో వీరికి సుదీర్ఘ నేర చరిత్ర ఉన్నట్లు వెల్లడైంది. మరికొందరు అలవాటుపడిన నేరస్థులుగా (Habitual Offenders) నమోదు కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
రచ్చకెక్కిన హింస..
నిరసనల సందర్భంగా చోటుచేసుకున్న రాళ్లదాడి, ఖాకీ డ్రెస్సులో ఉన్న పోలీసు సిబ్బందిపై దాడులు, ప్రభుత్వ వాహనాల ధ్వంసంతో పాటు భద్రతా బారికేడ్లను బద్దలు కొట్టిన ఉదంతాల వెనుక ఈ క్రిమినల్ మూకల హస్తం ఉందా అన్న కోణంలో ఇన్వెస్టిగేషన్ టీమ్స్ లోతుగా విచారణ చెపడుతున్నట్లు తెలుస్తోంది.. అయితే, ఒక వ్యక్తి కేవలం నిరసన స్థలంలో ఉన్నంత మాత్రాన అతనికి హింసతో సంబంధం ఉందని తేల్చలేమని.. ప్రతి ఒక్కరిపై ప్రాథమిక విచారణ తర్వాతే.. పోలీసులు స్పష్టం చేశారని తెలిపారు..
Also Read: పోలీస్ వ్యాన్ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!
ఈ పరిణామాలు ఒకవైపు శాంతిభద్రతల ముప్పును ఎత్తిచూపుతుంటే.. మరోవైపు సరికొత్త చట్టపరమైన వివాదానికి తెరలేపాయి. నిరసన ప్రదర్శనల్లో పౌరులపై నిఘా పెట్టేందుకు ఫేషియల్ రికగ్నిషన్ వంటి ప్రైవేట్ సాంకేతికతను వాడటం రాజ్యాంగం ప్రసాదించిన వ్యక్తిగత స్వేచ్ఛ (Privacy Rights)ను భంగపరచడమేనంటూ హక్కుల సంఘాలు న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. ప్రజాస్వామ్యయుత నిరసనల్లో నేరస్థుల చొరబాటు ఎంతటి ప్రమాదకరమో.. సాంకేతికత పేరిట సాధారణ పౌరుల స్వేచ్ఛను అణచివేయడం కూడా అంతే ప్రమాదకరమని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Also Read: పోలీస్ వ్యాన్ను ఒంతిచేత్తో ఆపేసిన బాలీవుడ్ బ్యూటీ..నీట్ విద్యార్థులకు అండగా మోడల్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Shani Vakri: మీన రాశిలో శని వక్రీకరణ.. డిసెంబర్ 11 వరకు ఈ రాశుల వారికి లక్ష్మీదేవి కటాక్షం!
Hyderabad, Telangana:Saturn Retrograde In Pisces: జ్యోతిష్య శాస్త్రంలో శనిదేవుడికి అత్యంత ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది.. మానవులు చేసే కర్మలను బట్టి ఫలితాలను ప్రసాదించే న్యాయాధిపతిగా, కర్మఫలదాతగా కూడా శనిదేవుడిని ఆరాధిస్తారు. ఇదిలా ఉంటే జూలై 27 నుంచి మీన రాశిలో శనిదేవుడు తిరోగమనం స్థితిలోకి ప్రవేశించాడు. ఈ తిరోగమన గ్రహ సంచారం ఈ ఏడాది డిసెంబర్ 11 వరకు దాదాపు నాలుగున్నర నెలల పాటు తిరోగమనంలోనే ఉంటాడు..శని భగవానుడి ఈ సమయంలో ద్వాదశ రాశులన్నింటిపైనా ప్రభావం చూపుతాడు. ప్రధానంగా 4 రాశుల జాతకులకు మాత్రం ఈ సమయం అత్యంత శుభప్రదంగా.. అదృష్టాన్ని తెచ్చిపెట్టేలా ఉంటుందని జ్యోతిష్యలు తెలుపుతున్నారు. ఈ కాలంలో ఉద్యోగం, ఆర్థిక పరిస్థితి, కెరీర్లో గొప్ప సానుకూల మార్పులు చోటుచేసుకోనున్నాయి.
శని వక్రీతో ఊహించని ప్రయోజనాలు కలుగుతాయి..
కన్యా రాశి (Virgo)
కన్యా రాశి వారికి శనిదేవుడు 5వ, 6వ స్థానాలకు అధిపతిగా భావిస్తారు. శని తిరోగమనం వల్ల వీరికి సుదీర్ఘకాలంగా నిలిచిపోయిన పనులన్నీ వేగంగా పూర్తవుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఉద్యోగస్తులకు ఆఫీసులో గుర్తింపు లభించడమే కాకుండా ప్రమోషన్ కూడా సులభంగా కలుగుతాయి. వ్యాపారులకు నూతన పెట్టుబడుల నుంచి మంచి లాభాలు సమకూరుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. పాత ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభించి.. దాంపత్య జీవితంలో అనుకూలమైన వాతావరణం నెలకొంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.
మకర రాశి (Capricorn)
శని సొంత రాశి అయిన మకర రాశి వారికి ఈ తిరోగమనం ఎంతో లాభదాయకంగా ఉంటుంది.. వ్యాపారంలో పెద్ద ఒప్పందాలు కూడా సులభంగా కుదురుతాయి. అంతేకాకుండా నూతన ఆర్డర్లు కూడా లభిస్తాయి.. సమాజంలో మీ గౌరవ మర్యాదలు కూడా సులభంగా లభిస్తుంది. కుటుంబంలో శాంతి కూడా లభిస్తుంది. ముఖ్యంగా దీర్ఘకాలిక సమస్యలతో బాధపడేవారికి అనేక సమస్యలు కూడా సులభంగా దూరమవుతాయి..
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
తులా రాశి (Libra)
తులా రాశి వారికి శనిదేవుడి శుభ దృష్టి వల్ల ఎన్నో రోజులుగా వేధిస్తున్న మానసిక ఒత్తిడులు, ఆందోళనలు తొలగిపోతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగులు, విద్యార్థులకు శుభవార్తలు వింటారు. నూతన ఆస్తులు, స్థలాలు లేదా వాహనాలు కొనుగోలు చేసే యోగం ఉంది. పొదుపు పెరిగి ఆర్థికంగా నిలకడ సాధిస్తారని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.
వృషభ రాశి (Taurus)
వృషభ రాశి వారికి శని వక్రీ ప్రభావంతో అద్భుతమైన ఫలాలు కలుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ఆకస్మిక ధనలాభం కలిగే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. గతంలో నిలిచిపోయిన లేదా మొండి బాకీల రూపంలో ఉన్న డబ్బు తిరిగి చేతికి అందుతుంది. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి పైఅధికారుల నుంచి సంపూర్ణ సహకారం లభిస్తుంది. అంతేకాకుండా మెరుగైన వేతనంతో కూడిన నూతన ఉద్యోగావకాశాలు కూడా సులభంగా పొందుతారు..
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
గమనిక.. 
Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..
Bhogapuram Airport: అదిరిపోయిన భోగాపురం ఎయిర్పోర్ట్ విజువల్స్
Gudepuvalasa, Andhra Pradesh:Watch Visuals Of Bhogapuram Airport Video At Vizag PM Modi Will Launch On August 1stTDP MLC: ఎమ్మెల్సీ కోసం 20 మంది పోటీ.. చంద్రబాబు ఛాయిస్ వీళ్లే!
Kanagumakulapalli, Andhra Pradesh:TDP Chief Chandrababu Exercise Governer Quota MLC Candidates In TDP Know The DetailsJeevan Reddy: రైతులకు సాగునీటి కోసం అధికారులకు జీవన్ రెడ్డి ఫోన్కాల్
Jagtial, Telangana:Former Minister T Jeevan Reddy Phone Call To Officials For Farmers Issue Watchడీఈ, ఎస్ఈలకు మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఫోన్.. ఖరీఫ్ పంటలను కాపాడాలని విజ్ఞప్తి
Jagtial, Telangana:BRS Party: ఎత్తిపోతల మోటర్లు మరమ్మతు చేపట్టి వెంటనే ఖరీఫ్ పంటకు నీరు అందించాలని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. సాగునీరు అందించి రైతులను ఆదుకోవాలని కోరారు. కొల్వాయి ఆరేపల్లిలో మోటార్లు మరమ్మతు చేయించాలని.. ఏడాదికాలంగా మరమ్మతులు చేపట్టడం లేదని తెలిపారు. అధికారులు అంచనాలు రూపొందించేది ఎప్పుడు నీళ్లు అందించేది ఎప్పుడు అని మాజీ మంత్రి జీవన్ రెడ్డి ప్రశ్నించారు.
బీర్పూర్ మండలం కొల్వాయి ఎత్తిపోతల పథకాన్ని సోమవారం రైతులతో కలిసి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్ రెడ్డి సందర్శించారు. అక్కడ కాలిపోయిన మోటార్లను పరిశీలించారు. ట్రాన్స్ఫార్మర్ కాలిపోవడంతో నీళ్లు అందక సాగు చేయడం లేదని రైతులు జీవన్ రెడ్డికి తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఈ సందర్భంగా విద్యుత్ డీఈ, ఎస్ఈలతో మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఫోన్లు చేసి మాట్లాడారు. సాగునీరు కోసం వెంటనే మోటార్లు ఆన్ చేయాలని విజ్ఞప్తి చేశారు.
'రైతుల అదృష్టం కొద్ది కాలువలో నీళ్లు ఉన్నాయని వాటిని సద్వినియోగం చేసుకునేందుకు మోటర్లు మరమ్మతు చేపట్టి పంపులు వినియోగించాలి. కొల్వాయి, ఆరేపల్లిలో పంపుసెట్లు నిలిచిపోయి ఏడాది గడుస్తుంది. రేకులపల్లెలో పంపుసెట్టు నిలిచిపోయింది. కమ్మనూరులో ట్రాన్స్ఫార్మర్ లేక పంపుసెట్టు వినియోగం కోసం ఏడాదిగా ఎదురుచూస్తున్నారు. మంగేలలో ట్రాన్స్ఫార్మర్ రీప్లేస్మెంట్ నేటికి రాలేదు. ఈనెల 31వ తేదీలోగా మోటార్ల మరమ్మతు, ట్రాన్స్ఫార్మర్ల రీప్లేస్మెంట్ చేస్తే ఖరీఫ్ పంట సాగు చేసుకునే అవకాశం ఉంది' అని అధికారులతో ఫోన్లో మాజీ మంత్రి జీవన్ రెడ్డి వివరించారు.
ఆగస్టు ఒకటో తేదీ నాటికి పంపుసెట్లు సిద్ధం చేయాలని.. లేకపోతే నీళ్లు ఉండి కూడా పంటలు ఎండిపోవడానికి మీరే బాధ్యత వహించాల్సి వస్తుందని అధికారులకు ఫోన్లో మాజీ మంత్రి జీవన్ రెడ్డి హెచ్చరించారు. నీళ్లు ఉండి కూడా పంటలు పండించుకోలేని దుస్థితి రాకుండా చూడాలని కోరారు. అన్ని పంపు సెట్లు వినియోగంలో తీసుకువచ్చి ఖరీఫ్ పంటకు నీరు అందించాలని అధికారులను విజ్ఞప్తి చేశారు. క్షేత్రస్థాయిలో పరిస్థితిని అంచనావేసేందుకు అధికారులు పంపుసెట్లు పరిశీలించాలని అధికారులకు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్ రెడ్డి సూచించారు.
31 లోగా కమ్మనూరు మంగల పంపు చెట్ల ద్వారా నీరు అందించాలి.
కుల్వాయి, ఆరేపల్లిలో ప్రధాన సమస్య పరిష్కరించే బాధ్యత తీసుకోవాలని అధికారులకు మాజీ మంత్రి జీవన్ రెడ్డి సూచించారు. మరమ్మతులకు డబ్బులు లేవని మాత్రం చెప్పొద్దన్నారు. ప్రభుత్వ ఖజానా ఖాళీ అయింది అని చెబితే రైతులే మరమ్మతులు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. బీర్పూర్లో నిలిచిపోయిన పంపుసెట్లు అన్ని ప్రారంభించాలని లేకపోతే రైతులు ప్రజావాణి ఎదుట కూర్చుంటారని హెచ్చరించారు. 'కొల్వాయి, ఆరేపల్లి లో మూడు పంపులు పనిచేయడం లేదు. రైతుల సమస్య అర్థం చేసుకోండి. సమయానికి నీళ్లు ఇవ్వకపోతే ఖరీఫ్ సాగు ఎట్లా సాధ్యమవుతుంది. సీజన్ పోయిన తర్వాత మరమ్మతులు చేయిస్తే లాభం ఏముంది. పంట సాగు చేపట్టకపోతే మీరే బాధ్యత వహించాలి' అని అధికారులను బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్ రెడ్డి హెచ్చరక చేశారు.
